brand
-
పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్లో బ్రాండ్ కావాలి..!
పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్కి ఇంటి పేరు ఏంటి, తండ్రి ఎవరు అనే రెండు డైలాగులు ఫైర్ అయ్యేలా చేసే బలహీనతలు. ఆ బలహీనతపైనే విలన్ దెబ్బకొడుతుంటే..నో పుష్పగాడు అంటే ప్లవర్ కాదు అదో బ్రాండ్ అని ప్రూవ్ చేస్తాడు. ఈ మూవీలోని డైలాగ్లా ప్రతి వ్యక్తి బ్రాండ్లా ఉండాలి. అంటే వర్క్ పరంగా లేదా దేనిలోనైనా మన ముద్ర ఉండేలా చూసుకోవాలి. ఏదో ఇతరులకి హెల్ప్ చేసి మంచివాళ్లు అనిపించుకునే నేమ్ అవసరం లేదు. మనల్ని చూడగానే ఈ వర్క్లో అతడికి మించి తోపులేరు అనే బ్రాండ్ సెట్ చేసుకోవాలట. అప్పుడే మనకు ఎందులోనూ తిరుగుండదని చెబుతోంది ఒక పాకిస్తాన్ మహిళ. ఆమెకు ఉద్యోగం రాకపోవడమే కెరీర్పై సరైన దృక్పథం ఏర్పడేలా చేసిందట. ఆ ఇంటర్యూలో సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన ఉనికినే కాదు ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది..ఇంతకీ ఆమె ఏం చెబుతుందంటే..పాకిస్తాన్కి చెందిన హిబా హనీఫ్ అనే మహాళ తాను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఫెయిల్యూర్ అయినా.. ఆ కంపెనీ సీఈవో అడిగిన ఒక్క ప్రశ్న తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పారు. తాను సోషల్మీడియా మేనేజ్మెంట్ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం అని ఒక కంపెనికి వెళ్లినట్లు తెలిపింది. "అక్కడ తనతోపాటు ముగ్గురు ఫైనల్ రౌండ్కి రాగా, ముగ్గుర్ని విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియా మేనేజర్గా తమకున్న వ్యూహాలు, నైపుణ్యాల గురించి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి ధీటుగా చెపపేలా తమ వద్ద స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది వారి టెస్ట్..అని చెప్పుకొచ్చారు" హనీఫ్. అయితే తాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు కానీ ఆ కంపెనీ సీఈవో అడిగిన ప్రశ్న తాను ఎలా ఉంటే కెరీర్ బాగుంటుందన్నది తెలియజేసిందని చెబుతోంది. నైపుణ్యాల, మరింత ఇంటిలిజెన్స్ అంటూ కోచింగ్ సెంటర్లకి పరిగెడుతుంటాం కానీ కావాల్సింది అది కాదు నువ్వు ఈ పనిలో బ్రాండ్ అనేలా మన ముద్ర ఉండాలి. అదే ఏ సంస్థకైనా కావాల్సిన స్కిల్ అని చెప్పడంతో.. ఇన్నాళ్లు తన గుర్తింపు ఏంటన్నది ఆలోచించలేకపోయానా..! అనేది గుర్తించానంటూ నాటి ఇంటర్యూని గుర్తుచేసుకున్నారామె. "సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇదే గుర్తింపు అనుకుంటున్నారు కానీ అది కాదు ఐడెంటిటీ. ఏదో కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లిపోవడం కాదు. ఈ పనిలో నీదంటూ బ్రాండ్ కావాలి. అబ్బా ఫలానా పనిలో ఆమె లేదా అతడు ది బెస్ట్ అనిపించుకోవాలి. అదే అసలైన నైపుణ్యం. పైగా కెరీర్ డెవలప్మెంట్కి కావాల్సిన పెట్టుబడి అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు హనీఫ్. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడంతో తానిన్నాళ్లు స్వంత గుర్తింపునే నిర్లక్ష్యం చేశానన్నా విషయాన్ని గ్రహించనని చెప్పారు. తాను ఈ ఫెయిల్యూర్ని మెల్కొలుపుగా భావించి ఆ దిశగా కృషి చేసి ది బెస్ట్ సోషల్ మీడియా మేనేజర్గా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరీ మీరు కూడా మీ వ్యక్తిగత బ్రాండ్ ఏంటన్నది ఆలోచిస్తున్నారా..! అంటూ ముగించారామె. మరీ మనం కూడా మనకంటూ ఓ ఫైర్ బ్రాండ్ ఉండేలా ట్రై చేద్దామా..!.(చదవండి: నిమ్మరసంతో గురకకు చెక్పెట్టండి..!) -
ప్రముఖ బ్రాండ్ను కొనుగోలు చేసిన రిలయన్స్
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఎస్ఐఎల్ బ్రాండ్ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎస్ఐఎల్(SIL) వివిధ రకాల జామ్లు, ఊరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది. రిలయన్స్ ఈ బ్రాండ్ను కొనుగోలు చేయడంతో ఇకపై ఎస్ఐఎల్ ఉత్పత్తులు ఆర్సీపీఎల్ ఆధ్వర్యంలో తయారు చేయనున్నారు.ఈ బ్రాండ్ కొనుగోలు కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదని రిలయన్స్ తెలిపింది. ఐకానిక్ భారతీయ వారసత్వ బ్రాండ్లను పునరుద్ధరించడానికి, వాటిని విస్తరించడానికి ఆర్సీపీఎల్ వ్యూహాత్మక చర్యల్లో భాగమని పేర్కొంది. ఎస్ఐఎల్ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఉత్పత్తులను నిలుపుకుంటూ సమకాలీన అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామని ఆర్సీపీఎల్ తెలిపింది. ఎస్ఐఎల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా రిలయన్స్ నెట్వర్క్ ఉపయోగపడనుంది.విస్తరణ దిశగా మరో కంపెనీ..కంపెనీలకు డిజిటల్ పరివర్తన సేవలు అందించే క్రెడెరా భారత్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశీయంగా ఆరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 1,300 మంది సిబ్బంది ఉండగా అతి పెద్దదైన హైదరాబాద్ సెంటర్లో 1,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు క్రెడెరా ఇండియా సీఈవో గౌరవ్ మాథుర్ తెలిపారు. మరింత మంది మార్కెటింగ్, టెక్నికల్ నిపుణులను నియమించుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు పలు కళాశాలలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్రెడెరాకు అంతర్జాతీయంగా 3,000 మంది సిబ్బంది ఉన్నారు. -
టీసీఎస్ అరుదైన ఘనత: రెండో గ్లోబల్ ఐటీ సర్వీస్ బ్రాండ్గా రికార్డ్
టెక్ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS).. గ్లోబల్ ఐటి సేవలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ వంటి వాటిలో గ్లోబల్ లీడర్గా ఎదిగిన ఈ బ్రాండ్ విలువ 21.3 బిలియన్లను చేరింది. 2010లో 2.3 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న కంపెనీ.. 15 సంవత్సరాలలో 826 శాతం వృద్ధి చెందింది.ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. మా బ్రాండ్ ఈ ప్రధాన మైలురాయిని అధిగమించి అగ్ర శ్రేణిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. 15 సంవత్సరాలుగా మా బ్రాండ్, విలువలో దాదాపు తొమ్మిది రెట్లు పెరిగింది. ఆవిష్కరణలలో అగ్రగామిగా, ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పనిని అందించగల సామర్థ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ప్రసిద్ధి చెందిందని అన్నారు.మార్కెటింగ్ ఎక్సలెన్స్పై టీసీఎస్ దృష్టి బ్రాండ్ విజిబిలిటీ & గ్లోబల్ రీచ్ను మెరుగుపరిచింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 14 ప్రధాన ఎండ్యూరెన్స్ రన్నింగ్ రేసులను స్పాన్సర్ చేస్తుంది. వీటిలో ఐదు ప్రతిష్టాత్మకమైన అబాట్ వరల్డ్ మారథాన్ మేజర్స్ (న్యూయార్క్, లండన్, బోస్టన్, చికాగో, సిడ్నీ) ఉన్నాయి. ఇందులో ప్రతి ఏటా 6,00,000 మంది రన్నర్లు పాల్గొంటున్నాయి.ఫ్యూచర్ అథ్లెట్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా TCS పనితీరును పర్యవేక్షించడానికి, అథ్లెట్ పనితీరును మెరుగుపరచడానికి అధునాతన డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం, వెల్నెస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ పట్ల దాని నిబద్ధతను బలోపేతం చేస్తుంది.టీసీఎస్.. జాగ్వార్ టీసీఎస్ రేసింగ్తో కూడా భాగస్వామిగా ఉంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ రేసింగ్ సిరీస్. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో పోటీపడుతుంది. ఈ సహకారం స్థిరమైన సాంకేతికతలలో.. ఎలక్ట్రిక్ మొబిలిటీ పురోగతిలో డ్రైవింగ్ ఆవిష్కరణకు కంపెనీ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. గత కొన్నేళ్లుగా.. ఫ్లాగ్షిప్ కస్టమర్ సమ్మిట్లు, ఇండస్ట్రీ ట్రేడ్ షోలు.. టెక్నాలజీ భాగస్వాముల ద్వారా.. వ్యాపారాలు నేటి డైనమిక్ వాతావరణంలో మెరుగ్గా స్వీకరించడంలో సహాయపడటానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కస్టమర్లతో TCS నిమగ్నమై ఉంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లో లోతైన పరిశోధన, అధ్యయనాలను రూపొందించడం ద్వారా టీసీఎస్ మరింత ముందుకు సాగనుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఫ్యూచర్ రెడీ ఈమొబిలిటీ స్టడీ 2025 రవాణా భవిష్యత్తును రూపొందించే ట్రెండ్లను హైలైట్ చేస్తుంది. -
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
‘మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)’ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని భక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఈఓలు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు హాజరవుతారు. ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి. దాంతో విభిన్న ప్రచారపంథాను అనుసరిస్తున్నాయి.భారీగా భక్తుల తాకిడి..పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈసారి దాదాపు 40 కోట్ల మంది మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశం మలుచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి.బ్రాండ్ ప్రచారంకొన్ని కంపెనీలు తమ బ్రాండ్ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు, ఛార్జింగ్ పాయింట్లు, విశ్రాంతి గదులు, సెల్ఫీ జోన్ల(Selfie Zones)ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు, డాబర్ ఆమ్లా, వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాయి. డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది.ప్రకటనలకు భారీగా ఖర్చుభక్తులు నివసించే ప్రదేశాలు, షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్స్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్(LED Screens)లు వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో భక్తులకు తమ బ్రాండ్ల విజిబిలిటీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. హోర్డింగ్లు/ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్పై 10 సెకన్ల యాడ్ కోసం కనిష్టంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.సాంస్కృతిక సమైక్యతకంపెనీలు తమ బ్రాండ్ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం, సంస్కృతిని మిళితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో.. లోకల్ సాంగ్స్పై రీల్స్ చేయాలని నిర్ణయించింది. కుకు ఎఫ్ఎం తన ఓటీటీ యాప్ ‘భక్తి’ని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇదీ చదవండి: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?సామాజిక బాధ్యతకార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం ‘కార్పొరేట్ సమాజిక బాధ్యత(CSR)’ కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు. దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, సీఎస్ఆర్ నిధులు ఖర్చు అవుతాయి. అందులో భాగంగా హెల్ప్ డెస్క్లు, పోలీసు బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిసింది. మహా కుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాల నుంచి సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. -
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
బిగ్బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్మెంట్కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్లో గతేడాది టాప్లో నిలిచిన బిగ్బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్లో మెంటార్గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్లతో కోర్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆరేళ్ల తర్వాత అమెరికన్ బ్రాండ్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హోమ్కేర్ సొల్యూషన్స్ సంస్థ బిస్సెల్ ఆరేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ఈసారి భారత్లో ఉత్పత్తుల పంపిణీ కోసం కావిటాక్ గ్లోబల్ కామర్స్ సంస్థతో జట్టు కట్టింది.స్పాట్క్లీన్ హైడ్రోస్టీమ్, స్పాట్క్లీన్ ప్రోహీట్ పేరిట పోర్టబుల్ వెట్, డ్రై వేక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్ల విక్రయాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు బిసెల్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మార్కెట్స్) మ్యాక్స్ బిసెల్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లోర్ సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్లో మార్కెట్ పరిమాణం చిన్నగానే ఉన్నప్పటికీ భవిష్యత్లో గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ముందుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి భాగస్వాములతో ఆన్లైన్లో అమ్మకాలతో పారంభించి, విక్రయాల పరిమాణాన్ని బట్టి క్రమంగా ఆఫ్లైన్లో కూడా కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని మ్యాక్స్ వివరించారు. అమెరికా, చైనా తదితర దేశాల్లో గణనీయంగా వ్యాపారం ఉన్న బిసెల్ సంస్థ 2018లో దేశీ మార్కెట్ కోసం యూరేకా ఫోర్బ్స్తో జట్టు కట్టింది. కానీ, ఆ తర్వాత భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించింది. -
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్కు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్ఫ్లిక్స్, డిస్నీ–హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్లతో పాప్కార్న్ నుంచి ఐస్క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్లను ప్రవేశపెట్టేందుకు నెట్ఫ్లిక్స్తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్ఫామ్లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్క్యాట్ ప్యాక్లను విడుదల చేయడంతో పాటు నెట్ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్స్టార్తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో నేరుగా లింక్లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ‘కంటెంట్ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
అంతర్జాతీయంగా ‘భారత్ బ్రాండ్’కు గుర్తింపు
న్యూఢిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్తో అంతర్జాతీయంగా భారత్ బ్రాండ్కు ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక పథకం ప్రకటించే అవకాశం ఉందని, దీనిపై అత్యున్నత స్థాయి కమిటీ పనిచేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. మేడ్ ఇన్ జపాన్, స్విట్జర్లాండ్ మాదిరే మేడ్ ఇన్ ఇండియాకు బలమైన బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్నది ఇందులోని ఉద్దేశమ్యని తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్ గురించి చెప్పగానే వాచీలు, చాక్లెట్లు, బ్యాంకింగ్ రంగం గుర్తుకొస్తుంది. ఇదే మాదిరిగా మనం ఏమి చేయగలం అన్న దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మనకు మెరుగైన సామర్థ్యాలు కలిగిన టెక్స్టైల్స్ తదితర కొన్ని రంగాలకే ఈ పథకాన్ని పరిమితం చేయాలా? తదతర అంశాలపై దృష్టి సారించాం’’అని ఆ అధికారి తెలిపారు. భారత్ బ్రాండ్కు ప్రచారం కల్పించే విషయంలో నాణ్యత కీలక అంశంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ‘ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’ (ఐబీఈఎఫ్) ఈ దిశగానే పనిచేస్తోంది. భారత ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయంగా అవగాహన, ప్రచారం కల్పించడం కోసం కృషి చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో పథకంపై సమాలోచనలు చేస్తోంది. నాణ్యతే ప్రామాణికంగా ఉండాలి.. ‘‘భారత బ్రాండ్ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నాణ్యతలో నిలకడ, మన్నిక ప్రాధాన్యంగా ఉండాలి. ఉదాహరణకు అధిక నాణ్యతతో కూడిన జనరిక్ ఔషధాల తయారీతో భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అంతర్జాతీయంగా మంచి నమ్మకాన్ని గెలుచుకుంది’’అని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) పేర్కొంది. భారత్ ప్రతిష్ట కాపాడుకునేందుకు నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్!
ఒకప్పుడు కటిక దారిద్యంతో చాలా తిప్పలు పడ్డాడు. కాలేజీ పీజులు చెల్లించడానికి పుస్తకాలు అమ్మాడు. నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్లో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్ డిజైనర్గా ఎదిగాడు. అతడి బ్రాండే భారదేశంలోని అతిపెద్ద లగ్జరీ బ్రాండ్గా కితాబులందుకుంది. అంతేగాదు బాలీవుడ్ సెలబ్రిటీల మోస్ట్ వాంటెడ్ వెడ్డింగ్ డిజైనర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతడెవరంటే..ఫ్యాషన్ ప్రపంచానికి అలానాటి సంప్రదాయ దుస్తులతో కొంత హంగులు తీసుకొచ్చి ప్రపంచమే కళ్లప్పగించి భారత్ ఫ్యాషన్ వైపు చూసేలా చేశాడు. అతడే సబ్యసాచి ముఖర్జీ. అద్భుతమైన హస్తకళకు, అచంచలమైన నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఈ కాస్ట్యూమ్ డిజైనర్. సబ్యసాచి బ్రాండ్ ఓ డిజైన్ మాస్ట్రో పీస్గా ఫ్యాషన్ పరిశ్రమలో నీరాజనాలు అందుకుంటోంది. అయితే అతడి జీవితమేమి గోల్డెన్ స్పూన్ బేబీలా సాగలేదు.సబ్యసాచి ఫిబ్రవరి 23, 1974లో పశ్చిమబెంగాల్లోని మానిక్తలాలో జన్మించాడు. భారతీయ బ్రాండ్ 'సబ్యసాచి' వ్యవస్థాపకుడు. అంతేగాదు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో బోర్డు సభ్యుడైన అతిపిన్న వయస్కుడు. అయితే అతడి బాల్యంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. ఆయన తన ప్రాథమిక విద్యను అరబిందో విద్యామందిర్లోనూ, మాధ్యమిక విద్యను కోల్కతా సెయింట్ జేవియర్ కళాశాలలోనూ పూర్తి చేశాడు. అతడి ఎన్నుకున్న ఫ్యాషన్ కెరీర్ని కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించారు. ఓ పక్క ఇంట్లో కటిక దారిద్యం మరోవైపు ఊహకందని ప్యాషన్ ప్రపంచం..అయినా సరే తన లక్ష్యాన్ని, కోరికను వదిలిపెట్టలేదు. కాలేజీ ఫీజల కోసం పుస్తకాలు అమ్ముతూ నానాపాట్లు పడి చదువు పూర్తి చేశాడు. తాను ఫ్యాషన్ రంగంలో నిలదొక్కుకునేంత వరకు రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సని ఏదోలా పూర్తి చేసి, వెంటనే తన సొంత లేబుల్ని ప్రారంభించాడు. అందులో తన డిజైన్ చేసిన దుస్తులను విక్రయించే యత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో చాలా ఇబ్బందులు పడేవాడు. చివరికీ తన డిజైన్లు ఎవరైన కొంటారా? అనే అనుమానం ఎదురయ్యేంతకు చేరిపోయాడు. అలాంటి సమయంలో సరిగ్గా 2001లో లాక్మే ఫ్యాషన్ వీక్ అతడి పాలిట వరంలా వచ్చింది. అందులో తన కలెక్షన్స్ని ప్రదర్శించి చూశాడు. అది మొదలు ఇక వెను తిరిగి చూసే అవకాశం లేకుండా అచంచలంగా ఎదుగుతూ..ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బ్రాండ్ విశిష్టత..సబ్యసాచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్త్రాలు, సాంస్కృతిక సంప్రదాయాలు వంటి మూలాలను ఆధారం చేసుకుని డిజైనర్ వేర్లను రూపొందించడం ఈ బ్రాండ్ విశిష్టత. అతని డిజైన్లు నిగూఢమైన అర్థాన్ని, కాలనుగుణ ఫ్యాషన్కి సరిపోయేలా వివరణను ఇచ్చేలా ఉండేవి. అతడి క్రియేటివిటీకి "ఫెమినా బ్రిటిష్ కౌన్సిల్"కి "ది మోస్ట్ ఔట్స్టాండింగ్ అండ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు వంటి ఎన్నో అవార్డులు ప్రశంసలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ ఖ్యాతీని తెచ్చిపెట్టాయి. అంతేగాదు బాలీవుడ్ దిగ్గజ తార వివాహ డ్రెస్లను రూపొందించే డిజైనర్గా పేరుతెచ్చుకున్నారు. అతడి డిజైన్లు రెడ్ కార్పెట్పైనే గాక మ్యాగజైన్ కవర్లపై కూడా మెరిశాయి. ఇక సబ్యసాచి బ్రాండ్ నికర విలువ దాదాపు రూ. 114 కోట్లు ఉంటుందని అంచనా. ఇది భారతదేశపు అత్యంత అద్భుతమైన లగ్జరీ డిజైనర్ బ్రాండ్గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ బ్రాండ్ కాలిఫోర్నియా, అట్లాంటా, లండన్,దుబాయ్ వంటి దేశాల్లో కూడా స్టోర్లను కలిగి ఉంది.(చదవండి: జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!) -
అబ్బో.. ఇదేనా బాబు.. మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన!
సాక్షి, గుంటూరు: బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని సీఎం చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అబ్బో.. ఇదేనా మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన అని వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు ప్రస్తుత, గతంలో చేసిన అరాచక పాలనపై మండిపడుతున్నారు. ‘బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం (ఆగష్టు 3,2024)తేదీన టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేశాడు. అక్రమ ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్నారని(జులై 10 2015)తేదీన ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో వేసి కొట్టించాడు. విజయవాడ ట్రాన్స్పోర్టు కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మీదికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ(మార్చి 26 2017) తేదీన ఆయన సెక్యూరిటీ గార్డును తోసివేశాడు. నన్ను రామసుబ్బారెడ్డిని నలుగురు ఐఏఎస్ల సమక్ష్మ లో కూర్చోబెట్టి (అక్రమంగా ) సంపాదించిన దానిలో చెరి సగం పంచుకోమని చెప్పాడు మా పెద రా (నా) యుడు అని అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియో ఉంది. అమరావతి డిజైన్ల కోసం అని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న జపాన్ మాకీ సంస్థ చైర్మన్ పుమిహికో అయితే.. ఏపీ కంటే బీహార్ నయం, ప్రతిదానికి లంచం ఇవ్వాలి అని విసిగి వేసారి లేఖ రాసి వెళ్లిపోలేదా? ’అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఎవరీ పాలన బ్రాండ్ ఏపీ ప్రతిష్ట దెబ్బతీసిందో తెలుసుకోవాలని, రాజకీయల కోసం అసత్య ఆరోపణలు చేయవద్దని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పాలన ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. -
రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!
మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత ఫ్యాషన్ ఉండేది. అయితే ఇప్పటిలా దానికి అంతలా క్రేజ్ లేకపోయినా నాటి రాజరికపు కుటుంబాలు గొప్ప గొప్ప డిజైనర్ వేర్ దుస్తులను ధరించేవారు. నాటి కాలంలో చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్వేర్ చీరలు గురించి చాలమందికి తెలియదు. నాటి కాలంలో ఎంబ్రాయిడరీ చేయడం ఉందా అనుకుంటారు. కానీ ఆ కాలంలోనే హస్తకళాకారులు నైపుణ్యం ఆశ్చర్యచకితులను చేసేలా అద్భుతంగా ఉండేది. నాటి స్మృతుల్ని మరచిపోకుండా చేసేలా మన రాజరికపు దర్పానికి గుర్తుగా అలనాటి సాంప్రదాయ దుస్తులను చక్కటి బ్రాండ్ నేమ్తో అందరికీ చేరువయ్యేలా చేస్తోంది నందినిసింగ్. ఎవరీ నందిని సింగ్? ఎలా అలనాటి రాజరికపు సాంప్రదాయ దుస్తులను వెలుగులోకి తీసుకొస్తోందంటే..అవద్ రాజ కుటుంబానికి చెందిన నందిని సింగ్ కరోనా మహమ్మారి సమయంలో రాజుల కాలం నాటి దుస్తులకు సంబంధించిన బ్రాండ్ని నెలకొల్పింది. అంతేగాదు అలనాటి సాంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించడమే కాకుండా నాటి సాంప్రదాయ చీరలను ప్రస్తుత జనరేషన్ తెలుసుకునేలా మంచి బ్రాండ్ నేమ్తో పరిచయం చేస్తోంది. ఈ రాజరికపు సంప్రదాయ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్తో ప్రదర్శిస్తోంది. ఈ బాండ్కి చెందిన దుస్తులు రాయల్ ఫేబుల్స్ వెడ్డింగ్ ఎడిట్లోనూ, ప్యాలెస్ అటెలియర్స్ అండ్ డిజైన్ స్టూడియోలలో ప్రదర్శనలిచ్చింది. ఈ మేరకు నందిని తన బ్రాండ్ జర్నీ గురించి మాట్లాడుతూ..తన గ్రామంలోని ఒక ఎన్జీవోకి సంబంధించిన పనిపై..ఝూన్సీ, లక్నో వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడూ.. ఎందరో హస్తకళకారులు తన వద్దకు వచ్చి తమ సమస్యను వివరించడంతో దీనిపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడే వారందర్నీ ఒక కమ్యూనిటీగా చేసి..షిఫాన్లు, ఆర్గాంజస్ వంటి బట్టలపై ఎంబ్రాయిడీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది.. అది ఒకరకంగా వారికి పని కల్పించినట్లు అవుతుంది కూడా అని భావించింది నందిని. అందుకోసం అని హోల్సేల్ వ్యాపారులను సంప్రదించి మరీ హస్తకళకారులకు ఉపాధి దొరికేలా చేసింది. ఆ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పేరుని మహాభారతం నుంచి తీసుకుంది. ఆ పురాణ గాథలో శ్రీకృష్ణుడు అనే చా అస్మీ (నేను అన్నాను) అనే సంస్కృత పదాన్ని తన దుస్తులకు బ్రాండ్ నేమ్గా ఎంపిక చేసుకుంది. ఈ సంప్రదాయ డిజైన్లను మంచి బ్రాండ్ నేమ్తో తీసుకురావడంలో ప్రేరణ తన తల్లి, అమ్మమ్మ, అత్తలే కారణం అంటోంది. ఎందుకంటే వారు ధరించే ఎంబ్రాయిడరీ చీరలతో తనకున్న చిన్న నాటి జ్ఞాపకాలే దీన్ని ఫ్యాషన్వేర్గా తీసుకొచ్చేందుji దారితీసిందని చెబుతోంది. "ఇక ఈ చాస్మీ బ్రాండెడ్ చీరలను హస్తకళకారులు సింగిల్-థ్రెడ్ వర్క్ లేదా 'సింగిల్ టార్'తో ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. అందుకోసం పట్టుదారాలను ఉపయోగిస్తారు. అయితే ఈ ఎంబ్రాయిడరీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎక్కువ దారాలను మిక్స్ చేయడం జరుగుతుంది. కానీ హస్తకళాకారులు మాత్రం సింగిల్ దారంతోనే ఎక్కువ సమయం కేటాయించి మరీ తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కూడా. అలాగే పిట్టా, జాలీ, రేషం ఎంబ్రాయిడరీతో సహా వివిద రకాల వర్క్లు చేస్తారు. అంతేగాదు శాలువాలు, లెహంగాలు, దుపట్టాలు, చీరలు, బ్లౌజ్లపై కూడా ఎంబ్రాయిడరీ చేస్తాం". అని నందిని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అలనాటి రాజవంశ మహిళలు ధరించే ఎంబ్రాయిడరీ చీరలను ఎలా ఉంటాయో చూసేయండి. View this post on Instagram A post shared by Chaasmi (@chaasmiofficial) (చదవండి: కట్టడితో పిల్లలను గడప దాటేలా చెయ్యొద్దు..!) -
కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ కూతురు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సార్ గ్లాస్లాంటి స్కిన్తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ సెల్ఫ్ పోర్ట్రెయిట్ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ లానీజ్ అంబాసిడర్గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్ బ్రాండ్ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్ పరంగా సింపుల్ మేకప్తో క్యూట్ లుక్తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్వేర్లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) ( చదవండి: ఈ ఏడాది మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?) -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందులోనూ కొరియన్ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్ స్కిన్ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్ బ్రాండ్లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్ని ప్రారంభించి.. ఓ టీచర్ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే.. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్ బ్రాండ్లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, సినిమాలకు భారత్ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్లో ఇంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ కొరియన్ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొరియన్ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్ అయినా బ్యూటీ బార్న్ వ్యవస్థాపకురాలు నాగలాండ్కి చెందిన తోయినాలి చోఫీ . ఈ కే బ్యూటీ బ్రాండ్ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్ తదితర ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్లైన్లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్రాండ్ని తాను కేవలం నాగాలండ్కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక తాను టీనేజ్లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్ చర్మసంరక్షణ ప్రొడక్ట్లు బెటర్ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్కి చెందిన అధికారిక ఇన్స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ (చదవండి: డౌన్ సిండ్రోమ్తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్గా..!) -
బైజూస్ వ్యవస్థాపకులకు షాక్!
న్యూఢిల్లీ: థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి వ్యవస్థాపకులకు ఉద్వాసన పలకాలని ఆరు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బైజూస్ బ్రాండ్తో ఎడ్యుకేషన్ సేవలందించే కంపెనీని వ్యవస్థాపకుల నియంత్రణ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం వాటాదారుల అసాధారణ సమావేశాన్ని (ఈజీఎం) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశాయి. డచ్ సంస్థ ప్రోజస్ అధ్యక్షతన బైజూస్లో పెట్టుబడులున్న కంపెనీలు ఏజీఎంకు నోటీసు జారీ చేసినట్లు తెలియజేశాయి. పాలన (గవర్నెన్స్), నిబంధనల అమలు అంశాలు, ఆర్థిక నిర్వహణలో అక్రమాలు, డైరెక్టర్ల బోర్డు పునరి్నర్మాణం తదితరాల పరిష్కారం కోసం ఏజీఎంకు పిలుపునిచి్చనట్లు వెల్లడించాయి. వెరసి యాజమాన్య మార్పునకు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. నోటీసు జారీకి మద్దతిచి్చన ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో జనరల్ అట్లాంటిక్, పీక్ ఫిఫ్టీన్, సోఫినా, చాన్ జుకర్బర్గ్, ఔల్ అండ్ శాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి బైజూస్లో ఉమ్మడిగా సుమారు 30 శాతం వాటా ఉంది. బైజూస్ వాటాదారుల కన్సార్షియం ఇంతక్రితం జులై, డిసెంబర్లలోనూ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి పిలుపునిచి్చనప్పటికీ ఆచరణకు నోచుకోలేదని తాజా నోటీసులో ప్రోజస్ పేర్కొంది. కాగా.. ఈ అంశంపై బైజూస్ వెంటనే స్పందించకపోవడం గమనార్హం! 200 మిలియన్ డాలర్ల సమీకరణ.. ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఈక్విటీ రైట్స్ ఇష్యూ ద్వారా 200 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ వాస్తవ వేల్యుయేషన్ మరింత ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుత విడత సమీకరణ కోసం మాత్రం 220–250 మిలియన్ డాలర్ల శ్రేణిలో పరిగణించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత తక్కువ వేల్యుయేషన్ ఈ ఇష్యూకు మాత్రమే పరిమితం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్పీఎల్) ఈ మేరకు ఈక్విటీ షేర్హోల్డర్లకు రైట్స్ ఇష్యూను ప్రారంభించినట్లు బైజూస్ పేర్కొంది. 2022 మార్చిలో బైజూస్ ఏకంగా 22 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించింది. పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 18 నెలలుగా వ్యవస్థాపకులు దాదాపు 1.1 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయడమనేది సంస్థ పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. మరోవైపు, ఇటీవలి కాలంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లు, బైజూస్ లక్ష్యం, రైట్స్ ఇష్యూ తదితర అంశాలను వివరిస్తూ షేర్హోల్డర్లకు కంపెనీ లేఖ రాసింది. దాదాపు 22 నెలల జాప్యం తర్వాత బైజూస్ ఇటీవలే ప్రకటించిన 2022 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల ప్రకారం నిర్వహణ నష్టం రూ. 6,679 కోట్లకు, ఆదాయం రూ. 5,298 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నష్టం రూ. 4,143 కోట్లు, కాగా ఆదాయం రూ. 2,428 కోట్లు. -
అరంగేట్రంతోనే అదరగొట్టాడు!
దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి నీల్ బ్రాండ్ తన అంతర్జాతీయ అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో సీనియర్ ఆటగాళ్ల గైర్హజరీలో సౌతాఫ్రికా జట్టును నీల్ బ్రాండ్ ముందుండి నడిపిస్తున్నాడు. దేశీవాళీ క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన బ్రాండ్కు.. తన అరంగేట్ర సిరీస్లోనే సఫారీ జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. ఈ క్రమంలో మౌంట్ మాంగనుయ్ వేదికగా కివీస్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్రాండ్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను బ్రాండ్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. 258/2 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ అదనంగా 253 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను ముగించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(240) అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(118) సెంచరీతో సత్తాచాటాడు. -
‘భారత్’ బ్రాండ్ శనగపప్పుకి డిమాండ్
న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు. నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. -
ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే..!
ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో బిడియం, సిగ్గుతో వెనకబడే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే... చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్గా ఎంచుకుంది రిచాకర్. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్ నేడు కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది. జంషెడ్పూర్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రిచాకర్. తండ్రి టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం రిచాది. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. శాప్ రిటైల్ కన్సల్టింగ్, స్పెన్సర్స్లో ఉద్యోగం చేశాక... సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసింది. ఒకపక్క ఉద్యోగానుభవం, మరోపక్క మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ‘‘సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా? వద్దు’’ అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది. రేడియంట్ మి మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్నిరోజులకి తన పనిమీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదువేల డిజైన్లు, యాభై బ్రాండ్లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందిస్తోంది జివామే. డైరెక్టర్గా... కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్గా కొనసాగుతోంది రిచా కర్. ప్రస్తుతం రిచా నెట్ వర్త్ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతోన్న జివామే బ్రాండ్ను 2020 లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచా కర్ ప్రస్తుతం తన భర్త కేదార్ గవాన్తో కలిసి అమెరికాలో నివాసముంటోంది. ‘‘ ఒక స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంట్లో... సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్. కోట్ల టర్నోవర్తో.. లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా... కాన్ఫిడెంట్గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరువందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి. 1. యాపిల్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు. సీఈఓ: టిమ్కుక్ కంపెనీ ప్రారంభం: 1976 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 2. మైక్రోసాఫ్ట్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు. సీఈఓ: సత్యనాదెళ్ల కంపెనీ ప్రారంభం: 1975 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 3. సౌదీ అరమ్కో సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు. సీఈఓ: అమిన్ హెచ్.నజెర్ కంపెనీ ప్రారంభం: 1933 ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! 4. ఆల్ఫాబెట్(గూగుల్) సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు. సీఈఓ: సుందర్ పిచాయ్ కంపెనీ ప్రారంభం: 1998 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 5. అమెజాన్ సెక్టార్: ఈ కామర్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు. సీఈఓ: యాండీ జెస్సీ ఫౌండర్: జెఫ్బెజోస్ కంపెనీ ప్రారంభం: 1994 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 6. ఎన్విడియా సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు. సీఈఓ: జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రారంభం: 1993 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 7. మెటా ప్లాట్ఫామ్స్(పేస్బుక్) సెక్టార్: సోషల్ మీడియా మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు. సీఈఓ: మార్క్ జూకర్బర్గ్ కంపెనీ ప్రారంభం: 2004 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ 8. బెర్క్షైర్ హాత్వే సెక్టార్: ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు. సీఈఓ: వారెన్బఫెట్ కంపెనీ ప్రారంభం: 1839 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 9. టెస్లా సెక్టార్: ఆటోమోటివ్ మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు. సీఈఓ: ఎలాన్మస్క్ కంపెనీ ప్రారంభం: 2003 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 10. ఎలి లిల్లి సెక్టార్: ఫార్మాసూటికల్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు. సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్ కంపెనీ ప్రారంభం: 1876 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ -
విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే!
బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘ది డర్టీ పిక్చర్’తో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో విద్యా బాలన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. హానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి నుంచి వరసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. విద్యా బాలన్ సినిమా కెరీర్ గురించి అందరికీ తెలిసినా ఆమె వ్యక్తిగత విషయాలు చాలా వరకూ బయటకు తెలీదు. కళ్ల అభినయంతో నటలో నూటికి నూరు మార్కులు కొట్టేసిన విద్యాబాలన్ ఓ ఇంటర్యూ తన కళ్ల అందం వెనుక దాగున్న రహస్యం గురించి, అందుకోసం తాను వాడే కాజల్ గురించి పంచుకుంది. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదాసీదా కాటుక కాదు.. పాకిస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’ కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! (చదవండి: పార్లర్కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
బ్రాండ్ బాబులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయం సాధించి, ఆర్థికంగా మరో మెట్టు పైకెదు గుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా వారి అభిరుచులు, ఇష్టాలు మారుతున్నాయి. తదనుగుణంగా ఉన్నత శ్రేణి, అధిక నాణ్యత గల వస్తువులు లేదా అధిక ధరలు కలిగిన ఉత్పత్తుల (ప్రీమియం కన్జమ్షన్) కొనుగోలు వైపు వారు మొగ్గు చూపుతున్నారని, అలాంటి వాటిపై వారి ఆసక్తి పెరుగుతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న భారతీయులు చేస్తున్న వ్యయం, ఇతర అంశాలను పరిశీలిస్తే ప్రీమియం కన్జమ్షన్ వైపు వారి ప్రాధాన్యతలు మారుతున్నట్టుగా అవగతమవుతోందని పేర్కొంటున్నాయి. 2019 నుంచి వ్యక్తిగత వినియోగం (ప్రైవేట్ కన్జమ్షన్) అనేది అంతకంతకు (కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, తదనంతర పరిణామాల కారణంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా) వృద్ధి చెందుతోందని, వివిధ కేటగిరీల్లో ఎక్కువగా వ్యయం చేయడం వ్యక్తుల ఆర్థిక పురోభివృద్ధిని సూచిస్తున్నాయని స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ‘రెడ్సీర్’తాజా నివేదిక వెల్లడించింది. మరికొన్ని ముఖ్యాంశాలు ఆర్థికంగా ఎదుగుతున్నవర్గాలు.. ట్రావెల్–టూరిజం, ఫైనాన్షియల్ సర్విసెస్, రిక్రియేషన్, ఇన్సూరెన్స్ తదితరాలపై చేసే వ్యయంలో పెరుగుదల చోటు చేసుకుంది. నాణ్యమైన విద్య,వ్యక్తిగత వాహనాలు, పర్సనల్ కేర్ వస్తువులు, ఆహారం, వివిధ రకాల బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. ఏప్రిల్, మే, జూన్లతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు, చేసిన విమాన ప్రయాణాలు, వివిధ రకాల హైఎండ్ వాహనాల కొనుగోళ్లు ప్రైవేట్ కన్జమ్షన్ తీరును తెలియజేస్తున్నాయి. సంపద పెరుగుదలను సూచిస్తున్నవినియోగ ధోరణులు భారతీయుల దీర్ఘకాలిక వినియోగ ధోరణులు క్రమంగా సంపద పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారుల ప్రవర్తన, వ్యవహారశైలి (కన్జ్యూమర్ బిహేవియర్) చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఉన్నత శ్రేణి కేటగిరీల వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమౌతోంది.ఇండియా డిజిటల్గా ఎదగడంతో పాటు దేశంలో మౌలిక సదుపాయాలు కూడా మెరుగైనందున ఈ దశాబ్దంలో ఈ ప్రత్యేక ప్రయాణం మరింత ముందుకు సాగనుంది. – మృగాంక్ గుట్గుటియా, రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్బ్యాగ్లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్లు, హ్యాండ్బ్యాగ్లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్తో సతమ్ మంచి సక్సెస్ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్లైన్లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
రక్షణ రంగానికి బ్రాండ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్ ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి.. ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000 జోయ్ అలుక్కాస్.. కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
ఇక మెడ్ప్లస్ సొంత బ్రాండ్ మందులు.. 80 శాతం వరకు డిస్కౌంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయంలో ఉన్న హైదరాబాద్ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్.. సొంత బ్రాండ్లో మందుల అమ్మకాల్లోకి ప్రవేశించింది. 50–80% డిస్కౌంట్తో వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. కంపెనీ సీవోవో చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ చేతన్ దీక్షిత్తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివిధ చికిత్సలు, దీర్ఘకాలిక జబ్బులకువాడే 500లకుపైగా పేటెంట్యేతర ఔషధాలను మెడ్ప్లస్ బ్రాండ్లో ప్రవేశపెట్టినట్టు మధుకర్ చెప్పారు. జీఎంపీ, ఈయూ జీఎంపీ ధ్రువీకరణ పొందిన ప్లాంట్లలో మందులు తయారవుతున్నట్టు వివరించారు. ఏటా 1,000 స్టోర్లు.. ప్రతి ఏటా మెడ్ప్లస్ ఫార్మసీ విభాగంలో 1,000 రిటైల్ ఔట్లెట్లను తెరుస్తామని మధుకర్ రెడ్డి తెలిపారు. ‘వీటి ఏర్పాటుకు ఏటా సుమారు రూ.300 కోట్లు అవసరం అవుతాయి. ఏడు రాష్ట్రాల్లోని 552 నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 3,822 స్టోర్లు ఉన్నా యి. ఈ ఏడాదే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రా ష్ట్రాల్లో అడుగుపెడుతున్నాం. 2022–23లో రూ. 4,550 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25% వృద్ధి ఆశిస్తున్నాం. డిస్కౌంట్ల వల్ల లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు’ అని వెల్లడించారు. సంస్థకు 22 వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
ప్రపంచంలోని టాప్ 10 ఫ్యాషన్ బ్రాండ్లు
-
మీకు తెలిసిన బ్రాండ్ లోగో ఇక్కడ ఉందా? చూడండి!
-
సరికొత్త కలెక్షన్తో మీ పెదాలకు మరింత అందం
-
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
రిలయన్స్ స్నాక్స్ బిజినెస్.. భారత్లోకి అమెరికన్ బ్రాండ్ చిప్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్ కన్జూమర్ ఫుడ్స్ తయారీ సంస్థ జనరల్ మిల్స్తో రిలయన్స్ రిటైల్ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్ బ్యూగుల్స్ బ్రాండ్ కార్న్ చిప్స్ స్నాక్స్ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ రిటైల్లో భాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, (ఆర్సీపీఎల్) తెలిపింది. ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్లో గణనీయ మార్కెట్ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్సీపీఎల్ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్కిక్, టాఫీమ్యాన్ తదితర బ్రాండ్స్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు -
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్ట్యాగ్తో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్లో కూడా నటించింది. -
స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ:తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో తీరని దుఃఖాన్ని, సంక్షోభాన్ని మిగిల్చింది. కానీ కొంతమందిలో మాత్రం వినూత్న ఆలోచనలకు పునాది వేసింది. అలా లాక్డౌన్లో లాక్ అయిన ఒక కొత్త జంట సరికొత్త ఆలోనచలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. అతికొద్ది సమయంలోనే కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇదే రియా అండ్ రౌనక్ సక్సెస్ స్టోరీ. రియా నిహాల్ సింగ్, రౌనక్ సింగ్ ఆనంద్ వివాహ బంధంలోకి అలా అడుగు పెట్టారో లేదో 2020లో దేశం కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ మొదలైంది. దీంతో కొత్త జంట ఇంటికే పరిమితం కావడంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారి ఆశయానికి బ్రేక్ పడింది. కానీ బిజినెస్ చేయాలన్న ఆలోచన వారిని ఊరికే ఉండనీయ లేదు. ఫిట్నెస్ ఔత్సాహికులైన ఇద్దరూ హోమ్ జిమ్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ తాము కాలేజీ రోజుల్లో అమెరికాలో ఉపయోగించిన స్మార్ట్ ఫిట్నెస్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో లేవు. మరోవైపు పెద్దగా నాణ్యతలేని ఉత్పత్తులను కొనుగోలు చేయడమా, లేదంటే లక్షల రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకోవడమా అనే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపించడంతో మీమాంసలో పడి పోయారు. ఈ క్రమంలో మార్కెట్లో తమలాంటి చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని గ్రహించారు. అప్పటికే తండ్రి ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థకు బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రౌనక్, మార్కెట్ డిమాండ్నుచూసి, తన సొంతహోమ్ ఫిట్నెస్ పరికరాల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అలా భార్యతో కలిసి డైరెక్ట్-టు-కస్టమర్ బ్రాండ్ ఫ్లెక్స్నెస్ట్ ని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా ఇంటర్నెట్లో నాణ్యమైన ఫిట్నెస్ పరికరాలను విక్రయిస్తూ పాపులర్ అవ్వడమే కాదు. కేవలం మూడేళ్లలో ఒక బ్రాండ్ నేమ్ను తీసుకొచ్చారు. 2021లో ఫ్లెక్స్నెస్ట్ను ఆవిష్కృతమైంది. యోగా మ్యాట్లు,ఎడ్జస్టబుల్ డంబెల్లతో ప్రారంభమై ఆ తరువాత తొలి బ్లూటూత్ కనెక్టెడ్ ఎక్సర్సైజ్ స్పిన్ బైక్, ఫ్లెక్స్నెస్ట్ రోవర్స్ ట్రెడ్మిల్స్ను పరిచయం చేశారు.అలా ఏడాదిన్నరలో వారి పోర్ట్ఫోలియోలో దాదాపు 12 ఉత్పత్తులను జోడించారు. గుర్గావ్లో కేవలం అయిదుగురి స్టాఫ్తో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే కంపెనీ రూ.37.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) 2022 జనవరిలోనే వారి ఆదాయం రికార్డు ఆదాయం రూ.3.83 కోట్లను సాధించారు. హోమ్ వర్కౌట్ జిమ్ ఉత్పత్తులతో టాప్లో నిలిచింది. ఇపుడిక రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఈ జంట ఆశిస్తోంది. వీరి ఉత్పత్తుల్లో దాదాపు సగం టైర్ 1 నగరాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రధానం జర్మనీ, చైనా, తైవాన్ల ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ సేల్స్లో 70 శాతం వెబ్సైట్, 30శాతం ఇతర ఆన్లైన్ మార్కెట్ప్లేస్ల నుండే జరుగుతాయి. 70వేలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న కంపెనీ, యాప్ ద్వారా వర్చువల్ శిక్షణ తరగతులను అందిస్తారు. (జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ) ఫిట్నెస్ బ్రాండ్ ఫ్లెక్స్ నెస్ట్ FlexDubs లాంచ్తో ఆడియో మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జర్మనీలో తయారైన AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెన్స్ బ్లూటూత్ ఇయర్ఫోన్లు లాంచ్ చేసింది. అమెరికాలో పరిచయం, ప్రేమ రియా నిహాల్ సింగ్ ఎమోరీ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్ పట్టా, జార్జియా విశ్వవిద్యాలయం నుంచి థియేటర్ స్టడీస్ (2012-2016)లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. పాఠశాల విద్యను ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్ నుండి పూర్తి చేసింది. వ్యాపారవేత్త కావడానికి ముందు, రియా ఎన్డీటీవీలోనూ, పబ్లిక్ రిలేషన్స్ విభాగంలోనూ పనిచేసింది. రౌనక్ బర్కిలీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ , డ్యూక్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్లో పీజీ చేశారు. 2015లో కాలేజీలో చదువుతున్నప్పుడు అమెరికాలో పప్రేమలో పడిన ఈ లవ్బర్డ్స్ 2020 జనవరిలో వివాహం చేసుకున్నారు. రౌనక్ తండ్రి కార్ కాంపోనెంట్ తయారీ కంపెనీ యజమాని. రియా కూడా ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి గుర్మీత్ నిహాల్ సింగ్ బట్టల ఎగుమతిదారు. అలా ఇద్దిరిదీ వ్యాపార కుటుంబాల నేపథ్యం కావడంతో ఈ జంటకు మరింత కలిసి వచ్చింది. -
బిజినెస్లో స్పీడ్ పెంచిన అలియా భట్!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్లోనూ స్పీడ్ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు. దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్లో అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్లైన్ మోడల్కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్యన్ ఖాన్.. బన్గయా బిజినెస్మేన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్గా మారింది. టీజర్లో షారుక్ ఎంట్రీ సూపర్! ఇందులో ఆర్యన్ ఖాన్తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్తో సింపుల్గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్లా? జుకర్బర్గ్ను నిలదీసిన ఉద్యోగులు ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ల పనుల్లో సోదరి సుహానా ఖాన్తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) -
బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ మెగా హీరో రామ్చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం గురించి ఉపాసన గత ఏడాది డిసెంబరులో ప్రకటించి నప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టయిల్స్తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సన్నిహితులు, ఫ్రెండ్స్తో సమక్షంలో ఘనంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్గా మారాయి. రామ్చరణ్, ఉపాసన స్నేహితులు, స్మితారెడ్డి, సరిన్ కట్టా త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్ను నిర్వహించారు. ఈ బేబీ షవర్కి అల్లు అర్జున్, సానియా మీర్జా, కనికా కపూర్ , వారి ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం, ఉపాసన గులాబీ రంగు గౌన్లో, తన బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధరే ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాసన కామినేని పింక్ డ్రెస్ రూ. 90 వేలు ఉపాసన కామినేని యొక్క పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్లో అందంగా ముస్తాబయ్యారు. డీప్ వీనెక్తో ,షార్ట్ స్లీవ్స్తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన కరెన్సీలో (టాక్స్లు అన్ని కలిపి) అక్షరాలా రూ. 90,471. ఏప్రిల్ 19, 2023న త్వరలో కాబోతున్న మమ్మీ ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక కోసం, ఉపాసన జపనీస్ బ్రాండ్ ఇస్సీ మియాకే నుండి బ్లూ కలర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్లో అలరించింది. ప్లీటెడ్ హాఫ్-స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్, ఫ్లేర్ ప్లీట్స్, సైడ్ గస్సెట్, ఫ్లేర్డ్ షేప్ హై నెక్ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో, ట్యూనిక్ ధర 430 డాలర్లు అంటే రూ. 35,352 అన్నమాట. వైట్ ఫ్లవర్ డ్రెస్ 1.12 లక్షలు ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి కాబోయే మమ్మీ ఉపాసన గ్లామరస్ ప్రెగ్నెన్సీ స్టైల్లో తన ఫ్యాన్స్ను కట్టిపడేస్తున్నారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి తెల్లటి-రంగు పూల డ్రెస్లో బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మెర్మాన్కు చెందినది. దీని ధర సుమారు రూ. 1,11,651. -
బ్రాండ్ ఇన్ఫ్లూయెన్సర్గా కోహ్లీ.. ఇక దూసుకెళ్లనున్న హెచ్ఎస్బీసీ బ్యాంక్
హైదరాబాద్: హెచ్ఎస్బీసీ ఇండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని తన బ్రాండ్ ఇన్ఫ్లూయెన్సర్గా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసింది. విరాట్ కోహ్లీతో మీడియా ప్రచారాన్ని నిర్వహించడం వల్ల హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సేవలకు విలువ తోడవుతుందని పేర్కొంది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఆర్థిక సేవల సంస్థతో భాగస్వామ్యం కావడం పట్ల విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా గత ఫిబ్రవరిలో హెచ్ఎస్బీసీ భారతదేశంలో కార్యకలాపాల నుంచి ప్రీ ట్యాక్స్ ఫ్రాఫిట్లో 15.04 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 సంవత్సరానికి అది 1.277 బిలియన్ డాలర్లు. ఆ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎస్బీసీ ఉద్యోగుల సంఖ్య 1,000 పెరిగి మొత్తంగా 39,000కి చేరుకుంది. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
Alia Bhatt రూ.150 కోట్ల బ్రాండ్, లగ్జరీ కార్లు, నెట్వర్త్, తొలి సంపాదన తెలుసా?
సాక్షి,ముంబై: స్టార్ హీరోయిన్ అలియా భట్ పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయంతో సినిమా రంగంలో మాత్రమేకాదు అటు భారీ పెట్టుబడిదారుగా ఒక సంస్థకు కో ఫౌండర్గా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్గా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తోంది గంగూభాయి. ఈ కంపెనీ స్థాపించిన ఏడాదికే రూ.150 కోట్లకు స్థాయికి చేరుకుంది. అలియా భట్ మార్చి 15న 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. అద్బుతమైన నటనతో స్టార్ హీరోయిన్గా ప్రశంస లందుకుంటున్న ఈ అమ్మడు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. గర్భవతిగా ఉన్నప్పుడు భట్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma )లాంచ్ చేసింది. ఈ కంపెనీ వెబ్సైట్లో 800పైగా ప్రొడక్ట్స్తో 2-14 సంవత్సరాల వయస్సు పిల్లల బట్టలు విక్రయిస్తుంది. 12 నెలల్లోనే ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధితో రూ.150 కోట్ల వాల్యుయేషన్ను సాధించడం విశేషం. బిజినెస్ గురించి ఇంకా నేర్చుకుంటున్నా: అలియా బిజినెస్ గురించి తానింకా నేర్చుకుంటున్నా అని, కేవలం ఏడాది వ్యవధిలో సంస్థ సాధించిన ఘనత గర్వకారణమని అలియా భట్ ఆనందాన్ని ప్రకటించింది. చిన్న కలగా మొదలై ఇప్పుడు 150 కోట్ల వ్యాపారంగా మారుతోందని, తాను కంపెనీపై కాకుండా వ్యక్తులు ఆలోచనలపైనే పెట్టుబడి పెడతానని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ కంపెనీ కోటి రూపాయలను సాధించింది. మరోవైపు గత నెలలో కో-ఫౌండర్గా అలియాను ప్రకటించడం విశేషం. దీంతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ను కూడా లాంచ్ చేసేంది అలియా. ప్రస్తుతం అలియా భట్ నికర విలువ రూ.299 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం, ఆమె 2017లో రూ. 39.88 కోట్లు సంపాదించింది; 2018లో ఇది రూ. 58.83 కోట్లకు పెరగింది. 2019లో ఆమె రూ. 59.21 కోట్లు సంపాదించింది. కాగా సినిమాల్లో ఒక్కో పాత్రకు 20 కోట్లు తీసుకుంటుందని సమాచారం. చిన్నతనంలో తన తండ్రి మహేష్ భట్ పాదాలకు క్రీమ్ రాసేందుకు రూ.500 సంపాదించేదట. అదే తన తొలి సంపాదన అని అలియా చెప్పుకుంటుంది. అలియా భట్ ఇల్లు, కార్లు అలియా భట్కు రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నట్టు సమాచారం. అలాగే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ6, ఆడి క్యూ7తో పాటు మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ వంటి అనేక కార్లు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె అలియా. 2022 ఏప్రిల్ 14న హీరో రణబీర్ కపూర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 నవంబర్ 6న పాప రాహాకు జన్మనిచ్చింది. ఇక సినిమా కరియర్ విషయానికి వస్తే 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలియా, హైవే, ఉడతా పంజాబ్, రాజీ, గల్లి బాయ్ బాలీవుడ్లో పలు విజయవంతమైన మూవీస్లో నటించింది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ గంగూబాయికతియావాడి చిత్రంలోని నటనతో ఆకట్టుకుంది. అలాగే తెలుగులో సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. -
గన్ షాట్ ప్రోమో : తేల్చేద్దాం ...గన్ షాట్గా...!
-
లెజెండరీ బ్రాండ్గా జీఆర్టీ
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వరుసగా ఎనిమిదవసారి ప్రతిష్టాత్మక ‘లెజెండరీ బ్రాండ్’ అవార్డును దక్కించుకున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. వినియోగదారులు సంస్థ పట్ల చూపెడుతున్న విశ్వాసమే తమకు ఈ అవార్డును తెచ్చిపెట్టిందని ప్రకటన వివరించింది. జీఎస్టీ తమిళనాడులో వరుసగా ఎనిమిదవసారి, కర్ణాటకసహా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 4వ సారి టైమ్స్ ఆఫ్ ఇండియా-బిజినెస్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించినట్లు పేర్కొంది. ఐదు దశాబ్దాలపాటు వినియోగదారులకు విశ్వసనీయ, అత్యుత్తమ సేవలు అందించడం సంస్థ పురోగతికి దోహదపడుతున్న అంశమని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. తాము సరైన మార్గంలో పయనిస్తున్నామన్న అంశాన్ని ‘వరుస లెజెండరీ అవార్డు’ నిరూపిస్తోందని మరో ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ అన్నారు. -
పతంజలి పేరు ఇకపై వాడొద్దు! బాబా రాందేవ్పై ఫైర్
లక్నో: పతంజలి బ్రాండ్ పేరిట పలు విక్రయాలు చేపడుతున్న బాబా రామ్దేవ్, ఆ కంపెనీ ఎండీ బాలకృష్ణన్పై మండిపడ్డారు బీజేపీ నేత ఒకరు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలను నిర్వహించొద్దని గురువారం డిమాండ్ చేశారు. పేరు మార్చకుంటే ఉద్యమం చేపడతానని హెచ్చరించారు ఆ బీజేపీ నేత. యూపీ కైసర్గంజ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. రామ్దేవ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్ గ్రామ పంచాయతీలో జరిగిన ఓ కార్యక్రమంలో గురువారం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ.. పతంజలి బ్రాండ్పై మండిపడ్డారు. యోగా పితామహుడైన మహర్షి పతంజలి లాంటి వ్యక్తి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్దేవ్.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ‘‘వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, చివరకు.. లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. రామ్దేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆ మహానుభావుడి స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. బ్రిజ్ భూషణ్ ఇలా తన ప్రకటనలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. ఇదీ చదవండి: సచిన్ పైలట్పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు -
పొలిటికల్ కారిడార్ : విశాఖ ఇమేజ్ దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు
-
రిలయన్స్ స్పెషల్ ప్రొడక్ట్స్, బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ ఆల్రౌండర్
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ కామర్స్ ప్లాట్ఫామ్ అజియో మంగళవారం అథ్లెయిజర్ బ్రాండ్ ‘‘ఎక్సెలరేట్’’ను ఆవిష్కరించింది. భారత క్రికెట్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్రాండ్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. క్రీడలు, ఫిట్నెస్ ఔత్సాహికులకు అవసరమయ్యే స్పోర్ట్ షూస్, అథ్లెటిక్, లైఫ్స్టైల్ పాదరక్షలు, ట్రాక్ ప్యాంట్, టీ-షర్టులతో పాటు ఇతర ఉపకరణాలు ఇందులో లభిస్తాయి. ఈ సరికొత్త ఉత్పత్తులు అజియో బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. రూ.699 ప్రారంభ ధరతో గొప్ప ఆఫర్లు పొందవచ్చు. ఎక్స్లరేట్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై హార్ధిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. ‘డోంట్ బ్రేక్, ఎక్సెలరేట్’ అనే ట్యాగ్లైన్తో పాండ్యా ప్రచారం కల్పిస్తూ బ్రాండ్ను ప్రజలకు మరింత చేరువ చేస్తారని రిలయన్స్ రిటైల్ సీఈవో అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. -
బిలియన్ డాలర్ బ్రాండ్గా స్ప్రైట్
న్యూఢిల్లీ: నిమ్మ రసం రుచిని తలపించే సాఫ్ట్డ్రింక్ స్ప్రైట్.. భారత మార్కెట్లో బిలియన్ డాలరు (దాదాపు రూ. 8,300 కోట్లు) బ్రాండుగా ఎదిగింది. బ్రాండ్ మాతృ సంస్థ కోక–కోలా కంపెనీ చైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయం వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమార్ధంలో కోక–కోలా మార్కెట్ షేరును పెంచుకోవడం కొనసాగిందని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు, సందర్భాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలతో స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండుగా మారిందని క్విన్సీ వివరించారు. కోక–కోలాకు అంతర్జాతీయంగా భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్. దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ 2021లో బిలియన్ డాలర్ బ్రాండ్గా చేరిందని ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
హెచ్సీఎల్ టెక్ కొత్త లోగో
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ నూతన లోగోను, బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్’ అంటూ లోగో పక్కన క్యాప్షన్ను పెట్టింది. లోగోలో రాకెట్ సింబల్ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
సేల్స్ బీభత్సం, 700 శాతం వృద్ధి..ఏ స్మార్ట్ఫోన్ బ్రాండ్ తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘ఐక్యూ’ జూన్తో ముగిసిన త్రైమాసికంలో.. భారత్లో వేగంగా వృద్ధి సాధిస్తున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ ‘స్మార్ట్ఫోన్ మోడల్ ట్రాకర్’ నివేదికను ప్రకటించింది. జూన్ క్వార్టర్లో ఐక్యూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాల్లో 700 శాతం వృద్ధిని చూపించింది. అంతేకాదు మార్చి త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూసినా ఐక్యూ జూన్ క్వార్టర్లో 135 శాతం వృద్ధిని చూపించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
సోషల్ మీడియా ప్రమోషన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వివిధ ఉత్పత్తులు, సేవల విషయమై వినియోగదారులను ప్రభావితం చేసేలా వ్యవహరించే వారికి (ప్రభావ శీలురు) కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఏదైనా ఉత్పత్తికి వారు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అయితే ఆ విషయాన్ని బయటకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయనుంది. ఏవి చేయాలి? ఏవి చేయకూడదు? అనే వివరాలు కొత్త నిబంధనల్లో పొందుపరచనున్నట్టు అధిక వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు వారాల్లో వీటిని విడుదల చేయవచ్చని పేర్కొన్నాయి. ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసే వారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ అంశాలపై వీరు పోస్ట్లు పెట్టడంతోపాటు వీడియోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకుని అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం యూజర్లలో కొద్ది మందికే తెలుసు. తాము చూసే వీడియో ఫలానా బ్రాండ్కు ప్రమోషన్ అని యూజర్లకు తెలిసేలా చేసి, లాభ, నష్టాలపై అవగాహన కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్ట్లు, వీడియోల్లో ఫలానా బ్రాండ్కు ఇది పెయిడ్ ప్రమోషన్ అని ముందే వెల్లడించాలని కొత్త నిబంధనలు నిర్ధేశించనున్నాయి. -
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్లు, డ్రస్సింగ్ సెన్స్కు ఫిదా అయిన నెటిజన్లు లైక్లు కొడుతూ కామెంట్స్తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
భారత మార్కెట్ను వదిలి వెళ్లేది లేదు
ముంబై: భారత మార్కెట్ నుంచి వెళ్లేది లేదని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ స్పష్టం చేసింది. బదులుగా తమ బ్రాండ్ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని ప్రకటించింది. భారత మార్కెట్ను వీడిపోవడాన్ని అవివేకంగా సంస్థ భారత ప్రెసిడెంట్ అవినాష్ సత్వలేకర్ అభివర్ణించారు. ఇతర విదేశీ సంస్థల మాదిరే ఫ్రాంక్లిన్ టెంపుల్ సైతం భారత మార్కెట్ నుంచి వెళ్లిపోవచ్చంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో, అటువంటిదేమీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 26 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 20 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.56,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్నట్టు గుర్తు చేశారు. తమ కార్యకలాపాలు పూర్తిగా లాభదాయకంగా ఉన్నట్టు చెప్పారు. సంక్షోభం ఎదుర్కొంటున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా హెడ్గా సత్వలేకర్ మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. పంపిణీదారులు, ఉద్యోగులతో మమేకమై, ఇన్వెస్టర్లను చేరుకోనున్నట్టు చెప్పారు. 2020 మార్కెట్ల క్రాష్ సమయంలో రూ.25,000 కోట్ల ఆస్తులతో కూడిన ఆరు డెట్ పథకాలను మూసేస్తూ ఈ సంస్థ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో సెబీ జరిమానా విధించడంతోపాటు, కొత్త డెట్ పథకాల ఆవిష్కరణపై నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఈ సంస్థ శాట్లో సవాలు చేసింది. -
జీవితానికి రంగులద్దింది!
జీవితాన్ని ప్రారంభించేటప్పుడు తెలియదు ఆ జీవితం ఎన్ని మలుపులు తీసుకుంటుందో. మన ఆకాంక్షలు కొన్ని, అవకాశాలు కొన్ని, అభిరుచులు మరికొన్ని. వీటన్నింటినీ కలబోసుకుని జీవితాన్ని డిజైన్ చేసుకోవాలని ఉండడం ఏ మాత్రం తప్పులేదు. అది మనిషి హక్కు కూడా. అయితే అక్కడే మనిషి ముందు అనారోగ్యం రూపంలో ఓ ప్రశ్నార్థకం నిలబడుతుంది. ఆ సవాల్కు దీటైన సమాధానాన్ని విసిరి లైఫ్ని కలర్ఫుల్గా మలుచుకుంది ప్రకృతి గుప్తా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రకృతి గుప్తా ఉన్నతవిద్య కోసం కెనడాకి వెళ్లింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి క్రిజ్లర్ ఫైనాన్సియల్ కంపెనీలో ఉద్యోగం, కొంతకాలానికి మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత పెళ్లితో ఆమె వర్క్ ప్లేస్ దుబాయ్కి మారింది. అక్కడ ఫియట్ క్రిజ్లర్ గ్రూప్తో పని చేసింది. ఇక్కడి వరకు జీవితంలో ప్రతి సోపానమూ ఆనందకరమే. అప్పుడు మొదలైంది అనారోగ్యం రూపంలో ఓ పరీక్ష. అనేక పరీక్షల తర్వాత నిర్ధారణ అయిన విషయం హాడ్గ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ అని. జీవితం మీద ఆశలన్నీ ఆవిరైపోయే పరిస్థితి అది. క్యాన్సర్ను జయించాలంటే ట్రీట్మెంట్ కంటే ప్రధానమైనది మానసిక స్థయిర్యం. జయించగలననే ధీమాతో పోరాడినప్పుడే దేహం ట్రీట్మెంట్కు సహకరిస్తుంది. ప్రకృతి తన జీవితం మీద సడలని విశ్వాసంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆలోచించింది. ‘ఈ విరామానికీ ఓ అర్థం ఉండి ఉంటుంది’ అని గట్టిగా నమ్మింది కూడా. చిన్నప్పుడు కలగన్న భవిష్యత్తు కళ్లముందు మెదలసాగింది. నాన్న స్వీట్ వ్యాపారి ‘‘నాన్న హైదరాబాద్లో స్వీట్స్ వ్యాపారి. స్వీట్స్ వ్యాపారి మాత్రమే కాదు, చాలా స్వీట్ వ్యాపారి కూడా! ఉద్యోగుల విషయంలో ఆయన చాలా బాధ్యతగా ఉండేవారు. నాన్నే నాకు రోల్మోడల్. నాన్నలా ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఉండేది. అయితే బిజినెస్లో చాలెంజెస్ ఎక్కువ. ఉద్యోగమే హాయి అని నన్ను సౌకర్యవంతంగా ఉంచడానికే నిర్ణయించుకున్నారు మా వాళ్లు. నేనూ అదేబాటలో నడిచాను. కానీ ఈ విరామం నాలోకి నేను ప్రయాణించడానికి దోహదం చేసింది. కీమోథెరపీ కోసం మూడు నెలలు, రేడియేషన్ థెరపీ కోసం మరో రెండు నెలలు హాస్పిటల్లో నాలుగ్గోడల మధ్యనే గడిపాను. ఎటు చూసినా రంగు వెలసిన జీవితంలా తెల్లటి గోడలు. ‘నా జీవితానికి నేనే రంగులద్దాలి. నా జీవితాన్ని నేనే రీ డిజైన్ చేసుకోవాలి’ అని నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చినదే కఫ్తాన్ కంపెనీ. ఇది నా విజయం ‘‘కఫ్తాన్లో నాతోపాటు యాభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో ముప్పై ఐదు మంది మహిళలే. సాధారణంగా ఇలాంటి చిన్న కంపెనీలలో వర్కింగ్ సెక్షన్లో మహిళలు, పర్యవేక్షణ విభాగంలో మగవాళ్లు కనిపిస్తుంటారు. కానీ నా కంపెనీలో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్వైజర్ వంటి కీలక స్థానాల్లో మహిళలే ఉన్నారు. దీనిని 2011లో స్థాపించాను. దాదాపుగా కంపెనీ తొలినాళ్ల నుంచి కొనసాగుతున్న వాళ్లు ఉన్నారు. కఫ్తాన్తో పాటు నాన్న స్థాపించిన ‘క్రాక్ హీల్’ ఆయింట్మెంట్ కంపెనీ కూడా నేనే చూసుకుంటున్నాను. దానిని మా నాన్న సక్సెస్ చేసి నా చేతికిచ్చారు. దానిని నడిపించడంలో పెద్ద కిక్ ఉండదు. ఇది నా బ్రెయిన్ చైల్డ్. దీనిని విజయపథంలో నడిపించడం నా చాలెంజ్. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది’’ అని వివరించింది ప్రకృతి గుప్తా. – వాకా మంజులారెడ్డి కఫ్తాన్... అంటే వదులుగా ఉండే చొక్కా. ఇది పర్షియా పదం. టర్కీ, ఫ్రాన్స్లో కూడా వాడుకలో ఉంది. మధ్యధరా ప్రాంతంలో నివసించే వాళ్లు ధరిస్తారు. మన దగ్గర నైట్డ్రస్గా వాడుకలో ఉన్న మోడల్ని సరికొత్తగా పగలు ధరించే మోడల్గా మార్చాను. మనం ధరించిన దుస్తుల విషయంలో దేహం ఎటువంటి ఆంక్షలనూ పెట్టకూడదు. ఒంటికి తగలగానే హాయిగా ఫీలవ్వాలి. అదే సౌకర్యాన్ని రోజంతా ఉంచగలగాలి. ధరించిన డ్రస్ను రోజంతా ఒంటి మీద ఉంచుకోగలగాలి... అనే ఆలోచనకు ప్రతిరూపమే ఈ లాంజ్వేర్. అలాంటి మెటీరియల్ను ఎంపిక చేయడం, ఆకర్షణీయమైన డిజైన్లకు రూపకల్పన చేయడమే నా సక్సెస్. ఇక వాటికి మరిన్ని సొబగుల కోసం దేశంలో రకరకాల అద్దకాలు, రకరకాల సంప్రదాయ డిజైన్లను ఎంచుకున్నాను. నేను అనుకున్న థీమ్తో పని చేస్తున్న వాళ్లు మార్కెట్లో పెద్దగా లేరు. ఇక ఆలస్యం చేయలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే వస్త్రాల తయారీ మొదలుపెట్టాను’’ అని తన జీవితానికి హైదరాబాద్లో కొత్త గమ్యాన్ని నిర్దేశించుకున్న వైనాన్ని వివరించింది ప్రకృతి. -
అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లినే టాప్
ముంబై: భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీ– 2021గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందేడాదితో పోలిస్తే కోహ్లీ సంపద తగ్గినా సెలబ్రిటీలందరితో పోలిస్తే బ్రాండ్ విలువ పరంగా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లుండగా, 2021లో 18.57 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,400 కోట్లు) పరిమితమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్ తెలిపింది. వరుసగా ఐదేళ్లుగా ఈ జాబితాలో కోహ్లీనే టాప్లో ఉంటున్నారు. కోహ్లీ తర్వాత స్థానాన్ని 15.83 కోట్ల డాలర్లతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆక్రమించారు. రణ్వీర్ తర్వాత 13.96 కోట్ల డాలర్లతో హిందీ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. ఒలింపిక్ విజేత పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది.. క్షమాపణలు చెప్పను: బైడెన్) -
ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరే బిజినెస్ బ్రాండ్గా!
Name Will be Business Brand: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రష్యా దాడులకు వెరవకుండా అగ్రరాజ్యం అమెరికా విమానం పంపిస్తాం మా దేశానికి వచ్చేయండంటూ ఆఫర్లు ఇచ్చినా స్వదేశం కోసం తుపాకీ చేతబట్టి అందరి దృష్టిలోనూ హీరో అయిపోయారు. ఇదే ఆయనకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. జెలెన్స్కీ ఫొటో, ‘ఐ నీడ్ అమ్యునిషన్, నాట్ ఏ రైడ్’అనే ఆయన మాటలున్న టీ షర్టులకు గిరాకీ పెరిగిపోయింది. అమెజాన్ వేదికగా ఈ టీషర్టులను 20 డాలర్లు(సుమారు రూ.1,500)కు జనం వేలం వెర్రిగా కొనుక్కుంటున్నారు. ఉక్రెయిన్కు మద్దతు తెలిపేందుకు, జనం జెలెన్స్కీ ఫొటోలున్న టీషర్టులను, చెవి రింగులు, జెండాలను కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. (చదవండి: రష్యాది ఉగ్రవాదం.. ఎవరూ మర్చిపోబోరు, క్షమించలేరు ) -
ఫ్యాషన్ అంటే ఇదీ.. వస్త్ర వ్యాపారంలోకి లోకనాయకుడు
Kamal Haasan to launch 'KH House of Khaddar' Business: నటనలో మేరునగధీరుడు కమల్హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. భారతీయ ఖద్దరుని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. కేహెచ్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్తో ఈ వస్త్రాలు మార్కెట్లోకి తేనున్నారు. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా రెడీ చేసిన ప్రోమోను ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. కమల్తో గుర్తింపు కమల్హాసన్ ఖద్దరు దుస్తుల వ్యాపారంలోకి రావడం వల్ల ఖద్దరుకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని. తద్వారా చేనేత కార్మికులకు మేలు జరుగుతుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఎఫెక్ట్ ప్రస్తుతం కమల్హాసన్ విక్రమ్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఇండియన్ 2 చిత్రానికి మన చిత్తూరుకి చెందిన అమృత కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖద్దరు దుస్తులకు డిమాండ్ ఎక్కువ. అమృత ద్వారా ఇండియన్ 2 చిత్రాల్లో ఖద్దరుతో కమల్కి అనుబంధం ఎక్కువైంది. ఎన్నికల హామీ మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంచీపురంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కమల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెస్ట్రన్ వరల్డ్కి ఖద్దరుని పరిచయం చేయాలని కమల్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కేహెచ్ బ్రాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఖద్దరు ఫ్యాషన్ ప్రస్తుతం ఖద్దరు దుస్తులంటే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువ ధరిస్తారనే ముద్ర పడిపోయింది. ఈ ట్రెండ్ని కమల్ బ్రేక్ చేసేలా ఉన్నారు. ఖద్దరుతో పూర్తిగా సూటుబూటులో జేమ్స్బాండ్ కనిపిస్తూ ప్రమోషన్ ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ యాడ్ చివర్లో ‘ఫ్యాషన్ ఈజ్ సివిల్, యేట్ డిస్ఒబీడియెంట్’ అంటూ మీసం మెలేశారు. ఇండియన్ యూత్ వెస్ట్రన్ మెన్ టార్గెట్గా ఆయన ఖద్దరు తేబోతున్నట్టు తెలుస్తోంది. Our weavers chance to loom large. Dear West, follow the thread it will reach you to our history. Bravo khaddar says KHHK !! https://t.co/qrxpSE72Yq#KHHouseofKhaddar #BravoKhaddar pic.twitter.com/jMSNv6jR3W — Kamal Haasan (@ikamalhaasan) November 16, 2021 చదవండి: ఆ నమ్మకమే.. ఆయన్ని ఈ వయసులోనూ ‘కింగ్’గా నిలబెట్టింది -
రూ.లక్షల కోట్లకు IPL బ్రాండ్ విలువ..?
-
బ్రిటీష్ వారి లీ కూపర్ బ్రాండ్.. ఇప్పుడీ భారతీయ కంపెనీ సొంతం..
Iconix Lifestyle India: బ్రిటిష్ బ్రాండ్ లీ కూపర్ మేధోసంపత్తి హక్కులను భారత్లో ఐకానిక్స్ లైఫ్స్టైల్ ఇండియా దక్కించుకుంది. లీ కూపర్ ఉత్పత్తుల పంపిణీని విస్తృతం చేయడంతోపాటు బ్రాండ్ స్థానాన్ని మరింత పదిలపరిచేందుకు ఐకానిక్స్కు ఈ డీల్ దోహదం చేయనుంది. రిలయన్స్, ఐకానిక్స్ బ్రాండ్ సంయుక్తంగా ఐకానిక్స్ లైఫ్స్టైల్ను ప్రమోట్ చేస్తున్నాయి. 1908 నుంచి స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ కంపెనీగా లీ కూపర్ బ్రాండ్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన డెనిమ్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. 126 దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. లేడీస్, జంట్స్, చిల్ట్రన్ ఇలా అన్ని కేటగిరిల్లో తమ ఉత్పత్తులను లీ కూపర్ అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ కంపెనీకి చెందిన మేథో హక్కులను ముఖేశ్ అంబానీ ఆధీనంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (ఆర్బీఎల్) సొంతం చేసుకుంది. దీంతో లీ కూపర్ బ్రాండ్ మరింతగా భారతీయులకు చేరువ కానుంది. గతంలో గతంలో టాటా గ్రూపు ల్యాండ్రోవర్, జాగ్వార్ వంటి విదేశీ కంపెనీనలు చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. తాజాగా రిలయన్స్ సంస్థ సైతం అంతర్జాతీయ బ్రాండ్లను సొంతం చేసుకునే పనిలో ఉంది. -
పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...!
ప్రపంచవ్యాప్తంగా ఈఏ స్పోర్ట్స్ పలు గేమింగ్స్ను అభివృద్ధి చేయడంలో ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ఈఏ స్పోర్ట్స్లో క్రికెట్, ఫుట్బాల్, నీడ్ ఫర్ స్పీడ్ వంటి గేమ్స్ భారీ ఆదరణను పొందాయి. కాగా ఈఏ స్పోర్ట్స్ గేమ్స్ను డెవలప్ చేసే సమయంలో ఆయా క్రీడాలకు సంబంధించిన సంస్థల పేర్లను వాడుకుంటాయి. సంస్థల పేర్లను వాడుకున్నందుకుగాను ఈఏ స్పోర్ట్స్ కొంత మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లిస్తుంది. తాజాగా ప్రముఖ గేమింగ్ దిగ్గజం ఈఏ స్పోర్ట్స్, ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా సంస్థలు మధ్య బ్రాండ్ లైసెన్సింగ్ విషయంలో అనిశ్చితి నెలకొంది. చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్యూవీ..! ఈఏ స్పోర్ట్స్లో ఫుట్బాల్ గేమ్ అత్యంత ఆదరణను పొందింది. ఫుట్బాల్ గేమ్కు ఫిఫా పేరును ఈఏ స్పోర్ట్స్ తన ఫుట్బాల్ గేమ్కు వాడుకుంటుంది. అందుకుగాను ఇప్పటికే ఈఏ స్పోర్ట్స్ ఫిఫా సంస్థకు సంవత్సరానికి సుమారు 150 మిలియన్(రూ .1130 కోట్లు) డాలర్లను చెల్లిస్తోంది. ఈఏ స్పోర్ట్స్, ఫిఫా మధ్య పదేళ్లపాటు ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. దీంతో ఫిఫా సమాఖ్య ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే రెట్టింపు డబ్బులను ఇవ్వాలని ఈఏ స్పోర్ట్స్కు షరతును పెట్టింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం...నాలుగు సంవత్సరాల కోసం సుమారు ఒక బిలియన్ (సుమారు రూ. 7,532 కోట్లు) పైగా ఫిఫా సమాఖ్య కోరుకుంటుంది. అంతేకాకుండా ఈఏ స్పోర్ట్స్ అదనపు రెవెన్యూ నుంచి అదనపు ఫీజును కూడా వసూలు చేయాలని ఫిఫా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. A new report in the @nytimes states that the dispute between EA and FIFA is related to cost and new revenue streams FIFA wants to charge EA double the amount ($1bn+ every 4 years) for the license and limit EA's ability to monetise beyond the game itselfhttps://t.co/5gNas9Iz9b pic.twitter.com/hZ9YnOZDMN — Daniel Ahmad (@ZhugeEX) October 13, 2021 చదవండి: సొంత బ్రాండ్లకే సెర్చ్లో టాప్ ప్రయారిటీ.. భారత్లో కాపీ ప్రొడక్ట్స్!? -
స్టార్ స్టయిల్: శ్రుతి హాసన్ ధరించిన చీర, జ్యూయెలరీ ధర ఎంతో తెలుసా?
‘ఆకాశం అమ్మాౖయెయితే, నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..’ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయే ఉంటుంది! మరి, అంతటి అందంతో పోటీపడేందుకు నిచ్చెన వేస్తున్న ఆ ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. దేవనాగ్రి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్తు ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. తర్వాత దేశమంతటా వివిధ పండుగలకు తగ్గ దుస్తులను డిజైన్ చేయటం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగ్రి’అనే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిశారు. స్పెషల్ అకేషన్స్కు సరిపోయే డిజైన్స్ రూపొందించడంలోనూ వీరు సిద్ధ హస్తులు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర.. బ్రాండ్: దేవనాగ్రి ధర: రూ. 34,000 అమ్రపాలి జ్యూయెలరీ నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘అమ్రపాలి’ పేరుతో మ్యూజియం స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘అమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా అమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: అమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర.. -
వాషింగ్పౌడర్ నిర్మా.. వెనుక పెను విషాదం
చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్భాయ్ పటేల్. సాక్షి, వెబ్డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటి వెనుక షెడ్డులో రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్శాఖలో ఉద్యోగిగా కర్సన్భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం. ఊహించని విషాదం ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిర్మాకు శ్రీకారం ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్భాయ్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. జింగిల్ మ్యాజిక్ ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్టైజ్మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్గా మారింది. కూతురిపై ప్రేమ నిర్మా అడ్వెర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్భాయ్కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది. నంబర్వన్ 2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది. విద్యారంగంలో నిర్మా నిర్మా బ్రాండ్ని దేశంలోనే నంబర్ వన్గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. 40 వేల కోట్లకు పైమాటే ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు. -
వాహ్.. తాజ్..!
న్యూఢిల్లీ: టాటాలకు చెందిన ‘తాజ్’ ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్ 50 2021’ పేరుతో బ్రాండ్ ఫైనాన్స్ ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కానీ ‘తాజ్’ హోటళ్లు బలంగా నిలబడినట్టు నివేదిక అభిప్రాయపడింది. టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) కింద తాజ్ హోటళ్లు నడుస్తుండడం గమనార్హం. 2016లో తాజ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తొలిసారి ఈ జాబితాలోకి ప్రవేశించడమే కాకుండా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘ఈ అంశాల ఆధారంగా చూస్తే తాజ్ బ్రాండ్ విలువ 296 మిలియన్ డాలర్లతో (రూ.2,200 కోట్లు) ప్రపంచంలో బలమైన హోటళ్ల బ్రాండ్గా నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్లో 100కు గాను 89.3 స్కోర్ను సంపాదించుకుంది. ఇది ఏఏఏ బ్రాండ్ రేటింగ్కు సమానం’’ అని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. తాజ్ తర్వాత ప్రీమియన్ ఇన్ రెండో స్థానంలో, మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ మూడో స్థానంలో, ఎన్హెచ్ హోటల్ గ్రూప్, షాంగ్రి లా హోటల్స్ తర్వాతి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. -
బ్రాండ్ మీది.. ప్రమోషన్ మాది
సాక్షి, హైదరాబాద్: వ్యాపారం, ప్రొడక్ట్స్, సంస్థలు, స్టార్టప్ కంపెనీలు, సరికొత్త డిజైన్స్ ఇలా ఏదైనా సరే మార్కెట్లో ఓ ‘బ్రాండ్ ’గా స్థిరపడాలనుకుంటాయి.. దానికి నాణ్యత, ట్రెండ్ని సెట్ చేసే లక్షణాలు ఉంటే సరిపోదు. అది జనాలకు చేరాలి.. మెరుగైన ప్రచారం కల్పించాలి. దానికి అనువైన మార్గం డిజిటల్ మార్కెటింగ్. అయితే ఒకప్పుడు నగరంలో బ్రాండ్ ప్రమోషన్కి బెంగళూర్, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన ఆన్లైన్ ప్రమోటర్స్ని ఆశ్రయించేవారు. ప్రస్తుతం నగరవాసులు కూడా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్లో రాణిస్తున్నారు. అందులో భాగంగా బ్రాండ్ ప్రమోషన్లో కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది ‘వీ ఆర్ వెరీ.ఇన్’.. టెక్నాలజీ పెరిగాక ప్రచార మాద్యమాలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. ప్రస్తుతం షాపింగ్ మొదలు చదువుల వరకు అన్నీ ఆన్లైన్ పరమయ్యాయి. కొత్త డిజైన్ వేర్స్ నుంచి వస్తువుల నాణ్యత వరకు ఆన్లైన్లోనే వెతుకుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, కొత్త స్టార్టప్లు, ఫ్యాషన్, విద్య, వైద్యం, వినోదం.. అందరూ బ్రాండ్ మార్కెటింగ్కి జై అంటున్నారు. దీని కోసం నగరంలో కొన్ని సంవత్సరాలుగా వేలకు పైగా ప్రమోటర్స్ పుట్టుకొచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వీరిదే హవా అంతా.. యాడ్స్, అడ్వర్టైజ్మెంట్, సోషల్మీడియా ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎన్నో మార్గాల ద్వారా బ్రాండ్లను పాపులర్ చేస్తుంటారు. ఈ రంగంలో రాణించాలంటే అన్ని రకాల సామాజిక, సాంకేతిక మూలాలపై అవగాహన, కాలానుగుణమైన హంగులను అలవర్చుకునే నేర్పు అతి ముఖ్యం. దీని ఆవశ్యకత తెలుసుకున్నాక నగరవాసులు కూడా ఈ మాద్యమంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీ ఆర్ క్రియేటివ్.. ఈ క్రమంలో నగరానికి చెందిన సాయి బత్తిన, చైతన్య కొదుమూరి అనే యువకులు వినూత్న ఆలోచనలతో ‘వి ఆర్ వెరీ.ఇన్’ బ్రాండింగ్ ప్రమోషన్ ప్రారంభించారు. మొదలుపెట్టిన అతితక్కువ కాలానికే మార్కెట్లో వీరి ఐడియాలజీకి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రమోషన్ విధానంలోని నూతన పంథా, ఈ–మెయిల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ తదితర సోషల్మీడియా యాప్స్లలో క్రియేటివ్ ప్రమోషన్స్తో బ్రాండ్గా మారాలనుకునే వారిని ఆకర్శిస్తున్నారు. ఇప్పటి వరకు లెనిన్ హౌస్, ఫ్లై యువర్ డ్రీమ్స్, నవ అగ్రీటెక్లాంటి వాటికి బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తూనే కొత్త స్టార్టప్లకు, పొలిటికల్, సెలబ్రిటీల పాపులారిటీ పెంచే ప్రమోషన్లకి, వెబ్ డిజైనింగ్కి పని చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, వ్యాపారం, హెల్త్ సర్వీసెస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, సామాజిక అవగాహన, ఫొటోగ్రఫీ, సామాజిక సేవ ఇలా విభిన్న రంగాలపై బ్రాండ్ ప్రమోషన్ చేయడం వీరి ప్రత్యేకత. కొత్త తరహాలో రాజకీయ నాయకులకు కూడా వ్యక్తిగత బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో సాయి బత్తిన, చైతన్య కొదుమూరితో పాటు మరికొందరు మిత్రులు 30 మంది ఫ్రీలాన్సర్లు పని చేస్తున్నారు. ‘సోషల్’ సేవ.. ‘విఆర్ వెరీ.ఇన్’ బ్రాండ్ ప్రమోషన్తో పాటు సామాజిక సేవనూ ప్రోత్సహిస్తున్నారు. ప్రాడక్ట్ సేల్స్పై వచ్చే నికర లాభంలో కొంత సామాజిక సేవకు కేటాయించేలా కంపెనీలను ఒప్పించి వారి నాణ్యత, మన్నిక తదితర అంశాలతో పాటు ఈ విషయానికి ప్రమోషన్స్లో ప్రాధాన్యం ఇవ్వడంతో సేల్స్ పెరగడమేకాకుండా సామాజిక సేవకూ వారధులుగా నిలుస్తున్నారు. ఓ ’చిరిగిన చొక్కానైనా వేసుకో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో‘ అనే నానుడి ఆధారంగా ’ఓ మంచి చొక్కా కొనుక్కో.. ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వు‘ అంటూ ఓ క్లాతింగ్ బ్రాండ్కి వినూత్నంగా ప్రమోషన్ చేశారు. ఆ బ్రాండ్ వస్త్రాల లాభం నుంచి నిరుపేద బాలలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. స్వతాహా వీరిరువురు మంచి రైటర్స్ కావడంతో విఆర్ వెరీ.ఇన్ పేజ్ ద్వారా సామాజిక అంశాలపై అవగాహన పెంచేలా ఆర్టికల్స్ షేర్ చేస్తుంటారు. మహిళల రక్షణ, ఆరోగ్యం, సామాజిక సమస్యలకు చెందిన అంశాలపై తమ ఆర్టికల్స్తో అవేర్నెస్ పెంచుతున్నారు. అంతేకాకుండా వీరి పేజ్కి ఎన్ని లైక్స్, షేర్స్ వస్తే అన్ని రూపాయలను నిరుపేద విద్యార్థుల చదువులకు సహాయంగా అందిస్తున్నారు. సినిమా కోసం వచ్చి.. నిజానికి సాయి బత్తిన, చైతన్య కొదుమూరి సినిమాపై ప్రేమతో వచ్చినవారే.. అక్కడే వీరి స్నేహం చిగురించింది. ఇంకా సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే షార్ట్ ఫిల్మ్లకు కూడా ఓ వేదిక ఉండాలని ప్రైమ్షో.ఇన్ ప్రారంభించారు. దీన్ని కూడా ఒటీటీ వేదికలా మార్చి షార్ట్ ఫిల్మ్కి ఆసరాగా నిలుస్తున్నారు. వీరికున్న సినిమా పరిచయాలను బ్రాండ్ ప్రమోషన్లో భాగం చేసి వీరి డిజిటల్ మార్కెటింగ్ను జనాలకు మరింత చేరువ చేస్తున్నారు. -
‘ఫెయిర్’ పోయి.. ‘గ్లో’ వచ్చింది..
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఆదరణ చూరగొన్న ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలగించింది. అందానికి సంబంధించి సానుకూల దృక్పథాన్ని దృష్టిలో తీసుకుని నూతన పేరును నిర్ణయించినట్టు వివరించింది. వచ్చే కొన్ని నెలల్లో గ్లో అండ్ లవ్లీ పేరుతో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని, భవిష్యత్తు ఆవిష్కరణలు సైతం ఈ దిశగానే ఉంటాయని పేర్కొంది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్ హ్యాండ్సమ్గా పిలవనున్నట్టు హెచ్యూఎల్ తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్యూఎల్ గత నెల 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్యూఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఎఫ్ఎంసీజీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్ కంపెనీ ఎల్ఓరియల్ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది. ఆగ్రహించిన ఇమామీ! హెచ్యూఎల్ తాజా చర్యలపై పోటీ సంస్థ ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పేరు తమ ఉత్పత్తి పేరును పోలి ఉండడంతో న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్టు ప్రకటన చేసింది. ‘‘షాక్కు గురైనప్పటికీ.. హెచ్యూఎల్ అనుచిత వ్యాపార విధానాల పట్ల ఆశ్చర్యమేమీ కలగలేదు. మా బ్రాండ్ ‘ఇమామీ గ్లో అండ్ హ్యాండ్సమ్’ను వారం క్రితమే డిజిటల్గా ఆవిష్కరించాం. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు కూడా చేసుకున్నాం’’ అని ఇమామీ తెలిపింది. ఇమామీ పురుషుల సౌందర్య సాధనం పేరు ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’గా ఇప్పటి వరకు మార్కెట్లో ఉంది. -
మాస్క్ల తయారీకి సిద్దమైన ప్రముఖ వస్త్ర కంపెనీ!
ముంబాయి: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్లు వాడటం అత్యవసరంగా మారింది. సైంటిఫిక్ పద్దతిలో చాలా కంపెనీ కరోనా వైరస్ను ఎదుర్కోనే విధంగా ఈ మాస్క్లను తయారు చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రముఖ బ్రాండ్ కంపెనీ తెవారో టెక్నాలజీ కంపెనీలు, ల్యాబరేటరీల సాయంలో హైజీన్, ఫ్యాషన్ కలగలిపిన మాస్క్లను తయారు చేస్తోంది. వైరల్ షీల్డ్ పేరుతో హైజీన్ మాస్క్లు, గ్లౌజ్లను తయారు చేస్తోంది. యాంటీ వైరస్ మాస్క్లను తయారుచేస్తున్న మొట్టమొదటి దుస్తుల కంపెనీగా తెవారో నిలిచింది. ఈ మాస్క్ రెండు కాటన్పొరలను కలిగి ఉండి, శ్వాస తీసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది కలగని మెత్తటి మెటీరియల్తో తయారుచేస్తున్నారు. ఈ మాస్క్లను ల్యాబ్లో పరీక్షించగా 99.99 శాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. అందరికి అందుబాటు ధరల్లో ఈ మాస్క్లను తీసుకువస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెజాన్తో పాటు కొన్ని మెడికల్ స్టోర్స్ ద్వారా ఈ మాస్క్లను అందుబాటులోకి తెచ్చెందుకు తెవారో ప్రయత్నిస్తోంది. (మాస్క్.. 3 పొరలుంటే భేష్) -
భారత్లో పాపులర్ బ్రాండ్లు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికీ అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజ కంపెనీలే భారతీయుల విశ్వాసాన్ని చూరగొంటున్నవి. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ ‘గూగుల్’ భారత్లో ఎక్కువ పాపులర్ అయిన బ్రాండ్. ఆ తర్వాత స్థానాల్లో వాట్సాప్, యూట్యూబ్లు కొనసాగుతున్నట్లు లండన్లోని మార్కెట్ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ ‘యూగౌ’ తెలిపింది. ‘బ్రాండ్ హెల్త్ ర్యాంకింగ్స్’ పేరిట పది సంస్థలకు ఇది రేటింగ్ ఇచ్చింది. వాటిలో స్విగ్గీకి ఐదవ ర్యాంక్, మేక్మైట్రిప్కు ఆరవ ర్యాంక్ లభించాయి. నాణ్యత, విలువ, సంతృప్తి, పేరు ప్రతిష్టలతోపాటు వినియోగదారులు ఇతరులకు వీటిని సిఫార్సు చేస్తారా? అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్లనూ యూగౌ కేటాయించింది. భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న ఇతర పాపులర్ బ్రాండుల్లో అమెజాన్కు నాలుగవ ర్యాంక్, ఉబర్కు ఏడవ ర్యాంక్, ఫేస్బుక్, ఓలా, జుమాటోలకు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదవ ర్యాంకులు లభించాయి. 2018, జూలై ఒకటవ తేదీ నుంచి 2019, జూన్ 30 వరకు ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బ్రాండ్లను కేటాయించారు. ప్రపంచ ర్యాంకుల్లో కూడా గూగుల్ మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా వాట్సాప్, యూట్యూబ్, శ్యామ్సంగ్, ఫేస్బుక్, అమెజాన్, ఐకియా, నైక్, పేపాల్, నెట్ఫిక్స్లు కొనసాగుతున్నాయి. భారత్లో 2018లోనే ఉబర్ఈట్స్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టాగ్రామ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, అమెజాన్ బ్రాండ్లు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినట్లు ‘యూగౌ’ సంస్థ తెలిపింది. -
అమ్మమ్మాస్ చపాతీ రూ. 7
హైదరాబాద్: రెడీ టు కుక్ ఫుడ్ విభాగంలోకి హైదరాబాద్కు చెందిన మంగమ్మ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎఫ్పిఎల్)ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్’ బ్రాండ్ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. రెడీ-టు-కుక్ విభాగంలో ఈ స్టార్టప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వేగంగా వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్ కో–ఫౌండర్ నాగసాయి విశ్వనాథ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రొడక్టులు ఏడు రోజులపాటు మన్నికగా ఉంటాయని వివరించారు. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రెడీ టు కుక్ ప్రొడక్టుల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటికే టెస్ట్ మార్కెట్లో 30,000 పైగా కుటుంబాలకు చేరువయ్యామని చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా రూ.2,500ల పెట్టుబడితో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయం చేపట్టవచ్చని వివరించారు. తాజా, అధిక పోషకాహార విలువ కలిగిన ఆహార పదార్థాలే తమ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. అమ్మమ్మాస్ బ్రాండ్ పేరుతో 'చపాతీ' (రాగి, మెంతీ, మల్టీ గ్రెయిన్,మోరింగ చపాతి) ' పరోటా '' లను వినియోగదారులకు అందించనుంది. ఒక్కో చపాతీ ధర రూ .7 గా విక్రయిస్తుంది. రోజుకు లక్ష చపాతీలు: మంగమ్మ ఫుడ్స్ ప్రస్తుతం హైదరాబాద్లోని కూకట్పల్లిలో రూ.25 లక్షలతో తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. రోజుకు 40,000 యూనిట్లు తయారు చేయగల సామర్థ్యం ఉందని కో–ఫౌండర్ ప్రతిమ విశ్వనాథ్ వెల్లడించారు. ‘2020 మార్చికల్లా దీనిని ఒక లక్ష యూనిట్ల స్థాయికి తీసుకు వెళతాం. జనవరి నాటికి రెడీ టు కుక్ కర్రీస్, రెడీ టు ఈట్ స్నాక్స్ విభాగంలోకి ప్రవేశిస్తాం. ప్రస్తుతం విక్రయిస్తున్న ప్యాక్ల ఖరీదు రకాన్నిబట్టి రూ.45–70 మధ్య ఉంది. ఒక్కో ప్యాక్లో 10 చపాతీలుఉంటాయ’ అని వివరించారు. శ్రామిక మహిళలు, సీనియర్ సిటిజన్లు తమ ఆహార అవసరాలకు, ఆరోగ్యకరమైన కానీ రడీ టూ కుక్ ఫుడ్, స్నాక్స్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ క్రమంలో వైవిధ్యంగా వారి ఆహార అవసరాలకు తోడ్పడటమే తమ లక్ష్యమని సహ వ్యవస్థకురాలు ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. కాగా నాగసాయి విశ్వనాథ్ ఘనాలోని టెలికాం సంస్థ గ్లోబాకామ్కు బిజినెస్ హెడ్గా పనిచేశారు. అలాగే కోకాకోలా, సాబ్-మిల్లెర్, మారికో ఇండస్ట్రీస్ , పార్లే బిస్కెట్స్ సహా వివిధ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. -
‘టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ను నియమించనున్నాం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ను నియమించనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకానిక్ స్టేడియం లాంటి నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో స్టేడియాన్ని నిర్మించాలని ఎమ్మెల్యేలు కోరినట్టు పేర్కొన్నారు. ఎన్సీసీని తెలంగాణ నుంచి విభజించాలని చూస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్సీసీ కెడెట్స్తో చేపడతామని వెల్లడించారు. పలు ప్రాంతాలను లీజుకు తీసుకున్న కొన్ని సంస్థలు లీజు డబ్బులను సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. అటువంటి సంస్థలకు లీజు డబ్బులు చెల్లించడం కోసం మూడు నెలల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో లీజులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కల్చరల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది పని తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సిటీ కో–బ్రాండ్తో పేటీఎం క్రెడిట్ కార్డ్
ఈ–కామర్స్ కంపెనీ పేటీఎం.. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టింది. ఈ కార్డ్ పరిమితి లక్ష రూపాయిలు కాగా, ప్రతి కొనుగోలుపై ఒక శాతం క్యాష్బ్యాక్, రూ.50,000 లావాదేవీలు దాటితే వార్షిక ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేటీఎం చైర్మన్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వివరించారు. సాధారణ వినియోగదారులకు వార్షిక ఫీజు రూ.500 వసూలు చేయనున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డుల సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పేటీఎంతో కలిసి సేవలందిస్తున్నట్లు సిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ స్టీఫెన్ బర్డ్ అన్నారు. -
కోహ్లి బ్రాండ్ @రూ.1200కోట్లు
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది దేశంలో ‘మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్’గా నిలిచాడు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ సలహాదారు సంస్థ ‘డఫ్ అండ్ ఫెల్ఫస్’ తాజా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ రూ.718 కోట్ల (102.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ (రూ.473 కోట్లు), రణ్వీర్ సింగ్ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. -
నకిలీ ఉత్పత్తులకు స్నాప్డీల్ చెక్..
న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ తాజాగా ‘బ్రాండ్ షీల్డ్’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్డీల్లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్ షీల్డ్ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్డీల్ తెలిపింది. -
భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న స్మార్ట్ఫోన్
ముంబై : స్మార్ట్ఫోన్ల యుగంలో రోజుకోక కొత్త ఫీచర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో నెలకొక స్టార్మ్ఫోన్ని లాంచ్ చేస్తోంది. వీటిలో కొన్ని హై బడ్జెట్ ఫోన్లు కాగా మరి కొన్ని మాత్రం సామాన్యులకు అందుబాటులో ఎక్కువ ఫీచర్స్తో.. తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్ఫోన్కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి. మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్ లెన్స్’ నిర్వహించిన సర్వేలో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్గా నిలిచింది. తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి. ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్ఫోన్తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్ స్మార్ట్ఫోన్ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్తోనే అడ్జస్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్ప్లస్ బ్రాండ్ను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఒప్పో, వివో, ఆపిల్, హనర్ వంటి హై బడ్జెట్ బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్ప్లస్ ముందు వరుసలో ఉంది. -
అత్యంత విలువైన బ్రాండ్గా మళ్లీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ముంబై: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా హెచ్డీఎఫ్సీ బ్యాంకు మళ్లీ నిలిచింది. బ్రాండ్జ్ ఇండి యా టాప్ 50లో తొలి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది దక్కించుకుంది. నివేదిక ప్రకారం.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాండ్ విలువ 21% వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఎల్ఐసీ 19.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ (15 బి. డాలర్లు) మూడో స్థానంలో, ఫ్లిప్ కార్ట్ (4.1 బి.డాలర్లు) 11, పేటీఎం (4.1 బి.డాలర్లు) 12, జీటీవీ (3.8 బి.డాలర్లు) 15వ స్థానంలో టాప్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. -
‘కాంప్లాన్’ బాయ్ ఎవరు?
క్రాఫ్ట్ హీన్జ్ సంస్థకు చెందిన కాంప్లాన్ బ్రాండ్ విక్రయం వేడెక్కుతోంది. దీని కొనుగోలు కోసం పోటీ పడుతున్న వారిలో దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలతో పాటు అగ్రశ్రేణి ప్రైవేటు ఈక్విటీ సంస్థలూ ఉన్నాయి. కాంప్లాన్తో పాటు గ్లూకోన్–డి, నైసిల్, సంప్రితి ఘీ బ్రాండ్లతో కూడిన కన్సూమర్ ఫుడ్ డివిజన్ను వంద కోట్ల డాలర్లకు విక్రయించాలనేది క్రాఫ్ట్ హెన్జ్ కంపెనీ ఆలోచన. ఈ విభాగం విక్రయ వ్యవహారాలను చూడటానికి జేపీ మోర్గాన్, లజార్డ్ సంస్థలను ఈ కంపెనీ నియమించింది కూడా. కాంప్లాన్ వంటివి బాగా పాతుకుపోయిన బ్రాండ్లు కావటంతో ఐటీసీ, ఇమామి, విప్రో, అబాట్, జైడస్ వెల్నెస్, క్యాడిలా వంటి కంపెనీలతో పాటు బ్లాక్స్టోన్, కార్లైల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వచ్చే నెల 15లోగా తమ తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీల బిడ్లు 70–80 కోట్ల డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. మరోవైపు గ్లాక్సో స్మిత్క్లైన్ కంపెనీ కూడా తన కన్సూమర్ హెల్త్కేర్ వ్యాపారాన్ని (దీంట్లో హార్లిక్స్ బ్రాండ్ కూడా ఉంది) విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. హార్లిక్స్ను అమ్మనున్నట్లు జీఎస్కే ప్రకటించిన కొద్ది రోజులకే క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కూడా కాంప్లాన్ బ్రాండ్ను అమ్మకానికి పెట్టడం విశేషం. కాంప్లాన్.. 8 శాతం మార్కెట్ వాటా! మూడేళ్ల కిందట 2015లో క్రాఫ్ట్ ఫుడ్స్, హీన్జ్ కంపెనీలు రెండూ విలీనమై క్రాప్ట్ హెన్జ్ సంస్థ ఏర్పడింది. ఈ కంపెనీ 13 విభిన్న రకాలైన బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తోంది. ఈ కంపెనీ కన్సూమర్ బిజినెస్ 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1,800 కోట్ల అమ్మకాలు సాధించింది. దీంట్లో ఒక్క కాంప్లాన్ వాటాయే 40 శాతంగా ఉంటుంది. ఈ కాంప్లాన్ బ్రాండ్ను 1994లో హీన్జ్ కంపెనీ గ్లాక్సో నుంచి కొనుగోలు చేసింది. మాల్టెడ్ ఫుడ్ డ్రింక్లో (ఎమ్ఎఫ్డీ) కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుంది. భారత్లో ఎమ్ఎఫ్డీ పరిశ్రమ రూ.8,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంట్లో 44.3 శాతం మార్కెట్ వాటాతో గ్లాక్సో కంపెనీకి చెందిన హార్లిక్స్దే అగ్రస్థానం. ఈ కంపెనీకే చెందిన బూస్ట్, మాల్టోవా కూడా మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. క్రాఫ్ట్ కంపెనీకి చెందిన బోర్నవిటా, నెస్లే మిలో తదితర బ్రాండ్లు కూడా మంచి అమ్మకాలే సాధిస్తున్నాయి. వైదొలుగుతున్న ఎమ్ఎన్సీలు... మాల్టెడ్ ఫుడ్ డ్రింక్ (ఎమ్ఎఫ్డీ) కేటగిరీ వృద్ధి ఆశించినంత జోరుగా లేకపోవటం, పోటీ తీవ్రత పెరుగుతుండటంతో ఈ రంగం నుంచి వైదొలగాలని బహుళ జాతి కంపెనీలు భావిస్తున్నాయి. మాల్ట్ బేస్డ్ డ్రింక్స్ విభాగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2014లో 13 శాతంగా ఉన్న ఈ పరిశ్రమ వృద్ది 2017లో 9 శాతానికే పరిమితమైంది. అయితే వాండర్ ఏజీ కంపెనీ ఓవల్టీన్, క్యాడిలాకు చెందిన ఆక్టిలైఫ్ వంటి సప్లిమెంట్ న్యూట్రిషన్ డ్రింక్స్ వీటికన్నా మంచి వృద్ధిని సాధించాయి. అలాగని ఈ డ్రింక్స్ వృద్ధి కూడా మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. ఈ డ్రింక్ల సెగ్మెంట్ వృద్ధి 2014లో 21.3 శాతంగా ఉండగా, 2017లో 11.5 శాతానికే పరిమితమయింది. 2017లో క్రాఫ్ట్ హీన్జ్కు న్యూట్రిషినల్ బేవరేజేస్ వ్యాపారంలో 5 కోట్ల డాలర్ల ఇంపెయిర్మెంట్ నష్టాలు (భవిష్యత్తు విలువ క్షీణించటం) వచ్చాయి. వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటం, ఇంపెయిర్మెంట్ నష్టాల వంటి కారణాల వల్ల క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కాంప్లాన్, ఇతర బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. కాగా బ్లాక్స్టోన్, కార్లైల్ వంటి పీఈ సంస్థలు కన్సూమర్ హెల్త్కేర్ థీమ్పై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు వదిలించుకోవాలనుకుంటున్న ఈ సెగ్మెంట్ బ్రాండ్ల కొనుగోలుకు ఇవి పోటీ పడుతూ బిడ్లు వేస్తున్నాయి. కాకపోతే అధికారికంగా మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు. ఆదాయ స్థాయిలు పెరుగుతుండటంతో వినియోగదారులు బ్రాండెడ్ ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో వచ్చే 20 ఏళ్లలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. కాంప్లాన్ కథ గ్లాక్సో కంపెనీ కాంప్లాన్ను పౌడర్ రూపంలో ఉన్న మిల్క్ ఎనర్జీ డ్రింక్గా 1954లో మార్కెట్లోకి తెచ్చింది. ఇంగ్లాండ్లో ఈ బ్రాండ్ను గ్లాక్సో కంపెనీ 1988లోనే వేరే కంపెనీకి అమ్మేసింది. భారత్లో మాత్రం 1994లో క్రాఫ్ట్ కంపెనీకి విక్రయించింది. మాల్టెట్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, క్రాఫ్ట్ అండ్ హెన్జ్ కంపెనీ ఐదవ అతి పెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ. కాప్రి సన్, క్లాసికో, జెల్–ఓ, కూల్–ఎయిడ్, లంచబుల్స్, మ్యాక్స్వెల్... ఇవి ఈ కంపెనీ పాపులర్ బ్రాండ్లలో కొన్ని. షికాగో, పిట్స్బర్గ్ కేంద్రాలుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో నియంత్రిత వాటాలు ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హతావే, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, 3జీ క్యాపిటల్కు ఉన్నాయి. -
ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: కల్తీలేని పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రోజు వారీ వినియోగించే బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కారం, సుగంధ ద్రవ్యాలు తదితర ఆహార ఉత్పత్తులను ఆ బ్రాండ్పై సరఫరా చేయనుంది. వాటిని విక్రయించేలా సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే పీపీపీ పద్ధతిలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ విధివిధానాలు, రోజువారీ కార్యక్రమాలపై సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రతిపాదనలు తయారుచేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికలో కార్పొరేషన్ లక్ష్యాలను, విధివిధానాలను వివరంగా తెలిపారు. ఆహార ఉత్పత్తులు, వాటి అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేపట్టాలని సమితి నిర్ణయించింది. వాటిని సొంత బ్రాండ్పై విక్రయించనుంది. అలాగే రైతులు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరరాని పక్షంలో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, మార్క్ఫెడ్, ఆగ్రోస్, ఆయిల్ఫెడ్ తదితర సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రైతు నుంచి వినియోగదారుని వరకు ఆహార ఉత్పత్తులు అందేలా గోదాములు, ప్యాకింగ్, కోల్డ్స్టోరేజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఆహార ఉత్పత్తులను సమీప రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. సమితుల ద్వారానే అమలు.. వ్యవసాయశాఖ చేపట్టే వివిధ పథకాల అమలంతా రైతు సమన్వయ సమితుల ద్వారానే జరగాలని ప్రతిపాదించారు. రైతుబంధు పథకం, రైతుబంధు బీమా పథకం, పంటల బీమా, రుణాలు, రైతు వేదికలుసహా ఇతర వ్యవసాయ పథకాలన్నింటినీ సమితి ద్వారా అమలుచేయాలనేది రైతు కార్పొరేషన్ ఉద్దేశం. ఈ కార్యక్రమాలపై విధానపరమైన నిర్ణయాలను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) తీసుకుంటారు. ఆ పోస్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించే కీలక బాధ్యతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగిస్తారు. అందుకోసం ఈడీ పోస్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ పోస్టునే ఈడీగా మార్చాలని కూడా భావిస్తున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును కూడా ఏర్పాటు చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈడీకి సహకరిస్తారు. రైతులు పండించిన పంటల సరఫరా డిమాండ్ను పరిశీలించాల్సిన బాధ్యత డిప్యూటీ జనరల్ మేనేజర్దే. ఎగుమతులు ఎక్కడికి చేయాలో నిర్ధారించాలి. రైతు కార్పొరేషన్కు వ్యవసాయాధికారులను నియమిస్తారు. అలాగే అకౌంట్ ఆఫీసర్ను నియమిస్తారు. -
హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి
సాక్షి,ముంబై: అత్యంతవిలువైన ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలిచిన ఐటీసీ హార్లిక్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. జీఎస్కేకు చెందిన హార్లిక్స్ బ్రాండును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అమ్మకానికి సరైన ధరను నిర్ణయింస్తే హార్లిక్స్ కొనుగోలు చేస్తామని ని ఐటీసీ ఎండీ సంజయ్ పురి చెప్పారు. ఐటీసీతో పాటు నెస్లే, డాబర్, మోండలేజ్, క్రాఫ్ హీంజ్, హిందుస్తాన్ యునిలీవర్ హార్లిక్స్ను కొనేందుకు పోటీలో ఉన్నాయి. మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ఉన్న హార్లిక్స్ దేశంలో మంచి ఆదరణనుపొందింది.నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీఎస్కే భారత అనుబంధ విభాగంలో హార్లిక్స్ కు 72.5 శాతం వాటా ఉండగా, దీన విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 3.1 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుదని అంచనా. -
విజయ్ దేవరకొండ.. రౌడీ బ్రాండ్
జూబ్లీహిల్స్: యువ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ’ పేరుతో సొంతంగా రూపొందించిన క్లొతింగ్ బ్రాండ్ను ఆదివారం జూబ్లీహిల్స్లోని హైలైఫ్ పబ్లో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ధరల్లో దుస్తులను అందించే లక్ష్యంతో సరికొత్త విభాగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. తనను చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో అందరూ రౌడీ అని ప్రేమగా పిలిచేవారని, ఈ రోజు తనకు నచ్చిన పని, వృత్తి చేయగలుగుతున్నానంటే కేవలం మొండితనంతో కూడిన రౌడీయిజమే కారణమన్నారు. రౌడీగానే జీవించాలనుంటున్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ఇటీవల తాను పెళ్లిచూపులు చిత్రానికిగాను సాధించిన ఫిలిమ్ఫేర్ అవార్డును వేలం వేయగా దివీస్ ల్యాబ్స్కు చెందిన శకుంతల దివీ రూ.25 లక్షలతో దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం www.rowdyclub.in పేరుతో రూపొందించిన వెబ్సైట్, యాప్లను ఆవిష్కరించారు. -
వైకింగ్ బ్రాండ్ మళ్లీ తెస్తున్న హీరో సైకిల్స్
న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్’ తాజాగా బ్రిటన్కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన మోస్ట్ పాపులర్ సైకిల్ బ్రాండ్ ‘వైకింగ్’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్ బ్రాండ్ను కలిగిన అవోసెట్ సైకిల్స్ను 2015లో హీరో సైకిల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్ షాప్స్లో వైకింగ్ బ్రాండ్ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ‘‘యాజమాన్యం మార్పు సహా పలు అంశాల కారణంగా దశాబ్దాల నుంచి వైకింగ్ బ్రాండ్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. హీరో సైకిల్స్ మా సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి యూకే మార్కెట్పై ప్రభావం చూపించాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది’’ అని ఎవోసెట్ సీఈవో శ్రీరామ్ వెంకటేశ్వరన్ తెలిపారు. -
బ్రాండెడ్ చీటింగ్..!
గచ్చిబౌలి: ఢిల్లీలో తయారైన నాసిరకం టీవీలను నగరానికి తరలించి.. సోనీ బ్రాండ్ పేరుతో స్టిక్కర్లు తగిలించి.. నేరుగా, ఆన్లైన్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 51 టీవీలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్కు చెందిన గౌరవ్ సింగ్ నగరానికి వలసవచ్చి చైతన్యపురిలో నివసిస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బుడిగెల సంతోష్ ఇతడి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు. గౌరవ్సింగ్ ఢిలీలో తయారైన వివిధ మోడల్స్కు చెందిన టీవీలను ఖరీదు చేసి తీసుకు వచ్చేవాడు. వీటికి సోనీ బ్రాండ్ లేబుల్స్ అతికించి తన దుకాణంలో విక్రయిస్తున్నాడు. ఇందులో సంతోష్ సేల్స్మెన్గానూ పని చేస్తున్నాడు. సోనీలోని వివిధ మోడల్స్తో పాటు సామ్సాంగ్ పేరుతోనూ లేబుల్స్ తగిలిస్తున్న గౌరవ్సింగ్ వీటి ఫొటోలను ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్లోనూ పొందుపరిచి మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తానంటూ నమ్మించి మోసాలు చేస్తున్నాడు. మలేషియాకు చెందిన టెలిరాక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేసి, దిగుమతి చేసుకుంటున్నట్లు నకిలీ బిల్లులు సైతం సృష్టించాడు. జీఎస్టీ లేకుండా 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు అందిస్తున్నమంటూ ప్రచారం చేసుకుని వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. 65 ఇంచుల సోనీ టీవీ ధర రూ.2.8 లక్షలు ఉండగా... గౌరవ్ సింగ్ మాత్రం ‘మేడిన్ ఢిల్లీ’ టీవీని కేవలం రూ.80 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీనిని సిటీకి తరలించి బ్రాండెడ్ కంపెనీకి చెందిన లేబుల్తో రూ.80 వేల డిస్కౌంట్ అంటూ రూ.2 లక్షలకు అమ్ముతున్నాడు. దీనిపై సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడి చేశారు. గౌరవ్ సింగ్తో పాటు సంతోష్ను పట్టుకుని వీరి నుంచి 51 నాసిరకం టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సీపీ తెలిపారు. ఇందుకుగాను ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపనున్నామన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ తరహా మోసాలు సైతం పెరిగాయని, వినియోగదారు లు కేవలం అధీకృత డీలర్ల వద్ద మాత్రమే వస్తు వులను ఖరీదు చేసుకోవాలని సూచించారు.