Blood Donation Camp
-
స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్ మరియు మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్లోని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్థానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. అయితే సాటి ఇతర భారతీయ మూలాలు కలిగిన స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించిందని పాలెపు మల్లిక్ గుర్తు చేశారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు.(చదవండి: ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్) -
మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!
రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు. మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..! బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
వందలమందికి ప్రాణంపోసిన ‘రక్తవీర్’
బీహార్లోని సుపౌల్కు చెందిన ఒక యువకుడు రక్తదాతలకు స్ఫూర్తిదాయకునిగా నిలుస్తున్నాడు. ఈ యువకుని చొరవతో ఇప్పటివరకు 1,100 మంది ప్రాణాలు నిలిచాయి. వివిధ సామాజిక సంస్థలు ఆ యువకుడిని సన్మానించాయి. ఈ కుర్రాడి పేరు అవినాష్ కుమార్ అమర్ అలియాస్ లోలప్ ఠాకూర్(28). ఇప్పటి వరకు అవినాష్ 330 లీటర్ల రక్తాన్ని తమ సంస్థ ద్వారా దానం చేశాడు. నగరంలో ఎవరికి రక్తం కావాలన్నా అందరికీ ముందుగా అవినాష్ పేరు గుర్తుకువస్తుందని స్థానికులు చెబుతుంటారు. మూడేళ్ల క్రితం 2019 ఆగస్టు నెలలో తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు, అతనిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో తనకు తొలిసారిగా రక్తదానం చేయాలనే ఆలోచన వచ్చిందని అవినాష్ తెలిపారు. తరువాత అవినాష్ తన స్నేహితులతో కలిసి ఓ రక్తదాన సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ‘రక్తవీర్ గ్రూప్’ అని పేరు పెట్టారు. ఈ గ్రూప్ 2019 నుండి అవసరమైనవారికి రక్తం అందిస్తూ వస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియడంతో వారంతా అవినాష్ మొదలు పెట్టిన సంస్థ ద్వారా రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు. తమ సంస్థకు సోషల్ మీడియా ఒక వరంలా మారిందని అవినాష్ తెలిపారు. తమ సోషల్ మీడియా నెట్వర్క్లో చాలమంది చేరారని, వారంతా రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా తమ సంస్థకు అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: గఢ్ముక్తేశ్వర్లో కార్తీక పూర్ణిమ సందడి -
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
-
చర్మ దాత సుఖీభవ
నేత్రదానం, రక్తదానం గురించి అందరికీ తెలుసు కానీ చర్మదానం గురించి తెలిసింది తక్కువే. కానీ నానాటికీ విస్తరిస్తున్న వైద్యరంగంలో చర్మం ప్రాధాన్యత ఎనలేనిది. మంచి చర్మం ఆరోగ్యానికి సూచిక. అలాగే కాలిన గాయాలు, ప్రమాదాలు, జబ్బుల వల్ల అనేకమంది రోగులకు కొత్త చర్మం అవసరమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు రాజధానిలోని విక్టోరియా ఆస్పత్రిలోని స్కిన్బ్యాంకు కొంతమేర ఆదుకుంటోంది. కర్ణాటక: రాష్ట్రంలో ప్రప్రథమంగా చర్మ నిధి (స్కిన్ బ్యాంక్) ప్రారంభమైన ఏడేళ్లలో దాతల సంఖ్య 200 కు చేరుకుంది. అయినప్పటికీ చర్మదానం గురించి సమాజంలో అవగాహన లోపించినందున దాతల సంఖ్య పెరగడం లేదు. బెంగళూరు వైద్య పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్ఐ) ఆధ్వర్యంలోని విక్టోరియా ఆసుపత్రిలో రోటరీ ఆశీర్వాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2016లో చర్మనిధి ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 197 మంది దాతలనుంచి త్వచాన్ని సేకరించారు. ప్రమాదాలు, జబ్బులకు గురైనవారికి చికిత్సకోసం చర్మానికి అధిక డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వినతులు కర్ణాటక మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇంకా పలు రాష్ట్రాల నుంచి చర్మం కావాలని ఈ కేంద్రానికి వినతులు వస్తుంటాయి. కానీ అందులో 60 శాతం మాత్రమే సరఫరా సాధ్యమైందని తెలిపారు. కాలిన ప్రమాదాలలో గాయపడినవారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సకు చర్మం అవసరమని బీఎంసీఆర్ఐ ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ కేటీ.రమేశ్ తెలిపారు. ప్రస్తుతం చర్మ నిధిలో 12 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం నిల్వలు ఉన్నాయి. చర్మదానం గురించి ప్రజల్లో జాగృతం చేయడానికి సోషల్ మీడియా ప్రచారం సహా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలను సందర్శించి వివరిస్తున్నామని తెలిపారు. చర్మదానానికి ఎందుకు వెనుకంజ ప్రజలు నేత్రదానం, ఇతర అవయవ దానం చేయడానికి ప్రమాణపత్రం ఇస్తారు. ఉత్సాహంగా రక్తదానం చేస్తారు. కానీ చర్మదానం చేయడం లేదని వైద్యులు తెలిపారు. చర్మం తీయడం బాధాకరంగా ఉంటుంది, శస్త్రచికిత్స చేస్తారు వంటి అపోహలే ఇందుకు కారణమన్నారు. చర్మదానం అంటే శరీర భాగమంతా చర్మం తీసుకోరు. తొడలు, కాళ్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల చర్మం పొరను మాత్రమే తీసుకుంటారు. ఏర్పడిన చిన్నపాటి కోత త్వరలోనే మానిపోతుంది. కాలిన బాధితులకు కావాలి విక్టోరియా ఆసుపత్రిలో మహాబోధి కాలిన గాయాల వార్డులో అనేకమంది రోగులకు చర్మం అవసరం పడుతూ ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ 220 మంది కాలిన గాయాలతో చేరుతుండగా వారిలో 70 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఎక్కువశాతం వీరి అవసరాలకే చాలడం లేదు. ఆరోగ్యవంతులు ఎవరైనా చర్మాన్ని ధారపోయవచ్చు. విరివిగా చర్మదానం చేయడం వల్ల ఎంతోమంది క్షతగాత్రుల జీవితాలకు సాయం చేసినట్లు అవుతుంది. దాతల్లో హెచ్చుతగ్గులు చర్మనిధికి 2016లో 18 మంది దాతలు రాగా, 2017లో 40 కి పెరిగింది. కానీ మళ్లీ తగ్గిపోయింది. 2018లో 33 మంది దాతలు ఉండగా ఆపై 17కు పడిపోయింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో 9 మంది మాత్రమే చర్మదానం చేశారు. 2021 నాటికి 18కి, 2022లో 40 కి పెరిగింది. ఈ ఏడాదిలో 22 మంది నుంచి చర్మం స్వీకరించారు. అలాగే 44 మంది రోగుల కోసం చర్మాన్ని పంపారు. ఇప్పటివరకు 310 మంది నుంచి వినతి వస్తే 194 మందికి మాత్రం సరఫరా చేశారు. వీరిలో నాలుగేళ్ల బాలుర నుంచి 85 ఏళ్లు వృద్ధుల వరకూ ఉన్నారు. అలాగే దాతల్లో 17 ఏళ్లు యువకుని నుంచి 98 ఏళ్లు వృద్ధుని వరకు 197 మంది దానం చేశారని చర్మనిధి పర్యవేక్షకుడు బీఎన్.నాగరాజ్ తెలిపారు. -
ఒకేరోజు.. ఒకే చోట.. 6,166 యూనిట్ల రక్తదానం
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు. -
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
బ్లడ్ డొనేషన్ పేరుతోనూ మోసాలు!
హైదరాబాద్: రక్తం, ప్లాస్మా వంటివి అత్యవసరమైన వారిని సంప్రదించి, వారి నుంచి కొంత మొత్తం తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ ఆ«దీనంలోని వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ శిల్పవల్లి శుక్రవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆరి్థక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్పై బయటికి వచ్చాడు. 2020లో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్మీడియా ఫ్లాట్ఫామ్స్లో సెర్చ్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచి్చన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కొవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని బెట్టింగ్లతో పెట్టేవాడని డీసీపీ తెలిపారు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్గోపాల్పేట, బంజారాహిల్స్తో పాటు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాజాగా మరోసారి సోషల్మీడియా వేదికగా బ్లడ్, ప్లాస్మా డొనేషన్ పేరుతో మోసాలు ప్రారంభించిన అతడిపై దోమలగూడ ఠాణాలో కేసు నమోదు కావడంతో వాంటెడ్గా మారాడు. సీసీఎస్లోని వెస్ట్జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ డి.భిక్షపతి నేతృత్వంలోని బృందం శుక్రవారం పట్టుకుంది. -
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఎస్ఏలో రక్తదానం
దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి(సెప్టెంబర్2) సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సీర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 14వ వర్ధంతి పాటు అమెరికాలో 9/11 విషాదకర ఘటనను తలచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఇక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు టీ షర్ట్ లు అందజేశారు. కాగా 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఆల్ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. 9/11 Attack ఘటన జరిగి 22 ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ 14వ వర్థంతి: డాలస్లో రక్తదాన శిబిరం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలోని డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్లో బ్లెడ్ డ్రైవ్ నిర్వహించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ సభ్యులు తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్లో ఆక్లాండ్లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగపూర్లో రక్తదాన కార్యక్రమం
భారత స్వాతంత్య్ర దినోత్సవం, సింగపూర్ జాతీయ దినోత్సవం(ఆగస్టు9)ను పురస్కరించుకొని రెడ్క్రాస్ సహకారంతో సింగపూర్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. HSA ఔట్రం రోడ్,కొత్తగా ఏర్పాటైన వన్ పుంగోల్లో ఏకకాలంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 75మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు.కుంకు వరలక్ష్మి-నాగేశ్వరరావు అనే దంపతులిద్దరూ రక్తదానంలో పాల్గొని అందరికి స్ఫూర్తిగా నిలిచారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం గురించి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ రక్తదానం చేయాలని, దీనివల్ల మరింత ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. గత ఏళ్లుగా వరుసగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైనా రక్తం కావాలని సహాయం అడిగితే వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి కార్యక్రమం 29 అక్టోబర్ 2023న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్ అమర్రహే
సాక్షి, అమరావతి: పరిపాలనలో మానవత్వాన్ని జోడించి ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచి, పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్రహే’’ అంటూ వాడవాడనా నినదించారు. ప్రజలు మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. గ్రామగ్రామాన కేక్లు కట్ చేసి.. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. భారీ ఎత్తున రక్తదానం చేసి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలో పలు రాష్ట్రాల్లో అభిమానులు, ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. మీ పథకాలు మరువలేనివి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యేలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో అభిమానులు కేక్ కట్ చేశారు. పెడన, గుడివాడ పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు జోగి రమేశ్, విడదల రజిని పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గుండుగొలనులోని మెగా జగనన్న హౌసింగ్ కాలనీ ద్వారం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, చీరాల, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి జయంతి వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. పల్నాడులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, బాపట్లలో మేరుగ నాగార్జున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఊరూరా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, రైతులకు ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి తమ మనసుల్లో వైఎస్సార్ గుర్తుండిపోయారని ప్రజలు, అభిమానులు కొనియాడారు. గుండెల్లో కొలువైన నేతకు జన నీరాజనం ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీచేశారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. తమ గుండెల్లో కొలువైన జననేత వైఎస్సార్ జయంతి వేడుకలను ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్వతీపురంలో వైఎస్సార్ విగ్రహానికి వేలాది మంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పీడిక రాజన్నదొర సాలూరులో, విజయనగరంలో వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కోరుకొండలో రక్తదానశిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ బులుసు సాంబమూర్తి పాఠశాలలో పార్టీ, నాయకులు, కార్యకర్తలు, అన్న, వస్త్రదానం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాల్లో వైఎస్సార్కు ఘనంగా నివాళులు.. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎన్నారైలు, ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర 17 దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు మహానేత వైఎస్కు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి మహానేత వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సేవా మార్గంలో జయంతి వేడుకలు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్నదానం, రక్తదానం, వస్త్రదానం తదితర సేవామార్గాల్లో నిర్వహించారు. గంగాధరనెల్లూరు మండలం వెజు్జపల్లెలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో, నగరి మండలంలోని బుగ్గ అగ్రహారంలో మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, పుంగనూరులో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ జయంతి ఉత్సవాలు ఆయన సొంత జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కడపలో హెడ్ పోసా్టఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్బాషా క్షీరాభిషేకం చేశారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
ధీరూభాయ్ అంబానీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. -
రక్తదానం జీవన దానమే!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్ఓ సర్టిఫికెట్ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్భవన్లో ఎన్ఐఆర్డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
సులభమైన మార్గం.. మీకు కూడా మంచిదే: మెగాస్టార్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడటానికి, మానవాళికి తోడ్పడటానికి సులభమైన, సమర్థవంతమైన, ఖర్చులేని మార్గం రక్తదానమని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉటామని సూచించారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) రక్తదాతలైన సోదర, సోదరిమణులకు రక్త దానంలోపాల్గొనేలా అవగాహన కల్పించేవారికి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరికీ సంతోషాన్ని కోరుకుంటున్నానని ట్వీట్లో ప్రస్తావించారు. The simplest, effective, no cost way to save lives and contribute to humanity. And guess what .. this is one donation that makes us healthier too !! Donate Blood & Save Lives!! Wishing everyone a Happy #WorldBloodDonorsDay ! And More power to all my Blood Brothers / Blood… pic.twitter.com/8Fqb0dt5jK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2023 -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్క్రాస్, బ్లడ్బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్క్రాస్లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్భవన్లో జరిగిన రెడ్క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రక్తదానంలో సెంచరీ..!
సాక్షి, కామారెడ్డి : వస్త్ర వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఒక సారి కాదు, రెండు సార్లు కాదు.. ఇప్పటికీ ఆయన 102 సార్లు రక్తదానం చేశాడు. ఎంతో మందికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాంబే క్లాథ్ హౌజ్ షాపింగ్ మాల్ యజమాని వీటీ రాజ్కుమార్ నాలుగున్నర దశాబ్దాలుగా రక్తదానం చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు రక్తదానం చేయడం అలవాటుగా మారింది. రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన వీటీ రాజ్కుమార్ను రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వీటీ రాజ్కుమార్ అందించిన సేవలపై ‘సాక్షి’ కథనం.. కామారెడ్డిలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో విపత్తులు సంభవించినా బాంబే క్లాథ్ హౌజ్ ద్వారా దుస్తులు, ఆహార పదార్థాలను పంపిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు అందజేస్తారు. రోడ్డు మీద పండ్లు, కూర గాయలు అమ్ముకుని జీవనం సాగించే వారికి ఎండ, వానల నుంచి రక్షించుకునేందుకు గొడుగులు పంపిణీ చేయడం, వైద్య శిబిరాలతో పేదలకు మందులు ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లూ చే యిస్తారు. కామారెడ్డి ఆస్పత్రి సమీపంలో రూ. 5కు భోజనం కూడా పెడుతున్నారు. ఇలా నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. తండ్రి పేరిట బ్లడ్ బ్యాంక్.. వైద్యం కోసం కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, డెలివరీల కోసం ఇక్కడి ఆస్పత్రులకు వచ్చే వారు సమయానికి రక్తం దొరక్క ఇబ్బందులు పడడమే కాదు ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. బాంబే క్లాథ్ హౌజ్ ముందరే ప్రభుత్వ ఆస్పత్రి ఉండడం, ఆస్పత్రికి వచ్చిన వారు బ్లడ్ కోసం పడే ఇబ్బందులను చూసి చలించిపోయిన వీటీ రాజ్కుమార్ ఆయన సోదరుడు వీటీ లాల్ బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడానికి ముందు కు వచ్చారు. తమ తండ్రి వీటీ ఠాకూర్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంపులు నిర్వహిస్తూ రక్తం సేకరించి నిల్వ చేయడం, ఆదప లో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో వేలాది మందికి రక్తం అందించారు. కాగా రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిని గుర్తించి రెడ్క్రాస్ సొసైటీ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న అవార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిలో రెండో వ్యక్తిగా వీటీ రాజ్కుమార్ను గవర్నర్ తమిళిసై అవార్డుతో సన్మానించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న రాజ్కుమార్ను అభినందించారు. రక్తదానంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది.. సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నన్నెంతగానో కలచివేశాయి. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నా.అప్పటి నుంచి ఏటా రెండు, మూడు సార్లు తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నా. బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్నాం. ఎన్ని డబ్బులు సంపాదించినా మనిషికి తృప్తి ఉండకపోవచ్చు. కానీ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినపుడు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇన్ని సార్లు రక్తదానం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మొదట్లో 20 సార్లు చేయాలనుకున్న. తరువాత టార్గెట్ 50 కి పెట్టుకున్నా. ఆ తరువాత వంద సార్లు అనుకున్నా. ఇప్పటికీ 102 సార్లు రక్తదానం చేశాను. శక్తి ఉన్నంత కాలం చేస్తూనే ఉంటా. -
ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ ట్వీట్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. ట్వీట్తో పాటు పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు) Hearty Thanks to each and every Blood brother / sister who has responded to my appeal and donated blood specifically to help the #BalasoreTrainAccident victims in Odisha! My heartfelt gratitude to you all ! 🙏@Chiranjeevi_CT pic.twitter.com/nj6PJGJyHo — Chiranjeevi Konidela (@KChiruTweets) June 9, 2023 -
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని TCSS నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. మరియు ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు , వెంకట రమణ వ్యవహరించారు. సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు , ఇతర సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల,సాయి బాలె తదితరులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలిపారు. -
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్టౌన్లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్సింగ్నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
నంద్యాల: పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరం
-
రక్తదానంలో వైఎస్ఆర్ సీపీ ప్రపంచ రికార్డ్
-
Happy Birthday CM YS Jagan: ‘రక్తదానం’లో గిన్నిస్, జీనియస్ రికార్డులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేసేందుకు అంగీకారం తెలియజేసి(టేక్ ది ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్) రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానం చేసేందుకు సిద్ధమంటూ WWW. ysrcpblooddonation.com ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 1,28,534 మంది, ఆఫ్లైన్ ద్వారా 26,503 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అలాగే బుధవారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో 13,039 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు మొత్తం 1,68,076 మందితో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది వరకు(దక్షిణాఫ్రికా పేర్న) ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వీరేంద్ర.. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. 24 గంటల్లోనే రికార్డులు బద్దలు అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపే దాతల నుంచి అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా నేషనల్ బ్లడ్ సర్వీస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా ఫ్లెడ్జ్ ఫామ్స్ సేకరించింది. అప్పుడు 24 గంటల్లో 71,121 మంది ఫ్లెడ్జ్ ఫామ్స్ను అందజేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటిదాకా మన దేశంలో కేవలం ఎనిమిది గంటల్లో 10,217 మంది ప్లెడ్జ్ ఫామ్స్ ఇచ్చిందే ప్రపంచ రికార్డుగా ఉండేది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రెడ్క్రాస్ సొసైటీతో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో భారీ ఎత్తున రక్తదానం చేశారు. కేవలం 24 గంటల్లోనే 1,68,076 ఈ రికార్డు సృష్టించి.. దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టారని రెడ్క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి వెల్లడించారు. రక్తదాన ఉద్యమం మరింత ముందుకు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ వెంట మనం నడుస్తున్నందునే మనం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయత, అభిమానం చూపుతున్నారని చెప్పారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం జగన్ దార్శనికుడిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు(నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ) చల్లా మధుసూదనరెడ్డిని, వారికి సహకరించిన ఐటీ వింగ్ ప్రతినిధులు, సోషల్ మీడియా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రక్తదాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు నిచ్చారు. -
చెన్నై: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
సాక్షి, చెన్నై: నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో భరోసానిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఇదే విషయాన్ని చెన్నైలోని భారత్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే బుధవారం జన నేతకు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. అభిమానంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నది నిజం చేస్తూ.. రైతుల పాలిట ఆపద్భాందవుడుగా మారాడని, బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా వెలుగుతున్నాడని ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వైఎస్ జగన్ను కొనియాడారు. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్ ప్రజా సంక్షేమ సారథిగా ఎదిగారని మరికొందరు విద్యార్థులు చెప్పారు. పేదింటి పెద్ద కొడుకుగా, అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేనమామగా, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్లు. ఈ కార్యక్రమంలో సైకం రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డి, నరేష్, కార్తీక్, అజయ్ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. -
CM YS Jagan Birthday Special: వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
-
CM YS Jagan Birthday: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
సాక్షి, తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైఎస్సార్సీపీ బద్దలుకొట్టింది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. చదవండి: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan -
175 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు.. వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన రక్తదానంకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19న క్రీడా పోటీలు, మహిళలకు సంబంధించిన పోటీలు, 20న మొక్కలు నాటడం, 21న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు,సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సుస్ధిరమైన అభివృధ్ది సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని మూడున్నరేళ్ల కాలంలోనే తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిన ఘనత సీఎం జగన్ది అని సజ్జల అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్ళలోనే 99 శాతం పూర్తి చేశారన్నారు. ఇచ్చిన హామీలకంటే వంద రెట్లు ఎక్కువగా పథకాలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గాలు ఆర్థికంగా బలపడేలా చేయడంతోపాటు వారికి విద్య, వైద్యపరంగాను, ఉపాధి మెరుగైన సేవలు అందించారన్నారు. వీటన్నింటికి మించి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేసి చూపించారన్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని భావించామన్నారు. ప్రతిసారి పార్టీ తరఫున చేస్తుంటాం. ఈసారి కోట్లాది మంది అభిమానులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదాదారులు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళాపక్షపాత ప్రభుత్వం, వారికి పెద్దపీట వేశారన్నారు. అప్పుడు 38వేల యూనిట్లు.. 2020లో రికార్డుస్ధాయిలో 38 వేల యూనిట్లు రక్తదానం చేసినట్లు సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు అందరూ శిబిరాలకు వచ్చి రక్తదానం చేశారు. తమ నాయకుడైన సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరోవైపు తమ భాధ్యతగా అవసరమైనవారికి రక్తం ఇవ్వాలనే మహోన్నత ఆశయంతో ఆనాడు రక్తదానం చేశారన్నారు. అప్పుడు కూడా రెడ్ క్రాస్, వైఎస్సార్సీపీ కలిసి రక్తదాన కార్యక్రమం నిర్వహించాయన్నారు. ఆ రోజున బ్లడ్ ఎక్కువ కాలం స్టోర్ చేశారు. నిజంగా అవసరమైనప్పుడు ఇస్తే బాగుంటుందనే భావించామన్నారు. అందుకే ఈసారి ఫిజికల్గా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వెబ్ సైట్ కూడా లాంచ్ చేశాం అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాలలోను ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వారికి అది అందేలా చేయడం ఈ వెబ్ సైట్(www.ysrcpblooddonation.com) వల్ల వీలు కలుగుతుంది. కార్యకర్తలు, అభిమానులు తమ నాయకుడికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడంతోపాటు సామాజిక బాధ్యత నెరవేర్చినట్లు అవుతుందన్నారు. వివిధ కాలేజీలు, సంస్ధలు అందరూ కూడా ప్రమోట్ చేయాలని కోరుతున్నామన్నారు. తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు రక్తం ఎంతో అవసరం అన్నారు. రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్నిపురస్కరించుకుని విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రెడ్ క్రాస్ మన రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందన్నారు. 2020లో కూడా రెడ్ క్రాస్ ద్వారా రక్తదానశిబిరాల ద్వారా 38 వేల యూనిట్లు రక్తాన్ని సేకరించామన్నారు. ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడమే కాకుండా ప్లెడ్జ్ ఫామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఆన్ లైన్ లో కూడా ఇవ్వచ్చు లేదా రక్తదానశిబిరాల వద్దకు వచ్చి ఈ ఫామ్స్ ఇవ్వచ్చని తెలియచేశారు. అత్యవసర పరిస్దితులలో రక్తం అవసరమైనప్పుడు మేము సేకరించే డేటా ద్వారా రక్తదాతల ద్వారా అవసరమైనవారికి సహాయం అందిస్తామన్నారు. 175 నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సాంఘికసంక్షేమశాఖమంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ళఅప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్రెడ్డి, నారమల్లి పద్మజ, పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు సజ్జల భార్గవ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
చిరంజీవిపై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ వోవెన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1,500 మంది రక్తదాతలకు రూ.7 లక్షల విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు. ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’–2022 అవార్డును గెలుచుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప సంబంధాలు నెలకొల్పేందుకు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 10లక్షలయూనిట్ల రక్తదానం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను సందర్శించడం గొప్ప గౌరవమని, ఎంతోమంది రక్తదాతలకు ఇది మరింత స్ఫూర్తినిస్తుందని చిరంజీవి చెప్పారు. ఈ బ్లడ్ బ్యాంకులో ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల రక్తదానం చేశామని, నేత్ర బ్యాంక్ ద్వారా 9,060 మందికి కంటిచూపు పునరుద్ధరించామని వెల్లడించారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఇది సహాయ పడిందన్నారు. రక్తం దొరకక తన దూరపు బంధువు ఒకరు చనిపోయినప్పుడు పడ్డ ఆవేదన నుంచే బ్లడ్ బ్యాంకు ఆలోచన వచ్చిందని వివరించారు. బ్లడ్బ్యాంకుకు అవసరమైన సాంకేతిక నిపుణుల కొరత ఉండటం వల్లే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిచోట తన అభిమానులు చెప్పగానే రక్తదానం చేస్తున్నారని..అభిమానులున్న చోట బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లేనని వెల్లడించారు. ఇటీవల ఓ తల్లి తన బాబు(8)కు ప్లేట్లెట్స్ను తన అభిమానులు ఇచ్చి ప్రాణాలు కాపాడారని ఓ సందేశం పంపినప్పుడు తనకు చాలా ఆనందం కలిగిందన్నారు. కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్తో బీజేపీ నేతల రక్తదాన కార్యక్రమం...పేలిన మాటల తుటాలు
కర్ణాట బీజీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన నేరస్తుడు సునీల్ దర్శనమిచ్చాడు. అతను బెంగుళూరులో అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్ కిల్లర్గా పరిగణించే సునీల్. ప్రస్తుతం అతను నేర కార్యకలపాలకు దూరంగా ఉంటున్నానని, సమాజ సేవ చేస్తున్నాని చెబుతుండటం విశేషం. ఆ నేరస్తుడు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, చిక్పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కనిపించాడు. దీంతో అతను బీజేపీలోకి చేరతాడంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కర్ణాట బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందిస్తూ... ఈ మిషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని అన్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలను ఆదేశించామని, అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారిని, నేర నేపథ్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోమని, ఇలాంటి వాటిని పార్టీ ఎప్పటికీ సహించదని నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శులు ఎక్కుపెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా..పోలీసుల దాడిలో దొరకని రౌడిషీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చారు. గతంలో బెట్టింగ్లకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీ పార్టీలో చేరి, మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య కూడా బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ శివకుమార్ ఒకప్పుడూ గ్యాంగ్స్టర్ కొత్వాల్ రామచంద్రకు అభిమాన శిష్యుడంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడూ కొత్వాల్ అభిమాన శిష్యుడు తీహార్ జైలు నుంచి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడని, ప్రస్తుతం అతను పార్టీ అద్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులను మరిచిపోయారా అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అండర్ వరల్డ్లో పెరిగిన శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హత్య నిందితులు వినయ్ కులకర్ణి, గూండాయిజంలో పేరుగాంచిన మహ్మద్ నలపాడ్లు కర్ణాటక కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారంటూ మొత్తం లిస్ట్ పేర్కొంది బీజేపీ. కాగా, ఇరు పార్టీ మాటల తుటాల దాడి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ...పాత రౌడీషీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో క్రైం బ్రాంచ్ కమిషనర్ ఎన్డీ శరణప్ప ఈ విషయమై వివరణ ఇచ్చారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ సునీల్పై ఎలాంటి పాత పెండింగ్ కేసులు లేవని స్పష్టం చేశారు. అంతేగాదు అతను విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేకపోవడంంతోనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రౌడీషీటర్ సునీల్ని అదుపులోకి తీసుకులేదని తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం) -
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
డాలస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తాజాగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 69 మంది రక్తదానం చేశారనీ, 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ఏడాదికి రెండు సార్లు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు టీప్యాడ్ వెల్లడించింది. గత ఎనిమిదేళ్లో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి అని, తాజాగా సేకరించిన బ్లడ్ను కార్టర్ బ్లడ్ కేర్కు అందించినట్లు తెలిపింది. రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారుతోపాటు వలంటీర్లకు, కార్టర్ బ్లడ్ కేర్ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్లో నిర్వహించిన చివరి డ్రైవ్లో 53 రిజిస్ట్రేషన్లు జరగ్గా, తాజాగా 69 మంది రిజిస్ట్రేషన్లతో రోజంతా జరిగిన రక్తదానంలో దాతలు రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు. అయితే సమయాభావం వల్ల చాలా మంది దాతలు రక్తదానం చేయలేకపోయారని నిర్వాహకులుతెలిపారు. ఈ డ్రైవ్లో సేకరించిన 52 యూనిట్ల రక్తంతో దాదాపు 10 మందికి గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు లేదా, 17 మందికి రక్త మార్పిడి లాంటి ఇతర అవసరాలకు సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారికి భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి సహకరించిన అభినందించి బ్లాంకెట్లను బహుమతిగా అందజేశారు. -
రక్తదానం చేసిన వారికి శ్రీవారి దర్శన భాగ్యం
-
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
గిన్నిస్ బుక్లోకి.. ‘హూ ఈజ్ హుస్సేన్?
వైరల్: హూ ఈజ్ హుస్సేన్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది! హుస్సేన్ ఎవరంటూనే గిన్నిస్కెక్కిందంటున్నారు ఏమిటా అని అవాక్కవుతున్నారా.. ఇంతకీ విషయం ఏమిటంటే.. హూ ఈజ్ హుస్సేన్ అనేది బ్రిటన్లోని ఓ సామాజిక న్యాయ దాతృత్వ సంస్థ. గత నెల 27న భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏ రేంజ్లో అంటే... ఒకేరోజులో 27 దేశాల నుంచి ఏకంగా 37,018 మంది రక్తదానం చేశారు. న్యూజిలాండ్లో 27న తెల్లవారగానే మొదలైన రక్తదానం అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో అదేరోజు వలంటీర్లు చేసిన రక్తదానంతో ముగిసింది. ఈ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు.. హూ ఈజ్ హుస్సేన్ సంస్థ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించినట్లు ఈ నెల 17న అధికారికంగా ధ్రువీకరించారు. 2020లో ఒకేరోజు 34,723 మంది చేసిన రక్తదానం రికార్డును హూ ఈజ్ హుస్సేన్ బద్దలుకొట్టిందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో తాము గ్లోబల్ బ్లడ్ హీరోస్ పేరిట విస్తృత ప్రచారం చేపట్టి ఒక్కరోజులోనే 37 వేల మందికిపైగా వలంటీర్లలో స్ఫూర్తినింపగలిగామని హూ ఈజ్ హుస్సేన్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కో వ్యక్తి చేసే రక్తదానం ద్వారా ముగ్గురి రోగుల వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని.. ఈ లెక్కన తాము 37 వేల మందికిపైగా దాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ఏకంగా 1.10 లక్షల మంది రోగులను కాపాడొచ్చని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ హుస్సేన్ పేరు ఏమిటని సంస్థ నిర్వాహకులను అడిగితే సుమారు వెయ్యేళ్ల కిందట జీవించిన మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబిన్ అలీ తన జీవితాంతం చేసిన నిస్వార్థ సేవలకు గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు వివరించారు. ఇదీ చదవండి: హిజాబ్ నిరసనల్లో ఆరుగురు మృతి -
సీఎం జగన్ బర్త్డే రక్తదాన శిబిరాల రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 2020 డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అరుదైన రికార్డును నెలకొల్పింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో నమోదైంది. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిన సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ముమ్మరంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా ఒక్కరోజులో 34,723 యూనిట్ల(12,153 లీటర్లు) రక్తాన్ని సేకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రోటరీ, రెడ్క్రాస్, లయన్స్ క్లబ్ ఇతర ఎన్జీవోలు ఈ శిబిరాల నిర్వహణలో పాలుపంచుకున్నాయి. ఒకేరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించడంతో ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో నమోదైంది. గతంలో ఒకేరోజు అత్యధికంగా 10,500 యూనిట్ల రక్తాన్ని సేకరించిన రికార్డును ఇది అధిగమించింది. పైగా కేవలం 8 – 9 గంటల్లోనే మూడు రెట్లు అదనంగా రక్తాన్ని సేకరించటంపట్ల వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు పార్టీ నాయకత్వాన్ని అభినందించారు. కరోనా నేపథ్యంలో రక్త దాతలు ముందుకొచ్చే వారు కాదు. దీంతో రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రక్తం దొరక్క చాలా ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకులకు సరఫరా చేశారు. -
డాలస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
-
డాలస్లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాలస్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ 13వ వర్ధంతి సందర్బంగా అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవి ఆరిమండ, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, మని అన్నపురెడ్డి, రమణ పుట్లూర్, జయచంద్ర రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర్ గండికోట, కృష్ణ రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, ప్రసాద్ చొప్ప, వీరా రెడ్డి వేముల, మోహన్ మల్లంపాటి, రాజేంద్ర పోలు, సుబ్బా రెడ్డి కొండ్రు, ఉమా కుర్రి, సురేష్ పులి, చెన్నారెడ్డి క్రోవి , మల్లిఖార్జున్ మురారితో సహా పలువురు వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ రక్త దాన శిబిరంలో చైతన్య కుమార్ రెడ్డి, జయచంద్ర గాజులపల్లి, కార్తీక్ ధర్మానాల, మోహన్ మల్లంపాటి, మోహన్ రెడ్డి పులగం, నాగేశ్వర గంట, నవీన్ కుమార్ రాజు అడ్డలూరి, పార్థసారథి గొర్ల, ప్రసాద్ భీమవరపు, రాఘవ రెడ్డి దాట్ల, రాంబాబు శొంఠి, రాము తవుతూ, శివచంద్ర రెడ్డి పల్లె, శివశంకర రెడ్డి వల్లూరు, సుభాష్ సురు, సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డివారి, స్వామినాథన్, ఉజ్వల్ కుమార్ వేమన, ఉమా కుర్రి, వీర లేవక, వీరా రెడ్డి వేముల, వీరవెంకట సత్య పోతంశెట్టి, వెంకట రెడ్డి శీలం, యుగంధర్ తిప్పిరెడ్డి తో పాటుగా పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేశారు. -
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను మంగళవారం ఆమె రాజ్భవన్లో ప్రారంభించారు. ఈ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లు బ్లడ్ డోనర్ వద్దకే వెళ్లి రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతా యని, దాతలు కూడా ముందుకు వస్తారని తెలిపారు. ఈ నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రెడ్క్రాస్ ప్రతిని«దులకు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ రెడ్క్రాస్ చైర్మన్ అజయ్మిశ్రా పాల్గొన్నారు. -
రక్తదానానికి ముందుకు రండి
సాక్షి, అమరావతి: ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏపీ శాఖకు సమకూర్చిన రక్తదాతల శకటాలను (బ్లడ్ డోనర్ వ్యాన్స్)ను విజయవాడ రాజ్భవన్ నుంచి గవర్నర్ జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఒక కరోనా పరీక్ష శకటంతో సహా ఐదు రక్తదాతల వాహనాలను సేవకు అంకితం చేశారు. వీటిని విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కడ దాతలు సిద్ధంగా ఉంటే అక్కడికే వెళ్లి రక్తసేకరణ చేస్తున్నారని.. ఇందుకోసం 18004251234లో సంప్రదించవచ్చన్నారు. రెడ్క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభిమానం మరువలేనిది ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. ఏపీ గవర్నర్గా పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లోనూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందగలనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
తమ్ముడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదని..
బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వారి అవయవాలు దానం చేయడం వల్ల నలుగురైదుగురి ప్రాణాలు నిలబడటం అనేక సందర్భాల్లో చూస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో అలా అవయవ దానం చేయడం కుదరదు. తమ్ముడి విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఊర్వశి సింగ్.. తన తమ్ముడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదని ‘బ్లడ్లైన్’ను నడుపుతూ వేలమంది ప్రాణాలు కాపాడుతోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఊర్వశి సింగ్కు ఇద్దరు చెల్లెళ్లతోపాటు ఒక్కగానొక్క తమ్ముడు అతుల్ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ్ముడిని ఎంతో ముద్దుగా చూసుకునేవారు. అది 2009... అతుల్కు లక్నోలో కొత్త ఉద్యోగం దొరికింది. ఆ విషయం అమ్మకు చెప్పడానికి జాన్పూర్ వస్తున్నాడు. ఆరోజు మదర్స్ డే కావడంతో అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఆత్రుతలో ఉన్నాడు. ఇంతలో వెనకనుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గర్లో ఉన్నవారు ఆసుపత్రిలో చేర్చడంతో తమ్ముడికోసం ఎదురుచూస్తోన్న ఇంట్లో వాళ్లకు ఈ దుర్ఘటన గురించి తెలిసింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. కానీ తీవ్రంగా గాయపడడంతో ఎక్కువ మొత్తంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అతుల్ స్నేహితుల సాయంతో కొంతవరకు రక్తం ఏర్పాటు చేసినప్పటికీ, కావాల్సినంత రక్తం సమయానికి అందకపోవడంతో తమ్ముడు చనిపోయాడు. బ్లడ్లైన్... సరైన సమయానికి రక్తం దొరికి ఉంటే తమ్ముడు బతికి ఉండేవాడు. అనిపించింది ఊర్వశికి. అప్పుడు తన తమ్ముడిలా ...రక్తం దొరకక, సరైన వైద్యం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు అని సంకల్పించుకుంది. దాంతో ‘బ్లడ్లైన్’ పేరుతో రక్తదాన బ్యాంకును ఏర్పాటు చేసి అప్పటినుంచి ఆపద, అత్యవసర వైద్యసదుపాయం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయడం ప్రారంభించింది. స్నేహితులు, బంధువుల సాయంతో కొన్నేళ్లు చేశాక.. ఒక్కదానివల్ల ఎక్కువ మందికి సాయం అందించలేకపోతున్నాను అనుకుని... 2018లో సామాజిక సేవాకార్యక్రమాలు చేసే కర్నిసేనతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న అధికారులను సమన్వయపరుస్తూ ఎక్కడ ఏ రోగికి అవసరమున్నా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ సంస్థతో కలిసి ఊర్వశికూడా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తోంది. అతుల్ ట్రస్ట్.. తమ్ముడి పేరుమీద ‘అతుల్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలోని వారికి సైతం కాలేజీ విద్యార్థుల సాయంతో అత్యవసరంలో ఉన్నవారికి రక్తం అందిస్తోంది. సోషల్ మీడియాలో వివిధ ప్రచార కార్యక్రమాలు ద్వారా ఊర్వశి తన సేవలకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి, కోవిడ్ సమయంలో కూడా అనేకమంది ప్రాణాలను కాపాడింది. నేను పేషెంటుని అయినప్పటికీ... ‘‘ఎక్కువమందికి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అడిగిన వారందరికి రక్తం సరఫరా చేస్తున్నాము. కొన్నిసార్లు అర్ధరాత్రి, తెల్లవారు జామున మూడు గంటలకు కూడా రక్తం కావాలని ఫోన్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో మా కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఫోన్ మాట్లాడి వాళ్ల అవసరాలు తీరుస్తున్నాను. నాకు ఆస్తమా ఉండడం వల్ల ఇంట్లో వాళ్లు నేను రక్తం దానం చేయడానికి ఒప్పుకోరు. అయినప్పటికీ ఈ మధ్యనే ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఓ గర్భిణికి రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాను. బ్లడ్బ్యాంక్లు అనుసరిస్తోన్న కొన్ని నిబంధనల వల్ల ప్రతి మూడునెలలకు చాలా రక్తం పాడై, వృధాగా పోతుంది. ఆ నిబంధనలు కాస్త సడలించడం వల్ల అవసరంలో ఉన్న వారికి రక్తం అందుతుంది’’ అని ఊర్వశి ప్రభుత్వాలను కోరుతోంది. -
ప్రతి రోజు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు..అయినా!
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతిప్రధానమైనది. దేశ వ్యాప్తంగా ఉన్న 135 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరపడుతుందని నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తుంది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రతి రోజు దాదాపు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన మాత్రం రక్త అవసరాలను తీర్చడానికి అనుగుణంగా లేవన్నది వాస్తవ సత్యం. నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -సాక్షి, హైదరాబాద్ రక్త నిల్వలు నిండుకున్నాయి... ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తలసేమియా బాధితులు భారత్లోనే ఎక్కువగా ఉన్నారు. రక్తదానం పై అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావట్లేదని సర్వేలు పేర్కొంటున్నాయి. 18 సంవత్సరాలు నిండి 12.5 హిమోగ్లోబిన్ స్థాయితో 45 నుంచి 50 కిలోల బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తదానానికి అర్హుడు. ఇలా ఒక్కో వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు రక్తదానం చేయవచ్చని అరోగ్య నిపుణులు నిర్ధారించారు. చదవండి: హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. 15 రోజలకు ఒక సారి ప్లాస్మా దానానికి ఆస్కారం ఉంది. ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. మొత్తంగా 85 శాతం పాజిటివ్ గ్రూప్, 15 శాతం నెగెటివ్ గ్రూప్కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా నెగెటివ్ గ్రూప్ వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి 20 వేల మందిలో ఒకరు బాంబే బ్లడ్ గ్రూప్తో పుడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు రక్తదాతల కోసం అవగాహనా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో రక్త నిధులను సమకూర్చలేకపోతున్నామని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. షుగర్, హెచ్ఐవీ, హెపటైటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు స్వచ్చంథంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తరచు రక్తదానం చేసేవారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి జబ్బులు దరిచేరవని మెడికల్ సర్వేలు నిర్థారిస్తున్నాయి. 258 సార్లు రక్తదానం చేశా... గత 22 సంవత్సరాల్లో 258 సార్లు రక్తదానం చేసి ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పాను. అంతేకాకుండా వ్యక్తిగతంగా, సోషల్మీడియా వేదిక ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 20 వేల మందికి సకాలంలో రక్తాన్ని అందించగలిగాను. సరైన సమయానికి రక్తం అందక ఒక వ్యక్తి చనిపోయారన్న వార్త తెలుసుకుని రక్తదానం చేయడం ప్రారంభించాను. రక్తదానంపై యువకుల ఆలోచనా విధానం మారాలి. యువకులు అధికంగా ఉన్న మన దేశంలో రక్తం అందక బాధితులు చనిపోవడం శోచనీయం. –డా.సంపత్ కుమార్, సామాజిక వేత్త, బంజారాహిల్స్. 12 వేల మందికి రక్తాన్ని అందించా. ఇప్పటి వరకు 116 సార్లు రక్తదానం చేశాను. పది సంవత్సరాల క్రితం నేను ప్రారంభించిన రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో 12 వేల మందికి రక్తాన్ని అందించగలిగాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 58 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను. రక్తదానం కోసం కృషి చేస్తున్న వారికి ఏటా సంస్థ ఆధ్వర్యంలో అవార్డులను ఇస్తున్నాము. –రెహమాన్, హైదరాబాద్. -
టీపాడ్ రక్తదాన శిబిరానికి భారీ స్పందన
బ్లడ్బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరతను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఐటీ కంపెనీ అయిన ఐటీ స్పిన్ ఆవరణలో టెక్సాస్లోని అతి పెద్ద బ్లడ్బ్యాంక్ కార్టర్ బ్లడ్ కేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫ్రిస్కో, ఎల్లెన, మెక్కెన్నీ, ప్రాస్పర్, ప్లేనో, ఐర్వింగ్, కాపెల్ తదితర ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. శిబిరం ఏర్పాటు చేసిన ఐటీ స్పిన్ ఆవరణలో బ్లడ్బ్యాంక్ వ్యాన్ ను చూసిన కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం. ఈ శిబిరంలో 150 మంది చికిత్సకు సరిపోయేలా 50 పింట్ల రక్తాన్ని సేకరించారు. ఇది సుమారు 10 గుండె శస్త్రచికిత్సలకు సరిపోతుందని కార్టర్ బ్లడ్కేర్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరానికి ఇంతగా స్పందన వస్తుందని తాము ఊహించలేదని, అంచనాలను మించి రక్తాన్ని సేకరించామని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టీపాడ్ గత ఎనిమిదేళ్ల నుంచి ఇది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా, ఇది తొమ్మిదవది. ప్రతిసారి రక్తదానానికి అవసరమైన పరిసరాలను కల్పించిన ఐటీ స్పిన్ కంపెనీ యాజమాన్యం రఘువీర్ బండారు, ఉమా బండారులకు టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పటిలాగే టీపాడ్.. 2022లో కార్యక్రమాలను రక్తదాన శిబిరంతో మొదలుపెట్టడం విశేషం. డాలస్ తెలంగాణ ప్రజాసమితి సగర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రేణుకా చనమోలు సహాయంతో స్వప్న తుమ్మపాల సమన్వయం చేశారు. అజయ్రెడ్డి, రమణ లష్కర్, ఇంద్రాని పంచెర్పుల, పండు పాల్వాయ్ నిర్దేశం చేశారు. టీపాడ్ సేవలను కార్టర్ బ్లడ్కేర్ నిర్వాహకులతో పాటు రక్తదాతలు, స్థానికులు అభినందించారు. -
సామాజిక సేవలో టీప్యాడ్
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్ 2న బ్లడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు టీప్యాడ్ ప్రతినిధులు తెలిపారు. టెక్సాస్లోని ఫ్రిక్స్ నగరంలో లెబనాన్రోడ్లో ఉన్న ఐటీ స్పిన్ భవనంలో ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ ఏడు టీప్యాడ్ ఈ బ్లడ్డ్రైవ్ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది జరిగే బ్లడ్ డ్రైవ్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలు రిజిస్ట్రర్ చేసుకోవాలని టీప్యాడ్ కోరింది. గడిచిన 90 రోజుల్లో విదేశీ ప్రయాణం చేసిన అమెరికన్లను ఈ బడ్ల్డ్రైవ్కు అనుమతించడం లేదని టీప్యాడ్ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం https://ww3.greatpartners.org/donor/schedules/drive_schedule/131481 లింక్ను ఉపయోగించుకోవాలని టీప్యాడ్ కోరింది. -
మెగా రక్తదాన శిబిరం ప్రారంభం
నాంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేన్(ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి, గృహకల్ప భవన సముదాయంలో 6వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్త దానం చేశారు. అనంతరం మాట్లాడుతూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఎన్జీఓ ఉద్యోగులు భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 730 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్లో రక్తదాన శిబిరం
సామాజికసేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం మరోసారి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. 2021 నవంబరు 27, 28 తేదిల్లో స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు ఈ కార్యక్రమం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా సమయంలో తెలుగు సమాజం వరుసగా ఆరోసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం విశేషం. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు తెలిపారు. రక్తదానం పట్ల ఆసక్తి ఉన్న ఇతర దాతలు తర్వాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చన్నారు. సింగపూర్ తెలుగు సమాజనికి, రెడ్క్రాస్తో పాటు బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
20 రోజులపాటు వేడుకలు
న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్లు నిర్మించనున్నారు. ఎగ్జిబిషన్ కూడా.. ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది. గంగా నది శుద్ధి.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. -
మోదీ బర్త్డే: 5 కోట్ల పోస్ట్కార్డులు.. థాంక్స్ పీఎం బ్యానర్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు నాడు ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘‘సేవా, సమార్పణ్, అభియాన్’’ పేరిట 20 రోజుల పాటు మెగా ఈవెంట్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్ సమయంలో ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసినందుకు, కోవిడ్ టీకా వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థ్యాంక్స్ పీఎం బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాక బూత్ స్థాయి నుంచి మోదీని అభినందిస్తూ 5 కోట్ల పోస్ట్ కార్డులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్తలందరూ సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో క్లిప్ రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని పార్టీ సూచించింది. (చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్లో ‘ఆప్’) ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గంగా నదిని శుభ్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 71 చోట్ల క్లీన్ గంగా పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి వచ్చే అన్ని బహుమతులను వేలం (pmmementos.gov.in/#/) వేసి ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ కోవిడ్ నియమాలు పాటించాలని పార్టీ సూచించింది. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ -
టీప్యాడ్ ఆధ్వర్యంలో డల్లాస్లో రక్తదాన శిబిరం
డల్లాస్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్యర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు 51 మంది పేర్లు నమోదు చేసుకోగా 30 పింట్స్ రక్తాన్ని సేకరించారు. ఒక్క పింట్ రక్తం ద్వారా ఆపదలో ఉన్న ముగ్గురి జీవితాలను కాపాడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అనురాధ మేకల, మామిడి రవికాంత్, సుంకిరెడ్డి మాధవి, రావు కల్వల, గోలి బుచ్చిరెడ్డిలతో పాటు టీప్యాడ్కి చెందిన అనేక మంది వలంటీర్లుగా పని చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్రిస్కో, ప్లానో, అలోనో, కొప్పెలో తదితర ప్రాంతాలకు చెందిన యువతకు టీప్యాడ్ కల్పిస్తోంది. రక్తదాన శిబిరం నిర్వహాణకు సహాకారం అందించిన ఐటీ స్పిన్ కంపెనీకి టీప్యాడ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ శిబిరానికి వచ్చి రక్తం దానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్ను గ్రాండ్గా నిర్వహించిన ఆటా -
గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి..
సాక్షి, భువనేశ్వర్: జీవితంలో పెళ్లి అనేది ఓ మరుపురాని సంఘటన. అదేరోజు అందరికీ గుర్తుండిపోయే ఓ మంచిపని చేస్తే అది ఇంకా ప్రత్యేకం. ఆదివారం హితేష్ అనే యువకుడి పెళ్లి జరుగుతుండగా, ఓ ఉన్నతాధికారి నుంచి రక్తదానం చేయాల్సిందిగా వరుడికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా వధువుకి తాళికట్టిన మరుక్షణమే పెళ్లిపీఠలపై నుంచి లేచి, నేరుగా ఆస్పత్రికి వెళ్లి, రక్తదానం చేసి, ఆదర్శంగా నిలిచాడు. వివరాలిలా ఉన్నాయి.. కొరాపుట్ జిల్లాలోని బొయిపరిగుడ సమితి, మఠపడ గ్రామపంచాయతీలో ఉన్న తెంతులిపొదర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణికి ఆదివారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం సహిద్ లక్ష్మణ్ నాయక్ ఆస్పత్రికి ఆమెని తరలించారు. రక్తం కొరతతో.. ఆమెకి రక్తం తక్కువగా ఉందని, చికిత్స చేయడం కుదరదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆమెకి కావాల్సిన గ్రూపు–ఏబీ పాజిటివ్ రక్తం కోసం చాలాచోట్ల ప్రయత్నించారు. కరోనా కారణంగా దాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో నిస్సహాయ స్థితికి చేరుకున్న వారి విషయం గురించి కొరాపుట్ డిప్యూటీ కలెక్టర్ అలోక్కుమార్ అనుగూలియకి తెలిసింది. దీంతో ఆయన బాధితులకు సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి రక్తం దానం చేయాల్సిందిగా కోరారు. ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో చివరికి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న హితేష్కి ఆయన ఫోన్ చేశారు. అధికారి ఫోన్ కాల్కి స్పందించిన సదరు యువకుడు తనకు పెళ్లి జరుగుతోందని, తాళి కట్టి వచ్చేస్తానని సమాధానమిచ్చాడు. పెళ్లయిన వెంటనే హితేష్ ఆస్పత్రికి చేరుకుని, రక్తదానం చేసి, గర్భిణికి అండగా నిలిచాడు. కరోనా భయంతో రక్తం దానం చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో పెళ్లికొడుకు పెళ్లిమండపం నుంచి వచ్చిమరీ రక్తదానం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గర్భిణి పరిస్థితి బాగుందని, చాలా సులభంగా డెలివరీ కూడా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చదవండి: కరోనాతో అసిస్టెంట్ డైరెక్టర్ మృతి -
హాట్సాఫ్ ఎస్పీ శ్వేత: రక్తదానంలో మగువలూ ముందడుగు
ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. చాలా మందికి రక్తం, ప్లాస్మా అవసరం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం అవసరం గుర్తించిన మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. రక్తదానం అంటే ఇప్పటికీ ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. రక్తం ఇస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా చాలామందిని వీడడం లేదు. మహిళల్లో రక్తదాన విషయంలో ఇంకా ఎన్నో అనుమానాలుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నెలసరి ఒత్తిళ్లు, ప్రసవానంతర సమస్యలు, రక్తహీనత... వంటివి వారిని ఈ విషయం లో వెనకడుగు వేయిస్తున్నాయి. వాటినన్నింటినీ దాటుకుంటూ నేటితరం యువతులు ‘మేము సైతం’ అంటూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి... సాధారణంగా చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది ఒక సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే గొప్ప విషయంగానే భావించాలి. కామారెడ్డి జిల్లాలో రక్తదానం ఒక ఉద్యమంగా సాగుతున్న సందర్భంలో రక్తదానం చేస్తూ పలువురు మహిళలు కూడా రక్తదాతలుగా వెలుగొందుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు గడచింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శ్వేత ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ఏటా రెండుసార్లు రక్తం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఇది నిరాటంకం గా కొనసాగిస్తానంటున్నారు. ఎస్పీ స్ఫూర్తితో పలువురు యువతులు మేము కూడా... అంటూ ముందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు రక్తదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడొచ్చని చెబుతున్నారు. అపోహలు వీడాలి మహిళలు రక్తదానం విషయంలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది. మగవారే కాదు మగువలూ రక్తం ఇవ్వొచ్చు. రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేనైతే ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నాను. ఇప్పటికీ తొమ్మిది సార్లు ఇచ్చాను. రాబోయే రోజుల్లోనూ ఇస్తూనే ఉంటా. మహిళలకు రక్తదాన విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. –ఎన్.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ శ్వేతను అభినందిస్తున్న ఐఏఎస్ అధికారి సత్యనారాయణ (ఫైల్) ఇబ్బందులేవీ రావు రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడామన్న సంతోషం కలుగుతోంది. – శోభ, కామారెడ్డి గొప్ప అనుభూతి మొదటిసారి రక్తదానం చేశాను. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. ఒకరికైనా సాయపడుతున్నాను అనే ఆలోచనతో గొప్ప అనుభూతిని పొందాను. రక్తదాతల సమూహం ద్వారా అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడానికి ఎప్పుడైనా నేను సిద్ధం. – నవ్య, మద్దికుంట, రామారెడ్డి మండలం ఎనిమిది సార్లు రక్తదానం చేశాను రక్తదానం విషయంలో ఎలాంటి అపోహలకూ లోను కావొద్దు. నేను ఇప్పటికీ ఎనిమిది సార్లు రక్తదానం చేశాను. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆడపిల్ల రక్తదానానికి ముందుకు రావాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు దూసుకుపోతున్నారు. రక్తదానంలోనూ బాధ్యతను నెరవేర్చాలి. –వెన్నెల, కామారెడ్డి పట్టణం ప్రాణదాతలు కావాలి నా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉందని తెలిస్తే వెళ్లి ఇస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు రక్తదానం చేశాను. అపోహలు వీడితే రక్తదానం చేయడానికి ఎవరికి వారే ముందుకు వస్తారు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని. –లావణ్య, రాంరెడ్డిపల్లి, బీబీపేట మండలం యువతులు ముందడుగు రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని తెలుసుకుని రక్తం చేయడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలి. రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. – హర్ష, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
వ్యాక్సినేషన్ తర్వాత బ్లడ్ డోనేషన్పై చిన్మయి ఏమన్నారంటే..
చిన్మయి శ్రీపాద పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ కంటే కూడా ఆమె మీ టూ ఉద్యమంతో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఉద్యమంలో తన ముక్కుసూటి తీరుతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో సైతం పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేగాక తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే ఆమె పలు విషయాలపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా మహిళల భద్రతపై చర్చిస్తుంటారు. అలా ఎప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకునే చిన్మయి తాజాగా ఓ సందేశాన్ని ఇచ్చారు. వ్యాక్సినేషన్ తర్వాత రక్తదానం ఇవ్వచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. చిన్న-పెద్ద, పేద-ధనిక అనే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. ఈ క్రమంలో కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ తీసుకున్న రక్తాదానం చేయడంపై ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 56 నుంచి 60 రోజుల వరకు బ్లడ్ డొనేట్ చేయరాదు. దాని వల్ల మున్ముందు బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి.. వ్యాక్సినేషన్కు ముందే బ్లడ్ డొనేట్ చేయండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
టీపీఏడీ అధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం
వాషింగ్టన్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ తన 8 వ వార్షిక బ్లడ్ డ్రైవ్ను నిర్వహించింది. ఎప్పటిలాగే ఈ కమ్యూనిటీ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంతో ఈ సంవత్సరానికి గాను తాము నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రక్త దానం చేసేందుకు సుమారు 40 మంది నమోదు చేసుకున్నారు. టెక్సాస్లోని అతిపెద్ద రక్త కేంద్రాలలో ఒకటైన కార్టర్ బ్లడ్ కేర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్టర్ బ్లడ్ కేర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘ఇక్కడ సేకరించిన ప్రతి పింట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఏడాది 30 యూనిట్ల రక్తం సేకరించాం. ఈ మొత్తం 90 మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.సేకరించిన 30 యూనిట్ల రక్తం, 5 గుండె శస్త్రచికిత్సలకు గాని.. 10 రక్త మార్పిడి వంటి అత్యధిక రక్తం వినియోగం అవసరం ఉన్న హెల్త్ సమస్యలకు సరిపోతుంది’’ అని తెలిపారు. టీపీఏడీ బృందం రక్తం దానం చేయడానికి వచ్చిన 40 మంది దాతలందరికీ అల్పాహారం, భోజనం అందించింది. స్థానిక ఐటీ కంపెనీ ఐటీ స్పిన్.. బ్లడ్ డ్రైవ్ నిర్వహించడానికి అవసరమైన పార్కింగ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. బ్లడ్ డ్రైవ్ను లక్ష్మి పోరెడ్డి సమన్వయం చేయగా.. రావు కల్వాలా, మాధవి సున్కిరెడ్డి, రవికాంత్ మామిడియాండ్ గోలీ బుచి రెడ్డి మార్గనిర్దేశం చేయగా.. అనురాధ మేకల ప్రచారం చేశారు. బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంతో, టీపీఏడీ ప్రాణాలను కాపాడటంలో సహాయపడటమే కాకుండా, ఫ్రిస్కో, ప్లానో, అలెన్, కొప్పెల్కు చెందిన విద్యార్థులు, యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా టీపీఏడీ వలంటీర్లు మాట్లాడుతూ.. ‘‘స్థానికులకు సాయం చేయడం కోసం మా వంతుగా బ్లడ్ డ్రైవ్ నిర్వహించాం. ఇది మా బాధ్యత. ఇదే మద్దతుతో భవిష్యత్తులో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా మరింత మందికి సాయం చేసి.. వారి జీవితాల్లో ప్రభావం చూపుతాము’’ అని తెలిపారు. అంతేకాక రక్తం దానం చేసిన 40 మంది దాతలకు టీపీఏడీ కృతజ్ఞతలు తెలియజేసింది. -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో జనవరి 24న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారు స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. గతేడాది జూలై 11, అక్టోబర్ 11లలో కోవిడ్ నిబంధనల్లోనూ ప్రతిసారీ కనీసం 100 మందికిపైగా రక్తదానం చేసి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఈ కార్యక్రమానికి యువతతోపాటు కొత్తగా మరో 25 మంది నుంచి అత్యద్భుత స్పందన వచ్చింది. అత్యధిక సంఖ్యలో రక్తదానం కోసం నమోదు చేసుకోగా 125 మంది హాజరై రక్తదానం చేశారు. రక్తదానం చేయలనుకున్నన ఇతరదాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చని నిర్వాహకులు మేరువ కాశయ్య విజ్ఞప్తి చేశారు. తదుపరి రక్తదాన కార్యక్రమాన్ని మే డే సందర్భంగా నిర్వహించాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ 19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. -
రక్తం పంచిన అభిమానం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో చోటు దక్కించుకుంది. తొలుత దీన్ని పార్టీ కార్యక్రమంగా భావించారు. కానీ, కేవలం 8 గంటల్లోనే ప్రజలు వెల్లువలా వచ్చి రక్తదానం చేయటంతో ఇది ప్రజా కార్యక్రమంగా మారిపోయింది. ఒకే రోజు ఒకే సమయంలో 175 నియోజకవర్గాల్లో ముమ్మరంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 278 కేంద్రాల్లో ఇది జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ, రోటరీ క్లబ్, రెడ్క్రాస్, లయన్స్ క్లబ్ ఇతర స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. రాత్రి 7గంటల సమయానికి 34,723 యూనిట్లతో 12,153 లీటర్ల రక్తాన్ని సేకరించారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో రక్తదానం చేస్తున్న యువకులు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ.. ఈ రక్తదాన సేకరణ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇంత పెద్దఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహించటం ఇదే తొలిసారి అని అన్నారు. లండన్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం : సజ్జల పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇది అత్యధికమన్నారు. గతంలో 10,500 యూనిట్ల సేకరణే రికార్డు అని.. కానీ ఇక్కడ కేవలం 8, 9 గంటల్లో దానికి మూడున్నర రెట్లు అధికంగా రక్తదానం చేశారన్నారు. కోవిడ్ వల్ల రక్తం దొరక్క చాలా ఆస్పత్రుల్లో ఆపరేషన్లకు ఆటంకం ఏర్పడిందన్నారు. తమ అధినేత పుట్టిన రోజున ఆరోగ్య రంగానికి బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సజ్జల అభినందనలు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స, వెలంపల్లి, ఎమ్మెల్యే ఉషాచరణ్, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నార్త్ అమెరికా ప్రతినిధి రత్నాకర్, డాక్టర్ పి. ఈశ్వర్, డాక్టర్ డి. భండారి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్ రికార్డు బ్రేక్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 175 నియోజకవర్గాలో పార్టీ శ్రేణులు చేపట్టిన రక్తదానం 18 వేల యూనిట్లను దాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టింది. గతంలో రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్ను తుడిచిపెట్టింది. ప్రస్తుత ఈ రికార్డ్ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. ( సీఎం జగన్ బర్త్డే: 20వేల మందితో భారీ ర్యాలీ ) కాగా, సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా సాక్షి టీవీలో ఆవిష్కరించిన ప్రత్యేక పాట ‘ఒక నిజం జన్మించిన రోజు.. ఒక తేజం ఉదయించిన రోజు.. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పాట వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పాలన, సాధించిన ఘనతను కీర్తిస్తూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో ల్యాబ్ల్లో బ్లడ్ కొరత కనిపించిందని, అందుకే రక్తదానం పెద్దఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చామని తెలిపారు.4వేల యూనిట్లకు పడిపోయిన దశలో 34వేల యూనిట్లకు పైగా అందించాం. సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ముందు ఉంటుందని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పార్టీ శ్రేణులు రక్తదానం చేశారని పేర్కొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్పై అభిమానంతో ప్రజలు కూడా రక్తదానం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రి జగన్కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ) తాడేపల్లి వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వేకటేశ్వర్లు, పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జననేత పుట్టిన రోజును స్వచ్చందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకున్న నాయకుడు ఇప్పుడు వారికి ధీమా ఇస్తూ పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ పుట్టిన రోజు ప్రతి ఇంట్లో జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు కనుకే ఈ రోజు ఈ సుపరిపాలనలో భాగంగా ఏడాదిన్నరలోనే అనేక మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏ సమస్య లేకుండా 60 వేల కోట్ల నిధులు ప్రజల అకౌంట్కి చేరాయి. పారదర్శకత, అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు’ అని తెలిపారు. (చదవండి: ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) ‘కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడితే మన రాష్ట్రం త్వరగా కొలుకుంది. ఇది చూసి అధికారులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేపట్టిన ఘనత వైఎస్ జగన్ది. ఈ రోజు ఒక యువ నాయకుడు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో పవర్ కేంద్రీకృతం అయితే ఈ నాయకుడు వికేంద్రీకరణ చేసి ప్రజలకు పవర్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయి.. అందుకే మేము ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టాము. ప్రజలకు సేవ చేయండి అని మా నాయకుడు ఇచ్చిన పిలుపే ఈ సేవా కార్యక్రమాలకు నాంది. ఆయన వందేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ.. ఆరోగ్యాంగా ఉండాలి’ అని కోరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సింగపూర్ తెలుగు సమాజం’ రక్తదాన శిబిరం
సింగపూర్: సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం, ఈ ఏడాదిలోనే రెండో సారి అక్టోబర్ 11 న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మొత్తం 120 మంది నమోదు చేసుకోగా 100 మంది హాజరయ్యారయి రక్తదానం చేశారు. రక్తదానం చేయాలనుకుంటున్న ఇతరదాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చని నిర్వాహకులు సోమ రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ -19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: విద్యార్థులకు ‘గాటా’ చేయూత.. -
వైఎస్సార్ 11వ వర్థంతి: ఆక్లాండ్లో రక్తదాన శిబిరం
న్యూజిలాండ్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం నివాళులు అర్పించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆనంద్ ఎద్దుల నాయకత్వంలో ఆక్లాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుష్మిత చిన్నమలరెడ్డి, సమంత్ దాగెపూడి, శివ గండ, మనోజ్ అల్లం, విజయ్ ఆల్ల, గీతా ఇందూరి, ప్రణవ్ అన్నమరాజు, శ్రీనివాస్ గోట్ల, వినయ్ చంద్రపతి, శ్రద్ధా సాయిలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఏపీ ఉమెన్స్ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు అభినందించారు. -
రియల్ హీరోస్..
సేవచేయాలనే సంకల్పం ఉన్నవారికి హద్దులు అంటూ ఏవీ ఉండవు.ఎక్కడినుంచైనా ఎక్కడికైనా వారు ఆపన్న హస్తాన్ని అందిస్తారు. సమాజసేవ కోసం మేము సైతం అనే వారు ఎందరో ఉన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న ఎందరో.. మాకెందుకులే అనే భావనను వీడి కరోనా బారిన పడిన వారి కోసం తమ రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇందులో మొదటి వరుసలో నిలుస్తున్నారు పోలీసులు. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా పోలీసులు ప్రముఖ పాత్ర పోషించారు. లాక్డౌన్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవుళ్లు రెడ్జోన్ ప్రాంతాల్లో పని చేశారు. ఈ క్రమంలో 300 మందికిపైకి కోవిడ్ బారిన పడ్డారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారి నుంచి కోలుకున్న అనంతరం ఎస్పీ సత్యయేసుబాబు స్ఫూర్తిదాయక మాటలతో ప్రభావితమైన 17 మంది సిబ్బంది ప్లాస్మా దానం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా తమ కర్తవ్యంగా భావించిన పోలీసు సిబ్బంది సేవలపై ప్రత్యేక కథనం. అనంతపురం క్రైం: ప్లాస్మా అనేది ఇది మానవ రక్తంలోని ఒక అత్యంత అవసరమైన పదార్థం. రక్తంలో దాదాపు 55 శాతం దాకా ఇది ఉంటుంది. నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి ఉంటుంది. 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక కండెక్టర్ లాంటిది. శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ప్లాస్మాకుంది. శరీరంలోని వివిధ ఇతర క్లిష్టమైన విధులను ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది. ప్లాస్మా థెరఫీతో మెరుగైన ఫలితాలు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడం ఆలస్యమవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరఫీ వైపు వైద్య నిపుణులు దృష్టి సారించారు. కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే ఇందుకు కారణం. అపోహల కారణంగా రక్తదానం చేసేందుకు ముందుకు రాని ఈ పరిస్థితుల్లో రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మా దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఎస్పీ సత్యయేసుబాబు సూచనలతో పోలీస్ సిబ్బంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వీరంతా కరోనా బారిన పడి కోలుకున్నవారే కావడం గమనార్హం. రక్తదానం చేసిన వారిలో ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు, 11 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారు. ఈ అవకాశం అందరికీ రాదు ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. కానీ ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో విధుల్లోకి చేరారు. అంతేకాకుండా కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ప్లాస్మా కోసం తమ రక్తాన్ని దానం చేశారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేసిన వారందరికీ నా తరపున, డీజీపీ సార్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పటి వరకూ కోవిడ్ బారి నుంచి బయటపడిన వారందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం అందరికీ రాదు. అటువంటి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్లాస్మా ఇవ్వడం ద్వారా ఎటువంటి నష్టమూ ఉండదు. – బి.సత్యయేసుబాబు, ఎస్పీ -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం
సింగపూర్ : రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్థానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్లో సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారు. కోవిడ్-19 సురక్షిత చర్యల్లో భాగంగా ముందుగా నమోదు చేసుకొన్న 100 మందికి మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం కల్పించామని నిర్వాహకులు సోమ రవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, రెడ్ క్రాస్- బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
న్యూజిలాండ్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వెల్లింగ్టన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను న్యూజిలాండ్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చాలా మందికి ఉపయోగపడుతుందని దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో.. వైఎస్సార్సీపీ ఏపీఎన్ఆర్టీఎస్ కో-ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, ప్రతాప్ రెడ్డి, అంబటి మహేష్, కైపు మహేష్, మిట్టపల్లి అఖిల్, బుజ్జి బాబు నెల్లోరి.. ఇంకా అనేక మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్’
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కాలంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్యే వీజీ గౌడ్, కలెక్టర్ సి. నారాయణరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రక్తాదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. టీఎన్జీఓలు కూడా ప్రభుత్వంలో భాగస్వామలేనని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్యతికి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో అతి పెద్ద సంక్షేమ ఫలాలు తెలంగాణలో అందుతూ దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. గత ఆరేళ్ల కేసీఆర్ పాలన జనరంజకమన్నారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా భావిస్తున్నారన్నారు. డబుల్ బెడరూం పథకం దేశంలోనే అద్భుత పథకమన్నారు. 24 గంటల ఉచిత కరెంటును సీంఎ రైతులకు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ధీమాగా రూ. 5 లక్షల భీమా అందిస్తున్నారన్నారు. కేవలం ఆరేళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇకపై కూడా బంగారు తెలంగాణ ఆవిష్కారం కావాలన్నారు. చివరగా తెలంగాణ ప్రజలకు మంత్రి రాష్ట్ర ఆవిర్భవ శుభాకాంక్షలు తెలిపారు. -
‘సేవ’కు సత్కారం
మున్నెన్నడూ ఎరుగని రోగమది. కనీ విని ఎరుగని రీతిలో కష్టాలను, నష్టాలను చవిచూపిస్తున్న కరవు కాలమిది. ఒకవైపు బతుకు బండి సాగేదెలా అనే బెంగ.. మరోవైపు నలువైపులా చీకట్లు ముసురుకుంటున్న వేళ కొన్ని మానవత్వపు చిరుదీపాలు వెలుగుతున్నాయి. మందేలేని వ్యాధి అంటుతుందేమోననే భయంతో చేతనైనంత సాయం చేçస్తూ వెలుగు పంచుతున్నారు. అలాంటి చిరు దీపాలకు చిరు సత్కారం అందనుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి సేవ చేసిన పలువురికి ప్రముఖ సోషల్ ఆక్టివిస్ట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కోవిడ్–19 ఫైటర్స్ అవార్డ్ ఇవ్వనున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూశాం. మరెన్నో ప్రాణాంతక వ్యాధులను దాటుకుని వచ్చాం. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక వ్యాధి ప్రపంచాన్నే ఇంటికి పరిమితం చేయడమే కాకుండా మనిషికి మనిషికి దూరాన్ని సైతం పెంచింది. కరోనా వ్యాధి సోకి మృత్యువాత పడినవారు కొందరైతే, దాని అవస్థల నుంచి కోలుకుంటున్న వారు మరికొందరు. అయితే ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే... మరో వైపు పరోక్షంగా ఇది సృష్టిస్తున్న విధ్వంసం అసాధారణం. లాక్డౌన్.. ఆకలి అప్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో పని లేక, అవసరానికి డబ్బులు అందక, కనీసం తినడానికి తిండి దొరక్క పస్తులుంటున్న ఆకలి కడుపులెన్నో. ఈ తరుణంలో ఎన్నో ఆపన్న హస్తాలు అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఉన్నంతలో సాటి వారికి చేయూత అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ కష్టకాలంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్. ముఖ్యంగా అన్నార్తులకు ఆహారం, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఈ సేవలో కరోనా సోకే ప్రభావం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక విధంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సేవ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయం చేయాలని ఉన్నా లాక్డౌన్ కారణంగా బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో వారందరూ సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు డబ్బులు పంపించి ఉదారతను చాటుకుంటున్నారు. మరికొందరు స్వయంగా ముందుకొచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సేవ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన 100 మందిని ఈ కోవిడ్–19 ఫైటర్ అవార్డ్స్తో పాటు నగదు బహుమతితో, ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నామని సంపత్ కుమార్ తెలిపారు. వీరిలో విభిన్న రకాలుగా సేవ చేసిన వారిని ఎంచుకున్నామన్నారు. సంపత్ కేరాఫ్ చారిటీ... సమాజంలో ఎవరికి ఏ అవసరమున్నా నేనున్నాను అని ముందుంటాడు సంపత్ కుమార్. అంతేకాకుండా ఇప్పటి వరకు 211 సార్లు రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమున్నవారికి అండగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. లాక్డౌన్లో కూడా వ్యక్తిగతంగా దాదాపు 2000 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందించాడు. దానితో పాటు సోషల్ మీడియాలో ఎఫ్3 ఛాలెంజ్ని (ఫిడ్ ఫైవ్ ఫ్యామిలీస్) విసిరి, దాని ద్వారా పోగైన లక్ష రూపాయలతో సిటీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించాడు. అంతేకాకుండా ఈ క్లిష్టపరిస్థితుల్లో తలసేమియాతో బాధ పడేవారికి రక్త నిల్వల కొరత ఉండకూడదని, తన సోసల్ మీడియా ఫాలోవర్స్ ద్వారా 700 యూనిట్ల రక్తాన్ని ముందుగానే సమకూర్చాడు. దీని కోసం ప్రత్యేకంగా బ్లడ్ అంబులెన్స్ని ఏర్పాటు చేశాడు. అలాగే నగరంలో ఎవరికి రక్తం అవసరమున్నా తనకున్న ఫాలోవర్స్ ద్వారా వెంటనే అందిస్తూ అందరికి ఆదర్శంగా, ఆపద్భాందవుడిగా నిలుస్తున్నాడు. -
‘రక్తదానంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి’
సాక్షి, హైదరాబాద్ : యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారంరోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో కవిత రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు సహాయ సంస్థలు, ఛారిటీ సంస్థల ద్వారా నిర్వహించబడే రక్తదాన కార్యక్రమాల్లో చాలామంది పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి సమూహాల వల్ల వైరస్ వ్యాప్తి పెరగొచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో లాక్డౌన్ ముగిసే వరకు వీటిపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. (విద్యార్థులకు సీఎం జగన్ గుడ్న్యూస్) అయితే నిత్యం రక్తమార్పిడి అవసరమైన తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే రోగుల అవసరాలు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటును కల్పించింది. రోగుల రక్త మార్పిడి, చికిత్స కొరకు సంబంధిత ఆస్పత్రికి వెళ్లడానికి ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను పరిశీలించి అధికారులు తగిన చర్యలను చేపట్టనున్నారు. ప్రయాణం అనుమతి కోసం రక్త మార్పిడి అవసరం ఉందంటూ తెలిపే ఆధారాలు పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని పోలీసు అధికారులు పరిశీలించి రెగ్యులర్గా ఆసుపత్రులను సందర్శించేందుకు వీలుగా వారికి పాసులను జారీ చేస్తారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతమేర కట్టడి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
రక్తదానం చేసేవారికి అన్ని సౌకర్యాలు : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్ : రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా రక్తదానం సేకరణ కార్యక్రమం జరిగింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసులు సోమవారం 117 యూనిట్ల రక్తదానం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ, తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని సజ్జనార్ తెలిపారు. ఒక్కరుచేసిన రక్తదానం ముగ్గురికి ఉపయోగ పడుతుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్స్ 9490617440, 9490617431కు సంప్రదిస్తే పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు. 13 అంబులెన్స్లను అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు 250 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందించామన్నారు. 5వందల పైచిలుకు డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. -
80 సార్లు రక్తదానం.. 127 సార్లు ప్లేట్లెట్స్
ఇప్పుడు చాలా మంది చాలా రకాల రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సాటిమనిషికి సేవచేయడంలో రికార్డు సృష్టించేవారు అరుదే. అలాంటి అరుదైన వ్యక్తి నగరవాసి సంపత్ కుమార్.వందలసార్లు రక్తదానం చేయడం ద్వారా రికార్డు సృష్టించిన ఆయన అంతకు మించిన స్ఫూర్తినింపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఒక మనిషికి అత్యంత అవసరమై, ఒక మనిషి కృత్రిమంగా తయారు చేసుకోలేని జీవ పదార్థం ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రతీ సెకనుకు ఇద్దరు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ సేవకు సమాజంలో మార్పునకునిర్విరామ రక్తదాతగా మారి మరెంతో మందిని రక్తదాతలుగా మారుస్తున్నారు నగరవాసి సంపత్ కుమార్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చలింపజేసినమృత్యువు.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన వ్యాపార కుటుంబంలో పుట్టి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా కొద్ది రోజులు చేసి ఇప్పుడు సిటీలో స్వంత బ్యూటీ పార్లర్ నిర్విహిస్తున్నా. ఇరవైఏళ్ల క్రితం గాంధీ హస్పిటల్లో సమయానికి రక్తం అందక ఓ రోగి చనిపోవడం చూసి చలించిపోయాను. ఆ మరునాడే రక్తదానం చేశా. కనీసం 18 నుండి 65 సంవత్సరాల వయస్సు కలిగి, ఆరోగ్యంగా ఉన్నప్రతీ వ్యక్తి 3 నెలలకు ఒకనారి రక్తం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చు.. ఈ విధంగా సంవత్సరానికి 24 సార్లు ప్లేట్లెట్స్, 4 సార్లు రక్తం దానం చేయొచ్చునని తెలిశాక ఇప్పటికి 80 సార్లు రక్తదానం, 127 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశా. 188 సార్లు రక్తదానం చేయొచ్చు దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు ప్రతీ సంవత్సరం 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 40 లక్షలు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. రక్తదానం పై అపోహలు తొలగించడానికి సదస్సులు, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నా రక్తదానం వలన గుండెపోటు, కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయనే విషయం సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దాతల రక్తాన్ని ప్రాజోన్ ప్లాస్మా, ర్యాండమ్ ప్లేట్లెట్స్, పాకెట్ సెల్స్ అనే 3 విభాగాలుగా విభజిస్తారు. ♦ ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదు. ఒక వ్యక్తి 47 సంవత్సరాల వ్యవధిలో (18–65 సంవత్సరాల మధ్య) 188 సార్లు రక్తదానం చేసి 564ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. తలసేమియా, కేన్సర్ కీమోథెరపీ, గుండె సర్జరీ, డెలివరీ సమయాల్లో... ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో రక్తం అవసరమవుతుంటుంది. గత 2008 నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ప్రయాణం చేస్తూ అక్కడే 148 సార్లు రక్తదానం చేశా. రక్తదానం, నేత్రదానంకృషి చేస్తూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసే బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవి తనను ‘‘నీ సేవలు వెల కట్టలేనివని’’ ప్రశంసించి తన కోసం ప్రత్యేకంగా బొకే పంనించడం ఎప్పటికీ మర్చిపోలేను. రక్తదాతగా పలు రికార్డులు ♦ విశ్వగురు ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఫీచర్ అబ్దుల్ కలాం ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఇండియన్ ప్రైడ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ♦ రక్త దానానికి సంబంధించి దేశంలోనే మొదటి డాక్టరేట్–తమిళ యూనివర్సిటీ. -
ప్రాణదాతలుగా బైంసా యువకులు
సాక్షి, భైంసాటౌన్(ముథోల్): పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆపత్కాలంలో రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ‘బ్లడ్ డోనర్స్’ పేరటి వాట్సాప్ గ్రూపు ప్రారంభించారు. 300 మంది సభ్యులున్న ఈ గ్రూపులో రక్తం కావాలి అనే సందేశమిస్తే చాలు.. క్షణాల్లో స్పందిస్తూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపు సభ్యుల్లో ఎక్కువ మంది నాలుగు, ఐదుసార్లు రక్తదానం చేసినవారే ఉన్నారు. ఒక్కరితో మొదలై.. భైంసా పట్టణానికి చెందిన దొడ్లోల్ల సురేశ్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ముథోల్ నియోజకవర్గంలోని ఎన్నో గ్రామాల నుంచి గర్భిణులు, క్షతగాత్రులు, ఇతర రోగులు భైంసాలోని ఏరియాస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో గర్భిణులు, ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి రక్తం అవసరం ఉండడం, స్థానికంగా బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో, రక్తదాతల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి రక్తం తీసుకురావాల్సి వచ్చేది. ఒకానొక సమయంలో సకాలంలో రక్తం అందక చనిపోయినవారున్నారు. ఇదంతా సురేశ్ను కదిలించింది. ఒకసారి ఒక గర్భిణికి అత్యవసరంగా ‘0’ పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో, సురేశ్ తానే స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేశాడు. తను ఒక్కడు మాత్రమే కాకుండా తనలాంటి వారితో రక్తదానం కోసం అత్యవసర సమయాల్లో స్పందించేలా వాట్సాప్ గ్రూపు తయారు చేశాడు. ఆ గ్రూపునకు తనే అడ్మిన్గా ఉండి తనలాంటి రక్తదానం చేసేవారిని అందులో సభ్యులుగా చేర్చాడు. ఫలితంగా ప్రస్తుతం దాదాపు 300ల మంది సభ్యులతో ఆ గ్రూపు కొనసాగుతోంది. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమున్నా.. క్షణాల్లో గ్రూపు సభ్యులు స్పందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. రక్తకణాలు ఇచ్చా.. నేను భైంసా ఏరియాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఒక వ్యక్తి తీవ్రరక్త స్రావంతో ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో, నేను వెంటనే రక్తదానం చేసేందుకు ముందుకొచ్చాను. స్థానికంగా బ్లడ్ బ్యాంక్ లేక చాలామంది ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినా అందులో నిల్వలు ఉండడం లేదు. ఒకసారి నా స్నేహితుడికి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు రక్తకణాలు దానంగా ఇచ్చాను. అది మరిచిపోలేని సందర్భం. – సురేశ్, బ్లడ్డోనర్స్ గ్రూప్ అడ్మిన్, భైంసా ఎంతో ఆనందంగా ఉంటుంది నాది ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. నేను ఇప్పటి వరకు మూడుసార్లు రక్తదానం చేశాను. ఒక సందర్భంలో గర్భిణికి, మరో సందర్భంలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి.. ఇంకా ఇతర సందర్భంలో రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి సహాయ పడడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. – రాజు, భైంసా గర్భిణికి రక్తం తక్కువగా ఉండటంతో.. నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. నేను బ్లడ్ డోనర్స్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాను. ఒకసారి భైంసా ఏరియాస్పత్రికి రాత్రి సమయంలో ఓ గర్భిణిని తీసుకొచ్చారు. ఆపరేషన్ చేయాలంటే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని సూచించారు. దీంతో ఎవరో బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశాను. – – సూర్యకిరణ్, భైంసా మూడుసార్లు రక్తదానం చేశా నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. నేను ఇప్పటివరకు మూడుసార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం ద్వారా ఆపద సమయంలో సహాయపడడం ఎంతో ఆనందంగా ఉంటుంది. బ్లడ్ డోనర్స్ గ్రూపులో రక్తం అవసరం అనగానే వెంటనే ఫోన్ చేసి స్పందిస్తాను. రక్తదానం చేయాలని నాతోటి మిత్రులకు కూడా చెబుతాను. – నరేశ్ -
సేవా మల్లె ‘తులసి’
మీరు ప్రొద్దుటూరులో ఉన్నారనుకోండి... తిరుపతిలో ఎవరికైనా రక్తం అవసరమైతే ఏం చేస్తారు? సేవా గుణం ఉంటే వెళ్లి ఇస్తారు. అదే యువతి అయితే... తోడు లేకుండా ఇంట్లో వాళ్లు ధైర్యంగా పంపలేరు. పంపాలనుకున్నా ఆ యువతి అదే ధైర్యంతో వెళ్లాలి. అక్కడ ఏ టైం అవుతుందో, మళ్లీ తిరిగి రావడమెప్పుడో అనే ఆలోచన. ఎందుకు వచ్చిన సేవాగుణంలే అనుకుంటారు. కానీ తులసి అలా అనుకోలేదు. అవతలి వ్యక్తి ప్రాణాపాయమే కనిపించింది. తక్షణమే సొంత ఖర్చులతో వెళ్లి రక్తదానం చేస్తుంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. కడప ఎడ్యుకేషన్: సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. ఇందులో ఆశయం దిశగా సాగితే విజ్ఞానం, వినోదం ఉంటాయి. ఏమాత్రం గురి తప్పినా జీవితాలు తారుమారవుతాయి. నేటి యువత మార్కెట్లో ఏ ట్రెండ్ వచ్చినా అందిపుచ్చుకుంటోంది. వాటిని అనుసరిస్తోంది. పేస్బుక్లో లైక్లు, కామెంట్లు, అప్డేట్లు ఇలా ఊహల గగనంలో విహరిస్తోంది. అదుపు తప్పితే మాత్రం కనిపించని విషవలయాలు ఉంటాయని నిపుణులు, మేధావులు హెచ్చరిçస్తున్నారు. త్వరలో పది, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి కేవలం రెండు నెలల మాత్రమే గడువు ఉంది. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉంటే భవిష్యత్తు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచైనా పరీక్షలపై దృష్టి సారిస్తే మంచి గ్రేడ్లను సాధించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సేవ చేయడంలో కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన తులసి ముందుంటారు. రైల్వేలో చిరుద్యోగిగా పని చేస్తున్న రామకృష్ణారెడ్డి సతీమణి తులసి. తులసి భర్త 15 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా భర్త దారిలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటోంది. కాశినాయన మండలం ఉప్పలూరుకు చెందిన రామ తులసికి 2014లో కలసపాడు మండలంలోని తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డితో వివాహామైంది. అప్పటికే వివేకానంద ఫౌండేషన్ను నిర్వహిస్తున్న అతను భార్యలోని సేవాగుణం చూసి సంస్థ కోశాధికారి బాధ్యతలను అప్పగించారు. భర్త సహకారంతో సేవలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. అనాథలకు అన్నదానం చేస్తున్న రామతులసి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేయడంతో పాటు వారికి మార్గదర్శిగా నిలుస్తూ మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు సంస్థ ద్వారా 3 వేల మందికి విద్యాసామగ్రి అందజేశారు. కళాశాలల్లోని బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, వివేకానంద సూక్తులతో స్ఫూర్తిని నింపుతోంది.ఇటీవలే ఒక యువకుడు రక్తం గడ్డకట్టే వ్యాధితో తిరుపతి సిమ్స్లో చేరాడు. అతనికి అరుదైన రక్త గ్రూపు అవసరం కావడంతో పత్రికల్లో సాయం చేయాలని కోరారు. దీన్ని ప్రొద్దుటూరులో చూసిన తులసి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు చిన్నపిల్లలు తప్ప వెంట రావడానికి ఎవరూ లేరు. అయినా ధైర్యంతో ఆమె పిల్లలతో వెళ్లి రక్త దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి పలువురు అభినందించారు.ప్రస్తుతం కాశినాయన మండలం ఓబులాపురం వద్ద వృద్ధుల సేవాశ్రమాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నారు. భర్త ఎక్కువ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా తులసి నిర్మాణ పనుల బాధ్యత తీసుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే రూ.15 లక్షలతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. సేవలోనే సంతృప్తి దూరం, ఒక్కరే వెళ్లాలన్న భయం కంటే అవతలి వ్యక్తి అవసరమే నన్ను కదిలించింది. అందుకే చిన్న పిల్లలున్నా వారిని వెంట తీసుకుని వెళ్లి రక్తదానం చేశా. అభాగ్యులు, పేదవారికి సేవ చేయడంలో సంతృప్తి ఉంటుంది. జీవితాంతం సేవ చేయాలనే ఉద్దేశంతోనే సేవాశ్రమం నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం.– రామ తులసి, వివేకానంద ఫౌండేషన్ -
రక్తదాతల కోసం ఎదురు చూపులు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : నెగటివ్ గ్రూపు కలిగిన రక్త దాత దొరకాలంటే అనేక అగచాట్లు పడాల్సి వస్తోంది. అలాంటిది ఒకే వ్యక్తికి 30 యూనిట్ల నెగిటివ్ గ్రూపు రక్తం కావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. సహృదయంతో ఆ గ్రూపు కలిగిన దాతలు ముందుకు వస్తే తప్ప ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించలేం. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన హుస్సేన్బాషా అనే 20 ఏళ్ల యువకుడు బ్లడ్ సర్కులేషన్ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు చికిత్స సమయంలో నెల రోజుల పాటు రోజుకు ఒక బ్యాగ్ చొప్పున 30 బ్యాగుల రక్తం ఎక్కించాలని తెలిపారు. అతడిది ఏ నెగిటివ్ రక్తం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందసాగారు. బ్లడ్ బ్యాంకుల నుంచి తెచ్చిన రక్తాన్ని స్విమ్స్ ఆస్పత్రి లో అనుమతించరు. నేరుగా డోనర్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్కు వచ్చి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన దాతల కోసం హుస్సేన్బాషా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. దాతలు 9390819132 అనే నంబర్కు ఫోన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మధ్య తర గతి కుటుంబానికి చెందిన హుస్సేన్బాషా కు టుంబ సభ్యులకు చిన్న పాటి ఖర్చులు భరాయించే స్థోమత కూడా లేదు. ఆస్పత్రిలో రో జు వారి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాతలు స్పందించాలని వారు కోరుతున్నారు. -
రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దాతల వద్దకే వెళ్లి రక్తం సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రతీ జిల్లా లో ఇటువంటి మొబైల్ వాహనాలను అం దుబాటులో ఉంచుతారు. ప్రయోగాత్మకంగా 18 రక్తసేకరణ వాహనాలను సిద్ధం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఆయా జిల్లాలకు పంపుతారు. వీటి ద్వారా రక్త సేకరణ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొబైల్ వాహనాల్లో సౌకర్యాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు పరిశీలించారు. బ్లడ్ బ్యాంకుల్లో మాదిరిగానే ఈ వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఏసీ, రెండు పడకలు, బీపీ, బరువు చెక్ చేసే యంత్రం తదితర సదుపాయాలుంటాయి. ఒకేసారి ఇద్దరి నుంచి రక్తం సేకరించడానికి వీలుంది. బ్లడ్ బ్యాంక్లకు చేరే వరకూ రక్తాన్ని భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ను వ్యాన్లో అమర్చారు. ఒక్కో వాహనం ధర రూ. 35 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని త్వరలో ప్రారంభించి రక్త దాతలకు అందుబాటులోకి తెస్తామని ఎన్హెచ్ఎం అధికారులు తెలిపారు. శిబిరాల ఏర్పాటు కష్టం అవడంతో.. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు, శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించాలన్నా వైద్యపరంగా నిబంధనల ప్రకారం సౌకర్యాల ను కల్పించడం కష్టమవుతోంది. స్కూళ్లు, ఇతరత్రా కార్యాలయాల వద్ద రక్తాన్ని సేకరించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు ఆహ్వానించగానే వెళ్లేలా ఈ వాహనాలను సిద్ధం చేశారు. రక్తదాతలు పిలిస్తే వెంటనే వెళ్లాలనేది వీరి ఉద్దేశం. ఊరూరా తిరిగి రక్తదానం ప్రాముఖ్యతను చెప్పి సేకరించాలనేది సర్కారు ఆలోచన. ఈ వాహనాల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉంటారని ఎన్హెచ్ఎం వర్గాలు తెలిపాయి. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి మొబైల్ రక్త సేకరణ వాహనాలను మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
‘పోలీసుల సేవలు ప్రశంసనీయం’
సాక్షి, విజయవాడ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్లు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. నిత్యం కష్టపడి పనిచేస్తూ.. సమాజాన్నికాపాడటంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్రంలో నక్సల్స్ దాడుల్లో అనేక మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమ కోసం తొలిసారిగా వారాంతరపు సెలవును మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. సుమారు 600 మంది పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న పోలీసు శాఖ సంకల్పం అభినందనీయమని కురసాల కన్నబాబు అన్నారు. సేవలు ప్రశంసనీయం:మంత్రి వెల్లంపల్లి కుటుంబాలను సైతం వదిలి నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్ శాఖ సేవలు ప్రశంసనీయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని సీపీ ద్వారకా తిరుమలరావును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభినందించారు. అపోహలను పొగొట్టడమే లక్ష్యం: సీపీ అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీస్ శాఖ పట్ల ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు. -
అమెరికాలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
-
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరం
ఫిలడెల్పియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్కి ఘన నివాళి అర్పించారు. 150 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెళ్కూర్,అంజి రెడ్డి సాగంరెడ్డి, హరి కురుకుండ, ద్వారక వారణాసి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, శ్రీనివాస్ ఈమని, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మి నారాయణ రెడ్డి, లక్ష్మీనరసింహ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగరాజా రెడ్డి , జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, రవి మరక, అజయ్ యారాట, నరసింహ రెడ్డి, వెంకట్ సుంకిరెడ్డితో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి..
సాక్షి, విజయవాడ : రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తి నింపుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. పెద్దమొత్తంలో విద్యార్థులు తరలివచ్చి రక్త దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరుతుందని ప్రశంసించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. రక్తదానంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. సమానత్వం సాధించేలా యువత కృషి చేయాలని సూచించారు. -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
వరంగల్ రూరల్: అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, మరొకరికి ప్రాణదానమని కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. సోమవారం రూరల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ వరంగల్ రెడ్ క్రాస్లో చికిత్స పొందుతున్న తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత తీవ్రంగా ఉందని, జిల్లాలోని ఉద్యోగులతో ఒక రోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తే బాగుంటుందని రెడ్ క్రాస్ వారి అభ్యర్థన మేరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం ఉదయం 8గంటల నుంచే ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్య లో హాజరై రక్తదానం ఇవ్వడం ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్రెడ్డి, డీఆర్డీఓ సంపత్రావు, రెడ్క్రాస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్చందర్రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సీహెచ్.మహేందర్ జీ, పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, జిల్లా పంచాయతీ అ«ధికారి నారాయణరావు, జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి శ్రీనివాసరావు, టీఎన్జీఓల సంఘం రూరల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత స్వయంగా రక్తదానం చేసి ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఉపాధి హమీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. డయేరియాపై విస్తృత ప్రచారం చేయాలి డయేరియా పట్ల విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ ముండ్రాతి హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని చాంబర్లో ఐసీడీఎఫ్ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత శాఖలు గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. డయేరియా తగలకుండా నియంత్రించడానికి జూన్ 10 నుంచి 22వ తేదీ వరకు విస్తృత ప్రచారం చేయాలని, దీని కోసం కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని, క్లోరినేషన్ చేసిన తాగునీటిను ప్రజలకు అందించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ హరిత సూచించారు.అనంతరం రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమ అమలుతీరును అధికారులతో కలెక్టర్ హరిత సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ శ్యామ నీరజ, డాక్టర్ మహేంద్రన్, డీఈఈఎంఓ డాక్టర్ స్వరూపరాణి, అహల్య తదితరులు పాల్గొన్నారు. -
రక్త కన్నీరు!
కంటి చూపు మందగిస్తే అద్దాలు వాడొచ్చు. కాళ్లు, చేతులు పనిచేయకపోతే కృత్రిమ పరికరాలు పెట్టుకోవచ్చు. కానీ రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ ద్రవాన్ని వాడే పరిస్థితి లేదు. కేవలం ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకన్నా రక్తదానం మిన్న అనే నానుడి ప్రాచుర్యం పొందుతోంది. కానీ జిల్లాలో ప్రస్తుతం రక్తనిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు అర్బన్: జిల్లాలో ఒక నెలకు 800 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. కానీ ఇందులో సగం యూనిట్లు కూడా ప్రభు త్వ వైద్యశాలల్లో, ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అందుబాటులో లేవు. కారణం.. వేసవి సెలవులు కావడం. నిజం.. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఊర్ల కు వెళ్లిపోయారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిండుకుంది. ఫలితంగా గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సకాలంలో రక్తం అందే పరిస్థితి కనిపించడం లేదు. నెగటివ్ గ్రూపులకు ఇబ్బందే చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందకు పైగా యూనిట్ల రక్తం ఎప్పుడూ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు 40 యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. ఇందులోనూ స్క్రీనింగ్ చేసిన పాజిటివ్ గ్రూపులు 30 వరకు ఉంటే నెగటివ్ గ్రూపులన్నీ కలిపి ఎనిమిదే ఉన్నాయి. బీ–నెగటివ్ అయితే ఒక్కటే యూనిట్ ఉంది. ఈ రక్త గ్రూపు ఉన్న గర్భిణి ఎవరైనా కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలపై వచ్చే పరిస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో కనీసం మూడు యూనిట్ల రక్తం కావాలి. ఇక్కడంతలేదు. చిత్తూరు రక్తనిధిలోనే రక్తం లేకపోవడంతో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుత్తూరు, పీలేరు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు చిత్తూరు నుంచి సరఫరా అయ్యే రక్తనిల్వలు ఆగిపోయాయి. రక్తదానం ఎవరు చేయవచ్చంటే.. వయసు 18–60 ఏళ్ల లోపు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని చాలామందిలో అపోహ ఉంది. ఇది తప్పు. 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేశాక కొన్ని రోజుల పాటు పనులన్నీ మానుకోవాలనే అపోహ వద్దు. రక్తం ఇచ్చాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పళ్ల రసం, పాలు వంటి స్వల్ప ఆహారం తీసుకున్నాక మళ్లీ పనులు చేసుకోవచ్చు. డబ్బులిచ్చినా దొరకడం లేదు జిల్లాలోని 15 ప్రాంతాల్లో రక్తనిధి కేంద్రాలున్నాయి. 250మి.లీ రక్తాన్ని ఓ యూనిట్గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనీమియా, రోడ్డు ప్రమాద బాధితులు వచ్చినప్పుడు కనీసం మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండవు. వీళ్లు ఓ వ్యక్తి ద్వారా రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేయించి, రూ.800 చెల్లించి ఒక్క యూనిట్ రక్తాన్ని వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం డబ్బులు చెల్లించినా కూడా జిల్లాలో ఎక్కడా రక్తం దొరకడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రక్తం తెప్పించుకుంటున్నారు. -
ఇచ్చిపుచ్చుకుంటే.. ఎంతో బాగుంటుంది..
విజయనగరం, పార్వతీపురం: అన్నిదానాల్లో కెల్లా రక్తదానం మిన్న అన్నారు పెద్దలు. ప్రతి మనిషీ ఆరోగ్యాంగా ఉండాలంటే శరీరంలో సరిపడా రక్తం ఉండాలి. ఒక్కోసారి శరీరంలో రక్తం తగినంత మోతాదులో లేనప్పుడు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. రక్తాన్ని తయారు చేయలేము కాబట్టి రక్తాన్ని ఒకరినుంచి సేకరించి మరొకరికి ఎక్కించి ప్రమాదం నుంచి గట్టెక్కించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఒక వేళ రక్తదాతలున్నా ఆ రక్తాన్ని నేరుగా వేరొకరికి ఎక్కించలేము. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని రక్తనిధి కేంద్రంలో పరీక్షలు జరిపి అది ఏ గ్రూపునకు చెందినదో తెలుసుకుని వారికి అత్యవసర సమయాల్లో అందిస్తారు. ఇందులో భాగంగా ఏర్పడినవే రక్తనిధి కేంద్రాలు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 2007లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఈ ప్రాంత రోగులకు అవసరమైన రక్తాన్ని సేకరించి సరఫరా చేస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సల్లో రక్తం అవసరమైన వారికి, రక్తహీనతతో బాధపడేవారికి అవసరమైన రక్తాన్ని ఈ కేంద్రం ద్వారా అందిస్తూ రక్తనిధి సేవలను చాటుకుంటూ వస్తున్నారు. కాని ఇప్పుడు ఈ రక్తనిధి పరిస్థితి క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. రక్తం కావాలని అవసరమైన రక్తాన్ని తీసుకుపోయేవారు తప్ప రక్తాన్ని దానం చేసేవారు తక్కువగా ఉండడంతో కేంద్రంలో రక్త నిల్వలు రోజురోజుకీ కనిష్టానికి పడిపోతున్నాయి. రక్తం కావాల్సిన వారు డోనర్ ద్వారా రక్తదానం చేపట్టి వారికి కావాల్సిన రక్తం తీసుకెళ్తే రక్తం కొరత ఉండదు. కాని ఎక్కువ మంది రక్తం కావాలని అడిగి తీసుకెళ్తున్నారు తప్ప దానం చేయడం లేదు. ఒకప్పుడు మూడంకెల్లో నిల్వ ఉండే రక్తం బ్యాగులు ఇప్పుడు రెండంకెలకు (20 కంటే తక్కువ) పడిపోయాయి. దీంతో రోగులకు అవసరమైన గ్రూపులకు చెందిన రక్తం నిల్వలు అందుబాటులో ఉండడం లేదు. ఇచ్చిపుచ్చుకునే సూత్రాన్ని అనుసరించినన్నాళ్లు నిల్వలు బాగానే ఉన్నాయి. కాని ఇప్పుడు దాతలు ముందుకు రాకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయని రక్తనిధి కేంద్రం సిబ్బంది చెబుతున్నారు. శిబిరాలు నిర్వహిస్తున్నాం.. ప్రస్తుతం రక్తనిధి కేంద్రలో చాలా తక్కువగా రక్తనిల్వలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. వేసవికాలం కావడంతో డోనర్లు ముందుకు రావడం లేదు.– ఎం. మధుకర్, ల్యాబ్టెక్నీషియన్ దాతలను తీసుకురావాలి.. రక్తం కావాల్సిన వారు దాతలను తీసుకువస్తే మంచింది. రక్తదానం చేసి వారికి కావాల్సిన రక్తాన్ని తీసుకెళ్తే అందరికీ బాగుంటుంది. రక్తం నిల్వలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ స్వాతి,రక్తనిధి ఇన్చార్జ్, పార్వతీపురం -
శిశిరానికి సెలవిచ్చా...
‘‘నేను వెడుతున్నాను...’’ కాఫీ తాగేసి లేచాడు మనోజ్.‘‘సరే... మంచిది!’’ ముభావంగా చెప్పింది సంహిత.‘‘అయామ్ సారీ, నా వల్ల నీవు హర్ట్ అయినట్టయితే...’’ ఫార్మల్గా చెప్పాడు.అభావంగా చూసింది. అతను వెళ్ళిపోయాడు వాకిట్లో వేసిన ముగ్గుతో పాటుగా, ఆమె హృదయాన్ని తొక్కుకుంటూ. అప్పటివరకూ కంటి చివరలో నిలిచిన కన్నీటి కణం ఇక ఆగలేనట్టు జారిపడింది ఆమె చెక్కిలి పైకి...గుండెల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి వెల్లువై ఒక్కసారిగా ఎగసింది... అంతే... రెండు చేతుల్లో తల దాచుకొని వెక్కి వెక్కి రోదించసాగింది సంహిత. ‘అయిపోయింది... ఒక అధ్యాయం ముగిసింది... ఇక నాకోసం నేను బ్రతకాల్సిందే...’ తనకు తానే సమాధానం చెప్పుకుంది. స్టవ్ మీద టీ పెట్టి, సిమ్ చేసి, ముఖం కడుక్కోవటానికి ఉపక్రమించింది. ‘‘ఏయ్, నీకేమైనాపిచ్చా? అతనలా తెగేసిచెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోతే చేతకాని దానిలాగా ఎందుకు ఊరుకుంటావు? ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు నువ్వు పనికిరానిదానివయ్యావా? నీలో ఉన్న లోపాలు ఇప్పుడు మీరు విడిపోవటానికి కారణం అయ్యాయటనా? అసలు పెళ్లి చేసుకున్నది ఎందుకట, ఇలా మధ్యలో విడిపోవటానికా? ఆ కాగితాలపై ఎందుకు సంతకాలు పెట్టావు?’’ కోపంగా అడిగింది వాసంతి.‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మగవాడితో సిగ్గు విడిచి ‘నువ్వే కావాలి, నన్ను వదిలేయకు’ అని ఎలా చెప్పమంటావు వాసూ? నేనూ మనిషినే కదా, అంత అవమానాన్ని ఎలా సహించగలనే?’’ ‘‘సంహీ... నేను వెళ్లి అడుగుతాను... పెళ్ళంటే ఏమైనా బొమ్మలాటా, కాసేపు ఆడుకుని బోర్ కొట్టగానే మానేయటానికి? నీ జీవితం ఏమైపోవాలి?’’‘‘ఏమీ అయిపోలేదు, అవ్వదు...’’ కూల్ గా చెప్పింది సంహిత. ‘‘అతను రాకముందు నా జీవితం ఉంది, ఇప్పుడూ ఉంది, ఇకపై కూడా ఉంటుంది. అంతే...’’‘‘అసలు ఏం జరిగింది చెప్పు?’’గతమనే గవాక్షపు తలుపులు తెరిచింది సంహిత. ‘‘జీవితంలో నాకు చాలా కలలున్నాయి... వాటిని నెరవేర్చుకోవాలి... నాతో పాటుగా మీరు కూడా ఆ పథంలో అడుగేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు...’’ పెళ్లి చూపుల్లో మనోజ్ కి టీ కప్పు అందిస్తూ అన్నది సంహిత.‘‘కలలా? ఏమిటవి?’’ కాజువల్గా అడిగాడు, గాలికి ఎగిరే ఆమె చీర కొంగును చూస్తూ...ఆమె ఒక్కోటీ చెబుతూ ఉంటే ముఖం అదోలా పెట్టాడు. ఆ తర్వాత అనాసక్తిగా విన్నాడు. ‘‘సంహితా, ఆర్యూ సీరియస్?’’‘‘యస్... అయామ్...’’‘‘కలలంటే ఇవా? చక్కగా ఒక పెద్ద స్థలం కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకోవాలి...పెద్ద కారు కొనుక్కోవాలి. మనకి ఇద్దరు పిల్లలు ఉండాలి. వాళ్లకి చాలా ఖరీదైన స్కూల్లో చదువు చెప్పించాలి. ఖరీదైన ఫర్నిచర్, పెయింటింగ్స్ మన ఇంట్లో ఉండాలి. రిచ్ లైఫ్ కావాలి మనకి...అవీ కలలంటే...తెలుసా?’’‘‘అదికాదు మనోజ్, నేను చెప్పేది విన్నారు కదా, అర్థం అయిందా మీకు?’’ కంగారుగా అన్నది సంహిత.‘‘చక్కగా అర్థమైంది. నువ్వు చాలా తరచుగా రక్తదానం చేస్తావు. ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్లి ఆదుకుంటావు. అనాథ పిల్లలకూ, వృద్ధులకూ సాయం చేస్తావు. ఇవే కదా... నేను వీటిని అభ్యంతర పరచను. వీటిని కలలంటే ఎలా? ఇవి నీ నిత్యకృత్యాలు. కాకపోతే నా కలలు ఇప్పుడే చెప్పాను కదా, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం ఇద్దరమూ చేద్దాము... సరేనా?’’‘అభ్యంతర పరచను’ అనగానే పొంగిపోయింది సంహిత. ‘‘మరి, ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చానా?’’ నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు, మనోజ్.క్రీగంట సిగ్గుతో అతన్ని చూస్తూ చేయి విడిపించుకుని లోపలి గదిలోనికి వెళ్ళిపోయింది, సంహిత. మిగిలిన విషయాలు అన్నీ పెద్దవాళ్ళే నిశ్చయించారు. మనోజ్ ఒక్క రూపాయి కూడా కట్నం వద్దనటంతో, ఆ వ్యక్తిత్వానికి దాసోహం అయిపొయింది సంహిత మనసు. ‘‘చక్కగా ఇద్దరం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం...ఐదు లక్షల రూపాయల చిట్ మొదలు పెడదాం...’’ పెళ్ళయిన వారం రోజులకు చెప్పాడు మనోజ్.‘‘ఉహు కుదరదండీ... నాకు కమిట్ మెంట్స్ ఉన్నాయి...’’ ‘‘కమిట్ మెంట్స్? అవేమిటి?’’‘‘నేను ‘సత్య’ అనే పాపను అడాప్ట్ చేసుకున్నాను. హోమ్లోఉంటుంది. ఆ పాపకి నెలకి చదువుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను...’’ చెప్పింది.‘‘సరి సర్లే, ఇప్పటివరకూ భరించావుగా ... ఇక మానేయ్...’’ తేలికగా చెప్పాడు మనోజ్.‘‘అలా ఎలా వీలవుతుంది?’’‘‘అవుతుందోయ్... రేపు మనకే పిల్లలు పుడతారు... అలాంటప్పుడు పరాయి పిల్లలు, వాళ్ళ ఖర్చులు మనకెందుకు చెప్పు?’’ ఆమెను మాట్లాడనీయకుండా చేతుల్లో బంధించాడు. మరో రోజు ఇద్దరూ ప్రగాఢ ప్రణయావేశంలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ కాల్ రాగానే బయలుదేరుతూ ఉంటే వద్దన్నాడు. ‘‘లేదండి, యాక్సిడెంట్... చాలా ప్రమాదంలో ఉన్నాడు పేషెంట్... నేను వెళ్లి బ్లడ్ ఇవ్వాలి... ప్లీజ్...’’ చెబుతూనే త్వరగా రెడీ అయి, తన బైక్ మీద వెళ్ళిపోయింది సంహిత. ఇంకో రోజు అతను వద్దని అంటున్నా, ఒక అంధురాలైన విద్యార్థినికి పరీక్ష వ్రాయటానికని స్క్రయిబ్గా వెళ్ళింది... ఈ రెండు సంఘటనలూ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధాన్ని ప్రారంభింప జేసి, మనసులమధ్య దూరాన్ని ఎక్కువచేసాయి.అతనిదంతా డబ్బు జాగ్రత్త, విపరీతమైన పొదుపు. ఆమె పాత డ్రెస్సులు, చీరలు ఎవరికీ ఉచితంగా ఇవ్వనీయడు. ‘సెకెండ్ హాండ్ లో అమ్మేస్తే బోలెడు డబ్బు కదా!’ అంటాడు. పుస్తకాలు, పత్రికలూ కొనుక్కోనీయడు. లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవచ్చు కదా అంటాడు... అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత సంహిత మొత్తం ఇంటి పనీ, వంట పనీ తానే చేయాలి. ఇటు చెంచా తీసి అటు పెట్టడు. ఏదైనా తనకి ఇష్టమైన మూవీ గురించి కాని, పుస్తకం గురించి కానీ చర్చించుదామంటే అతనికి ఆసక్తి ఉండదు. ‘ఊ..ఊ..’ అంటూ అటు తిరిగి పడుకుంటాడు. నిరాశగా నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ మిగల్లేదు సంహితకు. గొడవలు పడటం ఇష్టం లేని సంహిత, అతను అడిగిన డబ్బు ఇచ్చేసి, మిగిలిన దాంతో కష్టపడి సర్దుకుంటోంది. ఈలోగా సంహిత తండ్రికి ఆరోగ్యం పాడై, ఏవో టెస్టులు చేయించుకోవలసి వచ్చి, సంహిత దగ్గరకు వస్తే తానే ఆయన్ని లాబ్ కి తీసుకుపోయి పరీక్షలు జరిపించింది. వాటికీ, డాక్టర్ ఫీజుకీ, మందులకీ ఇంచుమించు ఐదారువేల దాకా ఖర్చయింది. తనకు చెప్పకుండా ఆ డబ్బు ఖర్చు చేసినందుకు చాలా రాద్ధాంతం చేసాడు మనోజ్. అతను డబ్బు మనిషి అనీ, ‘డబ్బు’ ను తప్ప మనుషులను ప్రేమించడనీ అర్థమైంది సంహితకు... ‘పిల్లలు పుడితే అతనే మారతాడమ్మా...’ అనునయంగా చెప్పింది తల్లి. అదే ఆశతో కాలం గడుపుతోంది సంహిత... ఎంతకాలం ఎదురు చూసినా తాను తల్లీ కావటం లేదు, మనోజ్ కూడా మారలేదు. పైగా సంహిత తనకు అనుకూలంగా మారలేదని అతనికి అంతులేని కోపం. ‘‘ఇలా ఎంతకాలం? మనకి పిల్లలు పుట్టే సూచనలేవీ కనపడటం లేదు... సంహితా, నీతో నేను ఆనందంగా ఉండలేను... మనం విడిపోదాం’’ ఒకరోజు చెప్పాడు మనోజ్.‘‘మనో... ఏమిటంటున్నారు? చాలా తప్పు. మనం విడిపోవటానికా పెళ్లి చేసుకున్నది?’’ ‘‘కాదు కానీ, నీ తెంపరితనం నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాకు అనుకూలంగా ఉండవు... నీకు ఖర్చులెక్కువ. నాకన్నా అనాథలూ, దిక్కు లేని వాళ్ళూ ప్రాణం...ఏదో పెళ్ళికి ముందు సరదా పడ్డావు, నన్నడిగితే నువ్వు పెళ్లి తర్వాత మారతావని అనుకుని మాటిచ్చాను... కాని నువ్వు మారలేదు, మారవు కూడా... అందుకే నాకు నీమీద ఇష్టం పోయింది...యస్... ఐ హేట్ యూ...’’‘‘ఇష్టం అనేది ఒకసారి కలిగాక పోతుందా మనోజ్? మీరు ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు... నా వైపు నుంచి మీరు సానుకూలంగా ఆలోంచించవచ్చు కదా.. మీ పాటికి మీరు నా మీద ఇష్టాన్నే చంపేసుకున్నారు. కానీ మీరంటే నాకు మాత్రం చాలా ప్రేమ!’’ ఆవేదనగా చెప్పింది సంహిత.‘‘హు...ప్రేమ! నీ ఆశయాల మీదా, నీ ఆదర్శాల మీదా మాత్రమే నీకు ప్రేమ... అందుకే వాటిని వదులుకోలేవు నీవు నాకోసం.. అలాంటప్పుడు నేనే నిన్ను వాటికి వదిలేసి వెళ్ళిపోవటం న్యాయం... మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు తీసుకుందాం...’’ స్థిరంగా చెప్పాడు మనోజ్. ‘‘అది వాసూ నా పెళ్లి కథ...నువ్వు చాలా కాలంగా ఇక్కడ లేకపోవటం వలన, నీ కాంటాక్ట్ నంబర్ నా దగ్గర లేకపోవటం వలన నా విషయాలు ఏవీ నీకు ఇప్పటివరకూ తెలియవు. అతనికి నా వ్యాపకాలు మైనస్ చేసుకుని, నా డబ్బును ప్లస్ చేసిన తర్వాత అతనికే మిగిలిన నేను కావాలి... అతని కన్నా ముందుగా నా జీవితంలోకి వచ్చిన వాటిని, వారిని నేను వదులుకోలేను కదా...’’ ముగించింది, సంహిత. ఆమె మొబైల్ మ్రోగింది... అవతలి వాళ్ళు చెబుతున్నది వింటున్నంత సేపూ సంహిత ముఖంలో ఆందోళన... ఫోన్ కాల్ ముగించి చెప్పింది... ‘‘పాప సత్యకి ఆరోగ్యం బాగాలేదు... అర్జెంట్ గా నేను ఆర్ఫనేజ్ కి వెళ్ళాలి... ఇక సత్యను అక్కడ ఉంచలేను, ఇంటికి తీసుకు వచ్చేస్తాను...’’ దృఢంగా అన్నది లేస్తూ.‘‘వీళ్ళకోసం నీ కాపురం వదులుకున్నావా?’’‘‘కాపురం కోసం ‘వీళ్ళని’ వదులుకోలేను... అలా చేస్తే నన్ను నేను చంపుకున్నట్టే... నాకు జీవించాలని ఉంది వాసూ... లెటజ్ గో...’’ సంహిత ముఖంలో కొత్తవెలుగు గోచరించింది వాసంతికి. నండూరి సుందరీ నాగమణి -
మైట ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో నేషనల్ బ్లడ్ సెంటర్ ఆఫ్ మలేషియాలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహత్మా గాంధీ 150వ జన్మదిన సంబరాలలో భాగంగా ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సహకారంతో దాదాపు 50 మంది మైట సభ్యులతో విజయవంతంగా నిర్వహించామని మైట అధ్యక్షుడు సైదం తిరుపతి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న దాతలందరికి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ముఖ్య కార్యవర్గ సభ్యులు కార్తీక్, సందీప్, మారుతి, రవి వర్మ, చందు, వెంకటేశ్వర్లు, సత్య, నరేందర్, అశ్విత, చిట్టి బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.