Drug Control Administration
-
HYD: కోట్ల విలువైన నకిలీ మందుల పట్టివేత
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ శివార్లలో బుధవారం(జనవరి1) భారీగా నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.ఏకంగా రూ.2 కోట్ల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్లతో పాటు పలు మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని జిన్నారంలో మందుల తయారీ ఫ్యాక్టరీ పెట్టి నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది.ఇటీవలి కాలంలో హైదరాబాద్లో నకిలీ మెడిసిన్లతో పాటు కాలం చెల్లిన మందులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మనుషుల పప్రాణాలకు ముప్పుతెచ్చే ఈ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసులు పెడుతున్నారు. -
డీఈఏ చీఫ్ పదవి నాకొద్దు: క్రోనిస్టర్
ఫ్లోరిడా: అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్ క్రోనిస్టర్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్బరో కౌంటీ షెరీఫ్ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్గా క్రోనిస్టర్ను నామినేట్ చేస్తున్నట్టు ట్రంప్ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్పై ఉన్నాయి. అటార్నీ జనరల్గా ట్రంప్ నామినేట్ చేసిన మాట్ గేట్జ్ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. రక్షణ మంత్రిగా నామినేట్ చేసిన పీట్ హెగ్సెత్ విషయంలో కూడా ట్రంప్ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం కష్టమేనని ట్రంప్ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్తో పోటీ పడ్డారు. -
HYD: డ్రగ్ కంట్రోల్ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్(డీసీఏ) అధికారులు నగరంలోని మెడికల్ షాపులపై ఆదివారం(నవంబర్17) ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లాల్లోని మెడికల్ షాపులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని గాయత్రి మెడికల్ స్టోర్లలో మందులు సీజ్ చేశారు.1.25 లక్షల విలువగల 45 రకాల మందులు సీజ్ చేశారు. గడువు ముగిసిన మందుల నిల్వలు ఉండడం, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. గాయత్రి మెడికల్ షాపు నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.రామంతపూర్లోని ఓ మెడికల్ షాపులోనూ నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.కంటి ఇన్ఫెక్షన్ నివారణ కొరకు అమ్ముతున్న నకిలీ మెడిసిన్ను సీజ్ చేశారు. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
HYD: భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నార్కొటిక్స్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని స్టెరాయిడ్స్ డిస్ట్రిబ్యూటర్ రాకేష్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) సోదాలు నిర్వహించారు. బాడీ బిల్డింగ్, జిమ్కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్లోని శ్రీకాంత్ న్యూరో సెంటర్ లోను భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు. రెండు చోట్ల 51 రకాల స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్టెరాయిడ్స్ మొత్తం విలువ రూ.3లక్షలుంటుందని నార్కొటిక్ అధికారులు భావిస్తున్నారు. స్టెరాయిడ్స్ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావుకు బిగుస్తున్న ఉచ్చు -
HYD: డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
సాక్షి, హై దరాబాద్: నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ప్లేట్లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించింది. మలక్పేట, చైతన్యపురి, లక్డీకపూల్, హిమయాత్ నగర్,సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. -
హైదరాబాద్లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్లోని హీమో ల్యాబొరేటరీస్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మందులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విజ్ఞప్తి చేసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయని, ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడంలో భాగంగా పలు సూచనలు చేసింది. ► ప్రజలను మోసం చేయడానికి కొన్ని ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండేలా నకిలీ మందులు తయారు చేస్తున్నారు. వీటిలో అవసరమైన పదార్థాలేవీ ఉండవు. సుద్ద, మొక్కజొన్న పిండి లేదా బంగాళాదుంప పిండి మొదలైనవి కలిగి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ► నకిలీ మందులు రోగి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. ఇవి వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా, కాలక్రమేణా రోగికి వినాశకరమైన పరిణామాలు సృష్టిస్తాయి. ► కొన్ని నకిలీ మందులు చూడటానికి అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. అనుమానిత నకిలీ ఔషధం, అసలైన ఔషధం మధ్య తేడాలను గుర్తించడానికి అనుమానాస్పద ఉత్పత్తిని అదే కంపెనీకి ముందు ఉపయోగించిన ఉత్పత్తితో సరిపోల్చండి. మునుపటి ప్యాకేజింగ్తో సరిపోల్చడానికి ప్రయత్నించండి. అనుమానం వస్తే భవిష్యత్లో పోలిక కోసం మీరు ఉత్పత్తిని తరచుగా ఉపయోగిస్తుంటే దయచేసి దాని ఫొటోగ్రాఫ్ తీసుకోండి. మందులు కచ్చితత్వంతో తయారు చేస్తారు. కాబట్టి పరిమాణం, బరువు, రంగు, నాణ్యతలో ఏదైనా వైవిధ్యం నకి లీని సూచిస్తుంది. స్పెల్లింగ్ తప్పులు లేదా వ్యాకరణ దోషాలు ఉంటాయి. త యారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయండి. టాబ్లెట్లు బాటిల్లో ఉంటే అన్ని టాబ్లెట్లు ఒకేలా కనిపించాలి. మాత్రలు చిప్ లేదా పగుళ్లు లేదా తప్పు పూత కలిగి ఉంటే, ఆ ఉత్పత్తులను కూడా అనుమానాస్పదంగా పరిగణించాలి. ► పేరున్న కంపెనీలతో ఉత్పత్తి ధరను తనిఖీ చేయండి. ఇది మరింత చౌకగా లేదా భారీ తగ్గింపుతో అందిస్తే అది నకిలీ ఉత్పత్తి కావొచ్చని అనుమానించాలి. కేంద్ర ప్రభుత్వం 300 ప్రముఖ బ్రాండ్ పేర్లను గత ఆగస్టు తర్వాత తయారు చేసింది. దాని ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్పై బార్కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది. ప్యాకేజింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ► మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను పట్టుబట్టి తీసుకోవాలి. వెబ్సైట్లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుంచి మందులు కొనుగోలు చేయవద్దు. లైసెన్సు ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి. నకిలీ మందుల వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు ఫోన్ చేసి చెప్పవచ్చు. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు.... మార్కెట్లో నకిలీ డ్రగ్స్ తరలింపును గుర్తించేందుకు పలుచోట్ల తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. నకిలీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడానికి అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్లో బొల్లారంలోని ఒక గోడౌన్లో కేన్సర్ నిరోధక మందులు( నకిలీవి) స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని కాశీపూర్, ఉత్తరాఖండ్, ఘజియాబాద్ నుంచి రాష్ట్రంలోకి నకిలీ డ్రగ్స్ ప్రవేశానికి సంబంధించిన నకిలీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ డ్రగ్స్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్న నకిలీ మందుల్లో సన్ ఫార్మా (అధిక కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే రోసువాస్ 10 టాబ్లెట్లు) వంటి ప్రముఖ కంపెనీల పేర్లతో తప్పుడు లేబుల్లు ఉన్నాయి. -
హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు
-
జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాణ్యతలేని మందులకు కళ్లెం..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన మందులే ప్రజలకు అందేలా అనేక చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు లేని మందులను లేకుండా చేసేందుకు నాలుగున్నరేళ్లుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా జాతీయస్థాయితో పోలిస్తే మన రాష్ట్రంలో నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులు తక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సగటున 4% ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ మందుల శాతం 1.55 మాత్రమే. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంచుకుని తనిఖీ చేసేవారు. మూసధోరణిలో సాగే ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తిపలికింది. ఇంటెలిజెంట్ శాంపిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్గా తనిఖీల నిర్వహణ, ఇంటెలిజెంట్ శాంపిలింగ్పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్ను రూపొందించారు. ఈ విధానంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని ఏ షాప్లో తనిఖీ చేయాలనే విషయమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు నిర్వహించి, రిపోర్టులను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు శాంపిళ్ల సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో ఎస్వోపీ రూపొందించారు. మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులు, అసాధారణంగా ధరలు ఎక్కువ/తక్కువ ఉండటం.. ఇలా వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని శాంపిళ్లు సేకరించి విశ్లేషణకు లే»ొరేటరీలకు పంపుతున్నారు. నిరంతర నిఘా రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంకులు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్సేల్, రిటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తయారీ సంస్థలు, హోల్సేల్, రిటెయిల్ మందుల షాపులపై ఔషధ నియంత్రణ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు మందుల షాపుల్లో 12,686, మందుల తయారీ యూనిట్లలో 243 తనిఖీలు చేసింది. వాటిలో 3,015 నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ విశ్లేషణలో 47 నమూనాలు (1.55%) ఎన్ఎస్క్యూగా తేలింది. ఎన్ఎస్క్యూగా తేలిన ఘటనల్లో అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికి 16 కేసుల్లో దోషులకు కోర్టు శిక్ష విధించింది. -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు. కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: పలు మెడికల్ షాపుల లైసెన్స్ లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్స్లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందర్బాగ్ కోటిలోని గణేష్ ఫార్మాసూటికల్స్, అంబర్పేట బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్, నాంపల్లి సర్దార్ మెడికల్ హాల్, అక్షయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్(నాంపల్లి), లంగర్హౌజ్లోని ఆర్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, చార్మినార్ భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, హుమాయూన్నగర్ అల్-హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్.. ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీరా మెడికల్ షాప్, మంగర్బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇదీ చదవండి: గట్టు కోసం గొడళ్లతో గొడవ -
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్ను రూపొందిస్తుంది. -
ఔషధ నియంత్రణపై రెండు నాలుకలు
దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణీలో ఉన్నాయన్న కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు బయటికి పొక్కడం కలకలం రేపింది. మళ్లీ ఆయనే అధికారిక సమావేశాల్లో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నాయని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమాలున్న మందులూ దొరుకుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. ఉజ్బెకిస్తాన్, గాంబియా... రెండు వేర్వేరు దేశాల్లో సుమారు 70 మంది పిల్లలు కల్తీ దగ్గుమందు కారణంగా మరణించారు. ఇటీవలి కాలంలో సంభవించిన ఈ దుర్ఘటనకు కారణమైన దగ్గు మందు సరఫరా అయ్యింది మన దేశం నుంచే. కొన్ని వారాల క్రితం నోయిడా పోలీసులు ఉజ్బెకిస్తాన్ మరణాలకు సంబంధించి ముగ్గురు ఫార్మా కంపెనీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా... కొన్ని నెలల క్రితం గాంబియా ఘటనకు సంబంధించి దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రెండు కేసుల్లోనూ దగ్గుమందులో విషపూరిత రసాయనాలు కలిసి ఉండటం గమనార్హం. గాంబియా ఘటనలను ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం దృష్టికి తెచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు ముందులో గుర్తించిన డైఎథిలీన్ గ్లైకోల్ (డీఈజీ) కారణంగా మూత్ర పిండాలు పనిచేయకుండా పోయి పిల్లలు మరణించినట్లు అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ కూడా ఈ వారమే ధ్రువీకరించింది. ఈ ఘటనలకు కేంద్ర ఆరోగ్య శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ఫార్మా స్యూటికల్ డిపార్ట్మెంట్ల స్పందన అంతంత మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గాంబియా ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో లోపాలపై దృష్టి పెట్టాయి కానీ... ఆయా సంస్థలు గుర్తించిన అంశాల జోలికి ఇవి పోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇవ్వకపోవడాన్ని విమర్శించి ఉరకున్నాయి. ఆరోగ్య శాఖ నెపం మొత్తాన్ని గాంబియాపై నెట్టేసింది. దిగుమతి చేసుకునేటప్పుడు పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని తేల్చేసింది. అంతటితో ఆగకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కో కేసులో మరణానికీ, ఔషధానికీ ఉన్న సంబంధాన్ని వివరించలేదని వ్యాఖ్యానించింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే... గాంబియా కొన్ని కేసుల్లో శవపరీక్షలు కూడా నిర్వహించి డీఈజీ అవశేషాలను గుర్తించిందని! అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఈ ఘటనలన్నింటినీ భారత ఔషధ పరిశ్రమను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగానే పరిగణించడం! గత నెల 24న వంద భాగస్వామ్య దేశాల భారత దౌత్యవేత్తలు పాల్గొన్న సమావేశంలోనూ మాండవియా దేశంలో నాణ్యమైన మందులు తయారవుతున్నాయని నొక్కి చెప్పడం ఇక్కడ ప్రస్తావించ దగ్గ అంశం. కేంద్ర ఆర్యోగ శాఖ మంత్రి ప్రకటనల్లో ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జరిగిన ఓ రహస్య సమావేశంలో దేశంలో మందుల నియంత్రణ దుఃస్థితిని ఆయన నేరుగా అంగీకరించారు. ‘‘దేశీ మార్కెట్లో చాలా నకిలీ మందులు చలామణిలో ఉన్నాయి. కల్తీ మందులు ఎగుమతి అవుతున్నాయి కూడా. దీనివల్ల ఫార్మా రంగం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ఒప్పు కొన్నారు. ఈ దుఃస్థితికి అధికారులే కారణమని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘ఫార్మా రంగానిదే బాధ్యత. కానీ అంతకంటే ముందు ఇది మన బాధ్యత’’ అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియంత్రణ వ్యవస్థల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘ఇది చురుకుగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వ యమూ కొరవడుతోంది’’ అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అంచనా ప్రకారం, ప్రస్తుత నియంత్రణ వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల సంస్థలు, ఫార్మాస్యూటికల్ విభాగాల పేరుతో ముక్కలు ముక్కలుగా ఉంది. మాండవియా ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది. ఆ తరువాత ఆగిపోవడమే కాకుండా... అప్పటివరకూ రికార్డయిన వీడియోను కూడా ఛానల్ నుంచి తొలగించారు. అయితే వీడియో తొలగించినంత మాత్రాన విషయం బయ టకు పొక్కకుండా ఉంటుందా? నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్న విధంగానే నియంత్రణ సంస్థల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లేని, కల్తీ, నకిలీ మందులు భారతీయ మార్కెట్లో చలామణి అవుతున్నట్లు అందరికీ అధికారికంగా తెలిసిపోయింది. ఇలాంటి మందులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నట్లు... దుష్ఫలితాలూ వాటివల్లనే అన్న విషయమూ స్పష్టమైంది. మంత్రి ప్రకటనను బట్టి చూస్తే దేశ ఫార్మా రంగం దుఃస్థితికి కారణాలు ఆయనకూ తెలుసన్నమాట. మరి ఇదే నిజమైతే ఆయన, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏం చేస్తున్నట్లు? గాంబియా, ఉజ్బె కిస్తాన్ ఘటనలపై వ్యతిరేక నివేదికలు వచ్చినప్పుడు బహిరంగంగా ఫార్మా రంగాన్ని, నియంత్రణ వ్యవస్థలకు మద్దతుగా మాట్లాడటం ఎందుకు? ఈ రెండు నాల్కల ధోరణిని వదిలిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో కూడిన వ్యవహారం. దేశ ఫార్మా రంగ నియంత్రణ సంస్థల్లోని అకృత్యాలు ఇప్పుడు కొత్తగా తెలిసినవి ఏమీ కాదు. 2012లోనే ఒక పార్లమెంటరీ కమిటీ సీడీఎస్సీఓ పనితీరుపై విచారణ జరిపి, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న అక్రమాలను బయటపెట్టింది. దురదృష్టవశాత్తూ అప్పటినుంచి ఇప్పటివరకూ జరిగిన మార్పు స్వల్పమే. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులు కాగితానికే పరిమితమైపోయాయి. ప్రభుత్వాలు కూడా ఈ రంగాన్ని సంస్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేకపోయాయి. ఇంకోవైపు ఫార్మా పరిశ్రమ ఎదుగుదలకు నియంత్రణ వ్యవస్థలు ప్రతిబంధకంగా మారుతున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దేశ ఫార్మా మార్కెట్ సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పది లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని కూడా ఆయన అంచనా కట్టారు. ఇది కచ్చితంగా మంచి లక్ష్యం. కానీ భద్రత, సామర్థ్యం, మందుల ప్రమాణాలతో రాజీపడి సాధించడం ఎంతమాత్రమూ సరికాదు. స్థానిక మార్కెట్ అయినా, విదేశీ మార్కెట్ అయినా వీటిని పాటించడం అవసరం. ప్రజలందరికీ చౌకగా, చక్కగా పనిచేసే మందులు అందివ్వా లన్నదే ప్రభుత్వ లక్ష్యమైతే అందుకు ఒక సమగ్రమైన పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒకే రసాయనానికి సంబంధించి వందలాది బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దాని ధర, సామర్థ్యాల్లో అంతరమూ కనిపిస్తోంది. అహేతుకమైన మిశ్రమా లున్న మందులూ దొరుకుతున్నాయి. వేర్వేరు బ్రాండ్లు ఉండటంతో వైద్యులను ఆకర్షించేందుకు కంపెనీలు అనైతిక మార్కెటింగ్ కార్య కలాపాలకూ దిగుతున్నాయి. జన ఔషధి కేంద్రాలు కొన్ని వేలు తెరచి నంతమాత్రాన సమస్యకు పరిష్కారం లభించదు. వీటికి దన్నుగా నిలిచే సరఫరా వ్యవస్థ కూడా అత్యవసరం. నిజానికి జన ఔషధి కేంద్రాల స్థాపన ఆలోచన మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ది. 2005లోనే ఆయన యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్లో భాగంగా ఈ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఔషధ కంపెనీల నుంచి జెనెరిక్ మందులను ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించారు. ఈ ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో అత్యధికం ఇప్పుడు పనిచేయడం లేదు. లేదా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి, సమస్య పరిష్కా రానికి బహుముఖ వ్యూహం అవసరం. దేశంలోని నియంత్రణ వ్యవస్థ లను గాడిలో పెట్టడంతో మొదలుపెడితే సరైన దిశలో ముందడుగు వేసినట్లు అవుతుంది! వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘యాంటిబయోటిక్స్’కు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యాంటిబయోటిక్ మందుల అతి వినియోగాన్ని నియంత్రించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా మందుల దుకాణాల్లో ఈ మందుల విక్రయానికి కళ్లెం వేయాలని నిర్ణయించింది. యాంటీబయోటిక్స్ అతి వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వైద్యులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల దుకాణాలకు వెళ్లి సమస్య చెప్పగానే ఈ మందులు ఇచ్చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం వీటి వినియోగం మరింత పెరిగింది. అధికశాతం మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ తరహాలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల్లో జరిగే యాంటిబయోటిక్స్ విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే హెచ్చరికలు జారీ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్ 1లో ఉండే మందులను దుకాణాల్లో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీటిలో యాంటిబయోటిక్స్ కూడా ఉంటాయి. అందువల్ల షెడ్యూల్ హెచ్, హెచ్ 1 మందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మందుల దుకాణాల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను విక్రయిస్తూ తనిఖీల్లో పట్టుబడినా, ఆధారాలతో ఫిర్యాదులు వచ్చినా నెల రోజుల పాటు లైసెన్స్ను సస్పెండ్ చేయడంతో పాటు, శాశ్వతంగా అనుమతులు రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి షెడ్యూల్ హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై నిఘా ఉంచుతున్నారు. రాష్ట్రంలో 42వేల హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలు ఉన్నాయి. మందులపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా హోల్సేలర్ నుంచి ఏ మందులు ఏ రిటైల్ దుకాణానికి వెళ్లాయి, అక్కడ వాటి విక్రయాలు, రికార్డులు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు మందుల దుకాణాల్లో ఫార్మాసిస్ట్ల అందుబాటు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు హెచ్, హెచ్1 మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మందుల వినియోగంపై ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వైద్యుడి సూచన లేకుండా మందుల దుకాణాల్లో యాంటిబయోటిక్ ఇస్తే ప్రశ్నించాలి. – ఎస్. రవిశంకర్ నారాయణ్, డీజీ ఔషధ నియంత్రణ విభాగం -
ఔషధ నియంత్రణ కార్యాలయాలు ప్రారంభం
గుంటూరు (మెడికల్): ఇప్పటివరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు సొంత భవనాలు సమకూరాయి. గుంటూరులో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 12 ఔషధ నియంత్రణ కార్యాలయాలను అక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 27 నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తొలివిడతగా రూ.6.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 12 భవనాలను ప్రారంభించామని తెలిపారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు మార్కెట్లో లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జెడ్పీ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మందులా... మృత్యు గుళికలా!
ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్లాండ్లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు. మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది. ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి. ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు! పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది. ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్సైట్ ఘనంగా చెప్పుకొంది. ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు. ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు. ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే. మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది. 2020లో జమ్మూ, కశ్మీర్లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం. 2004లో రాన్బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం. -
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలి
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: ప్రజల శ్రేయస్సే ఉమ్మడి లక్ష్యంగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. సచివాలయం ఐదో బ్లాక్లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మంత్రి.. ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఔషధ నియంత్రణ విభాగానిది ముఖ్య పాత్ర అని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మందుల ఊసే ఉండకూడదని, ఈ విషయంలో ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మందుల దుకాణాలకు లైసెన్స్ల జారీ, రెన్యువల్ విషయంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. ఔషధ తయారీ కంపెనీలు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలన్నారు. ఔషధ నియంత్రణ విభాగానికి గతంలో జిల్లాల్లో ఎక్కడా కనీసం కార్యాలయాలు కూడా ఉండేవి కావని, సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఉండేలా కృషి చేశారని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీలోని ఎన్సీడీసీ(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ప్రధాన కార్యాలయం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్సీడీసీ సెంటర్ల నిర్మాణానికి మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. ఏపీ నుంచి మంత్రి రజిని పాల్గొని మాట్లాడుతూ మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో రీజినల్ ఎన్సీడీసీ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, హెచ్ ఐవీ.. ఇలా అన్ని రోగాలకు ఈ సెంటర్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేస్తారని వివరించారు. -
Corona Third Wave: బ్లాక్ మార్కెట్కు చెక్
సాక్షి, అమరావతి : కరోనా తొలి, మలి విడతల్లో విటమిన్ టాబ్లెట్లతోపాటు కొన్ని రకాల మందులకు తీవ్ర డిమాండ్ ఏర్పడడంతో మెడికల్ మాఫియా అప్పట్లో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసింది. ప్రస్తుతం మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ నాటి పరిస్థితులకు చెక్ చెబుతూ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. కరోనాకు సంబంధించిన 30 రకాల అత్యవసర మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు వారంలో రెండుసార్లు 13 జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్కెట్లో మందుల నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. ఏవైన మందుల నిల్వలు తక్కువగా ఉన్నట్లైతే డిమాండ్కు సరిపడా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే మందులు సరఫరా చేసేలా పంపిణీదారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తికి అనుమతులు ఇక కరోనా రోగుల చికిత్సలో వినియోగించేందుకు అవకాశమున్న మోల్నుపిరవిర్ మాత్రలను రాష్ట్రంలోనే తయారుచేసేందుకు ప్రభుత్వం లైసెన్స్లు ఇచ్చింది. దీంతో కరోనా మూడో దశ మందుల ప్రోటోకాల్ జాబితాలో ఈ మాత్రలకు అనుమతిస్తే వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండదు. నాట్కో, లారస్, దివీస్ ఫార్మా కంపెనీలు ఈ మందును తయారుచేయనున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, మరికొందరికి ఈ మందును వినియోగించకూడదని ఐసీఎంఆర్ వెల్లడించింది. అదే విధంగా కరోనా రెండో దశ చికిత్సలో కీలకంగా మారిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పుష్కలంగా మందుల నిల్వలు రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పుష్కలంగా వాటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పీఎస్ఏ (ఆక్సిజన్) ప్లాంట్లను భారీగా ఏర్పాటుచేసింది. దీంతో ఆక్సిజన్కు కొరత లేదు. ఎక్కడైనా ఎమ్మార్పీని మించి మందులు విక్రయిస్తే వినియోగదారులు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులపై ప్రత్యేక నిఘా ఉంచాం. నకిలీ మందులు చెలామణి కాకుండా చూస్తున్నాం. – రవిశంకర్ నారాయణ్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ -
‘డ్రగ్స్’ అణచివేతలో దేశంలో ఏపీది అగ్రస్థానం
సాక్షి, అమరావతి: డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దశాబ్దాలుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వాల తీరుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరిని కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. ఇటీవల అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా 2021లో డ్రగ్స్ అక్రమ వ్యాపారంపై దేశంలో వివిధ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను సమీక్షించింది. గల్ఫ్ దేశాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ అత్యధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తదితర పశ్చిమ రాష్ట్రాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ముఖద్వారంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు చేపట్టడంలేదని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. కానీ, వాటికంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ విధానాలను అవలంబిస్తోందని పేర్కొంది. గంజాయి, ఇతర డ్రగ్స్ దందాపై ఉదాశీనంగా ఉండడంవల్లే ఇతర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ, ఏపీలో మాత్రం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ భారీగా కేసులు నమోదు చేస్తూ దీర్ఘకాలిక వ్యూహంతో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ సత్ఫలితాలిస్తోందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేసుల నమోదు,అరెస్టుల్లోనూ అగ్రస్థానమే ఇక 2021లో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న వారిపై దేశంలో వివిధ రాష్ట్రాలు నమోదు చేసిన కేసులు, నిందితుల అరెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఏకంగా 4,144 మందిపై కేసులు నమోదు చేసింది. వారిలో 2,565 మందిని అరెస్టుచేసింది. డ్రగ్స్ దందాకు పాల్పడే వారిని వివిధ రాష్ట్రాలు చేసిన అరెస్టుల వివరాలిలా.. సెబ్ దూకుడు.. గంజాయి, ఇతర డ్రగ్స్ మాఫియాపైగత దశాబ్దంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. పరోక్షంగా గంజాయి, డ్రగ్స్ దందాకు కొమ్ముకాశాయి. అందుకే అప్పట్లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లిప్తంగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ, అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి ఒత్తిళ్లకు అవకాశమివ్వకుండా స్మగ్లర్లపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తూ ఎడాపెడా కేసులు నమోదు చేసి డ్రగ్స్ మాఫియాను బెంబేలెత్తిస్తోంది. ఏకంగా 7,405 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసి రూ.9వేల కోట్ల విలువైన 3.70కోట్ల గంజాయి మొక్కలను పెకలించి దహనం చేసింది. 2021లో గంజాయి, డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న 2,164 కేసులు నమోదు చేసింది. 4,144మందిపై కేసులు నమోదు చేసి వారిలో ఇప్పటికే 2,565 మందిని అరెస్టు చేసింది. 2010 నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో అణచివేయడం ఇదే తొలిసారి. -
విజయవాడలో అక్రమ ఔషధాల కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు. -
మంచి కబురు!
కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 2–18 సంవత్సరాల మధ్యవారికి కోవాగ్జిన్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్నుంచి పూర్తిస్థాయిలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రపంచంలోనే తొలిసారి రెండేళ్లు, అంతకుపైబడిన పిల్లలకు టీకా వినియోగించే దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ వ్యాక్సిన్ను రూపొందించిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడు దశల క్లినికల్ పరీక్షల డేటాను అందజేసింది. తుది దశ సమాచారం రావాల్సివుంది. జైకోవ్–డీ అనే టీకాకు సైతం అత్యవసర విని యోగానికి అనుమతులు లభించాయి. అయితే అది 12–18 సంవత్సరాల మధ్యవారి కోసం రూపొందించింది. అలాగే 5–18 మధ్య వయసున్న పిల్లలకు కార్బీవ్యాక్స్, 2–18 ఏళ్ల మధ్యవారికి తయారైన కోవోవ్యాక్స్లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి మూడో దశ మన దేశంలోనూ విరుచుకుపడే అవకాశమున్నదని, ఈసారి ప్రధానంగా పిల్లలపైనే అది ప్రతాపం చూపబోతున్నదని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వారి కోసం రూపొందించిన కోవాగ్జిన్ టీకా అందుబాటులోకి రాబోతుండటం దేశ ప్రజలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఏడాదిన్నరకుపైగా పాఠశాలలు మూతబడి, ఆన్లైన్లో మాత్రమే చదువులు సాగుతున్న తీరు అత్యధిక శాతంమంది పిల్లలను చదువులకు పూర్తిగా దూరం చేసింది. ఒక అంచనా ప్రకారం 5 కోట్ల మంది పిల్లలు ఆన్లైన్ చదువులకు అవసరమైన సెల్ఫోన్లు, కంప్యూటర్లు కొనుక్కునే స్థోమత లేక పూర్తిగా వెనకబడ్డారు. ఇక క్రీడా శిక్షణ సంస్థలు, కోచింగ్ కేంద్రాలు వగైరాలు కూడా చాన్నాళ్లుగా మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని మళ్లీ తెరుస్తున్నారు. బడులు తెరుచుకున్నా ఇప్పటికీ తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తూనే ఉన్నారు. ఇంటికే పరిమితమైతే పిల్లల చదువు లకు మాత్రమేకాక... వారి మానసిక, శారీరక ఎదుగుదలకూ అది అవరోధమవుతుందని వారికి తెలుసు. అలాగని ప్రాణాలకు ముప్పు పొంచివుందన్న భయాందోళనలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. ఇక బడుల్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మాస్క్లు ధరించటం, శాని టైజర్ వాడకం, దూరం పాటించడం తదితరాలతో తరగతి గదులు కూడా గతంలో మాదిరి స్వేచ్ఛా యుత వాతావరణానికి దూరమైనాయి. బడులకు వెళ్లొస్తున్నారన్న మాటేగానీ... అంతా సవ్యంగా ఉందో లేదోనన్న చింత అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకూ కూడా ఉంటున్నది. పిల్లలకు సైతం వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు. అయితే కరోనా వ్యాక్సిన్ అనుమతుల విషయంలో గతంలో వచ్చిన విమర్శలవంటివి తలెత్త కుండా డీసీజీఐ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వ్యాక్సిన్ల వాడకం సురక్షితమైనదని నిపుణుల కమిటీ మాత్రమే అభిప్రాయపడితే చాలదు. సీజీఐ సంస్థ వెలుపల కూడా ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులు ఉన్నారు. వారు కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా డీసీజీఐ ఆ డేటాను అందు బాటులో ఉంచాలి. ప్రభుత్వం అనుమతించిందన్న ఒక్క కారణంతో సంతృప్తిపడి టీకాలు తీసుకోవ డానికి అనేకులు ముందుకొస్తారు. అందులో అనుమానం లేదు. కానీ అత్యధికులు సంతృప్తిపడే విధంగా చేయాలంటే ఇది తప్పనిసరి. క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన అంశాలేమిటో, వాటి లోతుపాతులే మిటో ఆరోగ్యరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. ఒక దశ ప్రయోగానికీ, మరో దశ ప్రయో గానికీ మధ్య ఉన్న వ్యవధి, టీకాలు తీసుకున్నవారిలో వెల్లడైన లక్షణాలు అధ్యయనం చేస్తారు. వ్యాక్సిన్ల విషయంలో పెదవి విరిచేవారిని సైతం అటువంటివారి అభిప్రాయం సంతృప్తి పరు స్తుంది. పెద్దల కోసం రూపొందించిన టీకా యధాతథంగా పిల్లలకు ఇవ్వటం సాధ్యపడదు. ఈ విష యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు సూచించింది. శారీరక ఎదుగుదల చక్కగా ఉండే శైశవ, బాల్య, కౌమార, యౌవన దశల్లోనివారు కావటం, వారికుండే భిన్నమైన వ్యాధి నిరోధకత ఇందుకు కారణం. క్లినికల్ పరీక్షకు ముందుకొచ్చిన పది పన్నెండేళ్లలోపు వయసున్న పిల్లలు తమను అడిగే ప్రశ్నలకు విస్పష్టంగా సమాధానాలివ్వటం కొంత కష్టం. అంతకన్నా చిన్న వయసు పిల్లలనుంచి సమాధానాలు రాబట్టడం అసాధ్యం. ఇప్పటికే 12–18 ఏళ్ల వారికి టీకాలం దించిన ఇజ్రాయెల్కు ఈ విషయంలో కొంత అనుభవముంది. బహుశా డేటా రూపకల్పనలో ఔషధ సంస్థలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. పెద్దల టీకాల విషయంలోనే అనేకమందిలో ఇంకా సందేహాలున్నాయని, అందుకే అనేకులు వాటికి దూరంగా ఉన్నారని మరిచిపోకూడదు. ఆ పరిస్థితి పిల్లల టీకాల విషయంలో తలెత్తకూడదనుకుంటే, అంతా సజావుగా సాగిపోవాలనుకుంటే పారదర్శ కత ప్రాణప్రదమైనది. అది ప్రజానీకం హక్కు కూడా. ప్రభుత్వాలు ఎటూ పిల్లల టీకాలను కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే బయట కొనదల్చుకున్నవారికి సైతం అందుబాటులో ఉండేలా ఆ టీకాల ధర నిర్ణయించాలి. పౌరు లకు టీకాలందించే కార్యక్రమం మన దేశంలో జోరందుకుంది. అనేక రాష్ట్రాలు పట్టుదలగా దీన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జనాభాలో మూడొంతులమంది ఒక టీకా లేదా రెండు తీసు కున్నట్టవుతుంది. పిల్లలకిచ్చే టీకాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువమందికి అందించగలిగితే జనాభాలో అత్యధికులు సురక్షిత స్థితికి చేరుకున్నట్టవుతుంది. చదువులు మళ్లీ చురుకందుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. -
మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత : సుచరిత
-
‘రెమ్డెసివిర్’ల బ్లాక్మార్కెట్పై నిఘా
సాక్షి, అమరావతి: రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్పై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. తమకు వస్తున్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు కిందిస్థాయి సిబ్బందే రెమ్డెసివిర్లు ఎత్తుకెళ్లి.. ప్రైవేటు మెడికల్ షాపులకు అమ్ముతున్నట్టు తేలిందన్నారు. అనంతపురం జిల్లాలో 16 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పెద్దాసుపత్రిలోని ఇద్దరు సిబ్బంది తీసుకెళ్లి.. రెండు మెడికల్ షాపులకు విక్రయించగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరులోనూ ఆస్పత్రి సిబ్బంది బయట అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని వార్డుల్లో నిఘా పెంచినట్టు ఔషధ నియంత్రణ శాఖ పేర్కొంది. కొందరు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. ఖాళీ బాటిళ్లు సేకరించి సెలైన్ నింపి.. మార్కెట్లోకి నకిలీ రెమ్డెసివిర్లు కూడా వచ్చినట్టు ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం అందింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడిన ఒరిజినల్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల ఖాళీ బాటిళ్లను సేకరించి.. మూతను గమ్తో అతికించి తిరిగి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సెలైన్ లేదా డిస్టిల్డ్ వాటర్ నింపుతున్నట్టు సమాచారం. వీటిని స్టాఫ్ నర్సులు గానీ, డాక్టర్లు గానీ కొద్దిగా పరిశీలిస్తే.. నకిలీవో, ఒరిజినల్వో తెలుసుకోవచ్చని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. ఒరిజినల్ ఇంజెక్షన్కు అయితే అల్యూమినియంతో మెషిన్లో చేసిన క్లోజ్డ్ ప్యాకింగ్ ఉంటుందని, నకిలీకైతే గమ్తో అతికించినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఇంజెక్షన్లు వేసే నర్సులు, వైద్యులు వీటిపై అప్రమత్తంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సూచించారు. ప్రతి ఆస్పత్రిపైనా నిఘాపెట్టాం ప్రతి ఆస్పత్రిపైనా, మెడికల్ షాపుపైనా నిఘా పెట్టాం. రెమ్డెసివిర్లను బ్లాక్మార్కెట్కు తరలించినా.. అడ్డదారిలో వాటిని షాపులు కొన్నట్లు వెల్లడైనా తక్షణమే లైసెన్సులు రద్దు చేస్తాం. నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 104కు ఫిర్యాదు చేసినా లేదా డ్రగ్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేసినా తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
ఆక్సిజన్ నిల్వలకు ఇబ్బంది లేదు
సాక్షి, అమరావతి: ఆక్సిజన్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ఆస్పత్రుల్లో సరిపడా నిల్వలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడే 26 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ వేశారు. 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండేలా రాష్ట్రంలో ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ పడకల్లోనూ పూర్తిస్థాయిలో రోగులు లేరు. ఆక్సిజన్ వినియోగం గత నాలుగు రోజులుగా పెరిగింది. ఆక్సిజన్ సరఫరా కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సరఫరాకు ఢోకా లేదు రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు ఢోకా లేదు. విశాఖ నుంచి మూడు కంపెనీలు సరఫరా చేస్తుండగా, చెన్నై నుంచి ఒక కంపెనీ, బళ్లారి నుంచి రెండు కంపెనీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంది. రాష్ట్రంలోనే మెజారిటీ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. దీన్ని అవసరం మేరకు, లేదా ఆస్పత్రుల ఇండెంట్ మేరకు తీసుకుంటున్నారు. 4.51 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోరేజీ సామర్థ్యం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ కెపాసిటీ భారీగా పెంచారు. కోవిడ్ మొదటి దశలోనే ఆక్సిజన్ పడకల ఏర్పాటులో భారీ కసరత్తు చేసి మౌలిక వసతులు కల్పించారు. లిక్విడ్ ఆక్సిజన్ 4,03,989.5 క్యూబిక్ మీటర్లు, డి–టైప్ సిలిండర్లు 48,003.1 కలిపి మొత్తం 4,51,992.6 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా.. రాష్ట్రంలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద 380 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. ఇవి గాకుండా 4 వేల సిలిండర్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో 6 వాహనాలు ఆక్సిజన్ లోడింగ్కు వెళ్లాయి. మరో 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్రాన్సిట్ (రవాణా)లో ఉంది. రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ఆక్సిజన్ లేకపోయినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు సమాచారమిస్తే.. అక్కడకు ఆక్సిజన్ సిలిండర్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టాకు ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్నది కాకుండా త్వరలో ఆస్పత్రులకు చేరాల్సినది. నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై నిశితంగా పర్యవేక్షణ ఉంది. ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వినియోగం చూస్తున్నాం. దీన్నిబట్టి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ కొరత సమస్యే తలెత్తలేదు మనకు వచ్చిన ఇండెంట్ను బట్టి తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రోజుకు 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. స్టోరేజీ కెపాసిటీ భారీగా ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొరత ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నాం. రోగులకు ఆక్సిజన్ కొరత ఉండదు. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
రెమ్డెసివిర్ బ్లాక్మార్కెట్పై నిఘా
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెటింగ్పై అధికారులు నిఘా పెంచారు. ఈ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఈ ఇంజక్షన్ను కొందరు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీ అండ్ ఎఫ్, హోల్సేల్ షాపులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెట్టారు. గుంటూరులో బుధవారం ఓ వ్యక్తి 6 ఇంజక్షన్లు తీసుకెళుతుండగా పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పట్టుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు. అదేరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ఆస్పత్రి ఐసీయూలో రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు మేల్ నర్సింగ్ సిబ్బందిని పట్టుకున్నారు. 7 డోసుల ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు నిఘా పెంచారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కేవలం కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే పంపిణీ జరగాలని, ప్రైవేటుగా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోల్సేలర్లు, రిటెయిలర్లు కూడా ఇంజక్షన్ల లెక్క చెప్పాలని ఆదేశించారు. గుంటూరులో బ్లాక్ మార్కెట్లో ఇంజక్షన్ల విక్రయాల్లో వైద్యుల ప్రమేయం ఉన్నట్టు నగరంలోని వైద్యుల సంఘంలో గురువారం విస్తృతంగా చర్చ జరిగింది. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు ఇంజక్షన్లు బ్లాక్మార్కెట్లో అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇవి కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే అమ్మాలి. కొంతమంది ఇంజక్షన్లను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రవిశంకర్నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ చదవండి: టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి -
కోవిడ్ ఆస్పత్రులకే రెమ్డెసివిర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు అనుమతులు ఉన్న ఆస్పత్రులకే రెమ్డెసివిర్ మందులను సరఫరా చేయాలని ఔషధ నియంత్రణ శాఖ హోల్సేల్, రిటైలర్లను ఆదేశించింది. ఈమేరకు ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అన్నీ సీఅండ్ఎఫ్ ఏజెన్సీలు, హోల్సేల్, రిటైల్ షాపులకు వచ్చే రెమ్డెసివిర్ మందుల వివరాలను సేకరించనున్నారు. ప్రతి సోమవారం, గురువారం ఆయా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు.. తమ పరిధిలో ఉన్న షాపుల నుంచి కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు సేకరిస్తారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా అనుమతి లేని ఆస్పత్రులకు సరఫరా చేయడం కుదరదని, కోవిడ్ పేషెంట్లను చేర్చుకుని సేవలందిస్తున్న ఆస్పత్రులకే రెమ్డెసివిర్ ఇవ్వాలని నిబంధన విధించారు. ఎక్కడైనా సీఅండ్ఎఫ్ స్టాకిస్ట్లు, హోల్సేలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడరు. గతంలో కోవిడ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరఫరా చేసుకునేందుకు వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్దేశించిన ఆస్పత్రులకే సరఫరా చేయాలని నిబంధన విధించినట్టు ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు ఎంబీఆర్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా రెమ్డెసివిర్, అజిత్రోమైసిన్ మందులు స్టాకు లేనప్పుడు స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్కు ఫోన్ చేయవచ్చన్నారు. ఫోన్ వివరాలు ఔషధ నియంత్రణ శాఖ వెబ్సైట్ http//dca.ap.nic.inలో చూడచ్చన్నారు. -
నకిలీ మందుల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: యాంటీబయోటిక్స్ పేరుతో డొల్ల ట్యాబ్లెట్లు తయారు చేసి, దేశ వ్యాప్తంగా రోగులను మోసగిస్తున్న ముఠా బండారం బట్టబయలైంది. ఉత్తరాఖండ్ చిరునామాతో తయారైన ఈ నకిలీ మందులపై అనుమానం రావడంతో రాష్ట్రానికి చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ మందులను తయారు చేసిన కంపెనీ చిరునామాను బట్టి ఆరాతీస్తే ఉత్తరాఖండ్లోని ఉద్దంసింగ్ నగర్లో అలాంటి కంపెనీ లేదని తేలింది. విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరంలలో ఈ నకిలీ మందులు బయటపడ్డాయి. దీంతో సుమారు 45 రోజుల పాటు పరిశోధించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారుల బృందం ఎట్టకేలకు ఈ కుంభకోణాన్ని ఛేదించింది. నకిలీ మందుల గుట్టు బయట పడిందిలా.. హెచ్పీహెచ్ఐఎన్ కంపెనీ తయారీ పేరుతో కొన్ని మందులు తొలుత భీమవరంలోని మందుల దుకాణాలకు చేరాయి. తనిఖీల ద్వారా ఈ విషయం ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిసింది. వారు ఆ మాత్రలను ల్యాబ్కు పంపించారు. ఇందులో ఎలాంటి మందు లేదని తేలింది. ఆ తర్వాత విజయవాడలోని హరిప్రియ మెడికల్స్ ద్వారా రాజమండ్రిలోని లోకేశ్వరి ఫార్మసీ వాళ్లు ఎక్కువగా అజిత్రోమైసిన్, సిఫిగ్జిమ్ ట్యాబ్లెట్లు కొన్నారు. వీటిని పరిశీలిస్తే ఇవి కూడా డమ్మీ అని తేలింది. ఆ తర్వాత పాలకొల్లులోనూ ఇలాంటి నకిలీ మందులే దొరికాయి. గొల్లపూడిలోని సహస్ర మెడికల్స్లోనూ కొన్ని నకిలీ మందులు లభించాయి. ఇవి విష్ రెమిడీస్ సంస్థ తయారు చేసినట్టు తేలింది. దీంతో ఏపీ ఔషధ అధికారుల బృందం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. చండీగఢ్లో మూలాలు బయటకు.. హెచ్పీహెచ్ఐఎన్ అనే కంపెనీ లేకుండా మందులెలా వచ్చాయి.. వీటికి మూలాలెక్కడ? అని ఆరా తీస్తే చివరకు చండీగఢ్లో బయటపడ్డాయి. క్యాన్ కేర్ అనే ఫార్మాసూటికల్ సంస్థ వీటిని తయారు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఆ సంస్థను ప్రశ్నించారు. అయితే ఎక్కడా ఆ మందులు తయారు చేసినట్టు ఆధారాలు లభించలేదు. మరింత లోతుగా పరిశీలించగా, హెచ్పీహెచ్ఐఎన్ మందులు మార్కెట్ చేసినట్టు, దానికి జీఎస్టీ చెల్లించినట్టు ఆధారాలు లభించాయి. దీంతో దొంగలు దొరికిపోయారు. వీరిపై వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కేసులు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ఎలాంటి మందులు తయారు చేసినా అమ్మకాలు బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా సొమ్ము చేసుకోవాలనుకున్నారు. 29 మందిపై చార్జిషీట్ నకిలీ మందులు తయారు చేసిన కంపెనీలు, వాటిని కొనుగోలు చేసిన ఇక్కడి ఫార్మసీ యాజమాన్యాలు మొత్తం 29 మందిపై చిర్జిషీట్ వేశారు. వీరిలో ఇప్పటికే చండీగఢ్లో నలుగురు జైలుకు వెళ్లారు. ఏపీలో నకిలీ మందులు కొనుగోలు చేసిన హరిప్రియ, కాళేశ్వరి ఫార్మసీ యాజమాన్యాల లైసెన్సులు రద్దు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. దేశ వ్యాప్తంగా నకిలీ మందులు అమ్ముతున్న విషయం గురించి ఏపీ ఔషధ నియంత్రణ అధికారులు కేంద్ర ఔషధ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర సంస్థ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఈ విచారణలో ఔషధ నియంత్రణకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె.రాజభాను, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున రావు, వినోద్, అన్వేష్ రెడ్డి, ఎ.క్రిష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ క్రిష్ణ, కానిస్టేబుల్ అచ్చన్నలు కీలక పాత్ర పోషించారు. తక్కువ కాలంలో ఛేదించగలిగాం నకిలీ మందులు అమ్ముతున్నారన్నది ఫిర్యాదుల ద్వారా రాలేదు. మేమే గుర్తించాం. వెంటనే అప్రమత్తమయ్యాం. వాటి మూలాలన్నీ శోధిస్తూ 45 రోజుల్లోనే అతి పెద్ద కేసును ఛేదించగలిగాం. వీళ్లందరికీ కఠిన శిక్ష పడేలా చార్జిషీట్ రూపొందించాం. నకిలీ మందుల విచారణకు వేసిన బృందం అద్భుతంగా పని చేయడం వల్లే తొందరగా కేసును ఛేదించగలిగాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
నకిలీ మందులకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నకిలీ లేదా నాసిరకం మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధ నియంత్రణ శాఖ సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ ఎక్కడో ఓ చోట మందుల నమూనాలను సేకరించడం, వాటిని పరీక్షించడం ఆ ఫలితాలను బట్టి చర్యలు తీసుకోవడం జరిగేది. కానీ, దీనివల్ల సరైన ఫలితాలు వచ్చేవి కావు. దీంతో నాసిరకం మందులు మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అయ్యేవి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ సిస్టం’ను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. ఈ విధానం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది. ఇదే ఇప్పుడు భీమవరంలో నకిలీ మందులను కనిపెట్టేలా చేసింది. దీంతో మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చే మందులపై నిఘా పెరిగింది. ఈ విధానం అమల్లోకి రావడంతో హోల్సేలర్లు, రిటైలర్లు కూడా మందుల సేకరణలో జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ విధానం అంటే.. ► ఏ ఉత్పత్తిదారుడైనా తన ట్యాబ్లెట్లు రెండు బ్యాచ్లు.. రెండు దఫాలు ఎన్ఎస్క్యూ (నాట్ స్టాండర్డ్ క్వాలిటీ–నాణ్యత లేదని) అని తేలితే సదరు కంపెనీ మందులను ఔషధ నియంత్రణ శాఖ సేకరిస్తుంది. ► ఉత్పత్తిదారుడి హోల్సేల్ లైసెన్సు సస్పెండైనా లేదా రద్దయినా, జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్) ఉల్లంఘించినా అలాంటి సంస్థల మందులను సేకరిస్తుంది. ► కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందులు లేదా ఎక్కువ ధర ఉన్నా, అలాగని తక్కువ ధరకు అమ్ముతున్నా అలాంటి వాటినీ పరిశీలిస్తారు. ► మందుల లేబుల్ లేదా ప్రింట్ వంటివి అనుమానం కలిగించేలా ఉన్నా.. మందుల పేర్లలో తప్పులున్నా అలాంటి వాటిపైనా ఔషధ నియంత్రణ శాఖ కన్నేస్తుంది. ► అంతేకాక.. ప్యాకింగ్లో నాసిరకం మెటీరియల్ వాడినా, అక్షరాలు కనిపించకుండా ఉన్నా వాటిపై నిఘా వేసి వేస్తుంది. ► సాధారణంగా సూపర్ స్టాకిస్ట్–స్టాకిస్ట్–హోల్సేలర్–రిటైలర్ క్రమ పద్ధతిలో సరఫరా కావాలి. ఇలా కాకుండా మార్కెట్లోకి వచ్చిన వాటిపైనా కన్నేస్తారు. ► ఏవైనా మందులకు స్కీములు ఇచ్చినా, ఇన్సెంటివ్లు ఇచ్చినా వాటినీ నియంత్రిస్తారు. ► ఇవన్నీ కాకుండా మందుల ప్రభావం గురించి డాక్టర్లు, మెడికల్ రిప్రెజెంటేటివ్లు, కెమిస్ట్ల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆ మందులను పరిశీలిస్తారు. నకిలీలను అరికట్టేందుకే ఈ విధానం గతంలో ఎక్కడంటే అక్కడ నమూనాలను సేకరించే వారు. దీనివల్ల ఫలితాలు ఆశించినంతగా ఉండేవి కావు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ శాంపిలింగ్ విధానం అమలుచేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిచ్చాం. దీనివల్ల మంచి మందులు మాత్రమే వినియోగదారులకు చేరే అవకాశం ఉంటుంది. హోల్సేలర్లు, రిటైలర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధానం మరింత పకడ్బందీగా అమలుచేస్తాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణ శాఖ -
డ్రగ్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. 1989 జనవరి 11న వరప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్ డైరెక్టర్గా, 2018న డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది. రిజి్రస్టేషన్ విలువ ప్రకారం రూ.3,43,80,000 విలువైన నాలుగు గృహ సముదాయాలను ఏసీబీ గుర్తించింది. రూ.6 లక్షల విలువైన అపార్టుమెంట్ ఫ్లాట్, రూ.15,64,000 విలువైన మూడు ఇళ్ల స్థలాలు, రూ.1,35,850 విలువైన 2.47 ఎకరాల భూమి, రూ.1,18,580 నగదు, రూ.18 లక్షల విలువైన 1,118 గ్రాముల బంగారం, రూ.15.32 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.50.60 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నట్లు సోదాల్లో తేలింది. మొత్తంగా రూ.3.7 కోట్ల అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రసాద్ను విజయవాడ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
నెట్రావిట్ మాత్ర.. మత్తులోకి యాత్ర..
1956: శస్త్రచికిత్స తదితర సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం శాస్త్రవేత్త పార్కే–డవీస్ కెటమ హైడ్రోక్లోరైడ్ను కనుగొన్నాడు. 1969: మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో దీనిని ‘నియంత్రణ మందు’గా మార్చారు. 2011: కెటమైన్ నుంచి పొడిని తయారుచేసి నిషా కోసం వాడుతుండటంతో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం.. దీన్ని ఇంట్లోనే తయారుచేస్తూ విక్రయించే ట్రెండ్ నడుస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇదొక్కటే కాదు.. మాదకద్రవ్యాలు కాని ఇలాంటి అనేక మత్తు ‘మందు’లకు యువత బానిసవుతోంది. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని విక్రయించేందుకు వ్యవస్థీకృత ముఠాలు పుట్టుకొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. పట్టుబడిన ఔషధాల్లో కొన్ని మెడికల్ షాపులు, డీలర్ల నుంచి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. మాదకద్రవ్యాలతో పాటు ఈ ఔషధాల దుర్వినియోగంపైనా నిఘా పెట్టారు. ఈ ఔషధాలను ‘మత్తు’ కోసం వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు నగరంలోని ఓయూ ఠాణా పరిధిలోనూ కెటమైన్ ఇంజెక్షన్లను అక్రమంగా కలిగిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. టోలిచౌకి ప్రాంతంలో కెటమైన్ ఇంజెక్షన్ను వినియోగించి పొడిని తయారుచేయడం వెలుగులోకొచ్చింది. ఈ పొడిని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు. దీన్ని వినియోగించే వారితో పాటు విక్రయించే వాళ్లు నగరంలో పలువురు ఉన్నారు. నగరంలో గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్ టాబ్లెట్స్ వాడుతున్నారు. వీటిని మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగర పోలీసులు ఇటీవల ఆసిఫ్నగర్ ప్రాంతంలో ఓ విక్రేతను అరెస్టుచేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో తీవ్రమైన వాసన వెలువడుతుంది. దీంతో అందరి కంట్లో పడుతున్నామని భావిస్తోన్న యువత.. ప్రత్యామ్నాయంగా ‘నెట్రావిట్’ మాత్రల్లో మత్తును వెతుక్కుంటోంది. తీవ్ర రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టక ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకనే వైద్యులు వీరికి నెట్రావిట్ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. శస్త్రచికిత్స జరిగిన వారికీ ఆ నొప్పి తెలియకుండా ఒకట్రెండు రోజులు వీటిని రాస్తారు. ప్రస్తుతం యువత ఈ ‘మత్తు’ బారినపడటంతో కొందరు మహారాష్ట్ర నుంచి నెట్రావిట్ మాత్రల్ని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నారు. 15 మాత్రలతో ఉండే స్ట్రిప్ ఖరీదు రూ.85 కాగా, గంజాయి బానిసలకు రూ.200కు అమ్ముతున్నారు. దగ్గు మందులే ఎక్కువ..: ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫుట్పాత్లపై ఉండే వారు సైతం వీటినే వాడుతున్నారు. వీరంతా వాడే వాటిలో దగ్గు మందు ప్రధానమైందని అ«ధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ జాబితాలో నిద్రమాత్రలు, వైట్నర్ వంటివీ ఉన్నాయి. నిద్రమాత్రల్ని సేకరించడం కొంచెం కష్టం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా, వాడేటప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. దీంతో మత్తుకు బానిసలవుతున్న యువత, వైట్నర్ లభించని వారు దగ్గు మందును ఎక్కువ వాడుతున్నారు. సాధారణంగా దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథార్ఫిన్, కోడైన్లతో తయారుచేస్తారు. కోడైన్తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్నికేవలం ఔషధాల తయారీకే వినియోగిస్తుంటారు. డెక్స్ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలవుతున్నారు. కండల కోసం ఇంజెక్షన్: అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్ను నగర యువత స్టెరాయిడ్గా వాడుతోంది. జిమ్ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి, ఎక్కువ బరువులు ఎత్తడానికి ఈ సూది మందును తీసుకుంటోంది. దీన్ని అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాను ఇటీవల టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రోగులకు సర్జరీలు చేసేటపుడు మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పనిసేలా చూస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాలక్రమంలో ఈ ఇంజెక్షన్ నగరంలో జిమ్లకు వెళ్తున్న యువతకు ‘అథ్లెట్స్ స్టెరాయిడ్’గా మారిపోయింది. మెడికల్ షాపులపై డేగకన్ను: ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి లేదు. కొందరు అక్రమార్కులు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు చీటీ లేకుండానే విక్రయించేస్తున్నారు. కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కొరి యర్లో ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్నాయి. ఈ నేపథ్యం లో నగరంలోని మెడికల్ దుకాణాలు, కొరియర్ సంస్థలపై పోలీ సులు డేగకన్ను వేశారు. మెడికల్ దుకాణాల నిర్లక్ష్య ధోరణిపైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్కు లేఖ రాయాలని నిర్ణయించారు. మున్ముందు అనారోగ్య సమస్యలు ఈ మత్తు‘మందుల్ని’, స్టెరాయిడ్స్ను వినియోగించే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడే వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వీటికి ఒకసారి అలవడితే.. అది దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతారు. వైద్యులు సైతం అత్యంత అరుదుగా రాసే కొన్ని ఔషధాలను అక్రమంగా వాడటం వల్ల గుండెజబ్బులతో పాటు కిడ్నీ, లివర్, మొదడుతో పాటు నరాల వ్యవస్థ దెబ్బతింటాయి. ఒక్కోసారి గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు పెరిగి తీవ్ర పరిణామాలు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలి. – డాక్టర్ పి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి అమ్మే, కొనేవారిపైనా కేసులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని ఔషధాలను విక్రయించడం నేరం. ప్రధానంగా దగ్గు మందులతో పాటు మత్తును కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వీటి కిందికి వస్తాయి. ఇలాంటివి విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతున్నాం. అమ్మిన వారితో పాటు కొన్న వారిపైనా కేసులు పెడుతున్నాం. ఇప్పటికే ఈ తరహా కేసులు పలు నమోదయ్యాయి. వైట్నర్ను మత్తు కోసం వాడుతున్నారనే సమాచారం ఉంది. – పి.రాధాకిషన్రావు, ఓఎస్డీ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ -
బాత్రూమ్లో కిందపడ్డా.. ఆస్పత్రికి తీసుకెళ్లండి
సాక్షి, బెంగళూరు : డ్రగ్స్ కేసులో పరప్పన జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది బాత్ రూమ్లో కిందపడి గాయపడినట్లు తెల్సింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని సోమవారం ఆమె తరఫున న్యాయ వాది ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. జారిపడటంతో వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని, జైలు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి అవకాశం కల్పించాలని పిటిషన్లో కోరారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను న్యాయమూర్తి శీనప్ప ఆదేశించారు. ఇటీవల బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో రాగిణి, సంజనలు పరప్పన జైల్లో ఉంటున్నారు. నటి ప్రణీత పేరుతో వంచన బహుభాషా నటి ప్రణీత పేరుతో వంచకులు ఎస్వీ.గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీని మోసం చేసిన ఘటనపై ఇక్కడి హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. వివరాలు.. బెంగళూరు ప్రైవేటు హోటల్కు ఎస్వీ.గ్రూప్ మేనేజర్ను పిలిపించుకున్న వంచకులు తాము నటి ప్రణీత మేనేజర్లమని పరిచయం చేసుకున్నారు. అంతేగాక సదరు నటిని సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. రూ.13.5 లక్షలు చెల్లిస్తే ప్రణీత మరో గంటలో వచ్చి ఒప్పందంపై సంతకం చేస్తారన్నారు. వీరి మాటలు నమ్మిన సదరు సంస్థ ఉద్యోగి వారికి నగదు ఇచ్చేశాడు. క్షణాల్లోనే వంచకులు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు మహమ్మద్ జునాయత్, వర్షాపై కేసు నమోదు చేశారు. -
నకిలీ ఔషధాలపై కొరడా
సాక్షి, అమరావతి: నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ నియంత్రణపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. నకిలీ మందులపై కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చర్చించిన అంశాలకు సంబంధించి నెలరోజుల్లో కార్యాచరణ, ప్రణాళిక తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు, సూచనలిలా ఉన్నాయి.. ► ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే. డ్రగ్ కంట్రోల్ కార్యకలాపాలు బలోపేతం చేయాలి. ► ఇందుకోసం కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. ► డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై కూడా దృష్టిపెట్టాలి. ► జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలి. ► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలి. థర్డ్ పార్టీ తనిఖీలు జరగాలి. ► మందుల దుకాణాల వద్దే ఫిర్యాదు ఎవరికి.. ఏ నంబర్కు చేయాలన్న సమాచారం ఉంచాలి. ► ప్రభుత్వాస్పత్రుల్లో కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ► నకిలీ మందుల తయారీ, విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు ఇవ్వాలి. ► అలాగే, ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తుల నుంచి నిరంతరం ఫిర్యాదులు స్వీకరించాలి. ► విజయవాడలో ఉన్న ల్యాబ్తోపాటు నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్ల్లో సామర్థ్యం పెంచాలి. దీంతో.. ఏడాదికి 2వేల నుంచి 13వేల శాంపిళ్లకు సామర్థ్యం పెంచుతున్నట్లు అధికారుల వివరణ. కాగా, ఈ సమీక్షలో డ్రగ్స్ అండ్ కాపీరైట్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రంగ్ కంట్రోల్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ అండ్ కాపీరైట్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. (చదవండి : ప్రముఖ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు) రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా జౌషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్కు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్ కెపాసిటీ స్వల్పంగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రగ్ కంట్రోల్ కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ జౌషధాలను అరికట్టాల్సిందేని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రగ్ తయారీ యూనిట్లు, ఔషధ దుకాణాలపై జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. (చదవండి : ‘చంద్రబాబూ నమ్మకం ఉంటే.. మా సవాల్ స్వీకరించు’) విజయవాడలో ఉన్న ల్యాబ్తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్ల్లో సామర్ధ్యం పెంపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. థర్ట్ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు. మందు దుకాణాల వద్దే కంప్లైంట్ ఎవరికి చేయాలి? ఏ నంబర్కు చేయాలన్న సమాచారాన్ని ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులపైనా కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు.నకిలీ మందుల తయారీ, విక్రయం, నాణ్యతలేని మందుల తయారీ విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు అందించాలని సీఎం జగన్ సూచించారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డిజిటిల్ పద్ధతిలో నిక్షిప్తం, వీటిపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నివేదన అదించాలన్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సిబ్బంది పూర్తిస్థాయి పరిజ్ఞానంపై శిక్షణ, కొత్త ప్రొసీజర్స్పైన పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు నెలరోజుల్లో పై అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
కరోనా కష్టకాలంలో కాసుల వేట
సాక్షి, హైదరాబాద్: ఔరా.. ఏమి ఈ ఔషధ డీలర్ల దందా! కరోనా కష్టకాలంలో కాసులవేటనా? ప్రాణాధార మందులను పక్కదారి పట్టిస్తున్నారా.. అంటే, అవుననే అంటు న్నారు డాక్టర్లు, పేషెంట్లు. కోవిడ్ రోగులకు రెమ్డిసివిర్(యాంటీ వైరల్ డ్రగ్), టోసిలిజుమాబ్(సివియర్ ఇమ్యూ న్ రియాక్షన్) ఔషధాలు ప్రాణాధారం. వీటి కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఔషధ డీలర్లకు బల్క్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ వెయింటింగ్లో పెట్టి తక్కువ మొత్తంలోనే సరఫరా చేస్తున్నారు. ఇదేమంటే.. స్టాకు లేదని సాకులు చెబుతున్నారు. మరోవైపు ఇవే ఔషధాలను బ్లాక్ మార్కెట్ లో 3 నుంచి 6 రెట్ల అధికధరలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చింది. వాస్తవ ధరలు ఇలా... బహిరంగ మార్కెట్లో రెమ్డిసివిర్ డ్రగ్ వాస్తవ ధర రూ. 5,500 కాగా కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్లో రూ. 30–40 వేలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోలర్ శాఖకు ఫిర్యాదులందాయి. మరో ప్రాణాధార ఔషధం టోసిలిజుమాబ్ ఔషధం వాస్తవ ధర రూ.40 వేలు కాగా దీనిని రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షలకు విక్రయిస్తుండడం గమనార్హం. నగరంలో ఇటీవల ఓ కార్పొరేట్ ఆస్పత్రి 3 వేల వైల్స్ రెమ్డిసివిర్కు ఆర్డర్ చేయగా 400 వైల్స్(ఇంజెక్షన్స్) మాత్రమే డీలర్ సరఫరా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా, నగరంలో ప్రాణాధార ఔషధాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు, పపేపపేషెంట్లు కోరుతున్నారు. మరోవైపు ఈ ప్రాణాధార ఔషధాలను తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ సీరియస్ నగరంలో కోవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతుండడం.. మరోవైపు ఈ మహమ్మారి చికిత్సకు వినియోగిస్తున్న ప్రాణాధార ఔషధాలను కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండడం పట్ల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణించింది. తక్షణం ఈ అంశంపై నివేదిక సమర్పించాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. బ్లాక్ దందాపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి అక్రమార్కులను కట్టడి చేయాలని స్పష్టం చేసింది. ఆరు దేశీయ కంపెనీలకు అనుమతి దేశీయంగా రెమ్డిసివిర్ జనరిక్ ఔషధ తయారీ బాధ్యతలను అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ నుంచి ఆరు భారతీయ కంపెనీలు అనుమతి తీసుకొని ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ ఔషధాలను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆయా సంస్థలు విక్రయిస్తున్నాయి. అయినప్పటికీ మనదేశంలో పలు మెట్రో నగరాల్లో ఈ ఔషధం డిమాండ్కు సరిపడా సరఫరా కావడం లేదని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. తక్షణం ఈ ప్రాణాధార ఔషధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, అన్నిచోట్లా లభ్యత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
చుక్కల్లో కోవిడ్-19 ఔషధం ధర..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ చికిత్సలో కీలక ఔషధంగా భావిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఔషధం లభ్యత అరకొరగా ఉన్నా కరోనా హాట్స్పాట్గా మారిన ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రెమిడిసివిర్ కొరత కారణంగా ఇతర నగరాల నుంచి రోగులు అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. రెమిడిసివిర్ మందుకు డిమాండ్ అధికంగా ఉండటం, పరిమిత సరఫరాలతో కొరత ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. మధ్యస్థ లక్షణాలతో బాధపడే కోవిడ్-19 రోగులకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడేందుకు జూన్ 13న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండంతో డాక్టర్లు రెమిడిసివిర్ను సిఫార్సు చేస్తున్నారు. అయితే సరఫరాలు మాత్రం ఆ స్ధాయిలో పెరగకపోవడంతో ఈ ఔషధానికి కొరత ఏర్పడింది. ఈ ఔషధాన్ని రోగులు ఇంజెక్షన్ రూపంలో ఆరు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషదం పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్కు జూన్ 1న భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) రెమిడిసివిర్ దిగుమతులకు అనుమతించింది. భారత్లో ఈ ఔషధ తయారీకి హెటెరో, సిప్లా, మైలాన్లకు లైసెన్స్ ఉండగా జుబిలియంట్, జైదూస్ సహా మరికొన్ని సంస్ధలు డీజీసీఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి.రెమిడిసివిర్ పేటెంట్ కలిగిన గిలియాడ్ సైన్సెస్తోనీ సంస్ధలన్నీ భారత్లో రెమిడిసివిర్ తయారీ కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం హెటెరో సంస్థ ఢిల్లీలో రెమిడిసివిర్ను వయల్కు రూ 5400 చొప్పున సరఫరా చేస్తోంది. మరో రెండు కంపెనీల నుంచి సరఫరాలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుండటంతో రెమిడిసివిర్ కొరతను అధిగమించవచ్చని ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ వారాంతంలో రెమిడివిర్ డ్రగ్ను సిప్లా మార్కెట్లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ డ్రగ్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు హెటెరో ఫార్మకు రెమిడిసివిర్ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. మరోవైపు కీలక ఔషధాల బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని డీసీజీఐ ఆయా రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు లేఖలు రాసింది. ఢిల్లీకి చెందిన అభయ్ శ్రీవాస్తవ్ కోవిడ్-19తో బాధపడే తన మిత్రుడి తల్లి (84)కి అవసరమైన రెమిడిసివిర్ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో ఈ మందు లభించకపోవడంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రెమిడిసివిర్ను బాధిత కుటుంబం సమకూర్చిందని శ్రీవాస్తవ్ చెప్పుకొచ్చారు. ఫార్మసీల్లోనూ ఈ డ్రగ్ దొరకడం లేదని దీనికోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోషల్మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం రూ 65,000కు ఈ మెడిసిన్ను అందిస్తామని ఎవరో హామీ ఇచ్చారని చెప్పారు. ముంబైలో తన సోదరుడు రెమిడిసివిర్ను కొనుగోలు చేసి తమకు కొరియర్ ద్వారా పంపించాడని తెలిపారు. మరోవైపు ఈ ఔషధం దొరక్క ఇబ్బందులు పడినవారి జాబితాలో జర్నలిస్టులూ ఉన్నారు. జర్నలిస్ట్ సమర్థ్ బన్సల్ తన నాయనమ్మ కోసం ఈ ఔషధం కోసం ప్రయత్నించగా ఒక్కో వయల్కు రూ 30,000 వరకూ కొటేషన్లు వచ్చాయని వాపోయారు. ఆస్పత్రి ఫార్మసీలో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో ఇతరత్రా విచారించగా ఢిల్లీ హోల్సేల్ మార్కెట్ నుంచి అత్యధిక ధరను కోట్ చేశారని చెప్పుకొచ్చారు. చివరికి కోల్కతా నుంచి రెమిడిసివిర్ను తెప్పించుకున్నామని చెప్పారు. చదవండి : కరోనాకు కొత్త చికిత్స -
కరోనా డ్రగ్ అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్కు చెందిన గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్ రాబోయే రెండో వారాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. (కరోనా చికిత్సకు గ్లెన్మార్క్ ఔషధం) సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు తెలిపారు. ఇంజక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని తెలిపింది. దీంతో కోవిడ్కు మందును కనిపెట్టిన ఘనత హైదరాబాద్ హెటిరోకి దక్కనుంది. ఇక కరోనా యాంటీ డ్రగ్ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్!) -
కరోనాపై యూట్యూబ్లో అవగాహన
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా జీవించాలో వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ పాటల రూపంలో యూట్యూబ్ లో వీడియో, కవితా సంపుటాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణ చర్యలను వివరిస్తూ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు విజయశేఖర్ స్వీయ రచనలో దీనిని రూపొందించారు. (రెడ్ జోన్లో మినహాయింపులకు నో..) వైరస్ ఎక్కడి పుట్టింది, దీని ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పొందుపరుస్తూ ఆరు నిమిషాల పాటు ఈ వీడియో రూపొందించారు. ఔషధ నియంత్రణ శాఖలో పని చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఉద్యోగులే మొత్తం దీని రూపకల్పనకు సహాయ సహకారాలు అందించారు. కరోనా వైరస్ వ్యాప్తి వేళ ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలపై ఏడీ విజయశేఖర్ హిందీ కవితా సంపుటి రచించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. (పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ) -
మెడికల్ షాపులపై అధికారులు దాడులు
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ సాకుతో మాస్క్లను అధిక ధరలకు విక్రయించడంతో విశాఖ జిల్లాలో మెడికల్ షాప్లపై సోమవారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కే.రజిత ఆధ్వర్యంలో 65 మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మాస్క్లను అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేపట్టారు. మూడు మందుల షాపుల్లో అధిక ధరలకు మాస్క్లు విక్రయినట్లు గుర్తించిన అధికారులు.. షాప్ల లైసెన్స్లను సస్పెండ్ చేశారు. -
దాడులు సరే.. చర్యలేవి?
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అక్రమ మెడికల్ దుకాణాల నిర్వహణపై ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లావ్యాప్తంగా 1500 వరకు మెడికల్ షాపులు ఉండగా వీటికి ఆకస్మికంగా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు సంబంధిత శాఖ దాడులు చేస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో కేసుల నమోదు నామమాత్రంగానే ఉంది. నెలవారిగా ఆకస్మిక తనిఖీలను పరిశీలిస్తే చర్యలు తీసుకున్న ఘటనలు కేవలం నెలకు ఒకటి చొప్పున నమోదు అవుతున్నాయి. ఇదీ అక్కడ పరిస్థితి ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఔషధ నియంత్రణ శాఖ 447 ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 85 మెడికల్ షాపులను గుర్తించారు. ఇందులో 82 షాపులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం 24 మెడికల్ షాపులకు తాత్కాలికంగా సీజ్ చేశారు. కోర్టులో మాత్రం నమోదు అయిన కేసుల సంఖ్య మూడు మాత్రమే. మిగత కేసుల వివరాలను పరిశీలిస్తే వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ విషయంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్ నాయకుల జోక్యంతో కేసుల నమోదులో ఆలసత్వం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు అనేకం ఉన్నాయి. ఆర్ఎంపీ వైద్యులు అనుబంధంగా మెడికల్ షాపులను నిర్వహిస్తున్నరు. వీటిని కూడా అధికారులు చూసి, చూడనట్లుగా వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సరస్వతినగర్లో కొద్దిరోజుల కిందట ఓ ప్రైవేట్ ఆసుపత్రి అనుమతి లేకుండా ఏర్పడింది. ఇందులో మెడికల్ను ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖకు సమాచారం అందించగా వారు చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఖలీల్వాడిలో గతంలో ఆకస్మికంగా దాడులు జరిపిన అధికారులు సుమారు 8 నెలలు అవుతున్న చర్యలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మెడికల్షాపులపై కన్నెత్తి చూడడం లేదు. -
అంతా మా ఇష్టం
సాక్షి, గుంటూరు : రాష్ట్రరాజధాని జిల్లా గుంటూరులో గత మూడేళ్లుగా మందులషాపుల నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల షాపుల్లో కొనే ఔషధాలు నకిలీవా కావా , ఆ మందులు వేసుకుంటే వ్యాధి తగ్గుతుందా లేక కొత్తరోగమేదైనా వస్తుందా అనే భయాందోళనలు జిల్లా ప్రజల్లో నెలకొన్నాయి. ప్రజల భయాలను నిజాలు చేస్తూ పలు మందుల షాపుల్లో జరుగుతున్న అక్రమాల గురించి ఏడాదికి ఒకసారి వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ ఔషధ నియంత్రణశాఖ అధికారులు మాముళ్లమత్తులో ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. మందుల ధరలు తగ్గిస్తే.. ప్రజలకు తక్కువ ధరలకు మందులు ఇస్తామని హోల్సేల్ వ్యాపారులు పోటీ వ్యాపారం వల్ల ముందుకొచ్చారు. రిటైల్షాపుల వారికి నష్టం వాటిల్లుతుందని వారికి వత్తాసుగా ఔషధ నియంత్రణశాఖ అధికారులు 2018 డిసెంబర్ మొదటి వారంలో తమ కార్యాలయంలో సమావేశంపెట్టి మందులపై డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేయాల్సిన విధులు నిర్వహించకుండా ఔషధ నియంత్రణ అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారో ఈ మీటింగ్ను బట్టి చెప్పకుండానే అర్ధం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చుక్కలే.. మందుల షాపులకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి సవాలక్ష నిబంధనలు చూపించి లైసెన్స్ను మంజూరు చేయకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. మందులషాపుల యూనియన్ కార్యాలయంలో సంప్రదిస్తే తక్షణమే మందులషాపులకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. 2016లో ఏం జరిగిందంటే.. గుంటూరు అర్భన్ పరిధిలోని ఫిరంగిపురంలో 2016లో మందులు వికటించి ఓ మహిళ ముఖం నల్లగా మారిపోవటంతో ఆమె వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు మందులు విక్రయించి, వైద్యంచేసింది ఫిరంగిపురంలోని మందులషాపులోనే. అర్హత లేని వ్యక్తి మందులు ఇచ్చి వైద్యం చేయటం వల్లే ముఖం కాలినట్లుగా మారిపోయిందని నివేదిక వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మందుల షాపుల్లో ఇదే తంతు కొనసాగుతోంది. 2017లో నకిలీలు వెలుగులోకి.. పలు ప్రముఖ కంపెనీల ఔషధాలను 2017లో నకిలీవి తయారుచేసి గుంటూరు కేంద్రంగా కోట్లాది రూపాయల నకిలీ మందుల వ్యాపారం నడిచింది. విజయవాడలో ఫార్మా కంపెనీ ప్రతినిధులు తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విజయవాడ పోలీసులు సదరు కంపెనీ ఉత్పత్తులను నకిలీవి తయారు చేసి గుంటూరు కొత్తపేట శివాలయం సమీపంలోని నిల్వచేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ మందుల విక్రయాలు గుంటూరు కేంద్రంగానే జరిగాయి. ఇతను గుంటూరులో 2015 నుంచి మందుల వ్యాపారం చేస్తున్నా అధికారులు మాముళ్ల మత్తులో గుర్తించలేదు. 2018లో విజిలెన్స్ తనిఖీల్లో ఇలా.. విజిలెన్స్ అధికారులు పలు మందులషాపుల్లో మూడు సార్లు తనిఖీలు చేసి అర్హతలేని వ్యక్తులు మందులు అమ్మటం, కాల పరిమితిదాటిన మందులు అమ్మటం, మందులు అమ్ముతున్నట్లు రికార్డుల్లో చూపకపోవటం, మందులను సరైన విధానంలో నిల్వచేయకపోవటం, రోగులకు కంపెనీవారు ఉచితంగా అందించే శాంపిల్ మాత్రలు అమ్మటం, అనుమతులు లేకుండా మందులను అమ్మటం ఇతర లోపాలను గుర్తించారు. నిబంధనలకు తిలోదకాలు.. ఫార్మాసిస్టుల షాపుల నిర్వాహకులు, ఔషధనియంత్రణ, పరిపాలనశాఖ అధికారులు ఇరువురు కూడా నిబంధనలకు నీళ్లు వదిలారు. లైసెన్స్ల మంజూరుకు రూ.30 వేల వరకు వసూలు చేస్తూ నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోవటం లేదు. ఫార్మాసిస్టు కోర్సు చేయని వారు, మందుల గురించి తెలియని వారు మందులు విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఫార్మసిస్టుల సర్టిఫికెట్ను అద్దెకు తీసుకుని షాపులను నిర్వహిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మందులను వైద్యులే తమ అసిస్టెంట్స్తో అమ్మకాలు చేయిస్తున్నారు. షాపు పెట్టకుండా కొద్దిపాటి గదుల్లోనే మందులు అమ్మిస్తున్నారు. ఆస్పత్రుల తనిఖీ సమయంలో.. గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో తనిఖీలు చేసిన సమయంలో పదోతరగతి కూడా ఉత్తీర్ణత చెందని వ్యక్తి మందులు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫార్మాశిస్టులే మందులు విక్రయాలు చేసేలా చూడాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనల అమలుకు చర్యలు ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా తిరుపతి నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చా. పరిస్థితులను పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం మందులషాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. –అనిల్కుమార్, అసిస్టెంట్ డైరక్టర్, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ -
సెక్స్ ప్రేరేపణ.. డ్రగ్స్ దందా!
-
హైదరాబాద్లో అక్రమంగా సెక్స్ డ్రగ్స్ తయారీ
హైదరాబాద్: నగరంలో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే మందుల్ని అక్రమంగా తయారు చేస్తోన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెటమైన్ అనే మత్తు మందును ఐదేళ్లుగా ఇంతం ల్యాబ్ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగుళూరులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో హైదరాబాద్లోని ఇంతం ల్యాబ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మందులు మహిళలపై వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే బెంగుళూరులో పట్టుబడిన ముఠా నుంచి కీలక సమాచారాన్ని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబట్టారు. ఆ ముఠా ఇచ్చిన సమాచారంతో నాచారంలో ఉన్న ఇంతం ల్యాబ్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన అనంతరం ఇంతం ల్యాబ్ను డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంటారని అధికారులు చెబుతున్నారు. మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా మందులు తయారు చేస్తోన్నట్లు తమ విచారణలో వెల్లడైందని, దీనికి సంబంధించి ఇంతం ల్యాబ్ యజమాని వెంకటేశ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
కస్టమర్లకు స్నాప్డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్డీల్లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
ముంబైలో వెయ్యి కోట్ల డ్రగ్స్ పట్టివేత
సాక్షి, ముంబై: ముంబై శాంతాక్రజ్లోని వాకోలా సమీపంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. ఆజాద్మైదాన్ మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు వాకోలాలోని సుభాష్ నగర్లో ఓ కారులో ఉంచిన డ్రగ్స్ను గుర్తించారు. వీటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి వారిని అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేశంలోని వేర్వేరు చోట్ల కొత్త సంవత్సరాది ఉత్సవాలకు సరఫరా చేసేందుకే ఈ డ్రగ్స్ను సిద్ధం చేసినట్లుగా భావిస్తున్నారు. -
రక్త ఉత్పత్తుల అక్రమ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్పల్లిలో ఒక హోల్సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు. ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్లెట్లు, రెడ్బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు. ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ గుట్టురట్టు
కర్నూలు(హాస్పిటల్): నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గుట్టు రట్టు చేశారు. పశువులు పొదుగు నుంచి పాలు విడవటానికి వాడే ఈ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. అయితే కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి సొంతంగా ఇంట్లోనే బ్రాండ్ పేరు ఏమీ లేకుండా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు తయారు చేస్తూ దర్జాగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వలపన్ని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. అప్పుల నుంచి గట్టెక్కేందుకు అక్రమ మార్గం.. వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఎన్.ప్రసాద్ 20 ఏళ్ల క్రితమే కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు నంద్యాల రోడ్డులో దాణా వ్యాపారం చేసి జీవనం సాగించాడు. ఈ క్రమంలో అతనికి రియల్టర్ వీసీ రమణ పరిచయమయ్యాడు. అతని మాటలు నమ్మి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకున్నాడు. వీసీ రమణ ఐపీ పెట్టడంతో ప్రసాద్ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు కొన్నేళ్ల క్రితమే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ ప్రారంభించాడు. లాలూ అనే వ్యక్తి నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ అనే కెమికల్, స్థానికంగా ఆక్టిక్ యాసిడ్ను కొనుగోలు చేసి ఇంజెక్షన్లు తయారు చేయసాగాడు. రెండు లీటర్ల ఆక్సిటోసిన్, నాలుగు లీటర్ల ఆక్టిక్ యాసిడ్, 14 లీటర్ల నీళ్లు కలిపి మొత్తం 20 లీటర్ల ఆక్సిటోసిన్ మందును తయారు చేసి వాటిని బాటిళ్లలో నింపాడు. 100 ఎంఎల్ బాటిల్ అయితే రూ.60లు, 200 ఎంఎల్ బాటిల్ అయితే రూ.100లకు రైతులకు, పాలవ్యాపారులకు విక్రయించడం మొదలుపెట్టాడు. వలపన్ని పట్టుకున్న అధికారులు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు మద్దూర్నగర్లోని వీర నాగేశ్వరరావు అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖర్రావు.. డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్ అలీ, విజయలక్ష్మి, హరిహరతేజల ఆధ్వర్యంలో దాడులకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా మద్దూర్నగర్లో ఓ ఆక్సిటోసిన్ బాటిల్ను కొనుగోలు చేసి, దానిని ల్యాబ్కు పంపించారు. అందులో ఆక్సిటోసిన్ మందు ఉందని నిర్ధారణ కావడంతో నాగేశ్వరరావును అరెస్ట్ చేసి , అతను చెప్పిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక నంద్యాల రోడ్డులోని ఓ ఇంట్లో తయారవుతున్న ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను గుర్తించారు. అతని వద్ద పెద్ద ఎత్తున ఆక్సిటోసిన్ మందు, ఆక్టిక్ యాసిడ్, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తే 10 ఏళ్ల జైలు నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ప్రసాద్పై డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పశువుల దాణాలపై నిఘా ఉంచి దాడులు కొనసాగిస్తాం. ఎవ్వరి వద్దైనా ఇంజెక్షన్లు లభిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. డెయిరీలు, రైతులు ఈ ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలి. – చంద్రశేఖర్రావు, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ ఆక్సిటోసిన్ వల్ల మనుషులకు క్యాన్సర్ సాధారణంగా దూడను చూడగానే గేదెకు మిల్క్లెట్ డౌన్ హార్మోన్ విడుదలై పాలు విడుస్తుంది. దూడ చనిపోతే పాలు విడవడానికి గేదె ఇబ్బంది పడుతుంది. ఈ కారణంగానే రైతులు దానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేసి పాలు పితుకుతారు. గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేయడం వల్ల వచ్చిన పాలలో సదరు మందు కూడా ఉంటుంది. ఇది మనిషి శరీరంలోకి వెళ్లి తరచూ వాంతులకు గురికావడం, చర్మంపై కురుపులు రావడం, మరికొందరికి క్యాన్సర్ రావడం సంభవిస్తుంది. గేదెలకు కూడా కీళ్ల నొప్పులు వచ్చి అది జీవించే కాలం తగ్గిపోతుంది. – డాక్టర్ సతీష్కుమార్, పశువైద్యాధికారి, కర్నూలు -
‘యాంటీ బయాటిక్’ బాంబు!
లండన్: బహుళజాతి ఫార్మాసూటికల్ సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మిలియన్ల కొద్దీ యాంటీ బయాటిక్స్ను భారత్లో అమ్ముతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని విచ్చలవిడిగా వాడటం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని బ్రిటన్లోని క్వీన్ మేరీ వర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. బహుళజాతి ఫార్మా కంపెనీలు భారత్లో ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ను ఉత్పత్తి చేయకుండా నిలువరించడంలో ఔషధ నియంత్రణ సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2012 వరకూ భారత ఔషధ నియంత్రణ సంస్థ రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ అమ్మకాల వివరాలను సేకరించినట్లు పరిశోధనలో పాల్గొన్న మెక్గెట్టిగన్ తెలిపారు. భారత్లో 118 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)ను అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్లలో కేవలం ఐదుగానే ఉందన్నారు. మొత్తం 118 రకాల ఎఫ్డీసీల్లో 63 శాతం డ్రగ్స్ను ఎలాంటి అనుమతులు లేకుండానే భారత్లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా మొత్తం 86 సింగిల్ డ్రగ్ ఫార్ములేషన్(ఎస్డీఎఫ్)ల్లో 93 శాతం మందులకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉందన్నారు. -
దేశీయ డ్రగ్ దిగ్గజాలకు అమెరికా షాక్
ముంబై : దేశీయ డ్రగ్ దిగ్గజాలకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో తీవ్ర షాక్ ఎదురైంది. ధరలు నిర్ణయించే విషయంలో అన్యాయపూర్వకమైన విధానాన్ని పాటిస్తున్నారంటూ... 12 జెనరిక్ డ్రగ్ తయారీదారులపై అమెరికా రాష్ట్రాలు సరికొత్త దావా దాఖలు చేశాయి. ఈ 12లో మన దేశానికి చెందిన డ్రగ్ దిగ్గజాలు ఐదు ఉన్నాయి. ఈ తయారీదారులు అన్యాయపూర్వకమైన ధరల విధానాన్ని అమలు చేస్తున్నారని, ధరలు నిర్ణయించడంలో వీరే ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారని దావాలో పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో రెగ్యులేటరీ తనిఖీలు, ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ దిగ్గజాలకు, ఇది మరో షాక్గా నిలిచింది. ఈ దిగ్గజాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్, జిడస్ కాడిలా ఫార్మాస్యూటికల్స్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ దిగ్గజాల్లో తెవా, సాండోజ్, యాక్టివిస్ వంటివి ఉన్నాయి. 45 రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఈ దావా దాఖలు చేశాయి. ఈ కొత్త దావాలో కొంతమంది ఎగ్జిక్యూటివ్ పేర్లను కూడా రాష్ట్రాలు ప్రతిపాదించాయి. మైలాన్ ప్రెసిడెంట్ రాజీవ్ మాలిక్, ఎంక్యూర్ ఫార్మా ఎండీ సతీష్ మెహతా ఉన్నారు. ఈ కంపెనీలపై విచారణ కొనసాగుతుందని, ఇతర కంపెనీలు, వ్యక్తులపై కూడా అదనపు చర్యలు తీసుకోనున్నట్టు డైరెక్టర్ కమ్యూనికేషన్ ఆఫీసు ఆఫ్ ది అటార్ని జనరల్ పేర్కొన్నారు. ఈ విచారణలో భాగంగా భవిష్యత్తులో మరింత మంది పేర్లు బయటికి వచ్చే అవకాశాలున్నాయన్నారు. -
ఏం చర్యలు తీసుకున్నారు ?
డ్రగ్స్ నియంత్రణ పై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరుపుతున్న దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేతిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం సహా 18 మందిని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు 2014లో బచ్పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కారణంగా 25 వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, డ్రగ్స్ను అరికట్టేందుకు తగిన విధానం రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ కారణంగా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2014లో దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ 2015లో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో వందలాది మంది చిన్నారులు, సినీ ప్రముఖులు డ్రగ్స్ బారిన పడ్డారని, ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసు విభాగం దర్యాప్తు కూడా జరుపుతోందని వివరించారు. వారిని బాధితులుగా చూస్తామన్నారు.. సిట్ దర్యాప్తులో పారదర్శకత లేదని, బృందంపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. పలుకుబడి కలిగిన వారు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నందున ఎవరినీ అరెస్టు చేయలేదని వివరించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే వారిని బాధితులుగానే చూస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షలో అనడంతో ఈ కేసు నీరు గారిపోయిందని వివరించారు. 1,300 మంది విద్యార్థులు డ్రగ్స్కు బానిసలయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో కేసును తీవ్రంగా పరిగణించాల్సిందని పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీం ఆదేశాల అమలు, ఇతర అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలేవో చెప్పాలని ఆదేశిస్తూ నవంబర్ 20కి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
డ్రగ్స్ నియంత్రణకు టాస్క్ఫోర్స్
విశాఖ నుంచి భారీ ఎత్తున గంజాయి రవాణా: మంత్రి గంటా సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు పోలీస్, డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ అధికారులతో ప్రభుత్వం టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనుందని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీంతో పాటు హెల్ప్లైన్, టోల్ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఆదివారం వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఎక్సైజ్ , డ్రగ్ నియంత్రణ అధికారులు, మానసిక ఆస్పత్రి వైద్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విశాఖ సర్క్యూట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. పాఠశాల స్థాయిలో 8, 9 తరగతుల నుంచే పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఆదిలోనే అరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గంజాయి సరఫరాలో పెద్దల హస్తం: విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇందులో కొంతమంది పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి గంటా చెప్పారు. గతంలో గంజాయి కిలోల్లో రవాణా అయ్యేదని, ఇప్పుడు టన్నుల్లో జరుగుతోందని తెలిపారు. -
డ్రగ్స్ మహమ్మారి సామాజిక రుగ్మత
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వినియోగం ఓ సామాజిక రుగ్మతగా మారిందని, దీనిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి పోరాడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఇటీవల నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఏ ఒక్క వర్గాన్నికానీ, వ్యక్తినికానీ లక్ష్యంగా చేసుకోలేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ‘డ్రగ్ క్యాపిటల్’గా మారిందని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ వాడకందారులు, సరఫరాదారులు, రవాణాదారులు సహ డ్రగ్స్తో సంబంధం కలిగిన ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందాపై విచారణ చేస్తున్న అకున్ సబర్వాల్ అత్యంత సమర్థమైన అధికారి అని ప్రశంసించారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా టీసీఈఐ నిర్వహించిన మోటార్బైక్ ర్యాలీని ఆయన జెండా ఉపి ప్రారంభించారు. సంస్థ కార్యదర్శి టీఎస్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలోని వివిధ విభాగాల సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు టీసీఈఐ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25న హైటెక్స్లో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సహ పలువురు సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం దేశవ్యాప్తంగా ప్రతిఏటా 20 శాతం వృద్ధి సాధిస్తోందని, దేశవ్యాప్తంగా 2017లో రూ.6,500 కోట్ల వ్యాపారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఈ ఏడాది దాదాపు రూ. 600 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. -
క్లీనిక్పై అధికారుల దాడులు
- రూ. లక్ష విలువైన మందులు సీజ్ నంద్యాల విద్య: నంద్యాల పట్టణంలోని దేవనగర్లోని సయ్యద్ క్లినిక్ (ప్రథమ చికిత్స కేంద్రం)పై జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల బృందం శనివారం దాడులు చేసింది. ఈ దాడులలో క్లినిక్లో అక్రమగా నిల్వ ఉన్న రూ. లక్ష విలువ చేసే ఔషధ మందులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఔషధ నియంత్రణ పరిపాలన అధికారి చంద్ర శేఖర్రావు మాట్లాడుతూ ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారికంగా, భారీ స్థాయిలో ఔషధ మందులను నిల్వ చేసుకోవడం నేరమన్నారు. ఇటువంటి మందులను అమ్మడం కాని, వాటిని నిల్వ చేసుకోవడం క్లినిక్ నిర్వహిస్తూ భారీ స్థాయిలో మందులను కలిగియున్న సయ్యద్ ఇస్తాక్ అహమ్మద్పై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తామన్నారు. మందులు ఎక్కడ నుండి కొనుగోలు చేశారనే వివరాలు విచారణలో తెలుస్తుందన్నారు. వీరి వెంట నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ హరిహర తేజ, కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబిద్ ఆలి, ఆదోని డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ దాదా కలందర్ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం: పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా వెలసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఉన్నాయి. ఎవరైనా ప్రమాదవశాత్తు గాయపడిన, జబ్బు పడిన, వారి ప్రాణాలను కాపాడటానికి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అయితే నిబంధనలు విరుద్ధంగా అడ్మిట్ చేసుకొని అక్కడనే రోగికి ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్స్, నేబ్యులైజేషన్ వంటి చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరిని నియంత్రించే వైద్య శాఖాధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
భారీగా శ్యాంపిల్ మందుల విక్రయాలు
–ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు –రూ.2లక్షల విలువ చేసే మందుల స్వాధీనం కర్నూలు(హాస్పిటల్): నగరంలోని వన్టౌన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు భారీగా శ్యాంపిల్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కుమ్మరివీధిలోని సుంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న కె.గిరిధర్సింగ్ కొన్నేళ్ల క్రితం ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేసేవాడు. మందులపై తనకున్న పరిజ్ఞానంతో పలువురు మెడికల్ రెప్స్తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తదితర ప్రాంతాల నుంచి శ్యాంపిల్ మందులను తెచ్చుకునేవాడు. వీటిని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల వంటి ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. ఆర్ఎంపీలు ఇతని వద్ద తక్కువ ధరకు మందులను కొని రోగులకు ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖరరావు నేతృత్వంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్అలి, జె. విజయలక్ష్మి మంగళవారం ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. గిరిధర్సింగ్ ఇంట్లో లేకపోవడంతో అతనికి ఫోన్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను రాకపోవడంతో వీఆర్వో టి.సుదర్శన్రెడ్డి సమక్షంలో గోడౌన్ తాళాలు పగులగొట్టి వంద రకాలైన రూ.2లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందుల వివరాలు సేకరించి పంచనామా చేశారు. కాగా నిందితుడు గిరిధర్సింగ్ పరారీలో ఉన్నాడు. -
2600 కిలోల డ్రగ్స్, 12.43 లక్షల లీటర్ల మద్యం
సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, చీరలు, కుంకుమ భరిణెలు ఇలాంటివి పంచిపెట్టడం సర్వసాధారణం. అయితే, పంజాబ్లో మాత్రం వీటన్నింటికి తోడు డ్రగ్స్ను కూడా విపరీతంగా పంచేశారు. పాక్ సరిహద్దుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా యువత వీటికి బానిసలు అవుతున్నారంటూ ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. ఇదే అంశం ఆధారంగా 'ఉడ్తా పంజాబ్' సినిమా కూడా వచ్చింది. తాజా ఎన్నికల్లో కూడా డ్రగ్స్ పంపకాలు పెద్ద ఎత్తునే జరిగాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే తాము 2600 కిలోల డ్రగ్రస్, 12.43 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 14న ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని తాము స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా చెప్పారు. వాటితో పాటురూ. 58.02 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. పట్టుబడినవే ఈ మొత్తంలో ఉంటే, ఇక అప్పటికే పంచేసినవి ఇంకెంత ఉంటాయోనని విమర్శకులు అంటున్నారు. వీటితో పాటు 164 కిలోల బంగారం, 26.145 కిలోల వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. గోవాలో కూడా.. గోవా కూడా తక్కువ ఏమీ తినలేదు. ఇక్కడ ఆరు కిలోల డ్రగ్రస్, 75వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు. వాటితో పాటు 58.19 కిలోల బంగారు, వెండి ఆభరణాలు, 175 రాడో రిస్ట్ వాచీలు కూడా స్వాధీనం అయ్యాయి. -
బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మంది పిల్లలకు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో శారీరక బలహీనతను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడు తున్నట్లు వెల్లడించారు. గురువారం ఇక్కడ అంబర్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నులిపురుగుల నివారణ మందుబిళ్లలను అందించారు. నులిపురుగుల నివారణపై అవ గాహన పోస్టర్లను, క్యాలెండర్లను ఎమ్మె ల్యే కిషన్రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ లలితా కుమారితో కలసి మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో ఆర్బీఎస్కె (రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం)తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిం చారు. పుట్టుకతో వచ్చే వ్యాధులను విద్యా ర్థుల జనన ధ్రువీకరణపత్రం ఆధారంగా గుర్తించి బాలల వికాసానికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడ్రన్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో ప్రా«థమిక ఆరోగ్యకేంద్రం స్థాయిని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్నూ ఏర్పాటు చేస్తామన్నారు. నిలో ఫర్, గాంధీ ఆస్పత్రుల ఘటనలపై మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తామన్నారు. నేడు నివారణ మాత్రల పంపిణీ నులిపురుగుల నివారణ కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారందరికీ ఈ మాత్రలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. -
డ్రగ్స్ పరిశ్రమపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వదులుతున్న వ్యర్థాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం హెచ్చార్సీని ఆశ్రయించారు. రసాయనాల పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాల కారణంగా చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆప్టిమస్ పరిశ్రమ వద్దకు నిజ నిర్ధారణకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై యాజమాన్యం దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దాడి విషయమై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదని, అందుకే హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
లెప్రసీ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా భారత్ లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించేందుకు వ్యాక్సిన్ కనుగొన్నది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలోజి వ్యవస్థాపక డైరెక్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ను ఉపయోగించేందుకు భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్తో పాటు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ విభాగం అనుమతి మంజూరు చేసింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బీహార్, గుజరాత్లోని ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని వారాల్లోనే అమలు చేయనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 2013-14 లెక్కల ప్రకారం దేశంలో 1.27 లక్షల మంది రోగులు లెప్రసీతో బాధ పడుతున్నారు. ఈ వ్యాక్సిన్ ఫలితాలను అంచనా వేసేందుకు లెప్రసీ రోగులతో కలసిమెలసి ఉండే కుటుంబ సభ్యలకు వ్యాక్సిన్ను ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే 60 శాతం కేసులు తగ్గిపోయాయి. అంటే వారికి లెప్రసీ వ్యాధి రాలేదు. ముందుగా దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కుష్టు రోగులను పూర్తిగా నయం చేసేందుకు కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా కృషి చేస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే లెప్రసీ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశంలోని 127 జిల్లాల్లో ఏడున్నర కోట్ల మంది ప్రజలపై పరీక్షలు జరపగా వారిలో ఐదువేల మందికి లెప్రసీ వ్యాధి ఉన్నట్లు తేలింది. -
ఏపీ, తెలంగాణ, అసోంలో హెటెరో కొత్త యూనిట్లు
ముంబై: హెటెరో డ్రగ్స్లో భాగమైన హెటెరో హెల్త్కేర్ తన ఫార్ములేషన్ల వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం రాష్ట్రాల్లో కొత్తగా మూడు యూనిట్లు ఏర్పాటు చేయనుంది. దేశీయ మార్కెట్కు ఫార్ములేషన్ల సరఫరా కోసం ఈ మూడు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఏపీలో ఏర్పాటు చేస్తున్న నూతన యూనిట్లో డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, ఇక్కడ ఇంజెక్టబుల్స్ను తయారు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అసోంలోని గువాహటి ప్లాంట్ పనులు 75% పూర్తయ్యాయని వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం అవుతుందని వెల్లడించింది. ఇక్కడ టాబ్లెట్లు, క్యాప్సుల్స్ తయారవుతాయని పేర్కొంది. అయితే, తెలంగాణ యూనిట్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని హెటెరో హెల్త్కేర్ స్పష్టం చేసింది. ఈ మూడు యూనిట్ల ద్వారా కంపెనీ ఆదాయం 20 నుంచి 25%పెరుగుతుందని పేర్కొం ది. ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా హెపటైటిస్, ఆంకాలజీ, హెచ్ఐవీ విభాగాల్లో నూతన మాలిక్యూల్స్పై దృష్టి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఫార్ములేషన్లను తయారు చేసే దేశ, విదేశీ ఫార్మా కంపెనీలకు అతిపెద్ద ముడి పదార్థాల (ఏపీఐ) సరఫరాదారు హెటెరో. దేశంతోపాటు విదేశాల్లో కలిపి కంపెనీకి 25 తయారీ కేంద్రాలున్నాయి. తాను తయారు చేస్తున్న ఏపీఐ, ఫార్ములేషన్లలో 60 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది. హెచ్ఐవీ ఔషధాల్లో 30 శాతం వాటాతో ప్రపంచ లీడర్గా ఉంది. -
అక్కడ నిషేధిస్తే.. ఇక్కడెలా అనుమతిచ్చారు?
- మందుల కొనుగోళ్లలో టీఎస్ఎంఎస్ఐడీసీ కక్కుర్తి - హసీబ్ ఫార్మా స్టెరైల్ వాటర్లో నాణ్యత లేదని నిర్ధారించిన బెంగాల్ సాక్షి, హైదరాబాద్ : కమీషన్ల కక్కుర్తి.. రోగుల పట్ల నిర్లక్ష్యం.. ముందుచూపు లేకపోవడం వెరసి టీఎస్ఎంఎస్ఐడీసీ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. స్టెరైల్ వాటర్నే నాణ్యతా ప్రమాణాల మేరకు తయారుచేయని కంపెనీకి.. సెలైన్ బాటిళ్ల టెండర్లను కట్టబెట్టింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏడుగురి చూపు పోవడానికి సెలైన్ బాటిళ్లలోని బ్యాక్టీరియానే కారణమని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన నాగపూర్కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తయారు చేసిన స్టెరైల్ వాటర్ బాటిళ్లను 2013సెప్టెంబర్లో నాణ్యతా ప్రమాణాలు లేవంటూ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. కానీ అదే కంపెనీకి చెందిన 13.07లక్షల సెలైన్ బాటిళ్లను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. చర్యలు కరువు: మూడు బ్యాచ్లకు చెందిన సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ సెలైన్ బాటిళ్లలో ఫంగస్ చేరినట్లు గుర్తించారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. కేవలం సెలైన్ బాటిళ్లను సీజ్ చేసి చేతులు దులుపుకుంది. మరోవైపు స్టెరైల్ వాటర్నే సరిగా తయారు చేయలేని కంపెనీకి సెలైన్ బాటిళ్ల టెండర్ ఎలా అప్పగించారని కొందరు వైద్యాధికారులు ప్రశ్నిస్తున్నారు. స్టెరైల్ నుంచే సెలైన్: స్టెరైల్ వాటర్ను ఇంజెక్షన్ల కోసం ఉపయోగిస్తుం టారు. స్టెరైల్ వాటర్ను విని యోగించుకునే సెలైన్ ఐవీ ఫ్లూయీడ్స్ వంటి వాటిని తయారు చేస్తారని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అలాంటిది స్టెరైల్ వాటరే నాణ్యతా ప్రమాణాల మేరకు లేకపోతే... దాని నుంచి తయారయ్యే సెలైన్ ఎంత వరకు సురక్షితమనేది అర్థం చేసుకోవచ్చు. హసీబ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కొనుగోలు చేసిన 13.07 లక్షల సెలైన్ బాటిళ్లో 8లక్షలు ఇప్పటికే వినియోగించగా, మిగతావి సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల సెలైన్ బాటిళ్లను సీజ్ చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా రెండు లక్షల సెలైన్ బాటిళ్లను గోవా, అహ్మదాబాద్ల నుంచి తెప్పిస్తున్నారు. -
నిలోఫర్లోనూ కల్తీ సెలైన్ బాటిళ్లు
హైదరాబాద్: సరోజనీ కంటి ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఆస్పత్రికి సరఫరా చేసే సెలైన్ బాటిళ్లలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావటంతో సదరు కంపెనీని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ కంపెనీ సరఫరా చేసే అన్ని ఆస్పత్రుల్లోనూ డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం సాయంత్రం నిలోఫర్ పిల్లల ఆస్పత్రిలో తనిఖీలు చేయగా మొత్తం 39 వేల బాటిళ్లలో బ్యాక్టీరియా ఆనవాళ్లున్న 29వేల సెలైన్ బాటిళ్లు బయటపడ్డాయి. వాటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తామని, వాటిని సీజ్ చేశామని డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని తెలిపారు. అయితే, ఇప్పటికే పదివేల బాటిళ్లను వినియోగించినట్లు తేలిందన్నారు. -
ఫైజర్, అలెర్గాన్ విలీనం...
ఫార్మా రంగంలో అతి పెద్ద డీల్ * ప్రపంచంలోనే నంబర్ వన్ ఔషధ సంస్థ ఆవిర్భావం * ఒప్పందం విలువ దాదాపు రూ. 10,40,000 కోట్లు న్యూయార్క్: ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, వయాగ్రా ఉత్పత్తి చేసే అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ ఫార్మా సంస్థ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెండు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. డీల్ ప్రకారం ఇరు సంస్థల వ్యాపారాలను అలెర్గాన్ కింద విలీనం చేస్తారు. విలీనానంతరం ఏర్పడే కొత్త సంస్థను ఫైజర్గా వ్యవహరించనున్నారు. రెండు సంస్థల వార్షికాదాయం 60 బిలియన్ డాలర్ల పైగా ఉండనుంది. 40 బిలియన్ డాలర్ల వార్షికాదాయంతో మరో ఔషధ సంస్థ మెర్క్ రెండో స్థానానికి పరిమితం కానుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న సుమారు 100 పైగా ఉత్పత్తులు అందుబాటులోకి వస్తే ఫైజర్కు 2018 నుంచి మరో 25 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సమకూరగలదని అంచనా. 116 బిలియన్ డాలర్లతో 2000లో వార్నర్-లాంబర్ట్ను ఫైజర్ కంపెనీ కొనుగోలు చేసిన డీల్ కన్నా తాజా ఒప్పందం మరింత భారీది కావడం గమనార్హం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. ఈ రెండు సంస్థల ఉత్పత్తులకూ భారత్లో గణనీయమైన అమ్మకాలు ఉన్నాయి. విస్తృత పరిశోధనలతో మరిన్ని ఔషధాల రూపకల్పనకు ఇరు కంపెనీల కలయిక తోడ్పడగలదని ఫైజర్ చైర్మన్ ఇయాన్ రీడ్ వ్యాఖ్యానించారు. జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చేందుకు రెండు సంస్థల భాగస్వామ్యం ఉపయోగపడగలదని అలెర్గాన్ సీఈవో బ్రెంట్ శాండర్స్ పేర్కొన్నారు. పన్ను ప్రయోజనాలు.. సాంకేతికంగా అలెర్గాన్.. తనకన్నా పెద్దదైన ఫైజర్ను కొనుగోలు చేసినట్లవుతుంది. ఫైజర్ అమెరికన్ కంపెనీ కాగా అలెర్గాన్.. ఐర్లాండ్కు చెందిన సంస్థ. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఫైజర్ సంస్థ పన్ను ప్రయోజనాలు పొందే దిశగా.. ప్రధాన కార్యాలయాన్ని ఐర్లాండ్కు మార్చుకోనుంది. దీంతో అమెరికాలో 35 శాతం కార్పొరేట్ ట్యాక్స్ భారం నుంచి ఫైజర్ తప్పించుకోవీలవుతుంది. ఐర్లాండ్లో ఈ పన్ను రేటు 12.5 శాతమే. ఒప్పందం స్వరూపం ఇది .. ఇరు కంపెనీలు కుదుర్చుకున్న విలీన ఒప్పంద ప్రకారం విలీనం అనంతరం ఏర్పడే సంయుక్త కంపెనీలో.. అలెర్గాన్ షేర్హోల్డర్ల వద్ద ఉన్న ఒక్కో షేరుకు ప్రతిగా 11.3 షేర్లు లభిస్తాయి. ఫైజర్ షేర్హోల్డర్ల వద్ద ఉన్న షేరు ఒక్కింటికి ఒక్కటి చొప్పున దక్కుతుంది. ఈ లావాదేవీ స్టాక్ మార్పిడి రూపంలో ఉండనుంది. ఫైజర్ ఇన్వెస్టర్లు కావాలనుకుంటే తమ షేర్లకు బదులుగా నగదును పొందే వీలుంది. అయితే, ఇందుకోసం మొత్తం నగదు చెల్లింపులు 6 బిలియన్ డాలర్ల పైగా, 12 బిలియన్ డాలర్ల లోపు ఉండాలి. డీల్ కోసం అక్టోబర్ 28 నాటి షేరు ధరతో పోలిస్తే 30 శాతం అధికంగా స్టాక్స్ విలువను నిర్ణయించారు. దీని ప్రకారం అలెర్గాన్ షేరు ధర ఒక్కోటి 363.63 డాలర్లుగా, ఫైజర్ షేరు ధర 32.18 డాలర్లుగా లెక్కించారు. షేరు ధర లెక్క ప్రకారం అలెర్గాన్ సంస్థ విలువ 160 బిలియన్ డాలర్లు కానుంది. ప్రస్తుతం ఫైజర్ చైర్మన్గా ఉన్న ఇయాన్ రీడ్.. ఇకపైన సంయుక్త కంపెనీకి చైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తారు. అలెర్గాన్ సీఈవో బ్రెంట్ సాండర్స్.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్గా ఉంటారు. ఫైజర్ పీఎల్సీ షేర్లను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయాలని సంస్థలు యోచిస్తున్నాయి. ఫైజర్ పీఎల్సీలో 15 మంది డెరైక్టర్లు ఉంటారు. వీరిలో 11 మంది ఫైజర్కి చెందిన వారు, మిగతా నలుగురు అలెర్గాన్కి చెందిన వారు ఉంటారు. ఇరు కంపెనీల కీలక ఉత్పత్తులు.. వయాగ్రాతో పాటు లైరికా, ప్రెవ్నార్ తదితర ఔషధాలను ఫైజర్ తయారు చేస్తోంది. మరోవైపు, కాస్మొటిక్ మెడికేషన్ బొటాక్స్తో పాటు అల్జీమర్స్ చికిత్సలో ఉపయోగించే నమెండా మొదలైన వాటిని అలెర్గాన్ ఉత్పత్తి చేస్తోంది. -
పరీక్షల్లో ఎయిమ్స్ మందులు ఫెయిల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న మందులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. రాజన్స్ బన్సాల్ అనే ఆర్టీఐ ఉద్యమకారుడు ఈ అంశంపై దరఖాస్తు చేశాడు. 2010 నుంచి 2015 మధ్యకాలంలో ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం పన్నెండు రకాల మెడిసిన్లు పరీక్షల కోసం తీసుకున్నామని, వాటిల్లో ఏఒక్కటీ పాస్ కాలేదని అతడికి ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ శాఖ తెలిపింది. ఇలా విఫలమైన మందుల్లో ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రి మందులు కూడా ఉండటం విశేషం. ఆ శాఖ తీసుకున్న డ్రగ్స్ నమునాలు సేకరించిన ఆస్పత్రులివే.. * సంజీవ్ గాంధీ ఆస్ప్రత్రి * సెంట్రల్ మెడికల్ స్టోర్ ఎంసీడీ బిల్డింగ్(సివిల్ లైన్స్) * సఫ్దార్ జంగ్ ఆస్ప్రత్రి * ఎయిమ్స్ * శ్రీ దాదా దేవ్ మత్రి అవమ్ శిషు చికిత్సాలయ(దాబ్రి) * లోక్ నాయక్ ఆస్పత్రి * జీటీబీ ఆస్పత్రి * దీన్ దయాల్ ఉపధ్యాయ్ ఆస్పత్రి * ఆచార్య భిక్షు ఆస్పత్రి * రావ్ తులా రాం మెమోరియల్ ఆస్పత్రి -
జనం నెత్తిన నాసిరకం మందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. రోగం నయమవాలని మందులు కొంటే కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు జరిపిన దాడుల్లో 21 సంస్థలు తయారు చేస్తున్న మందులు నాసిరకం అని తేలింది. వారు తయారు చేస్తున్న మందులు జనం అధికంగా వినియోగించేవే కావడం గమనార్హం. జూలైలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 650 శాంపిల్స్ సేకరించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ల్యాబొరేటరీలో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 21 మందులు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. వీటిని వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని ఆయా కంపెనీలకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీల నాసిరకం మందులను ఎవరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. నాసిరకం మందులివే... ఓంప్రజోల్ (పెంటా ఫార్మస్యూటికల్స్), పాంటాప్రజోల్ (హరి సుజన్), టోల్పెరిసోన్ హెసీఎల్ (జీఎంకే న్యూ ఫార్మా) రైబోఫ్లెవిన్ (రిడ్లీ లైఫ్ సైన్స్) పారాసిటమాల్, డైక్లోఫెనక్ సోడియం (ఎఫిల్ ఫార్మా) డైక్లోఫెనక్, పారసిటమాల్ (మవెన్ లైఫ్ సైన్స్), మెట్ఫొర్మిన్ హెచ్సీఎల్ (స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్) డైక్లోఫెనక్ సోడియం (వాల్టన్, అన్రోస్ ఫార్మా) క్లెపి డోజెల్, ఆస్ప్రిన్ (మార్క్సన్ ఫార్మా), సెట్రిజిన్ డీహైడ్రో క్లోరైడ్ (కొర్టెక్స్ ల్యాబ్), డెక్సామెథాజోన్ (నికెమ్ డ్రగ్స్),సెఫిక్జైమ్ (మైనోఫార్మా), ర్యాన్టిడిన్ (గోపిస్ ఫార్మా), ఓమెప్రజోల్ (జానస్ రెమిడీస్), పారాసిటమాల్ (లాకెమ్), ఓప్లాగ్జిన్ (హిపో ల్యాబ్స్, అన్రోజ్ ఫార్మా) పైరాసెటమ్ (మెడిపోల్ ఫార్మా). -
ఔషధ నియంత్రణ అధికారుల దాడులు
నల్గొండ (మిర్యాలగూడ) : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఔషధ నియంత్రణ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీరేపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మందులను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారనే ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. -
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝుళిపిం చింది. రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయకపోగా, నిర్ధేశించిన ధర కన్నా అధిక మొత్తానికి రక్తాన్ని అమ్ముతున్నట్లు గుర్తించింది. అర్హులైన టెక్నిషియన్లు లేకపోవడం, దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వచేయడం, చివరకు బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇలా అంతా లోపభూయిష్టంగా ఉన్నట్లు వెల్లడయింది. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రితోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు సహా 109 కేంద్రాలకు నోటీసులు జారీ చేసిం ది. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే లెసైన్స్లను రద్దు చేయడంతోపాటు కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. గతంలో హెచ్చరించినా మారని తీరు... తెలంగాణలో 132 బ్లడ్ బ్యాంకులు రిజిస్ట్రర్ కాగా, ఇందులో 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నా యి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యధికంగా 61 బ్లడ్బ్యాంకులు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 ఉన్నాయి. నోటీసులు అందుకున్న వాటిలో గ్రేటర్లోని బ్లడ్ బ్యాంకులే ఎక్కువ. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సుల్తాన్బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి రక్తనిధి కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి కనీస వసతులు లేవని నోటీసులు జారీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. నిలోఫర్లో 45 బాటిళ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఆయా బ్లడ్బ్యాంకులు తీరు మార్చుకోలేదు. తలసీమియా బాధితులకు విక్రయం.. డ్రగ్కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్త కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. ఆరు మాసాలకోసారి కూడా అటువైపు చూడటం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తం లో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధనను పట్టించుకోకపోగా.. ఒక్కో బాటిల్పై రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒ,ఎ, బి, నెగిటీవ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటివి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. -
ఆన్లైన్లో ఫార్మసిస్టుల లెసైన్స్లు
హైదరాబాద్ : ఫార్మసిస్టులు లెసైన్స్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు. స్థానిక ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నూతన వెబ్సైట్ను, సేల్స్ లెసైన్స్కు సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఫార్మసిస్టులు మందులషాపు తదితర వ్యాపారాల నిర్వహణ అనుమతి కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, ఇకపై వారు ఎలాంటి కష్టాలూ పడకుండా అనుమతి ప్రక్రియను సులభతరం చేస్తున్నామని చెప్పారు. ఫార్మసిస్టులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ కార్యాలయానికి పంపొచ్చని, వారి దరఖాస్తులను పరిశీలించి అనుమతి రాగానే ఆన్లైన్ ద్వారానే తెలియజేస్తామని చెప్పారు. అనుమతి వచ్చిన తర్వాత లెసైన్స్ పొందడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని, వాటి పరిశీలన అనంతరం అధికారులు లెసైన్స్ మంజూరు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ అకున్ సబర్వాల్, డిప్యూటీ డెరైక్టర్ అమృతరావు, పలువురు అసిస్టెంట్ డెరైక్టర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించాలి
- డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి - లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ సహకారంతో కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ ఎంజీఎం : టీబీ వ్యాధిని ముందుగానే గుర్తించినట్లరుుతే కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందని డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరైక్టర్ పల్లవి అన్నారు. గురువారం స్థానిక డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ‘టీబీ వ్యాధిని అరికట్టేందుకు కెమిస్టుల పాత్ర’పై లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ ప్రతినిధులు పల్లవితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీవీ వ్యాధిని అరికట్టడంతోపాటు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లిల్లీ ఎండీఆర్-టీబీ అనే స్వచ్ఛంద సంస్థ కెమిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. టీబీ వ్యాధి మొదట దగ్గుతో మొదలై జ్వరం, బరువు తెగ్గడం లక్షణాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కెమిస్టులు ప్రిస్కిప్షన్ లేకుండా ముందులు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కెమిస్టులకు అవగాహన : లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు టీబీ వ్యాధిని అంతమొందించడంతోపాటు అరికట్టడంలో కెమిస్టుల పాత్ర కీలకమని లిల్లీ ఎండీఆర్-టీబీ ప్రతినిధులు సూచించారు. దగ్గుతో బాధపడుతున్న వారు నామమాత్రపు మందులు వాడడం వల్ల వ్యాధి పెరిగే అవకాశంతోపాటు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లిల్లీ ఎండీఆర్-టీబీ సంస్థ కెమిస్టులకు టీబీ వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ షాపునకు వెళ్లిన వ్యక్తి జబ్బు నయం కాకపోతే.. ఆర్ఎంపీ వద్దకు, మరో వైద్యుడి వద్దకు వెళ్తున్నారని, ఇలా వ్యాధికి సరైన మందులు అందకపోవడంతో వ్యాధి ప్రభావం పెరిగే ఆవకాశం స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు కెమిస్టులకు శిక్షణా కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు సంబంధిత వైద్యులు చెప్పిన కోర్సును వాడినప్పుడు మాత్రమే ఆ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చన్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నారు. జిల్లాలో 103 మంది కెమిస్టులకు అవగాహన కల్పించగా.. 70 మంది సంస్థ ద్వారా పనిచేసేందుకు నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 530 మందిని కెమిస్టులు టీబీ అనుమానితులుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించగా.. ఇందులో 44 మందికి పాజిటివ్ నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. కెమిస్టులు ఇలాగే ముందుకు సాగితే టీబీ వ్యాధిని అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. -
భద్రాద్రిలో ‘ఔషధ’ తనిఖీలు
రూ.2.10 లక్షల విలువైన అక్రమ మందులు సీజ్ భద్రాచలం :భద్రాచలం పట్టణంలో బుధవారం ఔషద నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం, ఖమ్మం అర్భన్, రూరల్ డ్రగ్ ఇన్సిపెక్టర్లు జీ సురేందర్, వీ లక్ష్మీనారాయణ, కె సురేందర్ల నేతృత్వంలోని అధికారుల బృందం ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్లోని చంద్రశేఖర్ హోమియో క్లినిక్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన రూ.10 వేల విలువ గల మందులను, రెడ్క్రాస్ బిల్డిండ్ ఎదురుగా ఉన్న శ్రీవెంకటరమణ నర్సింగ్ హోమ్లో రూ.2 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి నిల్వలకు ఎటువంటి అనుమతులు లేకపోవటంతో సీజ్ చేశారు. భద్రాచలం పట్టణంలో ఔషద నియంత్రణ అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదుల నేపథ్యంలో సదరు అధికారులు నేరుగా రెండు ఆసుపత్రులను తనిఖీ చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, పట్టణంలోని ఇతర ఆసుపత్రులు, హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాల జోలికి వెళ్లకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలం కేంద్రంగా ఉన్న కొన్ని హోల్సేల్ దుకాణాలు నాసిరకం మందులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో తిరిగే ఆర్ఎంపీలతో ఒప్పందం కుదుర్చుకున్న కొంతమంది హోల్సేల్ మందుల విక్రయ దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు చేసి సరఫరా చేస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం ఈ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప, ఔషధ నియంత్రణ అధికారులు మందులు దుకాణాలు, ఆసుపత్రులపై తనిఖీలు చేయాలనే ఆలోచన లేకపోవటం కూడా వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో తనిఖీల కోసమని వచ్చిన ఔషధ నియంత్రణ అధికారులకు పట్టణంలో పేరుమోసిన మందుల విక్రయ దుకాణదారులు రాచ మర్యాదలు చేయటం గమనార్హం. సదరు అధికారులు హోటల్లో అల్పాహారం తీసుకునే సమయంలో కూడా కొంతమంది మందుల దుకాణ యజమానులు వారికి సేవలు చేస్తూ కనిపించారు. తనిఖీల కోసమని వచ్చిన సందర్భంలో ఇలా మందుల దుకాణదారులను వెంట వేసుకొని తిరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా ఔషధ నియంత్రణ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు భద్రాచలం కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించాల్సుంది. -
ఆయుర్వేదిక్ కంపెనీ పేరుతో మోసం
హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంతి నగర్లో ఆయుర్జన్ అనే మోసం చేస్తున్న ఒక ఆయుర్వేద కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. ఆయుర్వేద కంపెనీ పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు అందాయి. దాంతో అధికారులు ఈ కంపెనీపై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. లక్షన్నర విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ పంజా
హైదరాబాద్: హైదరాబాద్లోని 11 కార్పొరేట్ ఆస్పత్రుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 6 ఆస్పత్రుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. వీటిపై చట్ట పరమైన చర్యలకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. రెండు ఆసుపత్రుల్లో సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాప్లను సీజ్ చేశారు. చాలా ఆస్పత్రుల్లో అధిక ధరలకు మందులు అమ్ముతున్నట్టు అధికారులు నిర్ధారించారు . రికార్డుల మెయింటెనెన్స్ లోనూ అవకతవకలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
లెక్క తప్పింది!
* వికటించిన ‘ఔషధ’నగరి * తగ్గిన ఫార్మాసిటీ విస్తీర్ణం * భూ సర్వే ముచ్చర్లకే పరిమితం * అందులోనూ ప్రైవే టు, అసైన్డ్ భూములు * సర్కారుకు నికరంగా 1,623 ఎకరాలు మాత్రమే సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఔషధ నగరిపై ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. 13వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీకి భూ లభ్యత ప్రతిబంధకంగా మారింది. కేవలం 1,623 ఎకరాలు మాత్రమే ఔషధనగరికి అనుకూలంగా ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. కందుకూరు మండ లం ముచ్చర్ల ప్రాంతంలో రసాయన, ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫార్మా దిగ్గజాలతో కలిసి విహంగ వీక్షణం చేశారు. ఔషధ సంస్థల అధినేతలు అడిగిందే తడ వు.. 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామని ప్రకటించారు. తక్షణమే గుర్తించిన భూములను టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద భూముల సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులకు చావు కబురు చల్లగా తెలిసింది. ముందు అనుకున్నట్లు గుర్తించిన భూములుకాకుండా.. సర్వేను ముచ్చర్లలోని సర్వే నంబర్ 288కే పరిమితం చేయాలని సూచింది. దీంతో ఈ సర్వేనంబర్ పరిధిలోని భూములను సర్వే చేసిన యంత్రాం గం తేలిన లెక్కతో బిత్తరపోయింది. ఈ సర్వే నంబర్ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, అందులో 460 ఎకరాలు గల్లంతైంది. (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) ఈటీఎస్ సర్వేలో కేవలం 2,286 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. సంప్రదాయ సర్వేకు ఈటీఎస్ సర్వేకు కొంతమేర వ్యత్యా సం రావడం సహజమేనని అధికారయంత్రాంగం సమర్థించుకుం టోంది. అసలే భూ లభ్యత లెక్క తప్పిందని జుట్టుపీక్కుంటున్న రెవెన్యూ గణానికి అందులోనూ పట్టా భూములు ఉండడం మరిం త చికాకు తెప్పిస్తోంది. 381 ఎకరాల మేర ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉండగా, 282 ఎకరాలను ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పోగా ప్రభుత్వానికి నికరంగా మిగిలేది 1,623 ఎకరాలు మాత్రమే. పట్టా, ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా గుర్తించిన సర్వే నంబర్ అంతర్భాగంలో ఉండడంతో భూ సేకరణ తప్పనిసరి. ఈ క్రమంలో అసైన్డ్ భూములను సేకరించాలంటే 1307 కింద ఎక్స్గ్రేషియా చెల్లించాల్సివుంటుంది. ప్రైవేటు పట్టాదారులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సివుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యంత్రాంగం భూ లభ్యతపై తర్జనభర్జనలు పడుతోంది. పక్కనే ఉన్న సాయిరెడ్డినగర్లోని సర్వే నం.155లోని భూమినీ పరిశీలించినప్పటికీ, అందులోనూ ఇవే సమస్యలు ఇమిడి ఉండడంతో పక్కనపెట్టింది. ఊపు తగ్గించిన సర్కారు.. ఫార్మాసిటీపై దూకుడుగా వెళ్లిన సర్కారు.. ప్రస్తుతం ఊపు తగ్గించినట్లు కనిపిస్తోంది. ప్రతిపాదిత విస్తీర్ణాన్ని కుదించడం, నెలరోజులైనా భూముల సర్వేపై లెక్క తేల్చకపోవడం పరిశీలిస్తే.. ఔషధనగరిపై ప్రభుత్వం వైపు నుంచి మునుపటి స్పందన రావడంలేదని జిల్లా యంత్రాంగం అంటోంది. ఫార్మారంగ అధినేతల తో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత వరుసగా మూడు రోజులు ఈ ప్రాజెక్టు పురోగతిపై సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీకి ఈ సిటీ డిజైన్చేసే బాధ్యత అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఫార్మాసిటీ నిర్మాణం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. -
మందుల పేరిట మోసం
వేములవాడ అర్బన్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసరా చేసుకుంటున్న కొన్ని మందుల కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. అందినకాడికి దండుకుంటున్నాయి. ఓ ఆయుర్వేద మందుల కంపెనీవారు చందుర్తి మండలం రుద్రంగి, నిజామాబాద్ జిల్లా మానాల గ్రామాలకు చెందిన 15 మందిని బురిడీ కొట్టించిన వైనం శనివారం వెలుగు చూసింది. బీహార్లోని నలందా ప్రాంతానికి చెందిన రాజేశ్ వీపీ డెలివరీ పేరుతో నడుస్తున్న ఆయుర్వేద కంపెనీకి రూ. 500 డీడీ చెల్లిస్తే కావాల్సిన మందులు పోస్టుద్వారా పంపిస్తామని ప్రకటనల ద్వారా నమ్మబలికాడు. పార్శిల్ అందిన తర్వాత మరో రూ. 500 చెల్లించాలని సూచించాడు. దీంతో చందుర్తి మండలం రుద్రంగికి చెందిన దయ్యాల హన్మండ్లు, కాదాసు నారాయణ రూ. 500 డీడీ తీసి పంపారు. మరో 500 రూపాలు చెల్లించి పార్శిలు తీసుకున్నారు. పార్శిల్లో ఒకదానిని తెరిచి చూడగా అందులో చిత్తుకాగితాలు దర్శనమిచ్చాయి. అవాక్కైన వారు మరో పార్శిల్ తీసుకునేందుకు నిరాకరించారు. తమ వద్దనున్న సెల్ఫోన్ నంబర్కు ఫోన్చేస్తే సరైన స్పందన రాకపోవడంతో మోసపోయామని నాలుక్కర్చుకున్నారు. హన్మండ్లు, నారాయణలతోపాటు మరో 13 మంది సైతం రూ. 500 చొప్పున డీడీలు పంపించినట్లు చెప్పారు. విచ్ఛలవిడిగా వెలుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని సామాన్యులను రక్షించాలని వారు కోరారు. -
‘అజంతా’కు చెక్...
కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన ఫెన్సిడిల్ సిరప్ అక్రమ దందా విషయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చేపట్టిన విచారణ కొలిక్కి వస్తోంది. దగ్గుమందు అక్రమ దందాలో కీలక పాత్ర పోషించినవారికి సంబంధించి ఆధారాలను సేకరించిన అధికారులు చర్యలు మొదలుపెట్టారు. బిల్లుల ఆధారంగా విచారణ జరిపిన అనంతరం మంగళవారం కామారెడ్డికి చెందిన అజంతా ఏజెన్సీస్ లెసైన్సును రద్దు చేశా రు. దీంతో దుకాణం మూతపడింది. అజంతా యజమాని పాత సుధాకర్ ఫెన్సిడిల్ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమదందా విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి వరుస కథనాలను ప్రచురించింది. ఆ తరువాత అజంతా ఏజెన్సీ నుంచి 2.39 లక్షల ఫెన్సిడిల్ సిరప్ బాటిళ్లు అక్రమ రవాణా అయినట్టు గుర్తించిన అధికారులు వాటి బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్కు రవాణా అ యిన ఫెన్సిడిల్ సీసాల సంగతి అటుంచితే తమ ఏజెన్సీకి వచ్చిన మందులను రిటైలర్ దుకాణాలకు సరఫరా చేసినట్టు అజంతా ఏజెన్సీ యజమానులు బిల్లులు తయారు చేశారు. అక్రమదందా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఔషధ నియంత్రణ శాఖ విచారణను వేగవంతం చేసింది. మెడికల్ షాప్ల యజమానులను పిలిపించి వివరాలను ఆరా తీసింది. తాము అజంతా నుంచి వాటిని తెప్పించలేదని, ఆ బిల్లులకు, తమకు ఏ సంబంధమూ లేదని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. మెడికల్ షాపుల యజమానులను నేరుగా నిజామాబాద్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరుపుతున్నారు. లిఖితపూర్వకంగా వివరాలను రాయించుకుంటున్నారు. వాటిని కోర్టుకు సమర్పిస్తే నిందితుల చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. నాలుగు జిల్లాలలో విచారణ బిల్లులలో నాలుగు జిల్లాలకు చెందిన మెడికల్ షాప్ల వివరాలు ఉండడం తో ఆయా జిల్లాల అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. త్రిపురలో భద్రతా దళాలకు చిక్కిన తరువాత కేసును టేకప్ చేసిన అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చే శారు. అక్రమదందాలో భాగస్వాములైన వ్యాపారులు కేసు నుంచి తప్పించుకునేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. -
తీగలా అల్లుకుని
సరిహద్దులు చెరిపేసి.. చెక్పోస్టులు దాటేసి ‘బంగ్లా’కు చేరుతున్న ఫెన్సిడిల్ సీసాలు అక్రమ వ్యాపారులు అందరూ బంధువులే ‘అజంతా’ సుధాకరే కీలక పాత్రధారి కామారెడ్డి కేంద్రంగానే సాగిన దందా ఏటా కోట్లాది రూపాయల అక్రమార్జన ‘ఔషధ నియంత్రణ’ చేతిలో కీలక సమాచారం‘ఫెన్సిడిల్’ దగ్గు మందు బంగ్లాదేశ్కు తరలడానికి హైదరాబాదే అసలు అడ్డా అయినా, ఈ కీలక వ్యాపారానికి కొన్నేళ్లుగా కామారెడ్డే ప్రధాన కేంద్రం. ఇక్కడ మొదలైన వ్యాపారం కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్కు తీగలా అల్లుకుపోయింది. చివరకు భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులు దాటింది. అక్కడ దొరికిన ‘ఫెన్సిడిల్’ సీసాల ఆధారంగా అధికారులు విచారణ ప్రారంభిస్తే రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. నిజామాబాద్ : అక్రమ దందా పూర్తి వివరాలను సేకరించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దీనికి కీలక సూత్రధారి కామారెడ్డికి చెందిన అజంతా మెడికల్, జనరల్ స్టోర్స్ మేనేజింగ్ పార్టనర్ పి.సుధాకర్గా గుర్తించారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మెడికల్ ఏజెన్సీలు కూడా ఆయన బంధువులవిగా గుర్తించిన అధికారులు మరింత ముఖ్య సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఏటా కోట్లాది రూపాయల అక్రమార్జనకు కారణమైన ఈ కేసు వెనుక ఉన్న మరి కొందరి కోసం ఆరా తీస్తున్నారు. కామారెడ్డిలో దొరికిన ఆధారాలను కీలకంగా చేసుకుని విస్తృత దాడులు జరుపుతున్నారు. సుధాకర్ సరఫరా చేసిందే అధికం హైదరాబాద్ రామంతాపూర్లోని మహేందర్కు చెందిన ప్రణిత్ ఫార్మా, సికింద్రాబాద్లోని సురేందర్కు చెందిన మహావీర్ ఫార్మా, ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తోంది. వీరు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో 25 మంది డీలర్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ప్రతి నెల ఐదు వేల ఫెన్సిడిల్ సిరప్ సీసాలను సరఫరా చేస్తున్నట్లు ఇండెంట్లో పేర్కొన్నారు. కానీ, వీటిని నేరుగా హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్కు సరఫరా చేస్తున్నారు. సుధాకర్ ఈ వ్యాపారంలో రెండడుగులు ముందుకు వేశాడు. జిల్లాలో 400 మెడికల్ దుకాణాలకు ఈ మందు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించాడు. అందరికీ ఐదు వేల సీసాలు మాత్రమే అందిస్తే ఇతను మాత్రం 15 నుంచి 20 వేల వరకు ఇండెంట్ను కొనసాగించాడు. దీంతో ఎక్కువ పర్సెంటేజీ పొందాడు. హైదరాబాద్లోని నాలుగు, కరీంనగర్లోని కోరుట్లకు చెందిన కె.ఎస్.ఏజెన్సీ, హైదరాబాద్కు చెందిన రోహిత్ ప్రణిత్, మిస్రీ మరికొన్ని ఏజెన్సీల పేరిట ఇండెంట్ పెట్టాడు. ఇలా నెలకు 1.25 లక్షల ఫెన్సిడిల్ దగ్గుమందును బంగ్లాదేశ్కు సరఫరా చేస్తున్నారు. 2012 నుంచి నెలకు రూ.32 కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది. సుధాకర్ 2013 ఫిబ్రవరి నుంచి అక్రమ దందా కొనసాగి స్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడింది ఇలా బంగ్లాదేశ్కు అక్రమంగా రవాణా అవుతున్న ఫెన్సిడిల్ మందును గత అక్టోబర్లో తనిఖీ అధికారులు దేశ సరిహద్దులో పట్టుకున్నారు. బ్యాచ్నెంబర్ ఆధారంగా వివరాలు పరిశీలించి హైదరాబాద్కు చెందినవిగా గుర్తించారు. అనుమానంతో కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్లోని మందుల దుకాణాలను తనిఖీ చేయాలని జిల్లా ఔషధనియంత్రణ అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు ఆ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సురేంద్రనాథ్సాయి ఆదేశాల మేరకు డీఐలు ప్రసాద్, రాజిరెడ్డి ఆయా దుకాణాలను తనిఖీ చేశారు. అప్పటి వరకు గుట్టుగా ఉన్న ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి వరస కథనాలు వెలువరించింది. దీంతో అధికారులు విచారణను వేగవంతం చేసి మరిన్ని వివరాలు రాబట్టారు. దర్యాప్తును కొనసాగిస్తూనే నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. ‘దగ్గుమందు’ దందా ఎందుకంటే ఫెన్సిడిల్ అక్రమ వ్యాపారం తక్కువ ఆదాయంతో ఎక్కువ లాభం చేకూర్చే విధంగా మారింది. ఈ మందును కోడిల్ ఫార్మాతో తయారు చేస్తారు. దగ్గు నివారణకు ఒక చెంచా మందును మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మత్తు వస్తుంది. బంగ్లాదేశ్లో దీనికి సంబంధించిన ఫార్మా నిషేధంలో ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో ఈ ఫెన్సిడిల్ మందు రూ. 65 రూపాయలకు లభిస్తుంది. బంగ్లాదేశ్లో దీనిని రూ. 260 రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలోని మందుల దుకాణాలలో దీనిని ఐదు సీసాల కంటే కంటే ఎక్కువగా అందుబాటులో ఉంచరు. దీంతో వ్యాపారులు అక్రమ రవాణా వైపు దృష్టి మళ్లించారు. -
డ్రగ్స్ నిర్మూలనపై సలహాలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో మాదక ద్రవ్యాల బెడదను పరిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ దిశగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని దాన్నుంచి బయట పడేసే దిశగా చేసిన పోరాటంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను తనతో పంచుకోవాలని కోరారు. తన తదుపరి ఆకాశవాణి ప్రసంగంలో మాదక ద్రవ్యాల బానిసత్వంపై ప్రసంగించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ఆదివారం ప్రసారమైన తన ఆకాశవాణి కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఈ అంశాన్ని సృ్పజించడాన్ని ఆయనీ సందర్భంగా తెలిపారు. మాదక ద్రవ్యాల బెడద గురించి అనేకమంది స్నేహితులు తనకు లేఖరాసిన విషయాన్ని చెబుతూ.. తదుపరి కార్యక్రమంలో ఇదే అంశాన్ని తీసుకుంటానని పేర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నా. మీరు కనుక ఈ దిశగా పనిచేస్తున్నట్లయితే.. దయచేసి మీ అనుభవాలను నాతో పంచుకోండి’’ అని ఆయన తన ట్వీట్ ద్వారా ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఝడజౌఠి వెబ్సైట్ ద్వారా వీటిని తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా ఈ విషయంలో వ్యక్తిగత అనుభవాలను బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడని పక్షంలో తనకు నేరుగా లేఖ రాయవచ్చని ప్రధాని సూచించారు. తన తదుపరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ అంశంపై ప్రసంగిస్తానని హామీనిచ్చారు. దాదాపు నెలరోజుల తరువాత ఇది ప్రసారమవుతుందని భావిస్తున్నారు.