Dilip Kumar
-
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
మనసారా ప్రేమించా.. ఏరోజూ అనుమానించలేదు: సైరా భాను
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా భాను.. ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. హీరో దిలీప్కుమార్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో వదిలింది. ఈరోజు(అక్టోబర్ 2న) ఈ దంపతుల 58వ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. ఈ సందర్భంగా సైరా ఎమోషనల్ నోట్ వదిలింది. 'ప్రేమలో ప్రశ్నలు ఉండకూడదు.. హీరా పేరి సినిమాలో నేను చెప్పిన డైలాగ్ ఇది.. అందమైన జర్నీ..నిజ జీవితంలోనూ దాన్నే విశ్వసించాను. ప్రేమలో బలమైన నమ్మకం ఉంటే ప్రశ్నించే అవసరమే రాదు. నా స్వీట్హార్ట్ దిలీప్తో 1966 అక్టోబర్ 2న అందమైన ప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి ఎన్నడూ తనను ప్రశ్నించలేదు. మా జర్నీలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తనపై నమ్మకం కోల్పోలేదు.ఆరాధన..కేవలం ప్రేమించాను. అక్కడ అనుమానాలకు తావు లేదు. కేవలం ఆరాధన మాత్రమే ఉంది. ఆ భక్తిలోనే నిజమైన ప్రేమ ఉంది' అని రాసుకొచ్చింది. కాగా సైరా భాను, దిలీప్ కుమార్ 1966 అక్టోబర్ 11న పెళ్లి చేసుకున్నారు. అప్పుడు దిలీప్ వయసు 44 కాగా సైరా వయసు కేవలం 22 మాత్రమే! దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైరాతో కలిసి జీవించిన దిలీప్ 2021 జూలై 7న మరణించారు. View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు. -
షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్? బిగ్బీని తక్కువ చేసి..
ఫలానా హీరోకు టెక్కు ఎక్కువ.. ఆ దర్శకుడికి ముక్కు మీద కోపం.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కైతే పొగరు.. ఇలా ఇండస్ట్రీలోని తారల గురించి నెగెటివ్గా చాలామంది మాట్లాడుకుంటారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధమనేది ఎవరికీ తెలియదు. అలా షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్ అని తానూ విన్నానంటున్నాడు బాలీవుడ్ నటుడు దేవన్ భోజని.యాటిట్యూడ్..తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'జో జీతా వోహి సికిందర్ సినిమా తర్వాత ఓ మూవీలో షారూఖ్ ఫ్రెండ్గా నాకు ఛాన్స్ వచ్చింది. అప్పటికే తనకు యాటిట్యూడ్ ఉందని విన్నాను. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ గురించి కూడా చెడుగా మాట్లాడతాడని ఎక్కడో చూశాను. ఫస్ట్ డే సెట్కు వెళ్లగానే నన్ను నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అయితే షారూఖ్ దగ్గరకు వెళ్లాలనేసరికి మాత్రం అవసరమా? అనిపించింది. నేనెవరనేది తెలుసునా పేరు దేవన్ అని పరిచయం చేసినప్పుడు అయితే ఏంటి? అని వెటకారంగా మాట్లాడతాడేమోనని ఏదేదో ఊహించుకున్నాను. ఇంతలో వెనక్కు తిరిగేసరికి తనే నిలబడ్డాడు. హాయ్, నేను షారూఖ్.. జో జీతా వోహి సికిందర్ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని మెచ్చుకున్నాడు. నేనెవరనేది తనకు తెలుసా? అని ఆశ్చర్యపోయాను.ప్రశంసలునా సినిమా చాలా నచ్చిందన్నాడు. తన గురించి విన్నదంతా పచ్చి అబద్ధమేనని అప్పుడర్థమైంది. తను చాలా బాగా కలిసిపోతాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా దేవన్, షారూఖ్ 1994లో యే లంహే జుడాయికె సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం చాలా ఆలస్యంగా 2004లో విడుదలైంది.చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్ బాబు -
22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ఈ స్టార్స్ 'ప్రేమకథ' ఎప్పటికీ ప్రత్యేకమే
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆపై తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వయసు గురించి అందరూ పలు రకాలుగా మాట్లాడుకున్నా ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చివరి వరకు నిలిచారు. అలా బాలీవుడ్లో తమ ప్రేమ గొప్పదనాన్ని చూపారు ఈ లెజెండరీ కపుల్స్.. వారెవరో కాదు దిలీప్ కుమార్ - సైరా భాను. 1960ల నాటి సంగతి.. దిలీప్ కుమార్ను చూడ్డం కోసం ముంబైలో ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్కు హాజరైంది ఒక పదహారేళ్లమ్మాయి. అప్పుడే లండన్ నుంచి వచ్చింది స్కూల్ చదువు ముగించుకొని. ఆ షోకి దిలీప్ కుమార్ రాకపోయేసరికి చాలా నిరాశపడింది. తర్వాత యేడాదికి తనూ హీరోయిన్ అయింది ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీకపూర్ పక్కన. ఆమే సైరా బాను. ‘మొఘల్ ఎ ఆజం’ ప్రీమియర్ ప్రస్తావనకు తర్వాత ఆమె జీవితంలోని మలుపుకి సంబంధం ఉంది. (టాప్ హీరో రాజేంద్ర కుమార్తో సైరా భాను) మొదటి ప్రేమ రాజేంద్ర కుమార్తో ఆ రోజుల్లో దిలీప్ కుమార్ టాప్-1 స్థానంలో ఉంటే రాజేంద్ర కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సైరా బాను సినిమాల్లోకి రాకముందే రాజేంద్ర కుమార్ స్టార్. ఆ తరం ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ‘జంగ్లీ’ హిట్తో సైరా బానుకు స్టార్స్ పక్కన నటించే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ర కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సెట్స్లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ గుండె లయ తప్పింది. సైరా కళ్లల్లోని అమాయకత్వం అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వ గలను)’ అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’లోని పాటలో సైరా కోసం జీవించాడు. ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంతటి హీరో తనకు ఫిదా కావడంతో రాజేంద్ర కుమార్ పట్ల ఆమెకూ ఆకర్షణ మొదలైంది. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేమలో పడిపోయారిద్దరూ. ఆ మూవీ బాక్సాఫీస్ హిట్. దాంతో ఈ ఇద్దరి కలయికలోనే ‘ఝుక్ గయా ఆస్మాన్’ ప్రారంభమైంది. ఇందులోని ‘కౌన్ హై జో సప్నో మే ఆయా (నా కలలోకి వచ్చినదెవరు)’ పాటలో తన కళ్లల్లో సైరాను కొలువుంచుకొనే అభినయించాడు రాజేంద్ర కుమార్. ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆ జంటకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెర మీది కెమిస్ట్రీతో పాటు వీళ్లిద్దరి ప్రేమాయణమూ బాలీవుడ్ నోట షికారు చేసింది. అయితే రాజేంద్ర కుమార్ అప్పటికే పిల్లల తండ్రి. అదేమీ అడ్డంకిగా భావించని సైరా అతణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. సైరా ప్రేమ కోసం భార్యా,పిల్లలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్ర కుమార్. ఈ విషయం సైరా తల్లి నసీమ్ బానుకు తెలిసింది. నిజానికి రాజేంద్ర కుమార్ అంటే నసీమ్ కుటుంబానికి అపారమైన గౌరవం. ఒకరోజు ఆయన్ను కలిసి ‘సైరా చాలా మంచి పిల్ల. ఆమెను అర్థం చేసుకునే చక్కటి భాగస్వామి దొరకాలి’ అంటూ. రచ్చ కాకుండానే సైరాను ఆ ప్రేమ నుంచి తప్పించేసింది. అంతటితో వారిద్దరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. బర్త్డే పార్టీలో దిలీప్ కుమార్తో సైరా ప్రేమ చాన్స్ రానే వచ్చింది సైరా బాను బర్త్డే రూపంలో. పార్టీ అనౌన్స్ చేసి దిలీప్ కుమార్ను అతిథిగా ఆహ్వానించింది నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సైరా. దిలీప్ కుమార్ కూడా సైరాను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ క్షణం దిలీప్ కుమార్ కళ్లల్లో మెరిసిన మెరుపు నసీమ్ దృష్టిని దాటిపోలేదు. అలా కొన్నేళ్లపాటు సైరా- దిలీప్లు కూడా తమ మధ్య మూగప్రేమనే మనసులో నింపుకొన్నారు. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. సమయం చిక్కగానే అతణ్ణి అడిగింది.. ‘మీరంటే సైరాకు పిచ్చి.. చిన్నప్పటి నుంచీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటారా?’ అని. అప్పటికే వహీదా రెహ్మాన్తో డేటింగ్లో ఉన్నాడు దిలీప్ కుమార్. అయినా నసీమ్ ప్రతిపాదనను సమ్మతించాడు రెండో ఆలోచన లేకుండానే. అలా తనకన్నా ఇరవై రెండేళ్లు పెద్దవాడైన దిలీప్ కుమార్కు 1966లో జీవిత భాగస్వామి అయింది సైరా బాను. పెళ్లి తర్వాత అలాంటి కామెంట్లు అయితే పెళ్లి తర్వాత చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారట! పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. ఎళ్లు గడుస్తున్నా వారి బంధాన్ని నిక్షేపంగానే కొనసాగించారు. 'మనసులో ప్రేముంటే వయసుతో పనేముంది' అని తమ అనుబంధంతోనే నిరూపించారీ ఐకానిక్ కపుల్. పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం ధరించారు సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు. కొన్ని కారణాల వల్ల ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధం రెండేళ్లకు మించి కొనసాగలేదు. సైరాను మరిచిపోలేకపోయాడు దిలీప్. రెండేళ్లపాటు సైరాకు దూరంగా ఉండటం ఒక నరకంగా భావించాడు. తిరిగి సైరాను చేరుకున్నారు. అంత జరిగినా దిలీప్ నా వాడే అంటూ సైరా కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్లాంటి భర్త దొరకాలని. అల్లా రెండిటినీ నెరవేర్చాడు. అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దిలీప్ నా వాడు! అంటూ తన భర్తపై అపారమైన ప్రేమను ఆమె బయటపెట్టింది. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్.. 1944 నుంచి 1998 వరకు బాలీవుడ్ను ఏలిన దిలీప్ 2021లో అనారోగ్యంతో కన్నుమూశారు. -
1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్కుమార్ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కార్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయవాడలో వివిధ స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్ ఇంజన్గా మారుతోందన్నారు. కాలుష్యంతోపాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు. ఈ క్రమంలోనే లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు. వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్ షిప్పింగ్ను ఇన్ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్ టన్నుల సరుకు ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్ వాటర్వేస్ (ఎన్డబ్ల్యూ)4 నంబరును కేటాయించగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరాబాద్–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలోమీటర్లు, కాకినాడ కెనాల్ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్ (రాజమహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్ (విజయవాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్ బకింగ్హమ్ కెనాల్ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు. వీటితో పాటు ఎన్డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడితిపాలెం/బంగాళాఖాతం) 32 కిలోమీటర్లు, ఎన్డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రాపురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధానం చేస్తున్నామన్నారు. కడప ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్లకు పెన్నానది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు. గండికోటలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చ్యువల్గా మాట్లాడారు. సమావేశంలో జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కోల్కత్తా ప్రతినిధి రాజ్సింగ్, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
బ్లాక్ అండ్ వైట్ నక్షత్రం
నిరుడు ఈ నెలలోనే 7వ తేదీన కన్నుమూసిన దిలీప్కుమార్ వంటి ఒక కీర్తినార్జించిన వ్యక్తి జీవితంలోని విశేషాంశాలను తెలుసుకోవాలని ఆరాటపడుతున్న ఆయన అభిమానుల నిరీక్షణ ఏడేళ్ల క్రితమే 2014లో విడుదలైన ఆయన ఆత్మకథ ‘సబ్స్టెన్స్ అండ్ షాడో’లో ఫలించి ఉంటుంది. తన గురించి ఏదీ వదలకుండా ఆ పుస్తకంలో రాసుకున్నారు దిలీప్ కుమార్. పుస్తకంలో అనేక రహస్యోద్ఘాటనలతో పాటు.. దిలీప్కుమార్, సైరాబానుల ప్రేమకథ, లోకల్ ట్రైయిన్లో లతామంగేష్కర్తో అయిన తొలిపరిచయం, తొలిచిత్రం ‘జ్వార్ భాటా’ (1944) నుంచి ‘జుగ్ను’ (1947) వరకు యువనటుడిగా ఆయన ఎదుగుదల వంటి ఆసక్తికరమైన సాధారణ అంశాలు చాలానే ఉన్నాయి. దిలీప్ జీవితచరిత్ర కోసం ఒక అభిమానిలా తను కూడా ఏళ్లుగా కలగంటున్నానని పుస్తకం ఆవిష్కరణ రోజు సైరా చెప్పడం విశేషం. దిలీప్కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ఖాన్. 1922 డిసెంబరు 11న పెషావర్ (ఇప్పటి పాకిస్థాన్)లో జన్మించారు. ఆరు దశాబ్దాలు సినిమాల్లో ఉన్నారు. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. దేవానంద్ మరణం తర్వాత బాలివుడ్కు మొన్నటి వరకు మిగిలి ఉన్న ఏకైక నలుపు–తెలుపు చిత్రాల సూపర్స్టార్ దిలీప్. దిలీప్కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారి. పెషావర్లో, దేవ్లాలి (మహారాష్ట్ర)లో ఆయనకు పండ్ల తోటలు ఉండేవి. దిలీప్ దేవ్లాలిలోని ప్రతిష్టాత్మకమైన బార్నెస్ పాఠశాలలో చదువుకున్నారు. 1930లలో వారి కుటుంబం ముంబైకి మారింది. 1940 ప్రాంతంలో దిలీప్ ఇంటిని వదిలి పుణె వెళ్లి అక్కడ క్యాంటీన్ నడిపారు. డ్రైఫ్రూట్స్ బిజినెస్ చేశారు. 1943లో నటి, ‘బాంబే టాకీస్’ అధినేత అయిన దేవికారాణి... పుణె మిలటరీ క్యాంటిన్లో దిలీప్ను చూసి ‘జ్వార్ భాటా’ లో ప్రధాన పాత్ర ఇచ్చారు. అలా దిలీప్ సినిమాల్లోకి వచ్చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామ్యం వహించారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. దిలీప్ మొదట ప్రేమించింది నటి కామినీ కౌశల్ని. కానీ పెళ్లి దాకా పోలేదు. మధుబాలకు దగ్గరయ్యారు. మధుబాల కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమెనీ పెళ్లి చేసుకోలేకపోయాడు. తర్వాత అందాల నటి సైరాబానును ప్రేమించి 1966లో పెళ్లి చేసుకున్నారు. సైరాబాను అతడికన్నా 22 ఏళ్లు చిన్న. 1980లో ఆస్మాను పెళ్లాడారు. ఆ పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. 2011 నాటికి దిలీప్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. భార్య సైరాబానుతో కలిసి తన జీవితంలో తొలిసారిగా మక్కా వెళ్లి వచ్చారు దిలీప్ కుమార్. ఇంతకీ యూసఫ్ ఖాన్ దిలీప్కుమార్ ఎలా అయ్యాడు? ప్రఖ్యాత నవలాకారుడు, సినిమా రచయిత భగవతీ చరణ్ వర్మ పెట్టిన పేరది! వాసుదేవ్, జహంగీర్, దిలీప్కుమార్ అని మూడు పేర్లు చెప్పి ఒకటి పెట్టుకోమన్నప్పుడు యూసఫ్... దిలీప్ అనే పేరును ఎంచుకున్నారు. (చదవండి: చైతన్య భారతి: టెస్సీ థామస్ / 1963 అగ్ని పుత్రిక) -
కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ..
Kamal Haasan Regrets Not Working With Dilip Kumar Says He Begged Him: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో అలరించనుండగా సూర్య అతిథి పాత్రలో మెరవనున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇతర నటీనటులుతో కలిసి నటించడం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనకు దిలీప్ కుమార్ అంటే ఎంతో అభిమానమని, ఆయనతో నటించే అవకాశం కోల్పోవడం గురించి చెప్పుకొచ్చారు. 'నాకు ఇతర నటీనటులతో కలిసి నటించడం అంతే ఎంతో ఇష్టం. నేను నటించాలని కోరుకుని, అలా నటించని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దిలీప్ కుమార్ సర్. నేను 'తేవర్ మగన్' అనే సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరేందుకు ఆయన్ను కలిశాను. దిలీప్ కుమార్ చేతులు పట్టుకుని మరీ ఆ సినిమాలో నటించాలని ప్రాధేయపడ్డా. కానీ ఆయన ఒప్పుకోలేదు.' అని కమల్ హాసన్ తెలిపారు. అయితే తర్వాత అదే మూవీని హిందీలో అనిల్ కపూర్, అమ్రిష్పురి కాంబినేషనల్లో 'విరాసత్'గా తెరకెక్కించారు. చదవండి: 👇 అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
ఆ సంచలన దర్శకుడితో రజినీకాంత్
గత కొంత కాలంగా అనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నప్పటకీ సూపర్స్టార్ రజినీకాంత్ మాత్రం సినిమాలు చేయడం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ మద్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేసారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజినీ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తలతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే.. త్వరలోనే రజినీకాంత్ తన 169వ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రజినీ మరో కుర్ర దర్శకుడితో పని చేయబోతున్నట్టు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్తో 'బీస్ట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్తో తన తదుపరి సినిమా చేయడానికి సూపర్ స్టార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'డాక్టర్' చిత్రంతో ఈ దర్శకుడు బ్లాక్బప్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రజినీకాంత్ గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివ లాంటి యంగ్ డైరెక్టర్స్తో పని చేస్తూ యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్...
గోల్డెన్ ఎరా అంటారు– హిందీ సినిమా సంగీతంలో 1950–60ల మధ్య కాలాన్ని. సంగీతం కూడా విజయాన్ని నిర్దేశించేది. దిలీప్కుమార్ తన సినిమాలతో గొప్ప పాటలు ఇచ్చాడు. తను పాడాడు. కొందరి నసీబ్లు మార్చాడు. ఆ పాట కబుర్లు కొన్ని... దేవ్ ఆనంద్ దగ్గరకు ‘జంజీర్’ స్క్రిప్ట్ తీసుకుని వెళితే కథ చాలా బాగుంది... కాని హీరోకు పాటల్లేవు... నా ఇమేజ్కు తగినట్టుగా రెండు డ్యూయెట్స్ పెడితే ఈ సినిమా చేస్తాను అన్నాడు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా ఒప్పుకోలేదు. అమితాబ్తో ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రివెంజ్ స్టోరీ. అందులో పాటలకు వీలు లేదు. నిజమే. కాని ‘మొఘల్–ఏ–ఆజమ్’ ప్రేమ కథ. సలీమ్–అనార్కలీ తల మునకలుగా ప్రేమించుకుంటారు. దిలీప్ కుమార్కు దర్శకుడు కె.ఆసిఫ్ కథ చెప్పినప్పుడు ‘నాకు డ్యూయెట్ ఎక్కడ’ అనలేదు దిలీప్ కుమార్. తన మీద ఒక్క డ్యూయెట్ లేకుండానే ఆ సినిమాలో నటించాడు. ‘మొఘల్–ఏ–ఆజమ్’లో నేటికీ నిలబడి ఉన్న గొప్ప పాట ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ మధుబాలపై చిత్రీకరణ జరిగింది. అందులో దిలీప్ కుమార్ కుర్చీలో కూచుని ఆ పాటను తిలకిస్తాడు. రాజ్ కపూర్ అయితే కనీసం ఒక డ్రీమ్ సీక్వెన్స్ అయినా పెట్టి ఉండేవాడు ఇలాంటి కథలో. దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు నౌషాద్, గీతకర్త షకీల్ బదయూని ముగ్గరూ కలిసి ఒక త్రయంగా పాటల మువ్వలకు శ్రావ్యతను ఇచ్చారు. దిలీప్ కుమార్, నౌషాద్ల కాంబినేషన్లో ఆ తరం వారు మురిపెంగా చెప్పుకునే ‘అందాజ్’, ‘మేలా’, ‘బాబుల్’, ‘కోహినూర్’, ‘గంగా జమున’, ‘ఉరన్ ఖటోలా’, ‘లీడర్’... లాంటి హిట్స్ వచ్చాయి. ‘మొఘల్ ఏ ఆజమ్’ తలమానికం. ‘కోహినూర్’లో నౌషాద్ చేసిన ‘దో సితారోంకా జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్’ పాట తెలుగులో ‘ఈ రేయి నీవూ నేనూ ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి’గా వినిపించింది. ఇదే సినిమాలోని ‘మధుబన్ మే రాధికా నాచేరే’ రఫీ రాగం తీస్తే సముద్ర గర్భంలో ఉన్న బెస్తవాడికి కూడా వినిపించింది. ఈ పాటలో దిలీప్ కుమార్ సితార్ వాయిస్తూ కనిపించేందుకు దాదాపుగా సితార్ను నేర్చుకున్నాడు. అందుకే ఆ భాగాన్ని అతనే వాయించినట్టు అనిపిస్తుంది. దిలీప్– నౌషాద్ కాంబినేషన్లో మీరు జేబులో నుంచి తీసేకొద్దీ వచ్చే చిరుతిండ్ల పొట్లాల వంటి పాటలు వచ్చాయి. ‘ఓ దూర్ కే ముసాఫిర్ ముజ్కోభి సాత్ లేలేరే’ (ఉరన్ఖటోలా), ‘ముఝే దునియ వాలో షరాబీన సంఝో’ (లీడర్), ‘ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లేలే’ (రామ్ ఔర్ శ్యామ్), ‘ఆజ్ పురానీ రాహోంసే కోయి ముఝే ఆవాజ్ న దే’ (ఆద్మీ), ‘కోయి సాగర్ దిల్ కో బెహలాతా నహీ’ (దిల్ దియా దర్ద్ లియా).... ఇవన్నీ కడిగిన సరిగమల్లా ఉంటాయి. ఇతర సంగీతకారులు తక్కువ తినలేదు. సలీల్ చౌధరి తన బెంగాళీ రసగుల్లాల్లాంటి పాటలతో ‘మధుమతి’ని నింపేశాడు. దిలీప్ పాడే ‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’ పచ్చటి లోయల్లే వీచే గాలిలా ఉంటుంది. ‘దిల్ తడప్ తడప్ కె కెహ్ రహాహై ఆభిజా’ గుండెను హృదయంగా మార్చదూ?. ఇందులోనే ‘టూటే హుయే ఖ్వాబోనే’ ఒక లలితమైన రోదన. ఇక ఓ.పి. నయ్యర్ హార్మోనియం పెట్టె ముందేసుకుని ‘నయాదౌర్’లో ప్రతి పాటనూ హిట్ చేశాడు. ‘ఏ దేశ్ హై వీర్ జవానోంకా’ దేశభక్తి గీతాలలో మేలిమిది. ఆశాభోంస్లే, రఫీ పాడిన రెండు డ్యూయెట్లు ‘ఉడె జబ్ జబ్ తేరే జుల్ఫే’, ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ దిలీప్–వైజయంతి మాలలకు మాలలు. ‘సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్ జాయేగా మిల్ కర్ బోజ్ ఉఠానా’ కలిసి పని చేయమని ఎంత బాగా చెబుతుంది. దిలీప్ కుమార్కు తలత్ మంచి పాటలు పాడాడు. ‘దాగ్’లో ‘ఏ మేరే దిల్ కహీ ఔర్ చల్’ పాట నేటికీ ప్రియమైనది. ‘ఫుట్పాత్’లో తలత్ పాడిన విరహ వెన్నెల గీతం ‘షామ్ ఏ గమ్ కీ కసమ్ ఆజ్ గంగీన్ హమ్ ఆభిజా ఆభిజా ఆజ్ మేరే సనమ్’ లేమత్తు పానీయం. దిలీప్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాలు చేస్తే అందులోనూ ఆయనకు పాటలు ఇచ్చారు దర్శకులు. ‘కర్మ’లో ‘దిల్ దియాహై జాన్ భీ దేంగే’ పాటకు ముందు కొన్ని లైన్లను ఆయనే పాడి అభిమానులను మురిపించాడు. ‘సౌదాగర్’లో ‘ఇమ్లీకా బూటా’ పెద్ద హిట్. రోజులు గడిచే కొద్ది కొన్ని సుగంధాలకు విలువ పెరుగుతుంది. ఈ పాటల సుగంధం మరో వందేళ్లు. – సాక్షి ఫ్యామిలీ -
ఒక స్వర్ణయుగం ముగిసింది: సోనియా గాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంపై కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె దిలీప్ కుమార్ భార్య సైరా బానుకు ఒక లేఖ రాశారు. "మీ ప్రియమైన భర్త దిలీప్ కుమార్ కన్నుమూతతో, భారతీయ సినిమా చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది’’ అని సైరా బానుకు గురువారం రాసిన సంతాప సందేశంలో సోనియా పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఒక లెజెండ్..భవిష్యత్తులో కూడా లెజెండ్గానే కొనసాగుతారు.ఎందుకంటే భవిష్యత్తరం సినీ ప్రేమికులు కూడా ఆయన అద్భుతమైన నటనా వైభవాన్ని ఆస్వాదిస్తాయి. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీలను అందించిన ఆయన నటనా నైపుణ్యాన్ని ఆరాధిస్తారంటూ ఆయన సాధించిన ఘనతను, విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే గంగా జమునా, డాగ్, దీదార్, మొఘల్-ఏ-ఆజం, నయా దౌర్, మధుమతి, దేవదాస్,రామ్ ఔర్ శ్యామ్ లాంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో తన పాత్రలతో అలరించిన ఆయన నటను ఎవరు మరచిపోగలమని వ్యాఖ్యానించారు..పూర్తికాల జీవితాన్ని అనుభవించిన దిలీప్ కుమార్ అమూల్యమైన వారసత్వాన్ని ప్రపంచ సినిమాకు అందించారని కొనియాడారు. ఆయన మరణం విశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచేసిందనీ, దేశం ఎప్పటికీ ఆయనను గుర్తు పెట్టుకుంటుందనీ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని,ధైర్యాన్ని మీకివ్వాలని ప్రార్థిస్తున్నానని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కాగా వయసు సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ముంబై ఆసుపత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా 'కోహినూర్' గా భావించే మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, స్క్రీన్ పేరు దిలీప్ కుమార్గా ప్రపంచానికి సుపరిచితుడు. 1966లో ఆయన సైరా బానును వివాహమాడారు. -
దిలీప్ కుమార్@ ఫుట్బాల్కు వీరాభిమాని
న్యూఢిల్లీ: తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సినీ దిగ్గజం దిలీప్ కుమార్కు వ్యక్తిగతంగా క్రీడలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్బాల్ అంటే పడి చచ్చే ఆయన ప్రఖ్యాత మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్కు వీరాభిమాని. ఆ జట్టు కోల్కతాలో ఆడినా, ముంబైలో ఆడినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారని హైదరాబాద్కు చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్రాజ్ గుర్తు చేసుకున్నారు. రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ తదితర పెద్ద టోర్నీల మ్యాచ్లకు వెళ్లి దిలీప్ మ్యాచ్లను ఆస్వాదించేవారు. ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన గురించి అమల్రాజ్ చెప్పారు. ‘ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం కాబట్టి 1980 రోవర్స్ కప్ ఫైనల్కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టడం దిలీప్కు కోపం తెప్పించింది. దిలీప్ మొహమ్మదాన్కు అభిమాని కాగా... ఈస్ట్ బెంగాల్ అభిమానులు ఆ సమయంలో సూపర్ హిట్ సినిమా అయిన ‘మర్యాద’ హీరో రాజ్కుమార్ పేరుతో గొడవ చేస్తుండటంతో ఆయననే అతిథిగా పిలవాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయిన దిలీప్ కుమార్ను కలవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం’ అని అమల్రాజ్ అన్నారు. మరో ప్రముఖ ఆటగాడు చున్నీ గోస్వామి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఆయనను ఒప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో కూడా దిలీప్ కుమార్ కీలకపాత్ర పోషించారు. దిలీప్జీ... మీలాంటి మరో వ్యక్తి ఎప్పటికీ రాలేరు. భారత సినిమాకు మీరు చేసిన సేవ అసమానం. –సచిన్ టెండూల్కర్ భిన్న తరాలు ప్రేమించిన ఒక దిగ్గజం ఇవాళ కన్నుమూశారు. దిలీప్సాబ్కు నా నివాళి. – కోహ్లి దిలీప్గారే చెప్పినట్లుగా ప్రపంచంలో ఎన్నో విషయాలు మారిపోయినా అందరినీ ప్రేమించే మనసున్నవారు ఎప్పటికీ మారిపోరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీరేంద్ర సెహ్వాగ్ -
‘ట్రాజెడీ కింగ్’ కన్నుమూత
ముంబై: విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్కుమార్ (98) తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసిన ఆయన.. అశేష అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచారు. పాత్రోచిత సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్కుమార్ స్టార్గా వెలుగొందారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య, అధికారిక లాంఛనాలతో, శాంతాక్రుజ్లోని శ్మశానవాటికలో దిలీప్కుమార్కు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి, గన్ సెల్యూట్తో తుది వీడ్కోలు పలికారు. నాటి ప్రముఖ నటి సైరా బాను దిలీప్కుమార్ భార్య. దిలీప్కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఇ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్ కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్కపూర్, దేవానంద్లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్ కుమార్ ముంబై ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబనా ఆజ్మీ, షారూఖ్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లత మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్ కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో యూసుఫ్ ఖాన్గా దిలీప్కుమార్ జన్మించారు. దిలీప్ కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్గా మార్చారు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ఆయన చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఏ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్కపూర్, దేవానంద్లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్కుమార్ ముంబైలో ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, షారూక్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మిం చిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో యూసుఫ్ ఖాన్గా దిలీప్కుమార్ జన్మించారు. దిలీప్కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్గా మార్చా రు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమ యంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంతాపం దిలీప్ కుమార్ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తంచేశారు. నటుడిగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్కుమార్ చేసిన సుదీర్ఘ సేవను ఆయన గుర్తు చేసుకున్నారు. దిలీప్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, దిలీప్కుమార్ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిలీప్కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆయన పాత్రను మరువలేమని కొనియాడారు. పలు చిత్రాల్లో ఆయన నటన అద్వితీయం అని పేర్కొన్నారు న్నాళ్లుగా దిలీప్కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. కొన్నాళ్లుగా దిలీప్కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. -
Dilip Kumar: హైదరాబాద్కు అల్లుడయ్యారు.. కానీ రెండేళ్లకే!
‘సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ’... అతని సినిమా ప్రయాణం అతి సుందరం. ‘ఏ మేరా దీవానాపన్ హై..’ నటన పట్ల అతని ఉన్మత్తతా అతి సుందరం. ‘మధుబన్ మే రాధికా నాచెరే’... వెండితెరపై ఆ లీలా వినోదమూ సుందరమే. ‘యూసఫ్ ఖాన్’ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. జగతి ‘దిలీప్ కుమార్’ అని పిలుచుకుంది. భారత ఉపఖండం ఎల్లలు గీసుకొని ఉండొచ్చు. కాని అతణ్ణి అభిమానించడంలో గీతలన్నీ దారులుగా మారడం అతి సుందరం. కొందరు పట్టాభిషేకం వల్ల చక్రవర్తులు అవుతారు. కొందరు ప్రజల అభిషేకం వల్ల. దిలీప్ కుమార్ను ‘సినీ మొఘల్ ఏ ఆజమ్’ అని పూమాల వేసుకోవడం బహు సుందరం. ట్రాజెడీ కింగ్... కామెడీ స్టార్... రొమాంటిక్ హీరో... మెథడ్ యాక్టర్... పేర్లు ఏవైనా అతడు పలకడం సుందరం. మేకప్ వేసుకున్న కోహినూర్ వ్రజ్రం ఇన్నాళ్లు వెండితెరపై మెరిసి ఇకపై నింగిలో తళుకులీననుంది. ఖదీర్ ‘‘జనం ఆకలితో మాడుతుంటే మనం వాళ్లకు దక్కాల్సిన తిండి గింజల్ని రేట్లు పెంచి అమ్ముకుని మన బొక్కసాన్ని నింపుకున్నాం. ఊళ్లో మహమ్మారి కమ్ముకుంటే మనం మందుల్ని దాచిపెట్టి వాటి రేట్లు పెంచేశాం. పోలీసులు దాడి చేస్తారని తెలియగానే అవే మందుల్ని మురుక్కాలవల్లో పారబోశాం. మనిషికి దక్కాల్సిందేదీ మనిషికి దక్కకుండా చేస్తున్నాం’’ – ఫుట్పాత్ (1953) ‘‘అనార్కలి సమాధి మీద నాలుగు కాళ్లు నిలబెట్టి తప్ప మీ సింహాసనం నిలవదు అని మీరనుకుంటే జహాపనా... ఈ సలీమ్ అటువంటి సింహాసనాన్ని ఎప్పటికీ కోరుకోడు’’ – మొఘల్ ఏ ఆజమ్ (1960) ‘‘ఏదో ఒక ఉపాయం ఆలోచించు దొరబాబూ. ఊళ్లో మీరూ ఉండేలా మేమూ ఉండేలా. యంత్రాలూ పరికరాలతోపాటు మనుషులు కూడా ఉండేలా. అందరం కలిసి బతికే మార్గం ఆలోచించు’’ – నయాదౌర్ (1957) ‘‘ఎవడయ్యా ఆ బడుద్దాయి.. వేదన తట్టుకోవడానికి తాగేది? నేను తాగుతున్నానంటే కారణం కనీసం ఊపిరన్నా ఆడుతుందని’’ – దేవదాస్ (1954) ‘రైట్ బ్రదర్స్’ ప్రపంచానికి ఎగరడం నేర్పించారు. అదొక రికార్డు. దిలీప్ కుమార్ ఈ దేశంలో నటులను నేలన నడవడం నేర్పించాడు. అదీ రికార్డే. నాటకం చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి వినిపించేలా అరిచి డైలాగులు చెప్పే రోజులు పోయాయి. అరవొద్దు. దూరం నుంచి కనిపించేలా ముఖమంతా కదిలించే భావాలు చూపించాల్సిన అవసరం లేదు. చూపించొద్దు. ఇది సినిమా. దీనికి వేరేగా చేయాలి... నాలా చేయాలి అని చేసి చూపించాడు దిలీప్ కుమార్. ఒక కాలం ఉంటుంది. అరణ్యాలు మార్గాలు తొలుచుకునే కాలం. కొత్తది ఒకటి ఏర్పడే కాలం. అలాంటి కాలంలో అలాంటి వాళ్లు పుడతారు. సినిమా సంగీతం ఇలా ఉండాలి అని నౌషాద్ వచ్చాడు. సినిమా పాట ఇంత లలితంగా ఉండాలి అని లతా వచ్చింది. సినిమా దర్శకత్వం ఇలా ఉండాలి అని మహబూబ్ ఖాన్ వచ్చాడు. సినిమా నటన ఇలా ఉండాలని దిలీప్ కుమార్ వచ్చాడు. ‘దీదార్’ (1951) సినిమాలో దిలీప్ కుమార్ అంధుడు. అప్పటివరకూ సినిమాల్లో అంధులు వేగంగా కనురెప్పలు మూస్తూ కంటి కింద నల్ల చారలతో నటించేవారు. అదొక స్టీరియోటైప్. దిలీప్ ఆ సినిమాలో కళ్లు తెరిచి అంధుడుగా నటించాడు. శరీర కదలికా, మాట, నడక వల్ల తాను అంధుడు అని ప్రేక్షకులకు చెప్పాడు. సినిమా అంటే ఆ పూటకు మేకప్ వేసుకుని, ఆ రోజుకు సీన్ పేపర్ చదువుకుని, ఆ షాట్లో చెప్పాల్సిన డైలాగ్ చెప్పి మధ్యాహ్నం షెడ్యూల్కు ఇంకో స్టూడియోకు పరిగెత్తి పోవడం కాదు అని వృత్తి ఏకాగ్రతను మొదట పాటించినవాడు దిలీప్ కుమార్. తెర మీద నీలా కనిపిస్తున్నావా నీ పాత్రలా కనిపిస్తున్నావా అని అందుకై మధనపడ్డ వాడు దిలీప్ కుమార్. ఒక కాలంలో ఒకే సినిమా అని అతడు పాటించిన సూత్రాన్ని దాదాపు 50 ఏళ్ల తర్వాత రజనీకాంత్, ఆమిర్ఖాన్ పాటించి విజయాలు సాధించి ఆపై అందరు హీరోలు అదే ధోరణికి వచ్చేలా చేశారు. వీరి దారికి మ్యాప్ ఇచ్చినవాడు దిలీప్ కుమార్. ∙∙ ‘చేతులు ఎక్కడ పెట్టుకోవాలి?’ ఇది తెలిస్తే నటులైపోతారు. ఒక నటుడు నటించడానికి చేతులే పెద్ద అడ్డం అని నటులకు మాత్రమే తెలుస్తుంది. ఆ చేతుల్ని అలా జార్చి వదల్లేము. చీటికి మాటికి కదిలించలేము. ఈ చేతుల్ని హ్యాండిల్ చేయడానికి కొందరు వాటిని విసురుతూ నటిస్తే, కొందరు కాలర్ దగ్గరకు తెచ్చి నటిస్తే, కొందరు ఒక చేతిని సగం మడిచి, మరికొందరు బెల్ట్ పట్టుకుని నటించడం చూశాం. వారి నటనలో చేతులు రిజిస్టర్ అవుతాయి. దిలీప్ కుమార్ నటనను చూడండి. అతడు రిజిస్టర్ అవుతాడు. చేతులు కాదు. భారతదేశ నటులందరిలోనూ చేతులను సరిగ్గా పెట్టి నటించడం తెలిసిన మొదటి నటుడు దిలీప్ కుమార్. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లలో అందుకై అతడి సినిమాలు చూపిస్తారు. ∙∙ ‘నా విజయం నీ గుండెల్లో గడబిడ పుట్టిస్తే అంతే చాలు. నీ ఇనాం నీ దగ్గరే పెట్టుకో. నా విజయాన్ని నేను తీసుకెళ్తా’ అని ‘ఆన్’ (1952) సినిమాలో దిలీప్ కుమార్ అంటాడు. విజయం సాధిస్తే అలా సాధించాలి అనుకున్నవాడు దిలీప్ కుమార్. పెషావర్లో పుట్టి (1922) మరో పదేళ్ల తర్వాత కుటుంబం ముంబైకి వలస రావడం వల్ల అక్కడే చదువుకున్న దిలీప్ కుమార్ కాలేజ్లో రాజ్ కపూర్కు క్లాస్మేట్. చదువుకుని సొంతగా బతకాలనుకునే ఖాన్ల స్వభావం చదువు పూర్తి కావడంతోటే అతణ్ణి పూణెకి తీసుకెళ్లింది. అక్కడ సొంతంగా డ్రైఫ్రూట్స్ షాప్ పెట్టాడు. సంవత్సర కాలంలోనే లాభంతో తండ్రి దగ్గరకు వస్తే తండ్రి సంతోషించాడు. అయితే ఈ అందగాణ్ణి, చక్కటి మాట ఉన్నవాణ్ణి, మర్యాదపూర్వక ప్రవర్తన ఉన్నవాణ్ణి, మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నవాణ్ణి నటి దేవికా రాణి చూసింది. అప్పటికే ఆమె సూపర్స్టార్. బాంబే టాకిస్ స్టూడియో ఓనర్. కొత్త హీరోలతో సినిమాలు తీయాలని వెతుకుతోంది ఆమె. ‘నీ జీతం 1250 రూపాయలు’ అని దిలీప్ కుమార్తో దేవికా రాణి చెప్తే అది నెలకా సంవత్సరానికా అర్థం కాలేదు దిలీప్కు. 1944లో 150 రూపాయలు పెద్ద జీతం. ‘నాకు మా స్టూడియోలో నెలకు 150 ఇస్తున్నారు. నీకు అది సంవత్సరానికి అయి ఉంటుంది’ అని రాజ్ కపూర్ ఆ సందేహానికి జవాబు చెప్పాడు. కాని తప్పు. నెలకు 1250 రూపాయలు ఆఫర్ చేసింది దిలీప్ కుమార్కు దేవికా రాణి. అలాంటి బ్యాంగ్తో మొదలయ్యాడు దిలీప్ కుమార్. కాలేజ్లో ఫుట్బాల్ను స్పోర్ట్స్ ప్రిఫెరెన్స్గా తీసుకున్న దిలీప్ కుమార్, ఎప్పుడూ నాటకాలు వేయని దిలీప్ కుమార్, హాలీవుడ్ సినిమాలు తలమునకలుగా చూసి ఎరగని దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్కు ఉన్నట్టుగా గ్రెగెరి పెక్ మోడల్ లేని దిలీప్ కుమార్, రాజ్ కపూర్కు ఉన్నట్టుగా సురభి నాటక సంస్థ లాంటిది లేని దిలీప్ కుమార్ అంత మంచి నటుడు ఎలా అయ్యాడు. అది రహస్యం. ఎప్పుడూ ఎవరికీ తెలియదు. అయ్యాడు. అవడానికే అతడు నిరంతరం శ్రమించాడు. దేవికా రాణి అతణ్ణి పెట్టి తీసిన మొదటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాని ఇలా కొత్త తరహా నటన చూపుతున్న నటుణ్ణి అందరూ గుర్తించారు. మహబూబ్ ఖాన్ మల్టీస్టారర్గా రాజ్కపూర్, నర్గిస్, దిలీప్ కుమార్లను పెట్టి తీసిన ‘అందాజ్’ (1949)తో దిలీప్ కుమార్ తన ఊనికిని పూర్తిగా నిరూపించాడు. వరుసగా వచ్చిన మూడు సినిమాలు ‘దీదార్’ (1951), ‘తరానా’ (1951), ‘దాగ్’ (1952) దిలీప్ కుమార్ను ట్రాజెడీ కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాయి. అంతిమంగా ‘దేవదాస్’ (1955) అతణ్ణి ‘ట్రాజెడీ కింగ్’ను చేసింది. మెథడ్ యాక్టింగ్ అంటే పాత్రను మననం చేసుకుంటూ ఉండటం. మామూలు వ్యక్తిగా తక్కువ పాత్రగా ఎక్కువ ఉండటం. దిలీప్ కుమార్ ఈ పాత్రలతో ఎంత మమేకం అయ్యాడంటే ఆ కథలతో తనకు ఏ సంబంధం లేకున్నా ఆ విషాదం కమ్ముకుని డిప్రెషన్ రాసాగింది. డాక్టర్లు ‘ఇక మానెయ్. సరదా పాత్రలు చెయ్’ అంటే దిలీప్ దారి మార్చాడు. ఆజాద్ (1955), నయాదౌర్ (1957), మధుమతి (1958) అతణ్ణి చలాకీగా దూకుడుగా చూపించాయి. కాని అతడేంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరెస్ట్ ఎక్కాల్సి ఉంది. ఆ ఎవరెస్టే ‘మొఘల్ ఏ ఆజమ్’. హీరోలు డ్యూయెట్లు పాడుతూ ప్రేమిస్తారు. విడిపోతే విరహగీతాలు ఆలపిస్తారు. చివర్లో నాలుగు ఫైట్లు చేసి హీరోయిన్ని సొంతం చేసుకుంటారు. ఇదీ ప్రేమంటే. కాని ‘మొఘల్ ఏ ఆజమ్’లో సలీమ్గా దిలీప్ కుమార్ చూపిన ప్రేమ వేరు. ప్రేమ అంత గంభీరంగా ఉంటుందని, అంత గాఢంగా ఉంటుందని, అంత తెగింపుగా ఉంటుందని, అంత గర్జనతో ఉంటుందని, ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించే సత్తాను చిన్న గుండెలో ఇముడ్చుకుని ఉంటుందని దిలీప్ కుమార్ చూపించాడు. ఆ పాత్రకు అంతకు ముందు ఎలాంటి మోడల్ లేదు. ఏ మోడల్ అయినా అతడే చూపాడు. ‘జంజీర్’తో యాంగ్రీ యంగ్ మేన్ వచ్చాడని అమితాబ్ని చూపి అంటారు. నిజానికి యాంగ్రీ యంగ్మేన్ 1960లోనే వచ్చాడు. అతడు దిలీప్ కుమార్. రాజ్ కపూర్ వినోదం, సందేశం చూపే ప్రయత్నం చేశాడు. దేవ్ ఆనంద్ ఒట్టి వినోదమే. దిలీప్ కుమార్ వినోదం, సందేశం మాత్రమే కాదు అర్థవంతమైన ఒక జీవన అనుసరణను తన పాత్రల ద్వారా ఇస్తూ పోయాడు. మనం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ల పాత్రలను వారి సినీ ఇమేజ్ను ఒక అనుసరణీయతకు తీసుకోలేము. దిలీప్ కుమార్ను తీసుకోగలము. హీరోగా తన వయసు అయిపోయింది సరైన పాత్రలకు తగిన సంసిద్ధత తీసుకోవాలని 5 సంవత్సరాలు కెమెరా ముఖం చూడకుండా ఇంట్లో కూచున్నవాడు దిలీప్ కుమార్. ఆ తర్వాత కెమెరా ముందుకు వస్తే? అదొక ‘క్రాంతి’ (1981), ‘శక్తి’ (1982), ‘విధాత’ (1984), ‘కర్మ’ (1986), ‘సౌదాగర్’ (1991) అయ్యాయి. నువ్వొక మణివి. అవును. దానికి విలువుంది. అవును. కాని చీటికి మాటికి దానిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కిరీటంలోనే పెట్టాలి. అలా పెట్టి బతికినవాడు దిలీప్. అందుకే యాభై ఏళ్ల కెరీర్లో కేవలం 60 సినిమాలు మాత్రమే చేశాడు. దిలీప్ కుమార్ ‘నయాదౌర్’లో డాన్స్ చేశాడు. అరె అన్నారు. ‘రామ్ ఔర్ శ్యామ్’లో కామెడీ చేశాడు. పడీ పడీ నవ్వారు. ‘గంగా జమున’లో న్యాయం కోసం ఆయుధం పట్టిన గ్రామీణుడిగా చూసి అతని పక్షం వహించారు. ‘మషాల్’లో అర్ధరాత్రి వాన కురిసిన ముంబై వీధుల్లో చావు బతుకుల్లో ఉన్న భార్యను బతికించుకోవడానికి దారిన పోయే కార్లను ఆపుతూ పరిగెత్తుతూ ‘ఏయ్ భాయ్’ అని అరుస్తూ ఉంటే ఉద్వేగంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అతడు రాజేసిన స్పందనలకు నెత్తిన పెట్టుకున్నారు. చిల్లర మల్లర సినిమాలు చేయకుండా, చిల్లర మల్లర యాడ్స్లో నటించకుండా, రాజకీయ పదవుల కోసం చిల్లర మల్లర నాయకులతో స్నేహం నటించకుండా, చిల్లర మల్లర డబ్బు తీసుకుని శ్రీమంతుల పెళ్లిళ్లలో డాన్సులు చేయకుండా, చిల్లర మల్లర వాగుడు వాగకుండా, చిల్లర మల్లర ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, షోస్ చేయకుండా నటుడికి ఉండాల్సిన సంస్కారం కోసం, జ్ఞానం కోసం, శీలం కోసం, నడవడిక కోసం తన ఎదుట ఒక బెత్తం ఉన్నట్టుగా దేవుని బెత్తమో ప్రేక్షకుని బెత్తమో... దానికి జవాబుదారిౖయె ఉండటానికి ప్రయత్నించడమే దిలీప్ కుమార్ గొప్పతనం. అతడి లాంటి వాణ్ణి చూసి నేర్చుకోవాలంటే అతడి లాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రారు. అలా ఎదిగే ఐశ్వర్యం అందరికీ అబ్బదు. ఒక్కడే దిలీప్ కుమార్. ఆజ్ పురానే రాహోన్ సే కోయి ముఝె ఆవాజ్ న దే దర్ద్ మె డూబె గీత్ న దే ఘమ్ కా సిసక్తా సాజ్ న దే ► మధుబాలతో ప్రేమ..అనార్కలి దక్కలేదు దిలీప్ కుమార్, మధుబాల కలిసిన నటించిన మొదటి సినిమా ‘తరానా’ (1951) ఫ్లాప్. వాళ్ల రెండో సినిమా ‘సంగ్ దిల్’ (1952) బిలో యావరేజ్. మూడో సినిమా ‘అమర్’ (1954) యావరేజ్. వాళ్లు కలిసి నటించిన ఒకే ఒక్క సూపర్హిట్ సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’ (1960). దురదృష్ట వశాత్తూ ఆ సినిమా నాటికి వాళ్ల ప్రేమ ముగిసింది. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అని మొఘల్ ఏ ఆజమ్ సినిమాలో హిట్ పాట. దిలీప్కుమార్, మధుబాల కూడా తమ ప్రేమను దాచుకోలేదు. కలిసి మెలిసే తిరిగారు. కాని మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్కు దిలీప్తో మధుబాల ప్రేమ నచ్చలేదు. దానికి కారణం మధుబాల కూడా హీరోయిన్లలో సూపర్స్టార్ కావడం. ఇంకా ఆమె ఎదుట చాలా కెరీర్ ఉండటం. ఆమె సంపాదన కుటుంబానికి ముఖ్యం కావడం. ఒక రకంగా తండ్రికీ దిలీప్కి మధ్య మధుబాల నలిగిపోయింది. ఇది ‘నయాదౌర్’ (1957) సినిమాతో పతాక స్థాయికి చేరింది. ఆ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న మధుబాలాను షూటింగ్ అవుట్ డోర్ అనేసరికి తండ్రి నిలువరించాడు. ఔట్డోర్లో దిలీప్ ఉంటాడు కనుక తన కంట్రోల్ ఉండదు అని భయపడ్డాడు. షూటింగ్ ఆగిపోయేసరికి ఒళ్లు మండిన దర్శకుడు బి.ఆర్.చోప్రా కోర్టుకెక్కాడు. ఆ సమయంలో తండ్రి మర్యాద దిలీప్ కాపాడాలని మధుబాల ఆశించింది. కాని దిలీప్ మధుబాలకు ఆమె తండ్రికి వ్యతిరేకంగా బి.ఆర్. చోప్రా పక్షాన సాక్ష్యం చెప్పాడు. దీంతో ఆమె మనసు ముక్కలయ్యింది. ‘మొఘల్ ఏ ఆజమ్’ షూటింగ్ సమయానికి వారి మధ్య మాటలు లేవు. ‘ఒక్కసారి మా నాన్నకు సారీ చెప్పు చాలు’ అని మధుబాల అంది. దిలీప్ చెప్పలేదు. ఆ వాక్యూమ్ను నింపుకోవడానికి ఆమె హడావిడిగా వివాహితుడైన కిశోర్ కుమార్ను పెళ్లి (1960) చేసుకుంది. కాని దిలీప్, మధుబాల తమ టర్మ్స్ బాగలేకపోయినా ఎంతో ప్రొఫెషనలిజమ్తో మొఘల్ ఏ ఆజమ్లో నటించారు. ఉద్యానవనంలో ఎక్కడో దూరంగా తాన్సేన్ పాడుతూ ఉండగా వారి మధ్య ప్రణయ సన్నివేశం ఒకటి నడుస్తుంది. దానిని చూసిన వారెవరైనా వారు మాటలు మానుకున్న ప్రేమికులు అనుకోగలరా? వారి ప్రేమ కనీసం తెర మీదైనా పండింది. మధుబాలతో... ఆమె అతణ్ణే తన బిడ్డ అనుకుంది ప్రేమికులు మొండిగా ఉంటారు. మధుబాలను ప్రేమించిన దిలీప్ కుమార్ ఆమెతో పెళ్లి ఇక జరగదని అర్థమయ్యాక (1957) దాదాపు 11 ఏళ్ల పాటు మరో ప్రేమకథ వైపు చూళ్లేదు. ఆ కాలంలో అతని జీవితం లో ఏ స్త్రీ ఉందో కూడా ఎవరికీ తెలియదు. కాని తన 44 ఏళ్ల వయసులో తన కంటే 22 ఏళ్లు చిన్నది అయిన సైరా బానుతో ప్రేమలో పడ్డాడు. ఆమె హైస్కూల్ రోజుల నుంచి దిలీప్ ఫ్యాన్. చేసుకుంటే ఇలాంటి వాణ్ణే చేసుకోవాలి అనేదట. దిలీప్ కుమార్ని కలవడానికే సినిమా రంగంలోకి వచ్చిందట. కాని దిలీప్కు ఆమె పట్ల ఎటువంటి భావాలూ లేవు. ‘బచ్చీ’ (చిన్న పిల్ల) అని దూరం పెడుతూ వచ్చాడు. సినిమాల్లో తన పక్కన చాలా రోజుల తర్వాతగానీ తీసుకోలేదు. కాని సైరా ప్రేమ దిలీప్ కుమార్ పట్ల గట్టిది. వాళ్లు 1966లో వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ మగ దురహంకారి కాడు. పెళ్లయ్యాక సైరాబాను నటిగా కొనసాగడానికి అతడు ఏ అడ్డంకీ చెప్పలేదు. పెళ్లి తర్వాత సైరా దాదాపు పదేళ్లు హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్లో హిట్స్గా నిలిచిన ‘పడోసన్’, ‘విక్టోరియా నం.203’ వంటివి పెళ్లి తర్వాతే వచ్చాయి. సైరాకు దూకుడు ఎక్కువ. గర్భం దాల్చిన తర్వాత కూడా షూటింగ్లలో పాల్గొంది. ఆ సమయంలో చేసిన హార్స్ రైడింగ్ ఆమెకు ప్రమాదం తెచ్చి పెట్టిందని అంటారు. కడుపులో బిడ్డకు ఎనిమిది నెలల వయసులో ఆమెకు హై బ్లడ్ ప్రెషర్ వల్ల అబార్షన్ చేయాల్సి వచ్చింది. అంత లేటు అబార్షన్ కావడం వల్ల సైరా మళ్లీ గర్భం దాల్చే శక్తిని కోల్పోయింది. కాని దిలీప్ కాని సైరా కాని దీని గురించి ఎటువంటి ఫిర్యాదు లేకుండా జీవించారు. సైరా తనే దిలీప్కు తల్లయ్యింది. అతణ్ణే బిడ్డగా చేసుకుని అనుక్షణం చూసుకుంది. 98వ ఏట ఆఖరి నిమిషం వరకూ కూడా దిలీప్ కోసం పాకులాడిందామె. దిలీప్ మరణంతో ఆమె జీవితంలో అతి పెద్ద శూన్యం రానుంది. సైరాబానుతో పెళ్లి హీరోలకు హీరో హీరో అంటే ఎవరు? ఇన్స్పయిర్ చేసేవాడు. దేశంలో నటన విషయంలో దిలీప్ ఇన్స్పయిర్ చేసినట్టుగా మరో నటుడు చేయలేదు. నటుడు ధర్మేంద్ర పంజాబ్లో కాలేజీకి వెళ్లి వస్తూ దిలీప్కుమార్ సినిమాలు చూస్తూ ఇతనిలా హీరో అవ్వాలి అనుకుని హీరో అయ్యాడు. దిలీప్ అంటే ధర్మేంద్రకు చాలా గౌరవం. ఒక కడుపున పుట్టని తమ్ముణ్ణి అని చెప్పుకునేవాడు. దిలీప్ కుమార్ ధర్మేంద్రతో ‘దేవుడు నన్నెందుకు నీ అంత అందంగా పుట్టించలేదు’ అనేవాడు. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి ఢిల్లీ శిబిరంలో ఉన్న ఒక బాలుడు సినిమాకు వెళ్లి అందులోని దిలీప్ను చూసి హీరో అవ్వాలనుకున్నాడు. ఆ సినిమాలో దిలీప్ పేరు మనోజ్. అదే తన పేరుగా చేసుకున్నాడు. అతడే మనోజ్ కుమార్. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ఇద్దరూ దిలీప్ కుమార్ సినిమాలు చూసి నటనను నేర్చుకున్నామని బహిరంగంగా చెప్పారు, ఆయనను ఇమిటేట్ చేస్తూ నటిస్తారు కూడా. చిన్న గొంతుతో ఇంటెన్స్గా నటించడం దిలీప్ మొదట చూపెట్టాడు. అమితాబ్, షారూక్ అలాంటి సన్నివేశాల్లో దిలీప్ మార్గమే పాటిస్తారు. ‘మాకో కొడుకు పుట్టి ఉంటే అచ్చు నీలా ఉండేవాడు’ అని సైరా షారూక్తో అంది. ధర్మేంద్రతో..., మనోజ్ కుమార్తో.., అమితాబ్, షారూక్తో.. హైదరాబాద్ అల్లుడు దిలీప్ కుమార్ హైదరాబాద్ అల్లుడు. అవును. అయితే రెండేళ్లే. 1981–83 మధ్య అతడు తన జీవితంలోకి ఇంకో స్త్రీని ఆహ్వానించాడు. ఆమె హైదరాబాద్కు చెందిన అస్మా రహమాన్. ‘నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఆమెను వివాహం చేసుకోవడమే’ అన్నాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథ ‘ది సబ్స్టాన్స్ అండ్ షాడో’లో. హైదరాబాద్లో ఒక క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన దిలీప్కుమార్కు అతని చెల్లెళ్లు అస్మా రహమాన్ను పరిచయం చేశారు. అప్పటికే ఆమెకు వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు. కాని ఆమె దిలీప్కు చాలా పెద్ద ఫ్యాన్. దిలీప్తో విపరీతంగా ప్రేమలో ఉన్న ఆమె అతణ్ణి పెళ్లాడడానికి భర్తకు విడాకులు ఇచ్చింది. దిలీప్ కూడా సైరా నుంచి దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. 1981 లో జరిగిన ఈ వివాహం 1983లో ముగిసింది. సైరా దిలీప్ను క్షమించింది. ముంబై నుంచి తిరిగి వచ్చిన అస్మా తిరిగి మునుపటి భర్తను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడిందని కథనం. ఆస్మా రహమాన్తో... నీ కంటే పెద్దవాడు ఉంటాడు దిలీప్ కుమార్ తన ఆత్మకథలో ఇలా రాశాడు. ‘ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నాను. సాధారణంగా నా పక్క సీటు వాళ్లు నన్ను గుర్తుపట్టి కొంత హంగామా సృష్టిస్తుంటారు. నా పక్కన కూచున్న పెద్ద మనిషి అలా ఏమీ చేయలేదు. కిటికీలో నుంచి చూస్తూ కూచున్నాడు. నేనే ఆయనతో మాట కలిపాను. ఇద్దరం టీ తాగాం. ఆయన ఇంకా నన్ను గుర్తించడం లేదేమిటా అనుకున్నాను. ‘సినిమాలు చూస్తారా?’ అని అడిగాను. ఎప్పుడైనా ఒకసారి అన్నాడాయన. ‘నేను సినిమాల్లో పని చేస్తాను’ అని చెప్పాను. ‘ఓ అలాగా. ఏం చేస్తారు’ అని ఆయన అడిగాడు. ‘నటుణ్ణి’ అని చెప్పాను. ఆయన అంతకుమించి ఏమీ అడగలేదు. విమానం ల్యాండ్ అయ్యాక ఇక తట్టుకోలేక నా పేరు చెప్పాను – ‘నేను దిలీప్ కుమార్ని’ అని. ‘నేను జె.ఆర్.డి టాటాని’ అన్నాడాయన. అప్పుడు అర్థం అయ్యింది నాకు... నువ్వు ఎంతైనా ఎదుగు నీ కంటే పెద్దవాడు ఉంటాడు అని. విర్రవీగడం సరి కాదని. ఈ ఘటన నన్ను ఇంకా వినమ్రుడిని చేసింది... అని రాసుకున్నాడాయన. -
ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను
దిలీప్కుమార్ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్గారి అబ్బాయి’ హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’లో దిలీప్ కుమార్ నటించారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్ ‘రామ్ ఔర్ శ్యామ్’లోనూ దిలీప్కుమార్ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్కుమార్కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్కుమార్ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం... ► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్ కుమార్గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అందరం దిలీప్ కుమార్గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్గారిని లైఫ్లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్ చేయగలిగాను. ► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్ ఏస్ఆర్ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్కుమార్తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్ చేసే చాన్స్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్గా కూడా అనిపించింది. ► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్ తీసుకెళ్లారు. దిలీప్కుమార్గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్ అప్నా అప్నా’ సినిమా చేశాను. ► రీ టేక్ అని చెప్పడానికి టెన్షన్ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ‘గోపాల్.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్ బౌమిక్ని పిలిపించారు. దిలీప్గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కోసం చాలా రోజులు వర్క్ చేశారు. ఆ కథ డిస్ట్రబ్ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశాం. దిలీప్గారు బాగా షటిల్ ఆడేవారు. బాగా ఎక్సర్సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్ చేసినా బ్రేక్ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్గా లంచ్ తిని, ఓ అరగంట రెస్ట్ తీసుకుని, మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్లో పాల్గొనేవారు. హైదరాబాద్లో, మదరాసులలో షూటింగ్ చేసినప్పుడు బస చేసిన హోటల్లో షటిల్ ఆడుకుని షూటింగ్కి వచ్చేవారు. ► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది. ► దిలీప్గారు ఎక్కువ టేక్స్ తీసుకునేవారు కాదు. ‘కానూన్ అప్నా అప్నా’కి ఖాదర్ ఖాన్ డైలాగ్ రైటర్. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ కూడా చేశారు. ఖాదర్ రాసిన వెర్షన్ తీసుకెళ్లి, దిలీప్గారు ఫైనల్గా ఒక వెర్షన్ రాసుకొచ్చేవారు. ఖాదర్ ఖాన్ రాసిన ఫ్లేవర్ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్వర్క్ చేసేవారో ఊహించవచ్చు. ► కానూన్ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్కుమార్గారిని కలిశాను. గుర్తుపట్టి, ‘గోపాల్.. ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు – కృష్ణంరాజు ► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్కుమార్. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్కుమార్కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్ క్యారెక్టర్కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్కుమార్ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్కుమార్గారు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్ క్యారెక్టర్ను జితేంద్ర చేశారు. ► సాధారణంగా దిలీప్కుమార్గారు సినిమా షూటింగ్కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్కి వచ్చేవారు. ఇందులోని ధర్మ్ రాజ్ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్కు రప్పించిందేమో! ‘భాయీజాన్’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు. ► ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్తో రెడీ కాలేదు. దిలీప్కుమార్గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్కు రెడీ అయ్యారు. ► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్ ఫంక్షన్కు దిలీప్గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్గా ఉన్నాను. పోస్టర్లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు. లెజెండ్ దూరమయ్యారు – కె. రాఘవేంద్రరావు భారతీయ సినిమా చరిత్రలో టాప్ లెజెండ్ దిలీప్కుమార్గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్ పర్సన్స్. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్ ఇండస్ట్రీ ఒక లెజెండ్ని కోల్పోయింది. ప్రముఖుల నివాళి ‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్కుమార్కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు దిలీప్కుమార్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లెజెండరీ యాక్టర్ దిలీప్కుమార్గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్కుమార్గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద. – చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్కుమార్గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్గా ఎదిగిన దిలీప్గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్ బ్లెస్డ్. – మోహన్బాబు దిలీప్కుమార్ సార్ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్. మన హృదయాల్లో దిలీప్గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – వెంకటేశ్ ప్రపంచ సినిమాపై దిలీప్కుమార్ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్ యాక్టర్. లెజెండ్స్ ఎప్పటికీ బతికే ఉంటారు – రవితేజ దిలీప్గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. – మహేశ్బాబు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్కుమార్గారి పాత్ర విలువైనది. – జూనియర్ ఎన్టీఆర్ దిలీప్కుమార్గారి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. – రామ్చరణ్ దిలీప్కుమార్గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్కే కాదు. భవిష్యత్ తరాల యాక్టర్స్కూ ఆయన ఓ స్ఫూర్తి. – అల్లు అర్జున్ ఒక ఇనిస్టిట్యూషన్ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్కుమార్కు ముందు, దిలీప్కుమార్ తర్వాత అన్నట్లు ఉంటుంది. – అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్కుమార్ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో వచ్చింది’ అని దిలీప్ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్కుమార్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్ను పిలిచాడని అనుకుంటున్నాను. – వైజయంతీ మాల నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్కుమార్ని కోల్పోయాను. మా దిలీప్ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం. – ధర్మేంద్ర నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్ సార్తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. – సంజయ్ దత్ ఇండియన్ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. – సల్మాన్ ఖాన్ అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్ సాహెబ్కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్. సలామ్! – ఆమిర్ ఖాన్ ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్ హీరో దిలీప్కుమార్ సారే. ఇండియన్ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది. – అక్షయ్కుమార్ -
22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు.. అయినా!
Dilip Kumar Saira Banu Love Story(సాక్షి, వెబ్డెస్క్): వయసులో ఇరవై రెండేళ్ల వ్యత్యాసం.. అయితేనేం అన్యోన్య దాంపత్యం వారిది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రేమ కథకు ఆ జంట ప్రాణం పోసింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 54 ఏళ్ల పాటు కలిసే జీవన ప్రయాణాన్ని కొనసాగించింది. చిన్న చిన్న అపార్థాలకే విడాకులు తీసుకుంటారనే అపవాదు ఉన్న సినీ ఇండస్ట్రీలోనే వారూ ఉన్నారు. కానీ అభిప్రాయ భేదాలు తలెత్తినా సర్దుకుపోయారే తప్ప ఒకరి చేయి ఒకరు వీడలేదు. ఆయన మరొకరిని పెళ్లాడినా.. ఆమె అర్థం చేసుకున్నారే తప్ప అడ్డుచెప్పలేదు. ఆమె సహనం వహించింది. ఆయన తప్పు తెలుసుకున్నాడు. పొరపొచ్చాలు తొలగిపోయాయి. ఎప్పటిలాగే వారి అనుబంధం కొనసాగింది. కానీ ఇప్పుడు మృత్యువు వారిని విడదీసింది. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్గా పేరొందిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారు. లక్షలాది మంది అభిమానులతో పాటు భార్య సైరా బానుకు తీరని దుఃఖం మిగిల్చారు. పన్నెండేళ్ల వయసులోనే దిలీప్తో ప్రేమలో పడ్డ సైరా! అప్పటికే దిలీప్ కుమార్ బాలీవుడ్లో స్టార్గా ఎదిగారు. 1944లో జ్వర్ భాతా సినిమాతో సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 1955 నాటికి ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారిలో సైరా బాను కూడా ఒకరు. ఆయనంటే ఆరాధన ఆమెకు. 'మొఘల్-ఎ-ఆజామ్' సినిమా సమయంలో దిలీప్ను కలవాలని ఎంతగానో ఆరాటపడ్డారు సైరా. కానీ కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదాయన. ఆమె చిన్నబుచ్చుకుంది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనను కలిసే భాగ్యం లభించింది. సైరాను చూసి చిరునవ్వు చిందించాడు దిలీప్. గాల్లో తేలిపోయిందామె. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏదో ఒకరోజు దిలీప్ను పెళ్లి చేసుకుని భార్యను కావడం తథ్యం అని ఆనాడే బలంగా నమ్మింది. దిలీప్ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు.. కానీ తన తల్లి, నటి నసీం బాను వారసత్వంతో బీ-టౌన్లో అడుగుపెట్టింది సైరా. ఎంతో మందికి జోడీగా నటించింది. అవేమీ ఆమె మనసుకు తృప్తినివ్వలేదు. ఎలాగైనా దిలీప్తో జోడీ కట్టాలి.. ఆయనకు జంటగా కనిపించాలి అని తహతహలాడేది. కానీ, దిలీప్ కుమార్ మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. తన పక్కన సైరా మరీ చిన్నదానిలా కనిపిస్తుందని ఆయన భావన. అయినా ఎన్నాళ్లని తప్పించుకుంటారు.. సైరా అందం, ఆకర్షణీయ రూపానికి ఎలా ఫిదా కాకుండా ఉంటారు. అలాంటి ఒకరోజు రానే వచ్చింది. ఆనాడు కారులో వెళ్తున్న సమయంలో.. ఓ పూదోటలో సైరాను చూశాడు దిలీప్ కుమార్. చీరకట్టులో నిండైన రూపంతో నిల్చుని ఉన్న ఆమెను చూసి, ‘‘ఇన్నాళ్లు నేను కాదనుకుంటోంది ఈ అందాల రాశినా! తను చిన్నపిల్ల కాదు. పరిపూర్ణ మహిళ. తనతో కలిసి నటించాల్సిందే’’ అనుకున్నాడు ఆయన. వెంటనే కారు దిగి, సైరాతో కరచాలనం చేశాడు. ఆనాటి నుంచి 54 ఏళ్ల వరకు ఆమె చేతిని వీడలేదు. కలిసి నటించారు.. అనుబంధాన్ని పెనవేసుకున్నారు సగీనా మహతో, చోటీ బహూ, దునియా వంటి చిత్రాల్లో జంటగా నటించారు దిలీప్- సైరా బాను. ఆ సమయంలో వారి మధ్య పరిచయం, గాఢమైన స్నేహంగా మారింది. కూతురి మనసు తెలుసుకున్న సైరా తల్లి నసీం బాను.. వీరిద్దరిని మరింత చేరువ చేసింది. వారి అనుబంధానికి వారధిగా నిలిచింది. ఈ క్రమంలో.. ఓ శుభ ముహూర్తాన దిలీప్.. సైరా ముందు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది సైరా. అతడి ప్రేమను మనస్ఫూర్తిగా ఆమె అంగీకరించింది. 22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు 1966లో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటికి సైరాకు 22 ఏళ్లు. దిలీప్ కుమార్ వయస్సు 44. ఇద్దరి మధ్యా 22 ఏళ్ల వ్యత్యాసంపై ఎన్నో విమర్శలు వినిపించాయి. వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అనే పెదవి విరుపులు. కానీ, అది తప్పని నిరూపించారు ఇద్దరూ. ఇక పెళ్లి తర్వాత కూడా సైరా కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించారు. పెద్ద హీరోలతో కలిసి పనిచేశారు కూడా. ఇటు కెరీర్, అటు వైవాహిక జీవితం సాగిపోతోందనుకుంటున్న సంతోష సమయంలో ఓ పెద్ద కుదుపు. 1972లో గర్భవతి అయ్యారు సైరా. ఇద్దరూ ఆనందంలో తేలిపోయారు. చిన్నారి రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ, విధిరాత మరోలా ఉంది. ఎనిమిదో నెలలో సైరాకు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో తలెత్తిన అనారోగ్య సమస్యల వలన ఆమె ఎప్పటికీ తల్లికాలేరని నిర్ధారించారు వైద్యులు. పలువురితో సంబంధాలు.. రెండో వివాహం ఎప్పుడైతే సైరా ఇక గర్భవతి కాలేరన్న నిజం ప్రపంచానికి తెలిసిందో.. అప్పటి నుంచి పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిపి దిలీప్ కుమార్ పేరు వినిపించేది. ఆయన మరో పెళ్లికి సిద్ధమయ్యారనేది ఆ వార్తల సారాంశం. వీటన్నిటిని చూసి, సైరాకు దుఃఖం పొంగుకొచ్చేది. దిలీప్ ఎప్పటికీ తన చేయి వీడడని మనసు ఎంతగా చెబుతున్నా.. ఎక్కడో ఏదో అనుమానం. ఊహించిందే నిజమైంది. ఆస్మా రెహమాన్ వారి జీవితాల్లో ప్రవేశించింది. పెద్ద తప్పు చేశాను.. దిలీప్ పశ్చాత్తాపం హైదరాబాద్లో ఓ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సమయంలో ఆస్మాను కలిశాడు దిలీప్. ఆయన సోదరీమణులు ఫౌజియా, సయీదాలకు స్నేహితురాలు ఆమె. వారే తనను దిలీప్నకు పరిచయం చేశారు. అప్పటికే ఆస్మా.. ముగ్గురు పిల్లల తల్లి. అయినా ఎందుకో దిలీప్ కుమార్ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆస్మాను పెళ్లాడాడు. కానీ, ఆ బంధం రెండేళ్లకే ముగిసిపోయింది. ఆస్మాకు విడాకులు ఇచ్చి మళ్లీ సైరా చెంతకే చేరాడు దిలీప్ కుమార్. జీవితంలో తను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, కొన్ని అనివార్య కారణాలు, ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని, ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలనుకుంటున్నానని దిలీప్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. నాకు ఆయనే సర్వస్వం.. అందుకే నిజానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనను కాదని వేరే మహిళను జీవితంలో ఆహ్వానిస్తే ఏ భార్య మళ్లీ ఆ భర్తను క్షమించదు. కానీ, సైరా బాను ప్రేమ అనిర్వచనీయం, అనంతమైనది కదా. అందుకే ఆమె మళ్లీ మనస్ఫూర్తిగా దిలీప్ కుమార్ను భర్తగా అంగీకరించింది. ‘‘నాకు ఎల్లప్పుడూ ఆయనే సర్వస్వం. నా జీవితంలో ఆయన ఒక్కరే. ఒక అభిమానిగా, భార్యగా ఆయనను ఆరాధించాను. నాకు తెలుసు ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ.. ఆయన నన్ను తన జీవితభాగస్వామిగా ఎంచుకున్నారు. నా కలలన్నీ నిజం చేశారు. ఆయనను ఎలా వదులుకోగలను’’ అంటూ ఒకానొక సందర్భంలో భర్తపై తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు సైరా. దిలీప్ సైతం.. ‘‘నువ్వు ఆ చందమామ కూతురువి. నాకోసం స్వర్గం నుంచి దిగివచ్చావు’’ అంటూ వీలు కుదిరినప్పుడల్లా ఆమెపై ప్రేమ కురిపించేవారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడ వదిలి ఆయనే స్వర్గలోకాలకు వెళ్లిపోయారు. తన ప్రియసఖిని విషాదంలో ముంచివేశారు! -
మూగబోయాను..సైరా భాభీ మీకు నమస్కారం!
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ దిలీప్ సాబ్’ ట్రిండింగ్లో నిలిచింది. దిలీప్ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్ భాయ్ తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న యూసుఫ్ భాయ్కి సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆయనను రాత్రి పగలూ కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. యూసుఫ్ భాయ్ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్తో తన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇంకా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తదితరులు దిలీప్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్జీ నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు ఓదార్చారు. pic.twitter.com/nPwM4myyOJ — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 यूसुफ़ भाई पिछले कई सालों से बिमार थे, किसीको पहचान नहीं पाते थे ऐसे वक़्त सायरा भाभीने सब छोड़कर उनकी दिन रात सेवा की है उनके लिए दूसरा कुछ जीवन नहीं था. ऐसी औरत को मैं प्रणाम करती हूँ और यूसुफ़ भाई कीं आत्मा को शान्ति मिले ये दुआ करती हूँ. — Lata Mangeshkar (@mangeshkarlata) July 7, 2021 Adieu Dilip Saab . Unknown to you I have been your Eklavya.Thank you for the movies.Thank you for the language . Thank you for the dignity . Thank you for being socially responsible.Thank you🙏🙏 pic.twitter.com/P5UeMUOQ8t — Azmi Shabana (@AzmiShabana) July 7, 2021 -
దిలీప్ కుమార్ కెరీర్లో అద్భుతమైన పాట ఇదే
దిలీప్ కుమార్..ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు సంపాదించిన గొప్ప నటుడు . ఆరు దశాబ్దాలకు పైగా సినీ జీవితం ఆయనది. 60పైగా చిత్రాల్లో నటించాడు. వాటిలో ఓ మచ్చుతునక ‘మొగలే ఆజమ్’. ఈ సినిమాలో సలీంగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. అప్పటికే ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ కుమార్.. ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. ఇక ఈ సినమాలోని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. బహుశా ఈ పాట వినని సంగీత ప్రియులు ఉండరేమో. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన పాట ఇది. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కానీ ఆ పాట మాత్రం కలర్లో తీశారు. ఈ పాటకి షకీల్ బదాయునీ లిరిక్స్ అందించగా, నౌషాద్ అధ్భుతమైన సంగీతం అందించాడు. మొగలే ఆజమ్’విషయానికొస్తే.. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజ్ సలీం, నర్తకి అనార్కలి ప్రేమ కథతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఇది. అప్పట్లో భారీ కలెక్షన్లతోపాటు సంచనల విజయం సాధించింది. అక్బర్ కుమారుడు సలీమ్ పాత్రలో దిలీప్ కుమార్ ఒదిగిపోయాడు. యువరాజు సలీమ్ను వీరయోధుడిగా మార్చాలనుకున్న అక్బర్ తన కురుమారిడిని యుద్ధ విద్య నేర్చుకునేందుకు చిన్నతనంలో బయటకు పంపిస్తాడు. 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సలీమ్కు .. తమ సభలో ఆస్థాన నర్తకి అయిన అనార్కలీ ప్రేమలో పడుతాడు. సలీమ్-అనార్కలీ ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్లో భగ్న ప్రేమికుడగా సలీమ్ తన నటతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 2004లో పూర్తి స్థాయి రంగుల చిత్రంగా మార్చి విడుదల చేసిన మంచి స్పందన రావడం విశేషం. 41 ఏళ్ల తర్వాత 2006లో పాకిస్థాన్ లో విడుదలైన తొలి హిందీ చిత్రంగా ఘనత కూడా సాధించింది. -
దిలీప్ కుమార్ ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా?
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ మరణం చిత్రపరిశ్రమను అశనిపాతంలా తాకింది. తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన నేడు(జూలై 7న) అందరికీ వీడ్కోలు చెప్తూ నింగికేగాడు. అందరికీ దిలీప్ కుమార్గా సుపరిచితులైన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు వరకు ఆయనను అందరూ ఇదే పేరుతోనే పిలిచేవారు. మరి ఆయన పేరెందుకు మార్చుకున్నాడు? ఎవరు మార్చారు? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. యూసఫ్ ఖాన్కు నటుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. తను తెరకెక్కించిన 'జ్వర్ భాతా' సినిమా ద్వారా ఆయనను కథానాయకుడిగా పరిచయం చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. నిన్ను నటుడిగా ఆవిష్కరించబోతున్నానని, దానికంటే ముందు నీకు స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని యూసఫ్ ఖాన్తో చర్చించింది. అప్పుడు ఆ స్క్రీన్ నేమ్తోనే అందరూ పిలుస్తారని, అందులోనూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరైతే బాగుంటుందని అభిప్రాయపడింది. అంతేకాక ఏ పేరు పెడితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అనే పేరును కూడా ఆవిడే సూచించింది. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్గా స్థిరపడ్డాడు. -
భారతీయ సినిమాకు ఆద్యుడు...అభినయం ఒక విశ్వవిద్యాలయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అస్తమయంపై సినీ సెలబ్రిటీలతోపాటు, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, ఇతర నేతలు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన ఆద్యుడు అంటూ కొనియాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సినీరంగంలో చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ దిలీప్ కుమార్కు ఘన నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినిమా లెజెండ్గా దిలీప్ ఎప్పటికీ గుర్తుండిపోతారనిపేర్కొన్నారు. ‘అసమాన తేజస్సు ఆయన సొంతం..అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని’ మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్ నిష్క్రమణపై సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. Deeply anguished by the passing away of veteran actor & former Rajya Sabha member. In the death of Shri Dilip Kumar, the world of cinema has lost one of the greatest Indian actors. #DilipKumar pic.twitter.com/kW7RMoBBJD — Vice President of India (@VPSecretariat) July 7, 2021 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దిలీప్ కుమార్ మృతిపై సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్ సాబ్ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సీఎం ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు లెజెండ్ దిలీప్ కుమార్ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారని మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నివాళులర్పించారు. భారతీయ సినీ చరిత్రను లిఖిస్తే.. దిలీప్ కుమార్కు ముందు, దిలీప్ కుమార్కు తరువాత అని పేర్కొనాల్సి వస్తుందని బాలీవుడ్ మరో సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన సహ నటుడు దిలీప్ కుమార్ను గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్థాన్లోని పెషావర్లో 1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో చాలామంది లాగే ఆయన కూడా తన పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా జ్వర్ భాటా నిర్మాత దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్గా మార్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి ఎన్నో ప్రసిద్ధ సినిమాల్లో తన నటనతో అజరామరంగా నిలిచిపోయారు. हिंदी फ़िल्म जगत के मशहूर अभिनेता दिलीप कुमार जी का चले जाना बॉलीवुड के एक अध्याय की समाप्ति है। युसुफ़ साहब का शानदार अभिनय कला जगत में एक विश्वविद्यालय के समान था। वो हम सबके दिलों में ज़िंदा रहेंगे। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें। विनम्र श्रद्धांजलि pic.twitter.com/PEUlqSYk3i — Arvind Kejriwal (@ArvindKejriwal) July 7, 2021 My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji. His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630 — Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021 Dilip Kumarji was the doyen of Indian Cinema and will forever be remembered. Condolences to his family and friends. May the legend's soul rest in eternal peace. pic.twitter.com/s8kRj8cFdw — Mohanlal (@Mohanlal) July 7, 2021 T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
దిలీప్కుమార్ మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్కుమార్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దిలీప్ కుమార్ మృతి భారతీయన సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని సీఎం జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణం బాధాకరం. నేటి తరం నటులకు ఆయన ఆదర్శం. మీదైన నటనతో మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సర్కు ధన్యవాదాలు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్ (98) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ను ఏర్పరచుకున్నారు. దశాబ్దాల పాటు హిందీ చలనచిత్ర రంగాన్ని ఏలారు. భారతీయ చలన చిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్గా చెప్పుకొనే తరానికి చెందిన నటుడాయన. దేవదాస్, మొఘల్-ఎ-ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి మైల్ స్టోన్స్ వంటి సినిమాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్కుమార్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. -
Dilip Kumar: ఓ శకం ముగిసింది.. సినీ తారల సంతాపం
భారతీయ లెజండరీ నటుడు దిలీప్ కుమార్(98) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ శకం ముగిసిందని సంతాపం ప్రకటిస్తున్నారు. సీనీ పరిశ్రమలో లెజెండ్గా దిలీప్కుమార్ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారు. తనదైన నటనతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP. — Narendra Modi (@narendramodi) July 7, 2021 ‘భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసింది. ఇలాంటి గొప్ప నటుడు మళ్లీ చూడలేం.కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్ మృతి బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. An Era comes to an END in the Indian Film Industry.Deeply Saddened by the passing of LEGEND #DilipKumar Saab. One of the GREATEST Actors India has ever produced,an Acting Institution & a National Treasure. Enthralled the world for several decades.May his soul Rest in Peace. pic.twitter.com/f5Wb7ATs6T — Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2021 ‘భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్కుమార్. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. Dilip Kumar Saab's contribution to the growth of Indian cinema is priceless. Rest in Peace sir. You will be missed — Jr NTR (@tarak9999) July 7, 2021 దిలీప్ కుమార్ సర్ ఇప్పుడు మాతో లేరు. అతను ఎప్పటికే లెజెండే. అతని వారసత్వం ఎప్పటికీ మన గుండెల్లో కొనసాగుతోంది. అతని కుటుంబ సభ్యలను నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’అని వెకంటేశ్ ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్కుమార్ సర్ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’అని అక్షయ్ ట్వీట్ చేశారు. To the world many others may be heroes. To us actors, he was The Hero. #DilipKumar Sir has taken an entire era of Indian cinema away with him. My thoughts and prayers are with his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/dVwV7CUfxh — Akshay Kumar (@akshaykumar) July 7, 2021 టీ 3958.. ఒక సంస్థ పోయింది. ఎప్పుడైన భారతీయన సినీ చరిత్ర రాయాల్సి వస్తే.. దిలీప్ కుమార్ ముందు.. దిలీప్ కుమార్ తర్వాత అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని అమితాబ్ ట్వీట్ చేశారు. T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని జుహులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు. గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్, దేవదాస్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆజాద్' ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం 'మొఘల్-ఎ-ఆజామ్'తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఓరకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1994లో దిలీప్కుమార్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్కుమార్ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్ కుమార్ సేవలందించారు. భారతీయ చిత్రసీమకు మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు. -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా
సాక్షి, ముంబై: వరుస సంఘటనలు బాలీవుడ్ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ప్రముఖ నటి మందిరా బేడీ భర్త హఠాన్మరణం బాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, మరో ప్రముఖ యాక్టర్ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం మరింత ఆందోళనకు గురి చేసింది. జూన్ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత, దిలీప్ కుమార్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దిలీప్ కుమార్ (98)కు మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యంపైఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా బుధవారం ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియాతో బాధపడుతున్న షా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు షా బాగానే స్పందిస్తున్నారని షా మేనేజర్ ధృవీకరించారు. అటు నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.త్వరలో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామని నసీరుద్దీన్ షా భార్య, నటి రత్నా పథక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆసుప్రతిలో చేర్పించాల్సి వచ్చిందన్నారు. కాగా మందిరా బేడీభర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత Gold Price: గుడ్న్యూస్,ఈ ఒక్క నెలలోనే ఎంత తగ్గిందో తెలుసా? -
ముంబై: శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్
-
శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్కుమార్ అస్వస్థతకు లోనయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 98 ఏళ్ల వయసున్న ఈ నటుడిని సీనియర్ వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు. దిలీప్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన 1944 లో జ్వార్ భాటాతో వెండితెరపై కాలు మోపారు. కోహినూర్, ఆజాద్, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా 1998లో 'ఖిలా' చిత్రంలో కనిపించారు. చదవండి: Evaru Meelo Koteeswarulu: ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్ కరోనాని ఓడించేందుకు స్టార్ హీరోలు -
దిలీప్ సాబ్ నా శ్వాస
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి సైరా బాను ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి సైరా బాను మాట్లాడుతూ– ‘‘దిలీప్ సాబ్ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. ఆయన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంట్లో తన గదిలో నుంచి హాలు వరకూ నడవగలుగుతున్నారు. గడుస్తున్న ప్రతీ రోజునీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఏదో అభినందనల కోసమో, అంకితభావం ఉన్న భార్య అనిపించుకోవాలనో ఆయన్ను చూడటంలేదు. ఆయన్ను తాకడం, హత్తుకోవడం నా జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలుగా భావిస్తాను. దిలీప్ సాబ్ అంటే నాకంత ఆరాధన. ఆయనే నా శ్వాస. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థించండి’’ అని అన్నారు. డిసెంబర్ 11తో దిలీప్ కుమార్కి 98 ఏళ్లు వస్తాయి. 1966 అక్టోబర్ 11న దిలీప్ కుమార్, సైరా బాను వివాహం జరిగింది. -
‘ఫ్లూట్ ఆవు ముందు ఊదు..’
‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అని తెలుగులో పాపులర్ డైలాగ్ ఒకటుంది. దీన్ని కాస్త మార్చి ఆవు ముందు ఊదండి.. అంటున్నారో బీజేపీ నేత. పురాణాల్లోని శ్రీకృష్ణుడి మాదిరిగా ఆవు ముందు ఫ్లూట్ ఊదితే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా పాలు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. అస్సాం బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ శనివారం సిల్చార్లోని బరాక్ వ్యాలీలో జిరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందంటూ మంగళవారం ఆయన తన వాదనను సమర్థించుకున్నారు. గుజరాత్లోని ఎన్జీఓ కొన్ని సంవత్సరాల క్రితం ఒక అధ్యయనం చేపట్టిందని, వేణువు ద్వారా పలికించే రాగాలతో గోవుల్లో పాల ఉత్పత్తి పెరిగిందని శాస్త్రీయంగా నిరూపించిందన్నారు. మృదువైన సంగీతం వినిపిస్తే గోవులు సాధారణం కన్నా మూడు శాతం ఎక్కువగా పాలు ఇచ్చినట్టు 2001లో ఇద్దరు సైకాలజిస్టులు నిరూపించారని తెలిపారు. ఇక చెవులు చిల్లులు పడే సంగీతం, ఫాస్ట్ మ్యూజిక్ను అవి ఇష్టపడవని వారు పేర్కొన్నట్టుగా వెల్లడించారు. కాగా స్వచ్ఛమైన తెల్ల పాలను ఇచ్చే విదేశీ జాతి ఆవుల పాల కన్నా లేత పసుపు రంగులో ఉండే భారతీయ ఆవుల పాలు చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయన్నారు. భారతీయ ఆవుల పాలతో తయారైన జున్ను, వెన్న వంటి ఉత్పత్తులు కూడా శ్రేష్టమైనవని పాల్ చెప్పారు. భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు ఆవులను అక్రమంగా తరలిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు గోమాతగా పూజించే ఆవుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉందని దిలీప్ కుమార్ పాల్ పేర్కొన్నారు. -
ఒక్క కట్ లేకుండా...
దిలీప్కుమార్ సల్వాది హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా నచ్చిన జేమ్స్గారు అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. ‘‘దిక్సూచి’ కంటెంట్ ఉన్న చిత్రం. నిర్మాత రాజుగారు ప్యాషన్తో తీశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అమెరికాలో విడుదల చేస్తున్నాం. చిన్న సినిమా అయినా 15 లొకేషన్స్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు జేమ్స్. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారాను. ‘దిక్సూచి’ విడుదలైన తర్వాత ప్రేక్షకులే మా సినిమా గురించి మాట్లాడతారు’’ అన్నారు నరసింహరాజు. చాందినీ, సుమన్ పాల్గొన్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్, రజితసాగర్, అరుణ్బాబు, రాకేష్ ధన్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
‘కోదండరాం పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్ నేత కపిల్వాయి దిలీప్ కుమార్ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీజేఎస్ బిజినెస్ సెంటర్గా మారిపోయిందని, ఇది కోదండరాంకు తెలుసో.. తెలియదో అన్నారు. పార్టీలో వసూల్ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని, దిలీప్ కుమార్ మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. చులకన భావంతో తనపై దాడిచేస్తున్నారని, సత్యం అనే వ్యక్తిని తనపై దాడికి దింపుతున్నారని బాధపడ్డారు. విశాల్ అనే వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.(చదవండి: టీఆర్ఎస్ కారులో ‘పొగలు’) ఏదైనా అడిగితే ఏమిస్తారని, కారు, బంగ్లా ఇస్తారా? అని ఎదరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అంబర్పేట్ టికెట్ ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తూ పేపర్లలో రాయించారన్నారు. దిలీప్కుమార్కు పార్టీలో ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని, ఆడవాళ్లను మాత్రం అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం లక్ష్యాల దిశగా పార్టీ నడవట్లేదని, మనీ మిషన్గా నడుస్తుందన్నారు. దిలీప్ కుమార్కు తన రూ.2 లక్షలు ఇచ్చానని, అడిగితే పార్టీ ఫండ్ కింద తీసుకున్నామని దబాయిస్తున్నారని తెలిపారు. చదవండి: ముందస్తు ఎన్నికల ముచ్చట్లు -
మరోసారి ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు!
సాక్షి, ముంబై : అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ (93) అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విటర్ పేజీలో వెల్లడించారు. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు లోనవ్వడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కోలుకుంటున్నారని ట్వీట్ చేశారు. ఇంతకుముందు గతంలో పలుసార్లు దిలీప్కుమార్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో దిలీప్కుమార్ ఇబ్బంది పడుతున్నారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
ప్రేమకు కేరాఫ్ మధుబాల
సాక్షి, న్యూఢిల్లీ : భిన్న సంస్కతుల సమ్మిలిత దేశాల్లో ఎన్ని సామాజిక అవరోధాలున్నా ఫిబ్రవరి 14వ తేదీని 'వాలెంటైన్స్ డే'గా అంటే, ప్రేమికుల రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూనే ఉన్నారు. హిందూ అతివాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా భారత్లో కూడా ప్రేమికుల రోజును ఘనంగానే జరుపుకుంటున్నారు. ప్రేమకు, మధుర భావాలకు చిహ్నంగా సినీ ప్రేక్షకుల హదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన బాలీవుడ్ సినీ తార మధుబాల పుట్టింది కూడా ఈ రోజే. మధుబాల అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగమ్ డెహ్లావి. ఆమె 1933, ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టారు. నిజజీవిత ప్రేమలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న మధుబాల పిన్న వయసులోనే 1969, ఫిబ్రవరి 23వ తేదీన ముంబైలో మరణించారు. అలనాటి మేటి నటి దేవికా రాణినే ముంతాజ్ జెహానాకు స్క్రీన్ నేమ్ను మధుబాలగా సూచించారు. 1947లో రాజ్కుమార్ సరసన నీల్ కమల్లో నటించిన మధుబాల ఆ చిత్రానికి మాత్రం ముంతాజ్గానే పరిచయం అయ్యారు. ఆ తర్వాత తాను నటించిన అన్ని చిత్రాలకు మధుబాలగా పరిచయం. మహల్ (1949), అమర్ (1954), మిస్టర్ అండ్ మిసెస్ ‘55 (1955), చల్తీకా నామ్ గాడీ (1958), ఔరా బ్రిడ్జీ (1958), మొఘల్ ఏ ఆజమ్ (1960), బర్సాత్ కీ ఏక్ రాత్ (1960) సినిమాలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. కటిక దారిద్య్రం, సామాజిక దోపిడీ, సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, దుర్భర జీవితాల ఇతివృత్తాలు కలిగిన సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మొఘల్ ఏ ఆజమ్ చిత్రంలో అనార్కలీ పాత్రలో చెరగని ముద్రవేసి వెండితెరకు దూరమయ్యారు. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ను ప్రేమించి, ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ను పెళ్లి చేసుకొని ప్రేమాయణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె తన 27వ ఏటనే జబ్బు పడ్డారు. చిత్రమైన గుండె జబ్బుతో ఆమె మంచం పట్టారు. శరీరంలో రక్తం పంపింగ్ ఎక్కువ జరిగి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కార్చేవారు. ఆమె శరీరం నుంచి వైద్యులు ఎప్పటికప్పుడు రక్తాన్ని బయటకు తీసేవారు. తొమ్మిదేళ్లపాటు మంచానికి పరిమితమై మానసికంగా, శారీరకంగా చిక్కి శల్యమై 1969లో శాశ్వతంగా కన్నుమూశారు. ప్రేక్షకజన హృదయాల్లో మధుబాల శాశ్వతంగా నిలిచిపోయారని, వాలెంటైన్స్ డే రోజున ఆమె తప్పక గుర్తొస్తారని ఆమె సోదరి మధూర్ బ్రిజ్ ఎప్పుడూ అనేవారు. ఆశాభోంస్లే ఆమెకు పాడిన పాటలు అచ్చం మధుబాల పాడినట్లే అనిపిస్తాయి. ఆమెను మరిచిపోయినా ఆ పాటలు మాత్రం ఆమెను ఇప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి. -
దిలీప్ కుమార్కు కింగ్ఖాన్ పరామర్శ
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ను కింగ్ ఖాన్ షారూఖ్ పరామర్శించారు. సోమవారం ముంబైలోని దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లిన షారూఖ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్తో షారూఖ్ దిగిన ఫొటోను పారిశ్రామిక వేత్త ఫైసల్ ఫారూఖీ దిలీప్ కుమార్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. గత ఆరునెలల కాలంలో దిలీప్ కుమార్ను షారూఖ్ పరామర్శించడం ఇది రెండో సారి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్న షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు వ్యక్తిగా కనిపించనున్నాడు. .@iamsrk came to visit Saab at home today. -FF pic.twitter.com/GLrnqu1Ln2 — Dilip Kumar (@TheDilipKumar) 12 February 2018 -
మొదటి ఉద్యోగం
‘పన్నెండొందలా యాభై రూపాయలు. అమ్మో! అంత అమౌంటే! ఏడాదికి పన్నెండొందల యాభై రూపాయలా!’ అని మురిసిపోయాడు దిలీప్ కుమార్. అదే.. తన మొదటి ఉద్యోగం. బాంబే టాకీస్ దేవికారాణి గారు ఇచ్చిన ఉద్యోగం. అలా మొదలైంది హీరో దిలీప్ కుమార్ ప్రస్థానం. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ జీతం ఏడాదికి కాదు, ప్రతి నెలా అని. దిలీప్ కుమార్ సంతోషానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆయన తొంభై ఐదేళ్లకు దగ్గరగా ఉన్నారు. ఈ నెల 11న ఆయన పుట్టిన రోజు. ఆయన ఆరోగ్యం కొంచెం అలా అలా ఉంది. ‘పుట్టినరోజు గొప్పగా జరుపుకుంటున్నారా?’ అని అడిగితే, ‘కుటుంబంతోనే జరుపుకుంటా’ అని అన్నాడు. ట్రాజెడీ కింగ్గా.. అల్టిమేట్ మెథడ్ యాక్టర్గా ఈయనను సత్యజిత్రే అభివర్ణించాడు. అలాంటి ట్రాజెడీ హీరో ఇంకా ఎన్నో వసంతాలు జరుపుకోవాలని బాలీవుడ్ అంతా ఆకాంక్షిస్తోంది. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ (94) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. డీహైడ్రేషన్ కారణంగా దిలీప్ కుమార్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దిలీప్కుమార్ గత రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉదయ తారా నాయర్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దిలీప్కుమార్ ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. దిలీప్ కుమార్ చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. -
చిరంజీవిగారు నాకు ఇన్స్పిరేషన్
‘‘తేజాగారి ‘హోరా హోరీ’ హీరోగా నా ఫస్ట్ మూవీ. ఆయన దగ్గర పని చేయడం స్కూల్కి వెళ్లడం లాంటిది. రెండో సినిమా ‘మాయామాల్’ హీరోగా నాకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దిలీప్కుమార్. గోవింద్ లాలం దర్శకత్వంలో నల్లం శ్రీనివాస్, కేవీ హరికృష్ణ నిర్మించిన ‘మాయామాల్’ ఈ నెల 14న విడుదల కానుంది. దిలీప్కుమార్ మాట్లాడుతూ – ‘‘గోవింద్ చెప్పిన కథ చాలా నచ్చింది. మంచి థ్రిల్లర్ ఎంటర్టైనర్. ఓ ఛేజ్తో వైజాగ్లో స్టార్టయి హైదరాబాద్ చేరుకుంటాం. షెల్టర్ కోసం ఓ మాల్లోకి ఎంటరవుతాం. సినిమాలోని ఇతర పాత్రలు కూడా ఎంటర్ అవుతాయి. ఆ రాత్రి నుంచి మరుసటిరోజు ఉదయం వరకు ఏం జరిగిందనేదే కథ. హారర్ అండ్ థ్రిల్ జోనర్ మూవీ. ఒకే ఒక్క పాట, రెండు ఫైట్స్ ఉంటాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమాలంటే ఇష్టం. చిరంజీవిగారి అభిమానిని. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. సత్యానంద్గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్కి కావల్సినవన్నీ మినిమమ్ నేర్చుకుని, తర్వాత వచ్చాను’’ అని చెప్పారు. ‘‘సేమ్ బ్యానర్లో ఒక సినిమా డిస్కషన్ జరుగుతోంది. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి’’ అన్నారు దిలీప్. -
దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నారు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం మెరుగవుతోంది. దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నారని, క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. దిలీప్ కుమార్ తీవ్ర జ్వరంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దిలీప్ కుమార్ను త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తామని తెలిపారు. ఇంతకుముందు కూడా దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. -
దిలీప్ కుమార్కు సీరియస్ ఆస్పత్రిలో చేరిక
-
దిలీప్కుమార్కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ (93) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కుడి కాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
రూ.2,740 కోట్లు ఇవ్వండి
కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం నుంచి తెలంగాణను ఆదుకునేందుకు రూ.2,740 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. అకాల వర్షాలతో ఊహించని విధంగా నష్టం జరిగిం దని, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఇతోధిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ బృందాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిం చి వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, పంట నష్టాన్ని పరిశీలించారు. ఆదివారం హైదరా బాద్కు వచ్చిన బృందం వివిధ శాఖల ఉన్న తాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భం గా అకాల వర్షాలతో వాటిల్లిన నష్టాన్ని సీఎస్ రాజీవ్శర్మ శాఖలవారీగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి తాత్కాలిక ఉపశమనంగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని బృందానికి సారథ్యం వహించిన హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్కుమార్ వెల్లడించారు. అనంతరం కేంద్రం బృందం కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర బృందం సంగారెడ్డి జిల్లా అధికారులతో సమా వేశమైంది. పంట నష్టం జరిగిన తీరుపై కలెక్టరేట్ ఆవరణలో ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు. అక్కడి నుంచి నేరుగా బృందం సభ్యులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఝరాసంగం మండలం జీర్లపల్లిలో వర్షాలకు కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించారు. రాయికోడ్ మండలం జంబ్గి (కె)లో పత్తి, సోయా పంటలను పరిశీలించి.. నష్టం జరిగిన తీరుపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 31,618 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రూ.22.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పిట్లంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి, పంట నష్టాన్ని చూసి చలించిపోయింది. రెండో రోజైన సోమవారం హైదరాబాద్లో ముంపునకు గురైన వివిధ ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. -
కుదుటపడ్డ దిలీప్కుమార్.. నేడు డిశ్చార్జి
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం కుదుటపడింది. శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయనను బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఆయన ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయనను డిశ్చార్జి చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ట్రాజెడీ కింగ్గా పేరున్న దిలీప్కుమార్ తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన భార్య, అలనాటి హీరోయిన్ సైరా బాను అంతకుముందు చెప్పారు. దిలీప్ కుమార్ అసలుపేరు యూసుఫ్ ఖాన్. ఆయన ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ తెరను ఏలారు. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
'దిలీప్ బానే ఉన్నారు.. కానీ ప్రమాదం కూడా ఉంది'
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ప్రమాదం దాటిపోయిందని మాత్రం చెప్పలేమని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆస్పత్రిలో చేరిన సమయం కన్న ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో దిలీప్ కుమార్ ను శనివారం ఉదయం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 'దిలీస్ సాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కొంచెం పర్వాలేదు. కానీ కొంత ఆందోళన మాత్రం ఉంది. అపాయం తప్పినట్లు మాత్రం చెప్పలేము. కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంది. మరో 48 గంటలు గడిచిన తర్వాత స్పష్టమైన్ ఆరోగ్య సమాచారం వెల్లడిస్తాం' అని జలీల్ పార్కర్ అనే వైద్యుడు తెలిపారు. ఊపిరితిత్తుల్లో కొంత చెడిపోయాయని కూడా వెల్లడించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమల దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా. -
దిలీప్ కుమార్ మృతి
బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ అభిమానులను శోకంలో ముంచి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1944లో బాంబే టాకీస్ నిర్మాణ సంస్థలో వచ్చిన జ్వర్ భట చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన దిలీప్ కుమార్ సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పొసగకపోవటంతో ఇంటి నుంచి వచ్చేసి పూణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అయితే తొలిచిత్రం దిలిప్ కుమార్కు అంతగా గుర్తింపు తీసుకురాకపోయినప్పటికీ అనంతరం నటించిన జుగ్ను(1947) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి దిలీప్ కుమార్కు గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం షహీద్, మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్(1949) చిత్రాలతో దిలిప్ కుమార్కు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. అదే ఏడాది రిలీజైన షబ్నం చిత్రం కూడా భారీ హిట్ సాధించడం విశేషం. ఇక 1950 దశకంలో దిలీప్ కుమార్ నటించిన చిత్రాలు.. జోగన్, తరాణా, హల్చల్, దీదర్, దాగ్, దేవ్దాస్, యహుది, మధుమతి ఆయనకు ట్రాజెడీ కింగ్ ఇమేజ్ను కట్టబెట్టాయి. దాగ్(1952) చిత్రానికి గాను మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును దిలిప్ కుమార్ పొందారు. ఫుట్పాత్, నయా దౌర్, ముసాఫిర్, పైఘం లాంటి పలు సామాజిక నాటక చిత్రాలలో సైతం నటించి దిలీప్ కుమార్ మెప్పించారు. కోహినూర్, మొఘల్ ఏ ఆజమ్ చిత్రాలు దిలిప్ కుమార్కు మంచి విజయాన్నిచ్చాయి. గంగా జమునా చిత్రానికి దిలీప్ కుమార్ నిర్మాతగా కూడా వ్యవహరిచారు. దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం గంగా జమునానే కావడం విశేషం. దిలిప్ కుమార్ తన కన్నా వయసులో 22 సంవత్సరాలు చిన్నవారైన నటీమణి సైరాభానును 1966లో వివాహమాడారు. అనంతరం 1980లో దిలిప్ కుమార్ సంతానం కోసమని ఆస్మాను వివాహం చేసుకున్నప్పటికీ అది ఎక్కువకాలం నిలువలేదు. 1970 దశకంలో దిలిప్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఈ కాలంలో ఆయన నటించిన దస్తాన్(1972), బైరాగ్(1976) చిత్రాలు విజయం సాధించలేదు. దిలీప్ కుమార్ అవకాశాలను ఎక్కువగా రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్లు దక్కించుకున్నారన్న వాదన సైతం ఉంది. 1976 నుంచి 1981 వరకు దిలీప్ కుమార్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. అనంతరం అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన 'శక్తి' చిత్రానికి గాను దిలీప్ కుమార్ మరోసారి బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యధికంగా ఎనిమిది సార్లు బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డును దిలీప్ కుమార్ పొందారు. ఆయనతో సమానంగా షారుక్ ఖాన్ సైతం 8 ఫిల్మ్ఫేర్లు పొందారు. అత్యధిక అవార్డులు పొందిన నటుడిగా దిలీప్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. చిత్రరంగంలో ఆయన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్(1991), పద్మ విభూషణ్(2015) అవార్డులతో సత్కరించింది. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు దిలీప్ కుమార్ను వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో ఆయనను సత్కరించింది. దిలిప్ కుమార్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలనచిత్ర రంగంలో దిలీప్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత్లోనే కాదు పాకిస్థాన్లో సైతం దిలీప్ కుమార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. -
బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్కు తీవ్ర అస్వస్థత
ముంబై: బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో శనివారం ఉదయం ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నిమోనియాతో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. అయితే వార్తల్లో వస్తున్నట్టుగా ఆయన ఐసియులో లేరని, సాధరణ చికిత్స మాత్రమే అంధిస్తున్నట్టుగా తెలిపారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండటంతో ఆసుపత్రిలో చేర్చినట్టుగా తెలిపారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచారని ఆయన సన్నిహితుడు ఉదయ తారా నాయర్ వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దిలీప్ కుమార్ గా ఫేమస్ అయిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్, దేవదాసు సినిమాతో ఉత్తరాది ప్రేకకులతో ట్రాజెడీ కింగ్ గా పిలిపించుకున్న దిలీప్ అందాజ్, దీదర్, మొగళ్ ఈ అజమ్ లాంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. 1998లో నటించిన ఖిలా ఆయన చివరి సినిమా. -
'ఎన్నో రాత్రులు ఆ హీరోలు బాధపడేవారు'
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్దత్ జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలైనందుకు దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన సంజయ్ పుణె ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ తండ్రి, బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ దత్, దిలీప్ కుమార్ అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సంజయ్ అరెస్టయిన తర్వాత సునీల్ దత్ కుటుంబం ఎంతో బాధపడిందని సైరాభాను గతాన్ని వెల్లడించారు. 'సంజయ్ విడుదలయ్యాడని తెలిసి దిలీప్ సాబ్ చాలా సంతోషపడ్డారు. సంజయ్ అరెస్టయినపుడు సునీల్ దత్ సాబ్ కుటుంబం చాలా బాధపడింది. అప్పట్లో ఎన్నో సార్లు సునీల్ సాబ్, దిలీప్ సాబ్ కలిశారు. రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడుకునేవారు. సంజయ్ విషయం గురించి ఇద్దరూ బాధపడేవారు' అని సైరా భాను ట్వీట్ చేశారు. -
18 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోకు విముక్తి
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు హీరో దిలీప్ కుమార్ (94)కు 18 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో విముక్తి లభించింది. మంగళవారం ముంబై కోర్టు దిలీప్కుమార్ను నిర్దోషిగా ప్రకటించింది. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. దీంతో ఈ రోజు దిలీప్ కుమార్ కోర్టుకు హాజరుకాలేదు. 1998లో దిలీప్ కుమార్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన జీకే ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి గౌరవ చైర్మన్గా ఉన్నారు. ఎగుమతి వ్యాపారం చేసే ఈ కంపెనీ ఇచ్చిన చెక్లు బౌన్స్ కావడంతో బాధితులు కేసు పెట్టారు. కంపెనీ నిర్వాహకులతో పాటు దిలీప్ కుమార్పై కూడా ఫిర్యాదు చేశారు. కంపెనీ కార్యకలాపాల్లో దిలీప్ కుమార్కు నేరుగా ప్రమేయంలేదని, చెక్ బౌన్స్ కేసులో ఆయన పాత్రలేదని న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం సాగింది. ఈ రోజు కోర్టు దిలీప్ కుమార్ను నిర్దోషిగా ప్రకటించినట్టు ఆయన భార్య సైరా భాను ట్విట్టర్లో తెలియజేశారు. -
దిలీప్కుమార్కు 'పద్మవిభూషణ్' ప్రదానం
-
దిలీప్కుమార్కు పద్మవిభూషణ్ ప్రధానం
బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ సారి తన పుట్టినరోజును ఘనంగా నిర్వంచవద్దని అభిమానులను కోరిన దిలీప్ కుమార్ ఆ రోజు కూడా కేవలం తన ఇంటికే పరిమితమయ్యారు. ఈ శుక్రవారమే ఆయన పుట్టిన రోజు జరిగింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బయటికు రాని దిలీప్కుమార్కు ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయన్ను పద్మ విభూషణ్ అవార్డ్ తో గౌరవించింది. -
బాలీవుడ్ 'ట్రాజెడీ కింగ్' బర్త్ డే
రొమాంటిక్, కామిక్, హిస్టారిక్, సోషల్, ట్రాజెడీ ఇలా పాత్ర ఏదైన తనదైన హావభావాలతో రక్తి కట్టించే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్. దేవదాస్, మొగళ్ ఈ అజం, అందాజ్ లాంటి సినిమాలతో భారతీయ సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ఈ గ్రేట్ యాక్టర్ ఈ రోజు (శుక్రవారం) తన 93వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సౌత్ సినిమాతో కూడా విడదీయలేని అనుబందం ఉన్న ఆయన, చెన్నైలో సంభవించిన ప్రకృతి బీభత్సం కారణంగా ఈ సారి తన పుట్టినరోజు వేడకలకు దూరంగా ఉన్నారు. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. చిన్ననాటి నుంచే నటన పట్ల ఆకర్షితులైన ఆయన 1944లో రిలీజ్ అయిన 'జ్వార్ భట' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1949లో రిలీజ్ అయిన అందాజ్ దిలీప్ కుమార్కు స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా ఆన్, దేవదాస్, ఆజాద్, మొగళ్ ఈ అజం, గంగా జయున సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్గా ఎదిగారు. దాదాపు 60 ఏళ్ల పాటు బాలీవుడ్ వెండితెరను ఏళిన ఈ గ్రేట్ యాక్టర్ 1976లో ఐదేళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. 1981లో క్రాంతి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన మార్క్ చూపించారు. 1998లో విడుదలైన క్విలా దిలీప్ కుమార్ చివరి సినిమా ఆ తరువాత వయోభారం కారణంగా ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ను వరించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్ను తొలిసారిగా అందుకున్న నటుడు దిలీప్ కుమార్. అంతేకాదు అత్యధికంగా ఎనిమిది సార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక నటుడు ఆయన. భారత ప్రభుత్వం అందించే పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. పాకిస్థాన్ లో జన్మించిన దిలీప్ కుమార్ను అక్కడి ప్రభుత్వం 'నిషాన్ ఈ ఇంతియాజ్' అవార్డ్తో గౌరవించింది. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి కీర్తిని అందించిన లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
దిలీప్ కుమార్ (నటుడు), ఆర్య (నటుడు), విశ్వనాథన్ ఆనంద్ (చెస్ చాంపియన్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు కాబట్టి చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ వివాదాలు, పెండింగ్లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమై ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరు పుట్టిన తేదీ 11 రెండు సూర్యసంఖ్యల కలయికతో ఏర్పడ్డది గనక వీరికి జన్మతః ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో టీమ్ వర్క్తో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హ–{దోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 4, 5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దుర్గాదేవిని ఆరాధించడం, శునకాలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్లలో అన్నదానం, పిల్లలకు, వృద్ధులకు తీపి par తినిపించడం.ఙ- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
రజనీ బాటలో దిలీప్ కుమార్
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. హిందీ సినీ పరిశ్రమలో కురువృద్దుడి దిలీప్ కుమార్ ఈ నెల 11వ తేదీన.. 93వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అయితే చెన్నైలో వర్షాల కారణంగా భారీ విపత్తు సంభవించిన నేపధ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టుగా ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ చెన్నైతో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 12న తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దంటూ ఆయన తన అభిమానులు ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై వాసులు తీవ్ర దుఖంలో ఉన్న సమయంలో పండుగలు చేసుకోవటం భావ్యం కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రజనీ ప్రకటించారు. ఇక రజనీ కాంత్, దిలీప్ కుమార్ల నిర్ణయాలపై అభిమానుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. I have decided to forego all celebrations on my birthday as I am saddened by the tragedy that has swept the lives of so many in Chennai. — Dilip Kumar (@TheDilipKumar) December 8, 2015 -
పాక్లో దిలీప్ కుమార్ రహస్య పర్యటన!
భారతదేశంలో తన పర్యటన ముగియగానే పాక్ విదేశాంగ శాఖ మాజీమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ ఒక్కసారిగా విషం చిమ్మారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ భారత ప్రభుత్వం కోసం రెండు సార్లు పాకిస్థాన్లో రహస్యంగా పర్యటించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ కుమార్ భార్య సైరాబానుయే తనకు చెప్పారని అన్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సమకూర్చిన విమానంలో ఆయన ఇస్లామాబాద్కు వెళ్లారని చెప్పారు. బహుశా జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి దిలీప్ కుమార్ పాక్కు వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి ఈమధ్యనే వచ్చి వెళ్లారన్నారు. తాను మహాత్మాగాంధీ శిష్యులు కొందరిని మణిభవన్లో కలిశానని చెప్పారు. భారతదేశం నుంచి పాకిస్థాన్కు రావాల్సిన బకాయిల కోసం మహాత్మాగాంధీ నిరవధిక నిరాహార దీక్ష చేశారన్న విషయం పాకిస్థాన్లో కూడా చాలామందికి తెలియదని కసూరీ అన్నారు. తర్వాత జిన్నాహౌస్కు వెళ్లానని, కానీ అది చూడగానే తన హృదయం ద్రవించిపోయిందని చెప్పారు. దానికి ఏమాత్రం మరమ్మతులు చేయకుండా, అలాగే శిథిలావస్థలో వదిలేశారన్నారు. దాన్ని ముంబైలోని పాక్ కాన్సులేట్గా ఉపయోగించుకోవచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. జిన్నా భారతదేశంలో ఉన్న చివరిరోజు ముంబైలో దిలీప్కుమార్ను కలిశారని తెలిపారు. -
అద్వానీకి పద్మ విభూషణ్
అమితాబ్తోపాటు మరో 9 మందికీ.. నలుగురు తెలుగువారికి పద్మశ్రీ ప్రవాసాంధ్రులు డాక్టర్ నోరి, రఘురామ్లకు కూడా.. న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. నలుగురు తెలుగువారిని, ఇద్దరు ప్రవాసాంధ్రులనూ పద్మ శ్రీ వరించింది. మొత్తంగా.. 9 మందికి పద్మ విభూషణ్ , 20 మందికి పద్మ భూషణ్, 75 మందికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డు వరించినవారిలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, తదితరులు ఉన్నారు. నలుగురు తెలుగువారికి ‘పద్మ’ అవార్డులు పద్మ అవార్డుల్లో ఈసారి నలుగురు తెలుగువారికి పద్మ శ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి క్రీడారంగంలో మిథాలీ రాజ్(క్రికెట్), పీవీ సింధు(బ్యాడ్మింటన్), వైద్యరంగంలో డాక్టర్ మంజుల అణగాని, ఏపీ నుంచి కళలు విభాగంలో కోట శ్రీనివాసరావు(సినిమా) ఎంపికయ్యారు. ప్రవాసాంధ్రులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురామ్ పిళ్లరిశెట్టిలకు పద్మ శ్రీ అవార్డు లభించింది. తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురు కూడా యువతులే. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్ ఎల్కే అద్వానీ - రాజకీయాలు అమితాబ్ బచ్చన్ - కళలు ప్రకాశ్ సింగ్ బాదల్ - రాజకీయాలు డాక్టర్ డి వీరేంద్ర హెగ్డె - సామాజిక సేవ దిలీప్ కుమార్ - కళలు స్వామి రామభద్రాచార్య - ఆధ్యాత్మికం ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్ - సైన్స్ కొట్టాయన్ వేణుగోపాల్ - రాజకీయాలు అల్ హుస్సేనీ అగా ఖాన్ - వాణిజ్యం పద్మ భూషణ్ వీరికే.. జానూ బారువ (కళలు-అసోం), విజయ్ భట్కర్-సైన్స్, మహారాష్ట్ర), స్వపణ్ దాస్ గుప్తా-సాహిత్యం ఢిల్లీ), స్వామీ సత్యామిత్రానంద్ గిరి, ఎన్ గోపాలస్వామి, డాక్టర్ సుభాష్ సి కశ్యప్, డాక్టర్ గోకులోత్సవ్జీ మహారాజ్, డాక్టర్ అంబరీష్ మిట్టల్, శ్రీమతి సుధా రఘునాథన్, హరీష్ సాల్వే, డాక్టర్ అశోక్ సేథ్, రజత్ శర్మ, సత్పాల్,శివకుమార స్వామి, డాక్టర్ ఖరగ్సింగ్ వాల్దియా,ప్రొఫెసర్ మంజుల్ భార్గవ,డేవిడ్ ఫ్రావ్లే, బిల్గేట్స్, మిలిందా గేట్స్, సాయిచిరో మిసుమి పద్మశ్రీలు వీరికే.. డాక్టర్ మంజుల అనగాని,వైద్యం(తెలంగాణ), పీవీ సింధు, మిథాలీ రాజ్ (క్రీడలు, తెలంగాణ); అశోక్ భగత్, సంజయ్లీలా బన్సాలీ, కోట నివాసరావు(ఆంధ్రప్రదేశ్); డాక్టర్ దత్తాత్రేయుడు నోరీ డాక్టర్, రఘురామ పిల్లరిశెట్టి, లతోపాటు మొత్తం 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ప్రొఫైల్స్.. ఎల్కే అద్వానీ: పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. వయస్సు 87. నవంబరు 8, 1927న కరాచీ(పాకిస్తాన్)లో కృష్ణచంద్ అద్వానీ, జ్ఞానీ దేవీలకు జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. జర్నలిస్టుగా పనిచేశారు. 1942లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1990లో రామజన్మభూమి కోసం రథయాత్రతో బీజేపీ ఒక్కసారిగా జాతీయ పార్టీగా అవతరించేలా చేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా, 2002-04 మధ్యలో ఉపప్రధానిగా ఉన్నారు. 2014లో ఏడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అమితాబ్ బచ్చన్: పూర్తిపేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. వయస్సు 72. అక్టోబరు 11, 1942న అలహాబాద్లో హరివంశ్ రాయ్, తేజీ బచ్చన్లకు జన్మించారు. 1969లో సాత్ హిందుస్థానీ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. 1970లలో దీవార్, జంజీర్ వంటి సినిమాలతో స్టార్డమ్ సంపాదించుకుని బాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు. ఇంతకుముందు పద్మ శ్రీ(1984), పద్మ భూషణ్ (2001) అవార్డులు స్వీకరించారు. దిలీప్ కుమార్: అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. వయస్సు 92 ఏళ్లు. డిసెంబరు 11, 1922న పెషావర్(ప్రస్తుతం పాకిస్తాన్)లో జన్మించారు. తండ్రి లాలా గులామ్ సర్వార్ భూస్వామి, పండ్ల వ్యాపారి. 1944లో జ్వార్ భట సినిమాతో తెరంగేట్రం చేశారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్గా పేరుపొందారు. ఇంతకుముందు పద్మ భూషణ్(1991) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(1994)లు స్వీకరించారు. ప్రకాశ్ సింగ్ బాదల్: వయస్సు 87. డిసెంబరు 8, 1927న పంజాబ్లోని మలౌత్లో రఘురాజ్ సింగ్, సుంద్రీ కౌర్లకు జన్మించారు. 1947లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సర్పంచి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1970లో పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2007లో నాలుగోసారి, 2012లో ఐదోసారి సీఎంగా పదవిని చేపట్టారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అక్కడే విద్యనభ్యసించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ చేశారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్గా ప్రపంచ ప్రసిద్ధులు. ప్రస్తుతం న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ ఆసుపత్రి/వెల్ కార్నెల్ మెడికల్ కళాశాలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, ఎట్ ది న్యూయార్క్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ ఆఫ్ క్వీన్స్ రేడియేషన్ అంకాలజీ యూనిట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కోట శ్రీనివాసరావు: కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. బీఎస్సీ పూర్తిచేసి హైదరాబాద్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. తర్వాత నాటకాల కోసం ప్రమోషన్ని సైతం కాదనుకుని ఉద్యోగాన్నే వదులుకున్నారు. ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆయన సినీ జీవితానికి నాంది పలికింది. తాండ్ర పాపారాయుడు, ప్రతిఘటన, అహ నా పెళ్లంట సినిమాలతో సినీజీవితం మంచి మలుపు తిరిగింది. మూడున్నర దశాబ్దాల కాలంలో 700 చిత్రాల్లో నటించిన కోట ఆరు నంది అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ మంజుల అనగాని: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో 1968 నవంబర్ 8న జన్మించారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ చదివారు. 20 ఏళ్లలో 10 వేలకుపైగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేశారు. అపోలో, కేర్, యశోద, బీమ్స్ ఆస్పత్రుల్లో పని చేశారు. ప్రస్తుతం మాదాపూర్లోని సన్షైన్ ఆస్పత్రిలో స్త్రీ, శిశు వైద్య విభాగం డెరైక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ పి.రఘురామ్: గుంటూరులో పీవీ చలపతిరావు, ఉషాలక్ష్మి దంపతలుకు జన్మించారు. రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సల నిపుణుడిగా ప్రసిద్ధుడు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఇంగ్లాండ్లో ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం కిమ్స్-ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్లో రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సల నిపుణుడిగా పని చేస్తున్నారు. భార్య వైజయంతి, పిల్లలు సాయిరామ్, కృష్ణసాయి ఉన్నారు. -
షాపింగ్కు వచ్చి కొడుకుతో సహా అదృశ్యం
హైదరాబాద్ : షాపింగ్కు వచ్చిన వైద్యుడు తన కుమారుడితో సహా అదృశ్యమయ్యాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజు కథనం ప్రకారం... ప్రగతినగర్లో నివాసం ఉంటున్న సౌజన్య శ్రీదేవి, డాక్టర్ దిలీప్కుమార్(40) దంపతులు. సౌజన్య జేఎన్టీయూహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా.., దిలీప్ చందానగర్లోని సాయి సౌజన్య ఆసుపత్రిలో డాక్టర్. గతేడాది అక్టోబర్ 25న సౌజన్య, దిలీప్లు కుమారుడు సాయి (4)తో కలిసి షాపింగ్కు వచ్చి ప్రగతినగర్ విజేత సూపర్మార్కెట్ సమీపంలో కారు నిలిపారు. పాల ప్యాకెట్ కోసం సౌజన్య సూపర్ మార్కెట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న దిలీప్తో పాటు కుమారుడు సాయి కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేదు. దీంతో సౌజన్య తన భర్త, కుమారుడు అదృశ్యమయ్యారంటూ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా అమ్మాయి బాగా తీసింది!
‘‘మా అమ్మాయికి దర్శకత్వం అంటే మొదట్నుంచీ మక్కువ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా తీసింది. మా అమ్మాయి అని కాదు కానీ, ఈ సినిమా ఎంతో బాగా తీసింది’’ అని హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన కుమార్తె శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ ఈ నెల 13న విడుదల కానుంది. దిలీప్కుమార్, ప్రియాల్గోర్ కాంబినేషన్లో డా. సువర్ణ కొల్ల సమర్పణలో డా. కొల్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శశికిరణ్ మాట్లాడుతూ -‘‘నా కుటుంబం వెన్నుదన్నుతోనే నేనీ స్థాయికి చేరుకున్నా. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. -
సంపూర్ణ ఆరోగ్యంగా దిలీప్ కుమార్: బిగ్ బీ
ముంబై: అలనాటి బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. దిలీప్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి సంబంధించి సామాజిక నెట్వర్క్లో జరిగే ప్రచారాన్ని ఆయన ఖండించారు. 91 ఏళ్ల దిలీప్ కుమార్ ఆరోగ్యంపై సామాజిక వెబ్సైట్లలో పుకార్లు వ్యాపించాయి. యూసఫ్ సాబ్ గురించి నిరాధారమైన పుకార్లు వ్యాపించాయని బిగ్ బీ ట్విట్టర్లో తెలిపారు. దిలీప్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు సైరా జీ తనకు తెలిపినట్లు ట్విట్ చేశారు. దిలీప్ కుమార్ తన భార్య సైరాభానుతో కలసి ఇటీవల ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. ** -
పెద్దల పోరుకు సన్నద్ధం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో మరో ఎన్నిక దగ్గరపడుతోంది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ల స్థానానికి ఫిబ్రవరిలో ఎన్నిక జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ దిలీప్కుమార్ పదవీకాలం 2015 మార్చిలో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,33,506 ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో 46,291, వరంగల్ జిల్లాలో 44,512, ఖమ్మం జిల్లాలో 42,703 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందేందుకు 2011, అక్టోబరు 31కి ముందే డిగ్రీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నవంబరు 25 నుంచి డిసెంబరు 16 వరకు నమోదు చేసుకోవచ్చు. 2015 జనవరి 15న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు. ‘పట్టభద్రుల ఓటర్ల జాబితా(2008)లో ఓటరుగా నమోదై ఉన్నవారు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పనిలేదు. ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుంది. గుర్తింపు కార్డులేనివారు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది’ అని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఎన్నికలపై పార్టీల దృష్టి తెలంగాణలో జరుగుతున్న మొదటి ఎమ్మెల్సీ ఎన్నిక అవుతుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఉండనుంది. రాజకీయ పార్టీలకు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక విషయంలో ఇప్పటి నుంచే దృష్టి పెడుతున్నాయి. ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎన్నికలే అయినా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగానే పోటీ పడడం సహజంగా జరుగుతోంది. శాసనమండలి మళ్లీ ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగిన కపిల వాయి దిలీప్కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్రావును ఖరారు చేసింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పా ర్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ వరా లు చెబుతున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీల్లో ఇ ప్పుడే సందడి మొదలవుతోంది. మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార టీఆర్ఎస్లో ఎక్కువ మంది ఎమ్మె ల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఈ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.సుందర్రాజు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే... నల్లగొండ ఎంపీగా పో టీ చేసిన రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్నించనున్నారు. ఖమ్మం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కీలకంగా మారనుంది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా వరంగల్కు చెందిన బండా ప్రకాశ్కు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వామపక్ష పార్టీలు బరిలో దిగితే పొరుగన ఉన్న ఖమ్మం, నల్లగొండ నేతలకే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంది. -
దిలీప్ సాబ్కు పాక్ తాజా గౌరవం
ఒక కళాకారుడికి ఇది అపూర్వమైన గౌరవం. హిందీ చలనచిత్ర సీమలో ప్రస్తుతమున్న అత్యంత సీనియర్ హీరో దిలీప్ కుమార్కు ఆ అదృష్టం దక్కింది. పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని ఇరుకు సందుల్లో తొమ్మిది దశాబ్దాల పైచిలుకు క్రితం దిలీప్ సాబ్ జన్మించిన పాతకాలపు ఇల్లు ఇప్పుడు ‘జాతీయ వారసత్వ కట్టడం’గా గుర్తింపు పొందింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపి, సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. స్వాతంత్య్రం రాక ముందు నాటి అఖండ భారతదేశంలో 1922 డిసెంబర్ 11న పెషావర్లోని ఖిస్సా ఖవానీ బజార్లోని పురాతన గృహంలో దిలీప్ కుమార్ జన్మించారు. సినీ కళాకారుడిగా సరిహద్దులు దాటి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న దిలీప్ సాబ్ను పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఏ-ఇమ్తియాజ్’తో 1998లో గౌరవించింది. కాగా, ఇప్పుడిలా ఆయన పుట్టిన పాతకాలపు ఇంటిని జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించి, దాన్ని మ్యూజియమ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఈ 130 చదరపు మీటర్ల విస్తీర్ణపు ఇంటిని పునరుద్ధరించి, పెషావర్ నుంచి ముంబయ్ దాకా సాగిన దిలీప్ ప్రస్థానాన్ని తెలిపేలా అందులో మ్యూజియమ్ పెట్టనున్నారు. మ్యూజియమ్ గ్యాలరీని దిలీప్ సాబ్కు అంకితమివ్వనున్నారు. భవనాన్ని కొనుగోలు చేసి, వీలైనంత త్వరగా ఈ పనులన్నీ పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి దిలీప్ కుమార్ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. నిజానికి, పన్నెండు మంది తోబుట్టువుల్లో ఒకరైన దిలీప్ సాబ్ అసలు పేరు - మహమ్మద్ యూసఫ్ఖాన్. ఆయన తండ్రి ఓ పండ్ల వ్యాపారి. పెషావర్లో, ముంబయ్కి సమీపంలోని దేవాలీలో ఆయనకు పండ్ల తోటలు ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే 1930లలో ఈ ఫష్తూన్ కుటుంబం ముంబయ్కి తరలి వచ్చింది. 1944లో ‘జ్వర్ భాటా’తో సినీ రంగ ప్రవేశం చేసిన యూసఫ్ సినిమాల్లో తన పేరును దిలీప్ కుమార్గా మార్చుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్లు రెంటిలోనూ లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న దిలీప్కు ఇప్పుడిలా పాక్ ప్రభుత్వం ద్వారా దక్కిన గౌరవం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. సరిహద్దుకు ఆవల మరికొందరు: స్వాతంత్రానికి పూర్వం రోజుల్లో పాకిస్తాన్లో జన్మించి, ముంబయ్కి వచ్చిన హిందీ చిత్రాల ద్వారా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన సినీ ప్రముఖుల్లో రాజ్ కపూర్, సునీల్ దత్, యశ్చోప్రా, శేఖర్ కపూర్లు కూడా ఉన్నారు. యశ్చోప్రా, శేఖర్లు లాహోర్లో జన్మించగా, సునీల్దత్ పంజాబ్లోని ఝీలమ్ జిల్లాలో పుట్టారు. రాజ్కపూర్ సైతం దిలీప్ సాబ్ లాగానే పెషావర్లోని ఖిస్సా ఖవానీ బజార్ ప్రాంతంలోనే ఓ ఇంట్లో జన్మించడం విశేషం. ప్రస్తుతం ఆ పాతకాలపు ఇల్లు పునరుద్ధరణ జరుగుతోంది. రాజ్కపూర్ గౌరవార్థం ఆ ఇంటిని సైతం మ్యూజియమ్గా మారుస్తున్నారు. -
మా అమ్మాయి దర్శకురాలిగా విజయం సాధిస్తుంది :ఎమ్మెస్ నారాయణ
‘‘మా అమ్మాయి ఇప్పటివరకూ ఏం చేసినా విజయం సాధించింది. దర్శకురాలిగా కూడా తను విజయం సాధిస్తుంది. ఈ సినిమా విషయంలో నేను ఇన్వాల్వ్ కాలేదు. ఆమె పూర్తి స్వేచ్ఛతో చేసింది’’ అని నటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన తనయ శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్కుమార్, ప్రియాల్ గోర్ జంటగా ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా॥కొల్లా నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఎమ్మెస్ నారాయణ పాటల సీడీ ఆవిష్కరించి, దర్శకుడు దశరథ్కు ఇచ్చారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. శశి మంచి దర్శకురాలిగా రాణించాలి’’ అన్నారు. పాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతోందని కోట శ్రీనివాసరావు ప్రశంసించారు. దర్శకురాలు మాట్లాడుతూ, ‘‘మలయాళ చిత్రం ‘తట్టత్తిన్ మరియత్తు’కి ఇది రీమేక్. అవుట్పుట్ బాగా వచ్చింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నట శిక్షకులు ‘వైజాగ్’ సత్యానంద్, కొండవలస, సందీప్ కిషన్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగుల ప్రపంచంలో నేను!
-
జూన్లో దిలీప్ సాబ్ ఆత్మకథ
హిందీ చిత్రసీమకు పెద్ద దిక్కులాంటివారు దిలీప్కుమార్. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన కథానాయకుడాయన. ముఖ్యంగా విషాదాంత ప్రేమకథలపై చెక్కుచెదరని ముద్ర వేశారాయన. అందుకే ఆయన్ని ‘ట్రాజెడీ కింగ్’ అంటారు. ఇటీవలే ఈ బాలీవుడ్ లెజెండ్ 91వ పుట్టినరోజు జరుపుకున్నారు. దిలీప్ వ్యక్తిగత, వృత్తిజీవితం గురించి తెలుసుకోవాలని ఈ తరం వారికీ ఆసక్తి ఉంది. అయితే పూర్తి స్థాయి సమాచారం దొరకడంలేదు. ఆ లోటు త్వరలోనే నెరవేరనుంది. దిలీప్కుమార్ ఆత్మకథతో ‘సబ్స్టన్స్ అండ్ ది షాడో’ పేరుతో ఓ పుస్తకం తయారయ్యింది. సబ్స్టన్స్ అంటే సారాంశం, పదార్థం, సారం.. ఇలా పలు అర్థాలు వస్తాయి. దిలీప్ అసలు పేరు యూసుఫ్ఖాన్ని ఉద్దేశించి సబ్స్టన్స్ అని, ది షాడో అంటే దిలీప్కుమార్ అనే వెండితెర పేరును ఉద్దేశించి పెట్టినదని సమాచారం. సహనటీనటులతో తన అనుబంధం, రాజ్కపూర్, దేవానంద్ లాంటి నటులతో ఉన్న వైరం.. ఇలా పలు విషయాలను స్వయంగా దిలీప్కుమార్ చెప్పగా, రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. మధుబాలతో తన అనుబంధం గురించి కూడా దిలీప్ అందులో చెప్పారట. జూన్ 9న అమితాబ్బచ్చన్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. దిలీప్కుమార్ సతీమణి, నటి సైరాభాను పరిశ్రమ ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి, ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. దిలీప్సాబ్ జీవితంలోనే అత్యంత ఘనమైన వేడుకలా చేయాలనే ఆకాంక్షతో సైరాభాను ఉన్నారట! -
సామాజిక హరిత తెలంగాణకు కృషి
రోడ్ షోలో ఆర్ఎల్డీ ఎంపీ, సినీనటి జయప్రద హన్మకొండ చౌరస్తా, న్యూస్లైన్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యం.. సామాజిక హరిత తెలంగాణ కోసం ఆర్ఎల్డీ పాటుపడుతుందని ఆ పార్టీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి దిలీప్కుమార్ పక్షాన శనివారం జయప్రద నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో దిగిన ఆమెకు కపిలవాయి దిలీప్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న జయప్రద ముందుగా మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన రోడ్షోలో అక్కడక్కడా వాహనం పైనుంచే ప్రసంగించారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పటి నుంచి దిలీప్కుమార్ తనకు పరిచయమని చెప్పారు. సిన్సియర్ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించిన దిలీప్కు ప్రజాప్రతినిధిగా అంతకంటే రెట్టింపు స్థాయిలో పనిచేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఆమె వెంట కపిలవాయి దిలీప్కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరాదిలీప్, జిల్లా అధ్యక్షుడు సంగాల ఇర్మియా, కాకిరాల హరిప్రసాద్, చెరుకూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోలో గోండు, కోయగిరిజ సంప్రదాయ వేషధారణలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. -
షేక్... హ్యాండ్
‘పశ్చిమ’లో రగులుతున్న టికెట్ పంచాయితీ టీఆర్ఎల్డీ విలీనంపై ‘హస్తం’ఆశావహుల గుర్రు దిలీప్కు అవకాశమిస్తే ఓడిస్తామని హెచ్చరికల జారీ సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సీటు టికెట్ కాంగ్రెస్ పార్టీలో లొల్లి పుట్టిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఈ సెగ్మెంట్లో టికెట్ కేటాయింపు సవాల్గా మారింది. వరంగల్ పశ్చిమ సీటును ఆశిస్తున్న వారు కాంగ్రెస్లోనే డజనుకుపైగా ఉన్నారు. వీరందరినీ కాదని టీఆర్ఎల్డీ కోటాలో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్కు అవకాశమిస్తారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేయూలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహుల్లో కలకలం మొదలైంది. వారు ఇప్పటికే తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. టీఆర్ఎల్డీ కోటాలో ఈ సీటు కేటాయింపు ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఖండించకపోవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కపిలవాయికి ‘పశ్చిమ’ టికెట్ కేటాయించిన పక్షంలో ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఎంతకైనా తెగిస్తాం... కాంగ్రెస్ నేతలను కాదని దిలీప్కుమార్కు టికెట్ ఇస్తే... అందరం కలిసి ఒకరిని బరిలోకి దిం పి గెలిపించుకుంటామని కాంగ్రెస్లో పశ్చిమ టికెట్ను ఆశిస్తున్న ఆశావహులు చెబుతున్నా రు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు స్పష్టం చేసి న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటామని అం టున్నారు. ఏఐసీసీ స్థాయిలో ఏదైనా జరిగి దిలీ ప్కుమార్కు టికెట్ ఇస్తే... ఎంతకైనా తెగిస్తామని పీసీసీ జాబితాలో పేర్లు ఉన్న ముగ్గురు నేతలు స్పష్టం చేస్తున్నారు. దిలీప్కుమార్కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయమని... ఆయన స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తామని, కాంగ్రెస్ శ్రేణులే ఆయనను ఓడిస్తాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడి పార్టీని బతికించుకున్న తమను కాదని, ఇప్పటికే పదవిలో ఉన్న దిలీప్కు ప్రాధాన్యం ఇస్తే సహించలేదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇన్నాళ్లు పనిచేసిన వ్యక్తికి సీటు ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేరని వాపోతున్నారు. పొన్నాల ఏం చేస్తారో... టీఆర్ఎస్తో పొత్తు ఉండదనే స్పష్టత రావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆశలతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎల్డీ అంశం తెరపైకి రావడం కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళనపెంచింది. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న వారు ఏకంగా 14 మంది ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన తుది జాబితాలోనే నాయిని రాజేందర్రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి, పీవీ.రాజేశ్వరరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, హరిరమాదేవి, జి.రమాకాంత్రెడ్డి, పి.రామేశ్వరరెడ్డి, పి.హరీందర్రెడ్డి, నరోత్తంరెడ్డి, గంటా నరేందర్రెడ్డి, కె.నరేందర్రెడ్డి, జి.ప్రకాశ్రెడ్డి పేర్లు వరుసగా ఉన్నాయి. ఇంత మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో తుది జాబితాలో ఎంతమంది పేరు పెట్టాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కేంద్రంలోని నియోజకవర్గం కావడంతో ఈ సీటు విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరూ జోక్యం చేసుకోవడంలేదు. ఎవరికి సీటు దక్కినా... అసంతృప్తులకు పొన్నాల లక్ష్మయ్య బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. సొంత పార్టీ అసంతృప్తులపైనే ఆందోళన చెందుతున్న పొన్నాలకు... దిలీప్కుమార్ ఈ సీటును ఆశిస్తుండడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఎలా వ్యవహరిస్తారనే అంశం కాంగ్రెస్లో చర్చనీయూంశంగా మారింది. -
ఆశావహుల మెడపైపొత్తుల కత్తి
సాక్షిప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉండదని స్పష్టత రావడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశిం చారు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుకూలత ఉందని... ఇప్పుడే పోటీ చేయాలని కొత్త నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పొత్తులు ఉండవని అన్ని రకాలుగా పోటీకి సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సీసీఐ పొత్తు, టీఆర్ఎల్డీ విలీనం పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ రెండు పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలే చెబుతుండడంతో పోటీ చేసే ఆలోచనతో ఉన్న వారికి షాక్ తగిలినంత పనవుతోంది. సీపీఐ పొత్తుతో ఒక అసెంబ్లీ సీటు, టీఆర్ఎల్డీ విలీనంతో ఇంకో సీటు... కాంగ్రెస్కు తగ్గనున్నాయి. టీఆర్ఎల్డీ విలీనం జరిగితే వరంగల్ పశ్చిమ సీటును ఎమ్మెల్సీ దిలీప్కుమార్కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐకి ఇచ్చే అసెంబ్లీ స్థానం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సీపీఐతో సర్దుబాటు, టీఆర్ఎల్డీ విలీనంతో రెండు సీట్లు పోతే కాంగ్రెస్ వారికి పది సీట్లు మాత్రమే ఉండనున్నాయి. ఇది కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలకు ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు ఖరారైందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని ఇరు పార్టీల ముఖ్యలు చెబుతున్నారు. సీపీఐతో పొత్తులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కనీసం ఒక అసెంబ్లీ సీటును.. మొత్తం 12 సీట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రధానంగా మహబూబాబాద్ సీటును తమకు ఇవ్వాలని కోరుతోంది. 1967, 1994లో ఇక్కడ సీపీఐ గెలిచింది. 1972, 1989లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీటు విషయంలో సీపీఐ తీవ్రంగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోత్ కవిత ఉన్నారు. కవిత తండ్రి డి.ఎస్.రెడ్యానాయక్ డోర్నకల్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రం వర్తింపజేసి మహబూబాబాద్ను సీపీఐకి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐ జిల్లాలో రెండో సీటు కోరితే స్టేషన్ఘన్పూర్ ఉంటుందని తెలిసింది. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడంతో రెండు పార్టీలకు ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. రెండు పార్టీల పరిస్థితిని చూస్తే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గమే సీపీఐకి వెళ్తుందని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ఆ పార్టీలో చేరిన జి.విజయరామారావు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నర్థకంగా ఉంది. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్, టీడీపీ ఇంచార్జీలు టీఆర్ఎస్లో చేరవడం వల్లే విజయరామారావు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు సీపీఐకి సీటు కేటాయిస్తే విజయరామారావుకు మళ్లీ ఆశాభంగం తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున కాంగ్రెస్లో తమ పార్టీని విలీనం చేసే ప్రతిపాదనతో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) ఉంది. విలీనం లేకున్నా పొత్తు కుదిరే అవకాశం ఉంటుందని టీఆర్ఎల్డీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్కుమార్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎల్డీ విలీనం జరిగినా, పొత్తు కుదరినా ఈ సీటు దిలీప్కుమార్కు పోతుంది. కాంగ్రెస్లోని 12 మంది నాయకులు వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. టీఆర్ఎల్డీ విలీనం లేదా పొత్తు ప్రతిపాదనతో వీరందరిలో ఆందోళన నెలకొంది. వరంగల్ పశ్చిమ(హన్మకొండ) సెగ్మెంట్ను కాంగ్రెస్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయిస్తోంది. 2004లో టీఆర్ఎస్కు ఈ సీటు ఇచ్చినప్పుడు మినహా ఇదే జరుగుతోంది. కపిలవాయి దిలీప్కుమార్ ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్లో టీఆర్ఎల్డీ విలీనం జరిగినా... పొత్తు కుదిరినా దిలీప్కుమార్కు టిక్కెట్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బ్రాహ్మణ, వైశ్యుల్లో రాజకీయ చైతన్యం రావాలి
ఎమ్మెల్సీ దిలీప్కుమార్ హైదరాబాద్, న్యూస్లైన్: బ్రాహ్మణులు, వైశ్యుల్లో రాజకీయంగా చైతన్యం రావాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ దిలీప్కుమార్ అన్నారు. రాజ్యాధికారం అందని జాతులు అంతరించి పోయే ప్రమాదముందని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని, జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికార వాటా అడగడం తప్పుకాదని నొక్కి చెప్పారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత వైశ్య, బ్రాహ్మణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘సామాజిక న్యాయం, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికార సాధన కోసం రాజకీయ శంఖారావం’ సభలో దిలీప్ కుమార్ మాట్లాడారు. రాజకీయంగా వైశ్య, బ్రాహ్మణులు సంఘటితమై వారి ఓటు బ్యాంక్ను సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు. జేఏసీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ.. 16 శాతం జనాభా ఉన్న వైశ్య, బ్రాహ్మణులకు జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని పార్టీలూ సీట్లను కేటాయించాలన్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం చైర్మన్ సౌందర్య రాజన్ మాట్లాడుతూ, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. జేఏసీ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఆనంద్గుప్తాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, వైశ్య అభివృద్ధికి రూపొందించిన ఆడియో సిడీ, వైశ్య జాగృతి మాస పత్రికను ఆవిష్కరించారు. సభలో మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయ్, మాజీ ఎంపీ సుదీష్ రాంబోట్ల, సినీ నటి కవిత, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్ దేశపాండే, ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్, జేఏసీ కోచైర్మన్ పతంగి కమలాకర్శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలు గవర్నర్ కు ఇస్తే సీఎంలు బంట్రోతులే
కారేపల్లి, న్యూస్లైన్: రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోకి వస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బంట్రోతులుగా మారే పరిస్థితి ఉందని టీఆర్ఎల్డీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కారేపల్లికి చెందిన టీఆర్ఎల్డీ జిల్లా నాయకుడు మండెపూడి రమణయ్యను ఆదివారం దిలీప్కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చకు రాకుండా కుట్ర జరుగుతోందని, చర్చ అంశాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వడానికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపా రు. సీమాంధ్రలో ఏడాది కాలంలో హైకోర్టును, రెండేళ్లలో రాజధానిని పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. సీమాంధ్ర నేతలు సమన్యాయం కోరడంలో తప్పు లేదని, కానీ బిల్లు ను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను క్షోభపెట్టినట్లే అవుతుందన్నారు. ఆయన వెంట టీఆర్ఎల్డీ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి శేషగిరిరావు, జిల్లా అధ్యక్షుడు రజనీకుమార్రెడ్డి, మండల అధ్యక్షుడు కల్లూరి శ్రీని వాసచారి, జూపల్లి రాము, బట్టు కిరణ్ ఉన్నారు. -
దిలీప్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
-
బాలీవుడ్ మొఘల్కు శుభాకాంక్షలు తెలిపిన ఆశాపరేఖ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 91వ జన్మదినోత్సవ వేడుకులు బుధవారం ముంబయిలోని ఆయన నివాసంలో అత్యంత సాదాసీదాగా జరిగాయి. ఆ వేడుకలకు బాలీవుడ్ అలనాటి ప్రముఖ నటీ ఆశాపరేఖ్తోపాటు ధర్మేంద్ర, రాణీముఖర్జీలు తదితరులు హాజరైయ్యారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ సినిమా రచయితలు సలీం ఖాన్, హెలెన్లు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. తాను దిలీప్ కుమార్లో నటించాలని ఉందని ఆశాపరేఖ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొరికను వెల్లడించిన సంగతి తెలిసిందే. దేవదాసు, మధుమతి, మొఘల్-ఎ-అజాం చిత్రాల్లో దిలీప్ తన అద్భుతమైన నటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. -
దిలీప్ కుమార్ డిశ్చార్జి
బాలీవుడ్ వెటరన్ దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడింది. ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారు. ఈ నెల 15న అస్వస్థతకు గురైన 90 ఏళ్ల దిలీప్ కుమార్ను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని సన్నిహితులు తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మహమ్మద్ యూసుఫ్ ఖాన్గా జన్మించిన దిలీప్ సినీ రంగ ప్రవేశం చేశాక తన పేరును మార్చుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు పలు సినిమాల్లో నటించారు. 14 ఏళ్ల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు. -
మెరుగుపడిన దిలీప్ కుమార్ ఆరోగ్యం
ముంబయి : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. గుండె సంబంధిత సమస్యతో ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. ఇప్పటికే ఆయనను పలువురు సిని నటీనటులు, కేంద్రమంత్రులు వచ్చి పరామర్శించారు. దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. -
మరింత మెరుగైన దిలీప్ కుమార్ ఆరోగ్యం
ముంబై: గుండె సంబంధిత సమస్యతో నగరంలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముంది. ఈ నెల 15న అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశముందని వెల్లడించాయి. కాగా, దిలీప్ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సోమవారం కలిసి పరామర్శించారు. అంతకుముందు బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, ఫరీదా జలాల్, ఆశా పరేఖ్, రాజా మురద్, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా దిలీప్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో రాణించిన దిలీప్కు మధుమతి, దేవ్దాస్, ముఖల్ ఈ అజామ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ తదితర సినిమాలు నటునిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. -
కోలుకుంటున్ననటుడు దిలీప్ కుమార్
ముంబై : గుండెపోటుతో బాధపడుతూ గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్కుమార్ కోలుకుంటున్నారు. మరోవారంలో అతడిని డిశ్చార్జీ చేస్తామని శనివారం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘దిలీప్కుమార్ త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది. మరో రెండు రోజులపాటు అతడిని ఐసీయూలోనే ఉంచుతాం.. అతడిని వచ్చేవారం డిశ్చార్జి చేసే అవకాశముంది..’ అని అతడికి చికిత్స అందిస్తున్న లీలావతి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. కాగా దిలీప్కుమార్కు ఆస్పత్రిలో రెండు రోజులుగా పరామర్శల తాకిడి పెరిగింది. బాలీవుడ్ నటులు షబానాఅజ్మీ, ఫరీదా జలాల్,ఆషా పరేఖ్, రజా మురద్ తదితరులు వచ్చి పరామర్శించారు. -
లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్
నగరంలోని లీలావతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ హిందీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ని మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశార్జ్ చేయనున్నారని దిలీప్ కుమార్ భార్య సైరా భాను మేనేజర్ ముర్షిద్ ఖాన్ శనివారం ముంబైలో వెల్లడించారు. అయితే ఆయన క్రమంగా కొలుకున్నారని, ప్రస్తుతం అత్యవసర సేవ విభాగం (ఐసీయూ)లో ఉన్నారన్నారు. త్వరలో జనరల్ వార్డుకు మారుస్తారని ఖాన్ చెప్పారు. 90 ఏళ్ల ఆ మహానటుడు ఆదివారం ఛాతీలో తెలికపాటి నెప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు దిలీప్ను లీలావతీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దిలీప్ కుమార్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నెప్పిగా నిర్థారించారు. దిలీప్కుమార్ నటించిన జ్వార్ భాటా, మేళ, గంగా జమున, లీడర్, మొఘల్ ఏ అజాం, శక్తి, కర్మ, సౌదాగర్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మెగించిన సంగతి తెలిసిందే. -
దిలీప్ కుమార్ క్షేమం: వదంతులు నమ్మొద్దు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం పుకార్లు షికార్లు చేశాయి. ఆయన మరణించారంటూ వదంతులు వెలువడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఐతే దిలీప్ కుమార్ స్నేహితుడు ఉదయ తారానాయర్ వెంటనే స్పందించి దిలీప్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారాలను మానుకోవాలని సూచించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, వందతుల్ని నమ్మవద్దని అభిమానులను కోరారు. ఆదివారం 90 ఏళ్ల దిలీప్ కుమార్ అస్వస్థతకు గురవ్వడంతో ముంబై లీలావతి ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 'దిలీప్ ఇంకా ఐసీయూలోనే ఉన్నా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. ఆయన క్షేమంగా ఉన్నారు" అని నాయర్ చెప్పారు. -
అభిమాని ఫోన్ విసిరి కొట్టిన సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అభిమాని చేతిలోని ఫోన్ విసిరి మీడియాలో దృష్టిని ఆకర్షించాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ను సల్మాన్ ఖాన్ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో సల్మాన్ కనిపించగానే ఆతృతతో ఫోన్ లో బంధించడానికి ప్రయత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాక అభిమాని చేతిలోని ఫోన్ తీసుకుని విసిరికొట్టినట్టు బాలీవుడ్ కు చెందిన ఓ వీడియో మ్యాగజైన్ కథనాన్ని వెల్లడించింది. అనుకోని పరిణామంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, సందర్శకులతోపాటు అభిమాని కూడా బిత్తరపోయాడట. గతంలో కూడా పలు వివాదాల్లో సల్మాన్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. -
కోలుకుంటున్న నటుడు దిలీప్కుమార్
ముంబై: గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్కుమార్ కోలుకుంటున్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఆదివారం తీవ్ర గుండెనొప్పితో దిలీప్కుమార్ స్థానిక లీలావతి ఆస్పత్రిలో జాయినవ్వగా ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. దిలీప్ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దిలీప్ కుమార్ మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే దిలీప్ వయస్సు, అంతకుముందు జరిగిన గుండె ఆపరేషన్ను దృష్టిలో పెట్టుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉంచి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, దిలీప్ కుమార్ భార్య, నటి సైరా భాను మాట్లాడుతూ 14 ఏళ్ల కిందట అతడికి గుండె ఆపరేషన్ జరిగిందని తెలిపారు. -
నిలకడగా దిలీప్ కుమార్ ఆరోగ్యం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం కూడా ముంబై లీలావతి ఆస్పత్రి ఐసీయూలోనే ఉంచారు. 90 ఏళ్ల దిలీప్ కుమార్ ఆదివారం అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. 'దిలీప్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాక్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సైరా బాను ఆయన చెంతనే ఉన్నారు' అని సైరాబాను మేనేజర్ ముర్షీద్ఖాన్ చెప్పారు. కాగా దిలీప్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని ముర్షీద్ తెలిపారు. -
ఆస్పత్రిలో చేరిన దిలీప్కుమార్
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ (90) ఆదివారం అనారోగ్యానికి గురవడంతో ఆయనను ముంబైలోని బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఛాతీనొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యుడు ఒకరు చెప్పారు. -
'తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందరికి తెలుసు'
తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందిరికీ తెలుసు అని టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించి ఆరోపణలున్న కవర్ను జేఏసీకి పంపిస్తున్నానని ఆయన అన్నారు. ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలి అని దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. 2004లో తెలంగాణకు శత్రువైన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.. దీనికి బ్రోకర్ ఎవరు అని దిలీప్ కుమార్ నిలదీశారు. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే దీనికి కారకులెవరు అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ, ఆంధ్ర పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలేమిటి, ఎంత వసూలు చేశారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. డబ్బున్న వారికే టీఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తున్నారని.. ఎవరివద్ద ఎంత తీసుకున్నారని మీడియా ముఖంగా ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్ను టీఆర్ఎస్లో అవమానించలేదా అని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని, తరపై చేసిన ఆరోపణలు ఉపసంహరించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దిలీప్ కుమార్ హెచ్చరించారు.