Entrepreneur
-
ఫ్యాషన్తో కల సాకారం చేసుకున్న తాన్యా
అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.ముంచెత్తే సవాళ్లుపదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.అంకిత భావందేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)సామాజికంగా ఉన్నతంగా!చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు. -
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్మార్క్గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు
మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్ గ్యాప్కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్ పడిలేచిన కెరటంలాగ సొంత కంపెనీ స్థాపించారు. బిందు స్థాపించిన వెబ్సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతోంది.కేరళకు చెందిన బిందు వినోష్ ఎంసీఏ చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దశాబ్దానికి పైగా ఇల్లే ప్రపంచంగా ఉండిపోయారామె. నలభై ఏళ్లు దాటేటప్పటికి ఐటీ రంగం మీదున్న ఇష్టం ఆమెను తిరిగి కెరీర్ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించింది. 44 ఏళ్ల వయసులో ఓ పెద్ద ఐటీ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీకి, ఆఫీస్ ఏర్పాటు చేయడానికి 16 లక్షలతో ఎంటర్ప్రెన్యూర్గా మారారు. అనతికాలంలోనే సొంతంగా వెబ్సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. 2023లో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఆమె వ్యాపార సంస్థ ఇప్పుడు ఏడుగురు నిపుణులతో ఏడాదికి పాతిక లక్షలతో నడుస్తోంది. వెబ్సికిల్ ఐటీ రంగంలో వెబ్సైట్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్తోపాటు కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్సికిల్ సేవలందుకుంటున్న క్లయింట్లలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు పాతిక వరకు ఉన్నాయి. నేడామె ఐటీ సంస్థకు యజమానిగా కొత్తగా కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు. -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్కు గట్టి టేప్తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్తో ఫ్రేమ్కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?
ఒక స్త్రీ సంపాదించగలిగినప్పుడు.. ఆమె అధికారం పొందుతుందని, తన బిడ్డలను పాఠశాలకు వెళ్లేలా చేస్తుందని గట్టిగా నమ్మే మహిళలలో ఒకరు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'దీపాలీ గోయెంకా'. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు.వ్యాపారవేత్త బాలక్రిషన్ గోయెంకాను 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న దీపాలీ గోయెంకా.. వివాహం తరువాత 1987లో ముంబైకి వెళ్లారు. తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకోవాలనే కోరికతో భర్త చేసే టెక్ట్స్టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన కొత్త ఆలోచనలతో తనను తాను నిరూపించుకోగలిగింది.సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీపాలీకి టెక్ట్స్టైల్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వంటివి కూడా పూర్తి చేసింది. పెళ్ళైన తరువాత ఈ టెక్ట్స్టైల్ రంగంలోకి అడుగుపెట్టింది.పరిచయమే లేని ఓ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే.. ఆ రంగంలో ఆరితేరిన దీపాలీ 2016లో ఫోర్బ్స్ ఆమెను ఆసియాలో 16వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించింది. దీపాలీ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నేను ఆమె కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 18,566 కోట్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే పనిచేస్తుండేవారు. కానీ ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. నేడు ఆ సంస్థలో ఏకంగా 30 శాతం కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎదగాలనే సంకల్పంతో మహిళలను దీపాలీ ప్రోత్సహిస్తోంది. -
జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్
ఉద్యోగంలో చేరాలంటే మంచి జీతం, వారాంతపు సెలవులు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కొన్ని సార్లు జీతం తక్కువైనా తప్పకుండా సెలవుల విషయంలో రాజీపడే అవకాశమే లేదు. అయితే గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఓ సంస్థ సీఈఓ ఓ జాబ్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్ అవ్వడానికి.. అంతలా అందులో ఏముందో ఇక్కడ చూసేద్దాం.అహ్మదాబాద్లోని 'బ్యాటరీ ఒకే టెక్నాలజీస్' వ్యవస్థాపకుడు, సీఈఓ శుభమ్ మిశ్రా ఉద్యోగుల కోసం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఇందులో మా కోర్ టీమ్లో చేరడానికి అసాధారణమైన వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఉద్యోగులకు ఎలాంటి జీతం ఉండదు, వారాంతపు సెలవులు, సెలవులు (నిజంగా అవసరమైతేనే సెలవు) లేదు. ఎలాంటి బహుమతులు కూడా ఉండవని స్పష్టం చేశారు.రెడ్డిట్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫారమ్లలో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీని గురించి శుభమ్ మిశ్రా స్పందిస్తూ.. మేము దీర్ఘకాలికంగా కంపెనీని నిర్మిస్తున్నాము. మాతో పాటు ఎదగాలని అనుకుంటున్నా వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నామని ఆయన అన్నారు. వినూత్న ఏఐ పరిష్కారాల ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే స్టార్టప్ లక్ష్యంగా ఈ విధమైన పోస్ట్ చేసినట్లు మిశ్రా స్పష్టం చేశారు. -
'ది స్కై క్వీన్': 34 ఏళ్లకే ఏకంగా 10 ప్రైవేట్ జెట్లు..!
చిన్నతనంలో కేన్సర్లాంటి మహమ్మారితో పోరాటం చేసి గెలిచింది. అక్కడి నుంచి మొదలైన గెలుపు ప్రస్థానం..వినూత్న స్టార్టప్తో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా కోట్లకు పడగలెత్తింది. జస్ట్ 34 ఏళ్లకే ఏకంగా పది ప్రైవేట్ జెట్లు కలిగిన మహిళగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీమె అంటే..ఆమె పేరు కనికా టేక్రివాల్. మార్వాడీ కుటుంబానికి చెందిన యువ పారిశ్రామికవేత్త. 1990లో జన్మించిన కనికా 20 ప్రాయంలో ప్రాణాంతక కేన్సర్తో పోరాటం చేసి గెలిచింది. ఆమె విధ్యాభాసపరంగా.. ప్రఖ్యాత లారెన్స్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత లవ్డేల్ అండ్ జవహర్లాల్, భోపాల్లోని నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఇక కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే వినుత్నాంగా విమానాయన స్టార్టప్ జెట్సెట్ గోని ప్రారంభించింది.అలా అంచలంచెలుగా ఎదుగుతూ 420 కోట్లు విలువ చేసే సామ్రాజ్యాన్ని స్థాపించింది. ప్రస్తుతం కనికా ఆ కంపెనీ సీఈవోగా శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా దూసుకుపోతోంది. అంతేగాదు ఏకంగా లక్ష మంది ప్రయాణికులును గమ్యస్థానాలకు చేర్చి శెభాష్ అని ప్రశంసలందుకుంది. ఇప్పటివరకు ఆమె కంపెనీ దాదాపు 6వేల విమానాలను విజయవంతంగా నడుపుతోంది. కేవలం 34 ఏళ్ల వయసుకే దాదాపు 10 ప్రైవేట్ జెట్లను కలిగిన అత్యంత ధనిక మహిళగా హురున్ రిచ్ లిస్ట్లో నిలిచింది. అంతేగాదు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు, వరల్డ్ ఎకనామి ఫోరమ్ ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ వంటి అవార్డులు అందుకుంది. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను నిర్వహించే స్టార్టప్ వెంచర్ను సమర్థవంతంగా నిర్వహించి లాభల దిశగా నడిపించిన కనికా ప్రతిభాపాటవాలను అందరూ కొనియాడుతుండటం విశేషం. అంతేగాదు విమానాల లీజింగ్ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 'ది స్కై క్వీన్' పిలిపించుకుంది కనికా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం వద్దకు వచ్చేటప్పటికీ కనికా హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక్కడ కనికా వినూత్న స్టార్టప్ని సమర్థవంతంగా నిర్వహించి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పైగా మహిళలు ఎలాంటి వ్యాపారాన్నైనా సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రూవ్ చేసింది. (చదవండి: శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్చేస్తే..!) -
చురుకైన ఈ ఎంటర్ప్రిన్యూర్ అనిల్ అంబానీ కోడలు
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ఈనెల 12న అత్యంత విలాసంగా జరిగింది. అబ్బురంగా జరిగిన ఈ వేడుకల విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సోదరుడు, పెద్దగా వార్తల్లో లేని అనిల్ అంబానీ కోడలు ఎంటర్ప్రిన్యూర్ క్రిషా షా (Khrisha Shah) గురించి, ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనిల్ అంబానీ, టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీని క్రిషా షా వివాహం చేసుకున్నారు. క్రిషా నికుంజ్ ఎంటర్ప్రైజెస్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివంగత నికుంజ్ షా, ఫ్యాషన్ డిజైనర్ నీలం షా కుమార్తె ఈ క్రిషా షా. ఈమెకు ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు మిషాల్ షా వ్యాపారవేత్త కాగా సోదరి నృతి షా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్.ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. క్రిషా షా, జై అన్మోల్ అంబానీలు వారి కుటుంబాల ద్వారా పరిచయం అయ్యారు. కొన్నేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వీరి వివాహం కూడా విలాసవంతంగానే జరిగింది.‘డిస్కో’ స్థాపనక్రిషా షా వృత్తిపరమైన ప్రయాణం యూకేలో యాక్సెంచర్ సంస్థలో ప్రారంభమైంది. అక్కడ ఆమె భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్లలో సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆమె భారీ సంపాదననిచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ఏర్పాటు కలల వైపు పయనించారు. అలా సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ‘డిస్కో’ను స్థాపించారు. ఇది ప్రొఫెషనల్స్ కోసం ఆన్లైన్ హైపర్ లోకల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. ఫ్రీలాన్సర్లు, ఎంటర్ప్రిన్యూర్లు, ప్రొఫెనల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వొచ్చు. తమ విశేషాలను పంచుకోవచ్చు.ఎంటర్ప్రిన్యూర్గానే కాకుండా క్రిషా షా సామాజిక కార్యకర్త, మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా. ప్రేమ, ఆశ, శాంతి, ఐక్యత విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక, మానసిక ఆరోగ్య అవగాహన చొరవ అయిన #LOVEnotfear అనే ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. క్రిషా షా విద్యా నేపథ్యం విషయానికి వస్తే యూఎస్లోని యూసీ బర్కిలీ నుంచి పొలిటికల్ ఎకానమీలో బీఏ, ఇంగ్లండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషల్ పాలసీ అండ్ డెవలప్మెంట్లో ఎంఎస్సీ పట్టా పొందారు.జై అన్మోల్ అంబానీ, క్రిషా షా దంపతులు ప్రస్తుతం అనిల్ అంబానీ, టీనా అంబానీలతో కలిసి ముంబైలోని పాలి హిల్లోని సంపన్న నివాస ప్రాంతంలో తమ 17-అంతస్తుల ఇల్లు, అబోడ్లో నివసిస్తున్నారు. వార్తా సంస్థ డీఎన్ఏ ఇండియా ప్రకారం దీని విలువ రూ. 5,000 కోట్లు. -
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్ప్రెన్యూర్గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్ప్రెన్యూర్గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్లో ఓంపురి, రాజ్పాల్ యాదవ్లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్లైన్స్కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట. -
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. -
ఈ గ్రామంలో ప్రతి ఇల్లు పరిశ్రమే
-
ఆ విషాదమే ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది..ఏకంగా ఏడాదికి..!
భర్త అకాల మరణం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఓ సక్సెస్ ఫుల్ ఆగ్రో ఎంట్రప్రెన్యూర్గా మార్చింది. నేడు ఏకంగా ఏడాదికి 30 లక్షలు దాక ఆర్జిస్తోంది. పైగా ఎలాంటి ఉన్నత చదువులు చదువుకోకపోయినా కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తోంది. తాను నమ్ముకున్న భూమితల్లే తన విజయానికి కారణమని సగర్వంగా చెబుతోంది రాజ్బాల. ఎవరీ రాజ బాల? ఎలా అన్ని లక్షలు ఆర్జిస్తుందంటే.. రాజస్తాన్కి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు రాజ్బాల భర్త అకాల మరణంతో ఏం చేయాలేని అగాధంలోకి వెళ్లిపోయింది. ఓ పక్క ఇద్దరు పిల్లలు వాళ్లను ఎలా సాకాలో తెలియని సందిగ్ధ స్థితి. ఇక లాభం లేదు తానే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంది. తాను నమ్ముకున్న భూమినే ఆశ్రయించింది. అందరి రైతుల్లా కాకుండా రాజ్బాల సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిపోయింది. అనుకున్నదే తడువుగా సేంద్రీయ పద్ధతిలో ఇంటికి సరిపడ కాయగూరలు తదితర వాటిని పెంచుకునేది. ఆ తర్వాత క్రమేణ ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులు మంచివని, కేన్యర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించే కూరగాయాలతోనే సాధ్యమని పలు అవగాహన కార్యక్రమల ద్వారా తెలుసుకుంది. మొదట్లో ఇంట్లోకి కావాల్సినంత మటికే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించిన ఆమె ఈ రోజు అందరి కోసం సేంద్రియ పద్ధతుల్లో చాలా కూరగాయాలు పండిచడం ప్రారంభించింది. ఇలా ఆమె తన పొలంలో బొప్పాయి, మామిడి, అల్లం, పసుపు, బీట్ రూట్, టమాటాలతో సహా వివిధ రకాల కూరగాయలను పండిస్తోంది. అక్కడితో రాజ్బాల ఆగిపోలేదు పప్పు ధన్యాలు, సుగంధాలు పండించడం నుంచి పశువులకు దాణ అందించడం వరకు అన్నింటిని పండించేది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి శ్రమనే అధికంగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఆమె వ్యవసాయ నైపుణ్యం చూసి ఇతరులు కూడా ఈ సేంద్రియ వ్యవసాయమే చేయడం విశేషం. తాను తన భర్త మరణంతోనే సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చానని, నేడు దీంతో ఏడాదికి రూ. 30 లక్షలు పైనే ఆర్జిస్తున్నానని సగర్వంగా చెబుతోంది. ఇంకా ఆమె తాను మంచి చదువులు చదువుకోకపోయిన పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే గాకుండా ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫిసర్గా, మరోకరు లండన్లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన కోడళ్లు మద్దతుతో సోషల్ మీడియా ద్వారా సేంద్రియ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అందులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు, సలహాలు సూచనలు కూడా ఇస్తోంది రాజ్ బాల. (చదవండి: ఆత్మవిశ్వాసం గల పిల్లలుగా ఎదగాలంటే..ఆ తప్పులు చెయ్యొదంటున్న మిచెల్ ఒబామా!) -
Rahul Gandhi: అదానీ లబ్ధి కోసమే అగ్నివీర్: రాహుల్
న్యూఢిల్లీ/మొహానియా: పారిశ్రామికవేత్త అదానీకి ప్రయోజనం కలిగించేందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకం తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు వేతనాలివ్వడం మోదీకి ఇష్టం లేదన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బిహార్లోని కైమూర్ జిల్లా మొహానియాలో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సాధారణ సైనికుడి మాదిరిగా అగ్నివీర్కు వేతనం, పింఛను ఉండవు. క్యాంటిన్ సౌకర్యముండదు. విధి నిర్వహణలో మరణిస్తే అమరవీరుడి గుర్తింపూ ఇవ్వరు. రక్షణ బడ్జెట్ నుంచి సైనికులకు వేతనాలు, వసతులు కల్పించడం మోదీ సర్కారుకు ఇష్టం లేదు. బడ్జెట్ను అదానీకి లబ్ధి కలిగిలా ఖర్చు చేయాలనుకుంటోంది’’ అని ఆరోపించారు. బిహార్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు కూడా యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంకా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో శుక్రవారం యాత్రలో పాల్గొనలేకపోయినట్టు పార్టీ ప్రకటించింది. -
మోదీ ప్రశంసలు అందుకున్న ఎంట్రప్రెన్యూర్ వర్ష..
‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగాను. అదే మన్కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష. కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. వీడియో చూసి... అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్ప్రైజ్ను ఏర్పాటు చేసింది. అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష. వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం. -
ఎంటర్ప్రెన్యూర్లుగా రాణిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు
‘ఎంటర్ప్రెన్యూర్గా రాణించడం అంటే మాటలా?’ అన్నది ఒకప్పటి మాట. మాటల మాంత్రికులైన యువ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కలర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కలలు కంటున్నారు. ‘వ్యాపారం అంటే మాట్లాడినంత తేలిక కాదు’ అనే విమర్శను దాటి ఇన్ఫ్లూయెన్సర్లుగా తమ అనుభవాన్ని ఉపయోగించి ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేస్తున్నారు. బ్రాండ్స్ ద్వారా గుర్తింపు పొందిన యంగ్ ఇన్ఫ్లూయెన్సర్లు ఆ తరువాత తామే ఒక బ్రాండ్గా మారుతున్నారు. మాసివ్ ఆన్లైన్ ఫాలోయింగ్తో ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్స్టైల్ యూ ట్యూబర్ జ్యోతీ సేథీ ఎంటర్ప్రెన్యూర్గా అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ‘అభారి’ పేరుతో శారీ బ్రాండ్ను లాంచ్ చేసింది. వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అయింది.‘సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ముందు వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్ల పల్స్ తెలుసుకోగలిగాను. వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది జ్యోతి సేథీ. ముంబైకి చెందిన సంజయ్ ఖీర్ ఆరో తరగతిలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న సంజయ్ ఫుడ్కు సంబంధించి యూట్యూబ్ చానల్ ‘యువర్ ఫుడ్ ల్యాబ్’ ప్రారంభించాడు. 13 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకు΄ోయాడు. మూడు నెలల క్రితం కిచెన్ అండ్ హోమ్ అప్లయెన్స్ బ్రాండ్ ‘వైఎఫ్ఎల్ హోమ్’ను స్టార్ట్ చేశాడు. ‘ఒక వీడియోను రూపొందించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒక బ్రాండ్ను నిర్మించడానికి మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది పెద్ద సవాలు. ఆ సవాలును ఓపికతో మాత్రమే స్వీకరించాలి. కంటెంట్ క్రియేటర్గా నాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. అయితే ప్రొడక్ట్ మాట్లాడాలి’ అంటున్నాడు సంజయ్ ఖీర్. ఇన్ఫ్లూయెన్సర్గా తనకు ఉన్న పది సంవత్సరాల అనుభవంతో రెండు సంవత్సరాల క్రితం ‘వియరీఫెడ్’ అనే బ్యూటీ బ్రాండ్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది అనమ్ చష్మావాలా. తన స్కిన్ టోన్కు మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ గురించి ఎంత వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఈ నిరాశ నుంచే బ్రాండ్ ఆలోచన చేసింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ తరువాత తన బ్రాండ్ను పట్టాలకెక్కించింది. 26 సంవత్సరాల హిమాద్రి పటేల్ ఇన్ఫోసిస్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ఇన్ఫ్లూయెన్సర్గా సక్సెస్ అయిన తరువాత ఎత్నిక్ క్లాతింగ్ బ్రాండ్ ‘డ్రై బై హిమాద్రి’ స్టార్ట్ చేసింది. కంటెంట్ క్రియేటర్గా ప్రయాణం ప్రారంభించిన రణ్వీర్ అల్హబాదియా పాడ్కాస్ట్ షో ‘ది రణ్వీర్ షో’తో డిజిటల్ ప్రపంచంలో సుపరిచితుడయ్యాడు. కాలేజి ఫ్రెండ్ విరాజ్ సేథ్తో కలిసి ‘మాంక్ ఎంటర్టైన్మెంట్’ కంపెనీ ప్రారంభించి విజయం సాధించాడు. ఫ్యాషన్ సెన్స్, ఫన్–లవ్ కంటెంట్తో కంటెంట్ క్రియేటర్గా పేరు తెచ్చుకున్న దీక్షా ఖురానా ‘డీక్లాతింగ్’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్నవారికి ఎంటర్ప్రెన్యూర్గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు.‘సక్సెస్ఫుల్ బ్రాండ్లను క్రియేట్ చేయడానికి మౌలిక సదుపాయాల కొరత ఇన్ఫ్లూయెన్సర్లకు అడ్డంకిగా ఉంది’ అంటున్నాడు ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ‘వన్ ఇంప్రెషన్’ సీయీవో అపాక్ష్ గుప్తా అంతమాత్రాన ‘ఇది మన స్పేస్ కాదు’ అనుకోవడం లేదు, అధైర్యపడడం లేదు యువ ఇన్ఫ్లూయెన్సర్లు. ఒక్కో అడుగు వేసుకుంటూ నడకలో వేగం పెంచుతున్నారు. ఎంటర్ప్రెన్యూర్లుగా విజయం సాధిస్తున్నారు. కలా నిజమా అనుకున్నాను నా బ్రాండ్కు ఆర్డర్లు మొదలై, పెరుగుతూ పోతున్న క్రమంలో ‘ఇది కలా నిజమా?’ అనుకున్నాను. ఈ విజయం నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఇంకా ఏం చేయవచ్చు’ అని రక రకాలుగా ఆలోచించేలా చేసింది. ఇన్ఫ్లూయెన్సర్తో పోల్చితే ఎంటర్ప్రెన్యూర్గా బాగా కష్టపడాలి. – అనమ్ చష్మవాలా, బ్యూటీ బ్రాండ్ ‘వియరీఫెడ్’ ఫౌండర్ ఆ కష్టమే ఇక్కడ కూడా... వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అయితే ముందుగా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్గా నాకంటూ పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఆ తరువాత వ్యాపారం వైపు అడుగులు వేశాను. యూట్యూబ్ ద్వారా ఒక కంపెనీ ఎలా మొదలు పెట్టాలి? జీఎస్టీ నంబర్ అంటే ఏమిటి... మొదలైన విషయాలను తెలుసుకున్నాను. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటి నుంచి విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. అలాంటి కష్టమే వ్యాపారంలో పెడితే విజయం సాధిస్తాను అని నమ్మాను. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అది పెద్ద విజయం. – జ్యోతి సేథీ, క్లాత్ బ్రాండ్ ‘అభారీ’ ఫౌండర్ ట్రెండ్ సెట్ చేయాలి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్కు సంబంధించి సుపరిచిత బ్రాండ్లతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ఆ తరువాత సొంతంగా ‘డీక్లాతింగ్’ క్లాతింగ్ బ్రాండ్ను స్టార్ట్ చేశాను. బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ముందు ‘నా బ్రాండ్ ట్రెండ్ సెట్ చేయాలి’ అనుకున్నాను. అందరిలో ఒకరిగా కాకుండా మనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకోగలం. – దీక్షా ఖురానా, క్లాతింగ్ బ్రాండ్ ‘డీక్లాతింగ్’ ఫౌండర్ -
Nita Ambani Birthday: ‘సంపూర్ణ’ సంపన్నురాలు!
Nita Ambani Birthday: రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, వ్యాపారవేత్త నీతా అంబానీ నవంబర్ 1న 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. విద్యావేత్త, పరోపకారి, ఎంటర్ప్రిన్యూర్, కళలు, క్రీడల పోషకురాలైన నీతా అంబానీ రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 24 వేల కోట్ల నెట్వర్త్ అంచనాతో పలు భారీ బిజినెస్ వెంచర్లకు నాయకత్వం వహిస్తున్నారు. నీతా అంబానీ ముంబైలోని గుజరాతీ కుటుంబంలో 1963 నవంబర్ 1న జన్మించారు. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమెకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. ముఖేష్ అంబానీతో పరిచయానికి ముందు ఆమె టీచర్గా పనిచేసేవారు. ఆ తర్వాత 1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఒక కుమార్తె ఇషా అంబానీ ఉన్నారు. భారతీయ వ్యాపార రంగంలో మొదటి మహిళగా ప్రసిద్ధి చెదిన నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఆమెనే. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీల బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు కూడా. జీవితంలో అనేక మైలురాళ్లను సాధించిన నీతా అంబానీ ఎంటర్ప్రిన్యూర్గానేకాక చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. నీతా ఘనతలు ఇవే.. క్రీడల్లో మెరుగుదలకు సంబంధించి నీతా అంబానీ చేపట్టిన కార్యక్రమాలకు, అప్పటి భారత రాష్ట్రపతి ఆమెను 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు 2017'తో సత్కరించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా అందించే ఇండియన్ స్పోర్ట్స్ ఉత్తమ కార్పొరేట్ సపోర్టర్గానూ ఆమె అవార్డును అందుకున్నారు. ఇవి కాకుండా నీతా అంబానీ ఇటీవల యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) 2023 నుంచి గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు చేసిన కృషికి గాను ఆమెకీ అవార్డ్ దక్కింది. బిజినెస్ వెంచర్స్ నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్. సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక దేశంలో మహిళా సాధికారత కోసం పనిచేసే 'హర్ సర్కిల్' అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఉద్యమాన్ని కూడా స్థాపించారు నీతా అంబానీ. ఐపీఎల్లో అనేకసార్లు టోర్నమెంట్ను గెలుపొందిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆమె సహ యజమాని. అలాగే ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్పర్సన్ కూడా. ఇది దేశ ఫుట్బాల్ చరిత్రలో విప్లవాత్మకమైన ఇండియన్ సూపర్ లీగ్ను ప్రారంభించింది. ముంబైలో 2003లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించిన నీతా అంబానీ దానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రోత్సహించేందుకు ముంబైలో ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ను నీతా ప్రారంభించారు. As a proud mother, Mrs. Nita Ambani cheered for her daughter Isha Ambani on the launch of a new retail space #JioWorldPlaza, the brand new neighbour of the #NitaMukeshAmbaniCulturalCentre in Mumbai. Mrs. Ambani’s attire takes inspiration from the traditional Indian saree drape. pic.twitter.com/8hHLQXVGm6 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) October 31, 2023 -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్ప్రెన్యూర్గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్చెయిర్లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
పోస్ట్పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్కు గుడ్బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేసిన కౌర్కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్లో పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్వర్క్కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్ప్రెన్యూర్గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
టెక్ మిలియనీర్ యాంటీ ఏజింగ్ జర్నీ..షాకింగ్ విషయాలు
-
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్లో మార్కెట్కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి -
బుడ్డోడు కాదు బిలియనీర్..8వ తరగతి విద్యార్థి వందల కోట్ల వ్యాపారం!
వయస్సు చిన్నదే కావొచ్చు. సరిగ్గా ఆలోచిస్తే లక్షలు పోసి ఖర్చు పెట్టినా రాని బిజినెస్ ఐడియాలు రోజూ వారీ జీవితంలో ఎదురుయ్యే కొన్ని సమస్యల్లో నుంచి పుట్టుకొస్తాయి. అలా తనకు ఎదురైన ఓ ప్రాబ్లమ్ తీసుకొని దాన్నే బిజినెస్గా మరల్చుకొని వందల కోట్లు సంపాదిస్తున్నాడు 13ఏళ్ల తిలక్ మెహతా. తిలక్ మెహతా సరదాగా గడిపేందుకు ఓ రోజు తన మేనమామ ఇంటికి వెళ్లాడు. పాఠశాల విద్యార్ధి కావడంతో వెళ్లేటప్పుడు తనతో పాటు బండెడు పుస్తకాల్ని వెంటతీసుకొని వెళ్లాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు మామయ్య ఇంట్లో ఉన్న పుస్తకాల గురించి మరిచిపోయాడు. త్వరలోనే పరీక్షలు. చదవాల్సిన బుక్స్ లేవు. చేసేది లేక బుక్స్ డెలివరీ కోసం కొన్ని ఏజెన్సీలను వెతికాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా డెలివరీ ఖర్చు ఎక్కువగా ఉండడం, మార్కెట్లో డెలివరీ అవసరాల్ని తీర్చే సంస్థలు పెద్దగా అందుబాటులో లేవని గుర్తించాడు. బుక్స్ను సైతం ఇంటికి తెప్పించుకోలేకపోయాడు. సమస్యతోనే ఈ సంఘటన తిలక్ మెహతా మనస్సులో ఓ అద్భుతమైన ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ముంబై డబ్బావాలా ప్రేరణతో నగరంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని ఒకే రోజు డెలివరీ చేసేలా ఓ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీ పేరే ‘పేపర్ అండ్ పార్శిల్స్’. తక్కువ ఖర్చుతో కస్టమర్ల డెలివరీ సమస్యల్ని పరిష్కరించేలా సర్వీసుల్ని ప్రారంభించాడు. అతని తండ్రి ఆర్థిక సహకారం. డబ్బావాలా సహాయంతో సంప్రదాయ పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో డెలివరీలను అందించడం మొదలు పెట్టాడు. వ్యాపారం పెరిగే కొద్దీ 2018 నాటికి వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలను చేర్చడానికి విస్తరించింది. రూ.100 కోట్ల టర్నోవర్తో వెరసీ అచంచలమైన అంకితభావం, పట్టుదలతో తిలక్ మెహతా స్థాపించిన ఈ సంస్థ 100 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ను సాధించింది. 2021 నాటికి అతని నికర విలువ రూ. 65 కోట్లు ఉండగా, నెలవారీ ఆదాయం రూ. 2 కోట్లతో ముందుకు సాగుతున్నారు. వినూత్నమైన ఆలోచనలు, దృఢ సంకల్పం ఉంటే వ్యాపార ప్రపంచంలో ఎలా రాణించవచ్చో తిలక్ మెహతా ప్రయాణం ఒక స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. అంతేకాదు అవకాశాలను పొందడం, వారి ప్రత్యేక నైపుణ్యాలతో వ్యాపారం చేసేందుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తోంది. -
ఫిజిక్స్వాలా: గెలవాలంటే అజ్ఞానం కూడా అవసరమే!
సక్సెస్ కావాలంటే అజ్ఞానం కూడా ఉండాలి అంటారు ఫిజిక్స్వాలా ఫేమ్ అలక్ పాండే. అతడి మాటల తాత్పర్యం.. నాకు అన్ని తెలుసు అనుకున్నప్పుడూ ఏమి తెలుసుకోలేము ఏమి తెలియదు అనుకున్నప్పుడే అన్ని తెలసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది. అదే విజయానికి దారి చూపుతుంది. ప్రయాగ్రాజ్లో ట్యూషన్లు చెప్పి కుటుంబానికి వేడినీళ్లకు చన్నీళలా సహకరించిన స్టార్ ఎంటర్ప్రెన్యూసర్ అతడి ఎడ్టెక్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా శాఖోపశాఖలుగా విస్తరించి యూనికార్స్ క్లబ్లో చేరింది. సక్సెస్వాలా స్ట్రాంగ్ స్టోరీ. పాఠాలను పాఠాలుగా మాత్రమే బోధించాలని లేదు. వాటిని నిజజీవితంలోకి తీసుకువచ్చి, హాస్యం జోడించి చెబితే పాఠం అద్భుతంగా అర్థమవుతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ‘ఫిక్షనుకు ఫ్రిక్షన్కు తేడా ఏమిటి?’ నుంచి జటిలమైన భౌతికసూత్రాలను సులభంగా చెప్పడం వరకు అలక్ పాండే అద్భుతమైన నేర్పును సాధించాడు. ఈ ఫస్ట్–జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కొన్ని సంవత్సరాల క్రితం ‘ఫిజిక్స్వాలా’ పేరుతో ఫ్రీ యూట్యూబ్ చానల్కు శ్రీకారం చుట్టాడు. ‘పెద్ద సక్సెస్ సాధించబోతున్నాను’ అని ఆ సమయంలో అతను అనుకొని ఉండడు. అతడు అనుకున్నా, అనుకోకపోయినా ‘ఇస్రో’వారి రాకెట్లా ఫిజిక్స్వాలా దూసుకుపోయింది. 31 మిలియన్ల సబ్స్రైబర్లు, 61 యూట్యూబ్ చానల్స్, 5.3 బిలియన్ వ్యూస్! ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు పోటీ నుంచి తప్పుకోవడమే మేలు’ అనుకునే రకం కాదు అలక్. ‘పోటీలో చాలామంది ఉన్నప్పుడు మనదైన స్టైల్ను బయటికి తీయాలి’ అని బలంగా నమ్ముతాడు. నిరంతరం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం నుంచి వచ్చిన అలక్ ‘మాకు ప్రతి రపాయి వందరపాయలతో సవనంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అలక్ ఎడ్టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు తనకు తాను వేసుకున్న ప్రశ్న ‘స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?’ ఈ ప్రశ్నకు ఊహల్లో నుంచి సమాధానం తీసుకోకుండా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాడ్లాడాడు. వారు చెప్పిన ప్రతీదాన్ని నోట్ చేసుకొని లైవ్ ఆన్లైన్ కాసులలో అప్లై చేశాడు. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కోంగ్ సెంటర్ల ద్వారా బాగా డబ్బు గడింన అలక్ పాండేకు ‘ఫిజిక్స్వాలా’ చానల్ ద్వారా వచ్చిన యాడ్ మనీ ఎనిమిది వేలు చాలా తక్కువ. అయితే ఇది ‘శుభారంభం’ అని వత్రమే అనుకున్నాడు అలక్. అతడి నమ్మకం వృథా పోలేదు యాడ్ మనీ ఊహించని స్థాయిలో పెరుగుతూ పోయింది. కొన్నిసార్లు విద్యార్థులే ఉపాధ్యాయులై చక్కని సలహాలు ఇస్తారు. కొత్తలో అలక్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్డాడు. ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంతగా సక్సెస్ అవుతాం అనుకునేవాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు... ‘యాడ్స్ మీద కాదు టీచింగ్ మీద దృష్టి పెట్టండి’ అని చెప్పారు. ఇక అప్పటి నుం యాడ్స్పై కాకుండా టీచింగ్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ‘ఫిజిక్స్వాలా క్లాస్లలో చక్కగా అర్థమవుతుంది’ అనే మౌత్టాక్ వచ్చేలా కృషి చేశాడు. చాలామంది విజేతలలాగే అలక్ పాండేకు ఎదురయ్యే ప్రశ్న.... ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అది చెప్పడానికి అలక్ నోరు విప్పనక్కర్లేదు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనంలోని అతని ఆఫీసు గోడపై అతికించిన పోస్టర్లు చూస్తే చాలు. మచ్చుకు రెండు... ‘సక్సెస్ సాధించాలని బలంగా అనుకుంటే ప్లాన్ బీ గురించిన ఆలోచనే రాదు’ ‘వేగంగా పరాజయం పాలైనా సరే, నిదానంగా గట్టి విజయం సాధించాలి’. (చదవండి: మిస్ యూ భయ్యా! అతను కార్గిల్ శిఖరాలను రక్షిస్తున్నాడేమో!) -
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొత్త అవతారం!
న్యూఢిల్లీ: ఇతర బాలీవుడ్ తారల బాటలో పరిణీతి చోప్రా సైతం అడుగులు వేస్తున్నారు. తాజాగా వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ క్లెన్స్టాలో ఇన్వెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ ద్వారా ఈ అంశాన్ని పేర్కొన్నప్పటికీ పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. వెరసి బ్యూటీలో 82ఈ, క్లాతింగ్లో ఎడ్ ఏ మమ్మా, మేకప్ విభాగంలో కే బ్యూటీ బ్రాండ్ల ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకున్న దీపికా పదుకొణే, అలియా భట్, కత్రినా కైఫ్ బాటలో పరిణీతి చోప్రా సాగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో పునీత్ గుప్తా ప్రారంభించిన డీటూసీ స్టార్టప్ క్లెన్స్టా.. వాటర్లెస్ పర్సనల్ హైజీన్ ప్రొడక్టును తయారు చేస్తోంది. ఇతరులెవరూ రూపొందించని ప్రొడక్టును తయారు చేస్తున్న క్లెన్స్టా బ్రాండులో ఇన్వెస్టర్గా, భాగస్వామిగా చేరినందుకు ఉత్సాహపడుతున్నట్లు ఈ సందర్భంగా ఇన్స్ట్రాగామ్ ఖాతాలో పరిణీతి చోప్రా పేర్కొన్నారు. -
కొవ్వొత్తుల తయారీతో మొదలుపెట్టి కోట్ల సంపాదన వరకు..
కాస్మొటిక్స్ క్వీన్గా ఎదిగిన మీరా కులకర్ణి విజయగాథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. చదువును పక్కన పెట్టి 20 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిపోయింది... ఆ బంధం వికటించి కొన్ని రోజులకే ఆమె ఒంటరి తల్లిగా తిరిగి వచ్చింది.. కొన్నాళ్లకే తల్లిదండ్రులూ మృతి చెందడంతో అనాథగా మారింది. కాలాన్ని నెట్టుకుంటూ వచ్చి 45 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ప్రారంభించింది. దేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా అవరించింది. మీరా కులకర్ణి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది దేశంలోని ప్రముఖ సహజ సౌందర్య సాధనాల బ్రాండ్లలో ఒకటి. ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మార్కెట్ లీడర్గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించిన మీరా కులకర్ణి ప్రయాణం కొవ్వొత్తుల తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమ నుంచి ప్రారంభమైంది. అది తర్వాత హ్యాండ్మేడ్ సబ్బుల పరిశ్రమగా మారింది. ఫలించని వైవాహిక బంధం మీరా కులకర్ణి వైవాహిక బంధం ఫలించకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. 28 సంవత్సరాలు వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. భర్తకు దూరమై.. తల్లిందండ్రులు మరణించడంతో ఒంటరిగా తల్లిగా మిలిగిపోయింది. తమ ఇంటిలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి అలా వచ్చే డబ్బుతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత 45 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించింది మీరా. మొదట కొవ్వొత్తులను తయారు చేయడం ప్రారంభించిన ఆమె తర్వాత హ్యాండ్ మేడ్ సబ్బుల తయారీకి మారింది. యూఎస్లో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఆమెకు వచ్చిన సలహాతో సబ్బుల తయారీలో శిక్షణ పొందింది. ఆమె కొడుకు సమర్థ్ బేడీ ఇప్పుడు ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. రూ.2 లక్షల పెట్టుబడితో.. మీరా కులకర్ణి కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. నేడు ఆమె బ్రాండ్కు భారతదేశం అంతటా 110, విదేశాలలో డజనుకు పైగా స్టోర్లు ఉన్నాయి. తాజ్, హయత్ వంటి 300పైగా హోటళ్లు, దాదాపు 150 స్పాలు ఆమె కంపెనీ ఉత్పత్తులు వినియోగిస్తున్నాయి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కంపెనీ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.253 కోట్లు, 2021 ఆర్థిక ఏడాదిలో రూ.210 కోట్లు ఆర్జించింది. మీరా కులకర్ణి రూ. 1,290 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా కోటక్ వెల్త్ హురున్ – లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020గా నిలిచారు. ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది! -
అదిగో యువభారత్
‘దేనికీ వెరువని ధైర్యసాహసాలు, ముక్కుసూటితనంతో దూసుకుపోయే యువతే ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు!’ – స్వామి వివేకానంద యూఎన్ఎఫ్పీఏ.. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం (ఆ నివేదిక విడుదలయిన నాటికి) మన దేశ జనాభా.. 142.86 కోట్లు. 142.57 కోట్ల జనాభాతో ఉన్న చైనాను దాటేసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా పాపులేషన్ లిస్ట్లో ముందున్నాం. ప్రపంచమంతటా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉంటే.. అది ఒక్క మన దగ్గరే 68 శాతం ఉంది. ఈ జనాభాను ప్రపంచం.. వర్కింగ్ పాపులేషన్ అంటోంది. అంటే శక్తియుక్తులున్న మానవ వనరుల సమూహం.. మనకు అనుకూలమైన అంశం. ప్రపంచంలోకెల్లా అధిక జనాభా గల దేశంగానే కాదు.. అత్యధిక యువత ఉన్న దేశంగానూ ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే స్వామి వివేకానంద కోరుకున్న లక్షణాలతో ఉన్న యువతరం అన్నమాట. అడ్డూ అదుపూ లేని జనాభాతో వనరులను హరిస్తూ.. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని అభివృద్ధి చెందిన దేశాలు ఆగ్రహపడినా.. వెంటనే అసూయపడేలా చేస్తోంది ఈ యువతే. ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్గానే కాదు.. ప్రపంచ ఉత్పాదక రంగానికి అవసరమైన అద్భుత మానవ వనరులకూ మన నేలను కేంద్రంగా మలుస్తోంది. ఈ మనుషుల ఎడారిలో కనిపిస్తున్న ఆ ఒయాసిస్సే ఈ దేశం శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాన్నీ కల్పిస్తోంది. జపాన్తోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనాభా.. అందులో యువత తక్కువగా ఉండడంతో తీవ్రమైన వర్క్ఫోర్స్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఆయా దేశాల ఉత్పాదక రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఆ క్రమంలోనే 68 శాతం వర్కింగ్ పాపులేషన్తో మనం చాలా రిచ్గా ఉన్నాం.. అనే భావనలోనే కాదు.. ఆ దిశగా కృషిచేస్తే ప్రాక్టికల్గానూ ధనికదేశంగా మారగలం. ప్రపంచ మార్కెట్ని శాసించగలం. ఈ విషయంలో చైనానూ అధిగమించగలం. సవాళ్లు దేశ ఆర్థికాభివృద్ధికి యువతను ప్రధానవనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కానీ కార్యాచరణలో అదంత ఈజీ కాదు. ఆ లక్ష్యం చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలూ లేవు. ఏ జనాభాలోంచి వర్కింగ్ పాపులేషన్ను చూసి మురిసిపోతున్నామో.. ఆ వర్కింగ్ పాపులేషన్లోనే ఏ ఉపాధిమార్గంలేని వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం.. 2022 నాటికి మన దగ్గరున్న నిరుద్యోగిత 23.22 శాతం. 2018లో ఇది 4.9 శాతమే. ఈ పెరుగుదలకు కరోనా పరిస్థితులూ ఒక కారణం. పాండమిక్లో కోటీ తొంభైలక్షల యువత ఉద్యోగాలను కోల్పోయిందని కొన్ని సర్వేల సారాంశం. పని ఉన్నవారు కూడా చదువుకు సరిపడా కొలువులు దొరకక దొరికిన కొలువుల్లో తక్కువ వేతనాలతో సర్దుకోవాల్సిన పరిస్థితి. ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్ఐఈ) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే (2022) ప్రకారం ..ఈ నిరుద్యోగ పర్వంలో హరియాణ 37. 4 శాతం, రాజస్థాన్ 28.5 శాతం, ఢిల్లీ 20.8 శాతం పెరుగుదలతో మొదటి మూడు స్థానాల్లో తలవంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో 7.7 శాతం, తెలంగాణలో 4.1 శాతం పెరిగింది. ఉపాధి కల్పన లేమి.. పట్టణాలు, నగరాల్లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాల్లో మళ్లీ అధిక జనాభాదే మొదటి స్థానం. మిగతా కారణాల్లో.. అక్షరాస్యత.. ఉపాధి కల్పనల మధ్య అసమాన నిష్పత్తి, వ్యవసాయాధారిత పరిశ్రమలు తగినంతగా లేకపోవడం.. వ్యవసాయం నుంచి వలసలు (ఈ రెండిటినీ పరిగణించాలి), కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినడం, ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట్ల.. ఆ కుటుంబంలో ఒకరే వారసత్వ వ్యాపారాన్ని నిర్వహిస్తూండడం.. మిగిలిన వాళ్లకు పనిలేకపోవడం, కుటుంబ బాంధవ్యాలకు లోబడి కార్మికులు, శ్రామికులు స్వస్థలం వదిలి వెళ్లలేకపోవడం వంటివాటితోపాటు మార్కెట్ డిమాండ్కి అనుగుణమైన నైపుణ్య శిక్షణ లేకపోవడమూ కనిపిస్తున్నాయి. నైన్ టు ఫైవ్ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యువత ప్రధాన వనరుగా ఉపయోగపడకపోవడానికి ఆ తరం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన అడ్డంకులను చూపిస్తున్నారు నిపుణులు. మొదటిది.. కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు కావల్సిన సాఫ్ట్ స్కిల్స్ వారిలో లేకపోవడం. రెండవది.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కావల్సిన మెళవకువలూ కరువవడం. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండూ ఉన్న యువతకూ తగినంత ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా కుటుంబపరమైన మద్దతు లభించడం లేదు. సొంతంగా వ్యాపారం చేద్దామనే యువత ఆశయం, ఉత్సాహం మీద సొంత కుటుంబాలే నీళ్లు చల్లుతున్నాయి.. కెరీర్తో తమ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడకుండా నెలనెలా వేతనంతో భద్రమైన జీవితాన్ని గడపాలనే కోరికతో! ప్రయోగాలకు పోయి పిల్లలు నష్టాలను తెస్తే నెత్తికెత్తుకునే ఆర్థిక సామర్థ్యం.. వాళ్లకు అండగా నిలబడే నైతిక స్థయిర్యం లేకపోవడమే ఆ వెనుకడుగుకు కారణం కావచ్చు. అందుకే పిల్లల ఉత్సాహం కన్నా భరోసానిచ్చే ఆర్థిక భవిష్యత్ పట్లే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ జీతపు ఉద్యోగాల దిశగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే నైన్ టు ఫైవ్ జాబులే సర్వస్వం కాదనే సత్యాన్ని గ్రహించాలి. అలాగని ఇలా వ్యాపారం పెట్టగానే అలా కోట్లలో లాభాలు వచ్చిపడతాయి.. అవి తిరిగి పెట్టుబడులుగా మారి.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే నమ్మకాన్ని ఎవరూ ఇవ్వలేరు. కానీ ప్రయత్నం జరగాలి. ఈ రోజు యువత ఆ ధైర్యం చేయలేకపోతే రేపటి యువతకు ఎక్కడి నుంచి ప్రేరణ అందుతుంది? నేడు విజయపథంలో ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటియం, ఓలా వగైరా సంస్థలు నిన్న ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టినవే. ఒడిదుడుకులు తెలిసి.. తట్టుకునే మెకానిజమూ అర్థమై నేడు మార్కెట్లో తమ సేవలకు డిమాండ్ కల్పించుకుంటున్నవే! అందుకే దిగితేకానీ లోతు అంతుబట్టదు. ఐడియాలను కార్యాచరణలో పెడితే కానీ సక్సెస్ చేతికి చిక్కదు. గ్లోబలైజేషన్ తర్వాత రోజ్గార్ బజార్ రూపురేఖలు మారిపోయాయి. సర్కారు కొలువుల పరిధి తగ్గుతూ వస్తోందా.. ప్రైవేట్ జాబ్స్ విస్తృతమవుతున్నాయా అనేది తెలియదు కానీ పెను మార్పయితే స్పష్టమయింది. తదనుగుణంగానే యువత అడుగులూ అనివార్యం అయ్యాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా తప్పనిసరి అయిందో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార దక్షత కూడా అంతే తప్పనిసరి అవుతోంది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అందరూ నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కోసమే దరఖాస్తు చేసుకుంటే వాటిని సృష్టించే సంస్థలు ఉండొద్దూ? ఆ సంస్థలను నడిపే వ్యాపారవేత్తలు.. పారిశ్రామిక గణం రావద్దూ? ఆ చొరవ తీసుకోవడానికి.. చూపడానికి కావల్సిన శక్తియుక్తులున్న యువత మన దగ్గరే ఉంది. వారికి కావల్సింది ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక ఆలంబన.. కుటుంబం నుంచి కాసింత నమ్మకం! ఆ రెండూ ఇస్తే ఐడియాలతో స్టార్టప్లను పండిస్తూ వాప్యార దక్షతను పెంపొందించుకుంటుంది. బడా పారిశామికవేత్తల పెట్టుబడులను రాబట్టుకుంటుంది. వేలసంఖ్యలో కొత్త కొలువులను సృష్టిస్తుంది. ఆశాకిరణాలు.. నికరంగా వేతనాలు అందే ఉద్యోగాలే చేయాలనే తల్లిదండ్రుల ఒత్తిడినీ, పెట్టుబడుల కొరతనూ లెక్కచేయక ముందడుగు వేస్తున్న యువతా ఉన్నారు. కాబట్టే మన దగ్గర స్టార్టప్ కల్చర్ దినదిన ప్రవర్థమానమవుతోంది. ఎంతోమంది యంగ్ అంట్రప్రెన్యూర్స్ని సృష్టిస్తోంది. ఇందుకు ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ చక్కటి ఉదాహరణ. 2013లో.. అంటే తన పందొమ్మిదో ఏట .. ‘ఓయో రూమ్స్’ ప్రారంభించాడు. సరసమైన ధరలో.. సౌకర్యవంతమైన ఒక బసను వెదకడంలో విఫలమైన ఫ్రస్ట్రేషన్తో అతను ఈ కంపెనీని స్థాపించాడు. ఈ రోజు ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్గా పేరుపొందాడు. ఫోర్బ్స్ – 30 అండర్ 30 లిస్ట్ ఫర్ ఆసియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ వరుసలోనే లాజిస్టిక్ స్టార్టప్ ‘పోర్టర్’ ఫౌండర్ ప్రణవ్ గోయెల్నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్టప్ 500 సభ్యుల టీమ్గా..సిఖోయా కాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్స్తో వంద మిలియన్ డాలర్ల ఫండింగ్తో విరాజిల్లుతోంది. లెన్స్కార్ట్ గురించి తెలుసు కదా! దాని ఫౌండర్ పియూష్ భన్సాల్ కూడా యంగ్చాప్.. 2010లో ఆ పోర్టల్ను స్థాపించినప్పుడు! ఫోర్బ్స్ – 30 అండర్ 30లో ఉన్నాడు. అందరూ అబ్బాయిలేనా.. మరి అమ్మాయిలూ? అనే క్వశ్చన్ మార్క్ ఇమోజీని డిలీట్ చేయండి. అంట్రప్రెన్యూర్స్గా అమ్మాయిల సంఖ్యా తక్కువేం లేదు మన దగ్గర. దేశంలోని 58 శాతం మహిళా అంట్రప్రెన్యూర్స్ .. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించారు. వీళ్లంతా తమ తాతల, తండ్రుల వ్యాపారాన్ని నడుపుతున్నవారు కాదు. ఇండిపెండెంట్ అంట్రప్రెన్యూర్స్. వాళ్లలో ‘మెన్స్ట్రుపీడియా’ ఫౌండర్ అదితి గుప్తా.. మోస్ట్ సక్సెస్ఫుల్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలక్ష్మి సురేశ్.. దేశంలోకెల్లా అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా అంట్రప్రెన్యూర్. 2020లో తన ఇరవయ్యొకటో ఏటకల్లా.. ప్రపంచంలోనే యంగెస్ట్ వెబ్ డిజైనర్ కమ్ సీఈఓగా పేరు పొందింది. తన ఎనిమిదవ ఏటనే కోళికోడ్లోని తన స్కూల్కి వెబ్సైట్ని క్రియేట్ చేసింది. శ్రీలక్ష్మి ‘ఎస్ఈఓ’ అనే వెబ్ డిజైన్ కంపెనీని ప్రారంభించేనాటికి ఆమెకు పదేళ్లు. ఒక్క తన స్కూల్కే కాదు దేశంలోని ఇతరత్రా వాటికోసం ఆమె ఓ వంద వెబ్సైట్స్ని డెవలప్ చేసింది. వీళ్లంతా దేశంలో స్టార్టప్ కల్చర్ వృద్ధికి ఆశాకిరణాలు! మేధో వలస.. దేశానికి యువత.. బలంగా మారకుండా అడ్డంపడుతున్న మరో సవాలు మేధో వలస. తమ ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, జీతభత్యాలు, వాళ్లు కోరుకున్న జీవన ప్రమాణాలు లేక ఎంతోమంది యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. పైగా మన దగ్గర ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. ఈ వలస తాత్కాలిక పరిణామంలాగే కనిపిస్తుంది కానీ మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల నష్టాన్ని చేకూరుస్తోంది. ఈ మేధో వలసల్లో ముఖ్యంగా ఐఐటీయన్లే ఉంటున్నారు. మన ఐఐటీల్లో శిక్షణ పొందిన విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఐఐటీ పట్టభద్రుల పట్ల విదేశీ సంస్థలకు విపరీతమైన క్రేజ్! దాంతో వీళ్లకు ఊహించని రీతిలో వేతనాలిస్తూ తమ సంస్థల్లో ప్లేస్మెంట్స్ని కల్పిస్తున్నాయి. వాళ్లు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అందించడానికీ పోటీ పడుతున్నాయి. అందుకే బ్రెయిన్ డ్రెయిన్కి బ్రేక్ పడడం లేదు. ఈ వలసలన్నీ ప్రధానంగా అమెరికాకే తరలుతున్నాయి. విదేశాలకు వెళుతున్న ఐఐటియన్లలో 65 శాతం మందికి అమెరికాయే మజిలీ. ప్రపంచంలోని 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ జారీ చేసే హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాల లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్నది మన ఐఐటీ విద్యార్థులే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్కి విదేశాల్లో 540 శాతం ప్లేస్మెంట్స్ పెరిగాయంటే మన ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి దాదాపు లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అంచనా. 2014 నుంచి దాదాపు 2300 మంది సంపన్నులు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలే! త్వరిత గతిన మన దేశాన్ని అభివృద్ధి పరచగల ప్రతిభాసామర్థ్యాలే! అందుకే వేగిరంగా ఈ మేధో వలసను ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అమ్మాయిల భాగస్వామ్యం.. ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) సర్వే ప్రకారం.. పదిహేను నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో దాదాపు యాభై శాతం మంది అమ్మాయిలు ఇటు చదువుకోవడమూ లేదు అటు ఉద్యోగాల్లోనూ లేరు. కారణం.. కుటుంబ బాధ్యతలు, పెళ్లి! ఆశ్చర్యపోకండి! ఈ దేశంలో చాలా విషయాల్లో వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నట్లే స్త్రీ సమానత్వం విషయంలోనూ భిన్నమైన వాతావరణం ఉంది. స్త్రీవాద ఉద్యమాలతో చైతన్యం పొందిన ప్రాంతాల్లోనే ఇంకా అసమానతలు కన్పిస్తుంటే అసలు ఆ ఊసే లేని ప్రాంతాల్లో అమ్మాయిల స్థితి ఎలా ఉండొచ్చు! దీనికి సమాధానమే ఆ సర్వే. దాన్నిబట్టే అర్థమవుతోంది వర్క్ఫోర్స్లో అమ్మాయిల భాగస్వామ్యం ఎంతో! ఆడపిల్ల ఉద్యోగం చేయాలా? వద్దా? ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఆ మాటకొస్తే చదువు దగ్గర నుంచే ఆ నిర్ణయం మొదలవుతోంది. అయితే అమ్మాయిది కాదు.. కుటుంబానిది. విద్యావంతుల కుటుంబంలోని అమ్మాయిలకు తమకు ఇష్టమైన చదువు చదివే స్వేచ్ఛ దొరికినా.. కెరీర్ విషయానికి వచ్చేసరికి పెళ్లి అనేది దాన్ని సాగనివ్వడంలేదు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇది పెళ్లికాని అమ్మాయికి కూడా అడ్డంకిగానే ఉంది. ‘ఇంకా ఇలాంటి పరిస్థితులున్నాయా విడ్డూరం కాకపోతే అని ముక్కున వేలేసుకునే పనిలేదు. ఇప్పటికీ మనదేశంలో.. అమ్మాయిలకు చదువు, ఉద్యోగం కన్నా పెళ్లే ఆర్థిక భద్రతను, భరోసాను ఇస్తుంది అని భావించే కుటుంబాలే ఎక్కువ’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి. ఇలా పెళ్లి, పిల్లలు అనే బాధ్యత వర్క్ఫోర్స్లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని తగ్గిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ విషయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యత్యాసం తగ్గాలి. అవగాహనా కార్యక్రమాలు పెరగాలి. ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సహాయాలు.. దేశంలో ఇప్పుడు అంట్రప్రెన్యూర్ రంగంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణించేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్మెంట్ అండ్ అంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ. ఆ శిక్షణతో యువత అంట్రప్రెన్యూర్స్గా ఎదిగి.. ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది. స్కిల్ ఇండియా మిషన్.. పాతికేళ్లలోపు యువతకు వృత్తి శిక్షణ, పాలిటెక్నిక్, ఐటీ, సాఫ్ట్స్కిల్స్ డెవలప్మెంట్ వంటి కోర్సులను బోధిస్తోంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వగైరాల ద్వారా స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్ను చేపడుతోంది. అంట్రప్రెన్యూర్షిప్ దిశగా యువతను ప్రోత్సహించడానికి పెట్టుబడుల కోసం ఆర్థిక మద్దతునూ అందిస్తోంది. పన్ను రాయితీలు కల్పిస్తోంది. కొత్త ఇంక్యుబేటర్స్ను క్రియేట్ చేస్తోంది. ఉన్న ఇంక్యుబేటర్ల సామర్థ్యాన్ని పెంచుతోంది. దేశంలోని పట్టణ, నగరాల్లోని యువత కన్నా గ్రామీణ యువతే అంట్రప్రెన్యూర్షిప్ పట్ల ఉత్సుకతతో ఉన్నారు. అందుకే ప్రధాన్మంత్రి కుశల్ కేంద్రాలు అంట్రప్రెన్యూర్షిప్ హబ్స్గా మారి ఆసక్తి ఉన్న ట్రైనీలను అంట్రప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఐడీబీఐ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఎస్ఈటీఐఎస్) వంటి స్థానిక సంస్థలతో కలసి చదువుకున్న యువతకు స్టార్టప్స్లో శిక్షణనిస్తోంది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ అంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్నీ స్థాపించింది. కాలేజ్స్టూడెంట్స్లోని అంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ని వెలికి తీసి వారికి శిక్షణనిస్తోంది. నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేస్తోంది. సృజనాత్మక రంగాల్లో.. ఉన్నత విద్య మీద నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్లో ఇంజినీరింగ్ (బీటెక్ అండ్ ఎమ్టెక్)లో కోవిడ్ కంటే ముందు అయిదేళ్లలో దాదాపు 6,37,781 అడ్మిషన్లు పడిపోయాయని తేలింది. అదే సమయంలో సృజనాత్మక రంగాలైన ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, డిజైనింగ్, లింగ్విస్టిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంత్సరంలో 53, 213 మంది విద్యార్థులు పలురకాల ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు పొందారు. ఈ వృద్ధి ఆయా రంగాల్లో కొత్త కొలువులు ఏర్పడేందుకు దోహదపడుతోందనేది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల అభిప్రాయం. ‘భారతీయ సినిమా మీద సోషల్ మీడియా, డిజిటలైజేషన్ ప్రభావాన్ని కాదనలేం. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద సినిమా ప్రదర్శన గురించి ఏనాడైనా ఊహించామా? ఈ మార్పు ఆయా రంగాల్లో ఎన్నో కొత్తరకాల∙ఉద్యోగాలకు దారితీస్తోంది. వాటిల్లో వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటివి మచ్చుకు కొన్ని. నేటి యువత ఇదివరకటిలా కెరీర్కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పట్టుకు వేళ్లాడట్లేదు. సాంకేతిక విప్లవ ప్రపంచంలో ఎలాగైనా బతకగలమనే ధైర్యం వాళ్లకుంది. ఏ ఉద్యోగమైనా తిండి పెడుతుంది అనే భరోసా కలిగింది. అందుకే నచ్చిన ఉద్యోగాలను ఇచ్చే చదువులను ఎంచుకుంటున్నారు. కొందరైతే చదివిన చదువుతో సంబంధం లేకుండా కొత్త కొత్త కొలువులతో ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాన్నానల అంచనాలను సంతృప్తి పరచడమా లేక తమకు నచ్చినట్టు ఉండడమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనే వాళ్లు తీసుకుంటున్నారు. అలాగని పిల్లల ఇష్టాల్ని సపోర్ట్ చేయని తల్లిదండ్రులే అందరూ అని చెప్పడానికీ లేదు. చాలా మంది పెద్దలు కూడా పిల్లల సృజనాత్మకత మీద నమ్మకంతో వాళ్లకు నచ్చిన దారిలో వాళ్లు వెళ్లే స్వతంత్రాన్నిస్తున్నారు. అండగా నిలబెడుతున్నారు. దాంతో సృజనాత్మక రంగాలైన డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటివాటిల్లో నేటి యువత రాణిస్తోంది. ఆ రంగాలకూ డిమాండ్ పెరిగి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కాబట్టి సృజనాత్మక రంగాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గానే చూడకుండా.. మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగానూ గుర్తించి.. ఆ దిశగా వాటిని సిలబస్లో చేర్చాలి’ అంటారు న్యూ ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని కల్చర్ డిపార్ట్మెంట్ అధిపతి మిర్ ఇంతియాజ్. ‘విదేశాల్లో లాగా బయటి క్రియేటివ్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేలా ఓ పాలసీని తయారు చేయాలి. అప్పుడే యువతకు ఫలానా కోర్స్ చదివితే ఫలానా రంగంలో ఫలానా ఉద్యోగాలు ఉన్నాయనే అవగాహన కలుగుతుంది. ఇప్పుడెలాగైతే కంప్యూటర్ సైన్స్ చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలున్నాయని తెలుస్తోందో అలాగా’ అని అభిప్రాయపడుతున్నారు పుణెలోని ఎమ్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లోని ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ డిపార్ట్మెంట్ హెడ్ ఇంద్రజిత్ నియోగి. ‘సీబీఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ పాటర్న్లో ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం క్రియేటివ్ కోర్సుల్లో అంట్రప్రెన్యూర్ షిప్ కరిక్యులమ్ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారి.. పిల్లల్లోని సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంటుంది’ అని చెబుతున్నారు విద్యారంగ నిపుణులు. ముగింపు దేశంలో ప్రతి ఏటా దాదాపు కోటి మంది యువత వర్క్ఫోర్స్లోకి వస్తోందని అంచనా. ఇప్పుడున్న అవకాశాలు సరిపోవడం లేదు. అదీగాక మన దగ్గరున్న యువతరం దాదాపుగా.. ఉపాధి కల్పన అంతగాలేని గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందినదే. చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది అమ్మాయిలు సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మారాలని ఆశిస్తున్నారు. వారిలో నేర్చుకునే తపనకు.. సృజనాత్మక ఆలోచనలకేం కొదువలేదు. కావల్సిందల్లా సరైన మార్గదర్శకత్వం.. అవసరమైన మౌలిక సదుపాయాలు. ఇందాకే చెప్పుకున్నట్టు వీళ్లంతా మన దేశ ఆర్థిక ప్రగతికి అవాకాశాలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు యువ జనాభా లేక ఉస్సూరుమంటున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి. అలాంటి దేశాలకు మన యూత్ వరం. మన దగ్గరి ప్రతిభావంతులైన యువతకు వాళ్ల దేశంలో మంచి కొలువులు ఇస్తానని ఇప్పటికే జపాన్ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను మనం ఇంకెన్నో దేశాలతో చేసుకునే వీలుంది. అయితే ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలి. మనకున్న మరో అనుకూలాంశం. పెరుగుతున్న మధ్యతరగతి. వీళ్లే అతిపెద్ద వినియోగదారులు. మన డొమెస్టిక్ గ్రోత్కి డ్రైవర్స్. అందుకే పెట్టుబడులకూ మన దేశాన్ని మించింది లేదు. ఆ పెట్టుబడులే ఉద్యోగాలనూ సృష్టిస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతకు ఉపాధి కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఇదే ప్రభుత్వాల ఎజెండా కావాలి. అప్పుడే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం! -
జర్నలిస్ట్ టూ ఎంటర్ప్రెన్యూర్.. రూబీసిన్హా సక్సెస్ స్టోరీ
రూబీ సిన్హా ప్రారంభించిన ‘షీ ఎట్ వర్క్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు జ్ఞానకేంద్రంగా మారింది.‘అదిగో దారి’ అని దారి చూపే దిక్సూచి అయింది. ‘ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలు పెట్టారా? అయితే మీ దగ్గర ఉన్న శక్తిని బయటికి తీసుకురావల్సిన సమయం వచ్చింది. ఒక్కరిగా ప్రయాణం మొదలు పెట్టి వందలాదిమందికి స్ఫూర్తి ఇస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మీరు ఒకరు ఎందుకు కాకూడదు!’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఉత్సాహపరిచే రూబీ సిన్హా తాజాగా బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియామకం అయింది... దిల్లీకి చెందిన రూబీ సిన్హా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన తరువాత జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టింది. మరోవైపు వారాంతాలలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసేది. ఏమాత్రం తీరిక దొరికినా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేది. షార్ట్ ఫిల్మ్స్ తీసేది.అడ్వర్టైజింగ్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆమెకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.ఒక బిడ్డకు తల్లి అయిన రూబీ ఇంటికే పరిమితం కావల్సి వచ్చింది. కొంత కాలం తరువాత స్నేహితులలో ఒకరు ఇండిపెండెంట్ పీఆర్ కన్సల్టెంట్గా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఈ సలహా రూబీకి బాగా నచ్చింది. అలా మొదలైన ప్రయాణమే తనను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది. ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అన్నట్లు రూబీ సిన్హా ఎంటర్ప్రెన్యూర్ అయిన తరువాతగానీ మహిళ వ్యాపారవేత్తలు ఎదుర్కొనే సమస్యలు అర్థం కాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ‘కమ్యూన్ బ్రాండ్ సొల్యూషన్స్’ ద్వారా కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసింది. అయితే తన విజయానికే పరిమితమై సంతృప్తి పడకుండా ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్లాట్ఫామ్ ‘షీ ఎట్ వర్క్’ ద్వారా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది. ‘ప్రతి స్టార్టప్ ఐడియా సక్సెస్ కావాలని ఏమీ లేదు. కానీ ఎందుకు సక్సెస్ కాలేము అనే పట్టుదల ఉండే మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతాం. మన దేశంలో ఎంతో ప్రతిభ, సృజనాత్మకత ఉంది. వోలా క్యాబ్స్ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు ఎన్నెన్నో విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు’... ఇలాంటి మాటలు ఎన్నో ‘షీ ఎట్ వర్క్’లో కనిపిస్తాయి. ‘ఒంటరి ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. అయితే ఆ ప్రయాణం నీకు కొత్త శక్తి ఇస్తుంది’ అనే మాట రూబీకి చాలా ఇష్టం.తాను ఒంటరిగానే ప్రయాణం పెట్టింది.‘బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం వరకు ఎంటర్ప్రెన్యూర్ ముందు ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయితే అవేమీ జటిలమైన సవాళ్లు కాదు. ప్రతి సవాలు ఒక పాఠం నేర్పుతుంది. అలా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్ టీమ్ కెప్టెన్గానే కాదు టీమ్ మెంబర్గా కూడా వ్యవహరించాలి. టీమ్తో కలిసిపోయి వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి’ అంటుంది రూబీ. నేర్చుకోవడానికి చిన్నా,పెద్దా తేడా అనేది ఉండదు.‘నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఏమిటి’ అనే అహం అడ్డొస్తే అదే అడ్డుగోడగా మారుతుంది. అయితే రూబీకి అలాంటి అహాలు లేవు.‘ఈ తరానికి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం, తెలివితేటలు, చురుకుదనం ఉన్నాయి. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను’ అంటుంది రూబీ.‘భవిషత్ దార్శనికత, వ్యూహ చతురత, అంకితభావం రూబీ సిన్హా బలాలు’ అంటున్నారు బ్రిక్స్ సీసీఐ డైరెక్టర్ జనరల్ మధుకర్.భౌగోళిక సరిహద్దులకు అతీతంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సీసీఐ, ఉమెన్ వర్టికల్ ఏర్పాటయింది. ఇప్పుడు ఈ విభాగానికి రూబీ సిన్హా రూపంలో అంతులేని బలం చేకూరింది. -
నవ్వుల పువ్వుల దారిలో...
ఫ్యాషన్ బ్లాగర్గా ప్రయాణం మొదలుపెట్టింది దిల్లీకి చెందిన డాలీసింగ్. రైటర్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్గా విజయపథంలో దూసుకుపోతోంది. ‘మనలో ఉన్న శక్తి ఏమిటో మనం చేసే పనే చెబుతుంది’ అంటున్న 29 సంవత్సరాల డాలీసింగ్కు పనే బలం. ఆ బలమే తన విజయ రహస్యం... డాలీసింగ్ మాట్లాడితే చుట్టుపక్కల నవ్వుల పువ్వులు పూయాల్సిందే! ఆమె ఏం మాట్లాడినా సూటిగా ఉంటుంది. అదే సమయంలో ఫన్నీగా ఉంటుంది. ‘స్పిల్ ది సాస్’ అనే ఫ్యాషన్ బ్లాగ్తో ప్రయాణం మొదలు పెట్టింది. లైఫ్స్టైల్ పోర్టల్ ‘ఐ–దివ’ కోసం జూనియర్ రైటర్, స్టైలిస్ట్గా పనిచేసింది. ‘రాజు కీ మమ్మీ’ ఫన్నీ వీడియోలతో కంటెంట్ క్రియేషన్లోకి అడుగుపెట్టింది. ఈ వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. రోజువారి జీవితం నుంచే తన ఫన్నీ వీడియోలకు కావాల్సిన స్టఫ్ను ఎంపిక చేసుకునేది. ‘బయట ఏదైన ఆసక్తికరమైన దృశ్యం కంటపడితే నోట్ చేసుకునేదాన్ని. ఆ తరువాత డెవలప్ చేసేదాన్ని. మనలోని శక్తి ఏమిటో మన రచనల్లో తెలిసిపోతుంది. రచన చేయడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త క్యారెక్టర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తాను. ఐ–దివలో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటూ ఉండేది కాదు. ఒక టాపిక్ అనుకొని కెమెరా ముందుకు వచ్చి తోచినట్లుగా మాట్లాడడమే. ఆ తరువాత మాత్రం స్క్రిప్ట్ రాయడం మొదలైంది’ అంటుంది డాలీ సింగ్. కామెడీ అయినా సరే, ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాల్పనిక హాస్యం కంటే నిజజీవిత సంఘటనల నుంచి తీసుకున్న కామెడీనే ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచ్లైన్స్ విషయంలో రకరకాలుగా ఎక్సర్సైజ్లు చేస్తుంటుంది డాలీ. ‘ప్రేక్షకులను మెప్పించడం అనేది ఫన్ అండ్ చాలెంజింగ్గా ఉంటుంది. రెండు మూడు నెలలకు ఒకసారి రీస్టార్ట్ కావాల్సిందే. కంటెంట్ క్రియేషన్లో అతి ముఖ్యమైనది ఎప్పుటికప్పుడు మనల్ని మనం పునరావిష్కరించుకోవడం’ అంటుంది డాలీ. తాము క్రియేట్ చేయాలనుకునేదానికీ, ప్రేక్షకులు ఇష్టపడుతున్న కంటెంట్కూ మధ్య కంటెంట్ క్రియేటర్ సమన్వయం సాధించాల్సి ఉంటుంది. మరి డాలీ సంగతి? ‘అనేకసార్లు నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో... నేను క్రియేట్ చేసేది ప్రేక్షకులకు నచ్చేది కాదు. వారికి నచ్చేది నాకు నచ్చేది కాదు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది డాలీ. కంటెంట్ క్రియేటర్లకు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ‘ఒత్తిడిని పనిలో భాగంగానే భావించాను. దానినుంచి దూరం జరగడం అనేది కుదిరే పని కాదు. అయితే ఒత్తిడి ప్రభావం కంటెంట్పై పడకుండా జాగ్రత్త పడాలి’ అంటుంది డాలీ. ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందిన డాలీ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్సీరిస్ ‘మోడ్రన్ లవ్ ముంబై’తో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘నేను విజయం సాధించాను అనుకోవడం కంటే, ఇప్పుడే బయలుదేరాను అనుకుంటాను. అప్పుడే ఫ్రెష్గా ఆలోచించడానికి, మరిన్ని విజయాలు సాధించడానికి వీలవుతుంది’ అంటున్న డాలీసింగ్ ఒక షార్ట్ఫిల్మ్ కోసం స్క్రిప్ట్రెడీ చేసుకుంటోంది. అందులో తానే నటించనుంది. -
రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే..
ప్రేరణ ఝున్ఝున్వాలా.. భారత్కు చెందిన పారిశ్రామికవేత్త వ్యవస్థాపకురాలు. సింగపూర్లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీ స్కూల్ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడక్కడ బాగా పాపులరైన ప్రీ స్కూల్. దీంతోపాటు పిల్లల కోసం ఆమె ప్రారంభించిన మొబైల్ యాప్కు విశేష ఆదరణ లభిస్తోంది. కోటి డౌన్లోడ్లు లిటిల్ పాడింగ్టన్ ప్రీ స్కూల్ను నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఇది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్. ఈ అప్లికేషన్ భారత ఉపఖండంలో దాదాపు కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లల విద్యలో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రలైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి. వ్యాపార నేపథ్యం లేకుండానే.. ప్రేరణ ఝున్ఝున్వాలా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు.. ఎటువంటి బిజినెస్ కోర్సులు ఆమె చేయలేదు. కానీ ఈ కంపెనీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది ఫండింగ్ రౌండ్లో సుమారు రూ.60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్ల (రూ. 330 కోట్లు) వాల్యుయేషన్తో తమ కంపెనీ రౌండ్ను పెంచిందని ప్రేరణ చెప్పారు. తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో తన ఎదుగుదల క్రమబద్ధంగా జరిగిందన్నారు. 30 మంది సిబ్బంది ఉండగా ఏడాదిలోనే రెట్టింపు అంటే 60 మందికి పెంచినట్లు తెలిపారు. ఇండోసియా, వియత్నాంలో తమ సంస్థలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆమె సింగపూర్ వెంచర్లో ఇప్పుడు ఏడు పాఠశాలలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఉపాధ్యాయుల లోటును తీర్చడానికి ఆన్లైన్ విద్యను ప్రారంభించారామె. Honored to be featured in the current edition of @EntrepreneurIND's #Shepreneurs- Women to Watch 2023. Thank you for the feature @PunitaSabharwal https://t.co/IvZLcfsm0b — Prerna Jhunjhunwala (@prernaj87) April 3, 2023 ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన అమన్ గుప్తా..
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు. రెడ్ కార్పెట్ మీద భార్య ప్రియా దాగర్తో కలిసి అడుగులు వేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇలా రెడ్ కార్పెట్పై నడిచిన మొదటి భారతీయ పారిశ్రామిక వేత్త ఆయనే. అమన్ గుప్తా తొలిసారిగా కేన్స్ ప్రదర్శన కోసం భార్య ప్రియా దాగర్తో కలిసి వచ్చారు. ఈ మేరకు అమన్ గుప్తా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తను నేనే కావడం గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aman Gupta (@boatxaman) మరోవైపు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, మానుషి చిల్లర్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సంవత్సరం కేన్స్లోకి అడుగుపెట్టారు. కేన్స్ వెటరన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్గా 21వ సారి ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చింది. -
బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు!
అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! బిర్లా కుటుంబం దేశంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటి. వారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. తండ్రి కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్ 2023 భారతీయ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోనే 9వ అత్యంత సంపన్న వ్యక్తి. వీటితో సంబంధం లేకుండా ఒక వ్యాపారవేత్తగా, గాయనిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న అనన్య బిర్లా చదువు, ఆమె నడుపుతున్న వ్యాపారాలు, నికర సంపద వంటివి తెలుసుకుందాం. ఉన్నత చదువు, వ్యాపారాలు అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య చదివింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) విభిన్న ప్రతిభ అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్ ద లైఫ్’, ‘హోల్డ్ ఆన్’ వంటి అద్బుతమైన సింగిల్స్ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్కి అనేక అవార్డులను గెలుచుకున్నారు. మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా అయిన అనన్య.. మానసికంగా తాను పడిన ఇబ్బందులు, కుంగుబాటు వంటి సమస్యలను కూడా నిర్భయంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె అనన్య బిర్లా ఫౌండేషన్ను స్థాపించారు. ఇది మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీంతోపాటు లింగ సమానత్వం, ఫైనాన్షియల్ ఇన్క్లూషన్, విద్య, వాతావరణ మార్పు, మానవతా సహాయం వంటి అంశాలకు తోడ్పాటును అందిస్తోంది. నెట్వర్త్ అనన్య బిర్లా నికర సంపద విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. జీతం గురించి బహిరంగంగా తెలియకపోయినా రెండు విజయవంతమైన కంపెనీలకు వ్యవస్థాపకురాలు, సీఈవోగా ఆమె గణనీయమైన ఆదాయాన్నే ఆర్జిస్తోంది. ఇక సింగర్ గానూ సంపాదిస్తోంది. ఇలాంటి స్పూర్తివంతమైన, విజయవంతమైన వ్యాపారవేత్తల సక్సెస్ స్టోరీల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
సజ్జన్ జిందాల్కు ఈవై ఎంటర్ప్రెన్యుర్ అవార్డ్
న్యూఢిల్లీ: జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఎంపికయ్యారు. డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ కేవీ కామత్ అధ్యక్షతన గల ఏడుగురు సభ్యుల జ్యురీ విజేతల వివరాలను ప్రకటించింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ స్టీల్, సిమెంట్, ఇన్ఫ్రా, ఎనర్జీ, పెయింట్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 40వేల మందకి పైగా ఉపాధి కల్పిస్తుండడంతో ఈ సంస్థ అధినేత సజ్జన్ జిందాల్ను ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా హాజరయ్యారు. మరో తొమ్మిది ఇతర విభాగాల్లోనూ విజేతలను జ్యురీ ఎంపిక చేసింది. స్టార్టప్ విభాగంలో మెడ్జీనోమ్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో మహేశ్ ప్రతాప్నేని, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్, ఎనర్జీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా విభాగంలో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఇర్ఫాన్ రజాక్, తయారీ విభాగంలో బోరోసిల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ్ ప్రదీప్ ఖెరుకాను జ్యురీ ఎంపిక చేసింది. -
అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వివేక్ రంగస్వామి!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిక్కీ హేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ వంటి హేమా హేమీలు పోటీలో ఉండబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందినవారే. అయితే తాజాగా మరో యువ పారిశ్రామికవేత్త పేరుకూడా గట్టిగా వినపడుతోంది. భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వివేక్ రామస్వామికి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈయన కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే గమనార్హం. శాకాహారి అయిన వివేక్ రంగస్వామి వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్గా గుర్తింపుపొందారు. బయోఫార్మాసూటికల్ కంపెనీ 'రోయివంట్ సైన్సెస్'కు వ్యవస్థాపక సీఈఓ. వోకిఇజం, సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్పై తన అభిప్రాయాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా ప్రముఖ మేగజీన్ 'ది న్యూయార్కర్'.. వివేక్ రంగస్వామిని 'యాంటీ-వోక్ సీఈఓ'గా అభివర్ణించింది. వోక్యిజం అంటే సామాజికంగా, రాజకీయంగా అందరీ న్యాయం జరగడం లేదని బాధపడే సున్నిత మనస్తత్వం లేదా భావజాలం. అయితే వోకియిజం పిడివాద భావజాలం అని వివేక్ వాదిస్తుంటారు. ఇది ప్రపంచంలోని వాస్తవ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంపైనే ఎక్కువ ఆసక్తి కలిగిఉందని చెబుతుంటారు. అందుకే ఈయనను 'యాంటీ-వోక్ సీఈవో' అని న్యూ యార్కర్ అభివర్ణించింది. రాజకీయంగా వివేక్కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలా మంది భావిస్తున్నారు. అయితే వివేక్ అభ్యర్థిత్వాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రెసిడెన్సీకి వ్యాపార ఆధారిత విధానాన్ని తీసుకురాగల సరికొత్త వ్యక్తిగా అతడ్ని కొందరు చూస్తున్నారు. మరికొందరేమో అతనికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని, వోకియిజంపై అతని ఆలోచనలు వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఒకవేళ వివేక్ రంగస్వామికి అమెరికా అభ్యర్థిగా నిలబడే అవకాశం లభిస్తే మాత్రం అది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పొచ్చు. చదవండి: ట్రంప్కు షాక్ ఇస్తున్న రిపబ్లికన్లు.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్.. నమ్మినవాళ్లే వ్యతిరేకులుగా.. -
చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం
చిన్నవయసులోనే డిప్రెషన్ బారిన పడిన షర్మిన్ తల్లిదండ్రుల సహాయంతో ఆ చీకటి నుంచి బయటపడింది. ‘ఆట–మాట–పాట’లలో తన ప్రతిభ చూపింది. సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ ‘ఇన్స్టోరీడ్’తో ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకుంది. ‘కస్టమర్స్ కొనుగోలు నిర్ణయాలు లాజిక్ మీద కాదు ఎమోషన్స్పై ఆధారపడి ఉంటాయి’ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ ‘ఇన్స్టోరీడ్’ను ప్రారంభించింది షర్మిన్ అలి. ఈ ప్లాట్ఫామ్ సోలోప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్, క్లయింట్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసే ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది. ‘కంటెంట్ రైటర్స్ కస్టమర్ మనసులోకి పరకాయప్రవేశం చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది’ అంటున్న షర్మిన్ ‘ఇన్స్టోరీడ్’ ప్రారంభించడానికి ముందు ఎంతోమంది న్యూరో మార్కెటర్స్, న్యూరో సైంటిస్టులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఏఐ పవర్డ్ టూల్ను రూపొందించడానికి పద్దెనిమిది నెలల కాలం పట్టింది.ఇంతకీ ఈ టూల్ చేసే పని ఏమిటి? మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, మన కంటెంట్ మనకు బాగానే ఉంటుంది. ‘నిజంగా ఈ కంటెంట్ బాగుందా? మార్పు, చేర్పులు ఏమైనా చేయాలా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఈ టూల్కు పనిచెప్పవచ్చు. ‘ఈ వాక్యం సరిగ్గా లేదు’ ‘ఈ పదానికి బదులు మరో పదం వాడితే బాగుంటుందేమో’ ‘ఇలాంటి హెడ్లైన్స్ చాలా వచ్చాయి. వేరే హెడ్లైన్కు ప్రయత్నించండి’ ‘టు మెనీ నెగెటివ్ వర్డ్స్. మీ భావం సరిగ్గా చేరడం లేదు’ ‘ఇందులో భాషా దోషాలు కనిపిస్తున్నాయి’.....ఇలాంటి సలహాలు ఎన్నో ఇస్తుంది ఈ ఏఐ టూల్. కొన్నిసార్లు అనుకోకుండా మనం రాసిన వాక్యం, ఎవరో రాసిన వాక్యంలా ఉండి కాపీ కొట్టారు అనే ముద్ర పడడానికి అవకాశం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా ‘ఇన్స్టోరీడ్’ టూల్ హెచ్చరించి వేరే వాక్యాలు రాసుకునేలా చేస్తుంది. ‘చాలామంది నన్ను అడిగే ప్రశ్న...మీ ప్లాట్ఫామ్ ద్వారా కాపీరైటర్స్ అవసరం లేకుండా చేయవచ్చా? అది అసాధ్యం అని చెబుతాను. మానవసృజనకు ప్రత్యామ్నాయం లేదు. మా ప్లాట్ఫామ్ సృజనకు మెరుగులు పెట్టి మరింత చక్కగా తీర్చిదిద్దేలా చేస్తుంది’ అంటోంది షర్మిన్. షర్మిన్ ‘ఇన్స్టోరీడ్’కు శ్రీకారం చుట్టినప్పుడు ‘ఇది సక్సెస్ అవుతుందా?’ అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తన ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు షర్మిన్. ఆమె నమ్మకం నిజమైంది. బెంగళూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఇన్స్టోరీడ్’కు వేలాది మంది యూజర్స్ ఉన్నారు. ‘ఇన్స్టోరీడ్’కు ముందు అమెరికాలో డాటాసైన్స్, ఎనలటిక్స్ రంగాలలో పనిచేసింది షర్మిన్ పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్లో పుట్టిన షర్మిన్ అహ్మదాబాద్లో పెరిగింది. ‘ఆడుతూ పాడుతూ పెరిగినదే అందమైన బాల్యం’ అంటుంటారు. అయితే షర్మిన్ మాత్రం చిన్న వయసులోనే డిప్రెషన్ బారిన పడింది. భూకంపం, వరదలు, మతకలహాలు....మొదలైన వాటి ప్రభావంతో కుంగుబాటు అనే చీకట్లోకి వెళ్లిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేసి ఆ చీకటి నుంచి షర్మిన్ను బయటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు. అది మొదలు...ఆటలు, పాటలు, నృత్యాలలో చురుగ్గా పాల్గొనేది. ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్నప్పుడు ‘ఎంటర్ప్రెన్యూర్షిప్’ ఎలక్టివ్గా తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది తన కలగా మారింది. ‘ఇన్స్టోరీడ్’తో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసింది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు నటి, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్గా మంచి పేరు తెచ్చుకుంది షర్మిన్ అలి. -
Tasheen Rahimtoola: స్టార్ స్ట్రాటజిస్ట్
ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్గా తనను తాను నిరూపించుకున్న తషీన్...ఒకరోజు తనకు తానే సలహా ఇచ్చుకుంది. ఆ సలహా 28 సంవత్సరాల తషీన్ను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది... మ్యాథ్స్, ఎకనామిక్స్లో డిగ్రీ చేసిన తషీన్ రహిమ్తోలకు ఎప్పుడూ లాభ,నష్టాల గురించి ఆలోచించే అవసరం రాలేదు. ‘ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్’గా ఆమె మంచి ఉద్యోగంలో ఉంది. ‘ఎందరికో వ్యూహాత్మక సలహాలు ఇస్తున్న నేను ఎందుకు వ్యాపారంలోకి అడుగుపెట్టకూడదు?’ అని ఒక ఫైన్మార్నింగ్ ఆలోచించింది. తనకు తానే సలహా ఇచ్చుకుంది. నిజానికి ఎంటర్ప్రెన్యూర్ అనే మాట ఆమెకు కొత్తేమీ కాదు. తల్లిదండ్రులు ఇద్దరూ వేరువేరు వ్యాపారాల్లో ఉన్నారు. అయినప్పటికీ ‘జాబ్ వదిలేస్తున్నాను’ అని చెబితే ‘రిస్క్ తీసుకుంటున్నావు’ అనే మాటే ఎక్కువగా వినిపించింది. ‘బిజినెస్లోకి అడుగు పెట్టే ముందు బాగా నవ్వు. ఎందుకంటే రకరకాల టెన్షన్లతో ఆ తరువాత నవ్వే పరిస్థితి ఉండదు’ అన్నారు కొందరు. ఎవరు ఎలా స్పందించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తషీన్. ‘టేస్ట్ రీట్రీట్’తో ఎంటర్ప్రెన్యూర్గా తొలి అడుగు వేసింది. మార్కెట్లో పోటీని తట్టుకోవడం, ఆర్డర్స్ సంపాదించడం, టీమ్ను లీడ్ చేయడం...అంత తేలికైన విషయం కాదు. అయితే ఆమెకు ప్రతి ఆర్డర్ ఒక విలువైన పాఠం నేర్పింది. థీమ్డ్ పార్టీస్, కార్పొరేట్ గిఫ్టింగ్, సిట్–డౌన్ డిన్నర్....మొదలైన వాటిలో తనదైన ముద్ర వేసింది టేస్ట్ రీట్రీట్. ఒకప్పుడు ‘ముంబై–వోన్లీ సర్వీస్’గా మొదలైన ఈ వెంచర్ పాన్–ఇండియా ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. 50 లక్షలతో మొదలుపెట్టిన ‘టేస్ట్ రీట్రీట్’ ఇప్పుడు ‘17 క్రోర్ క్లబ్’లో చేరింది. ‘ఎందరో సాధించిన ఎన్నో విజయాల గురించి వింటూ ఉంటాం. నేను కూడా ట్రై చేసి చూస్తాను అనే ఆలోచన మీలో వస్తే మొదటి అడుగు పడినట్లే. మీకు ఇష్టమైన బిజినెస్ మొదలుపెడితే రెండో అడుగు పడుతుంది. మూడో అడుగులో అనుభవాలే పాఠాలు నేర్పించి మనల్ని విజేతగా నిలుపుతాయి’ అంటుంది 28 సంవత్సరాల తషీన్. -
చైనా బిలియనీర్ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్ నుంచే తరుచూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. స్పెయిన్, నెదర్లాండ్లోనూ ఆయన కనిపించినట్లు సమాచారం. కాగా జాక్ మా టోక్యోకు చెందిన సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్కు సన్నిహిత మిత్రుడు. అంతేగాక మసయోషి అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. జాక్ మా ఒకప్పుడు చైనాలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా వెలుగొందారు. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగ వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జాక్ మా సంస్థలపై చైనా ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి. అప్పటి నుంచి జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలు నిబంధనలు పాటించడం లేదని నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఆలీబాబా కంపెనీపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ప్రభుత్వంతో విబేధాల కారణంగా 2020 ఆయన బహిరంగంగా కనిపించడం మానేశారు. చైనాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు
ఈ అబ్బాయికి తన వయసు వారిలాగే సినిమాలు అంటే ఇష్టం. సినిమా పాటలు అంటే ఇష్టం. ఆ పాటలకు తీన్మార్ డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. అయితే వీటితో పాటు తనకు టెక్నాలజీ అంటే కూడా ఇష్టం. ఆ ఇష్టమే ఇతడిని 14 సంవత్సరాల వయసులో కంటెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం అయింది. 21 సంవత్సరాల వయసులో సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి, మరో కంపెనీలో భాగస్వామి కావడానికి కారణం అయింది... టిక్టాక్తో ఊపందుకున్న షార్ట్ ఫామ్ కంటెంట్ ఆ తరువాత యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్... మొదలైన మాధ్యమాల ద్వారా మరింత విస్తరించింది. షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ప్రేక్షకులకు అందే వినోదం అనేది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల రకరకాల జానర్లలో ఎంతోమంది యువప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ స్ట్రీమర్స్ పెరిగారు.వీరిని రకరకాల బ్రాండ్స్ తమ మార్కెటింగ్కు ఉపయోగించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్తో పోల్చితే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.ఇన్ఫ్లుయెన్సర్లు, బ్రాండ్లకు మధ్య వారధిగా ముంబైలో ఏర్పడిన ‘నోఫిల్టర్’ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ముంబైకి చెందిన రుత్విక్ లోఖండె ఒకరు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. క్రిప్టో కరెన్సీ నేపథ్యంలో అందరిలాగే బ్లాక్చెయిన్ అనే మాటను చాలాసార్లు విన్నాడు రుత్విక్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) భద్రతకు ఉపకరించే, డేటాను జాగ్రత్తగా కాపాడే, పారదర్శకతకు వీలయ్యే బ్లాక్చెయిన్ టెక్నాలజీ రుత్విక్ను బాగా ఆకర్షించింది. ‘ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని ఆలోచించాడు. ‘ఇలా ఉపయోగించుకోవచ్చు’ అనే ఐడియా తట్టడంతో బ్లాక్చెయిన్ సాంకేతికత ఆధారంగా ‘బిలీవర్స్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి సూపర్హిట్ చేశాడు. ఈ ప్లాట్ఫామ్ కళాకారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు... రైటర్ లేదా డైరెక్టర్ కావాలనుకుంటున్నవారు తమ స్క్రిప్ట్ను షేర్ చేస్తే, అది ఆడియెన్స్(బిలీవర్స్)కు నచ్చితే నిధుల సమీకరణకు వీలవుతుంది. ‘షార్ట్ కంటెంట్ అనేది హోటల్స్ నుంచి టూర్గైడ్ల వరకు ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటున్న రుత్విక్ ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సంస్థ ‘కొలబ్ట్రైబ్’ భాగస్వామి. ‘ప్రస్తుతం మన దేశంలో స్ట్రీట్కల్చర్ పెరిగింది. హిప్ హాప్ టాలెంట్ ముందుకు వస్తుంది. మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి ఎంతో టైమ్ పట్టడం లేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దగ్గర వీరి ప్రతిభకు సరిౖయెన ప్రతిఫలం లభించడం లేదు. 2025 నాటికి కంటెంట్ క్రియేషన్కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచుల ప్రకారం ఇన్ఫ్లూయెన్సర్ కావచ్చు, అయితే ప్రతిభ మాత్రమే సరిపోదు. తమ కంటెంట్ను ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్కిల్స్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి’ అంటున్నాడు రుత్విక్. కంటెంట్ క్రియేషన్లో వ్యక్తులు, సంస్థలకు సహాయపడడానికి ఏంజెల్ ఫండ్ ‘మూన్ క్యాపిటల్’ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడు రుత్విక్. ‘ప్రతిభకు ఎలాంటి హద్దులు, అవరోధాలు లేవు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది’ అంటున్నాడు యంగ్స్టార్ రిత్విక్. తన సక్సెస్ స్టోరీ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది కదా! -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్లో ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
Masarat Farooq: కశ్మీర్ లోయకు ట్యూషన్ చెబుతోంది
తుపాకుల మోతలు.. ఉగ్రవాదదాడులు ఇవి కశ్మీర్ అంటే గుర్తుకు వచ్చేది. కాని అక్కడి పిల్లలు చదువుకు చాలా విలువ ఇస్తారు. తరచూ స్కూళ్లకు వచ్చే ‘భయం సెలవులకు’ బాధ పడతారు. వారి భయం పోవాలంటే వాళ్ల ఇళ్లకే వెళ్లి ట్యూషన్ చెప్పాలి అని నిశ్చయించుకుంది మస్రత్ ఫారూక్. తానే ఒక ఎంట్రప్రెన్యూర్గా మారి, లోయ మొత్తం దాదాపు 100 మంది టీచర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లు సాయంత్రమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ట్యూషన్ చెప్పాలి. మస్రత్ ఆలోచన పెద్ద హిట్ అయ్యింది. తాజాగా కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమెకు ‘కశ్మీర్ విద్యారంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్’గా గుర్తింపు ఇచ్చారు. 26 ఏళ్లు మస్రత్ ఫరూక్కు. కాని కాశ్మీర్లోయ అంత ముఖ్యంగా శ్రీనగర్ అంతా ఆమెను ‘మాస్టర్జీ’ అని పిలుస్తారు. నర్వారా నుంచి ఒక తండ్రి ఫోన్ చేస్తాడు.. ‘మాస్టర్జీ... మా అబ్బాయికి ట్యూషన్ కావాలి’... రేషి మొహల్లా నుంచి ఒక తల్లి ఫోన్ చేస్తుంది.. ‘మాస్టర్జీ... మా పిల్లలకు ట్యూషన్ కావాలి’... టాటా బ్రాండ్, బాటా బ్రాండ్లాగా నమ్మకానికి, ఫలితాలకు ఒక గ్యారంటీగా మస్రత్ ఒక బ్రాండ్ అయ్యింది ట్యూషన్లకు ఆ అందమైన లోయలో... కలతల నేలలో. పాఠాలు చెప్పడం ఇష్టం శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్ పదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ‘నాకు పాఠాలు చెప్పడం ఇష్టం’ అంటుంది మస్రత్. ఇంటర్ చదువుతూ, డిగ్రీ చదువుతూ కూడా స్కూళ్లలో పార్ట్టైమ్ టీచర్గా పని చేసింది మస్రత్. క్లినికల్ సైకాలజీలో ఎం.ఎస్సీ చేసింది. అయితే 2019 అక్టోబర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో శ్రీనగర్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో పిల్లలు చదువుకు అంతరాయం కలగడం గమనించింది మస్రత్. ఆ వెంటనే 2020లో ఫిబ్రవరి నుంచి కోవిడ్ ప్రతిబంధకాలు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినా ఆ క్లాసులు జరిగే సమయంలో పిల్లలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం తన సొంత కజిన్స్ చదువు కుంటుపడటం కూడా గమనించింది. ఒక్కోసారి ఉగ్రవాద చర్యల వల్ల కూడా స్కూళ్లు సరిగ్గా నడవవు. బడి దగ్గర పిల్లలు అనే భావన కంటే పిల్లల దగ్గరకే బడి అనే భావన సరైనదని మస్రత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ముగ్గురు టీచర్లు... 20 మంది పిల్లలు విద్య గురు ముఖతా ఉండాలి... టీచర్ సమక్షం లో ఉంటూ టీచర్ను చూస్తూ నేర్చుకుంటే చదువు సరిగ్గా వస్తుందనేది మస్రత్కు తెలుసు. అందుకే స్కూల్ ఎలా నడిచినా హోమ్ ట్యూషన్లు పిల్లలకు మేలు చేస్తాయని భావించింది. తానొక్కతే అందరికీ చెప్పలేదు కనుక తన ఆధ్వర్యంలో పని చేసే టీమ్ ఉండాలనుకుంది. ఒక ముగ్గురు టీచర్లు దొరికితే 20 మంది పిల్లల ఖాతాలు దొరికితే చాలు అనుకుంది. ‘స్మార్ట్క్లాసెస్ హోమ్ ట్యూషన్స్’ పేరుతో సంస్థ ప్రారంభించి పత్రికల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చింది. చాలామంది అప్లికేషన్స్ పంపారు. కాని టీచింగ్కు ఎవరు పనికి వస్తారో కనిపెట్టడమే మస్రత్ విజయానికి కారణం. అలాంటి ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ట్యూషన్లు ఎవరికి చెప్పాలో తాను నిర్ణయించి పంపుతుంది. ఎంతమందికి చెప్తే ఆ మొత్తం నుంచి టీచరు, తాను షేర్ చేసుకుంటారు. అదీ ఒప్పందం. కాని వెంటనే స్పందన రాలేదు. కొన్ని రోజులకు రవూఫ్ అనే యూరాలజిస్ట్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని కోరాడు. మస్రత్ టీచర్ని పంపింది. పిల్లలు చదువుకుంటున్న పద్ధతికి ఆ డాక్టరు చాలా ఆనందించాడు. ఊళ్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ పదే పదే మస్రత్ టీమ్ గురించి చెప్పాడు. విద్యార్థులు పెరుగుతూ పోయారు. నేడు శ్రీనగర్ అంతా 200 మంది పిల్లలు మూలమూలన సాయంత్రమైతే దీపం వెలిగించి మస్రత్ పేరు తలుచుకుంటారు. ఎందుకంటే ట్యూషన్ మొదలయ్యేది అప్పుడే కదా. 80 మంది టీచర్లు మస్రత్ కింద పని చేస్తున్నారు. 50 వేల వరకూ జీతం మస్రత్ చెప్పడం ‘నా ట్యూషన్ల వల్ల 98 శాతం మార్కులు గ్యారంటీ’ అని. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ పిల్లలకు అలాగే మార్కులు వస్తున్నాయి. క్లాసును బట్టి ఫీజు నిర్ణయించడం వల్ల ఒక టీచరు చెప్పగలిగినన్ని ట్యూషన్లు చెప్పే స్వేచ్ఛ ఉండటం వల్ల తన దగ్గర పని చేస్తున్నవారిలో కొందరు నెలకు 50 వేలు (ఆమె వంతు షేర్ పోను) సంపాదిస్తున్నారని మస్రత్ చెప్పింది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’ అంటుంది మస్రత్. ఆమె ఇప్పుడు శ్రీనగర్లో రెండు కంప్యూటర్ సెంటర్లు నడుపుతోంది. త్వరలో స్కూల్ తెరవాలని అనుకుంటోంది. ఆమె చొరవ వల్ల ఒక వైపు చదువు, మరో వైపు ఉపాధి కలుగుతుండటంతో శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా ఆమెను తాజాగా సత్కరించారు. అది మస్రత్కు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఆన్లైన్ ట్యూషన్లతో కొందరు సక్సెస్ అయ్యారు. నాకు ఆన్లైన్తో సంబంధమే లేదు. నా విధానం నేరుగా పిల్లలకు విద్యావిధానం’ అని చెబుతున్న మస్రత్ త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆమె సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అలాంటిది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’. -
వ్యాపారవేత్తగా మారిన స్టార్ హీరోయిన్.. రకుల్కు పోటీగా
Kriti Sanon Turns Entrepreneur Launches The Tribe Fitness Startup: హీరోయిన్లు కేవలం గ్లామర్ రోల్స్కే పరిమితం కాకుండా కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంటారు. అలాగే తమలోని సింగర్ వంటి వివిధ కళలను బయటపెడుతుంటారు. హీరోయిన్లు ఓ పక్క నటిస్తూనే మరోపక్క నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మంచి ఫామ్లో ఉన్నప్పుడే పలు వ్యాపార రంగాల్లో కూడా సక్సేస్ అయ్యేందుకు కృషి చేస్తున్నారు మన కథానాయికలు. ఇలా బిజినెస్లోనే కాకుండా ఫిట్నెస్ రంగంలోకి దిగుతున్నారు ఫిట్నెస్ బ్యూటీలు. ఇప్పటికే కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్కు ఎఫ్ 45 పేరుతో హైదరబాద్తోపాటు వైజాగ్లో జిమ్లు ఉన్న విషయం తెలిసిందే. . ప్రస్తుతం ఈ ఫిట్నెస్ బ్యూటీకి మరో బ్యూటీ పోటీ రానుంది. ఆ భామ ఇంకెవరో కాదు.. 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్. ది ట్రైబ్ అనే జిమ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ ఫిట్నెస్గుమ్మ. '8 ఏళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్ టాలెంటెడ్ కో-ఫౌండర్లు అనుష్క నందానీ, కరణ్ సాహ్నీ, రాబిన్ బెహ్ల్లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్ను లాంచ్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.' అని కృతి సనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. దీనికి సంబంధించిన యాప్ను వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనుంది. తను నటించిన 'మిమి' సినిమాలో పాత్ర తన ఫిట్నెస్కు స్ఫూర్తినిచ్చిందని కృతి పేర్కొంది. చదవండి: 👇 పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. కొండపై నుంచి బైక్తో సహా దూకిన హీరో.. 8yrs ago, I started my journey as an actor in the hindi film industry! Today, exactly on the same day, I am thrilled to announce my journey as an Entrepreneur with my 3 super talented Co-founders Anushka Nandani, Karan Sawhney and Robin Behl as we launch “The Tribe”. #KeepMoving pic.twitter.com/EovBRSUlt2 — Kriti Sanon (@kritisanon) May 23, 2022 -
అవకాశాల అవసరశాల
లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన పిల్లలను బిజీగా ఉంచడానికి నానా తంటాలు పడ్డారు తల్లిదండ్రులు. అశ్వతీ వేణుగోపాల్ మాత్రం పిల్లల భవిష్యత్కు ఉపయోగపడే విధంగా, సమయాన్ని సద్వినియోగం చేసే ‘అవసర శాల’నే ప్రారంభించింది. ‘‘పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అంశాలు, వారిలో దాగున్న ప్రతిభను వెలికితీసే పోటీలు నిర్వహిస్తూ వారిని బిజీగా ఉంచడమేగాక, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. అవసర శాల ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చిన కెటిల్ సంస్థకే ఇండియా తరపున సభ్యురాలిగా ఎంపికైంది. లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన చిన్న స్టార్టప్తో అతికొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అశ్వతి గురించి ఆమె మాటల్లోనే... ‘‘కేరళలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. అందరిలాగే కష్టపడి ఇంజినీరింగ్ తరువాత ఎంబీఏ చేశాను. క్యాంపస్ సెలక్షన్స్ లో అమెజాన్లో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. ఏదైనా ఫెలోషిప్ చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఫెలోషిప్స్ గురించి తెగ వెతికాను. అప్పుడు నాకు చాలా ఫెలోషిప్స్ కనిపించాయి. నూటపది దేశాల్లోని 17 నుంచి 26 ఏళ్ల యువతీ యువకుల ప్రతిభను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ... ‘నోవెల్స్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లీడర్షిప్(కేఈసీటీఐఎల్– కెటిల్)’లో యూత్ప్రోగ్రామ్ ఫెలోషిప్ చేయడానికి అవకాశం లభించింది. ఏడాదిపాటు ఆన్లైన్ ప్రోగ్రామ్ జరిగింది. 2019 జూన్లో అట్లాంటాలో వారం రోజుల పాటు జరిగే లీడర్షిప్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 27 మందిలో నేను కూడా ఉన్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది చేంజ్ మేకర్లు, ఎంట్రప్రెన్యూర్లు, సామాజిక సేవాకార్యకర్తలు ఉన్నారు. వీళ్లంతా ఏదో ఒకటి సాధించి వచ్చినవారే. 17–20లోపు వాళ్లు వచ్చి వారు ఏమేం చేస్తున్నారో, సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను కూడా ఏదో ఒకటి చేయాలని. అవసరశాల అట్లాంటా నుంచి ఇండియా వచ్చిన తరువాత చాలా ఆలోచించాను. అతి చిన్న వయసులో అనేక దేశాల్లోని పిల్లలు వివిధ రంగాల్లో ఎదిగి చూపిస్తున్నారు. కెటిల్ వేదికగా అవన్నీ ప్రత్యక్షంగా చూశాను. ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. వారినెందుకు ఆ విధంగా తయారు చేయకూడదు అనిపించింది. అనుకున్న వెంటనే అమెజాన్లో ఉద్యోగం వదిలేశాను. నా భర్త సందీప్తో కలసి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తేసేందుకు అనేక మార్గాలను అన్వేషించి 2020లో ‘అవసరశాల’ను ప్రారంభించాం. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీల లిస్టు తయారు చేశాం. నవ్వుల పోటీ, ఫ్యాన్సీడ్రెస్, స్టోరీ టెల్లింగ్, గూగుల్ జూనియర్ కోడింగ్, నాసా స్పేస్ కాంటెస్ట్, జాతీయ, అంతర్జాతీయ స్కాలర్షిప్పులు, స్టూడెంట్ లీడర్ షిప్, అంతర్జాతీయ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ ఎస్సే కాంపిటీషన్స్, జాతీయ స్థాయి మ్యూజిక్ కాంపిటీషన్, డ్యాన్స్ ఫెలోషిప్స్, జూనియర్ ఫుట్బాల్ లీగ్, క్విజ్లు, ఒలింపియాడ్స్, అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వంటివన్నీ చేపడుతున్నాను. వీటిద్వారా పిల్లల్లో ప్రతిభను వెలికి తీస్తున్నాము. ‘విజ్కిడ్స్ చాలెంజ్’ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆర్ట్, సైన్స్, లైఫ్ స్కిల్స్, కుకింగ్, ఫైనాన్స్, ఇన్నోవేషన్స్లో శిక్షణ ఇస్తూ లాక్డౌన్లో పిల్లల్ని బిజీగా ఉంచాం. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులకు వివిధ అంశాలు, ఫెలోషిప్స్పై అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నాము. దీంతో వాళ్లు భవిష్యత్లో ఏ రంగంలోనైనా రాణించగలరు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో ఎదుగుతామనడానికి నేనే ఉదాహరణ. లాక్డౌన్ మొదట్లో ప్రారంభించిన అవసరశాల బాగా క్లిక్ అవ్వడంతో మంచి ఎంట్రప్రెన్యూర్గా ఎదిగాను. కెటిల్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్–3 ‘‘వచ్చే ఐదేళ్లలో నువ్వు ఏం చేస్తావు?’’ అని నన్ను అడిగారు. అప్పుడు నేను ‘‘ఆరుగురి కంటె ఎక్కువమందికి ప్రేరణగా నిలుస్తాను’’ అని చెప్పాను ‘అవసరశాల’తో ఆరుగురు కాదు వేలమందిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నిరూపించే స్థాయిలో ప్రేరణ కలిగించాను. నా పనికి గుర్తింపుగా ఐకానిక్ ఉమెన్ ఆఫ్ 2020 అవార్డు, టాప్టెన్ సోషల్ ఇన్నోవేటర్, యూత్ కోలాబ్ నుంచి పీపుల్స్ చాయిస్ అవార్డులు వంటివెన్నో వరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన సభ్యుల్లో ఇండియా నుంచి నేను ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని చెబుతోంది అశ్వతి. -
రీట్వీట్ చేసిన కేటీఆర్.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది?
సాక్షి, బెంగళూరు: హౌసింగ్.కామ్, ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ కొన్ని రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రవీష్ నరేష్ ట్వీట్పై కేటీఆర్ స్పందించడం.. కేటీర్కు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకూమార్ కౌంటర్ ఇవ్వడానికి తోడు మంత్రి అశ్వత్నారయన్ కూడా మండిపడటం.. రాజకీయపరంగా దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ రవీష్ నరేష్ ట్వీట్ చేశారు.‘బెంగళూరులో(భారత సిలికాన్ వ్యాలీ) ఐటీ సెక్టార్ అభివృద్ధి చెంది ఎన్నో స్టార్టప్లు బిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి అయినప్పటికీ అధ్వానమైన రోడ్లు, విద్యుత్ కోతలు, నీటి సరఫరాక ఇబ్బందులు, పాడైన ఫుట్పాత్ల సమస్యలున్నాయి. భారత్లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన మౌలిక సదుపాయలు కలిగి ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. Pack your bags & move to Hyderabad! We have better physical infrastructure & equally good social infrastructure. Our airport is 1 of the best & getting in & out of city is a breeze More importantly our Govt’s focus is on 3 i Mantra; innovation, infrastructure & inclusive growth https://t.co/RPVALrl0QB — KTR (@KTRTRS) March 31, 2022 అయితే ఈ ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. మీరంతా హైదరాబాద్కు రావొచ్చని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ‘మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్కి రండి. మా దగ్గర మెరుగైన భౌతిక మౌలిక సదుపాయాలు, మంచి సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది & నగరంలోకి రావడం బయటికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ప్రభుత్వం ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు,& సమ్మిళిత వృద్ధి(3 i) సూత్రాలపై దృష్టి పెట్టింది.’ అని రీట్వీట్ చేశారు. చదవండి: రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్కి దారి తీసిన స్టార్టప్ కంపెనీ! Dear Shri @DKShivakumar & Shri @KTRTRS, In 2023, both of you friends can pack up & move to any place you like. The "double engine governments of BJP" will not only continue to restore glory to Karnataka but will also take Telangana on super highway of progress and prosperity. pic.twitter.com/bFZAjRG0QZ — BJP Karnataka (@BJP4Karnataka) April 4, 2022 తాజాగా కేటీఆర్ ట్వీట్పై కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్నారయన్ మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తను బ్యాగ్లు సర్దుకుని హైదరాబాద్కు వచ్చేయండంటూ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాటతీరు సరైనదిగా లేదని, ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దురుసు మాటలు మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఒకరిని మరొకరు కిందకు లాగేందుకు ప్రయత్నించడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదని సూచించారు. మనమంతా భారతీయులం, మనమంతా కలిసి ప్రపంచంతో పోటీ పడాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్లకు కర్ణాటక బీజేపీ శాఖ ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీరిద్దరూ ఇక బ్యాగులు సర్దుకోవాలని కౌంటర్ వేసింది. నచ్చిన చోటుకి వెళ్లేందుకు ఇద్దరు స్నేహితులు సిద్ధంగా ఉండాలని సూచించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కర్ణాటక వైభవం కాపాడడంతో పాటు తెలంగాణలోనూ మరింత పురోగమించేదిశగా పయనించేలా చేస్తామని చెప్పింది. Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍 Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT — KTR (@KTRTRS) April 4, 2022 ఇక కేటీఆర్ సవాల్ను తను స్వీకరించినట్లు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పేర్కొన్నారు. ‘నా మిత్రుడు కేటీఆర్.. మీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నా. 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మా హయాంలో బెంగుళూరుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం.’ అని కేటీఆర్కు పరోక్షంగా కౌంటర్ వేశారు. అయితే కేటీఆర్ కూడా వెంటనే బదులిచ్చారు. ‘శివకుమార్ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, దేశ ప్రగతికి హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మౌళిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్ పెడుదాం. కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై కాదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతాం: మంత్రి గంగుల -
సీఎం జగన్ను కలిసిన ముల్క్ హోల్డింగ్స్ ఛైర్మన్ నవాబ్ షహతాజ్ షాజీ
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముల్క్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ నవాబ్ షహతాజ్ షాజీ ఉల్ ముల్క్, వైస్ ఛైర్మన్ నవాబ్ అద్నాన్ ఉల్ ముల్క్ కలిశారు. ఏపీలో ముల్క్ హోల్డింగ్స్ బిజినెస్ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుచేసేందుకు ముల్క్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. చదవండి: ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్లు: కేంద్రమంత్రి అల్యుమినియం కాయిల్స్ తయారీ, కాయిల్ కోటింగ్కు ఉపయోగించే హై పర్ఫామెన్స్ పెయింట్స్ తయారీ, అల్యూమినియం కాయిల్ కోటింగ్ ప్రొడక్షన్ లైన్స్, ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మినరల్ కోర్స్ ప్రొడక్షన్ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్స్, మెటల్ కాంపోజిట్ మెటీరియల్స్ పొడక్షన్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ముల్క్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. ఇటీవల దుబాయ్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పర్యటనలో ఏపీ ప్రభుత్వంతో ముల్క్ హోల్డింగ్స్ ఎంవోయూ చేసుకుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, రెండు వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాలలో ఏపీ ప్రభుత్వ స్పెషల్ రెప్రజెంటేటివ్ జుల్ఫీ రౌడ్జీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
‘రసోయి కీ రహస్య’: కాకి అరుపుతో ఆశలు చిగురించాయి.. ఆమెకు హాట్సాఫ్
డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం చేయాలి. నెల నెలా వచ్చే జీతంతో ఇవి చేద్దాం అవిచేద్దాం అని ఎన్నో కలలు. కానీ అనుకోకుండా ఎదురైన అనారోగ్యం మొత్తం జీవితాన్నే చీకటి మయం చేసింది. అయినా ఏమాత్రం భయపడలేదు పాయల్. అప్పటిదాకా తన కళ్లతో అందమైన ప్రపంచాన్ని చూసిన కళ్లు ఇక మీదట చూడలేవన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. తరువాత మెల్లగా కోలుకుని తన కాళ్ల మీద తను నిలబడి, చూపులేని వారెందరికో కుకింగ్ పాటాలు నేర్పిస్తోంది. పంజాబీ కుటుంబంలో పుట్టిన పాయల్ కపూర్ చిన్నప్పటి నుంచి చాలా చురుకు. అది 1992 ఆగస్టు..అప్పుడే పాయల్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్లోని ఒబేరాయ్ హోటల్లో ఉద్యోగం దొరికింది. రోజూ ఉద్యోగానికి వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం పాయల్ దినచర్య. అనుకోకుండా ఒకరోజు హోటల్లో పనిచేస్తోన్న సమయంలో అనారోగ్యంగా అనిపించింది. డాక్టర్ను కలవగా.. సాధారణ జ్వరమని అన్నారు. కానీ మూడు రోజులైనా తగ్గకపోగా మరింత తీవ్రం అయ్యింది. ఉదయం అద్దంలో తన ముఖాన్ని తనే సరిగా చూడలేకపోయింది. దీంతో వెంటనే కళ్ల డాక్టర్ను, నరాల డాక్టర్లను కలిసింది. ఒక నెలరోజులపాటు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఉంది. అయినా ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో పాయల్ను ముంబై తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనుపాపను అటు ఇటు తిప్పలేకపోయింది. వినలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి సమస్యలు కూడా వాటికి తోడయ్యాయి. కాకి అరుపుతో.. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా పాయల్ జీవితం అంధకారమైంది. పాయల్కు ఏదైనా చెప్పాలంటే కుటుంబ సభ్యులు ఆమె చెయ్యి మీద వేళ్లతో రాసేవారు. రోజులు అతికష్టంగా గడుస్తోన్న సమయంలో ఏడునెలల పాటు జరిగిన చికిత్సల మూలంగా ఆరోగ్యంలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ రోజు పాయల్కు కాకి అరుపు వినిపించింది. ఈ శబ్దం మోడుబారిన జీవితంలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో హైదరాబాద్ తిరిగొచ్చింది పాయల్. క్రమంగా వినికిడి, వాసనలు తెలిసినప్పటికీ చూపు మాత్రం రాలేదు. ఆరేళ్ల తరువాత.. పాయల్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిసిన ఆమె స్నేహితులు తనని సినిమాలకు తీసుకెళ్లడం, ఆమెతోపాటు బైక్ రైడ్స్ చేసేవారు. దీంతో తన పరిస్థితి మరింత మెరుగుపడింది. ఇదే సమయంలో అంధులను చూసుకునే ఓ ఎన్జీవో గురించి స్నేహితులు చెప్పారు. పాయల్ ఆ ఎన్జీవోని సంప్రదించడంతో వాళ్లు ఆమెకు తన పనులు తాను చేసుకోవడం నేర్పారు. వీటితోపాటు బ్రెయిలీ కూడా నేర్చుకుంది. తరువాత తనలా చూపులేక బాధపడుతోన్న వారికి పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పాయల్ను ఇష్టపడడంతో పెళ్లిచేసుకుంది. కానీ కొంత కాలం తర్వాత మనఃస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్తతో విడిపోయాక పాయల్ ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది. హోటల్లో ఉద్యోగం చేస్తూనే వైకల్యంతో ఎదురయ్యే సమస్యలు మీద మాట్లాడడం, వంటల తయారీ గురించి చెబుతుండేది. కరోనా కారణంగా అన్నీ మూతపడడంతో వంటరాని వాళ్ల పరిస్థితి ఏంటీ? అని అనిపించింది పాయల్కు. దీంతో 2020లో ‘రసోయి కీ రహస్య’ పేరుతో యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. వంటరాని వాళ్లకు వంటలు చేయడం ఎలా? చూపులేనివాళ్లు ఆహారాన్ని ఎలా వండుకోవచ్చో ట్యుటోరియల్స్ చెబుతోంది. అంతేగాక బ్రెయిలీలో వంటల తయారీ గురించి రాసి షేర్కూడా చేస్తుంది. 52 ఏళ్ల వయసులో ఎంతోయాక్టివ్గా యూ ట్యూబ్ చానల్ను నడుపుతూ పాయల్ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
సీఎం జగన్ను కలిసిన ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఎండీ
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండీ ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని వారు తెలిపారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఉత్పత్తిని విస్తరించే ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. చదవండి: ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్ గత రెండున్నరేళ్లుగా ఏపీ.. సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. స్కూల్స్, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాలు 16 మెడికల్ కాలేజీల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయడం సంతోషకరమని తెలిపారు. మొదటి సారి కలిసినా చాలా స్నేహపూర్వకంగా తమ సమావేశం జరిగిందని చక్కటి విజన్తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్ను మెరిపించారు. ఆటోమొబైల్తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్లైన్స్ చైర్మన్గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
మహిళా పారిశ్రామికవేత్త 'ఉషా తివా'కు 'క్యూట్ స్మైల్' టైటిల్
చైన్నై: చెన్నైకు చెందిన ఉషా తీవా క్యూట్ స్మైల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వైబ్రెంట్ కాన్సెప్ట్స్ నిర్వహించిన మిస్సెస్ ఇండియా గెలాక్సీ 2021 పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్సెస్ క్యూట్ స్మైల్ కిరీటాన్ని సామాజిక సేవకురాలు, పారిశ్రామిక వేత్త ఉషా తీవా గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ముఖ్య అతిథిగా సెలబ్రిటీ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ కరణ్ రామన్ హాజరయ్యారు. ఉషా తీవా సోమవారం మాట్లాడుతూ లక్షలాది మంది పేద ప్రజలకు దుస్తులను వితరణ చేస్తూ తన వంతుగా సమాజ సేవ చేస్తున్నానని తెలిపారు. మరోవైపు తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మహిళల అభివృద్ధి, సాధికారతకు కృషి చేస్తున్నట్టు ఉషా తీవా పేర్కొన్నారు. గ్రామీణ మహిళల జీవనోపాధికి తోడ్పాటు అందించడం చాలా కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. జీతాలతో పాటు, వివర్ష అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి కూడా ఖర్చు చేస్తారని వెల్లడించారు. మిస్సెస్ క్యూట్ స్మైల్ కిరీటాన్ని గెలుచుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఉషా తీవా. -
పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం...
విజయానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. సాధారణంగా 16, 17 యేళ్ల నుంచి అంతకంటే పెద్ద వయసున్నవారు బిజినెస్ లేదా జాబ్ చేయడం చూస్తుంటాం! కానీ 10 యేళ్ల వయసున్న పిల్లలెవరైనా నెలకు ఏకంగా కొట్ల రూపాయలను సంపాదించడం కనీవినీ ఎరుగునా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఐతే ఇదంతా ఎలా సాధ్యపడిందబ్బా! అని ఆశ్చర్యంతో తలమునకలైపోతున్నారని తెలుస్తుందిలే.. వివరాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సిస్ కర్టిస్ అనే 10 యేళ్ల బాలిక తల్లి సహాయంతో బొమ్మల వ్యాపారం (టాయ్ బిజినెస్) చేస్తోంది. తద్వారా నెలకు రూ.1 కోటి 4 లక్షలకు పైనే సంపాదిస్తోంది. కలర్ఫుల్ బొమ్మలతోపాటు, ఆకర్షనీయమైన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ వంటి (హెయర్ యాక్ససరీస్) వాటిని నెముషాల్లో అమ్మి పెద్ద మొత్తంలో ఆర్జిస్తుంది. బాలిక తల్లి రాక్సి మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా చిన్న వయసులోనే నా కూతురు బిజినెస్లో విజయం సాధించి నా కలను నెరవేర్చింది. నాచిన్నతనంలో 14 యేళ్ల వయసులో మెక్డోనాల్డ్స్లో పనిచేశాను. కానీ నా కూతురు అంతకంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిక్సిస్ సిడ్నీలో ప్రైమరీ స్కూల్లో చదువుతూ బిజినెస్ చేస్తోంది. తానుకోరుకుంటే 15 యేళ్లకే రిటైర్ అయ్యేలా కూడా ప్లాన్ చేశాం. అంతేకాదు కోటి 41 లక్షల రూపాయల విలువైన మెర్సిడెస్ కారు కూడా నా కూతురికి ఉంద’ని పేర్కొంది. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
Shana Parmeshwar: స్టీరింగ్కు ఆ విషయంతో పనిలేదు కదా!
షనా పరమేశ్వర్... ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేదు. కానీ సాహసాల ప్రపంచంలో ఆమె ఓ వెలుగు వీచిక. ఆమె పైలట్, మోటార్ కార్ రేసర్, ఒక ఎంటర్ప్రెన్యూర్. ఇవన్నీ కాక సరదాగా డీజే పాత్రను కూడా పోషించింది. రెడ్క్రాస్లో స్వచ్ఛందంగా సేవ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ‘ద మార్క్యూ వన్ మోటార్ క్లబ్’ డైరెక్టర్. బెంగళూరులో పుట్టిన షనాకి చిన్నప్పటి నుంచి కార్ రేస్ అంటే ఇష్టం. తండ్రితోపాటు రేసింగ్కి వెళ్లేది. ఆమెతోపాటు ఆమె కార్ రేస్ ఇష్టం, సాహసాల మీద వ్యామోహం కూడా పెరిగి పెద్దయింది. ఏవియేషన్ కోర్సు కోసం మలేసియాకు వెళ్లింది షనా. అక్కడ మోటార్ స్పోర్ట్స్ పట్ల కూడా ఆసక్తి కలిగిందామెకి. 2005– 2009 మధ్య కాలంలో ఆమె ‘కెథౌజండ్ ర్యాలీ’ లో కీలక పాత్ర వహించింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మోటార్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొన్నది. రకరకాల నేలల మీద వాహనాన్ని నడిపింది. ఆఖరుకు మంచు మీద కూడా వాహనాన్ని నడిపి విజయదరహాసంతో హెల్మెట్ తీసేది. మలేసియా నుంచి స్వీడెన్ మీదుగా ఇంగ్లండ్ వరకు సాగిన సర్క్యూట్లో ఫోక్స్వ్యాగన్, పోర్షె, లామ్బోర్గిని వంటి అనేక రకాల వాహనాలను నడిపింది. అలా ఆమె మోటారు వాహనాల రంగంలో అందరికీ సుపరిచితమైంది. వైమానిక రంగం మీదున్న ఇష్టం ఆమెను న్యూజిలాండ్కు నడిపించింది. బోట్స్వానా లో ఆమె పూర్తి స్థాయిలో ఫ్లయింగ్ కెరీర్ మీదనే దృష్టి పెట్టింది. ‘‘నా కలలన్నింటినీ సాకారం చేసుకోవడానికి తగినట్లు చేతి నిండా వ్యాపకాలను పెట్టుకున్నాను. న్యూజిలాండ్ నుంచి లండన్ కి వెళ్లాను. అక్కడ ఆటోమొబైల్ పరిశ్రమలో ఎగుమతి–దిగుమతుల వ్యాపారం మొదలు పెట్టాను. అది గాడిలో పడిన తర్వాత నేను నా కోసం జీవించడానికి ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పటి వరకు సరదాగా రేసింగ్ చేసిన నేను అప్పటి నుంచి ప్రొఫెషనల్ రేసర్గా మారిపోయాను’’ అని చెప్పింది షన. ఒక మహిళ మోటార్ కార్రేస్లో నెగ్గుకు రావడం కష్టంగా అనిపించడం లేదా అని అడిగిన వాళ్లకు షన చురక లాంటి సమాధానం చెప్తుంది. ‘స్టీరింగ్ పట్టుకున్న వ్యక్తి మగా ఆడా అనే తేడా కారుకు తెలియదు. స్టీరింగ్కీ తెలియదు. అలాంటప్పుడు మహిళ అయిన కారణంగా నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి’ అని తిరిగి ప్రశ్నిస్తుంటుంది షన. ‘వాహనం నడపడానికి శారీరక దారుఢ్యం ఎక్కువగా ఉండాలనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి డ్రైవింగ్లో ఉండాల్సింది వ్యూహాత్మకమైన నైపుణ్యం మాత్రమే. అది మగవాళ్లలో కంటే ఆడవాళ్లలోనే ఎక్కువని నా నమ్మకం’ అని నవ్వుతుందామె. మోటార్ స్పోర్ట్స్ రంగంలో రాణిస్తున్న మహిళలు విదేశాల్లో మాత్రమే కాదు ఇండియాలో కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పింది షన. యూకేలో 2017లో జరిగిన మోడ్బాల్ ర్యాలీలో పాల్గొన్న తొలి ఇండియన్ షన. అప్పటివరకు ఆ ర్యాలీలో మన మగవాళ్లు కూడా పాల్గొన్నది లేదు. ‘‘ట్రాక్ మీద అబ్బాయిల కార్లను నా కారు ఓవర్టేక్ చేసినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా అబ్బాయిల కార్ల కంటే నా కారును ముందుకు తీసుకు వెళ్లే వరకు నా మనసు ఆగేది కాదు’’ అని నవ్వుతుంది షన. -
శోభపై నార్కోటిక్స్ కేసు.. ఊహించని మలుపులతో ఊరట
ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్పై ఈ జనవరిలో నార్కోటిక్స్ కేసు నమోదు అయ్యింది. ఆమె షోరూంలో గంజాయి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరు నెలల విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను పక్కాగా ఈ కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. వివరాళ్లోకి వెళ్తే.. తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్(34).. పదేళ్ల నుంచి చేనేత రంగంలో రాణిస్తోంది. తిరువనంతపురంలో ఆమెకు ఓ చేనేత పరిశ్రమతో పాటు ఓ క్లోతింగ్ స్టోర్ ఉన్నాయి. ఆమె క్లయింట్స్లో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఆరేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె.. కోర్టులో విడాకుల వాదనలకు హాజరవుతూ వస్తోంది. అయితే జనవరి 21న ఆమె జీవితంలో మరిచిపోలేని ఘటన జరిగింది. కొవలంలో కొత్త బ్రాంచ్ పనుల్లో బిజీగా ఉన్న ఆమెకు తిరువనంతపురం పోలీసుల నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. ఆమె అవుట్లెట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వాళ్లు చెప్పడంతో ఆమె షాక్ తింది. సుమారు 400 గ్రాముల గంజాయి.. దొరకడంతో నార్కోటిక్స్ టీం ఆమెను కేసులో బుక్ చేసి ప్రశ్నించింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తాను అమాయకురాలినంటూ సీఎంకు, డీజీపీలకు ఆమె లేఖ రాయడం.. హై ప్రొఫైల్ సెలబబ్రిటీ కావడంతో ఈ కేసు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు అధికారులు. రెండు నెలల ట్రేస్ తర్వాత.. డీఎస్పీ అమ్మినికుట్టన్ ఆధ్వర్యంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇంట్లో పనిమనిషి.. స్టోర్లోకి వెళ్లడాన్ని గుర్తించింది ఆ టీం. ఆమెను ప్రశ్నించడంతో వివేక్ అనే వ్యక్తి తనకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి.. షాపులో పెట్టమని చెప్పాడని తెలిపింది. వివేక్ ఒకప్పుడు శోభా దగ్గరే పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలతో అతన్ని పని నుంచి తొలగించింది. హరీష్ హరిదాస్ అనే వ్యక్తితో కుమ్మక్కై వివేక్, శోభపై కుట్ర పన్నాడని ఆ తర్వాతే తేలింది. పెళ్లి కాదందనే.. హరీష్ హరిదాస్ యూకే పౌరసత్వం ఉన్న వ్యక్తి. లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ కొడుకు. పైగా డాక్టర్ కూడా. ఏడాది క్రితం శోభకు హరీష్ పెళ్లి ప్రతిపాదన పంపాడు. ఆమె కాదంది.అది మనసులో పెట్టుకునే ఆమె నార్కోటిక్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెపై ఉన్న ఆరోపణలు కొట్టేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వివేక్ ను అరెస్ట్ చేయగా.. హరిష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
Priyadarshini Nahar: విజయానికి ప్రధాన కారణం అదే...
‘మేం అంగవికలురం కాదు, దివ్యాంగులం’ అంటారు ప్రియదర్శినీ నహర్. అందరు పిల్లల్లాగానే ఆరోగ్యంగా పుట్టారు ప్రియా. చక్కగా ఆటపాటలతో బాల్యం అందంగా, ఆనందంగానే గడుస్తోంది. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. ప్రియదర్శినికి ఆరు సంవత్సరాల వయసులో, పోలియో కాటు వేసింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం పనిచేయలేదు. ప్రియా నహర్ తన అచేతన స్థితికి కుంగిపోలేదు. తల్లిదండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో చదువుకోవటం ప్రారంభించింది. కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు ప్రియదర్శినీ నహర్. అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి ఎంతోమందికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు ప్రియదర్శిని. ఆన్లైన్ క్లాసుల ద్వారా దివ్యాంగులకు పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ ఇవ్వాలనుకున్నారు. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. ఇందుకోసం పెద్ద ఆఫీసు తీసుకోలేదు. ఒక చిన్న గదిలో కూర్చుని, ముగ్గురు విద్యార్థులకు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పటం ప్రారంభించారు. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, ఉత్సాహవంతులైన చాలామంది దివ్యాంగులు ఆన్లైన్ క్లాసులకు కూర్చోవటం మొదలుపెట్టారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, పుణేలోని లా కాలేజ్ రోడ్డులో ‘యాష్ క్లాసెస్’ ప్రారంభించే స్థాయికి ఎదిగారు. ‘ది ఆసరా’ సంస్థ ప్రియా నహర్కి ఎంతగానో సహకరించింది. మార్కెటింగ్ ప్లాన్ చెప్పి, మరింతమంది విద్యార్థులు ఇందులో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహించింది. ఇప్పుడు ‘యాష్ క్లాసెస్’ అంటే మంచి శిక్షణ సంస్థగా పేరు సంపాదించుకుంది. వందమందికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు విద్యార్థులకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, ఎకనమిక్స్, కామర్స్ అంశాలలో మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రియదర్శిని. తన దగ్గరే టీచర్లను వేసుకుని వారికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రియా నహర్. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా రెండువేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, ‘ఓపెల్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అనే సంస్థను కూడా స్థాపించి, దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థను ప్రియదర్శిని విజయవంతంగా నడుపుతున్నారు. తన గురించి చెబుతూ... ‘‘మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లికి వివాహమైంది. పుణేలో ఉంటోంది. మా తమ్ముడు మంచి వస్త్ర వ్యాపారవేత్త అయ్యాడు. మా తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో ఇప్పుడు నేను కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాను. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నాకు మంచి చదువు చెప్పించారు అమ్మవాళ్లు. నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. అందువల్ల ఇంటి నుంచే ఏదో ఒక పని చేయాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో నేను బ్రైట్ స్టూడెంట్ని కావటం వల్ల, చదువుకు సంబంధించిన వాటిమీదే నా దృష్టి పెట్టాను. అలా ప్రారంభమైంది యాష్ కోచింగ్ సెంటర్’’ అంటున్న ప్రియదర్శిని.. విద్యార్థులకు చదువుతో పాటు, బిహేవియరల్ అనలిస్టులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది యోగా గురువులతో దివ్యాంగుల కోసం జిమ్ కూడా ప్రారంభించారు. ‘‘నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ముందు నేను శ్రద్ధగా చదువుకుని, ఆ తరవాత పిల్లలకు చెబుతాను. చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వాళ్లని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా, నాలాంటి చాలామంది పిల్లలకు తల్లిని. ‘నాణ్యమైన పని విజయానికి ప్రధాన కారణం’ అని నేను నమ్ముతాను’’ అంటారు ప్రియదర్శిని నహర్. Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్ -
పదిహేను సర్జరీలు అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు..
ప్రతి విజయం వెనుక కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు నిరంతర సాధనతో సమస్యలను అధిగమించి విజయ తీరాలకు చేరతారు. కానీ వైకల్యంతో ఉన్నతస్థాయికి ఎదగాలంటే మాత్రం... ‘కష్టాల కడలి’ని ఈదాల్సిందే. ఇటువంటి కష్టాల కడలిని ఎంతో ధైర్యంగా ఈది సమాజంలో తనకంటూ గుర్తింపును ఏర్పర్చుకున్నారు ‘ఇయర్బుక్ కాన్వాస్’ సహవ్యవస్థాపక సీఈవో సురాశ్రీ రహానే. వైకల్యాన్ని ఓడించి ఎంట్రప్రెన్యూర్గా ఎదిగి ఎంతోమందికి ప్రేరణగా నిలసున్నారు సురాశ్రీ. నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో సురాశ్రీ రహానే జన్మించింది. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో సురాశ్రీ పదిహేను రోజుల శిశువుగా ఉన్నప్పుడే కాళ్లకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అంతటితో సమస్య తీరుతుంది అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అది ప్రారంభం మాత్రమే అని తర్వాత తెలిసింది వారికి. ఒకపక్క తనసమస్యతో బాధపడుతూనే సురాశ్రీ స్కూలుకెళ్లి చక్కగా చదువుకునేది. ఒకసారి మేజర్ సర్జరీ అయింది. అప్పుడు కొన్ని నెలల పాటు స్కూలుకు వెళ్లడం కుదరలేదు. దీంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నందుకు తనకు ఎంతో బాధపడేది. ఇప్పటిదాక మొత్తం పదిహేను సర్జరీలు అయినప్పటికి సురాశ్రీ∙వైకల్యానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు! ఇలా ఉంటే నేను ముందుకు వెళ్లలేను బాగా చదువుకోని ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. కంప్యూటర్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ సురాశ్రీ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ‘‘చిన్నప్పుడు నాకాళ్ల మీద నేను నిలబడేందుకు కాళ్లు సహకరించలేదు! అయినా ఎంతో కష్టపడి నడవడం నేర్చుకున్నాను! ఇప్పుడు కెరియర్లో కూడా నాకు నేనే ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. జ్ఞాపకాల ఐడియా.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న కష్టాలు, వైకల్యంతో కోల్పోయిన కార్యక్రమాలు, ఆనందకరమైన సందర్భాలు, స్నేహితులతో సరిగ్గా గడపలేని క్షణాలు తనకి గుర్తుకొచ్చాయి. ‘‘ఇటువంటి మధుర, చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఒక దగ్గర రాసుకుని ఏడాది తరువాత చూసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది’ అన్న సురాశ్రీ ఆలోచనకు ప్రతిరూపమే ‘ఇయర్బుక్ కాన్వాస్’. స్టార్టప్ మార్వారీ కెటలిస్ట్ ఇన్వెస్ట్ చేయడంతో ఇయర్బుక్ కాన్వాస్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇయర్బుక్ కాన్వాస్కు మంచి గుర్తింపు రావడంతో ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ ఆసియా పసిఫిక్ యూనివర్సిటి నుంచి ‘అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా’ అవార్డులు సురాశ్రీని వరించాయి. టెడెక్స్, యూనెస్కో, యుపెన్ వంటి అంతర్జాతీయ వేదికలపై మోటివేషనల్ స్పీకర్గాకూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను ఎప్పుడూ జ్ఞాపకాలు రాసుకోవడానికి బుక్ కొనుక్కోలేదు. నాకు ఎవ్వరూ సలహా కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను బుక్ కొనకపోవడం వల్లే ఈరోజు ఇయర్ బుక్ను తీసుకు రాగలిగాను. భారతదేశంలో నంబర్ వ¯Œ ఇయర్ బుక్ కంపెనీగానేగాక, ఆసియాలో మొబైల్ అప్లికేషన్ కలిగిన ఏకైక బుక్ కంపెనీ గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ‘కార్పొరేట్ మెమరీ బుక్’ను తీసుకొచ్చాం. గతకాలపు జ్ఞాపకాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇయర్బుక్, కార్పొరేట్ మెమరీ బుక్లు తీసుకొచ్చాము. త్వరలోనే వైకల్యం గలిగిన పిల్లల కోసం ‘ఫ్యూచర్ ఎంట్రప్రెన్యూర్ బుక్’ తీసుకొస్తున్నాం’’అని సురాశ్రీ చెప్పింది. -
మహిళల సమస్యకు చాకొలెట్లు, ‘టీ’లే ఔషధం!
అందరూ అన్నీ చేసేస్తున్నారు. ఇక కొత్తగా నేనేం చేయాలి? ఇంతమంది మధ్యలో నేను పెట్టిన స్టార్టప్ మనుగడ సాధ్యమేనా? సొంతంగా పరిశ్రమ స్ఠాపించాలనుకునే యువతలో ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. అయినా ఒక సమస్యకు పరిష్కారాన్ని మించిన ఉపాధి మరేముంటుంది? తన కళ్ల ముందున్న సమస్య నుంచి కెరీర్ మొదలుపెట్టారు షీతా మిట్టల్. ఆ సమస్య కూడా నిరంతరం ఉండేదే అయినప్పుడు ఆ పరిష్కారం కూడా భూమి ఉన్నంత కాలం ఉండి తీరుతుంది. ఇంతకీ ఆమె ప్రారంభించిన పరిశ్రమ ఏమిటంటే.. మహిళల ఆరోగ్య ఉత్పత్తుల తయారీ. సమాజం మాట్లాడడానికి సందేహించే ఆరోగ్య సమస్యలకు ఆహారంతో పరిష్కారం చెబుతున్నారు షీతా మిట్టల్. ‘‘ఆహార ఉత్పత్తులు, హెల్త్ డ్రింకులు తయారు చేసే కంపెనీలన్నీ మహిళల మహిళల ఎముకల పటిష్టత వరకే ఆలోచిస్తున్నాయి. వార్ధక్యం లో ఎదురయ్యే కీళ్ల నొప్పుల గురించి మాట్లాడుతున్నాయి. అక్కడితోనే ఆగిపోతున్నాయి. నిజానికి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే గర్భాశయ సమస్యల గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. ఇప్పటికీ సమాజంలో ఆ విషయంలో గోప్యత, కళంక భావన బలంగానే ఉంది. ఆ శూన్యతను భర్తీ చేసే ప్రయత్నం చేశాను. మా అమ్మ తన ఆరోగ్యం విషయంలో ఎంత బాధపడిందో స్వయంగా చూశాను. అమ్మ శారీరకంగా బాధపడుతుంటే, నాది మానసికమైన వేదన. ఆమె బాధ చూస్తుంటే గుండె పిండేసినట్లయ్యేది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా ఈ ఇబ్బందులకు పరిష్కారం లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించేది. ఆ పని నేనే ఎందుకు చేయకూడదు... అనే ఆలోచనకు ప్రతిరూపమే ‘అండ్ మీ’! మూడేళ్ల కిందట మొదలైన మా సంస్థ ఈ కరోనా సమయంలో కూడా ప్రయోగాలను కొనసాగించి... మెనోపాజ్ కుకీస్ను తయారు చేసింది. మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తీసుకోవాల్సిన ఆహారం ప్రత్యేకమైనదై ఉండాలి. అయితే ఆధునిక మహిళకు ఆ దినుసులన్నీ మార్కెట్లో సేకరించి, వండుకుని తినగలిగే సమయం ఉండడం లేదు. అందుకే తినడానికి సిద్ధంగా కుకీస్ తయారు చేశాం. ప్రతి ఉత్పత్తినీ గైనకాలజిస్టులు, పోషకాహార నిపుణుల సూచనలను పాటించి తయారు చేస్తాం. తయారైన వాటిని ల్యాబ్లో పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు షీత. లక్ష్యం కోసం కలిశారు ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షీతా మిట్టల్ యూఎస్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశారు. యోగా శిక్షకురాలు కూడా. ఐదేళ్ల కిందట యూఎస్లోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న అంకుర్ గోయెల్ కూడా తన తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ అధ్యయనంలో అతడికి తెలిసిన సంగతి ఏమిటంటే... ‘మనదేశంలో ఐరన్లోపం ఉన్న మగవాళ్లు 23 శాతం ఉంటే మహిళలు 54 శాతం మంది. అలాగే క్యాల్షియం లోపం కూడా మగవాళ్లలో 25 శాతంలో ఉంటే ఆడవాళ్లలో 50 శాతం మందిలో ఉంది. ఈ పోషకాల లోపం జీవనశైలితోపాటు సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల వస్తోంది’ అని. షీతా మిట్టల్ కూడా అదే ప్రయత్నంలో ఉండడంతో ఇద్దరూ కలిసి మహిళలకు ఎదురయ్యే అనారోగ్యాలను తగ్గించే ఆహారం మీద దృష్టి పెట్టారు. అవసరాలను గుర్తించారు కరోనా సమయంలో అన్ని పరిశ్రమలూ స్తంభించిపోయినట్లే షీతా మిట్టల్ పరిశ్రమ కూడా ఒడిదొడుకులను ఎదుర్కొంది. కానీ అవసరం ఆగదు కదా! ఆన్లైన్లో రిక్వెస్ట్లు ఎక్కువయ్యాయి. దాంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయోగాలను, ఉత్పత్తులను తిరిగి ప్రారంభించిందామె. బెంగళూరు నుంచి మనదేశంలో ప్రముఖ నగరాలకు, విదేశాలకు కూడా విస్తరించించాయి ‘అండ్ మీ’ మహిళల ఆరోగ్య ఉత్పత్తులు. ప్రస్తుతం షీతామిట్టల్ పరిశ్రమ పెద్ద కంపెనీలకు దీటుగా సాగుతోంది. సమాజం లోని అవసరాన్ని మానవీయ కోణంలో చూడగలిగి, మనసు పెట్టి పరిష్కారాన్ని అన్వేషిస్తే... అంతకు మించిన ఉపాధి రంగం మరొకటి ఉండదని నిరూపించారు షీతామిట్టల్. చాకొలెట్లు, ‘టీ’లే ఔషధం! షీతా మిట్టల్ ‘అండ్ మీ’ పరిశ్రమ ద్వారా పీసీఓఎస్ను అదుపు చేసే పానీయంతోపాటు పీరియడ్స్ సమయంలో నొప్పిని నివారించే చాకొలెట్లు, టీ తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో మహిళలను తరచూ వేధిస్తున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించే మూలికా పానీయంతోపాటు యువతులను ఇబ్బంది పెడుతున్న యాక్నే, జుత్తు రాలడం, చర్మం పేలవంగా మారడం వంటి సమస్యలకు కూడా పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది. -
రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చార్లెస్ చక్ ఫ్రీనీ (89) తనకున్న యావదాస్తి 8 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.58 వేల కోట్ల)ను గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలోని పలు ఫౌండేషన్లకు, విశ్వవిద్యాలయాలకు దానం చేశారు. ఇంత భారీ మొత్తంలో చేసిన దానం ఇటీవల బయటకు రావడంతో ధనవంతు లంతా అవాక్కయ్యారు. 2012లో తన భార్యకు ఇచ్చేందుకు కేవలం 20 లక్షల డాలర్లు అట్టిపెట్టారు. దానం చేసిన మొత్తంలో దాదాపు సగ భాగాన్ని ఇతరులకు విద్య అందించడానికే సాయం చేశారు. మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేం దుకు దానం చేశారు. అంతా దానం చేయాలనే ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఆయన ఈ త్యాగం చేశారని బిల్ గేట్స్ పేర్కొన్నారు. -
మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, క్యుకి డిజిటల్ మీడియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బంగారా (46) ఆకస్మిక మరణం వ్యాపార వర్గాలను విభ్రాంతికి గురిచేసింది. ముంబై శివారు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బంగారా కన్నుమూశారు. ఆయన అకాల మరణంపై కంపెనీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ విషాదవార్తతో షాక్ లో వున్నామని క్యుకి మరో కో-ఫౌండర్ సీవోవో సాగర్ గోఖలే ఉద్యోగులకు పంపిన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ లోటును వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో మనమంతా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. అలాగే కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఇంటినుంచే బంగారాకు నివాళులర్పించాలన్నారు. అటు సమీర్ బంగారా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విశాల్ దాడ్లాని, అర్మాన్ మాలిక్, కుబ్రా సైట్, అదితీ సింగ్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. తన స్నేహితుడు, సమీర్ ఇక లేడన్న భయంకరమైన, హృదయ విదారక వార్త తెలిసి చాలా బాధపడుతున్నా అన్నారు. జీవితంలో ఎంతోమందికి సాయం చేసిన మంచి వ్యక్తి అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది విషాదాలను తలుచుకుంటూ 2020 ఇక చాలు దయచేసి..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Just heard that @samirbangara is no more. Horrible, heartbreaking news. Man's been a friend for a long time. Such a good guy, so straight-up. Helped so many people build careers out of nothing! His legacy will remain. Much love & strength to the family. 🙏🏼 2020, enough please! — VISHAL DADLANI (@VishalDadlani) June 14, 2020 Really very sad to wake up to the news that @samirbangara is no more. He was a great guy with a drive and passion like no other. Shocking and heartbreaking. Sincere condolences, strength and prayers to his immediate family & the @MyQyuki family... — ARMAAN MALIK (@ArmaanMalik22) June 14, 2020 -
రూ. 237 కోట్ల రధ్దైన నోట్లను మార్చిన శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి చెల్లనినోట్లను ఇచ్చి ఆస్తులను కొనుగోలుచేశారని వెల్లడైంది. ప్రభుత్వ పౌష్టికాహార కాంట్రాక్టర్ను బెదిరించి రూ. 237 కోట్ల రద్దైన నోట్లకు వడ్డీ సహా కొత్తనోట్లను చెల్లించేలా ఒప్పందం చేసుకున్న సంగతిని కోర్టుకు సమర్పించిన పత్రం ద్వారా ఐటీశాఖ బయటపెట్టింది. నోట్ల రద్దప్పుడు శశికళ ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి రద్దైన నోట్లను అందజేసి రూ.1,674 కోట్ల ఆస్తులను కొన్నట్లు పేర్కొంది. ‘రుణం కింద రూ.240 కోట్ల పాత నోట్లిస్తాం. బదులుగా ఏడాది తర్వాత 6 శాతం వడ్డీ సహా కొత్త నోట్లను చెల్లించాలని డీల్ కుమారస్వామి అనే వ్యాపారితో శశికళ ఒప్పందం కుదుర్చుకుంది’ అని ఐటీశాఖ పేర్కొంది. -
కోడింగ్ పిడుగు జునైరా ఖాన్ గుర్తుందా?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లకే ప్రోగ్రామ్లు, కోడింగ్లు చేస్తూ అసాధారణ ప్రతిభాపాటవాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన జునైరా ఖాన్ గుర్తుందా. ఇపుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. హైదరాబాద్కి చెందిన జునైరాఖాన్ (12) ఇపుడు తన ఖాతాదారుల కోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ వర్ధమాన వ్యాపారవేత్తగా ప్రశంసలందుకుంటోంది. జెడ్ఎం ఇన్ఫోకామ్ అనే సొంత వెబ్సైట్ ద్వారా బీటెక్ విద్యార్థులకు శిక్షణనిస్తున్న జునైరా ఖాన్ తాజాగా మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టారు. టీం మేనేజ్మెంట్ కోసం కొత్త అప్లికేషన్ను సృష్టించానని అతి త్వరలోనే దీన్ని లాంచ్ చేయబోతున్ననని ప్రకటించారు. ఈ యాప్ ద్వారా సంస్థలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపబోతున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికే అనేక కంపెనీలకు బిజినెస్ యాప్లను రూపొందించిన జునైరా ఖాన్ సొంతంగా ఒక సంస్థను నడుపుతూ వుండటం విశేషం. ఇప్పటివరకు నేను నాలుగైదు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చాను. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, పీహెచ్పీ, జావాస్క్రిప్ట్లపై పనిచేస్తాను. ఇప్పటికే అనేక మొబైల్ యాప్లు, బిజినెస్ యాప్లు తయారు చేశాను. ప్రస్తుతం, ఒక ఎన్జీవో కోసం పని చేస్తున్నానని ఖాన్ చెప్పారు. అలాగే చిన్న వయసులోనే తాను కోడింగ్ నేర్చుకుంటానని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందనీ, ఒక తల్లిగా ఆమెకు నేర్పడం తన బాధ్యతగా భావించానని జునైరాఖాన్ తల్లి నిషాద్ ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా జునైరా తల్లి నిషాత్ఖాన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ డెవలపింగ్, ఆండ్రాయిడ్ ఆప్ తరగతులు చెప్తుండేవారు. అయితే అప్పటికే నాల్గవ తరగతి చదువుతున్న జునైరాఖాన్ తనకు కూడా కోడింగ్ నేర్పాలని పట్టుబట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన నిషాత్ కూతురి ఆసక్తిని ప్రోత్సహించారు. వెబ్ డెవలపింగ్, కోడింగ్ను నేర్పించారు. అంతే..ఇక వెనుదిరిగి చూడలేదు. దిన దిన ప్రవర్థమానం చెంది చిన్న వయసులోనే ఢిల్లీ పబ్లిక్ స్కూలు చేత డిజిటల్ అంబాసిడర్ అవార్డును గెల్చుకుంది. తన పేరుతోనే జునైరా వెబ్ సొల్యూషన్స్ అనే వెబ్సైట్ను ప్రారంభించి తన అసాధారణ ప్రతిభతో దూసుకుపోతోంది. మరోవైపు జునైరా దగ్గర శిక్షణ పొందుతున్న మహమ్మద్ అర్బాజ్ అలం స్పందిస్తూ ఆమెదగ్గర శిక్షణ పొందం నిజంగా తనకు ఎంతో సంతోషంగా ఉందనీ, తన కరీర్ అభివృద్దిలో ఇది మరింత సాయపడుతుందని నమ్ముతున్నానన్నారు. -
ఓ ‘మహర్షి’ ఔదార్యం
వాషింగ్టన్ : ఎల్కేజీకే రూ లక్షల్లో ఫీజులు చెల్లించి ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దిక్కులు చూస్తున్న క్రమంలో ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్లో విద్యార్ధుల రుణాలన్నీ చెల్లించేందుకు ఓ వ్యాపార దిగ్గజం ముందుకు రావడం అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 440 కోట్ల డాలర్ల సంపద కలిగిన ఆఫ్రికన్ -అమెరికన్ వాణిజ్యవేత్త రాబర్ట్ ఎఫ్ స్మిత్ అట్లాంటాలోని బ్లాక్ మోర్హౌస్ కాలేజ్లో కొత్తగా డిగ్రీ పట్టా అందుకున్న విద్యార్ధుల రుణం మొత్తం ( దాదాపు రూ 250 కోట్లు) తాను చెల్లిస్తానని చెప్పి విద్యార్ధులు, తల్లితండ్రుల మన్ననలు పొందారు. విద్యార్ధుల రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధిని సమకూరుస్తానని స్మిత్ 400 మంది గ్రాడ్యుయేట్లు, వారి తల్లితండ్రుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మీ విద్యార్ధుల రుణాన్ని మాఫీ చేసేలా తమ కుటుంబం నిధులు మంజూరు చేస్తుందని గ్రాడ్యుయేషన్ మీట్లో స్మిత్ పేర్కొన్నట్టు కాలేజ్ ట్విటర్ ఖాతా వెల్లడించింది. ఈ కాలేజ్ నుంచి స్మిత్ గౌరవ పట్టా పొందుతూ తన ఔదార్యం చాటారు. తనలాంటి ఎందరో బ్లాక్ అమెరికన్ల ఉన్నతికి తన సాయం భరోసా అందించాలనే సంకల్పమే ఈ ప్రకటనకు తనను పురిగొల్పిందని స్మిత్ చెప్పారు. -
చంద్రన్నా! నీకాలనీ ఎక్కడన్నా?
చిత్తూరు, తొట్టంబేడు : సాక్షాత్తు చంద్రబాబునాయుడు పేరిట ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ఎస్టీలకు నయానోభయానో ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న పారిశ్రామికవేత్తకు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పూర్తిగా సహకరిస్తున్నారు. సర్వేనంబరు 85లో ఓ క్వారీ పక్కన ఉన్న భూముల్లో 25 మంది రెవెన్యూ అధికారులు నివేశన పట్టాలు ఇవ్వడంతో 23 ఏళ్ల క్రితం కాలనీ నిర్మించారు. అయితే, అధికారులు సర్వే నంబర్ 85లో కాకుండా 82–5లో పక్కా గృహాలు నిర్మించారు. దీనికి ఓ క్వారీ యజమాని హస్తమూ ఉంది. అప్పట్లో ఎమ్మెల్యే సురాజ్, కలెక్టర్ నరసింగారావు ఆ ఇళ్లను ప్రారంభించారు. కొన్నేళ్లు అనివార్య కారణలతో క్వారీ పనులు ఆగడంతో పనులు లేక కొంతమంది ఎస్టీలు కాలనీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2014–15లో ఉపాధి కింద రూ.5 లక్షలతో సీసీ రోడ్డును నిర్మించారు. కాపురాలులేని ప్రాంతంలో ఎలా సిమెంట్ రోడ్డు వేయడంపై పత్రికల్లో కథనాలు రావడంతో సర్పంచ్ భర్త గంగాధరం తొట్టంబేడు పరిధిలోని కొందరు ఎస్టీలకు ఇళ్లు ఇస్తామంటూ ఇక్కడ కాలనీలో వారిని ఉంచారు. ఎస్టీలు కాపురాలు ఉండటంతో అధికారులు సిమెంట్ రోడ్డుకు బిల్లులు మంజూరు చేశారు. అప్పటికే కాలనీలో ఉన్న కుటుంబాలకు ఆధార్, రేషన్, టీడీపీ సభ్యత్వ, ఓటరు గుర్తింపు కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి నుంచి ఎస్టీలు కూలీల పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్నే మళ్లీ రెవెన్యూ అ«ధికారులు ఓ పారిశ్రామికవేత్త కుమారుడు మయూర్కు 2015లో వ్యవసాయ భూములుగా పట్టా మంజూరు చేసి రైతు పట్టాదారు పాసుపుస్తకాన్ని పంపిణీ చేశారు. 2018లో క్వారీకి చెందిన కాలనీ నుంచి వెళ్లిన ఎస్టీలు ఇన్నేళ్లుగా భూముల జోలికి రాని ఆ పారిశ్రామికవేత్త క్వారీ యజమానులలో ఓ భాగస్వామి టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు మృతి చెందడంతో భూములు తమవంటూ ఎస్టీలపై దాడులకు దిగుతున్నారు. ఎంజీఎం కాలనీ అంటూ ఇక్కడ ఉన్న ఇళ్లను తామే కట్టించామని ఆ పారిశ్రామికవేత్త హుంకరిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు కాలనీ ఏమైనట్లు? సాక్షాత్తు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడీ బెదిరింపులు వారికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఎస్టీలు కోరుతున్నారు. ఎస్టీలకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్ష తొట్టంబేడు : చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకైనా సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే సురాజ్ ప్రకటించారు. ఆదివారం ఆయన చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీని పరిశీలించారు. కాలనీ ఎస్టీలపై చేస్తున్న దాడులకు నిరసనగా రోడ్డుపై ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ, 95–96లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు అప్పట్లో తానే ఈ కాలనీని ఆయన పేరిట ప్రారంభించానని, దీనిని ఆక్రమించేందుకు కొందరు ఇప్పుడు యత్నిస్తుండటం దుర్మార్గమని నిరసించారు. ఆక్రమణదారుల దౌర్జన్యాలతో రోజుకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నా స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పీజేచంద్రయ్య శెట్టి, మండల వైఎస్సార్ సీపీ ఎస్టీ నాయకుడు వెంకీ, ఎస్టీ సంఘాల నాయకులు చందమామల కోటయ్య, సుద్దాల సుబ్రమణ్యం, ప్రజాసంఘాల నాయకులు కోగిల ధర్మయ్య, కత్తిధర్మయ్య, వీసీవెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రాణభయంతో ఉన్నాం రాత్రిళ్లు నిద్రరావడం లేదు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని హడలిపోతున్నాం. రాత్రిళ్లు ఎక్కడ జేసీలతో వచ్చి మా ఇళ్లను కూల్చేస్తారోననే భయంతో వీధుల్లో సిమెంట్ రోడ్డుపై పడుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి. –కృష్ణవేణి, స్థానికురాలు నిందితులను అరెస్ట్ చేయాలి చంద్రబాబునాయుడు ఎస్టీకాలనీ ఎస్టీలపై దాడులుచేసి దౌ ర్జన్యం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. వారం రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలే దు. లేకపతే ఆందోళన చేస్తాం. –చందమామల కోటయ్య,యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తొట్టంబేడు మండలం -
జీఈఎస్లో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ బుడతడు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదు హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్లో హమీష్ ఫిన్లేసన్ (13) అతిచిన్న పారిశ్రామిక వేత్తగా క్రెడిట్ దక్కించుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్ అతిచిన్న డెలిగేట్గా తన ప్రత్యేకతను చాటనున్నారు. గేమింగ్ అండ్ అవేర్నెస్పై తాను రూపొందించిన యాప్లను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్లను హమీష్ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించేందుకు గాను ఆరవ యాప్ను పనిచేసే పనిలో ఉన్నాడు. తాను భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని ఫిన్లేసన్ తెలిపారు. టెక్నాలజీ అంటే తనకు ఎనలేని ప్రేమ అని, యాప్లు..టెక్నాలజీ అదే ఫస్ట్ లవ్..అయినా చదువుమీద కూడా దృష్టి పెడుతున్నట్టు చెప్పాడు. స్కూలు హోం వర్క్ పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో మాత్రమే యాప్ల తయారీన పని చూసుకుంటానన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడని హమీష్ తండ్రి గ్రేమే చెప్పారు. దాదాపు 54దేశాలలో వినియోగ దారులను సంపాదించుకున్న హమీష్ జీఈఎస్- 2017 ద్వారా సముద్ర తాబేళ్ల, ఆటిజం ప్రభావం గురించి అవగాహన పెంచాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా భాగ్యనగరంలో మంగళవారంనుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్-2017మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ను ప్రారంభిస్తారు అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
ఆ అధ్యక్షుడి పేరుతో కేఫ్
ఢాకా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కేఫ్ ఏర్పాటయింది. సైఫుల్ ఇస్లాం అనే వ్యాపారవేత్తకు ట్రంప్ అంటే చచ్చేంత అభిమానం. ఈ అభిమానంతోనే ఆయన రాజధానిలో ట్రంప్ కేఫ్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వెంటనే ఓకే చేయలేదు. ఈ కేఫ్కు, అమెరికా అధ్యక్షుడుతో ఎలాంటి సంబంధం లేదని, తానే పూర్తి యజమానిని అని సైఫుల్ ఇస్లాం నిరూపించుకోవాల్సి వచ్చింది.ఇందులో స్పెషల్ ట్రంప్ కాక్టెయిల్ అనబడే గ్రీన్ ఆపిల్ మాక్టెయిల్తోపాటు ఇండియన్, చైనీస్, థాయ్ వంటకాలు ఉంటాయి. సైఫుల్ దగ్గరి బంధువు ఒకరు అమెరికాలో ట్రంప్ గ్రూప్కు చెందిన రెస్టారెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయనే తనకీ ఈ ఐడియా చెప్పారని సైఫుల్ తెలిపారు. స్వతహాగా ట్రంప్ అభిమానిని కావటంతో ఈ వెంచర్కు పూనుకున్నానని చెప్పారు. తనకు గానీ, తన హోటల్తోగానీ ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని సైఫుల్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చూసి అందరూ జోకర్గా భావిస్తుంటారని, కానీ తనకు మాత్రం ఆయనే స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ప్రారంభించిన ఎన్నో వ్యాపారాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని, అందుకే ఆయనంటే తనకెంతో ఇష్టమని సైఫుల్ తెలిపారు. ఈ రెస్టారెంట్ వద్ద ఏర్పుటు చేసిన ట్రంప్ భారీ కటౌట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. కేఫ్ వైఫై పాస్వర్డ్ కూడా ట్రంప్ కుటుంబసభ్యుల పేరిటే ఉందని సమాచారం. ఈ రెస్టారెంట్ రెండు నెలల క్రితమే ప్రారంభమైనప్పటికీ మరోసారి గ్రాండ్ ఓపెనింగ్ చేయించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త
మన దిగ్గజాలు అవిభక్త భారతదేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. నెలకొల్పిన పరిశ్రమలను లాభాల బాటలో నడిపించడం సరే, అనాచారాలతో కునారిల్లుతున్న సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్న సామాజిక బాధ్యతనూ గుర్తెరిగిన అసాధారణ వ్యక్తి ఆయన. స్వాతంత్య్రానికి ముందు దేశంలో టాటా, బిర్లాల తర్వాత మూడో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా నిలిచిన దాల్మియా గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జైదయాల్ దాల్మియా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలపై గల దార్శనికత, ఉన్నత ఆదర్శాలపై గల నిబద్ధత దాల్మియాను భారత పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలుపుతాయి. వ్యాపార నేపథ్యం జైదయాల్ దాల్మియా 1904 డిసెంబర్ 11న రాజస్థాన్లోని చిరావా గ్రామంలో జన్మించారు. కొంతకాలం ఆయన కుటుంబం కలకత్తాకు వలస వెళ్లడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తర్వాత తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. చిరావాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అప్పటికే జైదయాల్ అన్న రామకృష్ణ దాల్మియా పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉండేవారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక జైదయాల్ అన్నకు చేదోడుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించి, అన్న మనసు చూరగొన్నారు. జైదయాల్ను సంప్రదించనిదే రామకృష్ణ దాల్మియా కీలక నిర్ణయాలేవీ తీసుకునేవారు కాదు. దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలో జైదయాల్ తనదైన ముద్రవేశారు. తీపి ప్రారంభం దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం చక్కెర కర్మాగారాలతో మొదలైంది. నిర్మల్కుమార్ జైన్ అనే బీహారీ వ్యాపారితో కలసి 1932-33లో దాల్మియా సోదరులు సుగర్ మిల్లును ప్రారంభించారు. మరుసటి ఏడాదే మరో చక్కెర మిల్లును ప్రారంభించారు. బ్యాంకింగ్, బీమా రంగాలపై దృష్టి సారించి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, భారత్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల్లో ప్రధాన వాటాదారుగా ఎదిగారు. 1935లో రాజ్గంగపూర్లో తొలి సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్గా (డీబీసీఎల్) అవతరించింది. జైదయాల్ సారథ్యంలో దాల్మియా గ్రూప్ సిమెంటు కర్మాగారాల సంఖ్య అనతి కాలంలోనే ఆరుకు పెరిగింది. వీటిలో ఒకటి కరాచీలో ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సిమెంటు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా అప్పట్లో అవిభక్త భారత్లో సిమెంటు రంగంలో ఏసీసీ గుత్తాధిపత్యానికి తెరదించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు గల జైదయాల్, సిమెంటు కర్మాగారాల కోసం యూరోప్ నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. సిమెంటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా వెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా రౌర్కెలాలో 1954లో అగ్నిప్రమాదాలను తట్టుకునే ఇటుకలను తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో నిరుపయోగంగా మారిన వాహనాలను దిగుమతి చేసుకుని, తుక్కుగా మార్చి విక్రయించేందుకు అలెన్ బెర్రీ అడ్ కో కంపెనీని స్థాపించారు. పత్రికారంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, అందులోనూ అడుగుపెట్టారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ సంస్థ బెన్నెట్ కోల్మన్ అండ్ కో కంపెనీని కొనుగోలు చేశారు. స్వాతంత్య్రానంతరం జైదయాల్ దాల్మియా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించి, వాటి అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే దాల్మియా గ్రూపులో విభేదాల వల్ల సోదరులు విడిపోయారు జైదయాల్ వాటాకు రాజ్గంగపూర్, కరాచీ సిమెంటు కర్మాగారాలు వచ్చాయి. కరాచీ కర్మాగారాన్ని 1964లో అమ్మేసి, స్వదేశంలోని సంస్థల విస్తరణకు కృషి చేశారు. రచయిత, సంస్కరణాభిలాషి... పారిశ్రామికవేత్తల్లో చాలామంది రచనా వ్యాసంగం, సంఘ సంస్కరణలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. జైదయాల్ దాల్మియా మాత్రం అందుకు భిన్నంగా ఈ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బెంగాలీ వైష్ణవ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించడమే కాకుండా, ధర్మశాస్త్రం, అస్పృశ్యత, ప్రాచీన భారతంలో గోమాంసం వంటి పుస్తకాలను రాశారు. సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆయన రామకృష్ణ జైదయాల్ దాల్మియా శ్రీవాణీ అలంకరణ్ సంస్థను స్థాపించారు. సాంఘిక సంస్కరణలకు విశేషంగా కృషి చేశారు. వితంతువులకు, వికలాంగులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ జైదయాల్ దాల్మియా సేవా సంస్థాన్ పేరిట సేవాసంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ వంటి కార్యక్రమాలకు విశేషంగా కృషిచేశారు. చరమాంకంలో వ్యాపారరంగం నుంచి విరమించుకున్న తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కాలం సేవా కార్యక్రమాలకే అంకితమైన జైదయాల్ దాల్మియా 1993లో కన్నుమూశారు. - దండేల కృష్ణ -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ప్రతి ఒక్కరూ పరిశ్రమలు స్థాపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జేసీ–2 ఆర్.సాల్మన్రాజ్కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక పాత జిల్లా పరిషత్ జెడ్పీ సమావేశ మం దిరంలో శనివారం మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై చ ర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ అధిక ఉపాధికి బాటలు వేస్తున్న సర్వీసు రంగాలను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని తెలి పారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిశ్రమల సాధనకు అనుకూల ప్రాంతమన్నారు. కృష్ణపట్నం రేవు, చెన్నై–కల్కత్తా రైలు మార్గం సరుకుల రవాణాలో ఉపయోగపడుతుందన్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసిన ఎస్ఈజెడ్లు, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలశాఖ స హాయ సంచాలకులు ఎస్వీ సురేష్ మా ట్లాడుతూ జిల్లాలో ఉన్న మౌలిక వసతులకు అధనంగా ఖనిజ నిల్వలు, మానవ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు విరివి గా ఉన్నాయని తెలిపారు. రూ.1,719 కోట్లతో 42 భారీ పరిశ్రమలు నడుస్తున్నట్టు, మరో 33 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆయా శాఖల ప్రతినిధులు ప్రమోద్ కుమార్రెడ్డి, మోహన్బాబు, పి.కల్పన, కె.రమణ, ఇ.మహేశ్వరన్, ఎంఎస్ ప్రసాద్లు పాల్గొన్నారు. -
అక్షత్.. మరో అద్భుతం...!
న్యూఢిల్లీః ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన సరి బేసి వాహన విధానంతో 13 ఏళ్ళ వయసులోనే తన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన అక్షత్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నగరంలో సరి బేసితో ఇబ్బందులు పడుతున్న పౌరులను కష్టాలనుంచీ గట్టెక్కించేందుకు 'ఆడ్ ఈవెన్ డాట్ కామ్' పేరుతో ఓ వైబ్ సైట్ ను రూపొందించి అనూహ్యంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు కార్ పూలింగ్ యాప్ ఓరాహీతో కలసి... ఆ బాల మేధావి.. మరో కొత్త యాప్ ను సృష్టించాడు. అక్షత్.. 13 ఏళ్ళ వయసులోనే తన సృజనాత్మకతతో అందరికీ చేరువయ్యాడు. వాహనదారులు తన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే.. సరి బేసి సమయాల్లో దగ్గరలోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు సులభంగా చేరుకునే మార్గాన్ని ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కార్ పూలింగ్ విధానానికి బ్రేక్ వేయడం, అనంతరం తన వెబ్ సైట్ ను ఇతర సంస్థకు అమ్మేసిన అక్షత్.. ఇప్పుడు మరో యాప్ తో ప్రజల ముందుకొచ్చాడు. 15 ఏళ్ళ వయసున్న అక్షత్ మిట్టల్.. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందకు 'ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్' పేరున కొత్త వెంచర్ ను బుధవారం ఆవిష్కరించాడు. ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ను స్వాధీన పరచుకున్న గుర్గావ్ ఆధారిత సాంకేతిక, డొమైన్ నిపుణులు.. కార్ పూలింగ్ యాప్ 'ఓరాహీ' సలహా బోర్డు తో కలసి కొత్త యాప్ ను ప్రవేశ పెట్టాడు. దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్.. పని చేయనుంది. భారత్ లో సామాజిక మార్పుకోసం, ప్రజలకు సహాయం అందించే దిశగా తాను ఆలోచిస్తున్న సమయంలోనే తనను... ఆడ్ ఈవెన్ డాట్ కామ్... అశోకా యూత్ ఛేంజ్ మేకర్ గా ఎంపిక చేసిందని అక్షత్ తెలిపాడు. సమాజంలో మార్పును కోరుకునేవారు, అందుకు సహాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలసి, దాదాపు పదిలక్షలమంది సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రస్తుత మిషన్ పనిచేస్తుందని అక్షత్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే ప్రజలకు సహాయం అందించేందుకు ఛేంజ్ మై ఇండియా ప్రారంభించినట్లు అక్షత్ మిట్టల్ తెలిపాడు. -
ఇస్తారా.. చస్తారా?
ట్రస్టు మాటున మాజీమంత్రి ఆక్రమణలు రైతుల భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేశారంటూ పోలీసు కేసులు రైతులను భూముల్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ ఓ మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు రైతులను బెదిరించి వందలాది ఎకరాల భూములను లాక్కుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే సొంత భూముల్లోకి రైతులనే వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి/తిరుపతిరూరల్: ట్రస్టు పేరుతో రైతుల భూములు ఆక్రమించుకోవడం అధికారపార్టీ నేతలకు పరిపాటిగా మారింది. తవణంపల్లి మండలం దిగువమాఘంలో ఓ ట్రస్ట్ పేరుతో దాదాపు రెండు వందల ఎకరాల్లో విద్యాసంస్థల ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించారు. అందుకోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 180 ఎకరాలకు పైగా ఇప్పటికే స్వాధీనం చే సుకున్నారు. ఎదురుతిరిగినరైతులు మూడు నాలుగు తరాలుగా కుటుంబానికి ఆసరాగా ఉన్న భూములను ఇస్తే తమకు జీవనం పోతుందని కొందరు రైతులు ట్రస్ట్కు భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ట్రస్ట్ కొనుగోలుచేసిన భూముల మధ్యలో దాదాపు 20 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. తమకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తేనే భూమిని ఇస్తామని అన్నదాతలు ట్రస్ట్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. అమ్మని భూముల చుట్టూ ప్రహరీ చుట్టూ భూములను కొనుగోలుచేసిన ట్రస్ట్ నిర్వాహకులు దాదాపు 10 అడుగుల ఎత్తులో ప్రహరీని నిర్మిస్తున్నారు. తమకు భూములు ఉన్నాయని వాటిలోకి వెళ్లేందుకు దారి కూడా వదలకుండా గోడ కట్టడంతో రైతులు ఆందోళన చేశారు. మధ్యలో వస్తున్న కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించారని వాపోతున్నారు. అడ్డుకున్న వారిపై కేసులు తమ భూముల్లోకి వెళ్లకుండా కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించడంపై సదరు నేతలను రైతులు అడ్డుకున్నారు.కొందరు ప్రహరీ రాళ్లను తొలగించారు. దీంతో తమ భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, తమ ఆస్తులను నాశనం చేస్తున్నారని ట్రస్ట్ ప్రతినిధులు రైతులపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు. -
వంటకాలతో వందకోట్ల టర్నోవర్..
భోజన ప్రియులను విభిన్న రకాల వంటకాలతో ఆకట్టుకున్న ఓ వ్యాపారి ఏకంగా కోట్లకు పడగలెత్తాడు. చవులూరించే రుచులతో ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకునేందుకు కుక్ ప్యాడ్ వెబ్సైట్ ను స్థాపించి.. ఇప్పుడు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పే జపాన్ లో జపనీస్ పారిశ్రామికవేత్త అకిమిస్తు సానో.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రాంతీయ జపనీస్ ప్రత్యేక వంటకాలలు భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రిల్డ్ స్క్విడ్, పాన్ కేక్స్ తో పాటు... చీజ్ కేక్, పాస్తా, బోలోగ్ నీస్ వంటి 2.1 మిలియన్ల అన్యదేశ వంటకాలతో 58.8 మిలియన్ల వినియోగదారులతో 'కుక్ ప్యాడ్' కొనసాగుతోంది. జపనీయులు ఇంటి భోజనాన్ని ఆస్వాదించేందుకు రకరకాల రుచులను అందిస్తున్న కుక్ ప్యాడ్.. జపాన్ లో అత్యంత ఎక్కువమంది వీక్షించే వెబ్పైట్లలో 55వ స్థానంలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో ఈ సంస్థ పన్నెండు రెట్లు విస్తరించింది. ఇంచుమించుగా జపాన్ మహిళల్లో సుమారు ఇరవైనుంచి ముఫ్ఫై సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో సగంకంటే ఎక్కువ మంది కుక్ ప్యాడ్ ను సందర్శిస్తుంటారు. 1997 లో సానో స్థాపించిన ఈ కుక్ ప్యాడ్..ఎంతో ప్రజాదరణ పొంది 2009 నాటికి 80శాతం రెవెన్యూ పెంచుకుంది. గతేడాది 65 మిలియన్ డాలర్ల కు చేరిన రెవెన్యూ సుమారు 19 మిలియన్ డాలర్ల లాభాలను మిగుల్చుకుంది. గత నెల దీని షేర్లు కూడ 20 శాతం పెరిగి, కంపెనీలో సానో వాటాను 44శాతానికి పెంచడంతోపాటు... కంపెనీ మొత్తం విలువ వంద కోట్లకు చేరింది. అత్యంత అరుదుగా మీడియా ముందుకు వచ్చే 42ఏళ్ళ సానో... జపాన్ కీయో విశ్వవిద్యాలయంలో పట్టభద్రత పొంది కుక్ ప్యాడ్ లో పని ప్రారంభించాడు. 2012 లో అక్కడ సీఈవో పాత్రను వదిలిన సానో... ఆ తర్వాత ఆదాయ సముపార్జనపై దృష్టి సారించాడు. మనానో వెడ్డింగ్ పేరిట ఉన్న జపనీస్ వివాహ వేదిక రివ్యూ సైట్ ను, కుకుంబర్ టౌన్ అనే ఆమెరికాకు చెందిన ఓ ఆహార బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేసి, ఈ సంవత్సరంలో లెక్కలేనంత ఆదాయాన్ని చేజిక్కించుకున్నాడు. పూర్వం చదువు లేకుండానే వంట జ్ఞానాన్ని ఎలా పొందారో తెలియదుకానీ, ఇప్పటి వారు వంటలు చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదని, అయితే రుచికరమైన వంటకాలు కుటుంబాలను సమష్టిగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయని సానో గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సానో..అతని భార్య వారి కెంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఓ చిన్నపాటి పరిశ్రమలా కనిపించే సంప్రదాయ పాకశాలలో(వంటిల్లు) ప్రతిరోజూ విధిగా ఉద్యోగులకు స్వయంగా వండి పెడుతుంటారట. అంతేకాక సానో తనకు కావలసిన, సమీప బంధువులు వండిన వంటకాలనే భుజిస్తాడని కూడా అతని గురించి బాగా తెలిసినవారు చెప్తుంటారు. -
ఎంటర్ప్రెన్యూర్లుగా క్యాబ్ డ్రైవర్లు
- ఓలా క్యాబ్ లీజింగ్ ద్వారా అవకాశం న్యూఢిల్లీ: క్యాబ్ లీజింగ్ వ్యాపారం ద్వారా డ్రైవర్లు ఎంటర్ప్రెన్యూర్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నామని ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ ఓలా పేర్కొంది. దీని కోసం క్యాబ్ లీజింగ్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని ఓలా వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఈ క్యాబ్ లీజింగ్ వ్యాపార విభాగం ఓలాకు పూర్తి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని వివరించారు. క్యాబ్ లీజింగ్ వ్యాపార విస్తరణ కోసం ఏడాది కాలంలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ప్రారంభంలో రూ.500 కోట్లు పెట్టుబడులు పెడతామని, స్వతంత్రంగా నిధులు సమీకరిస్తామని వివరించారు. క్యాబ్ లీజింగ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లు రూ.35,000 కనీస ప్రారంభ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, నెలవారీ రూ.15,000 చొప్పున లీజ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత ఆ కారు డ్రైవర్లు తమ సొంతం చేసుకునే ఆప్షన్ కూడా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంతో వేలాది మంది డ్రైవర్లు దీర్ఘకాలంలో నిలకడైన ఆదాయం సాధిస్తూనే కార్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని, డ్రైవర్లు ఎంటర్ప్రెన్యూర్లుగా మారే అవకాశం ఇదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇంకా మూడు ఇతర నగరాల్లో వెయ్యికి పైగా కార్లు నడుస్తున్నాయని తెలిపింది. ఈ లీజింగ్ విధానంలో ఈ ఏడాది చివరికల్లా లక్ష కార్లను భాగంగా చేయాలని తమ లక్ష్యమని వివరించింది. కాగా ఈ క్యాబ్ లీజింగ్ వ్యాపార విభాగానికి లీజ్ప్లాన్ ఇండియా సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ రాహుల్ మరోలి వైస్ ప్రెసిడెంట్(స్ట్రాటజిక్ సప్లై ఇనీషియేటివ్స్)గా పనిచేస్తారని వివరించారు. -
బ్యాంకు దోపిడీకి యత్నం
- కిటికీ గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దుండగులు - స్ట్రాంగ్రూం తాళాలు తెరుస్తుండగా మోగిన సైరన్ - సీసీ కెమెరా, డీవీడీ, మోడెమ్తీసుకుని పరార్ పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఓ ముఠా శుక్రవారం అర్ధరాత్రి యత్నించింది. లోనికి ప్రవేశించాక స్ట్రాంగ్రూమ్ తాళాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అంతకుముందు ఇదే గ్రామంలోని ఓ పారిశ్రామికవేత్త ఇంటి వద్ద కూడా వీరు చోరీకి ప్రయత్నించినట్టు తెలిసింది. మొత్తం మీద ఆరితేరిన దొంగలే ఈ దోపిడిలో పాల్గొని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలమాసనపల్లె గ్రామం లో జనావాసాలకు దూరంగా గ్రామీణ బ్యాంకు ఉంది. గతంలో ఎప్పుడూ ఇక్కడ చోరీలు జరిగిన సందర్భాలు లేవు. కానీ బ్యాంకులో సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేశారు. ఈ ధైర్యంతో అక్కడ వాచ్మన్ను పెట్టడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఇదే దొంగలకు అనుకూలంగా మారింది. శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దొంగల ముఠా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకు కిటికీని తెరచి అందులోని రెండు ఇనుప గ్రిల్స్ను ఆక్సాబ్లేడ్, లేదా ఎలక్ట్రానిక్ కటింగ్ మెషీన్ సాయంతో కట్ చేశారు. కట్ చేస్తున్నప్పుడు శబ్దం రాకుండా ఉండేందుకు నీరు పోస్తూ గ్రిల్స్ తొలగించారు. ఆ కిటికీ గుండా లోనికి ప్రవేశించి తొలుత సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అయితే సైరన్కు సంబంధించిన వైర్లు కనిపించపోవడంతో వాటిని కత్తిరించడం మరిచారు. బ్యాంకులోని అన్ని డ్రాలను ఓపెన్చేసి స్ట్రాంగ్రూమ్ తాళాలకోసం వెతికారు. ఎక్కడా లేకపోవడంతో స్ట్రాంగ్రూమ్ తాళాలను తీసేందుకు స్క్రూడ్రైవర్ ద్వారా ప్రయత్నించారు. దీంతో సైరన్ మోగడం ప్రారంభించింది. వెంటనే దొంగలు కిటికీ గుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న వాహనంలో పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేయితిరిగిన ముఠాపనేనా! దోపిడీకి యత్నించిన తీరును బట్టి చూస్తే ఈ ముఠాలో కనీసం నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు బ్యాంకులోకి వెళ్లిన తీరు, లోన సీసీ కెమెరాల వెర్లను తొలగించడం, వీడియో ఫుటేజీ కనిపించకుండా మోడెమ్ను తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే ఇది చేయితిరిగిన ముఠా పనేనని తెలుస్తోంది. వీరుముందే ఇక్కడ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. బ్యాంకు వద్దకు వెళ్లకముందే వీరు గ్రామ సమీపంలోని ఓ మహిళా పారిశ్రామిక వేత్త ఇంటి తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ వాచ్మన్ ఉండడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అర్థమవుతోంది. బ్యాంకులో అలారం మోగినపుడు సరిగ్గా సమయం 12.48గా నమోదై ఉంది. అంటే వీరు అర్ధరాత్రి 12నుంచే ఈ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో కొలమాసనపల్లె గ్రామం ఉలిక్కిపడింది. సంఘటన స్థలాన్నిసందర్శించిన నిపుణులు.. బ్యాంకు వద్ద అలారం మోగిన కాసేపటికే కొందరు స్థానికులు జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరోవైపు పలమనేరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గంగవరం సీఐ రవికుమార్, డీఎస్పీ శంకర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం చిత్తూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్స్క్వాడ్లు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసుజాగిలాలు బ్యాంకు నుంచి పలమనేరు రోడ్డు మీదుగా గొల్లపల్లె వరకు వెళ్లిఆగాయి. ఇప్పటికే ఈ కేసును ఛేదిం చేందుకు సర్కిల్ ఐడీ పార్టీ రంగంలోకి దిగిం ది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పలమనేరు ఇన్చార్జ్ సీఐ రవికుమార్ తెలిపారు. -
మహిళలుమహారాణులు
అనురాగం, అనుబంధం, ఆత్మీయతల కలబోత ఆమె. అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం. తల్లిగా, చెల్లిగా, సహధర్మచారిణిగా మహిళ పోషించే ప్రతి పాత్ర అద్వితీయం.. అద్భుతం. భేషజాలకు తావులేని మమకారం, కష్టసుఖాలకుఒకే రకంగా స్పందించే స్థితప్రజ్ఞత స్త్రీమూర్తికి మాత్రమే సొంతమైన ఆభరణం. పురుషులతో సమానంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఇల్లాలు సహనం, ఓర్పుతో అన్నింటా విజయదుందుభి మోగిస్తోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే..’ అన్నట్టు చదువులోనూ సత్తా చాటుతోంది. ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగానూ కీలక పదవులు అధిరోహించి మహిళ అంటే మహారాణి అనే స్థాయికి చేరింది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న నారీలోకంలో కొందరిని ‘సాక్షి’ పరిచయం చేస్తోంది. అంకితభావంతోనే విజయం పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్న బోడేపూడి సుధారాణి తండ్రి జాతీయ బ్యాంక్లో చిరుద్యోగి. 18 ఏళ్ల వయసులో ఆమె వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు ‘ఆడపిల్లవి నీకెందుకు’ అంటూ చాలామంది నిరుత్సాహ పరిచారు. పట్టుదలతో ఒకే యంత్రంతో విజయవాడలో సాయిసుధా పైప్స్ ఇండస్ట్రీ స్థాపించారు. రైతులకు అవసరమైన ఎల్డీపీ పైపులు తయారుచేసే ఈ పరిశ్రమ ఇప్పుడు విశాఖపట్నం, హైదరాబాద్కు విస్తరించి వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2004లో ఆదర్శ మహిళా రత్న అవార్డు పొందిన సుధారాణి 2006లో తక్కువ ధరకే రైతులకు పైపులను అందిస్తున్నందుకు అప్పటి తమిళనాడు గవర్నర్ పి.ఎస్.రామమోహనరావు చేతుల మీదుగా ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఉత్తమ వ్యాపార వేత్త అవార్డు అందుకున్నారు. వ్యాపారంలో విజయాలు సాధించినందుకు 2013లో విజయవాడలో చాంబర్ అఫ్ కామర్స్ అందించే స్వర్ణకంకణాన్ని సొంతం చేసుకున్నారు. 2014లో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు నుంచి ఆదర్శ సేవా రత్న అవార్డు అందుకున్నారు. తన విజయానికి తన తల్లిదండ్రులు సుశీలాదేవి, శివరామయ్య, భర్త మురళీకృష్ణ సహకారమే కారణమని సుధారాణి పేర్కొంటున్నారు. మహిళలకైనా, పురుషులకైనా ఏదైనా ఒక లక్ష్యం, దానిని సాధించాలన్న తపన ఉంటే విజయం కచ్చితంగా వరిస్తుందని సూచిస్తున్నారు. - వ్యాపార వేత్త బోడేపూడి సుధారాణి మాతాశిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని యడ్లపాడు. ఆర్ఎంపీగా పనిచేసే తన పెద్దనాన్నను చూసి తానూ డాక్టర్ కావాలని ఆమె నిర్ణయించుకున్నారు. చదువులో రాణించి 1977లో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లో చేరారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రకాశం జిల్లాలో కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత గుంటూరు జిల్లాలో అనేక ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహిం చారు. ఆమె భర్త కూడా డాక్టర్ కావడంతో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా ఉన్న సమయంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. విధి నిర్వహణలో ఇబ్బందులు సహజమని, వాటిని చూసి బెదిరిపోకుండా సమర్థంగా వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుందని నాగమల్లేశ్వరి అంటున్నారు. జిల్లాలో మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ వందశాతం పూర్తి చేయడం, మాతాశిశు మరణాల రేటును తగ్గించడం తన లక్ష్యాలని వివరించారు. నేటి ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయ రంగంలోనే మహిళల పాత్ర ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా నిలుస్తున్నారు. గృహిణిగా కుటుంబ భారాన్ని మోస్తూనే ఇటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో రాణించి సత్తా చాటుతున్నారు. జెడ్పీ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేలుగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా జిల్లాలో ఎందరో మహిళలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అనేక మంది పలు రకాల ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. - సాక్షి, విజయవాడ/విజయవాడ కల్చరల్/ గాంధీనగర్/లబ్బీపేట/ భవానీపురం/విజయవాడ స్పోర్ట్స కూతురి కోసం.. ఒక్కగానొక్క కుమార్తెగా పుట్టింట్లో అల్లారుముద్దుగా పెరిగింది. తల్లిదండ్రులు ఉన్నంతలో ఘనంగా ఆమె వివాహం చేశారు. భార్యాభర్తలు అన్యోన్యతకు గుర్తుగా కుమార్తె జన్మించింది. సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో పెద్దకుదుపు. తాగుడికి బానిసైన అర్ధంతరంగా జీవితం చాలించాడు. ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలముకున్నాయి. అయితే కుమార్తెను చదివిస్తేనే ఆ చీకట్లు తొలగుతాయని భావించింది. ఎన్నడూ కష్టపడని ఆమె రిక్షాను నమ్ముకుంది... ఇదీ కైకలూరుకు చెందిన బేత వరలక్ష్మి ఉరఫ్ రిక్షా లక్ష్మి కథ... కైకలూరుకు చెందిన అప్పారావు, కుమారి దంపతుల ఏకైక సంతానం వరలక్ష్మి. ఆమెకు కృష్ణతో వివాహమైంది. వారి కుమార్తె జగదీశ్వరి. కూలిపనులు చేసే కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఎంత చెప్పినా వినలేదు. మూడేళ్ల కిత్రం కిడ్నీలు దెబ్బతిని మృతి చెందాడు. దీంతో వరలక్ష్మి జీవి తంలో చీకట్లు అలముకున్నాయి. కుమార్తెను చదివించాలన్న నిర్ణయంతో రిక్షాను నమ్ముకుంది. ఆ రిక్షాపై రోజూ సమీప గ్రామాల్లో ఉదయం ముగ్గు విక్రయిస్తోంది. ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా కిరాయికి అదే రాక్షాపై వివిధ రకాల సామగ్రిని తరలి స్తుంది. అలా వచ్చే సంపాదనతో కూతురిని 8వ తరగతి చదివిస్తోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే రూ.150 రావడమే కష్టం. ఇంటికి నెలకు రూ.700 అద్దె చెల్లించాలి. ఒక్కొక్క సారి రిక్షాలో బరువు ఎక్కువైనప్పుడు శక్తినంతా కూడదీసుకోక తప్పదు. నా బిడ్డను చదివించుకోవాలంటే ఈ కష్టాన్ని భరించాల్సిందేనని చమర్చిన కళ్లతో లక్ష్మి పేర్కొంటోంది. - కైకలూరు నారీ భేరి బాలిక పుడితే తల్లిదండ్రులు బాధపడేవారు.. ఆడపిల్లకి చదువు ఎందుకంటూ వంటింటికే పరిమితం చేసేవారు. ఇదంతా గతం.. తరం మారుతోంది.. స్వరమూ మారుతోంది.. విద్య, ఉద్యోగం, వ్యా పారం రంగమేదైనా బాణంలా దూసుకెళ్తూ విజ యాలు సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలను స్థాపిస్తున్నారు. ఇంటితోపాటు పనిచేసే కార్యాలయాల్లోనూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చట్టాలు కాదు.. మార్పు రావాలి ఏటా మహిళా దినోత్సవాలు జరుపుకోవడంవల్ల ప్రయోజనం లేదు. దాని ప్రధాన ఉద్దేశం నెరవేరడం లేదు. చట్టాలవల్ల ఉపయోగంలేదు. ప్రజల్లో, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. నిర్భయ చట్టం వచ్చిన తరువాత మహిళలపై దాడులు మరిన్ని పెరిగాయి. వెలుగుచూసే కేసులకంటే చూడనివే ఎక్కువ. చట్టాల అమలులో ప్రభుత్వాల వైఫల్యమే కారణం. మహిళలు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా భద్రత లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. బాలురకు ఇంటిదగ్గర తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు నైతిక విలువలు బోధించాలి. పోలీసులు రాజకీయాలకు ప్రభావితం కాకుండా, కేసులను పక్కదారి పట్టించకుండా, సరిగా దర్యాప్తు చేస్తే కొన్ని నేరాలైనా తగ్గించవచ్చు. చార్జిషీట్ దాఖలులో జాప్యం చేస్తే కేసు నీరుగారుతుంది. పోలీసులు, కోర్టులు సమష్టిగా వ్యవహరిస్తే మహిళలకు మేలు జరుగుతుంది. - డి.లక్ష్మి, రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి ‘మహిళా సాధికారతను జరగనిద్దాం’ అన్న ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదంతో ముందుకు వెళ్లాలి. అంటే ఇప్పటి వరకు కొన్ని అవాంతరాలు ఉన్నట్టే కదా. వాటిని అధిగమించడమే లక్ష్యంగా పని చేయాలన్నది మా ఉద్దేశం. ఏ స్థాయిలో పని చేస్తున్నా తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం, తద్వారా ఆత్మగౌరవాన్ని పొందగలగడం ప్రధానం. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత సాధించినప్పుడే మహిళలు ముందుకు వెళ్లగలరు. గతంలోకంటే రాజకీయ సాధికారత పెరిగింది. ఆర్థికంగానూ మహిళల్లో స్వావలంబన పెరిగింది. అయితే సామాజికపరంగా సాధికారిత సాధించలేకపోయాం. అవగాహన రాహిత్యంవల్ల అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకర్షణలకు లోనవడం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావంతో బాలికల్లో ఆలోచనా ధోరణి పెడదారిపడుతోంది. - కె.కృష్ణకుమారి, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ శక్తిగా ఎదిగినప్పుడే సాధికారత సమాజంలో మహిళలు ఒక శక్తిగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. గతం కంటే మహిళల స్థితిగతులు మెరుగుపడ్డాయి. నిత్య జీవితంలో మహిళలకు అవసరమైన ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఆభరణాల తయారీ వంటి అనేక కోర్సుల్లో ఉచితంగా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందగులుగుతున్నారు. శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికెట్తో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సొంత కాళ్లపై నిలబడగులుగుతన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్పై 2007 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాం. శ్రీస్ పేరుతో భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు విశేష స్పందన లభిస్తోంది. 200 మంది మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్లో, ఆభరణాల తయారీలో శిక్షణ తీసుకుంటున్నారు. పద్మశ్రీ నాదెళ్ల, డెరైక్టర్, సెల్ఫ్ రూరల్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్(శ్రీస్) మహిళలను గౌరవించాలి మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నది నానుడి. నేడు మహిళ తన కాళ్లపై తాను నిలబడుతున్నా హక్కుల కోసం పోరాడాల్సి రావడం విచారకరం. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా మహిళ బయటకు వెళ్లిన రోజు పూర్తి స్వతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారని విన్నాం. అయితే రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దురదృష్టకరం. బాలురకు చిన్నప్పటి నుంచే మానవతా విలువలను తెలపాలి. మహిళలతో గౌరవంగా మెలగాలని తల్లిదండ్రులు హితవుచెప్పాలి. మహిళ సమాజంలో భాగం అయితే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. తరాలు మారుతున్నా మహిళల స్థితిగతుల్లో మార్పు రావడంలేదు. - గద్దె అనూరాధ, జెడ్పీ చైర్పర్సన్ -
గాజుల గలగల
మీరే పారిశ్రామికవేత్త ‘బంగారు గాజులు, బ్లాక్ మెటల్ గాజులు, రబ్బరు గాజులు, మట్టి గాజులు, లక్కగాజులు... ఎన్నో. కొంచెం కళాహృదయం ఉండాలే కానీ గాజులకే హారాలు అలంకరించవచ్చు. కళాపోషకులైన మహిళల మదిని ఇట్టే దోచేయవచ్చు. ఆ పని మాత్రం ఇంత వరకు మగవాళ్ల చేతిలోనే ఉండిపోయింది. కానీ మీరు తలుచుకుంటే మీ ఇంట్లోనే లక్క గాజుల తయారీ పరిశ్రమ పెట్టొచ్చు. ఏమేం కావాలి: సాధారణంగా పరిశ్రమల స్థాపనకు యంత్రసామగ్రి వంటి మౌలిక వసతులు అవసరం. లక్క గాజుల పరిశ్రమకు ప్లక్కర్, కట్టర్ వంటి చిన్న సాధనాలు, ఇంట్లో ఉపయోగించే పాత్రలు ఐదారు, గాజులు ఆరబెట్టడానికి స్టాండులు, నలుగురు మహిళలు కూర్చోవడానికి వీలుగా ఉండే చిన్న గది చాలు. ముడి సరుకు: అల్యూమినియం రింగులు, లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు, వెల్కమ్ పౌడర్, స్టోన్స్, కుందన్స్, చమ్కీలు, చైనులు, రంగులు అవసరం.రెండు నెలలపాటు గాజులు చేయాలంటే కనీసంగా కొంత ముడిసరుకుని సిద్ధం చేసుకోవాలి. ఎంతెంత పరిమాణంలో ఉండాలో, ఎంతెంత ధరల్లో దొరుకుతాయో చూద్దాం. వెల్కమ్ పౌడర్ - 25 కిలోలు (కిలో రూ.400) లెపాక్స్ ఆర్ - 2 కిలోలు (కిలో 350-400) లెపాక్స్ ఎక్స్ - 2 కిలోలు (కిలో 350-400) ఐదారు రంగులు (యాభై గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు) స్టోన్స్ - మూడు నాలుగు సైజులైనా తీసుకోవాలి. వాటిలో పదిరంగులుండేలా చూసుకోవాలి. ఒక్కొక్క రంగులో వంద గ్రాముల స్టోన్స్ తీసుకోవచ్చు. ధర స్టోన్ క్వాలిటీని బట్టి వందగ్రాముల ప్యాకెట్ 80 నుంచి 700 రూపాయలుంటుంది. చమ్కీలు - ఇవి కూడా పది రంగుల్లోవి తీసుకోవాలి. వంద గ్రాముల చమ్కీల ధర 50 రూపాయలుంటుంది. చైన్స్ - గోల్డ్ కలర్, సిల్వర్ కలర్తోపాటు ఇతర రంగులలో కూడా ఉంటాయి. వీటిని కిలోల చొప్పున కొనాలి. కిలో రూ. 200 ఉంటుంది. ఒక్కో రంగు చైన్ ఒక్కో కిలో చొప్పున తీసుకోవచ్చు. గాజుల తయారీలో చైన్లు తప్పనిసరి కాదు. గాజులు మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసమే. అల్యూమినియం రింగులు - సైజుల వారీగా ఒక్కొక్క సెట్. ఒక సెట్కి 60- 70 రింగులుంటాయి. ఒక రింగు రెండు నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది. ఈ రింగుల సైజ్ గాజుల సైజుల్లాగే 2.4, 2.6, 2.8 అనే మూడు సైజుల్లో ఉంటాయి. ఎంత ఖర్చవుతుంది: యాభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చుతో పరిశ్రమ ప్రారంభించవచ్చు. ఈ పరిశ్రమకు కరెంటు, నిర్వహణ ఖర్చులు ఉండవు. ఈ రసాయనాలు చర్మానికిగానీ, కళ్లకుగానీ ఎలాంటి ఇబ్బందిని కలిగించవు. శిక్షణ ఎలా?: రెండు నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ముడి సరుకు ఎక్కడ దొరుకుతుంది, అమ్మకం కేంద్రాలు, సెట్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వంటివన్నీ శిక్షణలో తెలుస్తాయి. శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. ‘ఎలీప్’ సౌజన్యంతో... తయారీ ఇలా! లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాలు బంకలాగ జిగురుగా ఉంటాయి. ఈ రెండింటినీ (వేటికవి విడిగా) వెల్కమ్ పౌడర్లో కలపాలి. కిలో లెపాక్స్కి నాలుగు కిలోల వెల్కమ్ పౌడర్ కావాల్సి ఉంటుంది. వీటిని చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను (వెల్కమ్ పౌడర్లో కలిపిన లెపాక్స్ ఎక్స్, లెపాక్స్ ఆర్) కలిపి అల్యూమినియం రింగుకు అతికిస్తే గాజు తయారవుతుంది. వెంటనే (లక్క ఆరి గట్టిపడే లోపు) గాజు మీద కావల్సిన డిజైన్లలో రాళ్లు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికించుకోవాలి. ఇరవై నిమిషాలకు జిగురు కొంత వరకు ఆరిపోతుంది. ఆ తర్వాత కుందన్స్ వంటివి అతికించే ప్రయత్నం చేస్తే అతుకుతాయిగానీ గాజు ఆకారం చెడిపోతుంది. అందుకే పది, పదిహేను నిమిషాల లోపే పని పూర్తి చేయాలి. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండుకు తగిలించి ఆరు గంటల సేపు ఆరనివ్వాలి. లక్క గట్టి పడి రాయిలా మారుతుంది. ఇక ఆ గాజు పగలదు, విరగదు. 2009 నుంచి యూనిట్ నిర్వహిస్తున్నాను, ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తున్నాను. - ఎస్.ఎమ్.జబీన్, నంద్యాల ఫోన్: 9492943006 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
నకిలీ మావోయిస్టు అరెస్టు
‘పుట్టగుంట’కు బెదిరింపు కాల్స్ కేసులో వీడిన మిస్టరీ నిందితుడు కరీంనగర్ జిల్లా వాసి నూజివీడు డీఎస్పీ సీతారామస్వామి వెల్లడి హనుమాన్జంక్షన్ : పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ను సొమ్ము డిమాండ్ చేసిన నకిలీ మావోయిస్టును హనుమాన్జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన నిందితుడు పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని ఈ సందర్భంగా మీడియాకు చూపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీష్కుమార్కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలంటూ ఫోన్కాల్స్ చేసిన వ్యక్తి రెండు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీష్కుమార్ ఈనెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మావోల కదలికలు, ప్రభావం అధికంగా ఉండే కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. నిందితుడి ఫోన్కాల్స్ జాబితా, అతడు ఇచ్చిన బ్యాంక్ అకౌంటు నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. నిందితుడు తెలిపిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో అకౌంటు అక్కడి రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండటంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన అకౌంటు నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు. శ్రీనివాసరెడ్డి తాను ఉపయోగించే సిమ్కార్డు, బ్యాంకు అకౌంట్లు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు అకౌంటు నంబర్లను తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్ల కోసం వాడుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో కరీంనగర్ పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రీయాశీలకంగా వ్యవహరించిన సీఐ వై.వి.రమణ, ఎస్సై నాగేంద్రకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్. శివాజీ గణేష్, కె.పెద్దిరాజులు, కానిస్టేబుళ్లు బి.వి.రామతులసీరావు, ఎ.హరిబాబులను ఆయన అభినందించారు. కేసును త్వరగా ఛేదించేందుకు కృషి చేసిన ఎస్పీ, దర్యాప్తు బృందానికి ‘పుట్టగుంట’ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈజీ మనీ కోసం అడ్డదారిలో.. శ్రీనివాసరెడ్డిపై ఇప్పటి వరకు పదికిపైగా ఈ తరహా కేసులు నమోదైనట్లు డీఎస్పీ సీతారామస్వామి చెప్పారు. అతడి స్వస్థలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో దాన్ని ఆసరా చేసుకుని ధనికులకు ఫోన్లు చేసి మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేసేవాడని తెలిపారు. రాష్ట్రవాప్తంగా చాలామంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇతడి చేతిలో మోసపోయారని తేలిందన్నారు. శ్రీనివాసరెడ్డి 2011లో వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేశాడన్నారు. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడన్నారు. జమ్మికుంటలో దూరవిద్యా కేంద్రం ఏర్పాటు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నాడన్నారు. దీంతో ఈజీ మనీకోసం మావోల పేరుతో తొలుత పరిసర గ్రామాల రాజకీయ నాయకులను బెదిరించాడన్నారు. క్రమంగా ఇంటర్నెట్ సహాయంతో ఇతర ప్రాంతాల వారి ఫోన్ నంబర్లు కూడా సేకరించి మావోయిస్టు పేరుతో చందాలు వసూలు చేశాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకుల యాజమానుల ఫోన్నంబర్లను నెట్లో సేకరించి వారిని ఫోన్ చేసి బెదిరించేవాడని డీఎస్పీ తెలిపారు. ఈక్రమంలోనే పుట్టగుం టకు ఫోన్కాల్స్ చేశాడని పేర్కొన్నారు. వీణవంక పోలీస్స్టేషన్లో అతడిపై రౌడీషీట్ ఉందన్నారు. జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఎనిమిది, హన్మకొండ స్టేషన్లో ఒక కేసు ఇతనిపై ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. మూడెకరాల ఆసామి అయిన శ్రీనివాసరెడ్డికి అక్కడి పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు జంక్షన్ పోలీసులు గుర్తించి నివ్వెరపోయారు. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
హనుమాన్జంక్షన్(కృష్ణాజిల్లా): విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీశ్కుమార్ను మావో అగ్రనేత గణపతి పేరుతో బెదిరింపులకు పాల్పడిన నకిలీ మావోయిస్టును హనుమాన్జంక్షన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ జె.సీతారామస్వామి వివరాలు వెల్లడించారు. వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి(31)ని మీడియాకు చూపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాలు.. మావోయిస్టు అగ్రనేత గణపతి పేరుతో సతీశ్కుమార్కు ఇటీవల వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీ ప్లీనరీ కోసం చందాలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి రెండు బ్యాంక్ ఖాతా నంబర్లు ఇచ్చాడు. దీనిపై సతీశ్కుమార్ ఈనెల 22న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వై.వి.రమణ, ఎస్సై ఐ.వి.నాగేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని జమ్మికుంట, వీణవంక ప్రాంతాల నుంచి ఫోన్కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి సీఐ నేతృత్వంలో పోలీసు బృందం జమ్మికుంటకు చేరుకుంది. నిందితుడి ఫోన్కాల్స్ జాబితా, బ్యాంక్ ఖాతా నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. జమ్మికుంట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్లో అకౌంటు రిటైర్డ్ పోస్టుమాస్టర్ పేరిట ఉండడంతో జంక్షన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కనపర్తికి చెందిన శ్రీనివాసరెడ్డి కొన్నిరోజుల కిందట తన ఖాతా నంబరు అడిగితే ఇచ్చినట్లు రిటైర్డ్ పొస్టుమాస్టర్ తెలిపాడు. శ్రీనివాసరెడ్డి ఉపయోగించే సిమ్కార్డు, బ్యాంకు ఖాతాలు తన పేరిట లేకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహితులు, బంధువులు డబ్బులు పంపుతారని చెప్పి ఇరుగుపొరుగు వాళ్ల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని ఈ తరహా బెదిరింపు వసూళ్లకు వాడుకుంటున్నట్లు విచారణలో తేలింది. జిల్లా పోలీసుల సహకారంతో శ్రీనివాసరెడ్డిని జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
‘పుట్టగుంట’ కేసు దర్యాప్తు వేగవంతం
హనుమాన్జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్కుమార్కు మావోయిస్ట్ పార్టీ నేతల పేరుతో వస్తున్న బెదిరింపు ఫోన్కాల్స్పై పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. మావోయిస్టు నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, అతను ఇచ్చిన బ్యాంకు అకౌంట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాల్డేటాను సేకరించిన పోలీసులకు వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నట్లు నిర్ధారణ కావటంతో ఇప్పటికే ఒక టీంను అక్కడకు పంపారు. ఈ కేసుపై అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి పెరగటంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పార్టీ ఫ్లీనరీ కోసం విరాళం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ నేతల నుంచి నాలుగైదు రోజులుగా వస్తున్న బెదిరింపు ఫోన్కాల్స్ పరంపర సోమవారం కూడా కొనసాగింది. ఫలించని పోలీసు వ్యూహం... మావోయిస్టు పార్టీ నేత గణపతి పేరుతో ఫోన్కాల్స్ చేస్తున్న వ్యక్తి డబ్బులు జమ చేసేందుకు పుట్టగుంట సతీష్కుమార్కు రెండు బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చాడు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు సోమవారం పోలీసులు వేసిన వ్యూహం విఫలమైంది. వరంగల్కు 50 కి.మీ దూరంలో జమ్మిగుంట పట్టణానికి చెందిన ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ను మావోయిస్టులు ఇవ్వటంతో దానిపై నిఘా పెట్టారు. ఆ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కాశీ విశ్వేశ్వరరెడ్డి, జమ్మిగుంట సీఐతో హనుమాన్జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్.ఐ నాగేంద్రకుమార్ మాట్లాడారు. మావోయిస్టు బెదిరింపు ఫోన్కాల్స్ కేసు వివరాలను పూర్తిగా వారికి వివరించి నిందితులను రెడ్హ్యండెడ్గా పట్టుకునేందుకు ప్రణాళిక రచించారు. మావోయిస్టులు తెలిపిన బ్యాంకు అకౌంట్ జమ్మిగుంటకు సమీపంలోకి కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతి నర్సయ్య పేరిట ఉందని విచారణలో వెల్లడైంది. ఏటీయం సదుపాయం లేకపోవటంతో ఖచ్చితంగా బ్యాంకుకు వచ్చి నగదు డ్రా చేసుకుని వెళ్లాల్సిందేనని మేనేజర్ వెల్లడించారు. దీంతో వ్యూహం ప్రకారం ముందస్తుగా బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులను నిఘా పెట్టించి మావోయిస్టు నేతకు పుట్టగుంటతో ఆంధ్రాబ్యాంకు అకౌంట్లో తొలి విడతగా రూ.20 వేలు నగదు జమ చేసినట్లుగా ఫోన్ చేయించారు. ఈ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్దకు వస్తే నిందితుడు తమ చేతికి చిక్కినట్లేననే పోలీసులు భావించారు. కానీ బ్యాంకు వద్ద జమ్మిగుంట పోలీసులు రోజంతా పడిగాపులు పడినా ఆ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసేందుకు ఎవరూ రాకపోవటంతో నిరాశ చెందారు. సదరు బ్యాంకులో ఖాతా తెరిచేందుకు తెల్పిన ఆడ్రస్సు, పాస్పోర్టు సైజు ఫొటో ఆధారంగా చేసుకుని నిందితుని ఆచూకీకోసం ఆరా తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని హనుమాన్జంక్షన్ సీఐ వై.వి.రమణ తెలిపారు. -
‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్కాల్స్
హనుమాన్జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కుమార్కు మావోయిస్టు పార్టీ నేతల పేరుతో బెదిరింపు ఫోన్కాల్స్ రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా వరుస ఫోన్కాల్స్ రావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి పార్టీకి ప్లీనరీ నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కూడా కాల్ వచ్చింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై జంక్షన్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సతీష్ ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ నంబరుపై నిఘా పెట్టారు. నిజంగా మావోయిస్టులు చేస్తున్నారా? లేక వారి పేరుతో డబ్బు వసూలు కోసం ఇతరులెవరైనా యత్నిస్తున్నారా ? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్డేటాను పోలీసులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నట్లు సదరు వ్యక్తి తొలుత పుట్టగుంటకు ఫోన్లో చెప్పాడు. కాల్డేటాను పరిశీలిస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసినట్లు వెల్లడైంది. ఏఎస్సై నేతృత్వంలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం వరంగల్ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది. నకిలీ ఆధారాలతో బ్యాంకు ఖాతా.. పుట్టగుంట సతీష్కుమార్కు మావోయిస్టు నేత గణపతి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని ఐ.సి.ఐ.సి.ఐ బ్రాంచ్లో ఈ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాకు సంబంధించి బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఆడ్రస్సు, ఇతర ఆధారాలు సరైనవి కాకపోవటంతో పాటు నగదును కూడా పూర్తిగా ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ ఖాతాలోకి ఎప్పుడెప్పుడు, ఎవరి ఖాతాల లోంచి ఎంత మొత్తంలో నగదు జమ అయింది.. అనే సమాచారాన్ని బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ఆగ్రనేతే ఫోన్ చేస్తాడా? సాక్షాత్తూ మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో బెదిరింపు ఫోన్కాల్స్ రావటంపై పోలీసుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రికార్డు చేసిన బెదిరింపు ఫోన్కాల్స్లోని వ్యక్తి మాటతీరును బట్టి అతడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిసింది. కానీ గణపతికి 60 ఏళ్లు పైబడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.