Family Doctor
-
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
ప్రతి పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్..ఈ స్కిం సాధించిన విజయాలపై గ్రౌండ్ రిపోర్ట్
-
ఇంటికే డాక్టర్.. ఇంటికే మెడిసిన్
-
ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్సీ, వీహెచ్సీల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులున్నారు. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు
ఇది గతం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యానికి జిల్లా ఆస్పత్రికో లేదా ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లాల్సిందే. వైద్య సదుపాయం ఉన్న గ్రామాలే తక్కువ. అక్కడ వైద్యుడు ఉంటాడన్న నమ్మకం లేదు. ప్రాంతీయ ఆస్పత్రులూ అంతంతమాత్రమే. అక్కడా వైద్యులు ఉండరు. దీంతో వృద్ధులైనా, మహిళలైనా, దివ్యాంగులైనా వ్యయప్రయాసలకోర్చి జిల్లా ఆస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లక తప్పని పరిస్థితి. అక్కడా పెద్ద క్యూలు. ఉండేదే అరకొర వైద్య సిబ్బంది. ఆరోజు తమను చూస్తారో లేదోనన్న ఆందోళన. నేడు గ్రామాలకే వైద్యులు.. ఇప్పుడున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్.. గ్రామాల్లోని ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాదు.. గ్రామీణ ప్రజలు చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులనే గ్రామాలకు పంపిస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గ్రామీణులెవరూ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరంలేదు. వారి వద్దకే వైద్యులు వస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, పరీక్షలు చేసి, అవసరమైన మందులు కూడా ఇస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’. ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులు వెళ్లే ఈ కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ట్రయల్ రన్ మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు అందించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1142 పీహెచ్సీలకు అదనంగా 88 కొత్త వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న 63 చోట్ల వైద్యులను నియమించింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు వారి పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను సమానంగా విభజించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,032 విలేజ్ క్లినిక్లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లతో పాటు వైద్యులు గ్రామాలకు వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూలకు అదనంగా 260 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 104 యూనిట్, వైద్యుడు గ్రామానికి వెళ్లిన రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రజలకు అవుట్పేòÙంట్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది. వీరిలో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్న వారికి నిర్దేశించిన ప్రమాణాలతో మెడికల్ ఫాలోఅప్ చేస్తూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరం సాధారణంగా బీపీ, షుగర్, ఇతర ధీర్ఘకాలిక వ్యాధిగ్రçÜ్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. మారుమూల గ్రామాల్లో ఉండే వారు ప్రతి నెలా వైద్యుడిని సంప్రదించాలంటే 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లాలి. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణ చార్జీలతో పాటు, ఒక రోజంతా కేటాయించాలి. మంచానికే పరిమితమైన వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఆ కుటుంబాలు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ కష్టాలకు చెక్ పెడుతూ సీఎం వైఎస్ జగన్ వైద్యులనే ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. విలేజ్ క్లినిక్లలోనే 105 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. థైరాయిడ్, గుండె సంబంధిత, ఇతన సమస్యలకు మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంటున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ♦ జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ♦ బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ♦ గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. ♦ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ♦ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ♦ తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ♦ పాలియేటివ్ కేర్ ♦ రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ♦ గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ♦ హిమోగ్లోబిన్ టెస్ట్ ♦ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (సుగర్) ♦ మలేరియా టెస్ట్ ♦ హెచ్ఐవీ నిర్ధారణ ♦ డెంగ్యూ టెస్ట్ ♦ మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ♦ అయోడిన్ టెస్ట్ ♦ వాటర్ టెస్టింగ్ ♦ హెపటైటిస్ బి నిర్ధారణ ♦ ఫైలేరియాసిస్ టెస్ట్ ♦ సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ♦ విజువల్ ఇన్స్పెక్షన్ ♦ స్పుటమ్ (ఏఎఫ్బీ) -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పూర్తయిన అనంతరం.. ఆస్పత్రులకు వెళ్లి ఫాలోఅప్ వైద్య సేవలు పొందడం కోసం రోగుల ప్రయాణాలకయ్యే ఖర్చును కూడా వారికి అందించబోతోంది. కన్సల్టేషన్కు రూ.300 చొప్పున.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య(ప్రొసీజర్లు)ను వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య వ్యయ పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత భరోసా కల్పించింది. అంతేకాకుండా 1,500కు పైగా ప్రొసీజర్లలో చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి గాను రోగులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గరిష్టంగా నెలకు రూ.5 వేల వరకు సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్యశ్రీ పథకంలోని గుండె, మెదడు, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాలకు సంబంధించిన 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స చేయించుకున్న తర్వాత.. ఏడాదిలోపు రోగులు 4సార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే రోజే.. ఫాలోఅప్ సేవల కోసం రావాల్సిన తేదీలను వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారంతా నిరుపేద, మధ్యతరగతి ప్రజలే. వీరు ప్రయాణాల ఖర్చులకు వెనుకడుగు వేసి ఫాలోఅప్ వైద్య సేవలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సమస్య పూర్తిగా నయం కాకపోవడంతో భవిష్యత్లో మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స పొందిన వారికి ప్రయాణ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒక్కో కన్సల్టేషన్కు రూ.300 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన మందులూ అందజేత.. ఫాలోఅప్ కన్సల్టేషన్ సమయంలోనే రోగికి అవసరమైన మందులను కూడా ఆస్పత్రిలో అందజేస్తారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద చేసే మొత్తం చికిత్సల్లో 10 శాతం మేర కేసుల్లో ఫాలోఅప్ కన్సల్టేషన్లు అవసరం ఉంటాయని వైద్య శాఖ అంచనా వేసింది. ఫాలోఅప్ కన్సల్టేషన్ వైద్య సేవల పొందేందుకు ప్రభుత్వం ఇలా అదనపు సాయం చేయడం వల్ల రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది ప్రజలకు గొప్ప మేలు చేస్తుందన్నారు. ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాం.. అవసరం ఉన్న ప్రతి ఒక్క రోగి ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కన్సల్టేషన్కు రూ.300 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయడానికి చర్యలు చేపట్టాం. మెడ్కో లాగిన్లో ఓ ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వ్యక్తి ఫాలోఅప్ కన్సల్టేషన్కు హాజరయ్యాడని నిర్ధారిస్తే.. ఆ రోగి, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.300 చొప్పున నగదు జమ అవుతాయి. – డీకే బాలాజీ, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్స్టాప్ సొల్యూషన్గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్సీకి విలేజ్ క్లినిక్స్ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
ఆరోగ్యం మీ హక్కు!
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తి కరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటూనే మందుల విషయంలో రాజీపడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని.. ఈ విషయంలో వాళ్లు అప్పులపాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా.. ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతీ ఒక్కరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. సేవలు వినియోగించడం గురించి తెలియని వ్యక్తి అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,42,34,464 కొత్త కార్డులను ప్రింట్ చేయిస్తున్నారు. ఈనెల 18 నుంచి వీటిని అందజేస్తారు. మరోవైపు.. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునేలా కార్యక్రమం చేపడుతోంది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఈ రెండు యాప్లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సురక్షపై నిరంతర సమీక్ష మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనందించే కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. అందులో మొదటిది.. ► సురక్షలో గుర్తించిన రోగులకు మందులు అందించడం, కాలానుగుణంగా ఆరోగ్యంపై ఫాలోఅప్ చేయడం.. ► రెండోది.. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్ సేవలు అందించడం.. ► మూడోది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మందులను కోర్సు ముగిసేలోపే వాటిని అందుబాటులో ఉంచడం. ఈ మూడు ప్రధాన అంశాలపై నిరంతరం సమీక్ష చేయనుంది. ► అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మందులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేదా? అన్న దానిపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అలాగే, సురక్షలో గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స అవసరమున్న రోగులకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వడమే కాక.. సురక్ష క్యాంపుల నుంచి ఆస్పత్రులకు రిఫర్ చేసి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరిన వారిని మరోసారి డాక్టర్ల బృందం పరిశీలించేలా.. శిబిరాల్లో ఇంకా వైద్యం అందాల్సిన వారికి వెంటనే నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోనుంది. చైనా వైరస్పైనా అప్రమత్తం చైనాలో హెచ్9ఎన్2 వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా మన దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మందులు, ఆక్సిజన్, పడకల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు లేకుండా చూడాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు. 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. అంతకుముందు.. వైద్యశాఖలో అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం చికిత్సలు పెరిగాయన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని కూడా వారు సీఎంకు వివరించారు. ► కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారని.. ► ఇందులో 73,602 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నామని.. ► చాలామందికి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు మందులు ఇచ్చారని.. అనంతరం తదుపరి చికిత్స కోసం 16,128 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. ► వీరిలో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్మెంట్లు పూర్తయ్యాయి. ► 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామని అధికారులు వివరించారు. ► ఇక కంటిచూపు సంబంధిత సమస్యలున్న 13,614 మందికి ఇప్పటికే కేటరాక్ట్ సర్జరీలు చేయించామన్నారు. 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు. ► క్యాంపుల్లో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. జనవరి నుంచి రెండోదశ ఆరోగ్య సురక్ష.. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతీవారం ఒక ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించామన్నారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని.. మందులు, వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీయూహెచ్)లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించాల్సి ఉండగా, తొలి దశలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్కు భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.30 లక్షలు చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా, 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా.. పీహెచ్సీ ప్రాంగణాల్లో నిర్మిస్తున్న బీపీయూహెచ్లు మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా వ్యవహరిస్తాయి. వీటిల్లో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) యూనిట్తోపాటు పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. సెమీఆటో అలైజర్, సెల్ కౌంటర్, ట్రూనాట్, అల్ట్రాసౌండ్, హెచ్బీ1సీ పరికరాలు ల్యాబ్లలో ఉంటాయి. కరోనా వైరస్, డయేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ యూనిట్ల ద్వారా సర్వేలెన్స్ ఉంచుతారు. ఎపిడమాలజిస్ట్లతోపాటు విజిలెన్స్ సెల్ కూడా అందుబాటులోకి వస్తాయి. యూనిట్లన్నింటినీ జిల్లా, బోధనాస్పత్రుల్లోని ల్యాబ్లకు అనుసంధానం చేస్తారు. -
జగనన్న ఏర్పాటు చేసిన వైయస్ఆర్ హెల్త్ సెంటర్ వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుంది..!
-
గతం మర్చిపోతే ఎలా!?
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు బుకాయించడంలో రామోజీ దిట్ట. అలా చేయకపోతే ఆయన కంటి మీద కునుకు పట్టదు. ఇలా బుకాయించడంలో ఆయన గిన్నీస్బుక్ రికార్డు కూడా ఇప్పటికే నెలకొల్పి ఉంటారు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఆయన విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి. తాజాగా.. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే ఆయన మరోమారు తన కడుపుమంటను చాటుకున్నారు. గతంలో తన ఆత్మబంధువు చంద్రబాబు పాలన ఎంతో ఘనంగా ఉండేదని, ఇప్పుడే ఏమీ జరగడం లేదన్నట్లుగా ‘మొహం చాటేసిన సీఎం’ అంటూ ఈనాడులో ఆదివారం ఓ అబద్ధాల మాలికను అల్లారు. అప్పట్లో ప్రభుత్వాసుపత్రుల్లో అందే సేవలకూ, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అందుతున్న సేవలకూ మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో దిక్కతోచని స్థితిలోనే తాజా కథనం రాసినట్లు దానిని చదివిన వారికి ఇట్టే అర్థమవుతుంది. విప్లవాత్మక మార్పులపై విషం.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తుండగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు.. పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నాడు–నేడు కింద అభివృద్ధి పరచడంతోపాటు ఎక్కడా ఖాళీల్లేకుండా 53,126 సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నియమించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన విలేజ్ క్లినిక్ వ్యవస్థ, దేశంలోనే పలువురి ప్రశంసలు అందుకున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త వైద్య కళాశాలలుం ఇలా ప్రజారోగ్య రంగంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పు పైనా రాజగురువు వరుసగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. తాజా కథనం కూడా ఈ కోవకు చెందినదే. నిత్యం 2,204 వాహనాల పరుగులు.. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రంలో ‘108’ వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) ‘104’లు 936, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కింద 500 వాహనాలు నిత్యం పరుగులు పెడుతున్నాయి. ఇలా మొత్తం 2,204 వాహనాల ద్వారా వేగవంతమైన, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇది చూసి ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తొలి నుంచీ ఈ సేవలపై రామోజీ విషం కక్కుతూనే ఉన్నారు. ఆదివారం నాటి కథనంలోనూ ఆయన అలాగే తన అక్కసును వెళ్లగక్కారు. నాడు దైన్యం.. నేడు ధైర్యం.. గత టీడీపీ ప్రభుత్వంలో 108, 104 సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అత్యవసర సమయంలో ఫోన్చేస్తే 108 అంబులెన్సు వస్తుందో రాదో తెలియని దుస్థితి. అయితే, అప్పట్లో సీఎం కుర్చీలో తమ బాబు ఉన్నాడు కాబట్టి రామోజీకి సహజంగా ఇవేమీ కనపడేవి కావు. టీడీపీ ప్రభుత్వంలో దైన్యంగా మారిన ఈ సేవలను సీఎం జగన్ పట్టాలెక్కించి ప్రజల్లో ధైర్యం నింపారు. మరోవైపు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి 108 అంబులెన్సులు 531 ఉండగా వీటిలో 336 వాహనాలు అరకొరకగా రోడ్లపై కనిపించేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. 2022 అక్టోబరులో అదనంగా మరో 20 అంబులెన్సులను (108 వాహనాలు) గిరిజన ప్రాంతాలకు కేటాయించారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అంతేకాక.. ఈ ఏడాదే 2.5 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టారు. వీటి కోసం రూ.34.79 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఈ లెక్కన 2020 నుంచి ఇప్పటివరకు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు రూ.135.05 కోట్లు ఖర్చుచేసినట్లయింది. ‘108’ల కోసం ఏటా రూ.188 కోట్ల ఖర్చు ఇక ఈ అంబులెన్స్ల నిర్వహణ కోసం నెలకు రూ.14.39 కోట్లు చొప్పున ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు వెచ్చిస్తోంది. అంటే మొత్తంగా ఒక ఏడాదిలో 108 వాహనాలు కోసం చేస్తున్న ఖర్చు రూ.188.56 కోట్లు. ఇదంతా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగానే జరుగుతోంది. ఇంత చిత్తశుద్ధితో 108 సేవలు అమలుచేస్తుంటే రామోజీరావు బురద జల్లే రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అర్బన్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 15 నిమిషాలు, రూరల్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 20 నిమిషాల్లోపే 108 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఇదీ 108 సేవల సమర్థతకు నిదర్శనం. సొంత ఊర్లలోనే ‘104’ సేవలు.. ఇక సీఎం జగన్ ప్రభుత్వంలో 104 సర్వీసుల స్వరూపానికి పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 ఎంఎంయూ (104)లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకు రూ.108 కోట్లు ఖర్చుచేశారు. రూ.4 కోట్లతో మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవల కోసం కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుచేయడానికి వీలుగా అదనంగా 260 (104) వాహనాలను ప్రవేశపెట్టారు. వీటికోసం రూ.58 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం 936 మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా కోట్లాది మంది ప్రజలు తమ సొంత ఊర్లలోనే వైద్యసేవలు పొందారు. ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నా.. 108, 104 సిబ్బందికి ఒప్పందం ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ నుంచి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిని కూడా రామోజీ తట్టుకోలేకపోతున్నారు. గత సంవత్సరం ఉద్యోగులకు నిర్దేశించిన బేసిక్ పే పై 8 శాతం ఇంక్రిమెంట్తో జీతాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ఇంక్రిమెంట్ ఇచ్చి, ఆ ఇంక్రిమెంట్ ఎరియర్స్ను చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ఉద్యోగులకు ప్రతినెలా జీతాలను జమచేయడంలో ఎప్పుడన్నా జాప్యం జరిగినా వెంటనే వేతనాలు అందేలా చర్యలు ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే సెప్టెంబరు వరకూ వేతనాలు పూర్తిగా చెల్లించారు. అయినా జీతాలు ఇవ్వలేదని ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. అలాగే, అక్టోబరు నెల వేతనం నవంబరులో ఇస్తారు. ఇవన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా రామోజీ రోత రాతలు లేనిపోని సమస్యలను సృష్టించేందుకు తప్ప మరొకటి కాదు. ‘తల్లీబిడ్డ’ సేవల్లోనూ ఎంతో మార్పు ► గతంలో కేవలం 279 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లు ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. ► అప్పట్లో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పేరిట ఓమ్నీ వాహనాలను వినియోగించేవారు. ఒక్కో దానిలో ఇద్దరు గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం కూడా లేదు. ► కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ ఏసీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో దాంట్లో ఒకరిని మాత్రమే తరలిస్తున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ.499లు మాత్రమే ఖర్చుచేయగా.. ఈ ప్రభుత్వం రూ.895లు వెచ్చిస్తోంది. -
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయని పలువురు వైద్యులు, వివిధ రంగాల నిపుణులు కొనియాడారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే వైద్యం అందుతోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులో శుక్రవారం ‘నాడు–నేడు ఆంధ్రప్రదేశ్లో వైద్యం, ఆరోగ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివిధ రంగాల నిపుణులు మాట్లాడారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎవరేమన్నారంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు రాష్ట్రంలో వైద్య సేవలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించడం అభినందించదగ్గ విషయం. వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధిక ఆస్పత్రులతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అలాగే అత్యధిక బెడ్లు కలిగిన రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆరోగ్య రంగంలో ఏపీకి 8 జాతీయ అవార్డులు, రెండు అంతర్జాతీయ అవార్డులు రావడం హర్షించదగ్గ విషయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ కొత్త వైద్య కళాశాలలతో వైద్య రంగం బలోపేతం గతంలో ఆస్పత్రుల్లో మందులు, వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రజల ఇళ్లకే వెళ్లి వైద్యులు పరీక్షలు నిర్వహించే స్థాయికి పరిస్థితి మారింది. కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య రంగాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు, బెటర్ ఆంధ్రప్రదేశ్ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎన్నో సంస్కరణలు నాడు–నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నారు. పేదవారికి సైతం ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు మంచి చేశారో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. –బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, సాయి భాస్కర్ ఆస్పత్రుల అధినేత -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్...
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిలో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్, ఇప్పుడు యుక్త వయస్సు వారిలో కూడా గుర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ము క్యాన్సర్ను వైద్యుడి వద్దకు వెళ్లకుండానే సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నా, చాలా మంది రెండు, మూడు దశల వరకూ గుర్తించలేక పోతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొంత వరకూ సత్ఫలితాలు ఇస్తున్నా, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుండగా, మన దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా అరుదుగా 30 ఏళ్ల వయస్సులోనూ, పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతోంది. ప్రభుత్వం సైతం క్యాన్సర్ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్రంలో కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, అత్యుత్తమ చికిత్సలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా వివిధ సంస్థలు ప్రజల్లో దీనిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు.. గ్రామీణ ప్రాంత మహిళలకు కుటుంబ డాక్టర్ కార్యక్రమం వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు వైద్యులు సైతం వెళ్లడంతో గ్రామీణ మహిళలు ఆరోగ్య చెకప్ చేయించుకుంటున్నారు. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక మందికి ప్రాథమిక దశలో గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారిని ఫాలోఅప్ చేస్తూ మందులు అందజేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇలా.. ► పీరియడ్ వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత రొమ్ము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందేమో చూడాలి. ► చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై ఏమైనా కాయలు ఉన్నాయా, రొమ్ము టైట్ అవుతుందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తకారుతుందా వంటి అంశాలను సెల్ఫ్చెక్ చేసుకోవచ్చు. ► నొప్పిలేని కణితులను క్యాన్సర్గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. వీరికి రొమ్ము క్యాన్సర్ రావచ్చు.. లేటు వయస్సులో పిల్లలు పుట్టిన వారికి, బిడ్డకు పాలివ్వని తల్లులకు, వంశపారంపర్యంగా, జీవనశైలి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, రెడ్మీట్ తినేవారిలో, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఊబకాయంతో ఉన్న మహిళలు, మోనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు. పెళ్లిచేసుకోని మహిళలకు, పిల్లలు లేని మహిళలకు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలపై అవగాహన ఉండాలి.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలపై ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించవచ్చు. మన దేశంలో 40 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతొంది. మహిళలకు సోకే క్యాన్సర్లలో 70 శాతం మందిలో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు ఉంటున్నాయి. ప్రతి మహిళ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. రొమ్ముపై నొప్పిలేని కణితి వచ్చినా, చంకలో గడ్డలు ఏర్పడినా వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముక్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎన్. సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు ప్రత్యేక దృష్టి.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్షణాలతో వచ్చిన వారిని గుర్తించి స్క్రీనింగ్ కోసం పంపుతున్నాం. అంతేకాకుండా ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, రొమ్ములో గడ్డలు ఉన్నట్లు మహిళలు వస్తే వారి లక్షణాలను పరిశీలించి నిర్ధారణ పరీక్షల కోసం పంపుతున్నారు. అన్ని పరీక్షలు ప్రభుత్వాస్పత్రిల్లో ఉచితంగా నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్జిల్లా -
పథకాల అమలులో ఏపీ ప్రామాణికం
సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్.. సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు. నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభుత్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. -
వైద్యరంగంలో ఏపీ సంస్కరణలు భేష్
సాక్షి, అమరావతి/మూలపాడు (ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవల కల్పన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని జర్మనీకి చెందిన అంతర్జాతీయ సంస్థ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె–పాల్) ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ బృందం గురువారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్తో సమావేశమైంది. అంతకుముందు బృందం సభ్యులు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు, ప్రజలను అడిగి వైద్యసేవలు అందుతున్న తీరు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కమిషనర్తో సమావేశమయ్యారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని సంస్థ ప్రతినిధులకు కమిషనర్ నివాస్ వివరించారు. నాడు–నేడు కింద ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు సహా పలు అంశాలను తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జె–పాల్ బృంద సభ్యులు ప్రొఫెసర్ నిక్కిల్ సుదర్శనన్ (మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ హర్షా తిరుమూర్తి (పెన్సిల్వేనియా యూనివర్సిటీ) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణకు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు మంచి నిర్ణయమని తెలిపారు. ఆరోగ్య సురక్ష కింద హెల్త్ క్యాంప్లు నిర్వహించి స్పెషలిస్ట్ వైద్య సేవల కల్పన అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ రాష్ట్ర నోడల్ అధికారి టి.రమేష్, ఎన్టీఆర్ జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, మూలపాడు పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
ప్రజారోగ్యానికి ‘రక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ కేర్లో నూతన అధ్యాయం ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్ కేర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ను, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం. వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్ను పెంచాం. గతంలో 915 నెట్వర్క్ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం. ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయాలి. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్ వర్క్ అంతా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా), అసోసియేషన్ ఆఫ్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ: గ్రామంలోని విలేజ్ క్లినిక్లో ఒక భాగానికి సీహెచ్వో, మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి పుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. నాలుగో దశ: హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. -
దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్లే ఉంటాయ్!!
అందరూ ఆయా నేపథ్యల రీత్యా వేరువేరు వృత్తులు చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. ఆయా వృత్తులకు అనుగుణంగా వారు ధరించే డ్రస్లు, తీరు బట్టి వారు ఏం చేస్తున్నారని చెప్పేస్తాం. మెడలోని ఈ సెతస్కోప్ చూడగానే మాత్రం..ఒక్కసారిగా కళ్లు పెద్దవి అవుతాయి. తెలియకుండాని చేతులు పైకెత్తి నమస్కారిస్తాయి. అంత గొప్పది వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరిః అన్న పెద్దల మాట అక్షరాల నిజం. అలాంటి వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఒకేరోజు ఐదు మెడికల్ కాలేజ్లు ప్రారంభించి రికార్డు సృష్టించారు. పేదలకు అందని ద్రాక్షలా ఉండే వైద్య విద్యను మరింత దగ్గర చేసేలా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా ఓ సరికొత్త సువర్ణ అధ్యయనానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఏపీలో స్వతంత్రం వచ్చాక వైద్య విద్య ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? తదతరాల గురించి సవివరంగా చూద్దాం! స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 కాలేజ్లే ఉన్నాయి. పైగా అప్పట్లో విద్యార్థులెవరు డాక్టర్ అవుతానని చెప్పే సాహసం చేసేవారు కూడా కాదు. ఎందుకంటే అది డబ్బున్నోళ్లు చదివే చదువు అని భావించేవారు. అందుకు తగ్గట్టుగానే కాలేజ్లు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీనికితోడు ఆయా కాలేజ్లో వసతులు తక్కువగానే ఉండేవి. ఇక మెడిసిన్ సీట్లు విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త పలుకుబడి, పెద్దల అండదండ ఉన్నవాళ్లకే దొరికేవి. బాగా చదివిన పేద స్టూడెంట్స్ సైతం నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. మంచి ర్యాంకు వచ్చిన ఉద్యోగాల్లో స్థిరపడిపోయే ఫార్మాస్యూటిక్స్ వంటి ఇతర రంగాలు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సుల వైపుకి వెళ్లిపోయేవారు. తొందరగా సెటిల్ అవ్వోచ్చు లేదా ఉద్యోగం కూడా సంపాదించడం ఈజీగా ఉంటుందనో వేరే రంగాలవైపుకి వెళ్లిపోయేవారు. ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవటం, డాక్టర్ అవ్వడం ఓ తియ్యటి కలలానే ఉండేది విద్యార్థులకు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వైద్య విద్య విషయంలో అంతగా చొరవ చూపలేదు. ఇక ఇక్కడ ప్రజలు కూడా వైద్యులు సంప్రదించేవారు కాదు. ఒకరకంగా చెప్పాంటే ఆస్పత్రులు అందుబాటులో లేవని చెప్పాలి. పేదవాడికి రోగం అంటే చావుతో సమానం. అలాంటి రోజులు. చుట్టుపక్కల ఉండే ఆర్ఎంపీ డాక్టర్లే వారికి దిక్కు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చిన వారి వద్దకే. పట్టణాలకి వెళ్లి చూపించుకునేంత స్థోమత లేకపోవడం కూడా ఓ కారణం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సరిగ్గా ఆ టైంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వం ఆ పరిస్థితిని చక్కబెట్టింది. ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలు కూడా మంచి వైద్యం అందుకునే అవకాశం కల్పించారు. పేద, బలహీన బడుగు వర్గాల మహిళలు పురుడు పోసుకోవడం ఓ నరకంగా ఉండేది. ఇక ఆ సమస్యకు 108 సర్వీస్తో చెక్పెట్టి.. సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించడం వైద్యం అందేలా చూడటం వంటి సేవలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అనే వరం ఇచ్చారు. ఆయన హయంలో ఏపీలో ఉద్యోగులు, పేద విద్యార్థలకు, మహిళలకు ఓ సువర్ణయుగంలో సాగిపోయింది. హెలికాప్టర్లో ఆయన అకాల మరణం, తర్వాత జరిగిన రకారకాల పరిణామాల మధ్య మళ్లీ పరిస్థితి అగోమ్య గోచరంలోకి వచ్చేసింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన సాగించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకురాలేకపోయింది. మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంతో మళ్లీ ఏపీ గత సువర్ణ యుగంతో కాంతులీనడం మొదలైంది. తండ్రి ఆశయాలను, ఆకాంక్షలను నిలబెడుతూ..ప్రజారంజకంగా పాలించి ప్రజల మన్నలను పొందుతున్నారు. తండ్రి రెండు అడుగులు వేసి ఏపీని అభివృద్ధి దిశగా వచ్చేలా చేస్తే.. ఆయన తనయుడు జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా పథకాలను ప్రజల వద్దకు తీసుకువచ్చి జనం మెచ్చిన సీఎం, జననాయకుడు అనే బిరుదులు అందుకుంటున్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీయంబర్స్మెంట్లతో పేదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అందుకునేలా చేస్తే తనయుడు మరో ముందడుగు వేసి అత్యంత ఖరీదైన వైద్య వృత్తిని పేదవాడి ముంగిట ఉండేలా చేశారు. పేదలకు ఆరోగ్యాన్ని మరింత చేరువ చేసేలా ఫ్యామిలీ డాక్టర్ వంటి వాటితో 95% ప్రజలు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ఐదు కళాశాలలు ప్రారంభించి జనం మెచ్చిన నాయకుడంటే ఏంటో చూపించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా వైద్య కళశాలలు ఏర్పాటు చేయడమేగాక ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు అందుబాటులో ఉండేలా చేశారు. అంతేగాదు ప్రతి పార్లమెంట్కు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడమేగాక ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి.. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పించుకున్నారు సీఎం జగన్. దీని ఫలితంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడం, పేద విద్యార్థుల సైతం వైద్య విద్యా\ను అభ్యసించే గొప్ప అవకాశం రెండు లభిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పేదలకు కూడా మెరుగైన వైద్యం మరింత చేరవవుతుంది. ఏ రాష్ట్రమైన సుభీక్షంగా ఉండాలంటే అది విద్యతోనే సాకారం అవుతుంది. అదికూడా సామాన్యుడు సైతం ఉన్నత విద్యను అందుకోగలిగితేనే ఆ రాష్ట్రం స్యశ్యామలంగా ఊహకందని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడానికి ఏపీనే ఉదాహారణ. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసరమైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్పత్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్ను డౌన్లోడ్ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో నిర్వహిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మూడో దశలో మరో మారు హెల్త్ క్యాంప్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మహిళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు ముమ్మరంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహి ంచిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కా రానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. రూ.66.65 కోట్లతో మందులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎంలు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు. ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్ పరికరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు. 342 మంది స్పెషలిస్ట్ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. ప్రతి క్యాంప్నకు సంబంధిత పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ వైద్యులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 342 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించారు. కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి కంట్రోల్ రూమ్ల నుంచి వైద్యులు, మందులు, డయగ్నోస్టిక్స్ లభ్యత వంటి ఇతర అంశాలపై పర్యవేక్షణ మొదలవుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ ఇలా ♦ 15వ తేదీ నుంచి కార్యక్రమంపై వలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ♦ 16వ తేదీ నుంచి ప్రజల్లో ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ఇంటింటి సర్వే ♦ 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ ఉచితంగా చికిత్స శిబిరాల్లో వైద్యుల కన్సల్టేషన్ అనంతరం ఎవరికైనా తదుపరి వైద్యం అవసరమైతే దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతారు. ఆస్పత్రుల్లో వారికి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు 15 రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
మీ ‘ఫ్యామిలీ డాక్టర్’తో చర్చించండి రామోజీ
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా ఈనాడు రామోజీ రావు అక్కసు వెళ్లగక్కారు. ఈ విధానం వల్ల తమకెంతో మేలు చేకూరుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోష పడుతుంటే రామోజీ మాత్రం దీనిపై కూడా విషం కక్కారు. ‘వైద్య సేవల్లోనూ ప్రచార కక్కుర్తి’ అంటూ చంద్రబాబు కోసం ఎంత బరితెగింపుకైనా సిద్ధమని చాటుకున్నారు. రాష్ట్రంలో వైద్య రంగం ప్రగతి గురించి, ప్రత్యేకించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి మీ ఫ్యామిలీ డాక్టర్తో చర్చించే దమ్ముందా రామోజీ? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం, 104, 108 సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడంతో పాటు ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తే సంతోషించాల్సింది పోయి ఈనాడు రామోజీ ఏడుస్తున్నారు. తన విష ప్రచారంతో వాస్తవాలకు ముసుగు వేయడానికి విఫలయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 104 సంచార వైద్య సేవలను స్వల్ప మార్పులతో ఫ్యామిలీ డాక్టర్గా మార్చి ఈ ప్రభుత్వం హడావుడి చేస్తోందంటూ వక్రభాష్యం పలికారు. అప్పట్లో కేవలం 277 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)లతో మొక్కుబడిగా సేవలు నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 104 సేవలకు ఊపిరిపోశారు. ఏకంగా రూ.211 కోట్లతో 936 నూతన ఎంఎంయూ వాహనాలను కొనుగోలు చేసి సేవలను విస్తరించారు. దీనికి కొనసాగింపుగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1,676 మంది వైద్యుల నియామకం ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రజలకు సక్రమంగా సేవలందించేందుకు ప్రతి మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో తెచ్చేందుకు కొత్తగా 88 పీహెచ్సీలు, 63 చోట్ల సీహెచ్సీలు కేంద్రంగా కో లొకేటెడ్ పీహెచ్సీలను మంజూరు చేశారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు కొత్త పీహెచ్సీలను ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా 1,676 మంది వైద్యాధికారుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించారు. అదనంగా 104 మంది వైద్యుల పోస్టుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 175 మంది పూల్ డాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రతి చోట బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)గా నియమించారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్స్లో 105 రకాల మందుల్ని అందుబాటులో ఉంచారు. ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా గ్రామాల్లో సేవలందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులపై అవగాహన ప్రస్తుత విధానంలో పీహెచ్సీ పరిధిలోని విలేజ్ క్లినిక్స్ను ఇద్దరు శాశ్వత వైద్యులకు సమానంగా మ్యాప్ చేశారు. దీంతో వారు నెలలో రెండు సార్లు ప్రతి విలేజ్ క్లినిక్ పరిధిలో పర్యటిస్తున్నారు. క్రమం తప్పకుండా గ్రామాలకు వెళుతుండటంతో ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు, ఇతర అంశాలపై వైద్యులకు ఓ అవగాహన ఉంటోంది. వైద్యుడు, రోగికి మధ్య బంధం బలపడుతోంది. మంచానికి పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. మందుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు వివరాల్ని ట్యాబ్లలో నమోదు చేస్తున్నారు. 97 లక్షల మందికి సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 3,11,74,218 జనాభాకు గాను 97,43,726 మంది కనీసం ఒక్కసారైనా (31 శాతం మంది) వైద్య సేవల్ని అందుకున్నారు. ఇప్పటి వరకు 68,24,258 మందికి సాధారణ వైద్య సేవలు, 12,46,335 మంది రక్తపోటు వ్యాధిగ్రస్తులు, 8,73,440 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు.. మధుమేహం రెండూ ఉన్న వారు 9,21,951 మందికి సేవలందించారు. 4,90,736 మంది గర్భిణిలు, 3,07,140 మంది బాలింతలు, 57,582 మంది రక్తహీనత బాధితులు సేవలు అందుకున్నారు. కేంద్రం ప్రశంసలు గుర్తు లేవా? ఇటీవల డెహ్రాడూన్లో కేంద్ర ప్రభుత్వం చింతన్ సివిర్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ఉత్తమ ఆరోగ్య విధానాల్లో ఒకటి అని కేంద్రం ప్రశంసించింది. వైద్య శాఖలో నియామకాలపై కూడా హర్షం వ్యక్తమైంది. ఈ విషయాలను సైతం విస్మరించి.. రామోజీరావు తప్పుడు రాతలు రాయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రంగంలో ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతం ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఈ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి నిరంతరం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాల్ని చేపడుతోంది. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇందులో ఈ ఏడాది నుంచి ఐదు ప్రారంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఇవన్నీ మీకు కనిపించడం లేదా రామోజీ? -
‘ఫ్యామిలీ డాక్టర్’తో పల్లెకు రక్ష
(పమిడివారిపాలెం, పెదపాలెం, కాకుమాను గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్): ‘ఏం తాత.. ఆరోగ్యం ఎలా ఉంది? మందు బిళ్లలు సమయానికి వేసుకుంటున్నావా?’ అని డాక్టర్ అడిగితే.. ‘ఆరోగ్యం బాగానే ఉంది’ అనేలా రెండు చేతులు కదిలిస్తూ సైగల ద్వారా ఆరి నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న నాగేశ్వరరావు భార్య విమల మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినట్టే మాత్రలు సమయానికి వేస్తున్నాం. రోజులో 3 సార్లు పడుకునే స్థితి (పొజిషన్)లో మార్పులు చేస్తున్నాం’ అని వివరించింది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు రెండేళ్లుగా ఆర్థో, న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వీటికి తోడు బీపీ సమస్య కూడా ఉంది. వయోభారం, అనారోగ్య సమస్యల రీత్యా మంచానికి పరిమితం అయ్యాడు. దీంతో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవడం కోసం వైద్యుడి వద్దకు నాగేశ్వరరావు వెళ్లాలంటే ఈ కుటుంబానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటికి కిలోమీటర్కు పైగానే దూరంలో ఉన్న పీహెచ్సీకి వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ ఆటో మాట్లాడుకోవాలి. రాను పోను సుమారు రూ.300 అవుతుంది. కదల్లేని స్థితిలో ఉన్న నాగేశ్వరరావును ఆటో ఎక్కించి, ఆస్పత్రిలో చూపించుకునిగి మళ్లీ ఇంటికి చేర్చాలంటే ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా తోడుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో ఈ వ్యయ ప్రయాసలు ఏమీ లేకుండా కాకుమాను పీహెచ్సీ డాక్టర్.. వృద్ధుడైన నాగేశ్వరావు ఇంటికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొలె్రస్టాల్, రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించే మాత్రలు ఇస్తున్నారు. ఈ క్రమంలో నాగేశ్వరావు భార్య విమల మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఆయన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆ రోజు మా పిల్లలు పనులు వదులుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. డాక్టరే మా ఇంటికి వస్తున్నారు. మా ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటోంది. నెల నెలా వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ కూడా ఇచ్చి వెళుతున్నారు. గతంలో ఆయన కిందపడి కాలు విరిగినప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించి ఆదుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంపై ‘సాక్షి’ గుంటూరు జిల్లాలోని పొన్నూరు, పెదకాకాని, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించగా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గుంటూరుకు వెళ్లే బాధ తప్పింది.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన కావూరి శేషగిరిరావుకు 90 ఏళ్లు. ఆయన సతీమణి వెంకాయమ్మకు 70 ఏళ్లుపైనే ఉంటాయి. పిల్లలందరూ వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వృద్ధులు ఇద్దరే ఉంటారు. వయో భారానికి తోడు శేషగిరిరావుకు బీపీ, షుగర్ ఉన్నాయి. వెంకాయమ్మ గుండెకు కొన్నేళ్ల క్రితం స్టెంట్ వేశారు. దీంతో వీరిద్దరూ క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రతి నెలా గుంటూరులోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను అందుబాటులోకి తేవడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని వీరి ఇంటికి వైద్యుడు వచ్చి మందులు ఇచ్చారు. ఈ మందులను తీసుకెళ్లి గుంటూరు మిలటరీ ఆస్పత్రిలో చూపిస్తే తామిచ్చే మందులు కూడా అవే అన్నారు. దీంతో వెంకాయమ్మ దంపతులు గుంటూరుకు వెళ్లడం మానేశారు. క్రమం తప్పకుండా ఫ్యామిలీ డాక్టర్ వీరి ఇంటికి వెళుతున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఒకప్పుడు గుంటూరు మిలటరీ ఆస్పత్రికి పోయి రావడానికి రోజంతా సరిపోయేది. బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరకే డాక్టర్ వస్తుండటం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎందరికో చాలా మంచి చేస్తోంది’ అని వెంకాయమ్మ అభిప్రాయపడింది. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం వల్ల వృద్ధులు, వ్యాధిగ్రస్తులున్న ఊరు, ఇంటి వద్దకే వెద్యులు వచ్చి సేవలు అందిస్తూ, ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ పుణ్యమా అని ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉంటారు. వీరిలో 170 మందికి పైగా బీపీ, షుగర్తో బాధ పడుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 కి.మీ దూరంలో ఉండే పెదనందిపాడు పీహెచ్సీ, 20 కి.మీకు పైగా దూరంలో ఉండే ప్రత్తిపాడు సీహెచ్సీ, పొన్నూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సిందే. ఒకసారి ఆటోలో ఆస్పత్రికి పోయి రావాలంటే రూ.500 పైనే ఖర్చవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఈ వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విధానంలో పెదనందిపాడు పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా నాలుగో శుక్రవారం గ్రామానికి వస్తున్నారు. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. మరోవైపు పక్కనే మూడు కి.మీ దూరంలో ఉన్న పుసులూరు గ్రామంలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తొలగిన ఆర్థిక భారం.. ఇబ్బందులు.. ఫ్యామిలీ డాక్టర్తో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే రవాణా వ్యయం రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరి్థక భారం, ఇతర ఇబ్బందులకు విముక్తి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 105 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తోంది. పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామాలకే వెళుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్ పేషెంట్(ఓపీ) క్లినిక్ నిర్వహించి, ఆ తర్వాత మంచానికి పరిమితం అయిన వారికి వైద్య సేవలు అందించడానికి గృహాలు సందర్శిస్తున్నారు అదే విధంగా అంగన్వాడీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.04 కోట్ల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చింది. కాగా గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ పరిధిలో 1,82,459 సార్లు సందర్శించారు. 2,10,75,065 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ఇవీ 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మలీ్టపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్బీ) ‘ఫ్యామిలీ డాక్టర్’ కోసం ప్రభుత్వ చర్యలు ఇలా.. ► మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్సీలకు అదనంగా 88 కొత్త పీహెచ్సీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రతి పీహెచ్సీలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉంటుండగానే కార్యక్రమం అమలు కోసం వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ► మరోవైపు మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న చోట 63 చోట్ల వైద్యులను నియమించి వారిని సీహెచ్సీలో కో లొకేట్ చేసి సేవలు అందిస్తున్నారు. ఎవరైనా వైద్యులు సెలవు పెడితే కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వైద్యులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలలో రెండుసార్లు సందర్శించడానికి వీలుగా అప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ► అన్ని విలేజ్ క్లినిక్స్లో 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ► ఎన్సీడీ సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేపట్టింది. వీరిలో గుర్తించిన బీపీ, షుగర్, ఇతర సమస్యల బాధితులను ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానించారు. వారికి నిరంతర ఫాలో అప్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సమస్య అయితే తప్ప ఊరు దాటం 15 ఏళ్లుగా బీపీ, షుగర్ సమస్యలున్నాయి. గతంలో రెగ్యులర్ చెకప్ కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేవాడిని. ప్రతి నెలా వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో చెకప్కు వెళ్లడం మానేసి మందులు మాత్రం వాడేవాన్ని. అలా నిర్లక్ష్యం చేయడంతో కొన్నిసార్లు ఇబ్బంది అయింది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి డాక్టర్ను గ్రామానికే పంపుతోంది. దీంతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. డాక్టర్ గ్రామానికి వచ్చే ముందు రోజు మైక్లో ప్రకటిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయితేనే మా ఊరి వాళ్లు పొన్నూరు, గుంటూరు వెళుతున్నారు. – పారి జలందర్, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా చాలా ఆనందంగా ఉంది రెండేళ్లుగా బీపీ సమస్య ఉంది. దీంతో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. మా ఊళ్లోనే ప్రభుత్వం విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇక్కడే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. పొన్నూరు నుంచి ప్రభుత్వ డాక్టర్ కూడా క్లినిక్కు వస్తారు. ముందు రోజు ఆశ, ఏఎన్ఎం సమాచారం ఇస్తారు. బీపీ స్థాయిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తున్నారు. మందులు బాగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను తేకపోయినట్లైతే పొన్నూరుకు పోవాల్సి వచ్చేది. దీంతో రాను, పోను ఆటో చార్జీల రూపంలో అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. – రత్నకుమారి, పెదపాలెం, గుంటూరు జిల్లా చాలా మంచి పని చేశారు రెండేళ్ల నుంచి బీపీ, షుగర్తో బాధ పడుతున్నాను. నెలనెలా చెకప్లు చేయించుకోవాలి. రోజూ మందులు వేసుకోవాలి. వైద్యం కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేదాన్ని. నన్ను చెకప్కు తీసుకుని వెళ్లడానికి మా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఊర్లోనే మందులు ఇస్తున్నారు. టెస్ట్లు చేస్తున్నారు. డాక్టర్ కూడా మా ఊరికే వస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఈ విధానం లేకుంటే మా ఇబ్బందులు వర్ణాతీతం. – ముప్పలనేని సుబ్బాయమ్మ, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా మంచి కార్యక్రమం మన దేశంలో ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఏఎన్ఎం, ఆశ, ఎంఎల్హెచ్పీ వ్యవస్థ మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలోనే వైద్యులు నేరుగా ప్రజలకు సంరక్షణ అందించే వ్యవస్థ లేదు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా డాక్టర్లను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించడం మంచి నిర్ణయం. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రాథమిక వైద్య సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆ దశలోనే రోగికి సరైన వైద్య సేవలు అందించడం కీలకం. ఈ నేపథ్యంలో వైద్యులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకం అవ్వడంతో చాలా వరకు జబ్బులు, సమస్యలు ప్రారంభ దశలోనే బయటపడతాయి. దీనికి తోడు బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్తో బాధపడే వారికి నిరంతర ఫాలోఅప్ సేవలు అందుతాయి. తద్వారా భవిష్యత్లో వారు గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత పెద్ద జబ్బులు ఎదుర్కోకుండా కాపాడటానికి వీలుంటుంది. ప్రజలపై ఆరి్థక భారం పడదు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటున్నాం ఫ్యామిలీ డాక్టర్ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలను తెలుసుకుంటున్నాం. ఇందుకోసం బోధనాస్పత్రుల్లోని ఎస్పీఎం విభాగాన్ని కార్యక్రమంలో భాగస్వామిని చేశాం. ప్రతి జిల్లాలో ర్యాండమ్గా ఒకటి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందిన వారి నుంచి వైద్య విద్యార్థులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సేవలు పొందిన వారిలో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్కు కారణాలు అన్వేషించి, పరిష్కరిస్తున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
కిడ్నీలపై.. జంట భూతాల ప్రభావం
శరీరంలో అత్యంత కీలకమైన కిడ్నీలను రెండు జీవనశైలి వ్యాధులు భూతాల్లా పట్టుకున్నాయి. వాటి బారిన పడి కిడ్నీలు దెబ్బతిని ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఆ భూతాలే మధుమేహం, రక్తపోటు. ఈ రెండూ అదుపులో లేకపోవడంతో వాటి ప్రభావం కిడ్నీలపై పడుతోంది. క్రమంగా అవి చెడిపోతున్నాయి. కిడ్నీ వ్యాధులకు మిగతా కొన్ని కారణాలు కూడా ఉన్నప్పటికీ, 85 శాతం వ్యాధిగ్రస్తుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులే ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ వ్యాధుల నియంత్రణకు తోడ్పడుతోంది. వైద్యులు గ్రామాలకు వెళ్లిన సమయంలో ప్రజలో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణ ప్రాంతాల వారికి వరంలా మారింది. – లబ్బీపేట (విజయవాడ తూర్పు) అవగాహన లేకనే.. అవగాహన లేమి, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వినియోగం కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే చివరకు డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. ఇదంతా అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందువల్ల ముందు జాగ్రత్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల్లో కొందరిలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే డయాలసిస్ అవసరం అయ్యేంత పరిస్థితికి దారితీస్తున్నాయి. కిడ్నీ వ్యాధులకు గురయ్యే వారిలో 45 శాతం మందికి మధుమేహం కారణం కాగా, మరో 55 శాతం మందికి అధిక రక్తపోటు, ఇతర కారణాలుగా చెబుతున్నారు. యూరిన్ ఆల్బుమిన్, సీరమ్ క్రియాటిన్, స్కానింగ్ వంటి చిన్నపాటి పరీక్షలతో కిడ్నీ పని తీరును తెలుసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. అక్యుట్ ఫెయిల్యూర్, క్రానిక్ ఫెయిల్యూర్. అక్యుట్ ఫెయిల్యూర్ను సరైన చికిత్సతో సాధారణ స్థితికి తేవచ్చు. క్రానిక్లో అలా చేయలేం. ఫ్యామిలీ డాక్టర్ ఓ వరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణులకు వరంలా మారింది. నెలలో రెండు రోజులు గ్రామాలకే వెళ్లి పరీక్షలు చేయడంతో కిడ్నీ వ్యాధుల లక్షణాలను ముందుగానే గుర్తించగలుగుతున్నారు. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు సందేహం ఉన్న వారికి పీహెచ్సీలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు గుర్తించినా ఫెయిల్యూర్కు దారితీయకుండా కాపాడుకోగలుగుతున్నారు. నిపుణుల వద్దకు వెళ్లి మెరుగైన వైద్యం పొందుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్కు కారణాలు ♦ అదుపులో లేని మధుమేహం, రక్తపోటు ♦ గ్లొమెరుల్లోనెఫ్రిటిస్ ♦ ఎడిపికెడి–పొలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఇది వంశపారంపర్యంగా వస్తుంది) ♦ ఆటో ఇమ్యూన్ జబ్బులు ♦ ఊబకాయం, ధూమపానం ♦ విచ్చలవిడిగా నొప్పి నివారణ మాత్రలు వాడటం.. దీర్ఘకాలం పాటు గ్యాస్ మాత్రల వినియోగం ♦ దీర్ఘకాలంలో గుండె, ఇతర జబ్బులు ♦ మాంసాహార ప్రొటీన్ అధికంగా తీసుకోవడం కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు.. ♦ ఆయాసం, అలసట ♦ కాళ్ల వాపులు, ముఖం వాపు ♦ మూత్రం తగ్గిపోవడం ♦ ఎముకలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి ♦ కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా డయాలసిస్ స్టేజ్కి చేరవచ్చు నిర్ధారణ ఇలా: కిడ్నీ వ్యాధులను సీరమ్ క్రియాటిన్, యూరిన్ ఆల్బూమిన్, పొట్ట అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు -
1.8 కోట్ల మందికి గ్రామాల్లోనే వైద్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంతో గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వైద్యసేవలు పొందారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుపై మంత్రి రజిని మంగళవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గర్భిణులకు మరింత సులభంగా ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలవుతున్న తీరు, ఓపీ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. రక్తహీనత సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లు అవగాహన కల్పించాలన్నారు. బీపీ, షుగర్ వంటి అసాంక్రమిక వ్యాధులపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఎన్సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) సర్వేలో భాగంగా మొత్తం జనాభాలో ఏకంగా 82.47 శాతం మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్సీడీ బాధితులకు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చికిత్స కూడా అందిస్తున్నామని వివరించారు. తాజాగా మరోసారి సర్వే చేపట్టాలని, సెపె్టంబర్ ఒకటో తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జిల్లాల నోడల్ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓపీలతోపాటు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జె.నివాస్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
పేద ప్రజలకు చేరువగా వైద్యం
గుడివాడ టౌన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు సీఎం జగన్ కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలతో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో రూ.10.28 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి బ్లాక్–2 భవనాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్ జయంతి రోజున 100 పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందించాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ వైద్య రంగం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గతంలో ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడేవారని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ఆస్పత్రి దుస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 22మంది వైద్యులు, 80 మందికి పైగా నర్సులు, ఇతర సిబ్బందితో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
అమెరికాలో సైతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత
ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో (వాటిని కౌంటీలు అని పిలుస్తారు) దేశ జనాభాలో కేవలం 20 శాతం జనమే నివసిస్తున్నారు. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు అవసరమైనన్ని వైద్య సౌకర్యాలు లేవని అమెరికా కేంద్ర (ఫెడరల్ ) ప్రభుత్వం భావిస్తోంది. ఈ కౌంటీల్లో దేశ ప్రజల్లో 20% నివసిస్తున్నాగాని మొత్తం డాక్టర్లలో కేవలం పది శాతం మందే అక్కడ ప్రాక్టీసు చేస్తున్నారు. వైద్యసేవలు అరకొరగా అందిస్తున్నారు. అంటే డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తూ వైద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం. 2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ కౌంటీలలో ప్రాథమిక వైద్య సేవలందించే డాక్టర్ల సంఖ్య అక్కడి జనాభాతో పోల్చితే బాగా తగ్గిపోయిందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ స్కాలర్లు గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సర్వేకు సంబంధించిన ఏడేళ్ల కాలంలో గ్రామీణ కౌంటీల్లో ప్రాథమిక వైద్యుల సంఖ్య తగ్గిపోగా, నగర (మెట్రోపాలిటన్ ఏరియాలు) ప్రాంతాల్లో డాక్టర్ల సంఖ్య పెరిగింది. మొత్తంమీద అమెరికాలో డాక్లర్ల సంఖ్య అవసరమైన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, కొన్ని ప్రాంతాల్లో వైద్యులు మరీ తక్కువగా ఉండడం పెద్ద లోపంగా ప్రభుత్వాధికారులు గుర్తించారు. నగర, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోల్చితే గ్రామీణ కౌంటీల్లోని జనానికి గుండె జబ్బులు, కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, అన్ని రకాల స్ట్రోకులు ఎక్కువ పీడిస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ సమస్య గురించి ఇక్కడ వివరించడానికి కారణాలు లేకపోలేదు. ఇండియాలో పల్లె ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య బాగా తక్కువే, ఏపీలో కొత్త పరిష్కారం వైద్య కళాశాలల సంఖ్య, డాక్టర్ల సంఖ్య ఈమధ్యనే పెరుగున్న భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తగినంత మంది వైద్యులు అందుబాటులో లేక కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజారోగ్యానికి మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రాధాన్యం ఇచ్చారు దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. 2004 నుంచి 2009 వరకూ ఐదేళ్లకు పైగా సాగిన ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్య సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు వైఎస్ గారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఆయన ప్రభుత్వం భర్తీ చేసింది. 108 వంటి అత్యవసర వైద్య సేవలతో పాటు పేదలు, బడుగు వర్గాల కోసం ఉచిత వైద్యానికి ఆరోగ్య శ్రీ పథకం రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. నవ్యాంధ్రలో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజన్న మార్గంలో పయనిస్తూ గ్రామీణ ప్రాంతాల వైద్య, ఆరోగ్య అవసరాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. అనేక వ్యాధులను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వీటన్నింటికీ తోడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యులు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చేయడానికి కొత్తగా ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం ప్రవేశపెట్టింది. ఈ వినూత్న వైద్య–ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే నాటికి పల్లెల్లో ప్రజలందరికీ డాక్టర్లు పిలిస్తే పలికే మంచి రోజులొస్తాయి. 10,032 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్కుల ద్వారా పనిచేసే వైద్యుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజారోగ్య సంరక్షణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆంధ్ర రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వైద్యులే స్వయంగా పల్లె ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జనం ఆరోగ్యం గురించి వాకబు చేసి వైద్య సహాయం అందిస్తే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలుగునాట సాకారమౌతుంది. అప్పుడు అమెరికా విశ్వవిద్యాలయాలు సైతం ఏపీ వచ్చి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న బాలికల సంఖ్య..
ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆదివాసీ–గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రసవాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఆదివాసీ మహిళల కాన్పులు ఇళ్లలో కాకుండా ఆసుపత్రుల్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్ సీలు) జరిగేలా ఆరోగ్య సిబ్బంది చూస్తున్నారు. ఏపీలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని, ఈ విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. శ్రామిక శక్తికి (లేబర్ ఫోర్స్) సంబంధించిన 2021–2022 సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 2019–20లో 1021 మంది బాలికలు ఉండగా, ఈ సంఖ్య 2021–2022 నాటికి 1046కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ఆడపిల్లలు ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా పెరగడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది కృషిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం చక్కటి ఫలితాలు అందిస్తుంది. దీనివల్ల 10,032మంది డాక్టర్లు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరైన గైడెన్స్ అందజేస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం..!
-
ఆరోగ్యానికి బలం!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగంలో నియామకాలతోపాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం మొదలు నాడు–నేడు ద్వారా వసతులతో తీర్చిదిద్దింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం లాంటి విప్లవాత్మక చర్యలతో ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్నే మార్చేసింది. కొరతకు చెక్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 48,639 వైద్య సిబ్బంది పోస్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం. పదవీ విరమణ తదితర కారణాలతో ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడుతో మహర్దశ టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రూ.16 వేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. నాడు–నేడు కార్యక్రమంతోపాటు 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలున్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. 882 చోట్ల పనులు పూర్తి కావటంతో ఆస్పత్రులు అధునాతనంగా తయారయ్యాయి. 121 సీహెచ్సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే 5 కొత్త వైద్య కళాశాలలు వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నిర్దేశించుకోగా ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. తద్వారా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది. ప్రజారోగ్యానికి రక్ష వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 108 సేవలకు పూర్వ వైభవం దివంగత వైఎస్సార్ ప్రారంభించిన 108 అంబులెన్స్ సేవలను గత సర్కారు నిర్వీర్యం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. పల్లెల్లోనే వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగులను మధ్యాహ్నం నుంచి పరామర్శిస్తూ ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్యులు గ్రామాలకు వెళ్లి 1,17,08,895 మందికి వైద్య సేవలు అందించారు. -
‘ప్రతీ రోగి చిరునవ్వుతో ఇంటికెళ్లాలి.. ఆస్పత్రుల్లో మార్పు తేవాలి’
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య రంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు మెరుగు పడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల తీరులో గణనీయమైన మార్పులొచ్చాయనే విషయాన్ని నిరూపించేలా ఉండాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించేలా చూడాలని మంత్రి సూచించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయిస్తున్న నిధులు, సిబ్బంది నియామకం...వంటి వాటి విషయంలో ఒక చరిత్ర సృష్టించారని..ఇది అందరూ గుర్తెరిగేలా ఈ పోస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మంత్రి రజిని తెలిపారు. రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి రోగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేవరకూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో, తాను మంచి సేవలు పొందానన్న సంతృప్తితో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి రజిని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ...ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ, లేనిదీ అధికారులు తరచూ చూడాలని మంత్రి ఆదేశించారు. తనిఖీల సంఖ్య పెంచాలని, తనిఖీల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మాత్రం అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు పసిగట్టినా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల వద్ద బాలింతలకు ప్రత్యేకించే విధంగా పింక్ కలర్ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం పెద్ద మొత్తం కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. విశాఖ కేజీహెచ్ ఈ నాలుగేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని, ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే అక్కడ ఏర్పడ్డాయని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. ముఖ్యంగా మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలతో ఆస్పత్రుల పనితీరు మారాలి ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని , పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని మంత్రి రజిని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీల ద్వారా ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ఇన్సినిరేటర్స్ ఏర్పాటుకు ఆదేశాలు ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే దాతల నుంచి సహకారాన్ని తీసుకుని, 16 టీచింగ్ ఆస్పత్రుల వద్ద ఇన్సినిరేటర్స్ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పతుల్లో సిబ్బంది నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకోవాలని, తదనుగుణంగా జీతానికి దీన్ని లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. డైట్ను తనిఖీ చేయాలి రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.80కు పెంచిన నేపథ్యంలో మెనూ చార్టులో నిర్దేశించిన మేరకు మూడుపూటలా నాణ్యమైన ఆహారం ఇస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు మహాప్రస్థానం వాహనాలను పెంచాలి మహాప్రస్థానం వాహనాల గురించి మంత్రి రజిని మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి సరిహద్దులు కలిగిన విశాఖపట్నం, విజయన గరాల ఆస్పత్రులకు మహాప్రస్థానం వాహనాలను పెంచాలని, ఈ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి రజిని ఆదేశించారు. అలాగే పెద్ద జిల్లా అయిన గుంటూరు, యాత్రికులు ఎక్కువగా సందర్శించే తిరుపతిలలో కూడా మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. సిటి, ఎమ్మారై సేవలపై అధ్యయనం రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నరసింహం, డిప్యూటీ డైరెక్టర్ కర్రి అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్తో అద్భుత ఫలితాలు
నాదెండ్ల: ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అద్భుత ఫలితాలు సాధిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కితాబిచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం ఆమె పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గ్రామానికి చెందిన నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ తదితరులు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. మంత్రి రజని వారిళ్లకు వెళ్లారు. వారికి అందుతున్న వైద్యసేవపై ఆరా తీశారు. ఫ్యామిలీ డాక్టర్ మీ ఇళ్లకే వచ్చి వైద్యం చేస్తున్నారా, కావాల్సిన మందులిస్తున్నారా, నెలలో ఎన్నిసార్లు వస్తున్నారు, ఏం పరీక్షలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ‘ప్రతినెలా రెండుసార్లు వస్తున్నారు’ వైద్యులు ప్రతినెలా రెండుసార్లు తమ ఇళ్లకే వచ్చి వైద్యం అందిస్తున్నారని నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ, వారి కుటుంబ సభ్యులు మంత్రి రజనికి వివరించారు. బీపీ, ఇతర అవసరమైన పరీక్షలు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా ఎప్పుడూ లేదని, ప్రభుత్వ వైద్యుడే తమ ఇళ్లకు వచ్చి వైద్యం చేయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎంఎల్ హెచ్పీ, ఏఎన్ఎంలు కూడా నిరంతరం రోగులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రికార్డులు పక్కాగా నిర్వహించండి రోగులకు అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని మంత్రి రజని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఓపీ సమయంలో ప్రతి రోగి ఆరోగ్య వివరాలు ఈహెచ్ఆర్లో నమోదయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి ఆరోగ్య సేవలందించే సమయంలో రోగులు, పిల్లలతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తూబాడు గ్రామంలో ఈ ఒక్కరోజే ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఏకంగా 266 మందికి ఓపీ సేవలు అందించామని చెప్పారు. ఈ స్థాయిలో గ్రామస్తులకు వైద్య సేవలు గతంలో ఎప్పుడూ అందలేదన్నారు. జగనన్న పరిపాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒకటని ప్రశంసించారు. మంత్రి స్థానిక వైఎస్సార్ హెల్త్ క్లినిక్కు వెళ్లి 104 వాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కూడా పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కూడా మంత్రి పరిశీలించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ప్రజా స్పందన అద్భుతం ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంపై పూర్తిస్థాయిలో ఆరా తీశానని చెప్పారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు. వీరిలో సగానికిపైగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రభుత్వ సిబ్బంది గ్రామాలకే వెళ్లి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారని.. ఎవరికైనా మెరుగైన వైద్యసేవలు అవసరమైతే పీహెచ్సీకి సిఫారసు చేస్తారని తెలిపారు. అవసరమైతే సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కూడా పంపిస్తారని వివరించారు. అక్కడ కూడా లొంగని జబ్బు అయితే బోధనాస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఆస్పత్రులను అనుసంధానించామని చెప్పారు. -
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా 92 లక్షల మందికి సేవలు
సాక్షి, అనంతపురం క్రైం: పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీని ద్వారా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల పరిధిలో 92 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికందుతున్న సేవలపై ఆరా తీశారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారి కోసం సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన పెయిన్ రిలీఫ్ క్లినిక్ను, రూ.3.46 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బరన్స్వార్డును మంత్రి ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్మోహన్రెడ్డి వైద్య రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ చరిత్రలోనే 49 వేల మంది సిబ్బందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పారు. అందులో ప్రాధాన్యత క్రమంలో ఐదు వైద్య కళాశాలల్లో (విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి) ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. రాజమండ్రి మినహా అన్ని కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతులు వచ్చాయన్నారు. రాజమండ్రి కళాశాల తనిఖీ పూర్తయితే దానికీ అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ మురళీధర్రెడ్డి, డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం) -
వైద్య ఆరోగ్య రంగంలో ప్రగతిదాయక అడుగులు
-
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్పై శిక్షణ విలేజ్ క్లినిక్లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్ను సిద్ధం చేయాలి. సీహెచ్వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎండీ మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరింత సమర్థంగా ‘ఫ్యామిలీ డాక్టర్’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని (ఎఫ్పీసీ) మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, బలమైన పర్యవేక్షణకు వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేస్తోంది. తద్వారా ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు భాగస్వాములవుతారు. కార్యక్రమం అమలు సంతృప్తస్థాయిలో జరుగుతోందా లేదా ఏమైనా మార్పులు చేయాలా అన్న విషయాలతోపాటు వివిధ అరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఇంతే కాకుండా ప్రజారోగ్య సమస్యలపై వైద్యులు, సిబ్బందికి కళాశాలల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను వైద్య కళాశాలల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాలకు అప్పగించారు. ఈ విభాగం వైద్యులను నోడల్ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించి భవిష్యత్ కార్యాచరణపై త్వరలో వర్క్షాప్లు నిర్వహించనున్నారు. లక్ష్యం మేరకు ఎఫ్పీసీ అమలవుతోందా, ఇతర అంశాలను అంచనా వేయడానికి చెక్ లిస్ట్ను కూడా రూపొందించారు. దీని ఆధారంగా ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి మూడు నెలలకు ఒకసారి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేస్తారు. ప్రజల్లో చైతన్యం కల్పించేలా ఎఫ్పీసీలో భాగంగా వైద్య విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. ప్రస్తుతం గ్రామాల్లోనూ మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి నాన్ కమ్యూనికబుల్(ఎన్సీడీ) వ్యాధుల బాధితులు పెరుగుతున్నారు. వీటితోపాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం, ఆ సమస్యలతో బాధపడుతున్న వారు మందులు సరిగా వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఎఫ్పీసీలో నమోదయ్యే వివరాల ఆధారంగా ప్రజారోగ్య సమస్యలపై వైద్య విద్యార్థుల ద్వారా అధ్యయనాలు చేపడతారు. 88 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఇప్పటివరకు 88.4 లక్షల మంది సొంత ఊళ్లలోనే వైద్య సేవలు పొందారు. వీరిలో 31.40 లక్షల మంది జనరల్ ఓపీ సేవలు అందుకున్నారు. మిగిలిన వారిలో 5.64 లక్షల మంది గర్భిణులు, 2.62 లక్షల మంది బాలింతలు, 25.41 లక్షల మంది రక్తపోటు, 18.18 లక్షల మంది మధుమేహం, 40 వేల మంది రక్తపోటు, మధుమేహం బాధితులు, 38 వేల మంది రక్తహీనత బాధితులు, ఇతరు అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులు ఉన్నారు. మూడు ప్రధాన ఉద్దేశాలు ఎఫ్పీసీలో వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం వెనుక మూడు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. కార్యక్రమాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం మొదటిది. కార్యక్రమం అమలును మూల్యాంకనం చేయడం రెండోది. వివిధ ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం మూడోది. ఈ అంశాల ఎజెండాగానే కమ్యూనిటీ మెడిసిన్ పనితీరు ఉంటుంది. ఇందుకోసం ప్రజారోగ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసుకుంటాం. – డాక్టర్ నీలిమ, కోఆర్డినేటర్, ఫ్యామిలీ డాక్టర్ విధానం -
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో 105 రకాల మందులు
సాక్షి, అమరావతి: ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ), లెప్రసీ, థైరాయిడ్ సహా పలు వ్యాధులతో బాధపడేవారు మందుల కోసం పీహెచ్సీలు, సీహెచ్సీల కోసం వెళ్లాల్సిన తిప్పలు తప్పనున్నాయి. ఈ తరహా వ్యాధులకు వాడే మందులను ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లోనే అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులో ఉండే మందుల రకాలను 67 నుంచి 105కు పెంచింది. పెంచిన రకాల మందులను అన్ని విలేజ్ క్లినిక్స్కు పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామీణులకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తూ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 10,032 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో)ను ప్రతి క్లినిక్లో నియమించారు. ఈ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లోనే 12 రకాల వైద్య, 14 రకాల నిర్ధారణ పరీక్షలను అందబాటులోకి తెచ్చారు. టెలీమెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, పీహెచ్సీ వైద్యుడి కన్సల్టేషన్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో రోజుకు సగటున ఒక్కో క్లినిక్లో 20 నుంచి 30 ఓపీలు నమోదవుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పల్లె ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రతి విలేజ్ క్లినిక్ను నెలలో రెండుసార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. రోజంతా ఆ గ్రామంలో ఉండి ఓపీలు నిర్వహించడంతో పాటు, మంచానికే పరిమితమైన వారికి కూడా వైద్యం చేస్తున్నారు. చదవండి: జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు దీంతోపాటు మిగిలిన రోజుల్లో టెలీమెడిసిన్ కన్సల్టేషన్లో వైద్యులు వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలున్న వారికి మందులను ప్రిస్క్రెబ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మందులు క్లినిక్స్లో అందుబాటులో లేకపోతే బాధితులు ప్రత్యేకంగా మందుల కోసం 5–10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్సీ, అంతకంటే దూరంలో ఉండే ఏపీవీవీపీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడానికి విలేజ్ క్లినిక్స్లోనే అదనంగా 38 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. -
‘వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే ఏపీ రోల్ మోడల్’
విజయవాడ: ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని..ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టుపై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ..ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని..హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని..గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని..వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని..కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని..జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ.ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగమే ప్రాజెక్ట్ ఎకో అన్నారు. ఎకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మాతా శిశు సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పెంచడం, వైద్యులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం ఎకో ప్రాజెక్టులో భాగంగా జరుగుతుందన్నారు. ఈ ఎకో ప్రాజెక్ట్ ద్వారా రోగులకి మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు, అధికారులు, తదితర సిబ్బంది ఉపయోగించుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ సూచించారు. ఎకో ప్రాజెక్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డా.సందీప్ భల్లా మాట్లాడుతూ.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలుకు, వాటిని బలోపేతం చేసేందుకు ఎకో ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. 180 దేశాల్లో ఎకో ప్రాజెక్టు సేవలు అందిస్తోందని..2008లో భారత్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో 20 రాష్ట్రాలతో ఎకో ఇండియా సంస్థ ఎంవోయూ చేసుకుని ఎకో ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎకో ప్రాజెక్టు ద్వారా డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నర్సులు, డెంటిస్టులు, ఆశా, ఏఎన్ఎం, వైద్య సంబంధింత స్పెషలిస్టులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు పరికరాలను ఉపయోగించడంలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాస్మిన్, నోడల్ ఆఫీసర్ ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ రమేష్, స్టేట్ నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మీ, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎమ్ డాక్టర్ వెంకట కిశోర్, సీఏవో గణపతిరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, కన్సల్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. -
క్షేత్రస్థాయిలో విజయవంతంగా ఫామిలీ ఫిజీషియన్ పథకం
-
ఇంటి ముంగిటకే వైద్యసేవలు
-
వైద్యరంగంలో మరింతగా ముందడుగులు వేస్తున్న వైఎస్ జగన్
-
ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమిది
సామాన్యుడికి వైద్యం అందించే విషయంలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టాం. ఇంటింటా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని.. ఆరోగ్య భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. ఈ రోజు పెన్షన్లు ఏ మాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తున్నాయో.. అదే మాదిరి వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాల్లో మీ ఇంటికి కూడా కదిలి వచ్చే కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి,గుంటూరు: ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే రోల్ మోడల్గా, వైద్య ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ విధానం రాబోయే రోజుల్లో దేశం మొత్తం మన వద్ద కాపీ చేసుకుని, అమలు చేసే రోజు వస్తుందని ఆకాంక్షించారు. మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఆయన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు. అక్కడి విలేజ్ క్లినిక్ను సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అందుబాటులో ఉన్న మందుల గురించి వైద్య సిబ్బందితో ఆరా తీశారు. గ్రామంలో ఎంత మందిని స్క్రీనింగ్ చేశారు.. ఎంత మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి.. వాటిని యాప్లో ఎలా నమోదు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘ఇక డాక్టర్ కోసం మీ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు పోవాల్సిన అవసరం లేదు. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు. మీ ఇంటి చేరువకే వస్తాడు. మీ కుటుంబం కోసం, మన పేదల కోసం అక్కడికే వైద్యుడితో పాటు వైద్య సేవలు కూడా వస్తాయి. అక్కడే మీ జబ్బుల గురించి తెలుసుకుని, అక్కడే మందులు ఇచ్చే గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితరులు తొలి దశలోనే జబ్బులను గుర్తించవచ్చు ► పేదలు, పేద సామాజిక వర్గాల వారు హాస్పిటల్స్ చుట్టూ, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరీక్షలు చేయించుకోవడం కోసం పరీక్ష కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆధునిక వైద్యాన్ని మీ గ్రామంలోనే ఉచితంగా అందించడానికే ఈ విధానం తీసుకువచ్చాం. గ్రామంలో మంచానికే పరిమితమైన రోగుల గడప వద్దే అవసరమైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. ► ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అని ఒక నానుడి. జబ్బులు ముదరకుండా.. రాకుండా కాపాడేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకువచ్చాం. దీనివల్ల బీపీ, షుగర్, ఇతరత్రా రోగాలను తొలి దశలోనే కనుక్కోగలుగుతాం. వాళ్లకు వెంటనే వైద్యం అందించి, ముదరకుండా కాపాడగలుగుతాం. ఇది ఒక్క బీపీ, షుగర్లకు మాత్రమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ వరకూ ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రంగా నిలుస్తుంది. మన గ్రామానికి నడిచి వచ్చిన గొప్ప వ్యవస్థ ► ఇదే లింగంగుంట్ల వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో ఏకంగా 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేయడం కోసం డయాగ్నస్టిక్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియో కాన్ఫ్రెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఎవరికి బాగా లేకపోయినా విలేజ్ క్లినిక్కు వెళితే స్పెషలిస్టు డాక్టర్లు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యం అందించే గొప్ప వ్యవస్థ ఈ రోజు మన గ్రామానికే నడిచి వచ్చింది. ► ప్రతి 2,000–2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ఇందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన వ్యక్తి కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో)గా ఉంటారు. మరో ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటుంది. వీళ్లిద్దరే కాకుండా ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్లో రిపోర్టు చేసే వ్యవస్థ ఆవిర్భవించింది. తద్వారా ప్రతి పేదవాడికి 24 గంటలపాటు వైద్యం అందించవచ్చు. ► విలేజ్ క్లినిక్లను మండలానికి రెండు పీహెచ్సీలకు అనుసంధానం చేస్తున్నాం. ప్రతి హీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఇందులో ఒక డాక్టర్ ఓపీ చూస్తుంటే.. రెండో డాక్టర్ కదిలే వైద్యశాల అయిన 104 వాహనం ఎక్కి, ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్తాడు. అక్కడి విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై సేవలు అందిస్తాడు. మండలానికి నలుగురు డాక్టర్లు ► మండలానికి రెండు పీహెచ్సీలు.. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు.. అంటే ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరు డ్యూటీలు మార్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు. ప్రతి డాక్టరు కూడా తనకు కేటాయించిన గ్రామానికే తాను వెళ్తాడు కాబట్టి.. ఆ డాక్టర్ పేరు, మొబైల్ నంబరు ప్రతి విలేజ్ క్లినిక్లో, ప్రతి గ్రామ సచివాలయంలో పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేస్తారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డాక్టర్ మీకు అందుబాటులో ఉంటాడు అనే భరోసా ఉంటుంది. ► నెలకు రెండు నుంచి నాలుగుసార్లు అదే గ్రామానికి వచ్చి వైద్యం అందిస్తాడు. తద్వారా ఆ డాక్టరుకు ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు, పేరున పిలిచే పరిచయం ఏర్పడుతుంది. అదే ఫ్యామిలీ డాక్టర్ విధానం. ఈ కాన్సెప్ట్ట్ను అమలు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక పద్ధతి ప్రకారం ముందు చూపుతో 104 వాహనాలు కొనుగోలు చేయడం, విలేజ్ క్లినిక్లు స్థాపించడం, ముందుగానే వైద్యులు, సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్స్ తయారు చేయడం, అవి డౌన్లోడ్ చేసి వినియోగించే విధానం వీళ్లందరికీ నేర్పించాం. రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు ► ఆరోగ్యశ్రీ అనగానే దివంగత నేత రాజశేఖరరెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి చేరువగా, ఉచితంగా తీసుకువచ్చారు. వైఎస్సార్ తదనంతరం ఈ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈ పథకంలోని ప్రొసీజర్స్ను 1000కి కట్టడి చేశారు. రూ. 800 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. ► మనందరి ప్రభుత్వం రాగానే ఆ బకాయిలను చెల్లించడమే కాకుండా, ప్రొసీజర్స్ను ఏకంగా 3,255కు విస్తరించాం. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆస్పత్రులు గతంలో కేవలం 919 మాత్రమే ఉంటే, ఇవాళ వాటి సంఖ్య 2,261. మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో 35,71,596 మంది సేవలు అందుకున్నారు. ► నిరుపేద ప్రాణం, నిస్సహాయుల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఒక్క ఆరోగ్యశ్రీ మీద చేసిన ఖర్చు రూ. 9 వేల కోట్లు. ఇది కాకుండా ఆరోగ్య ఆసరా కింద మరో రూ.990 కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. తేడా మీరే గమనించండి.. ► గత ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 46 నెలల కాలంలో ఏకంగా 48,639 ఉద్యోగాలు ఇచ్చాం. ► దేశ వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 33 శాతం, స్టాఫ్ నర్సులు 27%, జనరల్ íఫిజీషియన్ 50% ఖాళీలు ఉంటే మనం వంద శాతం భర్తీ చేశాం. స్పెషలిస్టు డాక్టర్లకు సంబంధించి దేశ వ్యాప్తంగా 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో 96.04 శాతం పూర్తి చేశాం. ► దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ స్థాపించాం. అక్కడ 10,032 మంది ఎంఎల్హెచ్పీలు, అంతేమంది ఏఎన్ఎంలను నియమించాం. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేల జీతం ఉంటే ఇప్పుడు రూ.పది వేలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వమే కొత్తగా 560 అర్బన్ పీహెచ్సీలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాం. ప్రతి 2,500 జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉన్న ఏకైక రాష్ట్రం మనదే. చంద్రబాబునాయుడు వైద్య రంగంపై ఏటా రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే మనం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. ► రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉంటే, కొత్తగా 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్నాం. పాత కళాశాలలను నాడు–నేడు కింద తీర్చిదిద్దుతున్నాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. 104, 108 వాహనాలు కొత్తగా 1,514 కొనుగోలు చేశాం. ► గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 229 రకాల మందులు, అవి కూడా నాసిరకం అందుబాటులో ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక 562 రకాల డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్లు, తలసేమియాతో బాధ పడుతూ మంచానికే పరిమితమైన వాళ్లకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ► ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఆ మనిషి ఇంటికి వెళ్లి తిరిగి పనులు చేసుకునే వరకు అండగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేలు చొప్పున వైద్యుల సలహా మేరకు విశ్రాంతి సమయంలో సాయం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 46 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2,05,108 కోట్లు జమ చేశాడు. వివక్ష, లంచాలు లేని పాలన సాగుతోంది. ఇదీ.. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. మీరే గమనించండి. బాబుకు స్కామ్లే తప్ప.. స్కీమ్లు తెలియవు స్కామ్లు చేయడమే తప్ప స్కీంలు తెలియని బాబులు ఉన్నారు. వారికి అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. మాత్రమే తెలుసు. లంచావతారాలు, గజ దొంగలు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలు, సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు.. ఇలా ఒకరు చంద్రబాబు రూపంలో, ఒకరు ఈనాడు రూపంలో, ఒకరు ఆంధ్రజ్యోతి, మరొకరు టీవీ5 రూపంలో.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు రూపంలో కనిపిస్తారు. ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని వీరికి మిగిలింది జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు మాత్రమే. వీటితో మాత్రమే వీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తుంటే, దీనికి అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతు చూసి తట్టుకోలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. నాకు అంగబలం, అర్థబలం, మీడియా బలం లేకపోయినా.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. నేను పొత్తులపై ఆధార పడను. నాకు ఎవరితోనైనా పొత్తు ఉందంటే అది ప్రజలతో మాత్రమే. నాకు కుయుక్తులు చేతకాదు. అబద్ధాలు చెప్పలేను. మోసం చేయలేను. పన్నాగాలు, జిత్తులు చేత కాదు. నేను ఏది చెప్తానో అదే చేస్తాను. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా.. అన్నది కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా సైనికుల్లా నిలబడండి. చిలకలూరిపేటకు వరాలు చిలకలూరిపేటలో రూ.150 కోట్లతో తాగునీటి కోసం పనులు జరుగుతున్నాయి. దీనికి మున్సిపల్ వాటాగా ఖర్చు పెట్టాల్సిన రూ.63 కోట్లు కావాలని మంత్రి విడదల రజిని అడిగింది. దీన్ని మంజూరు చేస్తున్నా. అంబేడ్కర్ కమ్యూనిట్ హాల్, బీసీ భవన్, కాపు భవనాలను మంజూరు చేస్తున్నా. ముస్లిం శ్మశానం, దర్గా నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశిస్తున్నా. లిఫ్ట్ ఇరిగేష¯న్ స్కీం మరమ్మతులకు ప్రతిపాదనలు రాగానే వాటిని కూడా పూర్తి చేస్తాం. జగనన్నా.. ఇది మీరు పెట్టిన భిక్ష బీసీ మహిళనైన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన జగనన్నకు రుణపడి ఉంటాను. అన్నా.. నా రాజకీయ జీవితం నీవు పెట్టిన భిక్ష. చిలకలూరిపేట లాంటి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మంత్రిగా ఉండటమే మీ చిత్తశుద్ధికి నిదర్శనం. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఆరోగ్య రంగానికి ఏం మేలు చేశారో చెప్పాలి. ఆయన ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధం అంటూ కాలక్షేపం చేశారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చు.. నాలుగు టీవీలు, నాలుగు పత్రికలు, నాలుగు పార్టీలతో పొత్తులు కలిగి ఉండొచ్చు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం మా జగనన్నదే. రాబోయే ఎన్నికల్లో మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, మీ దుష్టచతుష్టయం ఎన్ని అరాచకాలు చేసినా మిమ్మల్ని ఓడించడం ఖాయం. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మీ వల్లే బతికున్నా.. నేను కూలి పనులు చేసుకునే వాడిని. నా కిడ్నీలు పాడయ్యాయని, వెంటనే డయాలసిస్ చేయాలన్నారు. చాలా డబ్బు ఖర్చవుతుందని నేను భయపడ్డాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని డాక్టర్ అడిగారు. ఉందని చెప్పాను. ఆ కార్డు ఆధారంగా నా వద్ద నుంచి ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా నన్ను బతికిస్తున్నారు. వలంటీర్ వచ్చి నీకు రూ.10 వేలు ఫించన్ జగనన్న పంపారని ప్రతి నెలా ఇస్తున్నారు. ఆ డబ్బుతో, ఇతరత్రా మీ పథకాలతో నా కుటుంబం ముందుకెళ్తోంది. మా నాన్నకు గుండె సమస్య వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా స్టంట్ వేశారు. ఇప్పుడు తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం మాలాంటి పేదలకు వరం. మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాం. – ఎం.రమేష్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, లింగంగుంట్ల -
ప్రతి పేద వ్యక్తికి అండగా నిలవాలని ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్
-
పల్లె గడపకు ఫ్యామిలీ డాక్టర్.. జయహో జగనన్న (ఫొటోలు)
-
ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు: రజిని
-
‘ఫ్యామిలీ డాక్టర్’ ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఫ్యామిలీ డాక్టర్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. డాక్టర్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు. విలేజ్ క్లినీక్లో సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఉంటారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుంది. మండలానికి రెండు పీహెచ్సీలు. ప్రతీ పీహెచ్సీలు ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పీహెచ్సీలో ఉంటే.. మరొకరు ఆంబులెన్స్లో తిరుగుతుంటారు. వైఎస్ఆర్ విలేజ్క్లినిక్లను పీహెచ్సీలతో అనుసంధానిస్తాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారాయన. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని పేర్కొన్నారు. అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం ఇది. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తాం. మందులు ఉచితంగా అందించే గొప్ప కాన్సెప్ట్ ఈ ఫ్యామిలీ డాక్టర్ అని సీఎం జగన్ తెలిపారు. -
నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే: విడదల రజిని
సాక్షి, పల్నాడు: చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా.. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్ల వద్ద జరిగిన బహిరంగ సభలో విడదల రజని ప్రసంగించారు. సాధారణ బీసీ మహిళ అయిన తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రిని చేశారంటూ సీఎం జగన్కు విడదల రజిని కృతజ్ఞతలు తెలియజేశారామె. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్ను ఉద్దేశిస్తూ.. భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. సీఎం జగన్ ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారామె. భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఏనాడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం జగన్ బలంగా నమ్మారు. అందుకే వలంటీర్ వ్యవస్థ తెచ్చారని, ఆ వ్యవస్థ ఆత్మబంధువుల్లాగా పని చేస్తోంది. మహానగరాల్లో ధనవంతులు వినే ఫ్యామిలీ డాక్టర్ అనే మాటను.. గ్రామాల్లో ఉండే పేదల కోసం ఇక నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం. ఇది జగన్ మానసపుత్రిక అని మంత్రి రజిని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో వైద్య సేవలు ఉచితమని, గ్రామాల్లో పేదల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అలాగే గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ సేవలు కొనసాగనున్నాయని ఆమె తెలిపారు. నాలుగేళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో.. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి రజిని పేర్కొన్నారు. అయితే.. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏనాడూ ప్రజారోగ్యం గురించి ఆలోచించలేదని, పైగా ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారని మంత్రి రజిని మండిపడ్డారు. పైగా దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధమంటూ కాలక్షేపం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారని ఆమె గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఏనాడూ మంచి ఆలోచించలేదని, కేవలం మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో, నాలుగు టీవీలు.. పత్రికలు ఉండొచ్చేమో, నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో. కానీ, గుర్తు పెట్టుకోండి చంద్రబాబుగారు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం జగనన్నదని మంత్రి రజిని ఉద్ఘాటించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చేమోగానీ, జగన్ కోసం ప్రాణమిచ్చే ప్రజాభిమానం కొనసాగించలేరని పేర్కొన్నారామె. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా.. భూమి చీలినా.. నింగి కుంగినా.. అన్యాయానికి ఓటమి తప్పదని, చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని, జగనన్న గెలుపు తథ్యమని మంత్రి రజిని పేర్కొన్నారు. వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి.. ఊపిరి కావాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి.. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి అని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అంటోందని.. జై జగన్ నినాదాల నడుమ ప్రసంగం ముగించారామె. -
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా..
కార్పొరేట్ల దోపిడీకి గురవుతూ.. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలకు నోచుకోలేక అల్లాడుతున్న జనాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్ ‘ఆరోగ్యశ్రీ’ ప్రవేశపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుండడంతో ఆయా రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకపక్క కార్పొరేట్ వైద్యం పొందడానికి పేదవారికి అవకాశం కల్పిస్తూనే... మరోవైపు ప్రభుత్వాసు పత్రులను ఆధునికీకరించడం, కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం వైద్య శాఖను పటిష్ఠం చేస్తోంది. విలేజ్ క్లినిక్, ‘ఫ్యామిలీ డాక్టర్’ల ద్వారా వైద్యాన్ని మరింతగా పేదవాడి ముంగిటికి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక కుటుంబ ఆరోగ్యం బాగుంటే... సమాజ ఆరోగ్యమూ బాగుంటుంది. సమాజం బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. ఆ ఆలోచనే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధన వైపు పరుగులు పెట్టిస్తోంది. నాకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడం ఆయన నాపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తాను. ఊరూరికీ, ఇంటింటికీ వైద్య ఆరోగ్య సేవలు ఉచితంగా.. నాణ్యంగా అందాలన్న ఒక గొప్ప లక్ష్యంతో ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు (ఏప్రిల్ 6) పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆవిష్కరిస్తున్నారు. ఆ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవిని ఇవ్వడమే ఒక గొప్ప వరం అనుకుంటే... ఈ రోజు ఈ పథకాన్ని చిలకలూరిపేట నుంచి సీఎం ఆవిష్కరించడం మరో గొప్ప అను భూతిగా భావిస్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ పథకం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఈ పథకం గురించి వివరించే ముందు ఈ నాలుగేళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగం సాధించిన అపూర్వ విజయాలను వివరించదలిచాను. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల కొరత మాటే ఉండరాదని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు సీఎం. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండానే జీవో జారీ చేయించారు. డాక్టర్లు, స్పెషలిస్టు నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో కలిపి మొత్తం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుంది.‘పేదవాడికి కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం’ అనే నినాదానికి ‘ఆరోగ్యశ్రీ’ పేరిట డాక్టర్ వైఎస్సార్ ఊపిరి పోస్తే... దాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది ఆయన తనయుడు జగన్. ఈ రోజున రాష్ట్రంలో 90 శాతం ప్రజలు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కోట్లాది రూపాయల విలువైన వైద్య సేవలు అందుకోవడమే దీనికి సాక్ష్యం. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించిన ప్రొసీజర్స్నూ ముఖ్యమంత్రి గణనీయంగా పెంచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 ప్రొసీ జర్స్ ఉంటే... ఈ రోజు ముఖ్యమంత్రి వాటిని 3,255కు పెంచారు. ఇవ్వాళ క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రూ. 20 లక్షలు ఖర్చయినా వెనుకాడకుండా ఆరోగ్యశ్రీ ద్వారా భరించడం పేదవాడికి వరమే. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె, కిడ్నీ, కాలేయం మార్పిడి, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్, కాక్లియర్ ఇంప్లాంట్ వంటి అత్యంత వ్యయంతో కూడిన చికిత్సలను సైతం పొందే సౌలభ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి కల్పించారు. 919గా ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను 2,262కు పెంచారు. హైదరాబాద్, ముంబయి, చెన్నైల లోనూ 202 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పొందే వెసులుబాటును ముఖ్యమంత్రి కల్పించారు. పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చి సెంటర్ను ఏర్పాటు చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్ మాటి చ్చారు. నేను కూడా అధికారుల బృందంతో కలిసి ఉద్దానం ప్రాంతంలో పర్యటించాను. ఆ ప్రాంత కిడ్నీ బాధితుల సమస్యలను తెలుసు కున్నాను. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి మాటంటే మాటే. పలాసలో రూ. 50 కోట్లతో 200 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణాన్ని సీఎం ప్రారంభించారు. ఈ ఆస్పత్రి అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఉద్దానం వాసులకు ముందు స్వచ్ఛమైన మంచి నీటిని అందించే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఇంతటితో సరిపెట్టకుండా తీవ్రంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి నెలనెలా పెన్షన్ సాయం అందించేలా ఆదేశించి జగన్ మోహన్ రెడ్డి మానవీయ స్పర్శను చూపించారు. కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడరాదని ముఖ్యమంత్రి ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలో 66.17 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించారు. వీరిలో 4.38 లక్షల మందికి పైగా కంటిచూపు సంబంధిత సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. కళ్లజోడు అవసరమున్న 1.58 లక్షల మందికి మా ప్రభుత్వమే వాటిని పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 24.65 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 10.61 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేయడమే కాకుండా 4.70 లక్షల మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో రూ. 8,480 కోట్ల వ్యయంతో కొత్తగా 17 వైద్య కళా శాలలనూ ముఖ్యమంత్రి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 వైద్య కళాశాలల పటిష్ఠానికీ, ఉన్నతీకరణకూ రూ. 3.8 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ పరంగానూ అందుబాటులోకి తేవాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అదీ మారు మూల గిరిజన ప్రాంతాలకు మరింతగా వైద్య సేవలు అందాలన్నది ఆయన ఆశయం. అందుకే వారికోసం రాష్ట్రంలో ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులను సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయ గూడెం, డోర్నాలల్లో రూ. 246.30 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. కడపలో రూ. 257 కోట్లతో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, మానసిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆరోగ్య రంగం పరంగా ఇంత ప్రగతిని సాధించడం ముఖ్యమంత్రి ఈ రంగంపై పెట్టిన దృష్టికి తార్కాణంగా భావించాలి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతా శయానికి అనుగుణంగా వైద్య, ఆరోగ్య రంగానికి గత నాలుగేళ్లలో కేటాయించిన బడ్జెట్ మొత్తం 54.6 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంది. గ్రామాల్లో ప్రతి రెండు వేల జనాభాకు ఒక క్లినిక్ పని చేయా లన్నది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సమున్నత లక్ష్యంగా ఉంది. ఈ ఆశయానికి అనుగుణంగా 10,032 ‘డాక్టర్ వైఎస్సార్ విలేజ్హెల్త్ క్లినిక్స్’ ఏర్పాటవుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫై అయిన కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)తో పాటు ఒక ఏఎన్ఎంతో ఈ క్లినిక్స్ పనిచేస్తాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లో గ్రామస్థులకు 62 రకాల వైద్య సేవలు లభిస్తాయి. ఈ క్లినిక్స్ అన్నీ టెలిమెడిసిన్ సేవ లనూ అందిస్తాయి. స్పెషలిస్టు డాక్టర్ల కన్స ల్టేషన్ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా... పీహెచ్సీ లోని ఇద్దరు డాక్టర్లలో ఒకరు 104 వాహనంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శిస్తారు. అక్కడే ఆ గ్రామ ప్రజలకు జనరల్ ఓపీ, గర్భవతులకు వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు నిర్వహిస్తారు. తల్లీబిడ్డల సంరక్షణ; అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల సందర్శన; రక్తహీనత కలిగిన రోగులను గుర్తించి చికిత్స అందించడం వంటి విధులూ నిర్వహిస్తారు. గ్రామంలో మంచం మీది నుంచి లేవలేని స్థితిలో ఎవరైనా ఉంటే వారి ఇంటికి వెళ్లి పరీక్షలు, చికిత్సలు,మందులు ఉచితంగా అందజేస్తారు. గ్రామ పారిశుద్ధ్యం విషయమై పంచాయతీ కార్యదర్శిని సమన్వయం చేసుకోవడం వంటి విధులనూ డాక్టర్లు నిర్వహిస్తారు. ఈ మొబైల్ యూనిట్లలో 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ట్రయల్ రన్లో 2023 ఫిబ్రవరి వరకు 54.3 లక్షల మంది వారి వారి గ్రామా ల్లోనే ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందుకున్నారు. ఇవ్వాళ్ల ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అలా నిలవడానికి చేస్తున్న కృషిలో నేనూ భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. విడదల రజిని, వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి (నేడు ‘ఫ్యామిలీ డాక్టర్‘ పథకం ప్రారంభం) -
AP: ‘డాక్టర్’ గారు వచ్చేశారు!
సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య అనుబంధాన్ని బలపరచడం ద్వారా మెరుగైన వైద్య సంరక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మక ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఏమిటీ విధానం? ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమ కుటుంబ వైద్యుడిని సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్యం పట్ల సంబంధిత వైద్యుడు నిరంతరం ఫాలోఅప్లో ఉంటారు. ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యంపై డాక్టర్కు సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక అనుబంధం ఏర్పడి ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ అందుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం. ఇలా నిర్వహిస్తున్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. 14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో), ఏఎన్ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు. ప్రతి క్లినిక్లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్ అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్వో, ఏఎన్ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు. కొత్తగా 260 ఎంఎంయూ వాహనాలు పీహెచ్సీ వైద్యులు తమకు కేటాయించిన గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో మండలానికి ఒక 104 ఎంఎంయూను సమకూర్చి సేవలను బలోపేతం చేసింది. అయితే ప్రతి గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉన్నందున ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా కొత్తగా 260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నాలుగేళ్లలో 48,639 వైద్య పోస్టుల భర్తీ ఫ్యామిలీ డాక్టర్ విధానం సమర్థంగా అమలయ్యేందుకు ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులతోపాటు మండలానికి రెండు పీహెచ్సీలు లేదా ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్సీలకు అదనంగా 151 పీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా వైద్యుడు సెలవుపై వెళితే ఫ్యామిలీ డాక్టర్ సేవలకు అంతరాయం కలగకుండా అదనపు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఏడు పీహెచ్సీలకు ఒకరు, జిల్లాకు నలుగురు చొప్పున 285 మంది అదనపు వైద్యులను సమకూర్చారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ పథకం కోసం కొత్తగా వైద్య పోస్టులు సృష్టించడంతోపాటు అప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసి మొత్తంగా 2,875 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా మిగలకుండా గత నాలుగేళ్లలో 48,639 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యులకు ఫోన్లు వైద్యులు గ్రామాలను సందర్శించని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్ను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు. గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు – గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్ – హిమోగ్లోబిన్ టెస్ట్ – ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) – మలేరియా టెస్ట్ – హెచ్ఐవీ నిర్ధారణ – డెంగ్యూ టెస్ట్ – మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) – అయోడిన్ టెస్ట్ – వాటర్ టెస్టింగ్ – హెపటైటిస్ బి నిర్ధారణ – ఫైలేరియాసిస్ టెస్ట్ – సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ – విజువల్ ఇన్స్పెక్షన్ – స్పుటమ్ (ఏఎఫ్బీ) ట్రయల్ రన్లో 69 లక్షల మందికి వైద్య సేవలు – ఓపీ సేవలు– 25,80,599 – యాంటెనేటల్(గర్భిణులకు వైద్య సేవలు)– 4,03,500 – పోస్ట్నేటల్(బాలింతలకు వైద్య సేవలు)– 2,20,835 – మధుమేహం బాధితులు– 15,79,962 – రక్తపోటు బాధితులు– 20,98,028 – క్యాన్సర్ రోగులు– 33,635 నిరంతర సంరక్షణతో మంచి ఫలితాలు బీపీ నియంత్రణలో లేకపోవడంతో 20 శాతం పెరాలసిస్ కేసులు నమోదవుతున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో పలు రకాల జబ్బుల బారినపడుతున్నారు. గ్రామాల్లో జీవన శైలి జబ్బులు పెరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో నివసించే బీపీ, మధుమేహం, ఇతర సమస్యల బాధితులు తరచూ 5 నుంచి 10 కి.మీ ప్రయాణించి ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను కలసి మందులు తీసుకోవడం ఇబ్బందికరం. వైద్యుడే గ్రామాలకు వెళ్లి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం వాకబు చేయడం ప్రజారోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, సీనియర్ వైద్యుడు, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ అనుబంధంతో మానసిక బలం ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావడం మంచి పరిణామం. గర్భిణులు, బాలింతలు, బీపీ, మధుమేహం బాధితులను తరచూ పరామర్శించడం ద్వారా వైద్యులు వారిని గుర్తు పట్టి పేరుతో పలకరిస్తారు. తద్వారా వైద్యుడు, ప్రజలకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అది రోగికి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చిన సీఎం జగన్ దేశ వైద్య రంగ చరిత్రలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒక విప్లవాత్మక నిర్ణయం. ఇది ప్రజారోగ్య వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసింది. వైద్యుల కోసం ఆస్పత్రులకు వెళ్లి పడిగాపులు కాసే పరిస్థితులు తొలగిపోయి డాక్టర్లే గ్రామాల బాట పట్టడం సాధారణ విషయం కాదు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఒక్క ఫ్యామిలీ డాక్టర్ విధానమే కాకుండా వైద్య ఆరోగ్య రంగంపై రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చిస్తూ నాడు – నేడుతో ఆస్పత్రుల ఆధునికీకరణ, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చారు. ఆరోగ్య రంగంలో ఏపీ ఈ రోజు దేశానికి రోల్మోడల్గా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు – జనరల్ ఔట్ పేషెంట్ సేవలు – బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ – గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు.చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు. – రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు – ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. – పాలియేటివ్ కేర్.. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ -
‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం కోసం.. పల్నాడుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఫ్యామిలీ డాక్టర్ అనే మరో ప్రతిష్టాత్మక సంక్షేమ విధానానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు (ఏప్రిల్ 6వ తేదీ) సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారాయన. అనంతరం కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైద్య, ఆరోగ్య సేవలు నలుమూలలా విస్తరించే ఉద్దేశం, అలాగే స్పెషలిస్టు డాక్టర్ల సేవలను నేరుగా అందించే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది సీఎం జగన్ ప్రభుత్వం. ఇప్పటికే దశలవారీగా ట్రయల్ రన్స్ నిర్వహించగా.. అంతటా సూపర్ సక్సెస్ అయ్యింది కూడా. ఈ తరుణంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని అమలు చేయబోతోంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో.. గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లా లింగంగుంట్లకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్ని పరిశీలించిన అనంతరం.. అక్కడే ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ స్టాల్స్ను పరిశీలించనున్నారు. కావూరు గ్రామంలో ఏర్పాటు చేసే సభకు హాజరై.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
6న ఏపీ వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం
చిలకలూరిపేట: ఇప్పటి వరకు ట్రయల్ రన్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సీఎం వైఎస్ జగన్ పర్యటనపై శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే దిక్సూచిగా మారనుందన్నారు. ట్రయల్ రన్లో వేలాది మంది ఈ విధానం ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా పొందారని వెల్లడించారు. ప్రతి 2,000 జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ కేంద్రంగా ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా బృహత్తర వైద్య వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలోనే ఉంటూ వైద్య సేవలు అందిస్తారని, మరొకరు 104 వాహనం ద్వారా ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఓపీ సేవలతో పాటు గర్భిణులు, నవజాత శిశువులు, బాలింతలు, రక్తహీనతతో పాటు వివిధ సమస్యలున్న రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారన్నారు. నెలలో రెండుసార్లు వైద్యులు ఒక్కో గ్రామాన్ని సందర్శించి ఈ వైద్య సేవలను అందిస్తారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న రోగులకు సంబంధించి వారి ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధరప్రసాద్, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్ఈవో/సీహెచ్వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, త్వరలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల అధిపతులతో సోమవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో మంత్రి రజిని 2023–24 బడ్జెట్ అంచనాలు, వైఎస్సార్ కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్పై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ జిల్లా నోడల్ అధికారులు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. మందులషాపుల్లో మత్తు మందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని ఔషధ నియంత్రణ విభాగాన్ని ఆదేశించారు.‘వైఎస్సార్ కంటివెలుగు’ మూడో దశలో భాగంగా 35,42,151మంది వృద్ధులకు ఆరు నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 146 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాతవాటిలో ఎన్ని ‘మహాప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలన్నారు. వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, డీఎంఈ వినోద్కుమార్ పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆందోళన వద్దు.. ఇక మీ ఇంటికే డాక్టర్ వస్తాడు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ఘట్టానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈ నెల 15వ తేదీ తరువాత పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు సహా వివిధ కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటూ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 45,90,086 మందికి వైద్య సేవలు అందించినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రిఫరల్ సేవలను భాగం చేయండి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి ఇబ్బంది, సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా కార్డులపై నెంబర్ ఉంచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కార్డులపై ముద్రించాలన్నారు. రక్తహీనత బాధితుల వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్కు అనుసంధానించి పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పౌష్టికాహారం అందిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పీహెచ్సీల్లో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా వైద్యుల అదనపు నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇక డాక్టర్ల స్వల్పకాలిక సెలవుల సందర్భాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రతి 6–7 పీహెచ్సీలకు ఒక వైద్యుడిని అదనంగా నియమించామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్లో ఉంచినట్లు వెల్లడించారు. మరిన్ని ఔషధాలు.. టెస్టింగ్ కిట్లు.. రిజర్వు వాహనాలు రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లకుగానూ ప్రతి చోటా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ముగ్గురు నుంచి నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటారని అధికారులు చెప్పారు. విలేజ్ క్లినిక్స్, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ)లో మందుల సంఖ్యను 67 నుంచి 105కి పెంచామన్నారు. విలేజ్ క్లినిక్స్లో 14 రకాల వైద్య పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలకు అందించే వైద్య సేవలను రియల్ టైమ్లో నమోదు చేసేందుకు టూల్స్ సిద్ధం చేశామన్నారు. 104 ఎంఎంయూలు ప్రస్తుతం 676 ఉండగా కొత్తగా 234 వాహనాలతో కలిపి మొత్తం 910 ఎంఎంయూలతో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి జిల్లాకు బ్యాక్ అప్ కింద మరో 104 ఎంఎంయూ వాహనాన్ని రిజర్వ్లో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు.. ఫ్యామిలీ డాక్టర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు. జనరల్ ఓపీ, జీవన శైలి జబ్బులు, గర్భవతుల ఆరోగ్య సంరక్షణ, అంగన్వాడీ, పాఠశాలల సందర్శన, పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణ తదితర అంశాలపై వైద్యులు దృష్టి పెడతారని చెప్పారు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడంతో పాటు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ లాంటి విధులన్నింటినీ ఫ్యామిలీ డాక్టర్ నిర్వహిస్తారన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి జబ్బుల బాధితుల డేటా వివరాలు ఫ్యామిలీ డాక్టర్కు అందుబాటులో ఉంటాయన్నారు. వీరికి ఫాలో అప్ వైద్య సేవలను అందించడం కోసం ఈ డేటాను వినియోగిస్తామన్నారు. 108 అంబులెన్స్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కండిషన్లో లేని వాహనాలను తొలగించి కొత్తవాటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలు 146 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే ఎన్ఎంసీ అనుమతులు లభించాయని చెప్పారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 35.42 లక్షల మందికి వైఎస్సార్ కంటి వెలుగు సచివాలయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మూడో విడతలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 24,65,300 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంటి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తాజా సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి చికిత్స అందించే సంకల్పంతో కంటి వెలుగు కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 అక్టోబరు 10న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆరంభమైంది. తొలి రెండు దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,58,227 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షల నిర్వహణ, చికిత్స ప్రారంభించారు. 24,65,300 మందికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేసి 8 లక్షల మందికిపైగా వృద్ధులకు కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో మూడో విడతలో మిగిలిపోయిన 35.42 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 376 బృందాలతో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడతారు. వచ్చే ఆగస్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం.. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గ్లూకోమా, డయాబెటిక్ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు, సిబ్బందికి శిక్షణ కోసం ఎల్.వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ను భాగస్వామిగా చేసుకున్నారు. సీఎం సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ప్రత్యేకాధికారి డాక్టర్ అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎండీ మురళీధర్రెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్తో మెరుగైన ఆరోగ్య సంరక్షణ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం పుట్టిందని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆమె గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించాలని సీఎం జగన్ నిర్దేశించారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అమలుకు అన్ని వనరులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. క్లినిక్లలో సిబ్బంది పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. సికిల్ సెల్తో బాధపడే వారిని గుర్తించి.. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
ముంగిటకే వైద్యం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ప్రారంభమయ్యాక వైద్యుడితోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్స్ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో మందులు, ర్యాపిడ్ కిట్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించేలా ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్ కిట్లు సమకూరుస్తున్నారు. -
ప్రజారోగ్యం బలోపేతం.. మూడు కీలక కార్యక్రమాల అమలుకు సన్నద్ధం
సచివాలయ సిబ్బంది తరహాలోనే ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి కుటుంబాన్ని కలుసుకుని విలేజ్ క్లినిక్స్ సేవలను వివరించాలి. విలేజ్ క్లినిక్స్ ఆవశ్యకత, సిబ్బంది అందుబాటులో ఉంటున్న తీరు, సేవలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కలగాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రధాన కార్యక్రమాలకు మార్చి నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సందర్శన.. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు వారంలో మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ.. ఇలా ఈ మూడు కార్యక్రమాలను మార్చి నెలలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను నెలలో రెండు సార్లు వైద్యులు సందర్శిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 4 వేలు పైబడి జనాభా ఉన్న క్లినిక్లను నెలలో మూడు సార్లు సందర్శించేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో (ఎస్ఓపీ) పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం అంశాలను చేర్చామన్నారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి బాధితులకు వైద్యం అందించడంలో భాగంగా స్క్రీనింగ్, చికిత్సలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మార్చి 1 నుంచి ఆస్పత్రులను సందర్శించడం ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వో/జీఎంపీ ఆధీకýృత మందులు, సర్జికల్స్ మాత్రమే ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదు. ప్రజారోగ్య వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ఇప్పటికే కొనసాగుతోంది. ఇందులో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిదిద్దుకుని మార్చి 1వతేదీ తరువాత పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసేలా సన్నద్ధం కావాలి. సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత గుర్తింపు గ్రామ సచివాలయాల స్థాయిలోనే రక్తహీనత బాధితులను గుర్తించి ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్తహీనత నివారణకు వైద్యం, పౌష్టికాహారపరంగా అన్ని చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. డేటా అనుసంధానాన్ని సమర్థంగా చేపట్టాలి. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు పరస్పరం అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలి. కౌమార బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు బీ–12 సబ్ లింగ్యువల్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలి. పాఠ్య ప్రణాళికలో ఆరోగ్య అంశాలు పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కాలుష్యం తదితరాలకు సంబంధించి విలేజ్ క్లినిక్స్ సిబ్బంది సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలి. మండల స్థాయి అధికారులు, జేసీ, జిల్లా కలెక్టర్ వీటిపై పర్యవేక్షణ చేయాలి. 108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ దీనిపై సమీక్షించాలి. జిల్లాల్లో కలెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. ఎన్సీడీ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) నియంత్రణ, నివారణ, చికిత్సలపై దృష్టి సారించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటున్నారో లేదో ఆరా తీయాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన పేషెంట్లు డిశ్చార్జి అనంతరం ఇంటికి చేరుకున్నాక ఏఎన్ఎంలు వారిని పరామర్శించి ఆస్పత్రి సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఉద్దానం కిడ్నీ జబ్బులకు శాశ్వత పరిష్కారాలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బుల నివారణలో భాగంగా తాగునీటి కోసమే దాదాపు రూ.700 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పాలకొండ ప్రాంతంలో తాగునీటికి సుమారుగా రూ.265 కోట్లు వ్యయం చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండూ మార్చి కల్లా పూర్తవుతాయని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారాలు చూపుతోంది. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్య నివారణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. బోధనాస్పత్రుల్లో క్యాన్సర్కు అధునాతన చికిత్స ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్కు అధునాతన చికిత్స, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతమున్న, కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల్లో ఈ ప³రికరాలు, చికిత్సలు ఉండాలి. గుండె జబ్బుల చికిత్స కేంద్రాలుండాలి. అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్స్ పెట్టాలి. నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త బోధనాస్పత్రుల్లో ఇవి ఏర్పాటు కావాలి. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో క్యాన్సర్, కార్డియాక్ సదుపాయాలు ఉండాలి. ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె స్పెషాలిటీల్లో మరిన్ని పీజీ సీట్లు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారు. దంత సంరక్షణపై చిన్నారులు, పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స అందించడంపై ఆలోచన చేయాలి. రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ ఐదు అవార్డులు సాధించినట్లు వైద్య, ఆర్యోగ్యశాఖ మంత్రి విడదల రజని, అధికారులు తెలియచేయగా సీఎం జగన్ వారిని అభినందించారు. రాష్ట్రీయ కిషోర స్వాస్త్యా కార్యక్రమం (ఆర్కేఎస్కే)–స్కూల్, వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఇటీవల వైద్య శాఖకు లభించిన రెండు అవార్డులను సీఎం పరిశీలించారు. సమీక్షలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఎండీ మురళీధర్రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
-
తాడేపల్లి: సీఎం జగన్ను కలిసిన ప్రైమ్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఛైర్మన్
-
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగుంది
సాక్షి, అమరావతి: ప్రైమ్ హెల్త్కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ప్రైమ్ హెల్త్కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, అక్కడ టాప్ టెన్ వైద్య వ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీఎంతో సమావేశానంతరం డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి మాట్లాడుతూ ‘సీఎం జగన్తో సమావేశం మంచి సుహృద్భావ వాతావరణంలో జరిగింది. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు మంచి స్నేహితుడు.. అలాగే నా సహాధ్యాయి. మేం వివిధ అంశాలపై చర్చించాం. అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్యరంగంపై చర్చ జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం. ఏపీకి డిజిటల్ ఎక్స్రే మిషన్లు, అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కోవిడ్ సమయంలో కూడా అతితక్కువ వ్యవధిలో 1,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చాను. పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం అనేక గొప్ప పనులు చేస్తున్నారు. తన తండ్రిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారు, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంలో నేను భాగస్వామిని కావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’. అని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రసాద్ జి.రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, మెడికల్ అడ్వైజర్ ఎన్నారై ఎఫైర్స్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, పలువురు సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. -
Family Doctor: పల్లె తలుపు తట్టి.. ప్రజల నాడి పట్టి..
(చిట్యాల, వేములపల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) ‘‘ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి మందులు వాడుతున్నారా?’’ ‘‘బాగానే ఉంది..’’ సైగల ద్వారా కోటేశ్వరరావు సమాధానం. ‘‘పెద్ద డాక్టర్ రాసిచ్చిన మందులతో పాటు పోయినసారి మీరిచ్చిన బీపీ మందులు సమయానికి ఇస్తున్నామమ్మా.. ఫర్వాలేదు.. నా బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది’’ ఇదీ.. తమ ఇంటికే వచ్చి పరామర్శిస్తున్న డాక్టర్తో ఆనందంగా కోటేశ్వరరావు తల్లి నాగమ్మ సమాధానం. ‘‘సరే.. గుండె కొట్టుకోవడం, పల్స్ రేట్, బీపీ, షుగర్.. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న మందులు అలానే కొనసాగించండి. ఏదైనా సమస్య వస్తే సిబ్బందిని సంప్రదించండి. లేదంటే నాకు ఫోన్ చేయండి. ధైర్యంగా ఉండండి..’’ డాక్టర్ భరోసా. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో ఉన్న ఊరికే వైద్యులు వచ్చి ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగాయని గ్రామీణ ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓపీ (అవుట్ పేషంట్) సేవలు అందించి, ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే సరికొత్త కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ 21న వైద్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ సుష్మ ప్రియదర్శిని చిట్యాల గ్రామంలో నివసించే పక్షవాత బాధితుడు కోటేశ్వరరావు ఇంటిని నెలకు ఒకసారి సందర్శిస్తున్నారు. ‘గతంలో బీపీ, షుగర్ పరీక్షల కోసం ఆస్పత్రికి ప్రత్యేకంగా ఆటోలో వెళ్లాల్సి రావడంతో డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు’ అని ఆ కుటుంబం చెబుతోంది. ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వి.కృష్ణ గత ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కాలు విరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి ఉచితంగా మందులతో పాటు మూడు నెలల విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.12,500 ఆర్థిక సాయం చేసింది. పీహెచ్సీ డాక్టర్ ఇంటికే వెళ్లి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కె.లక్ష్మి ఐదు నెలల గర్భిణి. గతంలో వైద్య పరీక్షల కోసం ప్రతి నెల 9వ తేదీన పెండ్యాల పీహెచ్సీకి వెళ్లేది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా అవసరమైతే గ్రామంలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్కు వెళ్లేది. అయితే ప్రస్తుతం నెలలో రెండు రోజులు పీహెచ్సీ వైద్యురాలు గ్రామానికే వస్తున్నారు. ఆమెకే కాకుండా విలేజ్ క్లినిక్ పరిధిలోని 21 మంది గర్భిణులకు వైద్య సేవలు ఇంటి వద్దే అందుతున్నాయి. తొలగిన వ్యయ ప్రయాసలు దాదాపు 1,800 మంది నివసించే చిట్యాలలో 2019కి ముందు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం ఆరు కి.మీకి పైగా ప్రయాణించి వత్సవాయి పీహెచ్సీకి వెళ్లాల్సి వచ్చేది. స్పెషలిస్ట్ డాక్టర్ కోసం 30 కి.మీ పైగా దూరంలో ఉండే నందిగామ లేదంటే 80 కి.మీ పైనే ఉన్న విజయవాడకు వెళ్లక తప్పదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 67 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తుంది. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామానికే వస్తున్నారు. గ్రామంలో 239 మంది బీపీ, షుగర్ బాధితులున్నారు. 13 మంది గర్భిణులు, ఏడుగురు బాలింతలు, 18 మంది అనీమియా బాధితులకు డాక్టర్ సేవలు అందుతున్నాయి. వేములపల్లిలో 220 మంది బీపీ, షుగర్ బాధితులు, 21 మంది గర్భిణులు, 9 మంది బాలింతలకు పీహెచ్సీ డాక్టర్ నెలలో రెండు దఫాలు గ్రామానికే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వేములపల్లిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో వైద్య సేవలు పొందుతున్న రోగులు అంగన్వాడీలు, స్కూళ్లకు కూడా.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులకు ఆయా పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. ఒక్కో సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు సందర్శించి గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 104 ఎంఎంయూతో పాటు వెళ్లి విలేజ్ క్లినిక్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ గ్రామంలో మంచానికే పరిమితం అయిన వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాత బాధితులు, ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించి అవసరమైన సేవలు అందచేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 12.72 లక్షల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ అక్టోబర్ 21న ప్రారంభం కాగా ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 7,166 విలేజ్ క్లినిక్లను నెలలో రెండుసార్లు, 2,866 క్లినిక్లను నెలలో ఒకసారి సందర్శిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 12,72,709 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు. ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర ధీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్బీ) పెద్ద భారం తప్పింది నాకు 72 ఏళ్లు. నడుము నొప్పి ఉంది. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలను. బీపీ, షుగర్కు నెల నెలా డాక్టర్కు చూపించుకునేందుకు నా కుమార్తె పట్ణణానికి తీసుకెళ్లేది. ఇప్పుడు వేములపల్లెకు ప్రభుత్వ డాక్టర్ నెలకు రెండు సార్లు వస్తున్నారు. డాక్టరమ్మ బాగా చూస్తోంది. మందులు రాసిచ్చింది. దగ్గరే కాబట్టి ఒక్కదాన్నే వస్తున్నా. పెద్ద భారం తొలగింది. లేదంటే నా కుమార్తె రోజంతా తన పని వదులుకోవాల్సి వచ్చేది. – వసంత నాగేంద్రమ్మ, ఎస్.అమరవరం, ఎన్టీఆర్ జిల్లా బాలింతకు వైద్య సేవలు.. ఇటీవల పాప పుట్టింది. నాకు పుట్టుకతోనే ఫిట్స్ సమస్య ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవానికి నిరాకరించడంతో వత్సవాయి పీహెచ్సీ డాక్టర్ విజయవాడకు రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు కాన్పు చేశారు. ఫిట్స్ సమస్యకు కూడా వైద్యం చేశారు. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాక వైద్యులు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అవసరమైన మందులిస్తున్నారు. – అద్దంకి మౌనిక, చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా కొత్త అనుభూతి.. నెలలో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్లాలో మాకు ముందుగానే టైమ్ టేబుల్ నిర్దేశించారు. ఉదయమే 104 ఎంఎంయూతో పాటు గ్రామానికి వెళ్తాం. ముందు రోజే సంబంధిత గ్రామ ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సమాచారం ఇస్తారు. ప్రజల వద్దకే వెళ్లి సేవ చేస్తుండటం ఓ కొత్త అనుభూతి. – డాక్టర్ సుష్మ ప్రియదర్శిని, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా నిరంతరం సమీక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ విజయవంతంగా నడుస్తోంది. నిరంతర సమీక్షతో క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం. మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నాం. రోగులు, వైద్యం వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర ‘ఆయుష్మాన్ భారత్’ డిజిటల్ ఖాతాల్లో నిక్షిప్తం అవుతుంది. – ఎం.టి.కృష్ణ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైద్య రంగంలో సమూల మార్పులు ఒకప్పుడు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ వైద్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఆ పరిస్థితులను సీఎం జగన్ సమూలంగా రూపుమాపారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది, మందులు ఉండేవి కాదు. ఇప్పుడు విలేజ్ క్లినిక్ల ద్వారా 67 మందులు, 14 వైద్య పరీక్షలు, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాం. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
దేశవ్యాప్తంగా 'ఫ్యామిలీ డాక్టర్' విధానం ప్రవేశపెట్టాలి
న్యూఢిల్లీ: వైద్య, ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. దేశంలో 75 శాతం వైద్య ఆరోగ్య సేవలు కేవలం పట్టణ ప్రాంతంలోనే కేంద్రీకృతం అయ్యాయి. అంటే దేశ జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించే 27 శాతం ప్రజలకే ఈ వైద్య సేవలు పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య సేవలను దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. ఒకప్పటి ఫ్యామిలీ డాక్టర్స్ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వైద్య ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావచ్చని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఆ కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు: ఎంపీ మిథున్రెడ్డి) ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా సాధారణ వైద్యఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో గ్రామీణ ప్రాంతంలో అనేక జబ్బులకు సకాలంలో చికిత్స లభిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్స్ రోగులకు నేరుగా చికిత్స అందించడం లేదా మెరగైన చికిత్స కోసం స్పెషలిస్టు డాక్టర్లకు సిఫార్సు చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను ఆరంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో వైద్యం కోసం నకిలీ డాక్టర్లపై ఆధారపడే అవసరం తప్పుతుంది. నిక్కచ్చిగా జరిగే రోగ నిర్ధారణ పరీక్షల వలన ఆస్పత్రుల్లో చేరే అవసరం కూడా గణనీయంగా తగ్గుతుంది. అలాగే జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి, పని భారంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఒక ఉదాహరణగా నిలిచిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఎంపిక చేసిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నదని చెప్పారు. భారతీయులందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వైద్య, ఆరోగ్య సేవలను విస్తరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
త్వరలో పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్’!
వారిని పరామర్శించండి.. గ్రామ సందర్శనలో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన వారిని, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర జబ్బులతో మంచానికే పరిమితమైన వ్యక్తులను ఫ్యామిలీ డాక్టర్ కలుసుకుని పరామర్శించాలి. ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేయాలి. అవసరమైన వైద్య సేవలు, మందులు అందించాలి. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్ స్థాయి వరకు ట్యాబ్లు/సెల్ఫోన్లు అందించాలి. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి అమలు చేస్తున్న ఎఫ్పీసీ, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాల యాప్లన్నీ వీటిలో పొందుపరచాలి. ఫ్యామిలీ డాక్టర్ సంబంధిత గ్రామానికి వెళ్లి అందిస్తున్న వైద్య సేవల రియల్ టైమ్ డేటాను రికార్డు చేయాలి. దీనివల్ల సిబ్బంది, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందచేసి క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచనలివ్వాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) పూర్తి స్థాయిలో అమలుకు సన్నద్ధం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. డాక్టర్లే స్వయంగా గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో అదనంగా అవసరమయ్యే 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలను త్వరగా సమకూర్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఎఫ్పీసీపై పర్యవేక్షణకు సమర్థ యంత్రాంగం ఉండాలని, రాష్ట్రం, అసెంబ్లీ, మండలాల వారీగా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణకు అధికారులను నియమించాలని సూచించారు. వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని, అన్ని ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఆలోగా విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను వేగవంతం చేసి ఉగాది కల్లా పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన కొనసాగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పూర్తయ్యేకొద్దీ ఆయా చోట్ల పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ ఏడాది అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టు అమలుపై సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భాగస్వామ్యం ఎఫ్పీసీ అమలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లలు, గర్భవతులు, బాలింతలను గుర్తించి ఆ వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అందచేయాలి. వాటి ఆధారంగా పౌష్టికాహారం, మందులు అందించేలా చర్యలు తీసుకోవాలి. యాప్లో ఆసుపత్రుల వివరాలు.. ఏ వ్యాధికి, ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాలి. సంబంధిత చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్ రూపొందించాలి. ఆసుపత్రి లొకేషన్తో పాటు డైరెక్షన్ కూడా వెల్లడించేలా యాప్ ఉండాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల దగ్గర నుంచి అందరూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి గురించి గైడ్ చేసే పరిస్థితి రావాలి. ప్రజలకు ఈ యాప్ అందుబాటులో ఉండాలి. ఫిర్యాదులన్నీ 104 ద్వారా ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నెట్వర్క్ ఆస్పత్రులు రోగులకు సరిగా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లోపించడం లాంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. నెగిటివ్ ఫీడ్ బ్యాక్పై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి. డయాలసిస్ రోగులకు సేవలందించేందుకు 108 వాహనాలను వినియోగించుకోవాలి. ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి. విలేజ్ క్లినిక్స్ సహా అన్ని చోట్లా ఈ నంబర్ను ప్రదర్శించాలి. మరో 260 వాహనాలు.. ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ కార్యక్రమంలో భాగంగా వైద్యులు 7,166 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను రెండు సార్లు, 2,866 విలేజ్ క్లినిక్లను ఒకసారి చొప్పున సందర్శించినట్లు అధికారులు తెలిపారు. గత అక్టోబర్ 21 నుంచి ఇప్పటివరకు 7,86,226 మందికి వైద్య సేవలందించామన్నారు. రక్తపోటు బాధితులు 1,78,387, మధుమేహం బాధితులు 1,25,948 మందికి మందులు అందచేసినట్లు వివరించారు. డిసెంబర్లో 104 ఎంఎంయూ వాహనాలను అదనంగా 260 సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పూర్తి స్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎఫ్పీసీతో వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం గణనీయంగా పెరిగిందని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కూడా సిబ్బంది భాగస్వామ్యం బాగా పెరిగిందని చెప్పారు. పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి జి.ఎస్.నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జి.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఏపీ ఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్ కుమార్, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్: తలుపు తట్టి.. నాడి పట్టి
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు షబీరా. రామకుప్పం మండలం కెంచనబల్ల . ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుతోనే జీవనం సాగిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. గతంలో వైద్య సేవల కోసం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పంలోని పీహెచ్సీకి ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల కొద్దీ క్యూలో ఉంటేనే వైద్యం అందేది. ఇప్పుడా అవస్థలు తప్పాయి. ఇంటి దగ్గరకే డాక్టర్, వైద్య సిబ్బంది వచ్చి బీపీ, షుగర్ స్థాయిని పరిశీలించి మందులు అందజేస్తున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య ఉందని గుర్తించిన డాక్టర్లు గతవారం 108 ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించారు. ఇలా నడవలేని, కదలేని స్థితిలో చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వ్యాధుల బారిన పడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే బెంగ ఇక ఉండబోదు. నాణ్యమైన వైద్యం ఇంటి తలుపు తడుతోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువచేసేందుకు ఇంటి వద్దే వైద్యం(ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్) అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే సకాలంలో చికిత్స ద్వారా కోలుకునే అవకాశం ఉంటుందని గ్రహించి ఆ మేరకు చర్యలు చేపట్టడం విశేషం. చిత్తూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీలేని నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరికీ చేరువ అవుతోంది. దాదాపు 4వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరి«ధిలోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించడం విశేషం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు. ఏళ్ల తరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంటి వద్దకే వైద్యం అనే నినాదంతో ప్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం అమలుకానుంది. డేటా యాప్లో రోగుల ఆరోగ్య వివరాలు ఫ్యామిలీ డాక్టర్స్ గ్రామ పర్యటనకు ముందురోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటిస్తారు. ప్రతి ఇంటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. 14 రకాల రక్తపరీక్షలతో పాటు వివిధ ప్రాథమిక వైద్య పరీక్షలు చేపడతారు. ఇందుకు సంబం«ధించిన పూర్తి ఆరోగ్య వివరాలను డేటా ఎఫ్పీసీ యాప్లో పొందుపరు స్తారు. కుటుంబం, అందులోని వ్యక్తులు, వారి వివరాలను పూర్తి స్థాయిలో డేటా యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇలా నెలకు రెండుసార్లు ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం నిర్వహిస్తారు. 67 రకాల మందులు నూతన విధానంలో భాగంగా ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వ హిస్తారు. 104 (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనంలోని మెడికల్ ల్యాబ్లో 14 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉంటాయి. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచనల మేరకు రక్తపరీక్షలు చేపడతారు. అలానే అనారోగ్య సమస్యలను గుర్తించి బాధితులకు అప్పటికప్పుడే మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ వాహనంలో 67 రకాల మందులు సిద్ధం చేశారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం శస్త్ర చికిత్సల అనంతరం బాధితుడి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందుబాటులో వైద్యులు జీఓ 143 ప్రకారం ప్రతి పీహెచ్సీలోనూ 14 మంది వైద్య సిబ్బంది ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది వైద్యులను నియమించింది. అదేవిధంగా టెక్నీషియన్స్, డిజిటల్ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో నియమించి విలేజ్ హెల్త్ క్లినిక్లను బలోపేతం చేసింది. పకడ్బందీగా అమలు జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు వైద్యాన్ని తీసుకొచ్చింది. డాక్టర్లు రోగుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విజయవంతంగా జరుగుతోంది. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
‘ఫ్యామిలీ డాక్టర్’పై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయిల్ రన్ను సమర్థంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఏం చేయాలనే దానిపై నిరంతరం కసరత్తు చేయాలన్నారు. మంగళగిరి ఏపీ ఐఐసీ టవర్స్లోని తన కార్యాలయంలో బుధవారం వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత నెల 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ ట్రయిల్ రన్ ప్రారంభమైందని తెలిపారు. దీనికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, వైద్యుల నుంచి వస్తున్న సూచనలు తదితర వివరాలను వివరించారు. మూడు వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4,733 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లకు రెండుసార్లు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలు వెళ్లాయని, సిబ్బంది గ్రామాలకే వెళ్లి వైద్య పరీక్షల సేవలు అందించారని పేర్కొన్నారు. మరో 4,267 విలేజ్ హెల్త్ క్లినిక్లకు 104 ఎంఎంయూ వాహనాలు ఒకసారి వెళ్లాయని వివరించారు. గ్రామాలకే వైద్యులు వెళ్లడం గొప్ప విషయం మంత్రి రజిని మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి సంబంధించి తాను స్వయంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నానని, వారి నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 97,011 మంది బీపీ బాధితులు, 66,046 మంది సుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేసినట్టు చెప్పారు. వైద్య విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్షిప్ల పంపిణీ వైద్య రంగానికి సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి రజిని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో బుధవారం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. మంత్రి రజిని మాట్లాడుతూ వైద్యశాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేశామన్నారు. సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను సైతం పరిశోధనల్లో ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు. ఈ రీసెర్చ్ ఫలితాలు గ్రామీణ ప్రజలకు సైతం అందాలన్నారు. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామీణులకు పూర్తివైద్యం
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా పనిచేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్వోలకు) వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. ఆయన గురువారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సీహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో వైద్యసేవలన్నీ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా అందుబాటులోకి వస్తాయని, సీహెచ్వోలు టీం లీడర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక పెద్దల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎన్సీడీ సర్వేను త్వరగా పూర్తిచేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లతో పాటు టెలిమెడిసిన్ ద్వారా అవసరమైన మేరకు వైద్య సహాయం అందించాలని సూచించారు. పీహెచ్సీ వైద్యుడు గ్రామాన్ని సందర్శించే ముందురోజు సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు రోగులను ఆస్పత్రికి తీసుకొచ్చేలా పనిచేయాలన్నారు. జిల్లా హబ్ల సూచనల మేరకు రోగులను ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించడంతోపాటు చికిత్స అనంతరం తిరిగివచ్చిన రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారంతో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ–అభా) నమోదు ప్రక్రియలో మిగిలిన 30 శాతాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణుల విషయంలో సీహెచ్వోలు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. -
‘ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తోందని చెప్పారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ‘సుస్థిర అభివృద్ధి సూచికలు 2022–23’పై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల విజయవంతంలో వైద్యాధికారుల పాత్ర చాలా కీలకమన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై నిర్దేశించారు. ప్రస్తుతం జిల్లాలో ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ విధానం ట్రయల్ రన్ జరుగుతోందన్నారు. ప్రతి నెలా రెండు దఫాలు సచివాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, కౌమారదశ పిల్లలకు ఓపీ సేవలు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలోఅప్, మంచాలకే పరిమితమైన రోగుల గృహాలను సందర్శించి చికిత్సలు అందజేస్తారన్నారు. ట్రయల్ రన్ను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లాలో సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల ద్వారా సంక్రమించే జబ్బుల నివారణకు సర్పంచ్ల ద్వారా ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాతాశిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం వంద శాతం ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విశ్వనాథయ్య మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార సమతుల్యత, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకిన్ కూలర్లను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఎయిడ్స్, కుష్టు రోగుల మందులను భద్రపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ కృష్ణవేణి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం అధికారులు అనుపమ జేమ్స్, సుజాత, చెన్నకేశవులు, నారాయణస్వామి, డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాల పంపిణీకి చకచకా ఏర్పాట్లు అనంతపురం అర్బన్: పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పేదలందరికీ ఇల్లు పథకం’ కింద అర్హులైన పేదలకు ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. అర్హులై ఉండీ అందులో లబ్ధిపొందని వారు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ‘90 రోజుల్లో ఇంటి పట్టా పథకం’ కింద మంజూరు చేస్తుంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పథకం కింద అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 7,155, గుంతకల్లు డివిజన్లో 2,573, కళ్యాణదుర్గం డివిజన్లో 1,820 చొప్పున 11,548 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి ఇంటి పట్టా ఇచ్చేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగనన్న లే అవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించడం.. అవసరమైన చోట భూ సేకరణ చేపట్టడం వంటి అంశంపై అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. -
ఐదు రోజుల్లో ఇలా.. విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా ఈ నెల 21 నుంచి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం ట్రయల్ రన్ జోరుగా కొనసాగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే 26 జిల్లాల్లోని 3,160 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్లో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఐదు రోజుల్లో 89,705 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులిచ్చారు. చదవండి: AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు పక్షవాతంతో, నరాల బలహీనతలతో నడవలేని వారి ఇళ్లకు డాక్టర్లు, వైద్య సిబ్బం ది స్వయంగా వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం ప్రతి పీహెచ్సీలో ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్తో సహా సిబ్బంది, డాక్టర్తో పాటు ఆశా వర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల్లో.. ♦ఓపీల ద్వారా 37,309 మందికి సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. ♦జ్వరంతో బాధపడుతున్న 11,247మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ♦3,540 మంది గర్భిణులకు యాంటినేటల్ కేర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ♦607 మంది బాలింతలకు, వారి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ♦2,956మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ♦ఇక జీవనశైలి జబ్బులతో పాటు అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న 34,046 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ♦మరోవైపు.. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ ♦క్లినిక్స్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ అమలును ప్రత్యేక యాప్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశారు. ట్రయల్ రన్లో ఎదురయ్యే ఇబ్బందుల ఆధారంగా వాటిని సరిచేసుకుని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విధానంపై పల్లెల్లోని అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. జగన్బాబుకు రుణపడి ఉంటాం నేను బీపీ, షుగర్, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాను. రెండు మూడుసార్లు ప్రైవేట్ ఆçస్పత్రిలో చూపించుకున్నాను. వెళ్లినప్పుడల్లా రూ.4వేలకు పైగా అవుతోంది. ఈసారి మా విలేజ్ క్లినిక్లో డాక్టర్కి చూపించాను. పరీక్షించి మందులిచ్చారు. ఊర్లోనే డాక్టర్ వైద్యం చేయడం మాలాంటి వృద్ధులకు మంచిది. సీఎం జగన్ బాబుకు రుణపడి ఉంటాం. – సన్యాసిదేవుడు, గన్నవరం, అనకాపల్లి జిల్లా మాలాంటి వారికి ఒక వరం సీఎం పుణ్యాన ఉచితంగా వైద్యం చేయడంతోపాటు ఇంటి వద్దకే వైద్యుడు రావడం సంతోషంగా ఉంది. మాలాంటి బీద వారికి ఫ్యామిలీ డాక్టర్ పథకం ఒక వరం. ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన బాధలేదు. – లక్ష్మీదేవి, ముద్దినాయనపల్లి, అనంతపురం జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్కు మంచి ఆదరణ ఈ పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. ఇందుకు ఉద్యోగులుగా మా సహకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అందిస్తాం. ఇప్పటివరకు పేదలు అప్పులుచేసి పట్టణాల్లో వైద్యం చేయించుకునేవాళ్లు. ఇప్పుడొక ఎంబీబీఎస్ డాక్టర్ నేరుగా ఇంటివద్దే వైద్యం అందించడం గొప్ప విషయం. ప్రజల్లో దీనిపై అవగాహన కలి్పస్తాం. – జక్కల మాధవ, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
Family Doctor: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా
‘ఆకలికి అన్నము వేదనకు ఔషధం’ అనే నానుడి మనకందరికీ తెలిసినదే! శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆనారోగ్య శరీరాలకు ఔషధం అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఔష ధాన్ని నిర్ణయించాల్సింది మటుకు వైద్యులే అనేది జగమెరిగిన సత్యం! రోగిని పరీ క్షించటం, వ్యాధిని నిర్ణయించి తగిన సమయంలో సరియైన మోతాదులలో మందులు వాడటం అనేది వైద్యుల బాధ్యతే. అయితే ‘విత్తం ఉంటేనే వైద్యం’ అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉండ టంతో సమాజంలోని పేద, మధ్యతరగతి వారు వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం గ్రామాల్లో స్థిర నివాసం ఉండే వైద్యులు ఉండేవారు. వారికి ఆ ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాల ఆరోగ్య స్థితుల పట్ల ఒక అవగాహన ఉండేది. అందువల్ల ఆయా కుటుంబాలకు వైద్య చికిత్స అందించడం తేలికయ్యేది. వారందరినీ ఫ్యామిలీ డాక్టర్లుగా వ్యవహరించడం కద్దు. అయితే ప్రస్తుతం వైద్యుల సంఖ్య పెరుగుతున్నా ఈ ఆధునిక కాలంలో పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రజలందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇందుకు వైద్యం ఖరీదైనదిగా మారటం ఒక కారణమైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎక్కువ మంది డాక్టర్లు పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడం ఇంకో కారణం. దీంతో ఆయా గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లోని వార్డుల్లో కానీ జీవించే వారికి ఫ్యామిలీ డాక్టర్ అనదగిన వైద్యుని సేవలు పొందే అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో లభిస్తూనే ఉంటాయి. అలాగే వైద్య సౌకర్యాలు ఫరవాలేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. అలాగే రోగం, రొప్పు వస్తే అర్హత గల డాక్టర్ వైద్య సేవలు మృగ్యం. నాసిరకం మందులు, నాటు మందులు మాత్రమే వారికి లభిస్తాయి. మూఢనమ్మకాలతో కూడిన వైద్యం వారిని కాటేస్తున్నది. నాణ్యమైన వైద్యం కావాలంటే... అప్పుల పాలు కావటమో, ఆస్తులు తాకట్టు పెట్టటమో, నగ నట్రా లేదా ఆస్తులు అమ్ముకోవటమో చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా స్త్రీలలో ప్రసవ వేదన సమస్యలు, సాధారణ స్త్రీ ఆరోగ్య సమస్యలు; దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సహజమైన ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో కలిగే రుగ్మతలు, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటికి చికిత్స పొందే తాహతు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా తక్కువ మందికే ఉంది. అందుకే ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయింది. మాటలతో మానసిక భరోసా, అవసరమైన వరకే మందులతో వైద్యం చేసే పరిస్థితి ప్యామిలీ డాక్టర్ విధానంలో ఉంటుంది. నిజంగా ఇది ‘కారుచీకటిలో కాంతి పుంజం’ వంటిదని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఆవిష్కరణ మన రాష్ట్రానికే కాదు దేశానికే, ఆదర్శం, హర్షణీయం. ఇదేదో ప్రభుత్వ ఆకర్షణీయ పథకం అనుకుంటే పొరపాటే! ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించి... తగిన విధంగా వైద్య సేవలను అందచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపక రిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వాలంటరీ వ్యవస్థ, నూతన విద్యా విధానాల వైపు దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీసుకువస్తున్న ‘ఫ్యామిలీ డాక్టర్స్’ విధానం మరింతగా దేశ ప్రజలను ఆకర్షించి మంచి ఫలితాలు పొందడానికి మార్గదర్శకమవుతుంది. ఇంగ్లాండ్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. వైద్యునికి రోగికి మధ్య సత్సంబంధాలు మెరుగుపరచటమే కాక.... సకాలంలో సరియైన రీతిలో ప్రజలకు పెద్దగా ఆర్థిక భారం లేని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. అందుకే ఈ విధానా నికి ఆహ్వానం పలుకుదాం! ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిద్దాం! (క్లిక్ చేయండి: మన మందులు మంచివేనా?) - అమరనాథ్ జగర్లపూడి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు
హిందూపురం: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని కలెక్టర్ బసంత్కుమార్ అన్నారు. విలేజ్ క్లినిక్లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్తో సంపూర్ణ రక్షణ పుట్టపర్తి అర్బన్: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక పాఠశాల వద్ద ఓపీ నిర్వహించగా, మధ్యాహ్నం వరకూ గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు వంటి వాటికి మందులు తీసుకున్నారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని, గర్భిణులు, బాలింతల ఇళ్లకే వెళ్లి వైద్యలు పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి, నిరుపేదలకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నెలా వైద్య బృందం గ్రామానికి విచ్చేసి రోజంతా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మానాయక్, పుట్టపర్తి వైద్యాధికారి నాగరాజు నాయక్, సీహెచ్ఓ నగేష్, రమణయ్య, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి ) -
‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
సాక్షి, అమరావతి: ప్రజలు, ప్రభుత్వ వైద్యుల మధ్య బంధాన్ని బలపరచడం ద్వారా మరింత మెరుగ్గా ఆరోగ్య సంరక్షణపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రజలు చిన్న అనారోగ్యాలకు పీహెచ్సీ, సీహెచ్సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూరిలోనే వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని శుక్రవారం నుంచి ట్రయల్ రన్ ప్రాతిపదికన మొదలు పెడుతోంది. ఇందుకోసం వైద్య శాఖ యలో ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే సంక్రాంతి లేదా ఉగాది నాటికి సరిదిద్ది ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ఈ విధానం లక్ష్యం, ఎవరి పాత్ర ఏమిటి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా పలుమార్లు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా యాప్ కూడా సిద్ధం చేశారు. ఏమిటీ ఫ్యామిలీ డాక్టర్? సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాలు స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తినా తమకు బాగా పరిచయం ఉన్న ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్గా ఎంచుకుని సంప్రదిస్తాయి. లక్షణాల ఆధారంగా జబ్బును గుర్తించి చిన్న సమస్యలైతే ప్రాథమిక వైద్యం అందించి స్పెషలిస్ట్ వైద్యం అవసరమైతే ఆయన రిఫర్ చేస్తారు. ఇలా వారి ఆరోగ్యం పట్ల కుటుంబ వైద్యుడు నిరంతరం శ్రద్ధ తీసుకుంటారు. ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంటుంది. తద్వారా ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. ఇదే తరహాలో గ్రామీణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ఫ్యామిలీ డాక్టర్ విధానం లక్ష్యం. ఎలా నిర్వహిస్తారు..? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను విభజిస్తారు. వైద్యులు తమకు కేటాయించిన సచివాలయాలను నెలలో రెండు సార్లు సందర్శిస్తారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ప్రజలకు వైద్య సేవలు అందచేస్తారు. మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీలు నిర్వహిస్తారు. ఆ తరువాత నిర్దేశిత గృహాలను సందర్శిస్తారు. అంగన్వాడీ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. 67 రకాల మందులు.. 14 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)తో పాటు సచివాలయ ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వీటిలో అందుబాటులో ఉంటారు. ప్రతి క్లినిక్లో 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్లు ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశాలు వైద్యుడు గ్రామానికి వచ్చే ముందు రోజే ప్రజలకు సమాచారం అందజేస్తారు. బాలింతలు, గర్భిణులు, సాంక్రమిక, అసాంక్రమిక సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యులకు ఫోన్లు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందజేశారు. వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. సమర్థంగా అమలుకు ట్రయల్ రన్ – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఫ్యామిలీ డాక్టర్ విధానం సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక. దీన్ని సమర్థంగా అమలు చేసేందుకు తొలుత ట్రయల్ రన్ చేపట్టాలని నిర్ణయించాం. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని మెరుగ్గా తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది ఆఖరు వరకూ ట్రయల్ రన్ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించి కొత్త సంవత్సరంలో సమర్థంగా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ లోగా కొత్తగా కొనుగోలు చేస్తున్న అదనపు 104 ఎంఎంయూలు అందుబాటులోకి వస్తాయి. న్యాయపరమైన ఇబ్బందులతో ఆగిన సీహెచ్వోల నియామకం పూర్తవుతుంది. ట్రయల్ రన్ కోసం ప్రతి జిల్లాకు అడిషనల్ డీఎంహెచ్వో స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా ఎంపిక చేశాం. ఎక్కడైనా పీహెచ్సీ వైద్యుడు సెలవు పెడితే ఆ రోజు సేవలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 మంది వైద్యులను ఆయా సీహెచ్సీల్లో ఉంచుతున్నాం. జిల్లాకు నలుగురు చొప్పున వైద్యులను డీఎంహెచ్వోల కార్యాలయాలకు కేటాయించాం. వీరి సేవలను పీహెచ్సీల్లో వైద్యులు సెలవులు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయం కింద వినియోగించుకుంటాం. మిగిలిన రోజుల్లో సీహెచ్సీ, డీఎంహెచ్వో కార్యాలయంలో విధుల్లో ఉంటారు. వైద్యుల విధులు - ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్పేషెంట్ సేవలు. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులకు రోగులకు రెగ్యులర్ చెకప్. - గర్భిణులు, బాలింతలకు యాంటీ నేటల్, పోస్ట్ నేటల్ హెల్త్ చెకప్స్. - నవజాత, శిశు సంరక్షణ. అంగన్వాడీలను సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి పరిశీలన. - పిల్లల్లో ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు. - మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హోమ్ విజిట్స్. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలో అప్ సేవలు. - మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సేవలు. పాఠశాల విద్యార్థులకు జనరల్ చెకప్. రక్త హీనత నివారణకు ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీపై పర్యవేక్షణ. సీహెచ్వో టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, స్పెషలిస్ట్ సేవలు ప్రజలకు అందించడం. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులను గుర్తించేందుకు స్క్రీనింగ్. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు. ఏఎన్ఎం గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రిఫర్ చేసిన ఆరోగ్యశ్రీ కేసులను ఫాలోఅప్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్ జగన్ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు అందించాల్సిన యాంటీనేటల్, పోస్ట్ నేటల్ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. - ఆశ వర్కర్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు పొందడానికి ప్రజలను సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాలను సందర్శించేందుకు మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్లో కుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది. ఇంటి ముంగిటికే వైద్యం ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చింది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బ్యాచ్కు ఒక్కో గ్రామం ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు. వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు.. ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు చేసేదిదీ.. ►వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. ►వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ►అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ►పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్లపై అవగాహన కల్పిస్తారు. ►రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ►గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. ►ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజలకు వైద్యసేవలు చేరువ
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని రూపొందించారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన సముదాయంలో ఉన్న వైద్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ నిర్వహించారు. వైద్య శాఖలోని వివిధ విభాగాల పనితీరు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఇతర ఆరోగ్య కార్యక్రమాలను కృష్ణబాబు వివరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో విలేజ్ క్లినిక్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, నలుగురు ఆశా వర్కర్లు పని చేస్తారని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు సందర్శిస్తారని తెలిపారు. గ్రామ స్థాయిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తామన్నారు. ఈ బాధ్యతను విలేజ్ ఆరోగ్య మిత్ర చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్ పాల్గొన్నారు. -
ఫోన్ కాల్తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్కు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైంది. త్వరలో ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు.. టాప్లో ఏపీ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా సచివాలయం యూనిట్గా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది. విలేజ్ క్లినిక్స్లో వివరాలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని సచివాలయాలను విభజిస్తున్నారు. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యను వివరించి సలహాలు, సూచనలు పొందవచ్చు. విలేజ్ క్లినిక్కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులను తీసుకోవచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు అవసరమైనవారు విలేజ్ క్లినిక్లో సంప్రదిస్తే టెలీ మెడిసిన్ ద్వారా ఆయా వైద్యులతో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) మాట్లాడిస్తారు. ప్రత్యేక యాప్ ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందిస్తోంది. సచివాలయాల వారీగా వలంటీర్ల క్లస్టర్ల ప్రాతిపదికన ప్రజల వివరాలను యాప్లో అందుబాటులోకి తెస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (జీవన శైలి జబ్బులు) సర్వేలో భాగంగా వైద్య శాఖ ప్రజలను స్క్రీనింగ్ చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్తో అనుసంధానిస్తున్నారు. యాప్లో వైద్యాధికారులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో విధులు నిర్వహించే ఎంఎల్హెచ్పీలు, సచివాలయ ఏఎన్ఎంలు.. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లాగిన్ ఉంటుంది. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు రోగి ఏ క్లస్టర్ పరిధిలో ఉంటారో చెబితే చాలు దాని ఆధారంగా ఎన్సీడీ సర్వేతో సహా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ యాప్లో ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు. ఆ వివరాలతో పాటు అవసరమైన మందులను కూడా యాప్లో నమోదు చేస్తారు. మందుల ప్రిస్క్రిప్షన్ ఎంఎల్హెచ్పీ లాగిన్కు వెళుతుంది. దాని ఆధారంగా రోగికి ఎంఎల్హెచ్పీ మందులను అందిస్తారు. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ సంబంధిత వ్యక్తి డిజిటల్ హెల్త్ ఐడీలో అప్లోడ్ చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వైద్యుడే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసే ఆప్షన్ను కూడా యాప్లో కల్పిస్తున్నారు. ఇబ్బందులు ఎదురవకుండా.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను ఇద్దరు వైద్యులకు విభజిస్తారు. రోజు మార్చి రోజు పీహెచ్సీ వైద్యుడు తనకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాలి. వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో ఉండి వైద్యసేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో వారికి సచివాలయాల్లోనే హాజరు నమోదుకు వీలు కల్పిస్తున్నారు. వైద్యుడితో పాటు ఏఎన్ఎంలు గ్రామంలో సేవలు అందించేలా ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ నమోదు చేసుకునేలా పనివేళలు మార్పు చేయనున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేరువే లక్ష్యం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్ను అందిస్తున్నాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పీహెచ్సీ, సీహెచ్సీలకు వెళ్లలేనివారు వైద్యుడికి ఫోన్ చేయవచ్చు. గ్రామాల్లో పాము కాట్లు, గర్భిణులకు పురిటి నొప్పులు తదితర సందర్భాల్లో 108 అంబులెన్స్ చేరుకునేలోపు పీహెచ్సీ వైద్యుడిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రాథమిక చికిత్స చర్యలను సూచిస్తారు. తద్వారా బాధితుల విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మెరుగైన సేవల కోసమే.. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మెరుగైన సేవలందించేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇలా అన్ని వివరాలను వ్యక్తిగత డిజిటల్ హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేస్తాం. బయోమెట్రిక్ ద్వారా సంబంధిత వ్యక్తి అంగీకారంతో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చే ఏడాది జనవరిలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు ప్రణాళిక రూపొందించాం. వైద్యులకు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పించడంతో పాటు ఏఎన్ఎంల హాజరు వేళల్లో మార్పుపై సచివాలయాల శాఖకు లేఖ రాశాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు ఎంతో మేలు.. పీహెచ్సీ వైద్యులకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ల పంపిణీ, శాశ్వత ఫోన్ నంబర్ కేటాయింపు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. అత్యవసర సమయాల్లో పీహెచ్సీ వైద్యుడికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. వైద్యులు బదిలీపై వేరే చోటకు వెళ్లినా ఫోన్ నంబర్లు మారవు. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, జీజీహెచ్ కర్నూలు నిరంతర ఫాలోఅప్.. మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న వారి ఆరోగ్యం గురించి నిరంతరం వాకబు చేసేందుకు యాప్లో మరో ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక జబ్బులు) బాధితుల వివరాలు సచివాలయాల వారీగా ఫ్యామిలీ డాక్టర్ యాప్లో ఉంటాయి. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు యాప్లో నమోదైన వివరాలను పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. అనారోగ్య సమస్యలతో శిశువు జన్మిస్తే వెంటనే నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తారు. ఆ వివరాలు కూడా యాప్లో నమోదు చేస్తారు. గర్భిణులు, బాలింతలకు చెకప్లు, విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర అంశాలనూ యాప్ పరిధిలోకి తెస్తున్నారు.