Josh Hazlewood
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్కు వరుస ఎదురుదెబ్బలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) ముందు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. తొలుత మిచెల్ మార్ష్ (Mitchel Marsh).. తాజాగా ఫాస్ట్ బౌలర్లు కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ఈ మధ్యలో ఆస్ట్రేలియాకు మరో ఊహించని షాక్ కూడా తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా మొత్తం నలుగురు ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఈ నలుగురికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ప్రకటించాల్సి ఉంది. రేసులో కూపర్ కన్నోలీ, బ్యూ వెబ్స్టర్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ ముందువరసలో ఉన్నారు.కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు టెస్ట్లు, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో ఇదివరకే తొలి టెస్ట్ పూర్తి కాగా.. ఇవాళే (ఫిబ్రవరి 6) రెండో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీ విరామం సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (11), దిముత్ కరుణరత్నే (36), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), ధనంజయ డిసిల్వ (0) ఔట్ కాగా.. దినేశ్ చండీమల్ (70), కుసాల్ మెండిస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 3, మిచెల్ స్టార్క్, ట్రవిస్ హెడ్ తలో వికెట్ పడగొట్టారు.తొలి టెస్ట్లో ఆసీస్ భారీ విజయంతొలి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.ఫిబ్రవరి 12 నుంచి వన్డేలు.. ఆతర్వాత నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకే..!ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఆసీస్ జట్టు (ముందుగా ప్రకటించింది)పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ చేపట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.అయితే, ఈ మెగా ఈవెంట్కు ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో పాటు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఐసీసీ టోర్నీకి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్వయంగా ధ్రువీకరించాడు.చారిత్రాత్మక విజయంకాగా టీమిండియాతో స్వదేశంలో ప్రతిష్టాత్మ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు ప్యాట్ కమిన్స్. పదేళ్ల తర్వాత ఈ సిరీస్ గెలిచి తన కెప్టెన్సీ రికార్డులలో ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కమిన్స్... చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అదే విధంగా తన భార్య తమ రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో మాజీ సారథి స్మిత్ లంక టూర్లో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇంకా కోలుకోలేదని హెడ్కోచ్ మెక్డొనాల్డ్ బుధవారం వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం‘కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటి వరకు ఇంకా శిక్షణ కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటి స్థితిలో అతడు నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం. మరోవైపు.. పేసర్ హాజల్వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ లేదంటే ట్రవిస్ హెడ్ ఆస్ట్రేలియా సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన స్మిత్ మెగా టోర్నీలో నాయకుడిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ‘‘ఈ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాఅయితే, జట్టు గురించి పూర్తి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నేను టెస్టు సిరీస్ మీద దృష్టి సారించాను. ఈ సిరీస్ గెలిచిన తర్వాత వన్డేలపైకి దృష్టి మళ్లిస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేయడం నాకు మరింత ఇష్టం.ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న విషయంపై స్పష్టత ఉంది. పరిస్థితులకు తగ్గట్లుగా పావులు కదపడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతా. సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా’’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగుతోంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య లంక జట్టును ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో స్మిత్ అద్భుత శతకం(141)తో మెరిశాడు.ఇక ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. అనంతరం లంక- ఆసీస్ మధ్య రెండు వన్డేలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్(ప్రాథమిక) జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.చదవండి: Rohit Sharma: బుమ్రా గాయంపై అప్డేట్.. వరుణ్ చక్రవర్తి పోటీలో ఉంటాడు! -
గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా? -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్డౌన్ బ్యాటర్గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో టెస్టు సిరీస్తో బిజీగా ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేస్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ గాయం తీవ్రమైంది. ఫలితంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు పూర్తిగా దూరమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.కంగారు జట్టు సొంతగడ్డపై భారత్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టులో భారీ తేడాతో ఓడిపోయిన కమిన్స్ బృందం.. అడిలైడ్ మ్యాచ్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచింది. పింక్ బాల్ టెస్టులో రోహిత్ సేనను ఓడించి సిరీస్ను 1-1తో సమం చేసింది.గతంలోనూ గాయంకాగా తొలి టెస్టు సందర్భంగా పక్కటెముకల నొప్పితో బాధపడ్డ హాజిల్వుడ్కు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్.. అడిలైడ్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. హాజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ను పిలిపించగా అతడు ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, బ్రిస్బేన్లో భారత్తో జరుగుతున్న మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా హాజిల్వుడ్ను వెనక్కి పిలిపించింది.కండరాలు పట్టుకోవడంతోగబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో హాజిల్వుడ్ మళ్లీ గాయపడ్డాడు. భారత్తో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో అతడు మైదానాన్ని వీడాడు. ఈ 33 ఏళ్ల రైటార్మ్ పేసర్ కుడికాలి పిక్క కండరాలు పట్టుకోవడంతో వెంటనే స్కానింగ్కు పంపించారు.ఈ నేపథ్యంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొత్తానికి హాజిల్వుడ్ దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే అతడి స్థానాన్ని భర్తీ చేస్తామని వెల్లడించింది. కాగా బ్రిస్బేన్ టెస్టులో ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన హాజిల్వుడ్.. విరాట్ కోహ్లి(3) రూపంలో కీలక వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), బ్రెండన్ డగెట్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ -
భారత్తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు వార్మప్లో హాజిల్వుడ్ కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు.అయినప్పటికి నాలుగో రోజు ఆడేందుకు తన జట్టుతో కలిసి హాజిల్వుడ్ మైదానంలో అడుగుపెట్టాడు. ఒక్క ఓవర్ కూడా అతడు బౌలింగ్ చేశాడు. కానీ బౌలింగ్ చేసే క్రమంలో జోష్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ ఓవర్ను పూర్తి చేసి హాజిల్వుడ్ మైదానాన్ని వీడాడు.అనంతరం స్కానింగ్ తరలించగా ఎడమవైపు లో గ్రేడ్ గాయమైనట్లు తేలింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ధ్రువీకరించింది. ఈ క్రమంలో మిగిలిన ఆట మొత్తానికి అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా హాజిల్వుడ్ గాయం కారణంగానే దూరమయ్యాడు.ఇప్పుడు మళ్లీ గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంది. అతడికి బ్యాకప్గా స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ఇప్పటికే రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన బోలాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ బ్రిస్బేన్ టెస్టుకు హాజిల్వుడ్ అందుబాటులోకి రావడంతో బోలాండ్ బెంచ్కే పరిమితమయ్యాడు.మళ్లీ హాజిల్వుడ్ గాయం పడడంతో బోలాండ్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ తడబడతుంది. నాలుగో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫాల్ ఆన్ గండం దాటాలంటే భారత్ ఇంకా 79 పరుగులు వెనకబడి ఉంది. -
IND Vs AUS 3rd Test: తీరు మార్చుకోని విరాట్ కోహ్లి..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తమ ఇన్నింగ్స్ ప్రారంభించి పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండానే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాది జోష్ మీద కనిపించిన యశస్వి జైస్వాల్ రెండో బంతికే స్టార్క్ పన్నిన పన్నాగానికి బలయ్యాడు. స్టార్క్ సంధించిన స్లో బాల్ను అంచనా వేయడంలో విఫలమైన యశస్వి షార్ట్ మిడ్వికెట్లో కాపు కాసిన మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఈ బంతిని ఆడాల్సి అవసరం లేదు. వదిలేస్తే సరిపోయేది. కానీ గిల్ వెంటాడి మరీ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ గల్లీలో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ ఒక్క పరుగు వద్దే ముగిసింది. భారత్ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చేసిన తప్పునే మరోసారి చేశాడు. ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ ఫ్లిక్ చేసి ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఇలాంటి బంతులను ఎదుర్కోవడంలో విరాట్ తరుచూ విఫలమవుతున్నాడు. Virat Kohli and the delivery outside off stump 🥲Same story!pic.twitter.com/kuHQXBPLjY— CricTracker (@Cricketracker) December 16, 2024విరాట్ ప్రతిసారి ఒకే తరహాలో ఔట్ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. చేసిన తప్పునే ఎన్ని సార్లు చేస్తావు. నేర్చుకోవా అంటూ చురకలంటిస్తున్నారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతులను డ్రైవ్ చేయాల్సిన అవసరమేముందంటూ తలంటుతున్నారు. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి విరాట్ పెవిలియన్ బాటపట్టాడు.మొత్తానికి మూడో రోజు తొలి సెషన్లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. కేఎల్ రాహుల్కు (13) జతగా రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. విరాట్ ఔట్ కాగానే వర్షం మొదలైంది. అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్నైట్ స్కోర్కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ముగిసిపోయిన తొలిరోజు ఆట
Ind vs Aus 3rd Test Day 1 Updates: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య శనివారం మూడో టెస్టు మొదలైంది. బ్రిస్బేన్లోన గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో తొలిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్కు దిగింది. అయితే, వర్షం కారణంగా 13.2 ఓవర్ల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా వాన పడటంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారుఆటకు వర్షం ఆటంకంబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిరోజు ఆటకు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆసీస్ స్కోరు: 28/0 (13.2). ఖవాజా 19, మెక్స్వీనీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 26-0ఖవాజా 18, మెక్స్వీనీ మూడు పరుగులతో ఆడుతున్నారు.ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరుభారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. ఇక రోహిత్ సేన ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 17, నాథన్ మెక్స్వీనీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాళ్లిద్దరిపై వేటుటాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ను తీసుకున్నట్లు తెలిపాడు. ఒక మార్పుతో ఆసీస్మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం ప్లేయింగ్ ఎలెవన్లో ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న పేసర్ జోష్ హాజిల్వుడ్ తిరిగి రావడంతో.. స్కాట్ బోలాండ్పై వేటు పడింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్వుడ్. -
మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన..
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియ తమ తుది జట్టును ప్రకటించింది. రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.దీంతో స్కాట్ బోలాండ్ మళ్లీ బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇదొక్కటి మినహా మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన స్టార్ ప్లేయర్లు మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టు మెనెజ్మెంట్ మరోసారి అవకాశమిచ్చింది.కాగా అడిలైడ్ టెస్టులో బోలాండ్ 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో అతడిని పక్కన పెట్టక తప్పడం లేదని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు.ఇక శనివారం(డిసెంబర్14) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు సత్తాచాటాలని భావిస్తున్నాయి. భారత జట్టులో కూడా ఒకట్రెండు మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. హర్షిత్ రాణా, అశ్విన్ స్ధానాల్లో ప్రసిద్ద్ కృష్ణ, జడేజా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా తొలి టెస్టులో ఆసీస్ను 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేయగా.. రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమంగా ఉంది.మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీప్) పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్ -
సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: జోష్ హాజిల్వుడ్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టుతో ఆస్ట్రేలియా అభిమానులకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ విలన్గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్తో సిరాజ్ వాగ్వాదమే ఇందుకు కారణం.ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ చూపించిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురిచేసింది. హెడ్ కంటే ముందు మార్నస్ లబుషేన్ పట్ల కూడా ఈ హైదరాబాదీ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ సైతం సిరాజ్పై అగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగానే అడిలైడ్ ప్రేక్షకులు సిరాజ్ను స్లెడ్జ్ చేశారు. సిరాజ్ తీరును సునీల్ గవాస్కర్ వంటి భారత దిగ్గజాలు కూడా తప్పుబట్టారు. ఆఖరికి ఐసీసీ కూడా అతడికి షాక్ ఇచ్చింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ నేపథ్యంలో సిరాజ్ను ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోషల్ హాజిల్వుడ్ ప్రశంసించడం గమనార్హం. అతడు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. కాగా సిరాజ్-హాజిల్వుడ్ ఇద్దరూ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కలిసి ఆడిన సంగతి తెలిసిందే."సిరాజ్ చాలా మంచివాడు. కానీ కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్యవహరిస్తాడు. సిరాజ్తో కలిసి ఆర్సీబీలో గడిపిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. విరాట్ కోహ్లిలా కూడా అతడిది దూకుడైన స్వభావం. చాలా ఉద్వేగభరితమైనవాడు.అతడు మైదానంలో ఉన్నంత సేపు తన స్వభావంతో అభిమానులను అలరిస్తాడు. సిరాజ్ గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అద్భతమైన బౌలింగ్ స్పెల్లు వేశాడు అని హాజిల్వుడ్ పేర్కొన్నాడు. కాగా హాజిల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. -
భారత్తో రెండో టెస్టు.. ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు
టీమిండియాతో రెండో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్కు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. ఇక పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన నాథన్ మెక్స్వీనీని కొనసాగించింది. ఉస్మాన్ ఖవాజాతో పాటు అతడు మరోసారి ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.అయితే, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్గా ఉండటంతో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కగా.. బ్యూ వెబ్స్టర్కు మొండిచేయి ఎదురైంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.పింక్ బాల్తోఇరుజట్ల మధ్య పెర్త్లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత్.. ఆసీస్ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ క్రమంలో.. గెలుపు జోష్లో ఉన్న టీమిండియా అడిలైడ్లో ఆసీస్తో రెండో టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. పింక్ బాల్తో నిర్వహించే ఈ డే అండ్ నైట్ మ్యాచ్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. శుబ్మన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాత్రం జోష్ హాజిల్వుడ్ రూపంలో కీలక పేసర్ సేవలు కోల్పోయింది. తొలి టెస్టు అనంతరం అతడికి పక్కటెముకల నొప్పి తీవ్రం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా అందుబాటులో ఉంటారో లేదోనన్న అనుమానాలు నెలకొనగా.. క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం స్పష్టతనిచ్చింది. 68 పరుగులకే టీమ్ను అవుట్ చేయడంలో కీలక పాత్రభారత్తో పింక్ బాల్ టెస్టులో వీరిద్దరు ఆడతారని పేర్కొంది. కాగా హాజిల్వుడ్ స్థానంలో ఆడబోయే స్కాట్ బోలాండ్ 2021-22 యాషెస్ సిరీస్లో మూడో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించి 6/7తో రాణించి.. 68 పరుగులకే టీమ్ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు ఈ రైటార్మ్ పేసర్ 10 టెస్టులాడి 35 వికెట్లు కూల్చాడు.వారికి సెకండ్ ఛాన్స్ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో 35 ఏళ్ల బోలాండ్ భాగమయ్యాడు. మరోవైపు.. టీమిండియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ నాథన్ మెక్స్వీనీ(10, 0)కి ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. లబుషేన్(2, 3)ను కూడా కొనసాగించింది. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.టీమిండియాతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టుఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
ఆసీస్ జట్టులో విభేదాలు?.. పింక్ బాల్ టెస్టు మాకూ సవాలేనన్న బ్యాటర్!
టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.పెర్త్లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు. విభేదాలనే మాటకు తావు లేదు‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. బుమ్రా సూపర్.. ‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్కు తనదైన శైలి ఉంటుంది. వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందినాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు. తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: ‘గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్కు కవర్గా బ్యూ వెబ్స్టర్ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్తో రిలేషన్!.. బ్యాక్గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ పింక్బాల్ టెస్టులో గెలిచి తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తిరిగి కమ్బ్యాక్ ఇవ్వాలని తమ ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆసీస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హేజిల్వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది.పెర్త్లో అదుర్స్..కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హాజిల్ వుడ్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో మొత్తంగా 5 వికెట్లు హాజిల్ వుడ్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కావడంలో వుడ్ది కీలక పాత్ర.అబాట్, డాగెట్లకు పిలుపు..కాగా హాజిల్వుడ్ రీప్లేస్మెంట్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్లకు జట్టులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ జట్టులోకి వచ్చినప్పటకి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం స్కాట్ బోలాండ్కే చోటు దక్కే అవకాశముంది. కాగా మొదటి టెస్టులో అతడు బెంచకే పరిమితమయ్యాడు.చదవండి: SA vs SL 1st Test: స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా -
Ind vs Aus: నిద్రపోయిన దిగ్గజానికి మేలుకొలుపు: ఆసీస్ స్టార్ పేసర్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. క్రికెట్ దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే తదితరులు న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తట్టుకోలేక.. టీమిండియా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.తొలిసారి -0-3తో వైట్వాష్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్లో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. స్వదేశంలో కివీస్తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడి.. వైట్వాష్కు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఈ చెత్త ఘనత సాధించిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది.ఫలితంగా ఘోర అవమానం మూటగట్టుకోవడంతో పాటు.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలనూ సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టులు కచ్చితంగా గెలవాల్సిన స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో గావస్కర్ వంటి విశ్లేషకులు ఇక మనం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు వదిలేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపుఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్ హాజిల్వుడ్ స్పందించిన తీరు మాత్రం వైరల్గా మారింది. ‘‘నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపు. అయితే, వారు దీని నుంచి ఎలా బయటపడతారో చూద్దాం’’ అని హాజిల్వుడ్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా 3-0తో గెలవడం కంటే.. 0-3తో ఓడిపోవడమే వారికి మంచిదని అతడు అభిప్రాయపడ్డాడు.కివీస్తో సిరీస్లో చాలా మంది బ్యాటర్లు విఫలమయ్యారని.. అయితే ఒకరిద్దరు మాత్రం అద్భుతంగా ఆడారని కొనియాడాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాతో పోటీ ఎలా ఉండబోతుందో అంచనా వేయలేమని.. ఏదేమైనా ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని హాజిల్వుడ్ ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియా మరింత స్ట్రాంగ్గా ఇక ఇండియాలో ఒక్క టెస్టు గెలవడమే కష్టమని.. అలాంటిది క్లీన్స్వీప్తో కివీస్ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని హాజిల్వుడ్ కొనియాడాడు. అయితే, భారత జట్టును తక్కువ అంచనా వేయబోమని.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా మరింత స్ట్రాంగ్గా తిరిగివస్తుందని పేర్కొన్నాడు. కాగా నవంబరులో రోహిత్ సేన ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: 'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే' -
Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే..
టెస్టు కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటికే భారత్ తరఫున సంప్రదాయ క్రికెట్లో 522 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన తొలి టెస్టులో అశూ అదరగొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్సొంతమైదానం చెన్నైలోని చెపాక్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విలువైన శతకం(113) బాదడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా బంగ్లాపై టీమిండియా 280 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు(సెప్టెంబరు 27) కాన్పూర్లో మొదలుకానుంది.నాలుగు వికెట్లు తీస్తే..ఈ నేపథ్యంలో అశ్విన్ ఓ అరుదై రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాతో రెండో టెస్టులో గనుక ఈ దిగ్గజ స్పిన్నర్ నాలుగు వికెట్లు తీస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సాధిస్తాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ను అధిగమించి మొదటిస్థానానికి చేరుకుంటాడు. ఈ డబ్ట్యూటీసీ తాజా సీజన్లో హాజిల్వుడ్ ఇప్పటి వరకు 51 వికెట్లు తీయగా.. అశూ 48 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 51రవిచంద్రన్ అశ్విన్ఇండియా)-48ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 48మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-48క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-43నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-43.చదవండి: అతడిని కట్టడి చేస్తే టీమిండియాపై గెలుపు మాదే: కమిన్స్ -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెప్టెంబర్లో యూకే టూర్కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్తో మూడు టీ20లు.. ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్లో ఆసీస్ తలపడనుంది. అయితే ఈ టూర్కు ముందు కంగారులకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ కాలి పిక్క కండరాల గాయం కారణంగా స్కాట్లాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో హాజిల్వుడ్కు గాయమైనట్లు తెలుస్తోంది. అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్కు కూడా హాజిల్వుడ్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్వదేశంలో భారత్తో జరగనున్న టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని హాజిల్వుడ్కు మరింత విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హాజిల్వుడ్ స్ధానాన్ని రీలే మెరిడిత్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. అతడు చివరగా 2021లో ఆసీస్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో మెరిడిత్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు.కాగా ఈ యూకే టూర్కు ఇప్పటికే యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా దూరమయ్యాడు. ఇక ఇక సెప్టెంబర్ 4న స్కాట్లాండ్తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, మెరిడిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా -
WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సూపర్-8కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆ జట్టు పేసర్ మార్క్వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చిరకాల ప్రత్యర్థిగా భావించే ఆస్ట్రేలియా జట్టు తమ తదుపరి మ్యాచ్లో స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించాలని కోరుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్లో తమ మద్దతు పూర్తిగా ఆస్ట్రేలియాకే ఉంటుందని పేర్కొన్నాడు.కాగా స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దవడం, ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ముందుకెళ్లే ఆశలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. అయితే ఒకే ఒక్క విజయం... 3.1 ఓవర్లలో ముగించేయడం... 101 బంతులు మిగల్చడం... ఇంగ్లండ్ను ఒక్కసారిగా ఈ టి20 ప్రపంచకప్ రేసులోకి తీసుకొచ్చింది.అంటిగ్వా వేదికగా... శుక్రవారం జరిగిన పోరులో బట్లర్ బృందం 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. షోయబ్ ఖాన్ (23 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ టాప్స్కోరర్గా నిలిచాడు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆదిల్ రషీద్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ 12 పరుగుల చొప్పున ఇచ్చి చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 3.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సాల్ట్ (3 బంతుల్లో 12; 2 సిక్స్లు) దంచేశారు.ఈ నేపథ్యంలో సూపర్-8 రేసులోకి దూసుకువచ్చిన ఇంగ్లండ్.. శనివారం రాత్రి నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కచ్చితంగా గెలవాలి. భారీ తేడాతో విజయం సాధిస్తే ఇంకా మంచిది.అదే విధంగా జూన్ 16 నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈ రెండూ జరిగి.. నెట్ రన్రేటు పరంగా స్కాట్లాండ్ కంటే ఇంగ్లండ్ మెరుగ్గా ఉంటేనే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్- నమీబియా, ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మ్యాచ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్.. ఇంగ్లండ్ను టోర్నీ నుంచి పంపడమే తమ లక్ష్యమని పేర్కొనడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.హాజిల్వుడ్ వ్యాఖ్యలను బట్టి స్కాట్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోవడానికి సిద్ధపడిందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. హాజిల్వుడ్ సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో మార్క్వుడ్ స్పందిస్తూ.. హాజిల్వుడ్ చేసిన వ్యాఖ్యలు తమ జట్టు గౌరవాన్ని పెంచుతున్నాయంటూ కౌంటర్ వేశాడు. ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టు ఎలిమినేట్ అయితే బాగుంటుందని ప్రతి జట్టు కోరుకుంటుందని.. ఏదేమైనా స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టగా.. శనివారం నాటి మ్యాచ్ ఫలితంతో ఇంగ్లండ్ భవితవ్యం తేలనుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్కాట్లాండ్ 5 పాయింట్లు(నెట్ రన్రేటు +2.164), ఇంగ్లండ్ మూడు పాయింట్ల(నెట్ రన్రేటు +3.081)తో ఉన్నాయి. -
హాజిల్వుడ్ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ కోచ్ కౌంటర్
తమ జట్టు గురించి ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హాజిల్వుడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు. జోష్ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తమ దృష్టి ప్రస్తుతం మిగిలిన రెండు మ్యాచ్లపైనే ఉందని తెలిపాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్లతో పాటు ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. వీటిలో వరుసగా మూడు విజయాలు సాధించిన ఆసీస్.. గ్రూప్ టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు రెండింట భారీ తేడాతో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్లలో తాము గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని దుస్థితిలో ఉంది డిఫెండింగ్ చాంపియన్.ఇక మూడింట రెండు విజయాలతో ఉన్న స్కాట్లాండ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. తమకు ఆస్ట్రేలియాతో మిగిలిన మ్యాచ్లో గనుక గెలిస్తే నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఆసీస్ మ్యాచ్ అంటే అంత తేలికాదన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నమీబియాపై గెలుపుతో సూపర్-8 చేరిన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ను టోర్నీ నుంచి బయటకు పంపాలని తాము భావిస్తున్నట్లు తెలిపాడు.ఈ క్రమంలో కావాలనే స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంగ్లండ్ సూపర్-8 ఆశలపై నీళ్లు చల్లాలని ఆసీస్ కుట్ర పన్నిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్.. జోష్ హాజిల్వుడ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అతడు కేవలం సరదాగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశాడని.. జోష్ నిజాయితీ గురించి తనకు తెలుసునని పేర్కొన్నాడు. ఒమన్, నమీబియా జట్లపై విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాథ్యూ మాట్ పేర్కొన్నాడు.నమీబియాను చిత్తు చేసిగ్రూప్-బిలో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 34 బంతుల్లోనే ఛేదించింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... పేసర్లు హాజల్వుడ్, స్టొయినిస్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కమిన్స్, ఎలిస్లకు ఒక్కో వికెట్ దక్కింది.నమీబియా జట్టులో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (43 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), మైకేల్ వాన్ లింగెన్ (10 బంతుల్లో 10; 2 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు రెండంకెల స్కోరు దాటలేకపోయారు.అనంతరం ఆస్ట్రేలియా జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా... ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మార్ష్ (9 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. జూన్ 16న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో స్కాట్లాండ్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
నమీబియాను చిత్తు చేసిన ఆసీస్.. సూపర్-8కు అర్హత
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఒమన్ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్లో ఇంగ్లండ్ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.వెస్టిండీస్లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.జోష్ హాజిల్వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్వుడ్, వార్నర్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్వుడ్తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గ్రీన్.. తన విరోచిత పోరాటంతో జట్టుకు 383 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కాగా ఈ మ్యాచ్లో టెయిలాండర్ జోష్ హాజిల్వుడ్తో కలిసి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పదో వికెట్కు హాజిల్వుడ్తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో ఆసీస్కు న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు జాసన్ గిల్లెస్పీ , గ్లెన్ మెక్గ్రాత్ పేరిట ఉండేది. 2004 లో కివీస్తో జరిగిన ఓ టెస్టులో 10 వికెట్కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజాగా మ్యాచ్తో ఆల్టైమ్ రికార్డును గ్రీన్-హాజిల్వుడ్ జోడీ బ్రేక్ చేసింది. ఇక 279/9 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ అదనంగా మరో 104 పరుగులు చేసింది.ఓవరాల్గా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 275 బంతులు ఎదుర్కొన్న గ్రీన్.. 23 ఫోర్లు, 5 సిక్స్లతో 174 పరుగులు చేశాడు. హాజిల్ వుడ్ 62 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టగా.. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు. ఆ తర్వాత కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్వుడ్: జనవరి నెలలో విండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో హాజిల్వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్లో అతను రెండు మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
AUS Vs WI: హాజిల్వుడ్ విజృంభణ.. విండీస్ను చిత్తు చేసిన ఆసీస్
టెస్ట్ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్లో జరిగిన టెస్ట్ల్లో (తొలి) విండీస్ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్ను దెబ్బతీశాడు. 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను హాజిల్వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ సిరీస్లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్వుడ్.. ఓపెనర్గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్వైట్ (13), తేజ్నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్కు 55 పరుగులు జోడించాడు. -
ఆసీస్తో మూడో టెస్టు.. 68 పరుగులకే 7 వికెట్లు! పీకల్లోతు కష్టాల్లో పాక్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్.. పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు. హాజిల్వుడ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి పాక్ను కోలుకోలేని దెబ్బతీశాడు 14 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పాకిస్తాన్.. కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(6), అమీర్ జమాల్(0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్, లయోన్, స్టార్క్ తలా వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్ ఉంది. అంతకుముందు 116/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లబుషేన్తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Aus Vs Pak: జారిపడ్డ పాక్ ఫీల్డర్!.. 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు? వీడియో -
ఆస్ట్రేలియాకు మాత్రమే సాధ్యం! 2015 కంటే ఈ విజయమే గొప్పది!
CWC 2023 Winner Australia: ‘2015 కంటే ఈ విజయమే గొప్పది, ఎందుకంటే ఇది భారత గడ్డపై వచ్చింది’... హాజల్వుడ్ వ్యాఖ్య ఇది. ఇదే ఈ విజయం విలువేమిటో చెబుతోంది. టోర్నీ ఆరంభంలో 2 మ్యాచ్లలో ఓడిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా అట్టడుగున ఉంది. ఫలితం మాత్రమే కాదు ప్రదర్శన కూడా చెత్తగా ఉంది. రెండు మ్యాచ్లలో జట్టు 199, 177 పరుగులే చేయగలిగింది. దాంతో అందరూ ఆసీస్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ తర్వాతి మ్యాచ్ నుంచి మొదలు పెడితే సెమీస్ వరకు వరుసగా ఎనిమిదో విజయాలతో ఆ జట్టు దూసుకుపోయింది. న్యూజిలాండ్తో, సెమీస్లో దక్షిణాఫ్రికాతో అతి కష్టమ్మీద గెలవడంతో ఫైనల్ కూడా భారతే ఫేవరెట్గా కనిపించింది. కానీ పట్టుదల, చివరి వరకు ఓటమిని అంగీకరించని తర్వాత ఉన్న కంగారూ బృందం ఎప్పటిలాగే ఐసీసీ టోర్నీలో అసలు సమరంలో సత్తా చాటింది. ప్రధాన పోటీల్లో ఒత్తిడికి తలవంచని తమ బలాన్ని మళ్లీ చూపించింది. ప్రపంచ కప్కు ముందు హెడ్ చేతికి గాయమైంది. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉన్నా ఆసీస్ ఆ పని చేయక 14 మందితోనే జట్టును కొనసాగించింది. ఇప్పుడు అతను సెమీస్, ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. టోర్నీకి ప్రకటించిన టీమ్లో లబుషేన్కు చోటు దక్కలేదు. స్పిన్నర్ అగర్ గాయపడగా... అతని స్థానంలో మరో స్పిన్నర్ను ఎంచుకోకుండా లబుషేన్ను తీసుకుంది. జట్టు కుప్పకూలిపోకుండా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు సరైన వాడని ఆసీస్ భావించింది. ఫైనల్లో అతను అదే చేసి చూపించాడు. వార్నర్, మ్యాక్స్వెల్ ఐపీఎల్ అనుభవం ఇక్కడా బాగా పని చేయగా, మార్ష్ కూడా రెండు కీలక శతకాలు బాదాడు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్పై 91/7తో ఓటమికి చేరువైన దశలో మ్యాక్స్వెల్ చేసిన డబుల్ సెంచరీ నభూతో నభవిష్యత్. స్టార్క్, హాజల్వుడ్ చెరో 16 వికెట్లతో జట్టుకు చుక్కానిలా నిలవగా, లెగ్స్పిన్నర్ జంపా 23 వికెట్లతో సత్తా చాటాడు. అన్నింటికి మించి పేసర్గా, కెప్టెన్ కమిన్స్ ముద్ర ప్రత్యేకం. బౌలింగ్లో 15 వికెట్లు పడగొట్టడంతో పాటు వ్యూహాలపరంగా అతను చూపించిన సాహసం, తెగువ కమిన్స్ను ప్రత్యేకంగా నిలిపాయి. ఫైనల్లో తన 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా భారత్ను కట్టి పడేయగలిగాడు. 2023లో డబ్ల్యూటీసీ, యాషెస్, వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన కమిన్స్... ఈ మూడింటిలోనూ అద్భుత విజయాలతో ఆసీస్ గొప్ప నాయకుల్లో ఒకడిగా తన స్థానాన్ని లిఖించుకున్నాడు. –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్కప్కు ముందు మొహమ్మద్ సిరాజ్కు భంగపాటు
భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్కప్ 2023కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్కు భంగపాటు ఎదురైంది. కొద్ది రోజుల కిందట ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో ధారాళంగా పరుగులు (9 ఓవర్లలో 68 పరుగులు) సమర్పించుకున్నందుకు గాను సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 11 పాయింట్లు (680 నుంచి 669) కోల్పోయాడు. తద్వారా అతను ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో అగ్రస్థానాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. భారత్తో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన హాజిల్వుడ్ అప్పటివరకు తన ఖాతాలో ఉన్న 669 పాయింట్లను నిలబెట్టుకుని సిరాజ్తో పాటు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్కప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్లో వీరిరువురిలో టాప్ ర్యాంకర్ ఎవరో తేలిపోతుంది. తాజాగా ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాలు నిలబెట్టుకోగా.. పాక్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిది 2 స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉండిన మిచెల్ స్టార్క్ 2 స్థానాలు కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. 11వ ర్యాంక్లో ఉండిన మొహమ్మద్ నబీ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకగా.. 10వ ప్లేస్లో ఉండిన కుల్దీప్ యాదవ్ 11వ స్థానానికి పడిపోయాడు. ఈ మార్పులు మినహాయించి టాప్-10 వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు జరగలేదు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్తో సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐర్లాండ్ హ్యారీ టెక్టార్తో సమానంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. 5వ స్థానంలో ఉండిన ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఆరుకు పడిపోగా.. గత వారం ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉండిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. 10వ స్థానంలో ఉండిన ఫకర్ జమాన్ 11వ ప్లేస్కు పడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, శుభ్మన్ గిల్, డస్సెన్లు టాప్-3 ర్యాంకింగ్స్లో కొనసాగుతుండగా.. విరాట్ 9వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్-10 స్థానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. షకీబ్, నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతున్నారు. -
Ashes Series: నాలుగో టెస్ట్కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ -
Ashes 4th Test: వార్నర్కు కెప్టెన్ మద్దతు.. ఆసీస్ జట్టులో ఓ మార్పు
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. అయితే తుది జట్టును ప్రకటించే విషయంలో ఆసీస్ మేనేజ్మెంట్ మాత్రం వేచి చూచే ధోరణిని ప్రదర్శిస్తుంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ కేవలం లీకులు ఇచ్చాడు. తుది జట్టును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తొలి 3 టెస్ట్ల్లో విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కమిన్స్ అండగా నిలిచాడు. వార్నర్ కీలకమైన నాలుగో టెస్ట్లో ఆడతాడని చెప్పకనే చెప్పాడు. వార్నర్ గతంలో చాలా సందర్భాల్లో కీలక సమయాల్లో ఫామ్ను అందుకని తమను గెలిపించాడని ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్లో ప్రస్తావించాడు. దీన్ని బట్టి చూస్తే నాలుగో టెస్ట్ కోసం వార్నర్కు లైన్ క్లియర్ అయ్యిందన్న విషయం అర్ధమవుతుంది. తుది జట్టులో ఓ మార్పు విషయంపై కూడా కమిన్స్ నోరు విప్పాడు. మూడో టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని అనుభవజ్ఞుడైన హాజిల్వుడ్ భర్తీ చేస్తాడని తెలిపాడు. తుది జట్టులో మరేమైనా మార్పులుంటాయన్న ప్రశ్నకు కమిన్స్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తుది జట్టు ప్రకటనపై తొందరేం లేదని, మ్యాచ్కు కొద్ది గంటల ముందు ఆ ప్రకటన ఉంటుందని కాన్ఫరెన్స్ను కంక్లూడ్ చేశాడు. మరి కమిన్స్ చెప్పినట్లుగా వార్నర్ కొనసాగుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. మరో పక్క ఇంగ్లండ్ మాత్రం తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్డౌన్లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉంటారని తెలిపింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ యాషెస్ సిరీస్లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించిన ఆసీస్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ ప్రారంభానికి ముందు, ఈ మ్యాచ్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించారు. ఏఐ నుంచి ఆసీస్కు అనుకూలమైన సమాధానం వచ్చింది. ఆసీస్ గెలుపు ఖాయమని ఏఐ కుండ బద్దలుకొట్టి చెప్పింది. అయితే ఏఐ సమాధానాన్ని వర్ణించిన తీరు మాత్రం తికమకపెట్టేదిగా ఉంది. ఏఐ చెప్పిన సమాధానాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్ ఇన్స్టా ఖాతా ద్వారా వివరించారు. ఏఐ సమాధానం కమిన్స్ మాటల్లో.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా నరాలు తెగే ఉత్కంఠ పోరులో తలపడ్డాయి. సవాళ్లతో కూడిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్ అసాధారణ వ్యూహాన్ని అమలు చేసింది. వారి బ్యాటింగ్ ఆర్డర్ తారుమారైంది. ఏఐ సమాధానం హాజిల్వుడ్ మాటల్లో.. ఆసీస్ ఓపెనింగ్ జోడీ హాజిల్వుడ్, నాథన్ లయోన్ గార్డ్ తీసుకున్నారు. హాజిల్వుడ్.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి సొగసైన బౌండరీలు బాది సాహసోపేతమైన ఛేజింగ్కు నాంది పలికాడు. ఆసీస్ సాంప్రదాయేతర విధానానికి అమలు చేయడంతో టీమిండియా విస్మయానికి గురై లయ కోల్పోయింది. ఏఐ సమాధానం కమిన్స్ మాటల్లో.. కమిన్స్ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. అతని నిర్భయ ఉద్దేశం ఆసీస్ శిబిరంలో నమ్మకాన్ని తీసుకువచ్చింది. కమిన్స్ ఆడిన ప్రతి షాట్ ఆసీస్ను విజయానికి చేరువ చేసింది. ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో లయోన్ సిక్సర్ బాది ఆసీస్ను గెలిపించాడు. అసాధారణ వ్యూహాన్ని అమలు చేసి ఆసీస్ టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. కాగా, ఏఐ తలా తోక లేని సమాధాన్ని పక్కన పెడితే.. తొలి రోజు మాత్రం ఆసీస్దే పైచేయగా ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. చదవండి: WTC Final: అంచనా తప్పింది.. అశ్విన్ను పక్కకు పెట్టి మూల్యం చెల్లించుకుంది..! -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టార్ బౌలర్ ఔట్
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా హాజిల్వుడ్ గాయం తిరగబెట్టిందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అతని స్థానంలో 33 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ మైఖేల్ నెసర్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం నెసర్ ఇంగ్లండ్లోనే ఉన్నాడని, కౌంటీ ఛాంపియన్షిప్లో అతను గ్లామోర్గన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపింది. కౌంటీ ఛాంపియన్షిప్లో నెసర్ సూపర్ ఫామ్లో ఉన్నాడని, ఈ టోర్నీలో అతను 25.63 సగటున 19 వికెట్లు పడగొట్టాడని, దీన్ని పరిగణలోకి తీసుకునే అతన్ని ఎంపిక చేశామని సీఏ ప్రకటించింది. కాగా, హాజిల్వుడ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సందర్భంగా కూడా ఇలాగే గాయపడి లీగ్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదివరకే ఐసీసీ టీ20, వన్డే టోర్నమెంట్లు (వరల్డ్కప్లు) గెలిచిన భారత్, ఆసీస్ జట్లు.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 గెలిచి, మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్ టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్!
టీమిండియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్న్యూస్ అందింది. ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. హాజిల్వుడ్ కాలి మడమ గాయంతో గత కొంతకాలంగా భాదపడతున్నాడు. ఈ క్రమంలో పూర్తిఫిట్నెస్ సాధించకపోయనప్పటికీ ఐపీఎల్-2023లో ఆర్సీబీ తరపున ఆడేందుకు భారత్కు వచ్చాడు. అయితే కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన హాజిల్వుడ్ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్-2023 మధ్యలోనే తన స్వదేశానికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అతడు డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి.. నెట్స్లో తీవ్రంగా చమటోడ్చుతున్నాడు. ఇక తన ఫిట్నెస్పై హాజిల్వుడ్ తాజాగా స్పందించాడు. "నేను ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం వరకు ప్రతీ సెషన్లో ప్రాక్టీస్ చేయడమే నా పని. టెస్టు క్రికెట్కు టీ20 క్రికెట్ పూర్తి భిన్నం. టీ20ల్లో మన బౌలింగ్లో చాలా వేరియషన్స్ చూపించాలి. వైడ్ యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ బాల్స్ వేయడానికి చాలా కష్టపడాలి. ఈ క్రమంలో బౌలర్లకు తమ గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని" ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాజిల్వుడ్ పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? -
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్ మార్ష్, మ్యాట్ రెన్షా మాత్రం తాజాగా టీమ్లో చోటు కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ హాజిల్వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ జట్టులో కొనసాగనున్నారు. వారిద్దరు అవుట్.. వార్నర్కు కోచ్ మద్దతు మార్ష్, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు, యాషెస్ సిరీస్లోనూ వార్నర్ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్డొనాల్డ్ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Get your friends, form a circle and replicate this fun drill! 😉😀😀🏏#TeamIndia pic.twitter.com/X6iOuXPrhY — BCCI (@BCCI) May 26, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021-23కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మే 22) అధికారికంగా ప్రకటించింది. హాజిల్వుడ్.. ఈ మ్యాచ్తోపాటు ఆ తర్వాత జరిగే యాషెస్ సిరీస్కు సైతం సిద్ధంగా ఉంటాడని పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానాంలో జరుగనుండగా.. 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ జూన్ 16 నుంచి జులై 31 వరకు జరుగనుంది. కాగా, ఈ సీజన్లో 3 మ్యాచ్ల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన హాజిల్వుడ్.. కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతను పూర్తి ఫిట్గా ఉండివుంటే ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండేది. ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఆ జట్టు ఆఖరి మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు.. ఈ సీజన్లో ఇదొక్కటే ఆర్సీబీ నిష్క్రమణకు కారణం కాదు. కోహ్లి, డుప్లెసిస్, అప్పుడప్పుడు సిరాజ్ మినహా ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమైంది. దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు ఆర్సీబీ పరాజయాలకు మూల కారకులని చెప్పవచ్చు. ఏదిఏమైనా ఈ ఏడాది కూడా ఆర్సీబీ కప్ లేకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన గ్రూప్ స్టేజీ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీని గుజరాత్ ఓడించడంతో ముంబై ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..! -
పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్లో గెలిచిందనే కాని, ఓవరాల్గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్లలో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్స్టోన్ తుది జట్టులోకి రావచ్చు. తుది జట్లు (అంచనా).. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్కుమార్ వైశాఖ్, సిరాజ్ -
ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..!
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్లో సత్తా చాటిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్, ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీ బౌలర్ అయిన జోష్ హాజిల్వుడ్ మడమ సమస్య కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదముండగా.. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ సైతం మడమ గాయం కారణంగానే సీజన్ ఆరంభ మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇటీవలే భారత్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ల్లో కూడా పాల్గొనని హాజిల్వుడ్.. గాయం నుంచి వేగంగా కోలుకుని కనీసం సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్లకైనా అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. ఒకవేళ హాజిల్వుడ్ సీజన్ మొత్తానికే దూరమైతే, ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. 2022 మెగా వేలంలో హాజిల్వుడ్ను ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు, గత సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సెంచరీ బాదిన ఆర్సీబీ హీరో రజత్ పాటిదార్.. గాయం కారణంగా ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్లో చికిత్స పొందుతున్నాడు. 2023 ఆర్సీబీ ట్రయినింగ్ క్యాంప్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు గాయం బారిన పడ్డ పాటిదార్.. సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్సీఏ అధికారులు అతన్ని తదుపరి మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఎంఆర్ఐ స్కాన్ అనంతరం పాటిదార్ పరిస్థితిని మరోసారి సమీక్షించి, అతను ఐపీఎల్-2023 సెకెండ్ లెగ్లో పాల్గొనేది లేనిది తేలుస్తామని ఎన్సీఏ అధికారులు తెలిపారు. హాజిల్వుడ్, పాటిదార్లతో పాటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. మ్యాక్సీ కూడా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇదే నిజమైతే, త్వరలో ప్రారంభమయ్యే సీజన్లోనూ ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో ఆర్సీబీ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది. -
నెం1 ర్యాంక్ను కోల్పోయిన సిరాజ్.. టాప్ ర్యాంక్ ఎవరిదంటే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో తన నెం1 ర్యాంక్ను కోల్పోయాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్లో.. సిరాజ్ను అధిగమించి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ నెం1 స్థానానికి చేరుకున్నాడు. కాగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కేవలం 3 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్కు పడిపోయాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో హాజిల్వుడ్ 713 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(708 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్(702) పాయింట్లతో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్తో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. కాగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్ అద్భుతంగా రాణిస్తే.. మళ్లీ టాప్ ర్యాంక్కు చేరుకునే అవకాశం ఉంది. చదవండి: ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్ -
BGT 2023 IND VS AUS: ఆసీస్కు బిగ్ షాక్.. మరో వికెట్ డౌన్
అనుకున్నదే జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 ఆడేందుకు భారత్లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టులో (రెండో టెస్ట్ తర్వాత) మరో వికెట్ పడింది. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కాలి చీలిమండ గాయం కారణంగా సిరీస్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా హాజిల్వుడ్ బాటలోనే ఇంటిదారి పట్టాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ (తొలి రోజు) సందర్భంగా మహ్మద్ సిరాజ్ సంధించిన ఓ బంతి వార్నర్ మోచేతిని బలంగా తాకడంతో అతని ఎడమ మోచేయి ఫ్రాక్చర్కు గురైనట్లు ఆసీస్ మేనేజ్మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 21) ప్రకటించింది. ఈ కారణంగా వార్నర్.. భారత్తో జరిగే మూడు, నాలుగు టెస్ట్లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది. వార్నర్ స్కాన్ రిపోర్ట్స్లో వెంట్రుకవాసి అంత ఫ్రాక్చర్ను గుర్తించినట్లు వివరించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని హాజిల్వుడ్తో పాటు వార్నర్ కూడా సిడ్నీకి బయల్దేరతాడని పేర్కొంది. భారత్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు (మార్చి 17 నాటికి) వార్నర్ జట్టుతో తిరిగి చేరతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా గాయపడిన వార్నర్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అతని స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా మ్యాట్ రెన్షా బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్లో ఆడిన 3 ఇన్నింగ్స్ల్లో (1, 10, 15) దారుణంగా విఫలమైన 36 ఏళ్ల వార్నర్ జట్టుకు భారంగా మారాడు. ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇదివరకే స్వదేశానికి పయనమయ్యాడు. అతను తిరిగి వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు మూడో టెస్ట్కు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ల సన్నద్దతపై కూడా సందిగ్ధత నెలకొంది. హాజిల్వుడ్, వార్నర్లకు రీప్లేస్మెంట్గా ఎవరినైనా భారత్కు పిలిపించుకుంటారా లేదా అన్న అంశంపై కూడా ఆసీస్ మేనేజ్మెంట్ నోరు మెదపడం లేదు. ఇప్పటికే తొలి రెండు టెస్ట్ల్లో ఓటమిపాలై ఢీలా పడిపోయిన ఆసీస్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తదుపరి సిరీస్లో ఎలా రాణిస్తుందో చూడాలి. -
BGT 2023: హాజిల్వుడ్ బాటలో వార్నర్.. వార్నర్ స్థానంలో మ్యాక్స్వెల్..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును గాయాల బెడద వేధిస్తూ ఉంది. కాలి మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ ఇప్పటికే సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. తాజాగా మరో ఆసీస్ వికెట్ పడినట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్ సందర్భంగా మోచేతి గాయం బారిన పడిన డేవిడ్ వార్నర్.. తదుపరి జరిగే మూడు, నాలుగు టెస్ట్లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. వార్నర్కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని, అతని ఎల్బో ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది. ఇదే జరిగి ఉంటే వార్నర్ తదుపరి సిరీస్కు అందుబాటులో ఉండటం దాదాపుగా అసాధ్యం. ఈ విషయంపై ఆసీస్ మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. వార్నర్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ జట్టులో చేరతాడనే ప్రచారం జరుగుతుంది. మూడో టెస్ట్ ప్రారంభానికి మరో 9 రోజుల సమయం ఉన్నందున, ఈ లోపు మ్యాక్సీ జట్టుతో చేరతాడని వార్తాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాలి ఫ్రాక్చర్ నుంచి పూర్తిగా కోలుకున్న మ్యాక్సీ.. ఫిట్నెస్ టెస్ట్లో కూడా పాసయ్యాడని, టీమిండియాతో జరిగే వన్డే సిరీస్కు అతన్ని ఎంపిక చేయాలని ఆసీస్ మేనేజ్మెంట్ భావిస్తుందని, ఈ మధ్యలో వార్నర్ గాయపడటంతో మ్యాక్సీ కాస్త ముందుగానే భారత్లో అడుగుపెడతాడని సమాచారం. మరోవైపు వ్యక్తిగత కారణాల చేత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నపళంగా స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. మూడో టెస్ట్ ప్రారంభమయ్యే లోపు కమిన్స్ తిరిగి జట్టులో చేరతాడని ఆసీస్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో కూడా గ్యారెంటీ లేదని తెలుస్తోంది. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని సమాచారం. ఇంకోవైపు మూడో టెస్ట్కు మిచెల్ స్టార్క్, కెమరూన్ గ్రీన్ల సన్నద్ధతపై కూడా ఆసీస్ మేనేజ్మెంట్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. వీరి ఫిట్నెస్ పరిస్థితి ఎలా ఉందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసీస్ మున్ముందు ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. -
BGT 2023: మూడో టెస్ట్కు ముందు ఆసీస్కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 ఆడేందుకు భారత్లో పర్యటిస్తున్న ఆసీస్.. ఇప్పటికే తొలి రెండు టెస్ట్ల్లో ఓటమిపాలై, సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆ జట్టును గాయాల బెడద తారా స్థాయిలో వేధిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్లకు స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ దూరం కాగా.. తాజాగా అందిన సమాచారం మేరకు హేజిల్వుడ్ సిరీస్ మొత్తానికే దూరం కానున్నట్లు తెలుస్తోంది. మడమ గాయంతో బాధపడుతున్న 32 ఏళ్ల హేజిల్వుడ్.. ఇండోర్, అహ్మదాబాద్లలో జరిగే మూడు, నాలుగు టెస్ట్లకు అందుబాటులో ఉండడని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కన్ఫర్మ్ చేశాడు. హేజిల్వుడ్ తన రిహాబిలిటేషన్ను సిడ్నీలో కొనసాగిస్తాడని వెల్లడించాడు. మరోవైపు రెండో టెస్ట్ సందర్భంగా గాయపడ్డ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై మాట్లాడేందుకు మెక్ డొనాల్డ్ ఆసక్తి కనబర్చలేదు. వార్నర్ విషయంలో తొందరపడి ఎలాంటి ప్రకటన చేయకూడదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వార్నర్ అందుబాటులో ఉండే విషయం లేని విషయం మూడో టెస్ట్ ప్రారంభం ముందు వరకు బహిర్గతం చేయకూడదని టీమ్ డిస్కషన్లో చర్చించినట్లు సమాచారం. కాగా, న్యూఢిల్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా వార్నర్ మోచేతికి తీవ్ర గాయం కాగా.. అతని స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా మ్యాట్ రెన్షా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్లో మరో మ్యాచ్ గెలిస్తే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇదివరకే భారత్.. వన్డే, టీ20ల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. -
టీమిండియాతో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్!
భారత్తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై బాధలో ఉన్న ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిచెల్ స్టార్క్ కూడా ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అతడు కూడా జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆదనంగా మరో స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ను జట్టులో చేర్చుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది. టీమిండియాతో టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హాండ్స్కోంబ్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్), లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ(రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్), మాథ్యూ రేన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్), డేవిడ్ వార్నర్,మాథ్యూ కుహ్నెమన్ చదవండి: Wasim Jaffer: ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని -
భారత్తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్షాక్!
నాగ్పూర్ వేదికగా భారత్తో జరగనున్న తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ కాలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో హేజిల్వుడ్ గాయపడ్డాడు. అయితే భారత్తో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ఆస్ట్రేలియా సెలక్టర్లు భావించారు. ఈ క్రమంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టుతో పాటు హాజిల్వుడ్ భారత్కు వచ్చినప్పటికి ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. హాజిల్వుడ్ స్థానంలో బోలాండ్ ఇక గాయపడిన హాజిల్వుడ్ స్థానంలో పేసర్ స్కాట్ బోలాండ్కు తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. కాగా బోలాండ్ టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్లో కూడా బోలాండ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఇప్పటివరకు 6 టెస్టులు ఆడిన హాజిల్వుడ్ 28 వికెట్లు సాధించాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్ యాదవ్, పుల్కిత్ -
ICC T20 Rankings: పాపం సూర్య.. నెంబర్ 1 కాలేకపోయాడు! అదరగొట్టిన రవి బిష్ణోయి!
ICC Batting And Bowling T20 Rankings: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడికి చేరువగా వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్కు సూర్యకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ మ్యాచ్లో ఆడి మంచి స్కోరు నమోదు చేసి ఉంటే సూర్య.. నంబర్ 1గా నిలిచేవాడు. కానీ.. అలా జరుగలేదు. టాప్-5లో.. ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ 805 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. బాబర్ ఆజం 818 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్), ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా), డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) నిలిచారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ టీ20 సిరీస్లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు. రవి బిష్ణోయి అదరగొట్టిన రవి బిష్ణోయి.. టాప్-50లోకి.. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి దుమ్ములేపాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతడు ఏకంగా టాప్-50లోకి చేరుకున్నాడు. 481 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 44వ ర్యాంకు సాధించాడు. ఇక ఈ సిరీస్లో రెండో మ్యాచ్లో అద్బుతంగా(6 వికెట్లు) రాణించినప్పటికీ.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 28వ స్థానం నుంచి 35వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ విషయానికొస్తే.. ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్నది వీళ్లే! 1.బాబర్ ఆజం(పాకిస్తాన్)- 818 పాయింట్లు 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 805 పాయింట్లు 3.మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు 4.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 792 పాయింట్లు 5.డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)- 731 పాయింట్లు 6. ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు 7.పాథుమ్ నిశాంక(శ్రీలంక)-661 పాయింట్లు 8.డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 655 పాయింట్లు 9.నికోలస్ పూరన్(వెస్టిండీస్)-644 పాయింట్లు 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)-638 పాయింట్లు చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
లంక దారుణ ఆటతీరు.. 28 పరుగుల వ్యవధిలో
ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి టి20లో శ్రీలంక దారుణ ఆటతీరు కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 11.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ దశలో లంక బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా 200 పరుగుల మార్క్ను అందుకుంటుందని భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. 36 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక్కడి నుంచే లంక పతనం ఆరంభమైంది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక 28 పరుగుల వ్యవధిలో 19.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ త్రీ బ్యాటర్స్ మినహా మిగతా ఏడు మందిలో.. ఆరుగురు బ్యాటర్స్ (1,0,0,1,1,1,1) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వనిందు హసరంగా 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్వుడ్ 4, మిచెల్ స్టార్క్ 3, కేన్ రిచర్డ్సన్ ఒక వికెట్ తీశాడు. చదవండి: Ranji Trophy 2022: నమ్మశక్యం కాని క్యాచ్.. వీడియో వైరల్ Marcus Stoinis: కెరీర్కు టర్నింగ్ పాయింట్.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ -
ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ బౌలర్ పేరిట అత్యంత చెత్త రికార్డు
ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు వేసి 64 పరుగలిచ్చి ఒక్క వికెట కూడా పడగొట్టలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డు నమోదు చేశాడు. 16 పరుగుల ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న హాజిల్వుడ్ ఐపీఎల్లో వికెట్ తీయకుండా ఎక్కువ పరుగులు సమర్పించుకున్న విదేశీ బౌలర్గా నిలిచాడు. అంతేకాదు ఈ జాబితాలో హాజిల్వుడ్ తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకముందు ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ మార్కో జాన్సెన్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చాడు. అంతకముందు 2021లో సీఎస్కే తరపున లుంగీ ఎన్గిడి ముంబై ఇండియన్స్పై 4 ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అంతేకాదు ఆర్సీబీ తరపున కూడా ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ ప్రదర్శన హాజిల్వుడ్ పేరిట నిలిచింది. ఇంతకముందు షేన్ వాట్సన్ 2016లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 61 పరుగులు సమర్పించుకోగా.. 2019 సీజన్లో టిమ్ సౌథీ కేకేఆర్కు 61 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా హాజిల్వుడ్.. వాట్సన్, సౌథీలను దాటి తొలి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. Courtesy: IPL Twitter ఇంకో విషయమేంటంటే.. ఆర్సీబీ ఫ్రంట్లైన్ బౌలర్లైన సిరాజ్, హాజిల్వుడ్లు కలిసి ఆరు ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో హాజిల్వుడ్ 64 పరుగులు, సిరాజ్( 2 ఓవర్లలో 36 పరుగులు) ఉన్నాయి. ఈ దెబ్బకు సిరాజ్ మళ్లీ సెకండ్ స్పెల్ బౌలింగ్కు రాలేదు. ఇక హాజిల్వుడ్కు పంజాబ్ ఓపెనర్ బెయిర్ స్టో చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్ స్టో హాజిల్వుడ్ బౌలింగ్లో వరుసగా 4,6,6,4 బాది అతనికి పీడకలను మిగిల్చాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓటమి పాలైన ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో తలపడనున్న ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక రకంగా ఆర్సీబీకి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. చదవండి: సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన -
IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు!
IPL 2022 RCB Vs LSG- ముంబై: కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) ఆట ప్రతీ మ్యాచ్కూ పదునెక్కుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ డు ప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జోష్ హాజల్వుడ్ (4/25) లక్నోను దెబ్బ తీశాడు. సెంచరీ మిస్... బెంగళూరు ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. చమీరా వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి అనూజ్ రావత్ (4) అవుట్ కాగా, తర్వాతి బంతికే విరాట్ కోహ్లి (0) వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. చమీరా ఓవర్లో అతను వరుస బంతుల్లో 4, 4, 6 బాదగా ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే హోల్డర్ అద్భుత క్యాచ్తో మ్యాక్సీ ఇన్నింగ్స్ ముగియగా, సుయాశ్ (10) విఫలమయ్యాడు. ఈ దశలో డుప్లెసిస్ జట్టును ఆదుకున్నాడు. అతడికి షహబాజ్ అహ్మద్ (22 బంతుల్లో 26; 1 ఫోర్) నుంచి తగిన సహకారం లభించింది. వీరిద్దరు ఐదో వికెట్కు 48 బంతుల్లో 70 పరుగులు జోడించారు. షహబాజ్ రనౌటైన తర్వాత మరింత జోరుగా ఆడిన డుప్లెసిస్ ... బిష్ణోయ్ ఓవర్లో 14 పరుగులు రాబట్టి 90ల్లోకి చేరుకున్నాడు. అయితే 20వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ కావడంతో అతని సెంచరీ చేజారింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో లక్నో తడబడింది. డికాక్ (3), మనీశ్ పాండే (6) విఫలం కాగా, రాహుల్ను హర్షల్ అవుట్ చేశాడు. కీపర్ క్యాచ్ను అంపైర్ నాటౌట్గా ప్రకటించగా... రివ్యూలో ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత కృనాల్ ధాటిగా ఆడటంతో లక్నో పోటీలో నిలిచింది. అయితే ఎనిమిది పరుగుల వ్యవధిలో హుడా (13), కృనాల్ వెనుదిరిగారు. చివర్లో స్టొయినిస్ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (16) కొన్ని పరుగులు సాధించినా... అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. 38 బంతుల్లో 74 పరుగులు చేయాల్సిన స్థితిలో వచ్చిన స్టొయినిస్కు జట్టును గెలిపించడం శక్తికి మించి భారంగా మారింది. చదవండి: Faf Du Plesis: ఆర్సీబీ కెప్టెన్కు సెంచరీ యోగ్యం లేదా! That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 -
ఐపీఎల్లో అన్సోల్డ్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం.. ఆ వెనుకే 7.75 కోట్ల ఆటగాడు!
ICC T20 Rankings: ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. టీ20 ఫార్మాట్ బౌలర్ల విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 783 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ (784 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి కంటే ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్న హాజిల్వుడ్ ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. కాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న అతడు ఈ మేరకు టాప్-2లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక లంకతో సిరీస్లో హాజిల్వుడ్ వరుసగా 4, 3(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే 3-0 తేడాతో ఈ సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ, ఆదిల్ రషీద్(ఇంగ్లండ్), ఆడం జంపా(ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), ముజీబ్ ఉర్ రహమాన్(అఫ్గనిస్తాన్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా), షాబాద్ ఖాన్(పాకిస్తాన్), టిమ్ సౌథీ(న్యూజిలాండ్) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7.75 కోట్లు వెచ్చించి హాజిల్వుడ్ను సొంతం చేసుకుంది. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న తబ్రేజ్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 👑 New number one T20I bowler 🚀 Rohan Mustafa launches into the top-10 ⏫ Josh Hazlewood climbs four spots after an incredible performance against Sri Lanka Some big movements in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is. Details 👉 https://t.co/YrLa53Ls5E pic.twitter.com/otGbDw3B0r — ICC (@ICC) February 16, 2022 -
Ashes 2021-22: ఆసీస్ ప్రకటన.. తదుపరి 3 టెస్టులకు...
Ashes- Test Series: ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా తదుపరి మూడు టెస్టులకు కూడా పాత జట్టుతోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. రెండో మ్యాచ్కు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఫాస్ట్బౌలర్ జోష్ హాజిల్వుడ్ మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘యాషెస్ సిరీస్.. మెల్బోర్న్, సిడ్నీ, హోబర్ట్... టెస్టులను.. ఆస్ట్రేలియా తొలుత ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టుతోనే ఆడనుంది. ఆటగాళ్లు మంగళవారం అడిలైడ్ నుంచి బయల్దేరుతారు. బుధవారం విశ్రాంతి తీసుకుంటారు’’ అని అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా కరోనా పాజిటివ్ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన సారథి ప్యాట్ కమిన్స్.. ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐసోలేషన్కు వెళ్లిన కమిన్స్ మరోసారి కరోనా నిర్దారణ పరీక్షల తర్వాత నెగటివ్ ఫలితమే వస్తే తిరిగి జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా... అడిలైడ్ మ్యాచ్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించి ఆసీస్ విజయం దిశగా పయనిస్తోంది. కాగా మొదటి టెస్టులో ఏకపక్ష విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, జై రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్. రెండో టెస్టు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్ రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్ చదవండి: SA Vs IND: భారత్ పర్యటన.. ఆ మ్యాచ్లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు! Australia have locked in their squad for the three remaining #Ashes Test matches 👇 — cricket.com.au (@cricketcomau) December 20, 2021 -
Ashes 2021-22: రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. అదొక్కటే మార్పు: కెప్టెన్
Adelaide Test- Australia Playing XI: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా జరుగనున్న రెండో టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తమ తుది జట్టును ప్రకటించాడు. పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో.. అతడి స్థానంలో జై రిచర్డ్సన్ను ఆడించనున్నట్లు పేర్కొన్నాడు. కాగా రిచర్డ్సన్కు ఇదే తొలి యాషెస్ టెస్టు కావడం గమనార్హం. ఇక పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్కు దూరమవుతాడన్న వార్తలు వచ్చాయి. అయితే, కమిన్స్ మాత్రం వార్నర్ రెండో టెస్టు ఆడటం ఖాయమని స్పష్టం చేశాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 16 నుంచి రెండో టెస్టు మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఓవల్ మైదానంలో జరిగే ఈ పింక్ బాల్ టెస్టులో ఎలాగైన విజయం సాధించాలని జో రూట్ బృందం భావిస్తుండగా.. ఆధిక్యాన్ని పెంచుకోవాలని కమిన్స్ టీమ్ పట్టుదలగా ఉంది. ఇక గబ్బాలో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ విజయం ఏకపక్ష సాధించిన విషయం తెలిసిందే. 9 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో ఉంది. యాషెస్ సిరీస్ 2021-22.. రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు: మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జై రిచర్డ్సన్. చదవండి: Ind Vs SA Test Series: రోహిత్ లేడు.. రహానే, పుజారా, అశ్విన్ కానే కాదు.. అతడే వైస్ కెప్టెన్ Nathan Lyon looks back on his iconic caught and bowled from the 2017-18 Adelaide Test!#Ashes | #DirectHit pic.twitter.com/PL62WeSlh4 — cricket.com.au (@cricketcomau) December 15, 2021 While Jhye Richardson has 'seriously scary' pace, his consistency and control is winning rave reviews from his Test teammates #Ashes | @alintaenergy pic.twitter.com/LcDyZqCbXu — cricket.com.au (@cricketcomau) December 15, 2021 -
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
యాషెస్ సిరీస్లో రెండో టెస్ట్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజల్వుడ్ గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. దీంతో హాజల్వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్ను ఎంపిక చేశారు. కాగా రెండేళ్ల తర్వాత రిచర్డ్సన్కు టెస్ట్ జట్టులో తిరిగి చోటు దక్కింది. తొలి టెస్ట్లో జోష్ హాజల్వుడ్ మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ వేదికగా జరగిన తొలి టెస్ట్లో కూడా గాయంతోనే హాజల్వుడ్ ఆడినట్లు తెలుస్తోంది. ఇక తొలి టెస్ట్లో ఘన విజయంతో యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ప్రస్తుతం అసీస్ 5 టెస్ట్ల సిరీస్లో 1-0 తేడాతో అధిక్యంలో ఉంది. అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 16న ప్రారంభం కానుంది. చదవండి: Rohit Sharma: రోహిత్పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు.. -
చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం
దుబాయ్: ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లకు వ్యక్తిగత కారణాల చేత దూరమైన ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్.. యూఏఈ వేదికగా జరుగనున్న రెండో దశ మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎస్కే ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఆసీస్ స్పీడ్స్టర్ రాకతో చెన్నై జట్టులో జోష్ పెరిగిందని, తమ పేస్ విభాగం మరింత పదునెక్కిందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ శనివారం మీడియాకు వెల్లడించారు. కాగా, జోష్ హేజిల్వుడ్ ఇటీవల బంగ్లాదేశ్తో ఆడిన టీ20 సిరీస్లో మంచి ఫామ్ను కనబర్చాడు. అతనాడిన నాలుగు మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జోష్ అదే ఫామ్ను కొనసాగించాలని సీఎస్కే కోరుకుంటోంది. జోష్ రాకతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జోష్ హేజిల్వుడ్ను సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్ 2020కు ముందు రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్లో అతడు మూడు మ్యాచ్లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా పరిమితుల కారణంగా అతడికి ఆడే అవకాశం లభించలేదు. ఇక ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్లకు ముందు అతడు వ్యక్తిగత కారణాలతో లీగ్కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆసీస్కే చెందిన జేసన్ బెహ్రెన్డార్ఫ్ సీఎస్కే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టులో సామ్ కర్రన్, లుంగి ఎంగిడి, డ్వేన్ బ్రేవో, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్లు, దీపర్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి దేశీయ స్టార్ పేసర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబరు 19 ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్లు ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి. సీఎస్కే కెప్టెన్ ధోని, రైనా, అంబటి రాయుడు సహా పలువురు ఆటగాళ్లు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు) నిలిచింది. చదవండి: ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
Ball Tampering:ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు
సిడ్నీ: క్రికెట్లో బాల్ టాంపరింగ్ ఉదంతం పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్లో బాన్క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్క్రాఫ్ట్పై 9 నెలలు... స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే బ్యాన్క్రాఫ్ట్ తాజాగా ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ..తాను బాల్ టాంపరింగ్ చేయడం ఆసీస్ జట్టులో మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్ టాంపరింగ్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో మిగతా బౌలర్ల హస్తం ఉందంటూ అక్కడి మీడియా కోడై కూసింది. ఈ విషయంపై ఆసీస్ క్రీడా జర్నలిస్టులు సీఏపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏ బ్యాన్క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అప్పటి మ్యాచ్లో బౌలర్లుగా ఉన్న పాట్ కమిన్స్, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్లు స్పందించారు. ఆసీస్ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నలుగురు కలిసి ఒక సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.''ఆస్ట్రేలియన్ ప్రజలారా..మా నిజాయితీపై మాకు పూర్తి నమ్మకముంది. మా సమగ్రత, వ్యక్తిత్వంపై కొందరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు మాకు బాధ కలిగించాయి. అయినా ఈ ప్రశ్నలకు మేం వివిధ సందర్బాల్లో ఎన్నోసార్లు సమాధానాలు ఇచ్చాము. ఒకవేళ అవసరం అనుకుంటే.. మరోసారి దానిపై చర్చ పెట్టండి.. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి ఆరోజు మ్యాచ్లో బంతి షేప్ మార్చడానికి బయటనుంచి మైదానంలోకి ఒక పదార్థం తీసుకొచ్చారన్న సంగతి మాకు తెలియదు. బాల్ టాంపరింగ్ జరిగిందని అంపైర్లు గుర్తించాకా.. మైదానంలో ఉన్న స్క్రీన్పై బంతి షేప్ మారిందంటూ చూపించిన తర్వాత మాకు మిషయం అర్థమైంది. ఆరోజు మ్యాచ్లో ఉన్న ఇద్దరు అంపైర్లు నీల్ లాంగ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్.. మంచి అనుభవం కలిగినవారు. వారిద్దరు బంతిని పరిశీలించి షేప్ మారిందని చెప్పారు. బ్యాన్క్రాఫ్ట్ అప్పటికే సాండ్పేపర్కు బంతిని రుద్దాడని మాకు తెలియదు. కానీ అతను బాల్ టాంపరింగ్ చేస్తున్నట్లు ఇతర బౌలర్లకు కూడా తెలుసని చెప్పాడు. ఇది నిజం కాదు. ఒక బౌలర్గా మా బాధ్యత బంతులు విసరడం మాత్రమే.. బంతి షేప్ మారిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మాకెలా తెలుస్తాయి. వార్నర్, స్మిత్, బ్యాన్క్రాఫ్ట్లు చేసింది తప్పు కాబట్టే శిక్ష అనుభవించారు. కానీ ఈ ఉదంతం నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాం. మేము ఆటను ఆడే విధానం.. మైదానంలో ప్రవర్తించే తీరును ప్రజలు మంచి దృష్టితో చూడాలి. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలను నమ్మద్దొని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.. ఇక ఇది ముందుకు సాగవలసిన సమయం.'' అంటూ ముగించారు. చదవండి: వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్ ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by 7Cricket (@7cricket) -
సీఎస్కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని రోజు ముందే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు ఆసీస్ పేసర్ జోష్ హజల్వుడ్. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాల్సి ఉన్న ఈ ఆటగాడు బయో బబుల్ నిబంధనలు కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘంగా బయోబబుల్లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజల్వుడ్ తెలిపాడు. గత 10 నెలల నుంచి క్వారంటైన్, బయో బబుల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుందని, ఐపీఎల్తో అది ఇంకా కష్టంగా ఉంటుందని స్పష్టం చేసి మరీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కాగా, అతని స్థానంలో తాజాగా బెహ్రెన్డార్ఫ్ను సీఎస్కే తీసుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన మరో పేసర్ బెహ్రెన్డార్ఫ్తో హజల్వుడ్ స్థానాన్ని భర్తీ చేయాలని భావించిన ఆ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకూ 11 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న బెహ్రెన్డార్ఫ్.. గత రెండేళ్ల నుంచి జాతీయ జట్టుకు ఆడటం లేదు. ఇదిలా ఉంచితే, 2021 బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో పెర్త్ స్కాచర్స్కు ఆడిన బెహ్రెన్డార్ఫ్.. ఆ జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2019 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్లో ముంబై తరఫున ఐదు వికెట్లు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. ఇప్పుడు సీఎస్కే ఆడి తన సత్తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. శనివారం(ఏప్రిల్ 10వ తేదీన) సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది! IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?! NEWS: @ChennaiIPL sign Jason Behrendorff as replacement for Josh Hazlewood. @Vivo_India #VIVOIPL More details 👉 https://t.co/XIZSzQZqSb pic.twitter.com/8lRptsIv5c — IndianPremierLeague (@IPL) April 9, 2021 -
అతను దూరమవడానికి పుజారా కారణమా!
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తాను ఐపీఎల్లో ఆడడం లేదంటూ సీఎస్కే జట్టుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ బయోబబుల్లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాజిల్వుడ్ తెలిపాడు. గత 10 నెలల నుంచి బయోబబుల్, క్వారంటైన్లోనే ఎక్కువగా ఉంటూ ఫ్యామిలీకి దూరమవుతుండడంతో వారితో సరదాగా గడిపేందుకు ఐపీఎల్కు దూరమవుతున్నట్లుగా మరో కారణం కూడా చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ ఐపీఎల్ ఆడడం లేదని ప్రకటించిన క్షణం నుంచే సోషల్ మీడియాలో అతనిపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. చతేశ్వర్ పుజారాను నెట్స్లో ఎదుర్కొలేకనే హాజిల్వుడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి .. ఏంటి జోష్.. పుజారాకు భయపడ్డావా.. మీ ఇద్దరు ఒకే జట్టులో ఉన్నారన్న విషయం మరిచిపోయావా ఏంటి?.. అంటూ ట్రోల్ చేశారు. నెటిజన్ల మీమ్స్ను చూసిన సీఎస్కే కూడా తమ ట్విటర్లో పుజారా ఫోటోను షేర్ చేస్తూ.. ''చెపు జోష్, ఏమైంది...'' అంటూ కామెంట్ చేసింది. సీఎస్కే చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగా ఈ సీజన్కు దూరమైన జోష్ హాజిల్వుడ్ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకోవాలనేదానిపై సీఎస్కే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హాజిల్వుడ్ ఇలాంటి నిర్ణయం తీసకుంటాడని ఊహించలేదు. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఏ నిర్ణయానికి రాలేదు. హాజిల్వుడ్ లేకున్నా ప్రస్తుతం జట్టు సమతుల్యంగానే ఉంది. ఒకవేళ మేనేజ్మెంట్ వద్దు అనుకుంటే ఎవరిని తీసుకునే అవకాశం లేదు అని సీఎస్కే ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను ముంబై వేదికగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. చదవండి: ఐపీఎల్ 2021: వాంఖడేలో కరోనా కలకలం పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్ ChePu Josh, what happened? 🤔😉 #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gOBR7PPfRW — Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2021 -
వాటే సెన్సేషనల్ రనౌట్..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. నిన్నటి ఆటను రెండు వికెట్ల నష్టానికి 96 పరుగుల వద్ద ముగించిన టీమిండియా.. ఈ రోజు మూడొందల మార్కును ఈజీగా దాటుతుందని అనుకున్నప్పటికీ మనోళ్లు ముందుగానే ఇన్నింగ్స్ను ముగించారు. టీమిండియా మూడొందల పరుగుల మార్కును దాటకపోవడంలో ఆసీస్ ఫీల్డింగ్ కూడా ఒక కారణం. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లను రనౌట్ చేయగా, అందులోనూ ఒక టెస్టు మ్యాచ్లో రనౌట్లు రూపంలో మూడు వికెట్లను చేజార్చుకోవడం సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. కాగా, ఆ మూడు రనౌట్లలో హనుమ విహారి రనౌట్ అయిన తీరు బాధకరం అనే కంటే హజిల్వుడ్ రనౌట్ చేసేన తీరు కొనియాడకతప్పదు. (148 పరుగులు.. 8 వికెట్లు) భారత కెప్టెన్ రహానే ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హనుమ విహారి.. లయన్ వేసిన 68 ఓవర్లో మిడాఫ్ వైపుకు బంతిని ఆడి సింగిల్ తీయబోయాడు. పరుగు తీద్దామా.. వద్దా అనే ఆలోచనలో విహారి పరుగు పూర్తి చేయాలనుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. కానీ అక్కడే కాచుకుని ఉన్న హజల్వుడ్ బంతిని అందుకున్న వెంటనే వికెట్లపైకి నేరుగా గిరటేశాడు. అతని శరీరం మొత్తం గాల్లో ఉండగానే బంతిని గురి చూసి కొట్టడంతో విహారి రనౌట్ అయ్యాడు. ఇది నేటి ఆటలో టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చు. విహారి కనుక క్రీజ్లో ఉండి ఉంటే భారత్ మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం విహారి రనౌట్ వీడియో వైరల్గా మారింది. 96/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ఆటలో రహానేనకు కమిన్స్ పెవిలియన్కు పంపగా, ఆపై హనుమ విహారి(4) రనౌట్ అయ్యాడు. ఆ తరుణంలో పుజారా- పంత్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ జోడి 53 పరుగులు జత చేసిన తర్వాత పంత్ను హజల్వుడ్ ఔట్ చేశాడు. దాంతో టీమిండియా 195 పరుగుల వద్ద ఐదో వికెట్ను కోల్పోగా, అదే స్కోరు వద్ద పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. ఆ సమయంలో జడేజా-అశ్విన్లు ప్రతిఘటించే యత్నం చేశారు. కాగా, అశ్విన్(10) ఏడో వికెట్గా ఔటైన కాసేపటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా మాత్రం కడవరకూ క్రీజ్లో ఉండటంతో భారత్ 240 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే టీమిండియా 94 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. (అప్పుడూ ఇదే సీన్.. మరి టీమిండియా గెలిచేనా?) Don't take on the Hoff! ⚡@hcltech | #AUSvIND pic.twitter.com/eXFpRPuKiJ — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
కోహ్లిని ముంచిన పింక్ బాల్ టెస్ట్
దుబాయ్ : ఐసీసీ ఆదివారం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో టాప్ స్థానం నిలుపుకోగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 888 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉన్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన పింక్బాల్ టెస్టులో టీమిండియా ఘోర ప్రదర్శన నమోదు చేసింది. మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. పింక్బాల్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో స్పష్టంగా కనబడింది. ఒకవేళ కెప్టెన్ కోహ్లి ఆసీస్తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసి ఉంటే మొదటిస్థానానికి ఎగబాకే అవకాశం ఉండేది. కానీ మొదటి ఇన్నింగ్స్లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.(చదవండి : నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) ఇక ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినా మొదటిస్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసీస్తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి చేరుకోగా.. కోహ్లి, విలియమ్సన్ల మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. (చదవండి : అచ్చం ధోని తరహాలో..) ఇక బౌలింగ్ విషయానికి వస్తే పింక్బాల్ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హాజిల్వుడ్ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు.. పింక్బాల్ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు -
పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్లోనే
కాన్బెర్రా : క్రికెట్లో ప్రతీ బ్యాట్స్మెన్కు ఒక బౌలర్ కొరకరాని కొయ్యాగా మారడం సహజం. అది టెస్టు సిరీస్.. ద్వైపాక్షికం.. ముక్కోణపు టోర్నీ వన్డే సిరీస్.. ప్రపంచకప్ ఇలా ఏదైనా కావొచ్చు ఒక బ్యాట్స్మెన్ తనకు తెలియకుండానే ప్రతీ సారి అదే బౌలర్కు వికెట్ సమర్పించుకుంటాడు. ఉదాహరణకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసీస్ మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ బౌలింగ్లో ఓవరాల్గా 14 సార్లు ఔటయ్యాడు. అలాగే మెక్గ్రాత్, మురళీధరన్లు కూడా సచిన్ను చాలాసార్లు ఔట్ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్లు తలా ఆరు సార్లు ఔట్ చేయడం జరిగింది. (చదవండి : ఈ ఓటమి మాకు మంచి గుణపాఠం : కోహ్లి) తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆసీస్తో జరుగుతున్న సిరీస్లో యాదృశ్చికంగా హాజల్వుడ్ బౌలింగ్లోనే మూడుసార్లు ఔటవ్వడం విశేషం. ఓవరాల్గా హాజల్వుడ్ ఇప్పటివరకు కోహ్లిని 7 సార్లు ఔట్ చేయగా.. అందులో వన్డేల్లో నాలుగుసార్లు, టెస్టుల్లో మూడు సార్లు ఉన్నాయి. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన ఆటగాళ్ల సరసన హాజిల్వుడ్ చోటు దక్కించుకున్నాడు. ఇంతకమందు ఆసీస్కే చెందిన ఆడమ్ జంపా, నాథన్ లియోన్లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్సీ మోర్కెల్, విండీస్ రవి రాంపాల్లు ఏడేసి సార్లు ఔట్ చేశారు. (చదవండి : నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా : పాండ్యా) ఇక టెస్టుల్లో చూసుకుంటే కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన ఘనత ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పేరిట ఉంది. కోహ్లిని అండర్సన్ 8 సార్లు ఔట్ చేయగా.. ఇంగ్లండ్కే చెందిన గ్రేమి స్వాన్ కూడా కోహ్లిని 8 సార్లు ఔట్ చేశాడు. ఇక ఓవరాల్గా వన్డే, టెస్టులు కలిపి మొత్తంగా చూసుకుంటే కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 10 సార్లు కోహ్లిని ఔట్ చేయడం విశేషం. రానున్న సుదీర్ష సిరీస్లో టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లోనూ హాజల్వుడ్ ఆసీస్ తుది జట్టులో ఉన్నాడు. దీంతో కోహ్లి హాజల్వుడ్కు ఎన్ని సార్లు బలవ్వనున్నాడో చూడాలి. (చదవండి : టీమిండియాకు ఓదార్పు విజయం) -
కోహ్లితో పెట్టుకోం!
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేసే సమయంలో తమ జట్టు ఆటగాళ్లెవరూ అతడిని కవ్వించే ప్రయత్నం చేయరని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్వుడ్ చెప్పాడు. అలా చేయడం వల్ల కోహ్లిలోని అత్యుత్తమ ఆట బయటకొస్తుందని అది మరింత ప్రమాదకరమని హాజెల్వుడ్ అన్నాడు. ‘కోహ్లిని రెచ్చగొట్టేందుకు మేం సాహసించం. అతని రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్లోనే మేం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కోహ్లి కూడా ఆటలో పోటీని ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భాల్లో అతను మరింతగా చెలరేగిపోతాడు. కోహ్లి బ్యాటింగ్ చేసే సమయంలో స్లెడ్జింగ్ జోలికే వెళ్లకూడదు. బౌలర్లెవరూ ఆ పని చేయకూడదు’ అని హాజెల్వుడ్ వ్యాఖ్యానించాడు. -
రషీద్ హ్యాట్రిక్.. కానీ బర్త్డే బాయ్దే గెలుపు
అడిలైడ్: బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో బుధవారం రెండు వినూత్న ఘటనలు జరిగాయి. అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సిడ్నీ సిక్సర్స్ బౌలర్, బర్త్డే బాయ్ జోష్ హేజిల్వుడ్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ఈ పోరులో బర్త్డే బాయ్ హేజిల్ వుడ్ విజయం సాధించాడు. కాగా సిడ్నీ ఆల్రౌండర్ టామ్ కరన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బీబీఎల్లో భాగంగా బుధవారం అడిలైడ్, సిడ్నీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్కు దిగిన అడిలైడ్కు టామ్ కరన్(4/22) చుక్కలు చూపించాడు. కరన్కు తోడు మిగతా సిడ్నీ బౌలర్లు సహకారం అందించడంతో అడిలైడ్ జట్టు 19.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సిడ్నీకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. అడిలైడ్ బౌలర్ నెసెర్ ఆరంభంలోనే సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు. అయితే ఎట్టాగెట్టానో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్మన్ పనిపట్టాడు రషీద్ ఖాన్. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. కాగా, బీబీఎల్లో రషీద్కు ఇది మూడోది కాగా, అడిలైడ్ స్ట్రైకర్ జట్టుకు మొదటిది. రషీద్ దెబ్బకు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి సిడ్నీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టామ్ కరన్ ఈ సారి బ్యాట్తో జట్టును ఆదుకున్నాడు. అయితే అతడు కూడా 18 ఓవర్ చివరి బంతికి ఔటవ్వడంతో సిడ్నీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అంతేకాకుండా చివరి రెండో ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే సిడిల్ వేసిన 19 ఓవర్లో హేజిల్ వుడ్ అనూహ్యంగా హ్యాట్రిక్ ఫోర్ కొట్టి సిడ్నీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్, హేజిల్ వుడ్ పోరులో(హ్యాట్రిక్) బర్త్డే బాయే గెలిచాడాని కామెంటేటర్లు సరదాగా కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న టామ్ కరన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రషీద్ హ్యాట్రిక్ సాధించినప్పటికీ..!
-
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
పెర్త్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్ల గాయాల బెడడ తప్పటం లేదు. రొజుకొకరు చొప్పున గాయపడటం ఇరు జట్లను కలవరపెడుతోంది. తొలి రోజు కివీస్ బౌలర్ ఫెర్గుసన్ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ గాయంతో ఈ సిరీస్కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మూడో రోజు ఆటలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్కు అంపైర్గా విధులు నిర్వర్తిస్తున్న పాకిస్తాన్ సీనియర్ అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. గాయంతో విలవిల్లాడిన ఆయన మైదానంలో కుప్పకూలాడు. అలీమ్ దార్కు గాయం జరిగిన తీరు చూశాకా ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి. అనంతరం ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి అంపైరింగ్ చేశాడు. దీంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే? ఆస్ట్రేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ సౌథీ వేసిన బంతిని మార్నస్ లబుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో మరో ఎండ్లో ఉన్న నాన్ స్ట్రైకర్ బర్న్స్ సింగిల్ తీసే ప్రయత్నంలో సగం క్రీజు వరకు వెళ్లాడు. ఈ క్రమంలో బంతి అందుకున్న బౌలర్ టిమ్ సౌథీ వికెట్లపై విసిరాడు. ఆ బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అలీమ్ దార్, ఇదే క్రమంలో ఆ బంతిని అందుకోవాలని కివీస్ ఆల్రౌండర్ సాంట్నర్ చేసిన ప్రయత్నంలో వీరిద్దరూ ఢీ కొట్టకున్నారు. అయితే సాంట్నర్ అలీమ్ను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదర్లేదు. చికిత్స అనంతరం అలీమ్ దార్ అంపైరింగ్ చేయడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’ మూర్ఖులు అర్థం చేసుకోలేరు -
ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..
-
హాజల్వుడ్ ఔట్
మెల్బోర్న్: అసలే భారత్తో సొంతగడ్డపై ఎదురైన పరాభవాల నుంచి కోలుకోని ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్, వైస్ కెప్టెన్ హాజల్వుడ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతను త్వరలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్లో పాల్గొనడంలేదు. ఈ ఆసీస్ వైస్ కెప్టెన్ గతేడాది కూడా వెన్నుగాయంతో ఇబ్బందిపడ్డాడు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బెక్లే తమ పేసర్... ప్రపంచకప్ సమయానికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడనే ధీమా వ్యక్తం చేశారు. స్కానింగ్లో కింది వెన్నుభాగంలో ఇబ్బందులున్నట్లు తేలింది. త్వరలోనే అతనికి పునరావాస శిబిరంలో శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. లంకతో డేనైట్లో జరిగే తొలిటెస్టు ఈ నెల 24న బ్రిస్బేన్లో మొదలవుతుంది. అనంతరం రెండో టెస్టు వచ్చే నెల 1 నుంచి కాన్బెర్రాలో జరుగుతుంది. -
'తొలి టెస్టుకు నేను సిద్దం'
సిడ్నీ: త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరగబోయే యాషెస్ సిరీస్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్ వుడ్ ప్రకటించుకున్నాడు. యాషెస్ కు సన్నాహకంలో భాగంగా జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో ఆరు వికెట్లతో రాణించిన హజల్ వుడ్.. తన ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే యాషెస్ కు సిద్ధమైన విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు తెలియజేశాడు. యాషెస్ లో ఆస్ట్రేలియా పేస్ అటాక్ త్రయం మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జాక్సన్ బర్డ్ లకు జతగా హజల్ వుడ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా నాథల్ కౌల్టర్ నైల్ దూరమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని హజల్ వుడ్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఆసీస్ నలుగురు బౌలర్లతో మొదటి టెస్టుకు సిద్ధమైతే మాత్రం హజల్ వుడ్ కు తుది జట్టులో చోటు దాదాపు ఖాయం. ఈ క్రమంలోనే తన ఎంపికను పరిగణలోకి తీసుకోవాలంటూ సీఏకు హజల్ వుడ్ ముందుగా సంకేతాలు పంపాడు. -
'కౌల్టర్ నైల్.. వారికి దడపుట్టించు'
సిడ్నీ: ఇంగ్లండ్ తో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా తమ మాటల యుద్ధానికి మరింత పదునుపెట్టింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ యాషెస్ లో పాల్గొనకపోవడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న ఆసీస్.. తమ వాడివేడి మాటలతో ప్రత్యర్థి ఇంగ్లిష్ జట్టును భయపెట్టి యత్నం చేస్తోంది. రేపట్నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ఇంగ్లండ్ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొంటున్న తరుణంలో ఆసీస్ ప్రధాన పేసర్ జోష్ హజల్ వుడ్ పదునైన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ జట్టు టాపార్డర్ ను కకావికలం చేసి వారికి యాషెస్ కు ముందుగానే బౌలింగ్ లో సత్తాచూపెట్టాలని ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ కు సూచించాడు. 'కౌల్టర్ నైల్..ఇంగ్లండ్ పై రెచ్చిపో. నీ పదునైన బంతులతో వారికి దడపుట్టించు. పర్యాటక జట్టుకు తేరుకునే అవకాశం ఇవ్వకు. తొలుత టాపార్డర్ పని పడితే ఇక వారు గాడిలో పడే అవకాశం ఉండదు. ఇంగ్లండ్ జట్టును బౌలింగ్ తో భయభ్రాంతులకు గురి చేసి పైచేయి సాధించాలి. అది రెండు రోజుల మ్యాచ్ లో కౌల్టర్ చేస్తాడని అనుకుంటున్నా'అని హజల్ వుడ్ పేర్కొన్నాడు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తో కలిసి హజల్ వుడ్ ఓపెనింగ్ బౌలింగ్ ను పంచుకునే అవకాశం ఉంది. ఆ ఇద్దరికి జతగా మరో పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. -
థర్డ్ అంపైర్ను తిట్టిన హాజల్వుడ్
క్రిస్ట్చర్చ్: సాధారణంగా ఫీల్డ్ అంపైర్లపై క్రికెటర్లు అసహనం వ్యక్తం చేసే సందర్భాలు వారి చేష్టల్లో మనకు కనిపించినా.. మాటల్లో మాత్రం నియంత్రణం కోల్పోరు. అయితే అతనొక అంతర్జాతీయ క్రికెటర్ అనే సంగతి మరిచిపోయి ప్రవర్తించాడు ఆస్ట్రేలియా ఆటగాడు హాజల్వుడ్. టెలివిజన్ రీప్లేను పరిశీలించే థర్డ్ అంపైర్ను టార్గెట్ చేస్తూ బూతు పురాణం అందుకున్నాడు. పూర్తిగా నియంత్రణ కోల్పోయిన హాజల్ వుడ్ థర్డ్ అంపైర్ను అనకూడని మాట అనేశాడు. ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన అటు క్రికెట్ పెద్దల దగ్గర్నుంచీ అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నాల్గో రోజు ఆటలో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ 88 పరుగుల వద్ద ఉండగా హాజల్ వుడ్ యార్కర్ ను సంధించాడు. ఆ బంతి విలియమ్సన్ లెగ్ ను తాకడం.. హాజల్ వుడ్ అప్పీల్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ అవుట్ ను ఫీల్డ్ అంపైర్ మార్టినెస్ తిరస్కరించాడు. ఆపై వెంటనే కెప్టెన్ స్టీవ్ స్మిత్ టీవీ రిప్లే కోరాడు. ఆ నిర్ణయాన్ని సమీక్షించిన థర్డ్ అంపైర్ రిచర్డ్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవిస్తూ విలియమ్సన్ ను నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పోయిన హాజల్వుడ్ ఆ థర్డ్ అంపైర్....? అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. హాజిల్ వుడ్ తిట్ల పురాణం వికెట్ల వద్దనున్న మైక్రోఫోన్ ద్వారా అక్కడ మ్యాచ్ ను వీక్షిస్తున్న టీవీ కామెంటేటర్లకు సైతం చేరింది. ఇది ఎంతమాత్రం క్షమించరాని చర్యగా టీవీ వ్యాఖ్యాత మార్క్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.