interesting facts
-
ధనము - ధర్మము ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
బృహస్పతి మతానుసారం... ఒక మనిషికి నాలుగు విధాలుగా సంపద సిద్ధిస్తుంది. వంశపారంపర్యంగా, దైవానుకూలత కల గడం వలన, సమయానికి చేయబడిన సత్ప్రయత్నం వలన, స్నేహితుల సహాయ సహకారాలు సమృద్ధిగా లభించడం కార ణంగా – అనేవి ఆ నాలుగు విధాలు. ధర్మయుక్తమైన ధనానికి, ధనంతో సంపన్నమైన ధర్మానికి మించినవి ఈ లోకంలో మరి లేవు. ఈ రెండూ మనిషికి అమృతంతో సమానమైనవిగా పరిణమిస్తాయి. సుఖము, దుఃఖము – ఈ రెండింటిలో ఏదిసంభవించినప్పటికీ మనస్సు వికారానికి లోను కాకుండా వ్యవహరించడాన్ని ‘ధృతి’ అంటారు. ధర్మార్థముల సాధన కోసం, మనిషి ఏ ఏ కష్టాలను సహిస్తాడో, ఆ సహనం అంతా ఆ వ్యక్తి యొక్క ‘తితిక్ష’గా పరిగణించబడుతుంది. తోటి వ్యక్తుల సమ క్షంలో సాత్వికుడిగా గుర్తించబడడానికి మనిషి చేసే ప్రయత్నం, ఆ సహనశీలత వల్లే సఫలమవుతుంది. సదా ధర్మాచరణం వలన మాత్రమే ఒక మనిషి ఆ స్థితికి చేరుకోగలడని విజ్ఞులు చెప్పారు. తాను కష్టం చేసి సంపాదించినవి, ధర్మబద్దంగా తనకు చెందినవి తప్ప, ఇతరులకు చెందిన వస్తువులను సొంతం చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఉండడం; ఎల్లప్పుడూ స్థిరచిత్తంతో ధీరుడై ఉండడం, భయాన్ని వీడడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడు కోవడం, సదా శాంతుడై ఉండడం – ఇవి ‘దమము’ యొక్క లక్ష ణాలుగా పరిగణించబడ తాయి. కనుక ఇంద్రియాలు బుద్ధికి లోబడి ఉండే సంయమనాన్ని సాధించడాన్ని ‘దమము’అంటారు. ‘జ్ఞానంతోనే ఆ ఉన్నత స్థితిని మనిషి సాధించగలడు’ అని వ్యాసమహర్షి మాటలలో మహాభారతం, శాంతిపర్వం, 36వ అధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం నొక్కి చెప్పింది. అదత్తస్యానుపాదానం దానమధ్యయనం తపఃఅహింసా సత్యమక్రోధఇజ్యా ధర్మస్య లక్షణమ్. ఎవరిచేతనైనా ఇవ్వబడని వస్తువులను తీసుకోకుండాఉండడం; దానము, అధ్యయనము, తపస్సులందు కోరిక కలిగి ఉండడము; మరో ప్రాణి సౌఖ్యానికి, మనుగడకు ముప్పు కలిగే పని చేయకుండా ఉండడము, ఎల్లవేళల నిజమునే మాట్లాడ డము, కోపం తెచ్చుకోవడం అనే లక్షణాన్ని పూర్తిగా వదిలి వేయడము – ఇవి ధర్మయుక్తమైన జీవితాన్ని గడిపి సద్గతిపొందాలని కోరుకునే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలని పై శ్లోకం ద్వారా అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు -
కోరిక కాదు ఓపిక కావాలి.. ఇంట్రస్టింగ్ స్టోరీ
ఒకప్పుడు ఋషులు, మునీశ్వరులు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శనభాగ్యం కోసం యోగముద్రలో, ధ్యానంలో ఉండేవారు. సృష్టికర్త దర్శనమిచ్చేంతవరకు వారి కార్యదీక్ష భగ్నం చేసుకునే వారు కాదు. వారి పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది.రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువై పోయాయి. కోరికలు తోడయ్యాయి. దైవపూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు. మనిషి తలరాతను రాసింది ఆయనే కదా!కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాస్తాడు. మంచి అయినా, చెడు అయినా జరిగి΄ోతూనే వుంటాయి. బ్రహ్మ రాతను మార్చటం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అలాంటి పాప, పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్త్రదానాలు, నిలువుదోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు. మనం మానవమాత్రులం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోర్కెలు ఉండటం సహజం. (చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!)ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారున్ని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీ కృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడు వరం కోరుకొమ్మంటే ఏమీ పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావికన్నా మామూలు మనుషులం మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇక ΄ాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే..ఇదీ చదవండి: శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహంభక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయ్. మొలకలను తినాలని పక్షులు చూస్తాయ్. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్. అన్నిటినీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్. జీవితం కూడా అంతే! వచ్చేవరకు వేచివుండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే...– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి. -
2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?2025లో పెద్ద పండుగలు, వారం తేదీభోగి : సోమవారం (13/01/25)మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)కనుమ : బుధవారం(15/01/25)మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)హోలీ: శుక్రవారం (14/3/25)ఉగాది : ఆదివారం (30/3/25)శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25) ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా? దీపావళి:సోమవారం (20/10/25)క్రిస్మస్ : గురువారం (25/12/25)అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి. -
వేలాదిమందికి పట్టెడన్నం పెట్టిన ‘కరుణామయుని కోవెల’కు వందేళ్లు (ఫోటోలు)
-
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్డిఎల్ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. అల్లుడికి అత్తమామల కానుకలేవో తెలుసా? (ఫొటోలు)
-
పెళ్లయిన నలుగురితో ఎఫైర్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్గానే స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్సూట్లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
సొంత హోటల్లో టాటా చేసిన పనికి ఫిదా!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.తానెవరో తెలియకుండా..“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.ఒక రోజు న్యూయార్క్లోని టాటా సొంత హోటల్లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.మరో కోణంఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్ఫిష్లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్ఫిష్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
ప్రపంచ బీర్ దినోత్సవం : క్రాఫ్ట్ బీర్ ఇంత పాపులర్?!
International Beer Day: వినడానికి, అనడానికి గమ్మత్తుగా ఉన్నా, ప్రతీ ఏడాది ఆగస్టు తొలి శుక్రవారం ప్రపంచ బీర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ బీర్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీర్ ప్రియులను ఒక్కచోట చేర్చే పండగ అదే దీని స్పెషల్. అయితే అంతర్జాతీయ బీర్ దినోత్సవం అమెరికాలో పాటించే జాతీయబీర్ దినోత్సవం కంటే భిన్నంగా ఉంటుంది. బీర్ అనేది ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్ డ్రింక్స్లో ఒకటి. ఇంటర్నేషనల్ బీర్ డే సందర్బంగా మనదేశంలో బాగా పాపులర్ అయిన క్రాఫ్ట్ బీర్, ఇతర విశేషాలను తెలుసుకుందాం.2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్లో జెస్సీ అవ్షలోమోవ్ అనే సామాన్యుడు ప్రారంభించారు. ఈ వేడుకను తొలుత ఆగస్టు 5 న జరుపుకునేవారట. కానీ ఆ తర్వాతి కాలంలో ఆగస్టు తొలి శుక్రవారం నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పురాతన ఇరాన్లో రసాయన అవశేషాల రూపంలో లభించిన పురాతన ఆధారాలతో బీర్ చరిత్ర సుమారు 3500-2900 బీసీ నాటిది. స్కాటిష్ బ్రూవరీ బ్రూమీస్టర్ తయారుచేసిన స్నేక్ వెనమ్ 67.5శాతం స్ట్రాంగ్తో ప్రపంచంలోనే అత్యంత బలమైన బీర్గా పేరొందింది.1040లో జర్మనీలోని ఫ్రీసింగ్లో స్థాపించబడిన వీహెన్స్టెఫాన్ బ్రూవరీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రూవరీ. బీర్ ఉత్పత్తి చేసే తొలి ఐదు దేశాలుఅమెరికా చైనా, జర్మనీ, రష్యా, బ్రెజిల్ నిలుస్తాయి. 5వ శతాబ్దంలో పురాతన గ్రీకు రచయిత జెనోఫోన్ రచనలలో బీర్ గురించిన మొట్టమొదటి లిఖిత ప్రస్తావన ఉందని చెబుతారు. క్రాఫ్ట్ బీర్ భారతదేశంలో బీర్ ఒక గమ్మత్తైన వ్యాపారం. ఇటీవలి వరకు మనదేశంలో స్ట్రాంగ్, లైట్ అనే బీర్లో ఉండేది. కానీ15 సంవత్సరాల క్రితం, ‘క్రాఫ్ట్ బీర్ ఎంట్రీ ఇచ్చి బాగా ప్రజాదరణ పొందింది. క్రాఫ్ట్ బీర్ అంటే సాంప్రదాయ బ్రూయింగ్ పద్ధతుల్లో, అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించి చిన్న, స్వతంత్ర బ్రూవరీస్ ద్వారా ఉత్పత్తి చేసే బీర్. వివిధ రకాల మాల్ట్లు, హాప్లు , ఈస్ట్ జాతులతో ప్రయోగాలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, కోల్కత, హైదరాబాద్ నగరాలతో పాటు బెంగళూరు, పూణే , ముంబై లాంటి నగరాల్లో క్రాఫ్ట్ బీర్ విరివిగా లభిస్తుంది. ఇండియన్ క్రాఫ్ట్ బీర్ మిల్లెట్, స్థానికంగా లభించే పండ్లు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది అంటారు ఈ రంగ నిపుణులు. పలు అంచనాల ప్రకారం క్రాఫ్ట్ బీర్ పరిశ్రమ 2014-2018 మధ్య కాలంలో 304 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇక 2024-2032లో 24.41శాతం పెరుగుతుందని అంచనా. నోట్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం. -
Tree frog శాపం గురించి ఎపుడైనా విన్నారా?! ఆసక్తికర సంగతులు
మా తోటలోని అధ్బుతమైన మర్రివృక్షం కింద కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు.. మన మనుషుల కోసం అనుకుని ఎంతో పొరబడ్డాను. మొదటి వేసవికాలంలో, కొన్ని చెట్టుకప్ప(Tree Frog) లు వచ్చి చక్కగా నివసిస్తుంటే, అది చూసి నేను ఎంతో ముచ్చటపడ్డాను. వాటి శరీరం కింద పొందికగా పెట్టిన వాటి నాజూకైన పాదాలతో, పెద్ద జాలిగొన్న కళ్ళతో చూసే వాటికి నేను ఇంత చోటు ఇవ్వడానికి వెనకాడలేదు. కానీ ఈ విషయం స్పష్టంగా మిగిలిన కప్ప వంశానికి తెలిసిపోయి, ముని ముని మనవలు, ముని ముని మేనల్లుళ్లు, మేనకోడలు మరియు అవ్వలూ, అందరూ వచ్చి చేరారు. అతి త్వరలో ప్రతీ చూరు, పుస్తకము, కప్పు, ఇంకా పటములు వాటితో నిండిపోయాయి. కొన్నయితే వాషింగ్ మెషీన్ సబ్బు పెట్టెలో కూడా దూరాయి; కొన్ని వాషబేసిన్ నుంచి బయటకి వెళ్లే పైపులలో, మరికొన్నైతే సుఖంగా ఫ్లష్ ట్యాంక్ గోతిలో, ఇక చాలా అయితే గోడకీ బీరువాకి మధ్యనున్న చిన్న చోటిలో దూరి పడుక్కున్నాయి. ఒక దయ నిండిన ఉద్వేగ క్షణంలో, మా బతుకు మేము బతకటానికి మాకు ఇంత చోటు వదిలాయి.అర దశాబ్దం క్రితం, ఒక ఏడాది నగరంలో గడిపినప్పుడు, నేను ఒక పిల్లిని కానీ, కుక్కని కానీ పెంచుకునే స్థోమత లేకపోయింది. వాటికి బదులుగా నేను ఒక చిన్న చెట్టు కప్పను పెంచుకున్నాను. తను ఉన్న చిన్న గదిలో నిత్యకృత్యాల కోసం ఒక చిన్న బేసిన్ పెట్టి, ఆహారం కోసం పురుగులను ఆకర్షించడానికి లైటు వేసి ఉంచాను. ఇది ఒక బాధ్యతారహిత బంధం: నేను నడిపించడానికి తీసుకువెళ్లాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, విద్యలు నేర్పాలని కానీ నా పెంపుడు కప్ప ఆశించలేదు. తన మనుగడ మొత్తం ఆ ఒక చిన్న తేమ నిండిన గదిలో సాగించింది. కిటికీ బయట తనకి బ్రతికి బట్ట కట్టే అవకాశం ఆట్టే లేని ఒక గందరగోళ కాంక్రీట్ అడవి ఉంది. చెప్పడానికి మేము ఒకరినొకరు హత్తుకుని గడపకపోయినా, ఆ కప్ప అక్కడ ఉండడం వల్ల నేను కొంత సేద తీరాను. అంత బాగానే సాగుతున్నంతలో, ఒక పుస్తకం పడి కప్ప ప్రాణం పోయింది. ఈ విపత్తును ఊహించనందుకు నాకు తీరని ఆవేదన కలిగింది.కానీ ఇప్పుడు దాని ఖర్మ ఫలంగా, పురాతన ఈజిప్టు మమ్మీ శాపమంత ఖచ్చితంగా ఈ చెట్టు కప్ప శాపం నాకు చుట్టుకుంది. మా కొత్త ఇంట్లో ఆ కప్పలు కేవలం కాస్త చోటే ఆశిస్తే, నేను శాంతి వహించి ఉండేదాన్ని. కానీ అవి వాటి కింది భాగం ఎంతో వ్యూహాత్మక కోణంలో బయటికి తిప్పి, విచక్షణ లేకుండా వంటగది అరుగులనూ, బల్లలనూ, తువ్వాళ్లనూ, కంచాలనూ ఆక్రమించాయి. కొన్ని గదుల్లో ఎండిపోయిన కప్ప మూత్రం చారలు కట్టాయి. టాయిలెట్ పై కూర్చోవడం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టాయిలెట్ మూత కింద మరిన్ని కప్పలు నక్కి ఉండి, అప్రమత్తంగా లేని అతిధులను అతి సున్నితమైన శరీర భాగాలపై తట్టి ‘భౌ’ మని దాగుడుమూతలు ఆడేవి. ఒక పెద్ద తల్లి కప్ప, బాత్రూంలో లైట్ వేసే దురదృష్టవంతులు ఎవరిపైనైనా సరే మూత్ర జల్లు కురిపించేది. చీకటి బాత్రూములూ, కప్ప మూత్రపు వాసనగొట్టే తువ్వాళ్ళు వాడవలసి వచ్చినందుకూ, పలుమార్లు ప్లేట్లు కడుక్కోవలసి వచినందుకూ అలసి, విసిగి, ఆ గెంతే దౌర్భాగ్యులపై సున్నితమైన యుద్ధం ప్రకటించాము.మొత్తం 289 కప్పలను పట్టి, పొరుగునున్న నూతుల్లో వదలడంలో ఒక ఆదివారం గడిపాము. కానీ అదంతా వ్యర్ధ ప్రయాసే. అవి చిన్న జంతువులే కానీ వాటికి పరిసర జ్ఞానాం ఖచ్చితంగా ఉంది. మేము ఆఖరి కప్పను తొలంగించేలోపే, వాటి ఆరితేరిన ఇంటితోవ తెలుసుకునే నైజం వాటిని ఇంటికి చేర్చింది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు అవన్నీ వాటికి ఇంట్లో ప్రీతి అయినా స్థలాల్లోకి వచ్చేశాయి; అసల అవి వెళ్లనేలేదు అన్నట్టు. నేను వాటి అత్యుత్తమ ప్రతిభకు వంగి నమస్కరించాను.చాలా కప్పలు వంటగదిలోని మూల బీరువా తలుపు కింద దూరి, బూరెలమూకుళ్లపై, ప్రెషర్ కుక్కర్ పై, ఇంకా మిక్సీ జార్ల పై యాజమాన్యాన్ని ప్రకటించాయి. నిన్న నేను వెల్లుల్లిపాయలు వేయిస్తుండగా మూకుడి నుంచి ఒక ఘాటైన దుర్గంధం వచ్చింది….అది…కాదు… అయి ఉండదు... చెట్టు కప్ప మూత్రం! కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలవడానికే నాకు కొన్ని యుగాలు పట్టింది. మరి కాసిన్ని వలవడానికి మిగిలి ఉన్న జీవితాన్ని వృధా చేయదలచలేదు. అంచేత ఆ వాసన మాపడానికి మరిన్ని మసాలా దినుసులు వేశాను. కానీ తర్వాత వచ్చిన పొగడ్తలు, నా అద్భుతమైన వంట నైపుణ్యానికి వచ్చాయో, లేదా దాగిఉన్న ఆ…. వంటవారి రహస్య దినుసు అందామా … దానివల్ల వచ్చాయో, నేను ఖచ్చితంగా చెప్పలేను.రచయిత : జానకి లెనిన్ఫోటోలు : సచిన్ రాయ్ -
World Kebab Day 2024 నోరూరించే కబాబ్స్ , స్మోకీ , జ్యూసీ.. వీటికథ పెద్దదే!
కబాబ్..ప్రస్తుత కాలంలో ఆహార ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం. వెజ్, నాన్వెజ్, అనేక రకాలుగా కబాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచ కబాబ్ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..ప్రపంచ కబాబ్ దినోత్సవం 2024: కబాబ్ డే అనేది కబాబ్ల రుచికరమైన సంప్రదాయాన్ని గౌరవించడానికి జూలై రెండవ శుక్రవారం ప్రపంచ కబాబ్ డే జరుపుకుంటారు. అరబిక్ పదం ‘కబాబ్’ అంటే ‘కాల్చినది’ లేదా ‘వేయించినది’ అని అర్థం. కబాబ్లు మధ్ యప్రాచ్యం, మధ్యధరా దక్షిణాసియా వంటకాలలో ఇది చాలా పాపులర్. ఆ తరువాత ఇది భారతదేశం, టర్కీ ,పర్షియాలో ప్రసిద్ధి చెందింది.నాన్-వెజ్ కబాబ్స్ను చికెన్, మటన్, తదితర మాంసాన్ని కొన్ని గంటలపాటు వివిధ రకాలైన మసాలా దినుసులలో మెరినేట్ చేసిన తర్వాత స్కేవర్లపై నిప్పు మీద కాల్చి స్మోకీ ఫ్లేవర్లతో తయారు చేస్తారు. శాకాహారులు సోయాబీన్ కబాబ్లు లేదా పనీర్, తదితర కబాబ్లను తయారు చేసుకోవచ్చుపాపులర్ కబాబ్స్ అత్యంత ప్రసిద్ధ కబాబ్లలో టర్కీకి చెందిన డోనర్ కబాబ్ ఒకటి. భారతదేశానికి గలౌటీ కబాబ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 'గలూటి' అంటే నోటిలో కరిగిపోయేది అని అర్థం. 17వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లో న ఔద్ నవాబ్ వజీర్ మీర్జా అసద్-ఉద్-దౌలా కోసం దీన్ని తయారు చేశారట. నవాబుకు వయసు పెరిగేకొద్దీ, పళ్ళు రాలడం ప్రారంభించడంతో, ఇష్టమైన రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదించేందుకు దీన్ని కనిపెట్టారు. మరో ప్రసిద్ధ కబాబ్ రకంలెబనాన్కు చెందిన షవర్మా, అలాగే పాకిస్తాన్ నుండి సీక్ కబాబ్ ఇతర పాపులర్ కబాబ్స్. -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
వరలక్ష్మికి కాబోయే భర్త.. నటి కంటే తక్కువే సంపాదించాడా! (ఫోటోలు)
-
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూర్లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
లివ్ ఇన్ రిలేషన్.. ముగ్గురు పిల్లల తల్లి.. ప్రముఖ క్రికెటర్ సహచరి (ఫొటోలు)
-
ప్రపంచంలో అతిపెద్ద షిప్.. రిపేర్ ఖర్చే రూ.2212 కోట్లు!
టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తరువాత.. ప్రపంచంలో అతిపెద్ద ఓడల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ 1979లో జపాన్ ఓ నౌకను తయారు చేసింది. దీనిపేరు 'సీవైజ్ జెయింట్'. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..సీవైజ్ జెయింట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. దీనిని 1974-79 మధ్య జపాన్ కంపెనీ సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఈ నౌక పొడవు టైటానిక్ షిప్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది కార్గో షిప్గా పరిచయమైంది. దీనికి భారతదేశంతో కూడా ఓ ప్రత్యేకమైన అనుభందం ఉన్నట్లు సమాచారం.సీవైజ్ జెయింట్ నౌకను గ్రీకు వ్యాపారవేత్త కోసం.. జపాన్ దేశంలోని ఒప్పామా షిప్యార్డ్లో నిర్మించడం ప్రారభించారు. కానీ ఓడ నిర్మాణం చాలా ఆలస్యం కావడంతో ఆర్డర్ చేసిన ఓనర్ ఈ నౌకను నిరాకరించారు. అప్పటికి నౌకకు పేరు పెట్టలేదు. ఆ తరువాత తయారీ సంస్థ, ఆర్డర్ చేసిన యజమానికి మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.ఒప్పామా షిప్యార్డ్లో ఈ అతిపెద్ద నౌకను నిర్మించడం వల్ల దీనికి మొదట్లో ఒప్పమా అని పేరుపెట్టారు. కంపెనీ దీనిని ఆ తరువాత చైనాకు అప్పగించడం జరిగింది. చైనా చేతుల్లోకి చేరిన తరువాత దీనికి సీవైజ్ జెయింట్ అని పేరుపెట్టారు. ఈ నౌక అప్పట్లో ముడి చమురు రవాణా చేయడానికి ప్రధానంగా ఉపయోగించేవారు.1988లో సీవైజ్ జెయింట్ నౌక ఇరాన్ నుంచి చమురు తీసుకుని బయలుదేరి.. లారాక్ ద్విపంలో ఆగింది. అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వైమానిక దళం ఈ నౌకపై దాడి చేసింది. ఆ సమయంలో ఇది చాలా వరకు దెబ్బతింది. ఈ ఓడను మరమ్మత్తులు చేయడానికే.. ఏకంగా 100 మిలియన్ డాలర్లు ఖర్చు (1988లో) అయినట్లు సమాచారం. 100 మిలియన్ డాలర్ల నేటి విలువ సుమారు 265 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.2212 కోట్లు.సీవైజ్ జెయింట్ నౌక దాదాపు 1500 అడుగుల పొడవు ఉంది. 1988 తరువాత దీనిని పూర్తిగా మరమ్మత్తు చేసి 1991లో నార్వేజియన్ కంపెనీకి విక్రయించారు. 1991 తరువాత 2009లో గుజరాత్లోని అలంగ్ షిప్బ్రేకింగ్ యార్డ్కు చేరుకుంది. ఆ తరువాత దీనిని కూల్చి వేశాలు. ప్రస్తుతం ఇది హాంకాంగ్ మారిటైమ్ మ్యూజియంలో ఉన్నట్లు తెలుస్తోంది. -
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
ఇవేం పేర్లు బాబోయ్!.. రాజకీయ పార్టీలకు గమ్మత్తైన పేర్లు
ట్వంటీ20. హైటెక్. సాఫ్. సూపర్ నేషన్. జాగ్తే రహో... ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల పేర్లు! వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలున్నాయి. వీటి పేర్లు మనం తరచూ వినేవే. వీటితో పాటు భారత్లో ఏకంగా 2,597 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో వినడానికే గమ్మత్తైన, ఆసక్తికరమైన, పేర్లున్న పార్టీలకు కొదవ లేదు. కాకపోతే వీటిలో చాలావరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా తెరపైకే రావు. పార్టీ పెట్టడం యమా ఈజీ మన దేశంలో పార్టీ పెట్టడం సులువైన పని. రూ.10 వేలు డిపాజిట్, 100 మంది సభ్యుల మద్దతుంటే చాలు... పార్టీ పెట్టేయొచ్చు. ఏ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో కించపరిచేలా లేకపోతే చాలు. దాంతో దేశవ్యాప్తంగా ఇలా వేలాది పార్టీలు పుట్టుకొచ్చాయి. వాటిలో గమ్మత్తైన పేర్లకూ కొదవ లేదు. ఇండియన్ లవర్స్ పార్టీ, ఇండియన్ ఓషియానిక్ పార్టీ, లైఫ్ పీస్ఫుల్ పార్టీ, హోలీ బ్లెస్సింగ్ పీపుల్స్ పార్టీ, లేబర్ అండ్ జాబ్ సీకర్స్ పార్టీ, అఖిల భారతీయ భారత్మాతా–పుత్రపక్ష, భారతీయ మొహబ్బత్ పార్టీ, మినిస్టీరియల్ సిస్టం అబాలిషన్ పార్టీ, ఆల్ పెన్షనర్స్ పార్టీ, తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ, ఇండియన్ విక్టరీ పార్టీ, ఇంటర్నేషనల్ పార్టీ, చిల్డ్రన్ ఫస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చాలెంజర్స్ పార్టీ, స్వచ్ఛ భారత్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, ఇన్సానియత్ పార్టీ, నేషనల్ టైగర్ పార్టీ, మర్యాదీ దళ్... ఇలా ఈ జాబితా చాంతాడును మించిపోతుంది. ప్రధాని మోదీ ఇటీవల పదేపదే ప్రస్తావిస్తున్న నారీ శక్తి పేరుతో కూడా ఒక పార్టీ ఉంది! ఆమ్ ఆద్మీ పార్టీని తలపించేలా గరీబ్ ఆద్మీ పేరుతో కూడా ఒక పార్టీ ఉంది. ఇక, ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరునైతే వీటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు! అయితే ఈ పార్టీల్లో చాలావరకు వ్యవస్థపై తమ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసేందుకు, ఆదర్శ సమాజ స్వప్నానికి రూపమిచ్చేందుకు వాటి వ్యవస్థాపకులు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. రైట్ టు రీకాల్! ...అంటే తమకు నచ్చని ప్రజాప్రతినిధిని చట్టసభ నుంచి తప్పించే హక్కు. భారత్లో లేకున్నా చాలా దేశాల్లో ఈ హక్కుంది. కాకపోతే యూపీలో రాకేశ్ సూరి అనే 42 ఏళ్ల కంప్యూటర్ ఆపరేటర్ ఈ పేరుతో ఏకంగా పార్టీయే పెట్టారు. హామీలు నెరవేర్చని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే ప్రతిపాదనపై పౌరులకు అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యమట. అన్నట్టూ, ఈ లోక్సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి ఆయన పోటీ కూడా చేస్తున్నారు! యూపీలో ఇలాంటి భిన్నమైన పేర్లతో కూడిన పార్టీలకు కొదవ లేదు. సబ్ సే అచ్ఛీ అనే పార్టీ కూడా అక్కడ ఉనికిలో ఉంది. తొలుత దీని పేరు ఇస్లామిక్ డెమోక్రటిక్ పార్టీ. మతపరమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో ఇలా మార్చేశారన్నమాట! ఆప్ కీ అప్నీ పార్టీ (పీపుల్స్), సుభాష్ వాదీ భారతీయ సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా యూపీలో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.బ్రిటిష్ పాలన నుంచి వారసత్వంబ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.వ్యవసాయ దేశంభారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.పండుగలుభారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.ప్రాంతీయ నూతన సంవత్సరంభారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ దేశం భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. పండుగలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ నూతన సంవత్సరం భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
Sonia Agarwal: డైరెక్టర్తో ప్రేమవివాహం- విడాకులు.. ఇప్పటికీ సింగిల్గానే! (ఫోటోలు)
-
Sonu Srinivas Gowda Photos: పాపను దత్తత తీసుకుంది.. జైలుపాలైంది (ఫోటోలు)
-
వివాదాలతో సావాసం చేసే ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. కడుపులోనే బిడ్డను కోల్పోయిన నటి (ఫోటోలు)
-
10 పాయింట్లలో బీహార్ గొప్పతనం!
ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్కు చెందిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఇది దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సాయంతో పాట్నా నిట్ నుండి దానాపూర్ వరకు జనం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోవచ్చు. పేదరికపు కొలిమిలో శ్రమించిన మనుషులు మహనీయులు అవుతారని ఎవరో చెప్పినది బీహార్ను చూస్తే నిజమనిపిస్తుంది. బీహార్లో పేదరికం తాండవిస్తున్నప్పటికీ, ఈ రాష్ట్రం నుండి చాలా మంది ఉన్నతాధికారులుగా మారారు. దేశంలోని పలువురు ఐఏఎస్లు, బ్యాంకు పీవోలు బీహార్ నుండి వచ్చినవారే కావడం విశేషం. ప్రాచీన కాలంలో బీహార్ను మగధ అని పిలిచేవారు. అలాగే రాజధాని పట్నాను పాటలీపుత్ర పేరుతో పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అదే సమయంలో మహాత్మా గాంధీ బీహార్లోని చంపారణ్ నుండి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. దీనిని చంపారణ్ ఉద్యమం అని పిలుస్తారు. సున్నా లేని గణితానికి విలువ లేదు. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట బీహార్లోనే జన్మించారు. బాలీవుడ్కు గర్వకారణంగా నిలిచిన నటుడు పంకజ్ త్రిపాఠి బీహార్కు చెందినవారే. అలాగే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా బీహార్కు చెందినవారే. బీహార్కి చెందిన తినుబండారం లిట్టీ చోఖా ఎంతో ఫేమస్ అయ్యింది. వెజ్ మొదలుకొని నాన్ వెజ్ వరకు బీహార్లో చాలా వంటకాలు అందుబాటులో ఉంటాయి. బీహార్లో జరిగే ఛత్ పండుగ యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచంలో అస్తమించే సూర్యుణ్ణి కూడా ఆరాధించే ఏకైక పండుగ ఇదే. బీహార్కు చెందిన మిథిల పెయింటింగ్ ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీహార్లోనే జన్మించారు. -
Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
Uttar Pradesh: ఇదే ‘ఢిల్లీ’కి వెళ్లే దారి..
అత్యధికంగా 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్సభకు పంపే ఉత్తరప్రదేశ్ రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రం. అన్ని రాజకీయ పార్టీలను గేమ్చేంజర్గా మార్చే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. సాధారణంగా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయంగానూ ఈ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు సాధించిన పార్టీలకే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది ‘ఢిల్లీ’కి వెళ్లే దారి.. గత ఫలితాలను చూస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర ప్రదేశ్లో 62 లోక్సభ సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు స్థానాలను గెలుచుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 10 సీట్లు సాధించగా, అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. కాగా 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 71 లోక్సభ స్థానాల్లో భారీ విజయాన్ని సాధించింది. ఎస్పీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, ఇతరులు రెండు సీట్లు సాధించగా బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఈసారి కూడా గత రెండు సార్వత్రిక ఎన్నికల విజయాన్ని పునరావృతం చేయాలని ఆశిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కూడా కాషాయ పార్టీ విజయం సాధించింది. పోలింగ్ జరిగిన పది స్థానాల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ప్రతిపక్ష ఎస్పీ రెండు స్థానాలను చేజిక్కించుకుంది. అందరి దృష్టి ఆ స్థానం పైనే.. రాష్ట్రంలో మొత్తం 80 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 63 అన్రిజర్వ్డ్ సీట్లు కాగా, 17 సీట్లు ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ అయ్యాయి. రాష్ట్రంలోని వారణాసి, రాయ్బరేలీ, లక్నో, అమేథీ కీలక నియోజకవర్గాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గం అయిన వారణాసి స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. ఇటీవలే, కాంగ్రెస్, ఎస్పీ ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల కోసం సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. వారణాసి, రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, ఇతర ఇండియా కూటమి మిత్రపక్షాలు 63 స్థానాల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అయితే ఆమె మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడామె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
Maha Shivratri 2024 ఉపవాసం, జాగారం, ఇంట్రస్టింగ్ సంగతులు
మహా శివరాత్రి అంటే సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడైనా మహాశివుడకి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే బోళా శంకరుడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివ పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. శివరాత్రి పర్వదినం క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు పుట్టిన హలాహలం ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదమున్న కారణంగా ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో ఆ గరళాన్ని గొంతులో బంధించి గరళ కంఠుడుడయ్యాడు. కంఠం నీలంగా మారి మారడంతో నీలకంఠుడయ్యాడు. సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వివాదం పెరిగి పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. ఆ ఈ రోజు తనను మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగ శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, మినహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం అంటే ‘దగ్గరగా ఉండడం’ అని! ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉప వసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. -
అంబానీకి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా?
త్వరలో మూడు ముళ్ళతో, ఏడు అడుగులతో ఒక్కటి కానున్న కొత్త జంట 'అనంత్ అంబానీ, రాధిక మర్చంట్'ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ఇప్పుడిప్పుడే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వస్తున్నారు. జామ్నగర్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక్కో రోజు.. ఒక్కో థీమ్తో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే చాలామందికి భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. అనంత్ అంబానీకి కాబోయే భార్య 'రాధిక' గురించి పెద్దగా తెలియకపోవచ్చు. నిజానికి అనంత్, రాధిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ చిన్ననాటి స్నేహమే తరువాత ప్రేమగా చిగురించి, పెళ్లి పీటల వరకు తీసుకువచ్చింది. రాధిక మర్చంట్ ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, పారిశ్రామికవేత్త షైలా మర్చంట్ల చిన్న కుమార్తె. ఈమె బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి డిప్లొమో పూర్తి చేసింది. ఆ తరువాత న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్లలో ఇంటర్న్షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్గా కూడా పనిచేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డు డైరెక్టర్గా పనిచేసింది. విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్న ఈమె ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె సంపద విలువ రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. రాధిక మర్చంట్.. నీతా అంబానీ మాదిరిగా ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా, గతంలో 2022లో జియో వరల్డ్ సెంటర్లో నాట్యం చేసి ఎంతోమందిని అలరించింది. ఈమె జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కుల వంటి పలు సామిజిక అంశాల మీద కూడా ఆసక్తి కలిగి ఉంది. ఇదీ చదవండి: కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు.. రాధిక మర్చంట్ జులై 12న అనంత్ అంబానీతో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. -
గళ మాంత్రికుడు, లెజెండ్, అమీన్ సయానీ: ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
"బెహెనోం..ఔర్ భాయియోం.. మై హూం ఆప్కా దోస్త్.. అంటూ శబ్ద తరంగాలపై తేలియాడుతూ కొంత గంభీరంగా మరింత శ్రావ్యంగా మోగిన ఆ స్వరం 70వ చివరిదాకా పరిచయం లేనివారు ఉంటారా అసలు. ప్రతి బుధవారం రాత్రి 8గం.లకు రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాలా లక్షలాది ఇళ్లలో మారుమోగిన సూపర్ హిట్ షో. అమీన్ సయానీ గొంతు వినటం ఒక మరపురాని జ్ఞాపకం. ఆహా..అంటూ హిందీ చిత్రగీతాలను పరిచయం చేస్తూ సాగిన ఆ స్వరం దశాబ్దాల తరబడి భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది. తన గాత్రంతో ప్రజల గుండె చప్పుడును పెంచిన ప్రపంచ స్వర మాంత్రికుడు. ఆకాశవాణిలో అమీన్ సయానీ గోల్డెన్ వాయస్ ఒక మ్యాజిక్. 91 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన మరణం తీరని లోటు.. ఒక స్వర్ణ యుగం ముగిసిందంటూ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. మైక్లో కూల్గా, సాధారణంగా మృదువైన టోన్తో 54,000కి పైగా రేడియో ప్రోగ్రామ్లు, జింగిల్స , స్పాట్లను అందించిన అద్భుతమైన వ్యక్తి అమీన్ సయానీ. 1952లో ప్రారంభమైన బినాకా గీత్మాల 70ల చివరినాటికి, వారానికోసారి 21 కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. వారానికి 65వేలకు పైగా సంచుల కొద్దీ ఉత్తరాలొచ్చేవంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. రేడియో సూపర్స్టార్ కేవలం 13 ఏళ్లకే బాంబేలో ఆల్ ఇండియా రేడియో (AIR)కి ఆంగ్ల భాషా వ్యాఖ్యాతగా పనిచేశారు. 1952లో, బాలకృష్ణ విశ్వనాథ్ కేస్కర్ను ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా నియమించారు. కేస్కర్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో హిందీ-భాషా సినిమా పాటల పట్ల మోజు చూపలేదు. హిందీ పాటల ప్రసార సమయాన్ని 10శాతం కోటాకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిషేధించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో పనిచేస్తున్న ఒక అమెరికన్ వ్యాపారవేత్త డేనియల్ మోలినా సయాని సోదరుడు హమీద్ను తన సిలోన్ రేడియో కార్యకలాపాలకోసం ఎంపిక చేశారు. ఇంతలో ఆల్ ఇండియా రేడియో హిందీ విభాగం ఆడిషన్ తర్వాత, ఇంగ్లీష్, గుజరాతీకి సంబంధించిన యాస ఉందంటూ అమీన్ను తిరస్కరించారు. దీంతో సిలోన్ రేడియోలో ఉద్యోగం కోసం సోదరుడిని అడిగాడు. ఆకాశవాణి తిరస్కరించి కదా అంటూ ఆయన కూడా నిరాకరించాడు. అయితే అంత తేలిగ్గా వదులుకునే వ్యక్తి కాదు సయానీ. పట్టు వీడ లేదు. ఆ సమయంలో అమీన్కి ‘ఓవల్టీన్ఫుల్వారీ’ కార్యక్రమంలో అనౌన్సర్గా ఉద్యోగం వచ్చింది. తన మధురమైన గాత్రం, తనదైన శైలితో ప్రేక్షకులను కట్టి పడేసే వారు. తరువాత 1952లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని లెజెండ్గా అవతరించాడు. అలాగే తనను తిరస్కరించిన ఆల్ ఇండియా రేడియోలో అత్యంత ఇష్టపడే అనౌన్సర్గా నిలవడం విశేషం. 1952లో ‘బినాకాగీత్మాల’ సంచలనాలు నమోదు చేసింది. సయానీన షోను స్వీడిష్ కంపెనీ సిబా టూత్పేస్ట్ బ్రాండ్ బినాకా స్పాన్సర్ చేసింది. అదృష్టవశాత్తూ గీతమాల కార్యక్రమం 1989 - 1990ల మధ్య ఆల్ ఇండియా రేడియో (AIR)లోని వివిధ్ భారతికి మారింది. ఇటీవల హిందీ-భాషా సినిమా స్వర్ణయుగం సంగీత హక్కులను కలిగి ఉన్న సరేగామ, దశాబ్దాల ప్రోగ్రామ్ చరిత్రలోని ముఖ్యాంశాలను కవర్ చేసిన “అమీన్ సయానీ ప్రెజెంట్స్ గీత్మాలా కి ఛాన్ మే” పేరుతో 10 సంపుటాలను విడుదల చేసింది.ఈ పాటలతో పాటు, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ముఖేష్, మన్నా డే, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శశి కపూర్ , మరెంతో మంది గొప్ప వ్యక్తులతో సయానీ ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. అవార్డులు, రివార్డులు అమీన్సయానీని 2009లో పద్మశ్రీ అవార్డ్ వరించింది. 2006లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నుండి లివింగ్ లెజెండ్ అవార్డు 2003లో ఇండియా రేడియో ఫోరమ్, రేడియో మిర్చి నుంచి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో పాటు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. "బినాకా గీతమాల" కు అత్యుత్తమ రేడియో కార్యక్రమంగా 2000లో బొంబాయి అడ్వర్టైజింగ్ క్లబ్ గోల్డెన్ అబ్బి, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ట్ నుండి 1993లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, 1992లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 1991లో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ నుండి అప్పటి భారత ఉపరాష్ట్రపతి K.R. నారాయణన్ చేతుల మీదుగా బంగారు పతకాన్నిఅందుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి ఆయన గళం ఆసియా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ కింగ్డమ్లోని 'బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఎత్నిక్ నెట్వర్క్'లో ప్రసారమయ్యే "మినీ ఇన్సర్షన్స్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూస్", బీబీసీవరల్డ్ సర్వీస్ రేడియోలో మిలియన్స్", లండన్లోని 'సన్రైజ్ రేడియో'లో ప్రసారమయ్యే "వీటీకా హంగామా"కు నాలుగున్నరేళ్లు, UAEలోని 'రేడియో ఉమ్ముల్క్వైన్'లో ప్రసారమవుతున్న "గీత్మాలా కి యాదీన్" నాలుగేళ్లుగా, "యే భీచంగావో భీఖూబ్" 'రేడియో ఆసియా',దుబాయ్లో ఎనిమిది నెలల పాటు, టొరంటో, వాషింగ్టన్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ బోస్టన్లలోని 'జాతి రేడియో స్టేషన్ల'లో మొత్తం రెండున్నర సంవత్సరాల పాటు, దక్షిణాఫ్రికా దేశం స్వాజిలాండ్ ఇలా మరెన్నో ఆయన కరియర్లో మైలు రాళ్లు. సినిమాల్లోనూ.. అమీన్ సయాని భూత్ బంగ్లా, బాక్సర్, తీన్ డెవియన్ , ఖత్ల్తో సహా సినిమాల్లో అనౌన్సర్గా కనిపించారు. 1960-62లో టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్లో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేశాడు. ఆయన భార్య రమా మట్టు కూడా ప్రముఖ గాయని, వాయిస్ ఆర్టిస్ట్. ఎక్కడ పుట్టారు 1932 డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు అమీన్ సయానీ . ముంబైలోని న్యూ ఎరా స్కూల్లో అతని పాఠశాల విద్య పూర్తిగా ఇంగ్లీష్ , గుజరాతీలో సాగింది. తరువాత 1954లో గ్వాలియర్కు మారి సింధియా స్కూల్లో చదువుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత, ముంబైకి తిరిగి వచ్చేశారు. ప్రస్తుత FM రేడియో యుగంలో, రేడియో జాకీలు వస్తున్నారు. పాపులారిటీ సాధిస్తున్నారు. కానీ భారతదేశ రేడియో ప్రేమికులకు అమీన్ తేనెలూరు ఆ స్వరం అజరామరం. ఆయన భౌతికంగా లేకపోయినా ధ్వని తరంగాలపై ఆ గొంతు ఎప్పటికీ శాశ్వతమే. -
Valentines day: లవ్బర్డ్స్ ప్రత్యేకతలు ఇవీ!
ప్రేమికుల దినోత్సవం.. ఏదో పులకింతకు గురి చేసే పదం. పెళ్లయి ఏళ్లు గడిచినా, ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినా, సిచ్యుయేషనల్ రిలేషన్షిప్లో ఉన్న లవ్బర్డ్స్ జీవితాల్లో ఈ రోజుకున్న ప్రత్యేకతే వేరు. అన్నట్టు ప్రేమికులను అందంగా వర్ణించాలంటే లవ్బర్డ్స్ అని ఎందుకు అంటాం. అసలు ఈ పోలిక ఎలా వచ్చింది? లవ్బర్డ్స్ గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇపుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచుర్యం పొందిన అందమైన, తెలివైనచిలుక జాతికి చెందిన పక్షులే ఈ లవ్బర్డ్స్. ఈ చిన్న పక్షులు 100 సంవత్సరాలకు పైగా ఆఫ్రికన్ చిలుకలలో అత్యంత ప్రియమైన రకాల్లో ఒకటి. కొన్ని చిలుకలు మనుషులను అనుకరిస్తూ, మాట్లాడగలవు కానీ. లవ్బర్డ్స్ సాధారణంగా మాట్లాడవు. ఈలలు లేదా డోర్బెల్స్ అనుకరిస్తాయి. కానీ చాలా చిన్నప్పటినుంచీ నేర్పితే మాట్లాడుతాయిట. లవ్బర్డ్స్లో రకాలు లవ్బర్డ్స్లో తొమ్మిది వేర్వేరు ఉప-జాతులు ఉన్నాయి. వీటిలో దేనికవే వాటి ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. మాస్క్డ్ లవ్బర్డ్, బ్లాక్-చెంపల లవ్బర్డ్, ఫిషర్స్ లవ్బర్డ్, న్యాసా లవ్బర్డ్, స్విండర్న్ లవ్బర్డ్, రెడ్-ఫేస్డ్ లవ్బర్డ్, అబిస్సినియన్ లవ్బర్డ్, మడగాస్కర్ లవ్బర్డ్ , లవ్లీ పీచ్-ఫేస్డ్ లవ్బర్డ్ ఉన్నాయి. అయితే పసుపు, గ్రీన్, బ్లూ కలర్లో ఉండే లవ్బర్డ్స్ బాగా పాపులర్. ప్రేమికులతో లవ్బర్డ్స్ అని పోలిక ఎందుకంటే లవ్బర్డ్స్ చాలా చురుకైన పక్షులు. ప్రేమ పక్షులు సాధారణంగా 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జీవితాంతం ప్రేమలోనే మునిగి తేలతాయి. ఏకభాగస్వామితో మాత్రమే బలమైన ప్రేమబంధాన్ని కొనసాగిస్తాయి. ఒకదానికొకటి కొసరి..కొసరి తినిపించుకుంటూ,ఎపుడూ అచ్చిక బుచ్చిక లాడు కుంటూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి. ఒకవేళ జంట వీడితే డిప్రెషన్కు కూడా లోనవుతాయట. జంట వీడితే తట్టుకోలేవు! మనుషుల మాదిరిగానే, ప్రేమపక్షులు కూడా తమ భాగస్వామి లేదా జట్టు నుండి విడిపోయినప్పుడు నిరాశకు గురవుతాయి. ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. దీంతో దిగులుతో ఆహారం మానేసి చివరికి చనిపోవచ్చు కూడా. లవ్బర్డ్స్లో ఆడ, మగ తేడాను సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా మగవి ఆడవాటి కంటే పెద్దగా ఉంటాయి. సాధారణంగా నల్లటి రెక్కలున్న మగ ప్రేమపక్షికి ఎర్రటి ఈకల కిరీటం ఉంటుంది. అంతేకాదు మేటింగ్ సమయంలో లవ్ బర్డ్స్ హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. దీంతోవాటిల్లో జెలసీ, దూకుడు తత్వంబాగా పెరుగుతుందిట. ఫలితంగా కొన్ని సందర్భాల్లో తగాదాలు, ఒక్కోసారి ఒకదాన్ని మరొకటి చంపుకునే దాకా పోతాయిట. ప్రేమ పక్షులు ఏమి తింటాయి? లవ్బర్డ్స్ చిన్ని చిన్ని గింజలు, విత్తనాలు, గడ్డి, పండ్లు , కొన్ని రకాల కూరగాయలను తింటాయి. చాలా ఇళ్లలో రంధ్రాలు ఉన్న మట్టి కుండల్లోనే లవ్బర్డ్స్ ని ఎందుకు పెంచుతారో ఎపుడైనా ఆలోచించారా? ప్రేమ పక్షులు.. అడవిలో చెట్లు, రాళ్ళు, పొదల్లోని రంధ్రాలలో నివసించడం వీటికి అలవాటు. అడవులు తగ్గిపోవడంతో భవనాల్లోని రంధ్రాల్లోగూడు కట్టుకుంటాయి. అందుకే ఇళ్లలో కూడా సహజంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆ ఏర్పాటు అన్నమాట. -
అయోధ్య హనుమాన్ గర్హి ఆలయం.. ఆసక్తికర విషయాలు
-
బ్లూ వేల్స్ నాలుక అంత బరువా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు
బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిల్లో అతి పురాతన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో చూడవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ (వెచ్చని) జలాలకు వలసపోతాయి. బ్లూవేల్స్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. ♦ బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు . దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం. ♦ బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ♦ బ్లూ వేల్ నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది. ♦ నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. ♦ నీలి తిమింగలం గుండె మినీ కూపర్ (కారు) పరిమాణంలో ఉంటుంది. ♦ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం మరియు వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం ♦ ఇది గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకదానిని క్రిల్ (రొయ్యల లాంటిది) తింటుంది ♦ బ్లూ వేల్ ప్రతిరోజూ 4 నుండి 6 టన్నుల క్రిల్ తింటుంది. ఫీడింగ్ సీజన్లో, బ్లూ వేల్ ప్రతిరోజూ 3600 చేపలను తింటుంది. ♦ గర్భం దాల్చిన ఒక సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బుల్లి వేల్ దాదాపు 3 టన్నుల బరువు ఉంటుంది. ♦ ఈ బేబీ వేల్ ప్రతిరోజూ 100 గ్యాలన్ల పాలు తాగుతుంది, ప్రతి గంటకు 9 పౌండ్లు (రోజుకు 200 పౌండ్లు) పెరుగుతుంది. ♦ ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు మెదడులో సగం మాత్రమే ఉపయోగిస్తాయట. -
రంజుగా.. రారాజులా పెరిగి...కట్ చేస్తే..!
జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. పుట్టింటికి ఎపుడు పోదామా అని కొత్త పెళ్లి కూతుళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. అటు కొత్త అల్లుళ్ళ మంచీ మర్యాదకోసం అత్తగారిళ్లు సిద్ధమవుతుంటాయి. రకరకాల పిండివంటల తయారీలో మునిగిపోతారు మహిళలు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అబ్బో.. సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల పాటు కోస్తాకుర్రాళ్లలో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరాదాగా సాగిన ఈ వ్యవహారం ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఈ కోడి పందాల కథా కమామిష్షు ఏంటో ఒకసారి చూద్దాం. కోడి పందాలు, పందెం కోళ్లు కోడిపందెం అంటే.. స్పెషల్గా పెంచిపోషించిన, శిక్షణ ఇచ్చిన రెండు కోడి పుంజులు హోరాహోరీగా పోట్లాడుకోవడం. ఊపిరి ఆగేదాకా కాలు దూసి పోరాడటం. కాళ్లకు కట్టిన పదునైన కత్తులు దిగుతున్నా.. రక్త మోడుతున్నా వెన్ను చూపకూడదు. విజయమో వీర స్వర్గమో అన్నట్టు అయితే ప్రత్యర్థిని పడగొట్టాలి.. లేదంటే తన ప్రాణం పోవాలి. అదీ పందెం. కోడి పుంజులకు శిక్షణ ఇంత పకడ్బందీగా పందెం సాగాలి అంటూ ఏంతో కొంత ట్రైనింగ్ ఉండాలిగా. ప్రత్యర్థికి దీటుగా బలిష్టంగా ఉండాలిగా. అందుకే మరి పందెంకోళ్లకు ప్రత్యేక శిక్షణతోపాటు బలవర్ధక ఆహారాన్ని కూడా అందిస్తారు. అయితే ఇందులో పందేనికి పనికి వచ్చే పుంజు(మగకోళ్లను) గుర్తించడం ఒక కళ. ఇక్కడే తొలి అడుగు పడుతుంది. ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలున్న పుంజును “కాకి” అని, తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని, నల్లగా ఉండి, రెండు మూడు ఈకలు ఉన్న పుంజును కొక్కి రాయి అని దీనికి పెద్ద పురాణమే ఉంది. ముఖ్యంగా ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పూల, నల్లబోర, ఎర్రపొడ, గేరువా లాంటివి ఇందులో ఉన్నాయి. డేగ, నెమలి, కాకి కోడి పందేలకు సంబంధించి డేగ, కాకి, నెమలి రకాలు పాపులర్. ఇలా తమకు నచ్చిన పందెం కోళ్లను గుర్తించి, వాటిని ప్రత్యేక షెడ్లలో సకల సదుపాయాలతో పెంచుతారు. ఉదయం లేచింది మొదలు వ్యాయామం, తైలాలతో మసాజ్లు, దాణా దాకా అన్నీ రాచమర్యాదలే. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించిన అనంతరం పిస్తా, బాదం, జీడి పప్పు అక్రూట్ లాంటి డ్రైఫూట్స్ తినిపిస్తారు. మధ్యాహ్నం , సాయంత్రం తృణధాన్యాల, డ్రై ఫ్రూట్స్తో దాణా పెడతారు.అంతేకాదు కొద్దిగా మద్యాన్ని కూడా పోస్తారట. దీంతో పౌరుషానికి ప్రతీకగా, పందేనికి సిద్ధం అన్నట్టు తయారవుతాయి. కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం) మనుషులకు పంచాంగం ఉన్నట్టు కోళ్లకూ ఉంది మరి. అదే కుక్కుట శాస్త్రం. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. తిధి, వార,నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయట. వారం, తిధి, దిశ,నక్షత్ర బలంతోపాటు, తమ జాతకం బలానికి, కోడి జాతక బలంకూడా తోడైతే ఇక గెలుపు మాదేనని నమ్ముతారు పందెం రాయుళ్లు. చివరకు మిగిలేది చుట్టూ వేలాదిమంది గుమిగూడగా, యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. యజమాని పట్ల విశ్వాసంతో, బాస్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నట్టు రంగంలోకి దిగుతాయి. రక్తం చిందించి మరీ పోరాడతాయి. ఈ క్రమంలో నెగ్గితే..వైభోగం. లేదంటే పరలోకం. అప్పటిదాకా రాజభోగాలు అనుభవించి, నేనే రాజు అన్నట్టుగా ఎదిగిన పుంజు కాస్తా.. చివరికి మందులోకి నంజులాగానో, అల్లుడుగారికి విందుగానో మారిపోతుంది. -
వినూతన వేడుకలు..
కొత్త సంవత్సరం వచ్చిందంటే.. ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత ఏడాది ఇచ్చిన చేదు అనుభవాలను మరిచిపోయి.. తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని సరికొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుగుతుంటాయి. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. ప్రపంచమంతా క్రమంగా 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలికిన తరుణంలో.. వివిధ దేశాల ప్రజలు జరుపుకునే వేడుకలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు.. ♦ డెన్మార్క్లో ప్రజలు తమ ఇళ్లలోని పింగాణీ పాత్రలను గది తలుపులపైకి విసిరేస్తారు. అవి పగిలి.. ఎన్ని ముక్కలైతే కొత్త ఏడాది అంత అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ♦ గ్రీస్ ప్రజలు ‘వాసిలోపిటా’ అనే కేక్లో ఒక నాణాన్ని కనిపించకుండా పెడతారు. ఎవరికైతే ఆ నాణెం ఉన్న కేక్ భాగం వస్తుందో.. వారికి ఆ ఏడాదంతా అదృష్టం కలిసి వస్తుందని విశ్వసిస్తారు. ♦ నూతన సంవత్సరం అంటేనే పాతకు వీడ్కోలు చెప్పడం. దీనికి సూచికగా దక్షిణాఫ్రికా ప్రజలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి పాత వస్తువులను కిటికీల నుంచి బయటకు విసిరేస్తారు. ♦ స్కాట్లాండ్లో అర్ధరాత్రి దాటాక తమ ఇంట్లోకి మొదటగా ఎవరు అడుగు పెడతారో.. వారి వల్ల అదృష్టం వస్తుందని విశ్వసిస్తూ బహుమతులు ఇచ్చుకుంటారు. ♦ స్పెయిన్లో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే.. 12 ద్రాక్ష పండ్లు తినడం సంప్రదాయం. ఒక్కో పండు ఒక్కో నెలకు సంకేతం. ఇలా తినటం వల్ల అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. ♦ జపాన్లో ప్రజలు అర్ధరాత్రి వేళ బౌద్ధ దేవాలయాలకు వెళ్లి 108 సార్లు గంటలు మోగిస్తారు. ♦ బ్రెజిల్లో జనం తెలుపు రంగు దుస్తులు ధరించి సముద్ర దేవత యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పూలను విసిరి పాటలు పాడతారు. ♦ ఫిలిప్పీన్స్లో గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులు, దుస్తులు అదృష్టం తెచ్చిపెడతాయని విశ్వసిస్తారు. అందువల్ల అక్కడి వారు నూతన సంవత్సరాన్ని ఆహా్వనిస్తూ గుండ్రని చుక్కలు ఉన్న దుస్తులు ధరిస్తారు. ఆ రోజు గుండ్రని పండ్లు తింటారు. ♦ రష్యాలో కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్లో కలుపుకొని తాగుతారు. ♦ అమెరికాలోని న్యూయార్క్లో అర్ధరాత్రి 12 గంటలకు టైమ్ బాల్ను కిందకు వదులుతారు. దీన్ని ‘బాల్ డ్రాప్’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కిరిబతిలోనే తొలి సంబరం.. ప్రపంచంలో అందరికంటే ముందు పసిఫిక్ సముద్రంలోని కిరిబతి దీవుల్లోనే కొత్త సంవత్సరం వస్తుంది. భారత కాలమానం ప్రకారమైతే డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ ప్రాంతం నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియా దేశాల్లో మనకంటే ఆరేడు గంటల ముందే మొదలవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మనకంటే మూడున్నర గంటల ముందే అడుగుపెడతాయి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లు భారత్ కంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. చైనాలో వేడుకలు ఉండవు.. జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోని దేశాలు కూడా ఉన్నాయి. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్ ప్రకారమే అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ♦ న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ♦ ఆస్ట్రేలియా.. మనకు సాయంత్రం 6.30 ♦ జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ♦ చైనా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్.. మనకు రాత్రి 9.30 ♦ థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ♦ యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 1.30 ♦ గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 3.30 ♦ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ♦ యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు మనకు జనవరి 1 తెల్లవారుజామున 5.30 ♦ బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ♦ ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ♦ అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ♦ మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ♦ అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ♦ హవాయ్.. మనకు జనవరి 1 మధ్యాహ్నం ఉదయం 3.30 ♦ సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ♦ బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ♦ ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా ఆధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలుంటే.. రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. -
మెడలో రుద్రాక్ష ఉంటే పాటించాల్సిన నియమాలు ఏంటీ ?
-
‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’..మిడిల్ ఈస్ట్లో తిరుగులేని బిజినెస్మ్యాన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడని అందరికీ తెలుసు. అయితే మిడిల్ ఈస్ట్లో తిరుగులేని బిజినెస్మ్యాన్.. ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ అని పిలిచే మిర్వాయిస్ అజీజీ (Mirwais Azizi) గురించి చాలా మందికి తెలియదు. ఆయన నిర్వహిస్తున్న వ్యాపారాలు ఏంటీ.. వాటి విలువ ఎంత.. ఎందుకు ఆయన్ను ‘ఆఫ్ఘనిస్తాన్ అంబానీ’ (Mukesh Ambani of Afghanistan) అంటారు.. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత సంపన్నుడు మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత సంపన్నుడు. ఆయన్ను తరచుగా 'ముఖేష్ అంబానీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుస్తారు. దుబాయ్ నుంచి తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మిర్వాయిస్ అజీజీ, అజీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు, ఛైర్మన్. అజీజీ 1989లో వ్యాపారాన్ని ప్రారంభించారు. రియల్టీ, బ్యాంకింగ్, పెట్టుబడి, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద వాణిజ్య బ్యాంకు అయిన అజీజీ బ్యాంకుకు మిర్వాయిస్ అజీజీ చైర్మన్గా ఉన్నారు. 2006లో 7.5 మిలియన్ డాలర్ల ఈక్విటీ మూలధనంతో ఈ బ్యాంకును స్థాపించారాయన. ఆ బ్యాంక్ ఈక్విటీ మూలధనం ఇప్పుడు 80 మిలియన్ డాలర్లు. 2018 మార్చిలో అజీజీ పేరు "అరేబియన్ బిజినెస్ 100 ఇన్స్పైరింగ్ లీడర్స్ ఇన్ ది మిడిల్ ఈస్ట్" జాబితాలో ఉంది. ఆసియా సెంటినెల్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్లో విక్రయించే 70 శాతం పెట్రోలియం ఉత్పత్తులను నిర్వహించేది అజీజీనే. అజీజీ బ్యాంక్ అధినేత మిర్వాయిస్ అజీజీ ఆఫ్ఘనిస్తాన్లోని లగ్మన్లో అజీజీ పష్టూన్ల కుటుంబంలో 1962లో జన్మించారు. కాబూల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1988లో దుబాయ్ వెళ్లారు. 2006లో అజీజీ బ్యాంక్ని స్థాపించారు. 2007లో అజీజీ డెవలప్మెంట్స్ను ఏర్పాటు చేశారు. మిర్వాయిస్ అజీజీ బఖ్తర్ బ్యాంకు (ప్రస్తుతం ఇస్లామిక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్)కు కూడా అధినేత. నివేదికల ప్రకారం.. అజీజీ డెవలప్మెంట్స్ ప్రస్తుతం దుబాయ్ అంతటా 45 బిలియన్ దిర్హమ్ల విలువైన 200 ప్రాజెక్ట్లను కలిగి ఉంది. అజీజీ పెట్రోలియం వ్యాపారం అజీజీ హొటాక్ గ్రూప్ పది దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అజీజీ ఈ వ్యాపారాన్ని 80 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభించాడు. అజీజీ భార్య పేరు పారిగుల్. ఈ దంపతులకు ఫర్హాద్ అజీజీ, ఫవాద్ అజీజీ, జవాద్ అజీజీతో సహా ఏడుగురు సంతానం ఉన్నారు. మిర్వాయిస్ అజీజీ నెట్వర్త్ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఆయనకున్న వివిధ వ్యాపారాల విలువల ఆధారంగా ఆయన్ను బిలియనీర్గా భావిస్తారు. -
I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
సాధారణంగా మనం కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) అని వస్తూ ఉంటుంది. దీనితో చాలా మంది విసుగెత్తిపోతారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? హిస్టరీ ఏమైనా గూగుల్ తెలుసుకుంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఇందులో కొన్నింటిని ఓపెన్ చేయాలనంటే ‘నేను రోబో కాదు’ (I am not a robot) అని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో స్క్రీన్ మీద చిన్న బాక్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నిజానికి స్క్రీన్ మీద ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) కనిపించగానే ఎవరైనా వెంటనే క్లిక్ చేస్తే, అప్పుడు గూగుల్ నేను రోబో కాదు అని భావిస్తుందనుకుంటారు. కానీ ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌసింగ్ హిస్టరీ మొత్తం గూగుల్కి తెలిసిపోతుంది. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ గతంలో ఒకసారి బీబీసీ క్విజ్ షోలో ఇలాంటిదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందనేది వెల్లడిస్తారు. అంటే అప్పటి వరకు పనిచేసింది మనిషేనా లేదా రోబోనా అని నిర్దారించుకోవడానికి ఇలా వస్తుందని తెలుస్తోంది. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం (అప్పటివరకు మీరు ఏమి సర్చ్ చేశారో) గూగుల్కి అందించడానికి అంగీకరించినట్లే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తరువాత కొన్ని పజిల్స్లాగా వస్తాయి. అప్పుడు వాటిని క్లియర్ చేసిన తరువాత కావలసిన సైట్ ఓపెన్ అవుతుంది. -
రొటీన్కి భిన్నంగా..! ఆనంద్ మహీంద్రా కూతుళ్ల గురించి తెలుసా?
Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు. రొటీన్కి భిన్నంగా.. సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్లో ఆర్ట్ డైరెక్టర్గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నారు. అల్లుళ్లిద్దరూ విదేశీయులే.. ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. -
ఎంతో ఇష్టంగా తాగే చాయ్లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా!
ఓ కప్పు 'టీ' తాగితే హమ్యయ్య అనిపిస్తుంది. అంతెందుకు పనివాళ్ల దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అబ్బా ఓ కప్పు 'టీ' పడితే ప్రాణం సుఖంగా ఉంటుంది. హుషారుగా పనిచెయ్యొచ్చు అనుకుంటారు. చాలామంది టీ తాగితే చాలు ఆకలి తీరిపోయిందనుకుంటారు. అంతలా చాయ్కి అతక్కుపోయారు కొందరూ. అలాంటి టీలో ఒకప్పుడూ పాలు కలిపేవారే కాదట. మధ్యలోంచే మొదలైంది. అక్కడనుంచి టీని పాలు కలిపి తయారు చేయడం ప్రారంభించారట. అంతేగాని ముందుగా ఓన్లీ డికాషన్ తప్ప పాలు కలపేవారే కాదట. అసలెప్పుడూ అలా చేయడం ప్రారంభమైంది? ఎలా వచ్చింది? తదితరాలు గురించే ఈ కథనం. మన దేశంలో ఎవరైన వస్తే ముందుగా టీ తాగుతారా అని అడుగుతారు. ఇంట్లో ఏం లేకపోయిని జస్ట్ ఓ టీ కప్పు, కొన్ని బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాయ్లో పాలు కలపడం అనే ప్రక్రియ భారత్ నుంచి ప్రారంభం కాలేదట. మన వరకు వచ్చేటప్పటికీ.. బ్రిటీస్ వాళ్లు టీ తోటలు పెంచేంత వరకు మనకు చాయ్ గురించి తెలియనే తెలియదు. బ్రిటీష్ వాళ్లకు కూడా టీ గురించి 17వ శతాబ్దం వరకు తెలియదట. టిబెట్లో ప్రజలు టీ పొడితో పాలు కలిపి తయారు చేసేవారట. అలా చైనా నుంచి మంగోలియాకు టీ తయారీ విధానం విస్తరించిందట. ఇక 1800 మధ్య కాలం నుంచి బ్రిటీష్వారు టీ పొలాలు ఏర్పాలు చేసి దుకాణాలు పెట్టి విక్రయించేంతవరకు టీ పెట్టే అలవాటు మనకు లేనేలేదట. కాబట్టి మనకు టీలో పాలు కలపడం గురించి బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసిందే గానీ ముందుగా భారత్లో మాత్రం లేదు. టీలో పాలు కలపడం వెనుక కారణం.. పశ్చిమ ఐరోపాలో పర్యటించేటప్పుడూ సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు ఉండేవి. ఆ టైంలో కాస్త నకీల టీల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో టీని ఆసక్తికరంగా రుచిగా ఉండేలా తయారు చేసే విధానాలపై దృష్టి పెట్టారు అప్పటి ప్రజలు. ఆ క్రమంలో పాలు జోడించటం జరిగింది. సాధారణ 'టీ' డికాషన్ చేదుగా ఉండటంతో పాలు జోడించి మరింత రుచిగా తాగేలా చేయడమ ప్రారంభించారు. అలానే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే..యూరోపియన్ పింగాణి పాత్రలు చాలా సున్నితమైనవి, ఖరీదైనవి. దీంతో వేడివేడీ టీ పోయగానే అవి పగలిపోయేవి. కప్పులు పగలకుండా లేదా పగళ్లు రాకుండా ఉండేలా చల్లటి పాలు పోసి ఆ తర్వాత వేడివేడి టీ డికాషిన్ పోసేవారట. అలా పాలతో టీ సర్వ్ చేయడం ప్రారంభమైందట. పాలతోనే రుచిగా ఉటుందని ఎప్పుడూ తెలిసిందంటే.. టిబెటియన్లు పోషకాహారాన్ని పెంచెందుకు ఈ టీ తయారీకి పాలు జోడించారట. అలాగే బ్రిటన్ పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రామిక తరగతి ప్రజలు టీలో పాటు జోడించేవారట. వారు దానిని బిల్డర్స్ టీ అని పిలిచేవారట. సుదీర్ఘ పనిదినాల్లో టీ విరామంలా దీన్ని సేవించి తిరిగి నూతన ఉత్తేజంతో పనిచేశేవారట. టీలో ఉండే టానిన్లు కారణంగా చేదుగా ఉంటుంది. పాలుతో కాకుండా నేరుగా తాగితే నోరు పొడిబారినట్లు అవుతుంది. అదే ఇలా పాలతో తీసుకుంటే టానిన్ల ప్రభావాన్ని తగ్గించి చక్కటి రుచితో బాటు కాస్త నోరు తేమగా ఉండేలా చేస్తుంది. పాలు ఉపయోగించడంతో తక్షణమే ఒంట్లోకి శక్తి వచ్చి కాస్త బలంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి నుంచి ఇలా పాలను టీ పోడితో జోడించి రుచిగా తయారు చేయడం ప్రారంభమైందట. అలాగే మరో కారణం కూడా చెబుతుంటారు కొందరూ. టీని పాలతో తీసుకునే అలవాటు ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వారి నుంచి మొదలైందని కొందరి వాదన. 1685లో, ఫిలిప్ సిల్వెస్ట్రే డుఫోర్ పాలతో దగ్గు, జీర్ణ రుగ్మతలకు విరుగుడుగా ఇలా టీని తయారు చేశాడని అంటారు. కలోనియల్ బోస్టన్లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ బ్లాక్ టీలు తప్పనిసరిగా పాలతో బాగా రుచిగా ఉండేవి. వారు కాంటన్ నుంచి లండన్ మీదుగా తమ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి టీ పాతబడిపోయి రుచిగా ఉండేది కాదు. దీంతో పాలు జోడించగానే రుచిగా ఉండేది. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక కెన్యాలో ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన టీలో ఎక్కువ భాగం పాలతో కలిపి తాగడానికి తయారు చేసిన టీనే ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
ఇంద్రకీలాద్రి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
-
బ్యాట్స్మన్ టు బిజినెస్మన్: రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు. ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్ బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు. కోటక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒకప్పుడు క్రికెటర్ రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్మన్. వాస్తవంగా క్రికెటర్గానే తన కెరీర్ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరుగుతున్న కంగా లీగ్లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది. (Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..) ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు. -
మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
Indian Automobile History: సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తి తెలుసుకుందాం. 1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్హౌస్లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి.. ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఆవిరితో నడిచే వాహనాలు.. తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. భారతీయ ఆటోరంగానికి ఆటంకం.. ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది. అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని.. అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి. SIAM ఏర్పాటు.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది. వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్.. విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది. ➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి. ఇదీ చదవండి: స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్ని బ్యాంకులు ఉండేవో తెలుసా? ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
ఈ పిజ్జా చాలా ఫేమస్.. దీని చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్కు చేరువలోని పోంపే నగరంలో రోమన్ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం. చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్చంద్ రాయ్చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్చంద్ 1832లో సూరత్లో రాయ్చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో రాయ్చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్గా అవతరించడానికి సహాయపడింది. రాయ్చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్స్పాట్గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్చంద్ రాయ్చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
హనుమంతుడు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
-
భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?
India First Billionaire Mir Osman Ali Khan: ఈ రోజు భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, లక్ష్మీ మిట్టల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇండియాలో చెప్పుకోదగ్గ బిలీనియర్ ఉండేవాడు. ఆయన గురించి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. క్వీన్ ఎలిజబెత్కు సైత బహుమతులు అందించిన ఆ బిలీనియర్ ఎవరు? అతని సంపద ఎంత ఉండేది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటీష్ పాలిత భారతదేశం ఒకప్పుడు సంపదలతో తులతూగుతూ ఉండేదని చరిత్రకారులు రాసిన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. మన దేశంలో తొలి బిలియనీర్ 'మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' (Mir Osman Ali Khan). 1886లో జన్మించిన అలీ ఖాన్ హైదరాబాద్ చివరి నిజాం రాజు. ఈయన 1911 నుంచి 1948 వరకు భారతదేశం విలీనం అయ్యే వరకు పాలించాడు. నిజానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటీష్ వారికీ విధేయుడని, విభజన సమయంలో పాకిస్థాన్లో చేరాలని అక్కడే స్వాతంత్య్ర రాజ్యాన్ని పాలించాలని కలలు కన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 1980 - 90లలో ప్రపంచంలో ఉన్న పది మంది అత్యంత ధనవంతుల జాబితాలో ఈ నిజాం రాజు కూడా ఒకరు. ఆయన సంపదకు సంబంధించిన అధికారిక వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ 2 బిలియన్ డాలర్లు (1940లో) ఉంటాయని అంచనా. ఈ సంపద విలువ ఇప్పటి కరెన్సీ ప్రకారం సుమారు 35.8 బిలియన్లతో సమానం. ఇంత సంపద అప్పట్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!) ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందిన నిజాం భారతదేశపు మొదటి విమానాశ్రయం రూపొందించినట్లు చెబుతున్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చేయడంతోపాటు విద్యుత్తును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్ హైకోర్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో సహా అనేక ప్రభుత్వ సంస్థలను స్థాపించిన ఘనత కూడా నిజాం వంశానిదే అని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇతర నిజం రాజుల మాదిరిగా దుస్తులకు, ఇతరత్రా విషయాలకు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈయన వద్ద పేపర్ వెయిట్ ఉండేదని అది 185 క్యారెట్ల వజ్రాలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చిన ఘనత కూడా నిజాం రాజు సొంతమే. దానిని క్వీన్ ఎలిజబెత్ మరణించే వరకు కూడా ఉపయోగించిందని సమాచారం. -ఎన్. కుమార్ -
ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!
World Largest Truck: చాలా మంది ఇప్పటి వరకు నాలుగు, ఎనిమిది, పదహారు చక్రాల ట్రక్కులను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రక్కు వాటన్నింటికంటే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కు కావడం గమనార్హం. 'బెలాజ్ 75710' (Belaz 75710) పేరు కలిగిన ఈ ట్రక్కు ఒకసారికి సుమారు 500 టన్నుల బరువును తీసుకెళుతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా ప్రసిద్ధి చెందిన ఈ వాహనం బెలారస్లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ట్రక్కులను తయారు చేసే BelAZ కంపెనీ సోవియట్ యూనియన్ కాలంలో బెలారస్, జోడినో నగరంలో ఉండేది. సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తరువాత ఈ కంపెనీ ఇతర దేశాల కంటే పెద్దగా ఉండే వాహనాలను తయారు చేయడం ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కూడా కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక బోగీ నిర్మాణానికి అన్ని కోట్లా?) ఇక బెలాజ్ 75710 విషయానికి వస్తే.. దీని బరువు 450 టన్నులు. దీనికి 8 చక్రాలు అమర్చారు, ఒక్కొక్క టైర్ బరువు సుమారు 5 టన్నుల కంటే ఎక్కువ. ట్రక్కు పొడవు 20 మీటర్లు, వెడల్పు 9.7 మీటర్లు. లోడ్ తీసుకెళ్లేటప్పుడు ఈ ట్రక్కు స్పీడ్ 45 కిమీ/గం కాగా, ఖాళీగా ఉన్నప్పుడు 60 కిమీ/గం వేగంతో వెళుతుంది. ఇంత పెద్ద భారీ ట్రక్కు పనిచేయాలంటే ఒక్క ఇంజిన్ సరిపోదు. కావున ఇందులో రెండు డీజిల్ ఇంజిన్లు అమర్చారు. (ఇదీ చదవండి: 46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే ఇలా చేయండి!) బెలాజ్ 75710 ట్రక్కులోని 16 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్లు 2300 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రస్తుతం ఈ ట్రక్కుని సైబీరియాలోని బచట్స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్లో ఫీల్డ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. కావున ఇది త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలు క్వారీలలో చాలా ఉపయోగపడతాయి. దీని ధర సుమారు రూ. 50 కోట్లకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. -
మీకు తెలుసా! ఒక ట్రైన్ తయారీకి అయ్యే ఖర్చు ఎంతంటే?
ట్రైన్ గురించి, ట్రైన్ జర్నీ గురించి దాదాపు అందరికి తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదో రకైమన అనుభూతి అనే చెప్పాలి. లయబద్దంగా కదులుతూ ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసిన వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. ఒక బోగీ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని చాలా మందికి తెలియక పోవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి వివరాలను తెలుసుకుందాం. కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో 12,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ తయారీ విషయానికి వస్తే.. ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధార పడి ఉంటుంది, కావున దానికయ్యే ఖర్చు ఆ రేంజ్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ట్రైన్ చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 24 బోగీలు నాశనమైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ కోచ్ల మొత్తం విలువ రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. -
ప్రపంచంలోని టాప్ 10 అరుదైన శిలలు
-
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా?
Raghav Chadha Net Worth: ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలలో నటిస్తున్న పరిణీతి చోప్రా విలాసవంతమైన జీవనశైలి కలిగిన నటి. ఆమెకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర ఆస్తులతో ఆమె నెట్వర్త్ రూ. 60 కోట్లు. అయితే ఆమెకు కాబోయే భర్త రాఘవ్ చద్దా ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మై నేత డాట్ ఇన్ఫో ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా వయసు 34 ఏళ్లు. రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ. కాబోయే భార్య పరిణీతి చోప్రాతో పోల్చితే రాఘవ్ చద్దా జీవనశైలి, నికర ఆస్తులు చాలా తక్కువ. చిన్న ఇల్లు, పాత కారు.. రాఘవ్ చద్దా ప్రకటించిన మొత్తం ఆస్తులు MyNeta.info ప్రకారం.. రూ. 50 లక్షలు. ఇందులో చరాస్తుల విలువ రూ. 36 లక్షలు. సొంత ఇల్లు ఉంది. దాని విలువ రూ.37 లక్షలు. ఇక కార్ల విషయానికి వస్తే.. రాఘవ్ చద్దా వద్ద ఉన్నది 2009 మోడల్ మారుతీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ మాత్రమే. ఇది కాకుండా ఆయన వద్ద దాదాపు 90 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 4.94 లక్షలు. పరిణీతి నెట్వర్త్ రూ. 60 కోట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం.. పరిణీతి చోప్రా నెట్వర్త్ రూ.60 కోట్లు. ఆమె సంపదలో ఎక్కువ భాగం సినిమా డీల్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచి వచ్చిందే. ఆమెకు ముంబైలో సముద్ర తీరాన లగ్జరీ విల్లా ఉంది. ఇక ఆమె దగ్గర ఆడీ A6, జాగ్వార్ XJL, ఆడీ Q5 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by @parineetichopra ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
కోట్ల ఖర్చుతో పెళ్లి.. ఆడంబరమే అయినా ఆదర్శమూ ఉంది..
భారత దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద వేడుక. సామాన్య మధ్య తరగతి వారి నుంచి సంపన్నుల వరకూ వారి వారి స్థాయిలో వివాహ వేడుకను జరిపిస్తుంటారు. ఇక బడా వ్యాపారవేత్తల సంగతి చెప్పనక్కర లేదు. అత్యంత ఆడంబరంగా జరిగిన చాలా పెళ్లిళ్ల గురించి మనకు తెలుసు. అయితే ఆడంబరంతో పాటు ఆదర్శం కూడా ఉన్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త కొడుకుల జంట వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (అమెజాన్ నుంచి 100 మంది అవుట్!) సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతో రాయ్ల వివాహాలు 2004లో ఒకే వేదికలో జరిగాయి. రూ. 550 కోట్లతో అంగరంగ వైభవంగా వారి వివాహాలు జరిపించారు. ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో నాలుగు రోజుల పాటు జరిగిన వివాహానికి అతిథులను ప్రైవేట్ జెట్లలో తరలించినట్లు వార్తలు వార్తలు వచ్చాయి. అయితే ఆ విలాసవంతమైన వివాహాలకు సంబంధించి ఆదర్శవంతమైన మరో కోణం ఉంది కుమారుల వివాహం సందర్భంగా సుబ్రతా రాయ్ కుటుంబం వివిధ మతాలు, కులాలకు చెందిన 101 మంది నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చేసి సుమారు 15000 మంది పేదలకు భోజనం అందించారు. కాగా సుశాంతో, సీమాంతోల వివాహ వేడుకలకు దాదాపు 11,000 మంది అతిథులు హాజరయ్యారు. (వామ్మో.. పసిడి పరుగు, వెండి హై జంప్!) వివాహ వేడుకలో 100కి పైగా వివిధ రకాల వంటకాలను వడ్డించారు. సుశాంతో రాయ్ రిచా అహుజాను, సీమంతో రాయ్ చాందిని తూర్ను వివాహం చేసుకున్నారు. వివాహ వేదికను ఖరీదైన పూలు, పాలిష్ లైట్లు, ప్రిజం గ్లాసులు, దీపాలతో అద్భుతంగా అలంకరించారు. అతిథులలో పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు. -
నందమూరి తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం 2002లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. సక్సెస్ఫుల్ ఆడియో ఆల్బమ్స్తో యువతకు చేరువైంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న. కానీ అతనికి అదృష్టం కలిసి రాలేదు. పదిహేనుకు పైగా చిత్రాలు చేసినప్పటికీ తారకరత్నకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. కుటుంబం విషయానికి వస్తే 2012లో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్గా కూడా పని చేశారు. నందమూరి తారకరత్న చేసింది కొద్ది సినిమాలే అయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించడంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఈ విషాద సమయంలో ఆయన నటించిన సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ఒకటో నంబర్ కుర్రాడు(2002) యువ రత్న(2002) తారక్(2003) నో(2004) భద్రాద్రి రాముడు(2004) పకడై(2006) అమరావతి(2009) వెంకటాద్రి(2009) ముక్కంటి(2010) నందీశ్వరుడు(2011) విజేత(2012) ఎదురులేని అలెగ్జాండర్(2012) చూడాలని.. చెప్పాలని(2012) మహా భక్త సిరియాలా(2014) కాకతీయుడు(2015) ఎవరు(2016) మనమంతా(2016) రాజా చేయి వేస్తే(2016) కయ్యూం భాయి(2017) దేవినేని(2021) సారథి(2022) 2022లో 9 అవర్స్ సిరీస్లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న. -
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా!
జనవరి చివరి వారం వచ్చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్ పేరు మారుమోగుతోంది. ఇందులో కేంద్రం అందించే కేటాయింపులు, పలు రంగాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, పన్ను తగ్గింపు లేదా పెంపు చర్యలపై, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలుపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందో అని సామాన్య ప్రజల నుంచి కార్పొరేట్ సంస్ధలు ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షికబడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో బడ్జెట్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలపై ఓ లుక్కేద్దాం! ►10: మొరార్జీ దేశాయ్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరుగులేని రికార్డు. దేశాయ్ జవహర్లాల్ నెహ్రూ (1958-1963), ఇందిరా గాంధీ (1967-1969) హయాంలో భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1996-1998, 2004-2008, 2012-2014 మధ్య తొమ్మిది బడ్జెట్లతో పి.చిదంబరం రెండవ స్థానంలో ఉండగా, ఎనిమిది బడ్జెట్లను సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ (1982-1984, 2008-2012) జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ►మూడు: సాధారణ ఆర్థిక మంత్రి లేకపోవడంతో ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురూ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. టిటి కృష్ణమాచారి రాజీనామా తర్వాత జవహర్లాల్ నెహ్రూ 1958 బడ్జెట్ను సమర్పించారు. బ్యాంక్ జాతీయీకరణకు వ్యతిరేకంగా తన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత ఇందిరా గాంధీ 1970 బడ్జెట్ను సమర్పించారు. రాజీవ్ గాంధీ 1987లో VP సింగ్ను రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసిన తర్వాత బడ్జెట్ను సమర్పించారు, ఆ పోర్ట్ఫోలియోను తాత్కాలికంగా తన వద్ద ఉంచుకున్నారు. ►800: 1977లో హెచ్ఎం పటేల్ బడ్జెట్ ప్రసంగంలోని పదాల సంఖ్య. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఆర్థిక మంత్రి చేసిన అతి చిన్న ప్రసంగం అంటే ఇదే. ►18,700: డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్లోని పదాల సంఖ్య - అత్యధిక పదాలు కలిగిన బడ్జెట్ ఇది. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది. దేశంలో ఆర్థిక సరళీకరణకు నాంది పలికినందున 1991 బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా కోట్ చేయడంతో పాటు విశ్లేషించబడిన బడ్జెట్ ఇది. ►162: 2020 బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు సీతారామన్ మాట్లాడిన మొత్తం నిమిషాల సంఖ్య. ఈ బడ్జెట్ ప్రసంగం ద్వారా గతంలో తను నమోదు చేసిన రికార్డ్ను ఆమె అధిగమించింది. 2019లో 137 నిమిషాల మాట్లాడి సుదీర్ఘంగా ప్రసంగించి రికార్డ్ నమోదు చేసింది. సీతారామన్ కంటే ముందు, 135 పాటు మాట్లాడిన జస్వంత్ సింగ్ (నిడివి పరంగా) అత్యధిక ప్రసంగం చేసిన రికార్డును కలిగి ఉన్నారు. ►1999: కేంద్ర బడ్జెట్ సమయం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 11 గంటలకు మార్చిన సంవత్సరం. ►2017: రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్తో విలీనమైన సంవత్సరం. ఫిబ్రవరి మొదటి రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ను అమలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం కల్పించేందుకు ఈ తేదీ మార్పు ఉపయోగపడుతోంది. ►3,94,49,09,00,00,000: భారత ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాలని ప్రతిపాదించిన మొత్తం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ₹ 39.44 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనా కంటే 4.6 శాతం పెరిగింది. ►13.3: 2022 బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం 13.3 శాతం. రక్షణ పెన్షన్ల కోసం ₹ 1.19 లక్షల కోట్లతో సహా ₹ 5.25 లక్షల కోట్ల బడ్జెట్ను మంత్రిత్వ శాఖకు కేటాయించారు. ►10,40,00,00,00,000: మొత్తం విద్యా బడ్జెట్ 2022-23లో మొదటిసారిగా ₹ 1-లక్ష కోట్లు దాటింది. గత ఏడాది విద్యకు కేటాయింపులు ₹ 1.04 లక్షల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 18.5 శాతం ఎక్కువ. చదవండి: బడ్జెట్: ఆర్థికమంత్రులు,ప్రధానులు,రాష్ట్రపతులు, ఈ విషయాలను గమనించారా? -
ఆర్థిక మంత్రిగా పని చేసినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.. ఎందుకో తెలుసా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఐదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం! బడ్జెట్ అనే పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రులలో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ చెక్కు చెదరకుండా ఆయన పేరునే కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయంటే నమ్మడమే కష్టమే. కానీ ఈ జాబితాలో ఇద్దరు ఉన్నారు. హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కలిగి ఉన్నప్పటికీ, ఏ కేంద్ర బడ్జెట్ను సమర్పించలేదు. వీరివురూ చాలా తక్కువ వ్యవధిలో పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం లేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండవ ఆర్థిక మంత్రిగా నియమితులై, కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోయారు. చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. దీంతో ఈ సారి బడ్జెట్కు ప్రత్యేకత సంతరించుకుంది. దేశ బడ్జెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ విషయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం! ►1977లో అప్పటి ఆర్థికమంత్రి హీరాభాయ్ ములిజిభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ►బడ్జెట్లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ►అత్యధిక బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్క చెదరకుండా అలానే ఉంది. ►బ్రిటీష్ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. కొత్త తేదీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ నిలిచారు. ►జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మాత్రమే బడ్జెట్ను సమర్పించిన ఏకైక ప్రధానులు. ►1999 వరకు, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ ఆమె 2.42 గంటలపాటు ప్రసంగించారు. ఇదే ఇంతవరకు ఎక్కువ సమయం ప్రసంగించిన బడ్జెట్గా రికార్డ్ నమోదు చేసింది. ►కేంద్ర బడ్జెట్ 1950లో లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ ముద్రణ జరుగుతుండగా, ఈ లీక్ తర్వాత, దానిని న్యూఢిల్లీలోని మింటో రోడ్లోని ప్రెస్కి మార్చాల్సి వచ్చింది. ► ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి పేపర్లెస్ బడ్జెట్ను సమర్పించారు. చదవండి: బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా! -
ఇలాంటి వింత ఉద్యోగాల గురించి ఎప్పుడైనా విన్నారా
మనుషుల మనుగడకు ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం– ఇలా ఏదో ఒక ఆదాయ మార్గం ఉండాల్సిందే! కొన్ని పనుల్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఇంకొన్ని పనుల్లో పెద్దగా కష్టం లేకున్నా, ఫలితం బాగానే దక్కుతుంది. ఆదాయమార్గమైన ఏ రంగంలో రాణించాలన్నా, ఆ రంగానికి చెందిన నైపుణ్యాలు లేకుంటే, అందులో కొనసాగడం కష్టమే! రకరకాల చదువులు, శిక్షణలు వంటివన్నీ ఉపాధి కోసమే! ఉపాధి ఏదైనా, అందులోని కష్టనష్టాలను భరించక తప్పదు. డబ్బులు ఊరికే రావు కదా మరి! నిజమే గాని, పూర్తిగా ఊరికే కాకున్నా దాదాపు ఊరికే డబ్బులొచ్చే ఉపాధి మార్గాలూ ఉన్నాయి. ప్రపంచంలో దండిగా ఆదాయం తెచ్చిపెట్టగల కొన్ని సుఖప్రదమైన సరదా పనులు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని చిత్రవిచిత్రమైన ఉపాధి మార్గాలు కూడా ఉన్నాయి. అతి అరుదైన అలాంటి కొన్ని వింత వింత ఉద్యోగాలు, ఉపాధిమార్గాల విశేషాలు మీకోసం.. రోజూ భోంచేయడం, భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను రుచిచూడటం, రోజంతా అలసి సొలసి పనిచేశాక, రాత్రివేళ ఆదమరచి నిద్రపోవడం, కాలక్షేపానికి సినిమాలు చూడటం, టీవీ చానళ్లు, ఓటీటీల్లోని ప్రసారాలను చూడటం వంటివి అందరూ చేసే పనులే! ఈ పనుల వల్ల ఎంతో కొంత ఖర్చు కూడా తప్పదు. అయితే, కొందరికి మాత్రం ఇలాంటి పనులే భేషైన ఆదాయమార్గాలుగా మారి, ఇబ్బడిముబ్బడిగా కాసులు కురిపిస్తున్నాయి. ఏమిటేమిటి? తిండి తిన్నా, నిద్రపోయినా, సినిమాలు చూసినా డబ్బులిస్తారా? అని అవాక్కయిపోకండి. ఇలాంటి రోజువారీ పనులకూ భేషుగ్గా డబ్బులిచ్చేవారు ఉన్నారు. ప్రొఫెషనల్ స్లీపర్ చక్కని సుతిమెత్తని పరుపు మీదకు చేరి, సుఖంగా నిద్రించడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. పాశ్చాత్య దేశాల్లో కొన్ని పరుపుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి ప్రొఫెషనల్ స్లీపర్లకు పూర్తి స్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నిద్రకు సంబంధించిన సమస్యలపై వైద్య పరిశోధనల కోసం కొన్ని ఔషధ తయారీ సంస్థలు, భారీ స్థాయి ప్రదర్శనలను ఏర్పాటు చేసేచోట ప్రదర్శనల నిర్వాహకులు కూడా ప్రొఫెషనల్ స్లీపర్ల సేవలను తమ అవసరాల మేరకు తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. వీరు చేయాల్సిన పనల్లా, తమకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో, పరిసరాల్లో చక్కగా నిద్రించడం, నిద్ర లేచాక తమ నిద్రానుభూతిని వివరంగా తెలియజేయడం. ప్రొఫెషనల్ స్లీపర్ల సగటు వార్షిక ఆదాయం 46,545 డాలర్ల (రూ.38.36 లక్షలు) వరకు ఉంటుంది. పెట్ఫుడ్ టెస్టర్ ఫుడ్ టెస్టర్ మరీ అరుదైన ఉద్యోగమేమీ కాదు. కొన్ని స్టార్ హోటళ్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్ టెస్టర్లను నియమించుకుంటాయి. అయితే, పెంపుడు జంతువుల కోసం తయారు చేసే ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యత ఎలా ఉన్నదీ చెప్పడానికి కొన్ని బహుళజాతి పెట్ఫుడ్ తయారీ సంస్థలు ఫుడ్ టెస్టర్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పెంపుడు పిల్లులు, కుక్కల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూసి, వాటి నాణ్యతను చెప్పడమే పెట్ఫుడ్ టెస్టర్ల పని. ఈ ఉద్యగంలో ఏడాదికి 27 వేల డాలర్లకు (22.25 లక్షలు) పైగానే సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. పారానార్మల్ గైడ్ ప్రసిద్ధి పొందిన పర్యాటక ప్రదేశాల్లో అక్కడి స్థానిక విశేషాలను పర్యాటకులకు వివరించేందుకు గైడ్లు ఉంటారు. ఈ పని వారికి ఒక స్వయం ఉపాధి మార్గం. ప్రపంచంలో భయానక ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు అక్కడ తిరుగుతుంటాయని ఆ ప్రదేశాల గురించిన కథలు వినిపిస్తుంటాయి. చాలామంది అలాంటి ప్రదేశాలకు వెళ్లడానికే భయపడతారు. కొందరికి మాత్రం అతీంద్రియ శక్తుల విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అలాంటి ఔత్సాహికులు వెదికి మరీ అలాంటి ప్రదేశాలకు వెళుతుంటారు. సాహసించి వెళ్లిన వారికి అక్కడి స్థానిక విశేషాలు, పద్ధతులు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి సహకరించేందుకే పారానార్మల్ గైడ్లు పుట్టుకొచ్చారు. పర్యాటకులకు తోడుగా అతీంద్రియ శక్తులు ఉన్నాయనుకునే పాడుబడ్డ బంగ్లాలు, కోటలు, అడవుల్లోకి వెళుతూ, వారికి అక్కడి విశేషాలను వివరిస్తారు. వీరి ఆదాయం ఏడాదికి 84 వేల డాలర్ల (రూ.69.27 లక్షలు) వరకు ఉంటుంది. ఫార్చూన్కుకీ రైటర్ కుకీస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండి. వీటిలో రకరకాలు ఉంటాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా కుకీస్ను ఇష్టంగా తింటారు. పాశ్చాత్యదేశాల్లో కుకీస్ను తయారు చేసే కొన్ని కంపెనీలు, వాటిలో కొన్ని చీటీలను పెడతాయి. ఆ చీటీల్లో అదృష్టాన్ని సూచించే అందమైన వాక్యాలు ఉంటాయి. జనాలను బాగా ఆకట్టుకునేలాంటి అదృష్ట వాక్యాలు రాయడంలో నైపుణ్యం ఉన్న రచయితలను కుకీల తయారీ సంస్థలు ఫార్చూన్ కుకీ రైటర్లుగా నియమించుకుంటాయి. చాలామంది కుకీల కంటే, వాటిలో ఉండే చీటీల కోసమే వాటిని కొంటుంటారు. అందువల్ల ఫార్చూన్కుకీ రైటర్లకు గిరాకీ ఏర్పడింది. వీరి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది. ఫేస్ఫీలర్ రకరకాల ముఖాలను చేతులతో తాకి, ముఖచర్మాల తీరుతెన్నులను వివరించడమే ‘ఫేస్ఫీలర్’ పని. సౌందర్యసాధనాల మార్కెట్లో ముఖానికి సంబంధించిన వాటి వాటానే సింహభాగం ఉంటుంది. అందువల్ల ముఖసౌందర్యానికి మెరుగుపరచే క్రీములు, లోషన్లు, పౌడర్లు, సబ్బులు, ఫేస్వాష్లు, షేవింగ్ క్రీములు, రేజర్లు వంటివి తయారు చేసే సంస్థలు ప్రత్యేకంగా ఫేస్ ఫీలర్లను నియమించుకుంటాయి. కొత్తగా ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ముందు ఈ కంపెనీలు రకరకాల పరీక్షలు నిర్వహిస్తాయి. వాటిలో ఫేస్ఫీలర్ల పాత్ర కీలకం. ఉత్పత్తులు వాడక ముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు ముఖచర్మాల్లో వచ్చిన మార్పులను చేతులతో తాకి గుర్తించి, వివరాలను నమోదు చేయడం వీరి ముఖ్యమైన పని. వీరు భరోసా ఇస్తేనే, సదరు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. వీరి పారితోషికం గంటకు 25–50 డాలర్ల (రూ.2,061–4,123)వరకు ఉంటుంది. లైన్ స్టాండర్ క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఉండాల్సి రావడం ఎవరికైనా ఇబ్బందే! బలహీనంగా ఉన్నవాళ్లయితే క్యూలైన్లలో నిలబడలేక, సొమ్మసిల్లిపోయే సంఘటనలు మనకు తెలియనివి కాదు. మనవంతు క్యూలైన్లో మనకు బదులు మరొకరు నిలబడేందుకు ముందుకొస్తే, ఎంతో ఉపశమనంగా ఉంటుంది. క్యూలైన్ల సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. జనాలు ఎదుర్కొనే ఈ ఇబ్బందిని గమనించి కొందరు, దీనినే తమ స్వయం ఉపాధి అవకాశంగా మార్చుకున్నారు. ఇతరుల బదులు క్యూలైన్లో నిలబడి, అందుకు కొంత రుసుము తీసుకుంటారు. ఈ పనిచేయడానికి విద్యార్హతలు, నైపుణ్యాలతో పెద్దగా పనిలేదు. కాళ్లల్లో సత్తా, గంటల తరబడి నిలబడే ఓపిక ఉంటే చాలు. అమెరికాలోను, యూరోపియన్ దేశాల్లోనూ కొద్దిమంది లైన్స్టాండర్లుగా ఉపాధి పొందుతున్నారు. షాపింగ్ మాల్స్ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించినప్పుడు, బడా కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు వీరికి బాగా గిరాకీ ఉంటుంది. లైన్స్టాండర్లు ఈ పని ద్వారా వారానికి వెయ్యి డాలర్ల వరకు (సుమారు రూ.82 వేలు) సంపాదిస్తుంటారు. పెయింట్ డ్రై వాచర్ పెయింట్లను తయారు చేసే కొన్ని బడా అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించేందుకు పెయింట్ డ్రై వాచర్లను నియమించుకుంటాయి. పెయింటర్లు గోడలకు పెయింట్ పూయడం పూర్తిచేసిన వెంటనే పెయింట్ డ్రై వాచర్ల పని మొదలవుతుంది. గంటల తరబడి పెయింట్ పూసిన గోడ ముందే కూర్చుని, పూసిన పెయింట్ ఆరడానికి ఎంత సమయం పడుతోంది, ఆరిన తర్వాత దేనికైనా అంటుకుంటోందా లేదా అని పరిశీలించి, ఆ వివరాలను కంపెనీ నిర్వాహకులకు ఒక నివేదికలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ పనిచేయడానికి కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చునే ఓపిక ఉంటే చాలు. ఈ పనిచేసే వారికి వార్షికాదాయం 40 వేల డాలర్ల (రూ.32.98 లక్షలు) వరకు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని... ఇలాంటివే మరికొన్ని విచిత్రమైన ఉద్యోగాలు, వృత్తులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని రిస్కుతో కూడుకున్నవీ ఉన్నాయి. ఉదాహరణకు పాముల నుంచి విషాన్ని వెలికితీయడం. ఈ ప్రక్రియను స్నేక్ మిల్కింగ్ అంటారు. ఔషధ కంపెనీలు ఈ పనికోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటాయి. వీరికి వార్షికాదాయం 60 వేల డాలర్ల (సుమారు 50 లక్షలు) వరకు ఉంటుంది. వివాహ వేడుకల్లో అతిథుల సందడి తక్కువయ్యే సందర్భాల్లో కొందరు ఫేక్గెస్ట్లను ఆహ్వానిస్తుంటారు. ఒక్కో పెళ్లికి హాజరయ్యేందుకు వీరికి 2500 డాలర్ల (రూ.2.06 లక్షలు) వరకు ముడుతుంది. అలాగే అంతిమయాత్రలో పాల్గొనేందుకు కూడా అద్దెమనుషుల సేవలను ఉపయోగించుకునే జనాలూ ఉన్నారు. విమానాలకు రంగులు వేసే ఏరోప్లేన్ పెయింటర్, వ్యాపార సమావేశాలకు కాస్త హంగు తీసుకొచ్చే ప్రొఫెషనల్ ఫారెనర్, రహదారికి అడ్డంగా పేరుకుపోయిన మంచుదిమ్మలను తొలగించే ఐస్బెర్గ్ మూవర్, ఎలుకల సాయంతో మందుపాతరల ఆచూకీని కనుగొనే ల్యాండ్మైన్ డిటెక్టర్, దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించే తీఫ్ హంటర్ వంటి అరుదైన వృత్తులు కూడా ఉన్నాయి. ఈ వృత్తులు, ఉద్యోగాల గురించి చాలామందికి సరైన సమాచారం తెలియదు. ఇలాంటి కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల ఆదాయం కంటే ఎక్కువగానే ఉండటం విశేషం. ఫెంగ్షుయి కన్సల్టంట్ ఫెంగ్షుయి ప్రాచీనకాలం నుంచి చైనాలో వ్యాప్తిలో ఉంది. ఇది దాదాపు మన వాస్తుశాస్త్రంలాంటిది. చైనా నుంచి ఇది దేశదేశాలకూ పాకింది. అగ్రరాజ్యాల్లో ఫెంగ్షుయికి ఆదరణ విపరీతంగా ఉంటోంది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ చైనీయులు కొందరు ఫెంగ్షుయిని వృత్తిగా మలచుకుని భారీ ఆదాయం సంపాదిస్తున్నారు. ఫెంగ్షుయి పూర్తిగా విశ్వాసాలతో కూడుకున్నదే అయినా, దీని గిరాకీ తక్కువేమీ కాదు. ఈ గిరాకీనే ఫెంగ్షుయి కన్సల్టంట్లకు కాసుల పంట పండిస్తోంది. ఒక్కో క్లయింట్ నుంచి వీరు వెయ్యి డాలర్ల (రూ.82 వేలు) వరకు వసూలు చేస్తుంటారు. పేపర్ టవల్ స్నిఫర్ సెంట్లు, డియోడరెంట్లు వంటివి వాసన చూసి, వాటి నాణ్యతను పరీక్షించే ఆడర్ స్నిఫర్లే కాదు, పేపర్ టవల్స్– అదే టిష్యూపేపర్లను వాసన చూసే పేపర్ టవల్ స్నిఫర్లూ ఉన్నారు. టిష్యూపేపర్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు పేపర్ టవల్ స్నిఫర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అప్పుడే తయారైన టిష్యూ పేపర్లను వాసన చూసి, వాటి నాణ్యతను ధ్రువీకరించడమే వీరు చేయాల్సిన పని. వీరికి ఏడాదికి 52 వేల డాలర్ల (రూ.42.88 లక్షలు) వరకు ఆదాయం ఉంటుంది. హ్యూమన్ స్టాచ్యూ హ్యూమన్ స్టాచ్యూలు మన దేశంలోనూ కనిపిస్తారు. అయితే, వారినెవరూ ప్రత్యేకంగా నియమించరు. వారంతట వారే, ఒళ్లంతా తెల్లగా మెరిసే రంగు పూసుకుని గాంధీ వేషంలో ఎక్కువగా రద్దీ కూడళ్లలో కనిపిస్తుంటారు. జనాలు జాలి తలచి ఇచ్చే డబ్బు తప్ప వారికి దక్కేదింకేమీ ఉండదు. కాని, పాశ్చాత్య దేశాల్లోనైతే ఇదొక ప్రత్యేకమైన వృత్తి. వీరు ఒంటికి రంగు పూసుకుని, కదలకుండా శిలా విగ్రహంలా గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. ఎక్కువగా వేడుకలు జరిగే చోట, షాపింగ్ మాల్స్ వద్ద జనాలను ఆకట్టుకోవడానికి వీరిని నియమించుకుంటారు. వీరి సేవలకు గంటకు 100 డాలర్ల (సుమారు రూ.8,200) వరకు పారితోషికంగా చెల్లిస్తారు. ఆడర్ స్నిఫర్స్ పొద్దన్న లేచింది మొదలు రకరకాల వాసనలను ఆఘ్రాణిస్తూనే ఉంటాం. వాసనలు చూడటానికి జీతాలు చెల్లించే సంస్థలూ ఉన్నాయి. సెంట్లు, పర్ఫ్యూమ్లు, డీయోడరెంట్లు వంటి పరిమళ ద్రవ్యాలను తయారు చేసే కొన్ని పెద్దస్థాయి కంపెనీలు ప్రత్యేకంగా ఆడర్ స్నిఫర్స్ను నియమించుకుంటాయి. ఇంకొన్ని కంపెనీలు తమ అవసరం మేరకు గంటకు కొంతమొత్తం చొప్పున పారితోషికం చెల్లించి, ఆడర్ స్నిఫర్ల సేవలను వినియోగించు కుంటాయి. ఉత్పత్తుల నాణ్యతను కాపాడుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్తదనాన్ని అందించడానికి మార్కెట్లో పోటీ పడే సంస్థలు నిశితమైన ఆఘ్రాణశక్తి గలవారికి ఆడర్ స్నిఫర్లుగా అవకాశాలు ఇస్తుంటాయి. ఈ ఉద్యోగంలో పనితనం, అనుభవం బట్టి ఏడాదికి 39 వేల (32.16 లక్షలు) నుంచి, 1.13 లక్షల డాలర్ల (రూ.93.18 లక్షలు) వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా వీరి సేవలను వినియోగించు కునే కంపెనీలు వీరికి గంటకు 25–30 డాలర్ల (రూ.2,061– 2,474) వరకు చెల్లిస్తాయి. ప్రొఫెషనల్ కడ్లర్ ఇది పూర్తిగా స్వయం ఉపాధి వృత్తి. తమ వద్దకు వచ్చే క్లయింట్లను వాటేసుకోవడమే వీరి పని. రకరకాల కారణాలతో దిగులు, మనోవేదనతో బాధపడేవారు ఆత్మీయస్పర్శను కోరుకుంటారు. ఆత్మీయస్పర్శకు నోచుకోని ఒంటరిజీవులకు ఊరటనిచ్చే ఉద్దేశంతో సమంతా హెస్ అనే అమెరికన్ యువతి దాదాపు దశాబ్దం కిందట ప్రొఫెషనల్ కడ్లర్గా మారింది. ఆమె ఇందులో విజయవంతం కావడంతో మరికొందరు కూడా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. సోఫాపై కూర్చుని లేదా మంచంపై పడుకుని, క్లయింట్లను కౌగలించుకుని ఉండటమే వీరి పని. వీరి ఆదాయం గంటకు 20 నుంచి 40 డాలర్ల (రూ.1650– 3300) వరకు ఉంటుంది. మూవీ వాచర్ సినిమాలు చూడటమంటే చాలామందికి సరదా. అభిమాన హీరోల సినిమాలు విడుదలైతే, థియేటర్లో ఆడుతున్నన్ని రోజులూ వాటిని చూసే వీరాభిమానులూ ఉంటారు. సినిమాకు వెళితే టికెట్లు, వెహికల్ పార్కింగ్, చిరుతిళ్లు, కూల్డ్రింకులు వగైరాలకు బాగానే ఖర్చవుతుంది. అయితే, సినిమాలు చూడటానికి– అదీ విడుదలకు ముందే వాటిని చూడటానికి డబ్బులిచ్చేవారూ ఉన్నారు. హాలీవుడ్లో కొన్ని నిర్మాణ సంస్థలు తాము నిర్మించిన సినిమాలు చూసి, వాటికి రేటింగ్ ఇచ్చేందుకు నిపుణులైన విశ్లేషకులను నియమించుకుంటాయి. ‘నెట్ఫ్లిక్స్’ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలూ ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్నాయి. విడుదలకు ముందే ఈ నిపుణులు సినిమాలు, సిరీస్లు చూసి, వాటికి మంచి రేటింగ్ ఇస్తేనే, అవి విడుదలకు నోచుకుంటాయి. ఈ పని చేసేవారికి గంటకు 15 డాలర్ల (రూ.1237) వరకు పారితోషికం ఉంటుంది. ప్రొఫెషనల్ మెర్మెయిడ్ మెర్మెయిడ్లు– అంటే మత్స్యకన్యలు కాల్పనిక సాహిత్యంలో తప్ప నిజజీవితంలో కనిపించరు. అయితే, కొందరు మెర్మెయిడ్ వేషధారణతో సరదాగా సముద్రతీరంలోనో, కనీసం ఈతకొలను దగ్గరో రకరకాల భంగిమల్లో ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. నడుము నుంచి దిగువభాగమంతా చేప మాదిరిగా తయారు చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఈతకొడుతూ చూసేవారిని ఆకర్షిస్తూ ఉంటారు. పెద్దపెద్ద వేడుకలు, ఉత్సవాలు జరిగేచోట నిర్వాహకులు ప్రొఫెషనల్ మెర్మెయిడ్ల సేవలను ఉపయోగించుకుంటూ ఉంటారు. సందర్శకుల్లో ఆసక్తి ఉన్నవారికి మెర్మెయిడ్ దుస్తులు ధరించి, ఈతకొట్టడంలో మెలకువలను కూడా వీరు నేర్పిస్తూ ఉంటారు. ఇది పూర్తిస్థాయి ఉద్యోగం కాకున్నా, భారీగానే ఆదాయం తెచ్చిపెట్టే స్వయం ఉపాధి మార్గం. ప్రొఫెషనల్ మెర్మెయిడ్లకు ఆదాయం గంటకు 300 డాలర్ల (సుమారు రూ.25 వేలు) వరకు ఉంటుంది. -
మెరుపు వేగం.. చీతాలకు ఉన్న ఈ ప్రత్యేక గుణం గురించి తెలుసా?
చీతా.. ఈ భూమ్మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. తేలికగా ఉండే శరీర తత్వంతో.. పొడవాటి తోక, సన్నని పొడవైన కాళ్లతో మెరుగు వేగంతో దూసుకుపోయే తత్వం చీతాది. అదే టైంలో ఆ చూడ ముచ్చటైన స్వభావమే దాని పాలిట శాపంగా మారింది. ఆల్రెడీ భారత్లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్టు చేపట్టారు. నమీబియా నుంచి తెచ్చిన ఎనిమిది చీతాలను కునో నేషనల్ పార్క్(ఎంపీ)లోకి వదిలారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అరుదైన ఈ వన్యప్రాణి గురించి.. ► చీతా అనే పదం.. హిందుస్థానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీనర్థం చిత్ర..యా అంటే రంగురంగులది అని. ► చీతాలు నాలుగు ఉపజాతులుగా ఇప్పుడు ఈ భూమ్మీద ఉన్నాయి. సౌతాఫ్రికన్ చీతాలు, ఆసియాటిక్ చీతాలు, నార్త్ఈస్ట్ ఆఫ్రికన్ చీతాలు, నార్త్వెస్ట్ ఆఫ్రికన్ చీతాలు. ► చీతా వేట నిమిషం కంటే వ్యవధిలోనే ముగస్తుంటుంది సాధారణంగా. ఒక దూకుతో వేటను పట్టేస్తుంది. ఇది ఎంతలా అంటే.. స్పోర్ట్స్ కారు కంటే వేగంగా..! ► పిల్లి జాతి వన్యప్రాణుల్లో చీతాలది ఒక ప్రత్యేకమైన జీవనం. మగవన్నీ కలిసి జీవిస్తే.. ఆడ చీతలు మాత్రం ఒంటరిగా కూనలను పెంచుతాయి. పగలంతా వాటిని దాచేసి.. ఎలా వేటాడో నేర్పిస్తాయి. ఇక మగవన్నీ ఒక జట్టుగా ఉండి తమ సరిహద్దుల్ని కాపాడుకోవడంతో పాటు వేటను వెంటాడుతాయి. ► చీతలకు ఉన్న మరో ప్రత్యేకత పగటి పూట వేట. పొద్దుపొద్దునే.. లేదంటే మిట్టమధ్యాహ్నాం అవి బరిలో దిగుతాయి. సూర్యుడి కాంతి కంటి మీద పడినా.. కళ్లు రెప్పవాల్చకుండా వేటాడుతాయి అవి. తద్వారా సింహం, హైనాల లాంటి పోటీ నుంచి అవి ఊరట దక్కించుకుంటాయి. మ్మి.. యావ్ చీతా గర్జిస్తుందని పొరబడేరు.. పాపం దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల (రెండు భాగాల బోన్) అది గర్జించలేదు. బదులుగా.. పిల్లిలాగా మియావ్ అని లేదంటే షిష్.. అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. ► చీతాను ఒకప్పుడు ఈజిప్ట్లో పరమ పవిత్రంగా, రాజసంగా భావించేవాళ్లు. ఫారోల సమాధులు, ఇతర కట్టడాలపై వాటికి ఉన్న ప్రాధాన్యతే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ► చీతాలు తమ సరిహద్దులు ఎక్కువగా ఉండాలని అనుకుంటాయి. కానీ, మనుషుల తాకిడితో వాటి సరిహద్దులు చెరిగిపోయి.. అంతరించే దశకు చేరుకున్నాయి. ► సింహాలు తప్ప మిగతా జాతులన్నీ విడిగానే జీవిస్తాయి. కానీ, చీతాలు మాత్రం గుంపునే ఇష్టపడతాయి. సింహాల మాదిరే నీళ్లు కూడా తక్కువగా తాగుతాయి చీతాలు. ఫాస్ట్ ఫుడ్ ఇష్టం చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం. అందుకే కుందేళ్లను, జింకలను వేటాడుతాయి. పెద్ద వాటి జోలికి ఎక్కువగా పోవు. పైగా ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకుని త్వరగా తినేస్తాయి కూడా. ► చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ. అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో.. తల్లి చీతాలకు చంపి.. కూనలను అక్రమ రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా అరేబియన్ గల్ప్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అందుకే వీటి వేటను అణచివేసేందుకు ఆఫ్రికా, ఇరాన్ లాంటి ఆసియా దేశం కఠినచట్టాలు అమలు చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పిల్లల జోలికొస్తే చంపేంత ప్రేమ.. ఎలుగుబంట్ల గురించి షాకింగ్ నిజాలు
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): ఎలుగుబంట్లు తన పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురైతే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ సమయంలో పులినైనా ఎదిరించి దాడికి తెగబడతాయి. పిల్లలపై వాటి వాత్సల్యం అలాంటిది. కంగారుల్లాగా తన సంతానాన్ని నిత్యం కంటికిరెప్పలా చూసుకుంటూ వెంట పెట్టుకుని తిరిగే ఈ భల్లూకాలు అంతరించిపోతున్న జీవుల్లో ఉండటం విచారకరం. చదవండి: శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి ఎలుగు బంట్లలో పలు రకాల జాతులున్నప్పటికీ స్లాత్బేర్గా పిలువబడే తెల్లమూతి నల్ల ఎలుగు బంటి భారత ఉపఖండమంతా జీవిస్తున్న మాంసాహార క్షీరదం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించ గలిగే ఎలుగుబంటి నల్లమల కీకారణ్యంలోనూ , అనంతపురం జిల్లాలోని బోడి కొండల్లోనూ ఉన్నాయి. అయినప్పటికీ వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది. తన పిల్లలపై అపారమైన ప్రేమ తన పిల్లలను రక్షించుకునేందుకు ఎదురు పడిన జీవిని చంపేంత ప్రమాదకారి ఎలుగుబంటి. ఏ వన్యప్రాణి అయినా పిల్లలతో ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కానీ ఎలుగుబంటికి ఆవేశపాళ్లు చాలా ఎక్కువ. ఈ రౌద్రమంతా తనకు తన పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమ, జాగురూకత. దీంతో అది పిల్లలతో సంచరించేటప్పుడు జంతువైనా, మనిషి అయినా ఎదురైతే ఎలాంటి శషభిషలు లేకుండా దాడికి పూనుకుంటుంది. ఈ దాడి ప్రాణాంతకంగా ఉంటుంది. అడవుల్లో విధులు నిర్వహించే అటవీ సిబ్బంది కూడా ఎలుగుబంటి దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి నిరంతర జాగురూకత పాటించాల్సి ఉంటుంది. నిత్యం వీపున మోస్తూ.. భల్లూకం తన పిల్లలను అత్యంత జాగ్రత్తతో పెంచుతుంది. నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఎలుగుబంటి ప్రత్యేక లక్షణం. ఇది ఇతర వన్యప్రాణుల్లో అంతగా కనిపించదు. కోతులు మాత్రమే పిల్ల కోతులను పొట్టకు కరిపించుకు మోస్తుంటాయి. పులినైనా ఎదిరించే ధైర్యం పిల్లలతో ఉండే ఎలుగు బంటి వాటి రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు నల్లమల సమీప గ్రామాల ప్రజలు. చాలా సందర్భాలో అవి పెద్దపులులతో పోరాటానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్దపులితో పోల్చుకుంటే వాటి బలం చాలా తక్కువ. కానీ పిల్లల కోసం శక్తికి మించి తలపడుతుంటాయి. వాటి పదునైన గోళ్ల ధాటికి పెద్దపులులు కూడా భయపడతాయని వారు చెబుతారు. మాంసాహారే కాని అల్పాహారి ఎలుగుబంటి పేరుకు కార్నివోర్స్ (మాంసాహార జంతువు )ల లిస్ట్లో ఉంటుంది. కానీ, అది తినే ఆహారం చూస్తే అల్పాహారమనుకోకుండా ఉండలేం. ఎలుగు బంటి పుట్టలను తవ్వి చీమలు, చెదలను తింటుంది. అలాగే వివిధ ఫలాలను కూడా ఇది భుజిస్తుంది. రేగు పళ్లను ఇష్టంగా తింటుంది. చెట్లు ఎక్కడంలో నేర్పరి భల్లూకాలు చెట్లు ఎక్కడంలో చిరుత పులులలాగే మంచి నేర్పరులు. ఇవి ఎక్కువగా పండ్లను ఆహారంగా స్వీకరిస్తాయి. వాటి కోసం చెట్లను ఎక్కుతుంటాయి. ఎత్తులో ఉండే వెలగ పండ్లను, చిటిమిటి, టుంకి పండ్లను తన నేర్పరితనంతో ఎలుగు బంట్లు సులభంగా సంపాదించుకుంటాయి. అలాగే తేనె పట్టులను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. భల్లూకం నుంచి ఇలా తప్పించుకోవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లు దాడికి తెగబడుతాయి.వెంట పిల్లలున్నప్పుడు, ఆహార సేకరణ సమయంలో అంతరాయం కలిగిస్తే అవి రెచ్చిపోతాయి. అడవుల్లో సంచరించే వ్యక్తులు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు కదలాలి. పుట్టల వద్ద ఎలుగు బంట్లు కనిపిస్తే పెద్దగా అరుస్తూ కేకలు వేయడం ద్వారా వాటిని బెదర గొట్టవచ్చు. అలాగే చేతిలో తమ పొడవుకు మించిన చేతికర్రను వెంట తీసుకెళ్లాలి. ఎలుగుబంటి పరుగు వేగం కూడా తక్కువే కాబట్టి దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుంటుంది. ఎలుగుబంటి రక్షిత జీవి ఎలుగుబంటి రక్షిత జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. ఇది అంతరించిపోయే దశలో ఉన్నందువలన దీనిని వేటాడడంగానీ, ప్రమాదం కలిగించడంకానీ చట్టబద్ధంగా నేరం. ఎలుగుబంట్లు సాధారణ పరిస్థితుల్లో ఎవరికి హాని చేయవు. కొద్దిజాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా తప్పించుకోవచ్చు. –శ్రీనివాసరెడ్డి, ఎఫ్డిపీటీ, ఎన్ఎస్పీఆర్ మనిషిని చూస్తే గట్టిగా అరుస్తాయి అడవిలో పులితో కూడా ప్రమాదం లేదు కానీ ఎలుగుబంటి చూస్తేనే చాలు మాకు వణుకుపుడుతుంది. మనిషిని చూస్తే అవి పెద్దగా అరుస్తూ మీదపడి తీవ్రంగా గాయపరుస్తాయి. మా గ్రామానికి చెందిన చాలా మంది వాటి దాడిలో గాయపడ్డారు. ఓ ఇద్దరు మరణించారు కూడా. వీరికి అటవీశాఖ నుంచి పరిహారం లభిస్తుండడం కొంత మేలు కలుగుతుంది. – ఎల్లయ్య, రైతు, నల్లకాల్వ -
బోన్ చర్చ్.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం
భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్లో కుట్నా హోరాలోని సెడ్లెక్లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు కూడా వచ్చింది. -
ఈ ప్రముఖుల గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
అమీషాకు పింక్ పిచ్చి... నటి అమీషా పటేల్కు పింక్ కలర్ అంటే పిచ్చి. ఆమె డ్రెస్లు, చీరలు, ఇతరత్రా అలంకరణ వస్తువులతో పాటు దాదాపుగా ప్రతి వస్తువు పింక్ కలర్లో ఉండేలా చూసుకుంటుంది. బద్రీ భామ ఇంట్లో ఆఖరికి గోడలు, తలుపులు, ఫర్నిచర్ కూడా పింక్ మయమేనట. ముఖ్యమంత్రి కాక ముందు బొటిక్ ఓనర్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి.. (దివంగత) బిజు పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు బొటిక్ నిర్వహించేవారు.. ‘సైక్డెల్హి’ పేరుతో. ఇది నిజం. న్యూఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో ఉండేది అది. కాళీ కాదు చిత్రకారిణి.. కలకత్తా కాళీలా గర్జించే మమతా బెనర్జీ చిత్రకళలో మేటి తెలుసా! ఆమె చిత్రాలు ఎక్కువగా మహిళలకు సంబంధించే ఉంటాయి. అందులో కొన్ని చిత్రకళా ప్రదర్శనల్లో అమ్ముడు పోయి అధిక మొత్తంలో కాసులనూ సంపాదించి పెట్టాయి ఆమెకు. ప్రపంచంలో ఒకే ఒక్కడు మన మన్మోహనుడు.. ఆర్థిక సంస్కరణలను అద్భుతంగా అమలు చేసిన ఆర్థికవేత్తగా.. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ జగద్విదితం. ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత చదువుకున్న.. క్వాలిఫైడ్ ప్రధాని మరొకరు లేరుట. చాంపియన్ ప్రెసిడెంట్.. మన తొలి మహిళా ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఎరుకే కదా! కానీ ఆమె టేబుల్ టెన్నిస్ చాంపియన్ అని తెలుసుండదు. అవును కాలేజీ రోజుల్లో ఆమె టీటీ చాంపియన్. మరీ ఇంత బిజీనా..? సుప్రసిద్ధ రచయిత హరుకి మురకామి డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘నేను ఉదయం నాలుగింటికల్లా నిద్రలేస్తాను. లేవగానే రాయడం మీద కూర్చుంటాను అయిదు నుంచి ఆరుగంటల పాటు. మధ్యాహ్నం దాదాపు పది కిలోమీటర్లు నడవడమో.. లేక పదిహేను వందల మీటర్లు స్విమ్ చేయడమో లేదంటే రెండూ ఉంటాయి. ఆ తర్వాత కాసేపు నచ్చిన పుస్తకం చదవడమో.. మ్యూజిక్ వినడమో చేస్తాను. రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రకుపక్రమిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా. .రాకుండా రోజూ ఇదే షెడ్యూల్ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నోట్ చేసుకుంటున్న రిపోర్టర్ చివరి వాక్యం రాసి ఊపిరి పీల్చుకుంటూ నిట్టూర్చాడట. ఆయుష్మాన్ ఖురానా@దంతావధాని బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. దంతాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎంతంటే ఆ శ్రద్ధ ఓ అబ్సేషన్ అయ్యేంతగా. సాధారణంగా ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటాం. కానీ ఆయుష్మాన్.. తరచుగా అంటే రోజులో వీలైనన్ని సార్లు బ్రష్ చేసుకుంటూంటాడట. అందుకే నిత్యం తన వెంట డెంటల్ కేర్ కిట్ను క్యారీ చేస్తూంటాడట! -
Faria Abdullah: మన చిట్టి.. మామూలు టాలెంట్ కాదు!
మనసు ఉంటే మార్గం ఉండడమే కాదు... ఆ మార్గం దగ్గరికి తీసుకెళ్లడానికి మాంచి బైక్ కూడా ఉంటుంది! ఈ బైక్పై ఆ మార్గంలో దూసుకువెళితే ఎన్నో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎన్నో విద్యలు, విజయాలు పలకరించి స్వాగతిస్తాయి.... ‘జాతిరత్నాలు’ సినిమాతో మనకు సుపరిచితం అయింది ఫరియా అబ్దుల్లా... అదేనండీ చిట్టి! విశేషం ఏమిటంటే మన చిట్టి ఎన్నో విద్యలలో గట్టి ప్రతిభ ప్రదర్శిస్తోంది. స్కూల్రోజుల్లోనే డ్యాన్స్, పెయింటింగ్ నేర్చుకుంది. హైదరాబాద్, బంజారాహిల్స్లో పెరిగిన ఫరియాకు, పదవ తరగతి తరువాత ‘హోమ్ స్కూలింగ్’ పుణ్యమా అని బోలెడు స్వేచ్ఛ లభించింది. ఎందరో గురువుల దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకునే అవకాశం వచ్చింది. పెయింటింగ్ క్లాసుల కోసం కాచిగూడ, లిటరేచర్ క్లాసుల కోసం లింగంపల్లి వెళ్లేది. ఆ సమయంలోనే నాటకరంగంపై ఆసక్తి కలిగింది. ‘నిషుంబిత’ ‘సమహార’... మొదలైన థియేటర్ గ్రూప్స్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నటించడం మాత్రమే కాదు నాటకం రచించడం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం చేసింది. ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడతారు. తాను తెలుగు మాట్లాడుతుంది. ఇంగ్లీష్తో కలిపితే ఇప్పటి వరకు తనకు నాలుగు భాషలు వచ్చు. ‘కవిత్వం ఒక తీరనిదాహం’ అంటాడు మహాకవి. నేర్చుకోవాలనే ‘తపన’ కూడా తీరని దాహం లాంటిదే. ఆ దాహం ఎన్నో విద్యలను మనకు పరిచయం చేస్తుంది... పదిమంది గొప్పగా మాట్లాడుకునేలా చేస్తుంది అని చెప్పడానికి ఫరియా అబ్దుల్లాలాంటి వారు ఉదాహరణగా నిలుస్తారు. ఇతరులకు స్ఫూర్తి ఇస్తారు. (క్లిక్: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన పూరీ జగన్నాథ్ కూతురు!) -
ఇళ్లు అందంగా ఉండాలంటే.. నాలుగు రాళ్లు ఉన్నా చాలు!
ఇంట్లోకి ప్రకృతిని ఆహ్వానించాలంటే సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. అందుకు రాతి కళ గొప్ప వేదిక అవుతుంది. పెద్ద రాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. సొంతింటి కల కోసం సంపాదనను సూచిస్తూ ‘నాలుగు రాళ్లు సంపాదించండి ’ అని హితులు సలహాలు ఇస్తుంటారు. అద్దెల్లు అయినా, సొంతిల్లు అయినా అలంకారంలో రాళ్లను రతనాలుగా మార్చేలా నవతరం వినూత్న ఆలోచనలు చేస్తోంది. గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్ స్టోన్ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్తో గోడ మొత్తం స్టోన్ లుక్తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా ఉండటం లేదు. గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్ ల్యాంప్.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్ ల్యాంప్ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు. ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్లోనే కాదు లివింగ్ రూమ్లోనూ ఆకర్షణగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ రాసి అలంకరించుకోవచ్చు. టేబుల్ టాప్: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్ టేబుల్ టాప్ను గ్లాస్ అమరికతో డిజైన్ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు. ప్లేట్ మ్యాట్స్: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్ వంటి ప్లేట్ మ్యాట్స్ను డైనింగ్ టేబుల్పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్ మ్యాట్స్ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు తప్పక అందుతాయి. ఫొటో ఫ్రేమ్స్, స్టోన్ పెయింటింగ్, వాల్ డెకార్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ పాట్స్.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్. ఇంకొన్ని రంగులు. ఆర్ట్ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
Suraj Bhai Meena: అడవిలో ఆడపులి.. పల్లె కట్టుబాటును దాటి...
Suraj Bhai Meena- దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు ఉండే రణథమ్బోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో చాలా ఆడపులులు ఉన్నాయి. వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్లూ ఉన్నారు. కాని వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది. సూరజ్బాయి మీనా. ఆ అడవి దాపున పల్లెలో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్గైడ్గా మారింది. మగవాళ్లు వద్దన్నారు. ఊరు వద్దంది. కాని ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది. ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది. రాజస్థాన్లోని సవాయి మధోపూర్ టౌన్ చుట్టుపక్కల బనస్ నదిని చుట్టుముడుతూ ఉండే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రణథమ్బోర్ 1980 ల నుంచి టూరిజంలో చురుగ్గా ఉంది. అప్పటి నుంచి ఎందరో గైడ్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే టూరిస్ట్లను అడవిలో గైడ్ చేస్తూ ఉంటారు. వారికి పులిని చూపుతూ ఉంటారు. ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. అదంతా పురుషుల పనే 2007 వరకూ. కాని ఆ సంవత్సరం మొదటిసారి ఒక మహిళా గైడ్ అడవిలోకి వచ్చింది. సూరజ్బాయి మీనా. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు రెండురోజులు ఉండి పారిపోతుంది అనుకున్నారు. కాని ఇవాళ్టి వరకూ సూరజ్బాయి మీనా అక్కడ పని చేస్తూనే ఉంది. తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్లను తయారు చేసి వారికీ ఉపాధి చూపింది. పల్లె కట్టుబాటును దాటి... సూరజ్బాయి మీనాది రణథమ్బోర్ రిజర్వ్కు ఆనుకుని ఉన్న భురి పహడి అనే కుగ్రామం. ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల. ఆ ఊళ్లో ఎవరికీ చదువు లేదు. ఆడపిల్లలకు అసలే లేదు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో 8వ తరగతి తర్వాతే ఏబిసిడిలు నేర్పిస్తారు. అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా. ‘మా అన్నయ్య హేమరాజ్ మొదట రిజర్వ్ ఫారెస్ట్లో చేరాడు. నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని. అడవి నాకు చాలా నచ్చేది. నేను కూడా అన్నయ్యలాగే గైడ్ అవ్వాలనుకున్నాను. కాని అది అంత సులభం కాదని నాకు తెలుసు’ అంది మీనా. తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్గా మారడానికి నిశ్చయించుకుంది. కాని ఈ విషయం ఊళ్లో ఎవరికీ నచ్చలేదు. వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ‘ఆ ఫారిన్ వాళ్లు వచ్చి నిన్నేమైనా చేస్తే? వాళ్ల మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే’ అని తల్లి ఆందోళన చెందింది. మీనా అన్నయ్యల్లో హేమరాజ్ తప్ప మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వలేదు. కాని హేమరాజ్ ఆమెకు అండగా నిలిచాడు. చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు. సవాయి మధోపూర్కు తీసుకెళ్లి ఫారెస్ట్ వాళ్ల ట్రైనింగ్కు అప్లికేషన్ పెట్టించాడు. చెల్లెలు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 2007లో మీనా తొలి మహిళా గైడ్గా అడవిలో ప్రవేశించింది. పులినీ... విమర్శనూ ఇప్పుడు మీనాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ఫారెస్ట్లో పని చేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం. రెండు టూరిస్ట్లతో ఇంగ్లిష్ మాట్లాడటం. మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు ‘నీకిక్కడ ఏం పని?’ అన్నట్టుగా చూసేవారు. ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని సఫారీలో టూరిస్ట్లను ఎక్కించుకుని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు. ఇంకోవైపు ఫారిన్ టూరిస్ట్లకు అడవిలో చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఇంగ్లిష్లో చెప్పాల్సి వచ్చేది. అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపీలో రాసుకుని ఇంగ్లిష్ని సాధన చేసి నేర్చుకుంది. చిన్న పెద్ద వాక్యాలు పలకడం తెలుసుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది. ఆమెకు సరదాగా మాట్లాడటం వచ్చు. టూరిస్ట్లను నవ్వించేది. క్రమంగా ఆమె అందరికీ నచ్చింది. పులితో భేటి రణథమ్బోర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉన్నాయి. అన్ని పులులనూ మీనా గుర్తించగలదు. ‘పులి కనిపిస్తే టూరిస్ట్లకు దాని పేరు చెప్తాను. అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి. దాని పేరే అదేనని నీకెలా తెలుసు అని చాలామంది టూరిస్ట్లు అడుగుతారు. ఏం చెప్పమంటారు’ అంటుంది. ఫారెస్ట్కు వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు, బర్డ్ వాచర్స్, ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తుంటారు. మీనా అడవి చూపిస్తుంటుంది. ‘ఒక ఫోటోగ్రాఫర్ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు. నేను వెంటనే జిప్సీ దిగి అతనికి, పులికీ మధ్య నిలబడ్డాను. లక్కీగా అది ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంది మీనా. కొన్నిసార్లు పులి జిప్సీ బానెట్ మీదకు లంఘిస్తూ ఉంటుంది. కాని ఎప్పుడూ ఎలాంటి అపాయం జరగలేదు. ‘పులి కనిపించకపోతే టూరిస్ట్లు విసుక్కుంటారు. పులిని చూపించు అంటారు. అది నేను రమ్మంటే రాదు కదా. అంతగా కచ్చితంగా చూడాలంటే జూకు వెళ్లండి అని చెప్తుంటాను’ అని నవ్వుతుంది మీనా. జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది. తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా సివంగిలా మారింది. ఇద్దరు పిల్లలు, భర్తతో ఆమె సంతోషంగా ఉంది. అన్నట్టు బి.ఇడి వరకూ చదివేసింది కూడా. కలవాలంటే ఈ వేసవిలో రణథమ్బోర్ ట్రిప్ వేయండి. -
అసలు పేరు ‘నగ్న పర్వతం’.. కానీ పర్యాటకులు మరోలా పిలుస్తారు!
కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్గా ఉంటాయో అంతే భయాన్నీ క్రియేట్ చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. పాకిస్తాన్లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది. ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). నంగా పర్బత్ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. 1953లో హెర్మన్ బుహ్ల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరూ వచ్చింది. ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్ను మోస్ట్ డేంజరెస్ అండ్ థ్రిల్లింగ్ టూర్ అంటారు పర్వత పర్యాటక ప్రియులు. -
హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే?
సాక్షి,పంజగుట్ట: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదని, కులీకుతుబ్షా కాలంలోనే ఈ నగరానికి హైదరాబాద్గా నామకరణం చేశారని చరిత్ర కారులు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ సంపాదకులు కింగ్సుఖ్నాగ్, పరిశోధకులు సయ్యద్ ఇనాముర్ రహమాన్ ఘయుర్లతో కలిసి మాట్లాడుతూ... భాగమతి ప్రేమకు చిహ్నంగా కులీకుతుబ్షా భాగ్యనగర్ను నిర్మించారనడంలో వాస్తవం లేదన్నారు. 1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి ప్రబలడంతో రాజు తన పరివారంతో మూసీ నది దక్షిణాన విడిది చేశారని, అక్కడ వేడి ఎక్కువగా ఉండటం, రాజవాసం ఎవరికీ కనబడకుండా ఉండేందుకు తోటలు ఏర్పాటు చేయించారని ఆ సమయంలో ఒక ఫ్రాన్స్ దేశస్తుడు అన్ని తోటలు చూసి ‘బాగ్ నగర్’గా తన పుస్తకంలో రాసుకున్నారన్నారు. కులీకుతుబ్షా అనుమతితో రెండో ఖలీఫా అయిన లలీ తన మరోపేరు హైదర్ కావడంతో ఈ ప్రాంతానికి హైదరాబాద్గా నామకరణం చేశారన్నారు. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది
మనుషులుండే ఊళ్లు చాలా ఉన్నాయి.. మరి మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది.. సెంటూరిపే.. ఇటలీలోని ఈ చిన్న పట్టణం.. పై నుంచి చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్లో తమ పట్టణం మ్యాప్ను చూసి.. చూస్తా ఉంటే మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు.. దాన్ని తీర్చేసుకుందామని.. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు.. కట్చేస్తే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే.. చాలామంది దీన్ని నమ్మలేదు. మార్ఫింగ్ చేశారని.. ఫొటోగ్రాఫర్ను విమర్శించారు. అయితే.. తర్వాత గూగుల్లో మ్యాప్లో చెక్ చేసుకుని.. తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా చెప్పారు. 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. (చదవండి: ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) -
యాక్..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..!
బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ ఎట్సెట్రా చాలా రకాల టీలు విన్నాం.. తాగుతున్నాం కూడా. చైనాలో పాండా విసర్జనలతో కూడా టీ కాస్తారట తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన టీ ఇది. సాధారణంగా పాండాలు వెదురు మొక్కలను తింటాయి. దాంతో అవి విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయట. అందుకే ఒక పాండా టీ ప్యాకెట్ విలువ రూ.2.4 లక్షలు. ఒట్టి పాండాలే కాదు సేంద్రియ తేయాకులను తినే పురుగుల విసర్జనతో కూడా చైనీయులు చాయ్ తయారుచేస్తారు. ఈ చాయ్ ఒక కప్పెడు కావాలంటే రూ.200 పైనే చెల్లించాలి. రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిదట. అందుకే అక్కడ చాలామంది వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిల్లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. -
వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..!
ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్. పోరస్ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్ సైజ్లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది. కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!
మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉన్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి.. ►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు. ►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట. ►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. ►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు. ►ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్బాల్ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్ హూవర్, హ్యారీ ఎస్ ట్రూమాన్, గెరాల్డ్ ఫోర్డ్, రోనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్డబ్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. ►గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెఫ్ట్ హ్యండ్ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు. ►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే. ►left అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం. ►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట. ►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి. ►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే! ►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు. ►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి. ►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే. ►వీరు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు. ►ఆగస్ట్ 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ►వీరు పొడవైన పదాలను స్పీడ్గా టైప్ చేయగలరట. ►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. ►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు జాన్ మెక్ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
గ్రామం కనుమరుగై 200 ఏండ్లు.. అయినా ఆనవాళ్లు ఇప్పటికి పదిలం
సాక్షి, కర్నూలు( కోయిలకుంట్ల): కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని శతాబ్ధాల క్రితం కనుమరుగైన గ్రామాలు ఆనవాళ్ల ఆధారంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుందూనది పరివాహకంలోని బొబ్బిలి గుంతల, కనుమలపాడు, దద్దనాల గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితం కనుమరుగు కాగా అదే సమయంలో పట్టణానికి ఆరు కి.మీ దూరంలో ఉన్న గుండుమల గ్రామం ఖాళీ అయినట్లు పలు ఆనవాళ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. రెండు శతాబ్ధాల క్రితం నుంచి గ్రామం లేకపోయినా ఆ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామాన్ని గుర్తుచేస్తున్నాయి. కాలగమనంలో కలిసిన గుండుమల: కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఎస్సార్బీసీ నుంచి పొలాలకు వెళ్లే రహదారిలో సుమారు ఆరు కి.మీ దూరంలో రెండు వందల సంవత్సరాల క్రితం వరకు గుండుమల గ్రామం ఉండేది. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి సుమారు 300 కుటుంబాలు జీవనం సాగించేవి. సుద్దరాళ్లతో తక్కువ ఎత్తులో నిర్మించుకున్న ఇళ్లు, కొట్టాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం, కులవృత్తుల ఆధారంగా కుటుంబాలను పోషించుకునే వారు అక్కడ నివసించే ప్రజలు. కొర్ర, ఆరుకలను ప్రధాన పంటలుగా, సజ్జ, జొన్న, వేరుశనగ, కంది, పెసర, తదితర పంటలను సాగుచేసేవారు. కుండలు చేయడం, చెప్పులు కుట్టడం, మగ్గంనేయడం, తదితర కులవృత్తులతో ఆయా కులాల్లోని కుటుంబాలు కుల వృత్తులు నిర్వహించేవారు. వీరభద్రస్వామి, శ్రీరాముడు, ఆంజనేయస్వాములను ఆరాధ్య దైవాలుగా కొలిచినట్లు ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గ్రామస్తులు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పండులను అత్యంత వైభవంగా నిర్వహించేవారని బయటపడ్డ ఆధారాల ద్వారా వెల్లడి అవుతోంది. కుందూనది వరదలు, దొంగల బెడదతో గ్రామం ఖాళీ: పట్టణానికి సుదూరంలో ఉండటం, చుట్టుపక్కల కనుచూపుమేర గ్రామాలు లేకపోవడం, పక్కనే కుందూనది ఉండటంతో నదికి తరుచూ సంభవించే వరదలు, దొంగల బెడదతో రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామం ఖాళీ అయింది. గ్రామానికి అతి సమీపంలోనే కుందూనది ప్రవహిస్తుండటం, ఆకాలంలో అధికంగా వర్షాలు కురిసేవి. వర్షాకాలమంతా నది ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తేది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి, పంటనష్టం జరిగి గ్రామస్తులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. వేసవికాలంలో దొంగలు పడి గ్రామంలో పడి డబ్బులు, బంగారు ఆభరణాలు, ధాన్యం, తదితర విలువైన వస్తువులు దోచుకెళ్లేవారు. వరదలు, దొంగల బెడదతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి గ్రామానికి సమీపంలో ఉన్న భీమునిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల ప్రాంతాలకు వలస వెళ్లడంతో క్రమేపి గ్రామం ఖాళీ అయ్యింది. ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వంశస్తులు ఇప్పటికి ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. రెండు శతాబ్ధాలు గడిచినా ఆనవాళ్లు పదిలం: గ్రామం కనుమరుగై రెండు వందల సంవత్సరాలు దాటినా గ్రామానికి సంబంధించిన పలు ఆనవాళ్లు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. ఇళ్లకు సంబంధించి పునాది గోడలు, గ్రామ ప్రజల దాహార్తి తీర్చే కుంట, ప్రజలు ఆరాధ్య దైవాలుగా కొలిచే వీరభద్రస్వామి, రామునిరాతి విగ్రహాలు, వీరభద్రస్వామిని ఊరేగించే రథచక్రాలు, కుంటకు సంబంధించిన మెట్లు గ్రామాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్రామం కనుమరుగు కాగా గ్రామం ఉన్న ప్రాంతం క్రమేపి వ్యవసాయ భూమిగా మార్పు కావడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైతులు శెనగ, జొన్న పంటలు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో గ్రామానికి సంబంధించిన భూములను ఇప్పటికి గుండుమల పొలాలుగా పిలుస్తుండటం విశేషం. చదవండి: అదొక చిన్న గ్రామం.. అయితేనేం ప్రభుత్వ ఉద్యోగుల అడ్డాగా మారింది -
ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో అరంగేట్రంలోనే అద్భుతమైన ద్విశతకాన్ని సాధించి, రాత్రికి రాత్రే హీరోగా మారిపోయిన న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే గత జీవితం ఏమంత సాఫీగా సాగలేదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే.. ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా.. క్రికెట్ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్ బాట పట్టాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్బై చెప్పాడు. అక్కడి నుంచి స్నేహితుల సహకారంతో వెల్లింగ్టన్కు చేరిన కాన్వే.. అక్కడే తన క్రికెట్ కెరీర్ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్గా, బ్యాట్స్మెన్గా డ్యుయల్ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కాన్వే.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన అతను.. అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్ మక్కాలో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన కాన్వే.. 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్తో 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్లో 200 పరుగులు సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..