kidnap case
-
కిడ్నాప్ కేసులో ఎస్పీ చెప్పిన.. సంచలన విషయాలు
-
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
అబిడ్స్ పీఎస్ వద్ద టెన్షన్.. కిడ్నాపర్పై పాప బంధువుల దాడి
సాక్షి, అబిడ్స్: హైదరాబాద్లోని అబిడ్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపను కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, పాప కుటుంబ సభ్యులు స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని చితకబాదారు. దీంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల ప్రకారం.. అబిడ్స్లో కిడ్నాప్నకు గురైన ఒకటో తరగతి బాలిక ప్రగతి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఎండీ బిలాల్(కిడ్నాపర్) చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కిడ్నాపర్ బిలాల్ను బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్కు పోలీసులు తీసుకువచ్చారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్ తల్లి భవానికి ముందస్తు బెయిల్
బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్కే.నగర్కు చెందిన బాధితురాలి కిడ్నాప్ కేసులో మంగళవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.Karnataka High Court grants anticipatory bail to Bhavani Revanna, mother of suspended JD(S) leader Prajwal Revanna. The bail has been granted to her on the condition that she is not allowed to enter Mysuru and Hassan. Court says that when she has already answered 85 questions…— ANI (@ANI) June 18, 2024 తన ఇంట్లో పనిచేసే ఆర్కే నగర్కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్టులోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్పై సిట్ విచారణ కొనసాగుతోంది. -
తిరుపతి కిడ్నాప్ కథ సుఖాంతం...
-
KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు -
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
బహదూర్పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్పురా పీఎస్ పరిధిలోని కిషన్బాగ్లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్పురా పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం
సాక్షి, తిరుపతి: తిరుపతి బస్టాండ్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో క్షేమంగా పోలీసులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం 3 వద్ద కోసం సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుని పోయాడు. ఆందోళనతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్గా (2) గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లడం.. చిన్నారి ఆ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం జరిగిపోయాయి. -
పాతబస్తీ ఫలక్నుమాలో మరో బాలుడు కిడ్నాప్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చిన్నారుల వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు అపహరణకు గురవ్వడం తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అయిదేళ్ల బాలుడిని ఇద్దరు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని రక్షించి.. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు అయాన్ను ఓ అగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడిని వ్యక్తి తీసుకొని వెళ్తునట్టు స్థానిక సీసీటీవీ ఫుటేజీ రికార్డయ్యాయి. కొడుకు కనిపించకపోవడంతో ఫలక్నుమా పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయిదు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. చదవండి: HYD: ట్యూషన్కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
HYD: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కలకలం..
సాక్షి, సరూర్ నగర్: హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్ను చేధించారు. వివరాల ప్రకారం.. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్నకు గురయ్యారు. అయితే, దిల్షుక్నగర్లోని కృష్ణానగర్లో జీఎస్టీ కట్టని ఓ షాప్ను సీజ్ చేసేందుకు ఆఫీసర్ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్లను షాప్ ఓనర్, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. జీఎస్టీ ఆఫీసర్పై వారు దాడికి పాల్పడ్డారు. ఇక, కిడ్నాప్ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టికర్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. -
విశాఖ: గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసు చేధన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. ఓ రియల్టర్ను భార్యతో సహా కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే అంతేవేగంగా స్పందించిన పోలీసులు కేసును చేధించారు. బాధితుల్ని రక్షించడంతో పాటు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రియల్టర్ శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు అంతే చాకచక్యంగా చేధించారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. భర్తపై ఛీటింగ్ కేసు.. కిడ్నాపర్ల డిమాండ్ మరోవైపు శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. గతంలో శ్రీనివాస్పై విజయవాడ పడమటలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జూన్ 2021లో శ్రీనివాస్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ సమయంలో రూ.3 కోట్లు కాజేజినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ తరుణంలో వాళ్ల దగ్గరి నుంచి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాప్కు దిగారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా.. ఈస్ట్ ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్లో ప్రత్యక్షం -
ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
పీఎం పాలెం(భీవిులి)/ దొండపర్తి(విశాఖ దక్షిణ) : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివారాలిలా ఉన్నాయి. కోలా వెంకటహేమంత్కుమార్, ఉలవల రాజేష్, బమ్మిడి రాజేష్ మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులను ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ.1.75 కోట్లు వసూలు చేయడంతో పాటు బంగారు నగలు లాక్కున్నారు. నగర పోలీస్ కమిషనర్కి ఎంపీ ఘటనపై ఫోన్లో తెలియజేయగా పోలీసులు బృందాలుగా ఏర్పడి సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి ఆటకట్టించారు. కిడ్నాప్నకు గురైన ఎంపీ భార్య, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాన నిందితుడైన కోలా వెంకటహేమంత్కుమార్, అతడికి సహకరించిన ఉలవల రాజేష్, న్యాయవాది బమ్మిడి రాజేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న యర్రోలు సాయి(19), బాడితబోయిన బాలాజీ(24)ను ఆనందపురం హైవే కూడలి వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. దమ్ము ఆనందబాబు (26)ను ఆదర్్శనగర్ హైవే రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిదీ గాజువాక. వీరి నుంచి రూ.10 లక్షలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. మైనర్లను జువైనల్ హోమ్కు తరలించామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీకి భద్రత పెంపు ఎంపీ ఎంవీవీకు భద్రత పెంచారు. ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)కు కూడా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీని హేమంత్కుమార్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు హేమంత్కుమార్, రాజేష్, సాయితో పాటు మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకి టూ ప్లస్ టూ, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవీకి వన్ ప్లస్ వన్ భద్రతా సిబ్బందిని కేటాయించారు -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికాడు -
కోటి 75 లక్షలు తీసుకుని ఏం చేసాడు అంటే..!
-
రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది: డీజీపీ రాజేంద్రనాథ్
సాక్షి, మంగళగిరి: విశాఖలో కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. ఏపీ క్రైమ్రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ ఫోన్ చేసి అక్కడి సీపీకి సమాచారం ఇచ్చారు. ఆడిటర్, ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చింది. రిషికొండలో బాధితులు ఉన్నట్టు ట్రేస్ చేశాం. పోలీసులకు సమాచారం వచ్చినట్టు నిందితులకు తెలిసింది. ఎంపీ కొడుకు, భార్య, మరో వ్యక్తిని తీసుకుని మళ్లీ పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. పద్మనాభపురం వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి పారిపోయారు. డబ్బు కోసమే ముందుగా ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కుమారుడితో ఫోన్ చేయించి తల్లిని రప్పించారు. గంటల వ్యవధితోనే కిడ్నాపర్లను పట్టుకున్నాం. కిడ్నాపర్లు రూ.కోటి 75లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.85లక్షలు రికవరీ చేశాం. కత్తితో చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఇవాళ నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం సరికాదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయి. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. పోలీసులు అలర్ట్గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం. భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయి. గంజాయి పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ యాక్ట్లు పెడుతున్నాం. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి సాగు లేదు. నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయి అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: పవన్ పార్టీకి అతీగతీ లేదు.. లోకేష్ది దిగజారుడు రాజకీయం -
ఆడిటర్ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్
దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్కుమార్, రాజేష్లను అరెస్టుచేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ.. కిడ్నాప్ జరిగింది ఇలా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్తో లాసెన్స్ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్ చేయించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్ జీవీకి జ్యోతితో ఫోన్చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్కు ఫోన్చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆడిటర్ ఫోన్ ట్రాక్కు ఎంపీ వినతి ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు. ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్చేసి అతని నెంబర్ను ట్రాక్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి.. మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్కుమార్, రాజేష్లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్కు తరలించారు. హేమంత్కుమార్పై 12 కేసులు.. భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ హేమంత్కుమార్ ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్కుమార్ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్నాథ్ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు. ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్కుమార్తో పాటు రాజేష్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. -
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. ముగ్గురు సేఫ్..
-
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో నలుగురు దుండగులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురిని అపహరించి రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్గా పోలీసులు గుర్తించారు. 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. కాగా గన్నమనేని గతంలో వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం వైఎస్సార్సీపీ పరిశీలకులుగా బధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగేఓ ఎంపీ వద్ద ఆడిటర్గా పనిచేస్తున్నారు. -
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
ఎంత పని చేశావ్.. తల్లీ! పోలీసులను పరుగులు పెట్టించి చివరికీ..
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: నరసరావుపేటలో కనిపించకుండాపోయిన ఏడాది బాలుడు బావిలో శవమై తేలాడు. కిడ్నాప్ అయ్యాడని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పరుగులు పెట్టిన పోలీసులు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాప్ జరగలేదని నిర్ధారించుకున్నారు. అనుమానంతో తల్లిని ప్రశ్నించగా.. పిల్లాడిని ఆడిస్తుండగా పొరపాటున బావిలో పడిపోయాడని తెలిపింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. బావి నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలేనికి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు కుమార్తె మోక్ష, కుమారుడు భానుప్రకాష్ (1) ఉన్నారు. కాగా, వాసు, సాయిలక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఏడాది కుమారుడు భానుప్రకాష్ కనిపించడం లేదని తల్లి సాయిలక్ష్మి తన భర్త, బంధువులకు సమాచారం అందించింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తండ్రి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట్రుకలు కొనుగోలు చేసే వ్యక్తులు శుక్రవారం రెక్కీ నిర్వహించారని, శనివారం సాయంత్రం తమ బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును తక్షణమే అక్కడికి బదిలీ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ సీఐ ప్రభాకర్ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. దాదాపు 60 సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలుడి ఆచూకీ ఎక్కడా నమోదు కాలేదు. తల్లిని ప్రశ్నించడంతో.. బాలుడు భానుప్రకాష్ ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బాలుడి తల్లి సాయిలక్ష్మిని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రహరీపై ఆడుకుంటున్న బాలుడు కిందకు జారి పాత బావిలో పడిపోయాడని సాయిలక్ష్మి తెలిపింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారోనన్న భయంతో చెప్పలేదని భోరున విలపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు బావిలో వెతకగా బాలుడి మృతదేహం లభించింది. పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలుడి తల్లి సాయిలక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. మొదటి కాన్పు సమయంలోనే ఆమె మానసిక సమస్య రావడంతో చికిత్స అందిస్తున్నట్టు భర్త తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష్మి తల్లిదండ్రులు క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చిన్నారి తన చేతుల్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ఆమె భయపడి బాలుడు కనిపించడం లేదని భర్త, బంధువులకు చెప్పిందని ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి) -
వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు. నిజామాబాద్ మహిళ.. దుబాయ్లో సహజీవనం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది. ఆరేళ్లకు అతడు వస్తాననడంతో... తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్లో ఆమెకు అప్పగించారు. ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక... దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది. -
హిజ్రాల తెగింపు.. రోజంతా హోటల్లో ఉంచి.. అర్థనగ్నంగా వీడియో తీసి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ వ్యక్తిని హిజ్రాలు నిలువు దోపిడీ చేశారు. ఒక రోజు పాటు ఓ హోటల్లో ఉంచుకుని రూ. 4 లక్షలు వసూలు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు షేక్ శ్రీనివాససన్ అశోక్నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ శ్రీనివాసన్ (49) గత నెల 30న రాత్రి నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ఇద్దరు హిజ్రాలు శ్రీనివాసన్ను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటోలో తిప్పుతూ 31 తేదీ రాత్రి వేకువజామున రెసిడెన్సీ రోడ్డులోని హోటల్కు తీసుకెళ్లారు. మరో ఇద్దరు హిజ్రాలను పిలిపించుకుని శ్రీనివాసన్ను అర్దనగ్నంగా వీడియో తీసి అతడి వద్ద గల గడియారం, ఉంగరం, డెబిట్ కార్డు, బంగారుచైన్, రూ.40 వేల నగదు లాక్కుని బెదిరించి వీడియో వైరల్ చేస్తామని గూగుల్పే ద్వారా లక్ష రూపాయలు, డెబిట్కార్డు పిన్ నెంబరు తెలుసుకుని రూ.2.90 లక్షలు నగదు డ్రా చేసుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కిడ్నాప్ హైడ్రామా.. యువకుడిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన యువకులు
సాక్షి, నిజామాబాద్: యువకుడి కిడ్నాప్ హైడ్రామా జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం క్రేటా కారులో వచ్చిన ముగ్గురు ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న నరేశ్ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న వారు కారు ఫొటోలను మీడియా, పోలీసులకు పంపించారు. దీంతో మూడోటౌన్ ఎస్సై శ్రావణ్కుమార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోకారు బృందంతో పాటు మరో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా బోధన్ వీడీసీ అధ్యక్షుడు బాగ య్యదిగా గుర్తించారు. పోలీసులు బాగయ్యను ఫోన్ లో విచారించగా తన అల్లుడైన అఖిలేష్ యాదవ్ ఉదయం ఇంటి నుంచి కారు తీసుకువెళ్లినట్లు చెప్పారు. అఖిలేష్యాదవ్తో పాటు అతని స్నేహితులు నిఖిల్, సాయికృష్ణ ఉన్నారు. పోలీసులు బాగయ్య కుమారుడు భరత్ను పిలిపించి ఫోన్లో కాన్ఫరెన్స్ కలిపి అఖిలేష్ యాదవ్తో మాట్లాడించగా తాను బోధన్కు వస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అఖిలేష్యాదవ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో నరేశ్ను ఎడపల్లి మధ్యలో దింపేశారు. కాగా నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని బాధితుడు నరేశ్ పోలీసులకు తెలిపాడు. అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎడపల్లి మధ్యలో విడిచిపెట్టారని చెప్పాడు. ఎవరినీ తాను టీజ్ చేయలేదని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నాడు. ఎస్సై శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఎలాంటి కిడ్నాప్ జరగలేదన్నారు. ప్రేమ వ్యవహారం మాట్లాడినట్లు తెలిపారు. చదవండి: ఇటీవలే యువకుడితో నిశ్చితార్థం.. తల్లి దగ్గరకు వెళ్లొచ్చి.. -
నాలుగేళ్లుగా వీడని బాలుడి అదృశ్యం మిస్టరీ?
సాక్షి, మెదక్: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద నాలుగేళ్ల క్రితం కిడ్నాప్నకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కుమారుడి కోసం తండ్రి తల్లడిల్లుతున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతడి రెండేళ్ల కుమారుడు అఖిల్ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఏపని చేసుకోలేక విధిలేని పరిస్థితుల్లో కపూర్య భిక్షాటన ఎంచుకున్నాడు. కొడుకు, భర్తను వదిలి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భిక్షాటనచేస్తూ తన కుమారుడితోపాటు రామాయంపేట వచ్చి కపూర్య కొద్దిరోజులపాటు ఇక్కడే గడిపాడు. అక్కన్నపేట రైల్వేస్టేషన్కు వెళ్లిన కపూర్య అక్కడ రైళ్లలో భిక్షాటనచేస్తూ రాత్రి స్టేషన్ ఆవరణలో నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి కుమారుడు అఖిల్ను అపహరించుకపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే కుమారుడు కనిపించకపోవడంతో రామాయంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాకబు చేసినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్నవారు బాలుడిని అపహరించుకపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కాగా మహారాష్ట్ర, ఇతర దూరప్రాంతాల వారు రైలులో ప్రయాణిస్తున్నవారే బాలుడిని అపహరించుకపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
వైశాలిపై దాడి చేసినట్లు విచారణలో నవీన్ రెడ్డి వెల్లడి
-
వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నవీన్ రెడ్డి కీలక కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు తెలంగాణంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణలో భాగంగా ఆదివారం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసులో హస్తినాపురం నుంచి మన్నెగూడ వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. వైశాలి ఇంటి ముందు టీషాపు కోసం షెడ్డు రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ముఠాను నవీన్ అక్కడికి పిలిచాడు. అనంతరం, వైశాలిని కిడ్నాప్ చేసి కారు ఆమెపై దాడి చేసినట్టు నవీన్ రెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా నవీన్ రెడ్డిని పోలీసులు కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా 36 మంది నిందితులు జైలులోనే ఉన్నారు. -
సిరిసిల్ల: షాలిని ప్రేమ-పెళ్లి వ్యవహారం సుఖాంతం?!
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారిన యువతి కిడ్నాప్ వ్యవహారం.. ఆపై ఇష్టపూర్వక వివాహంగా మారి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని షాలిని ప్రకటించడం, ఆమెను బెదిరించి ఉంటారన్న తల్లిదండ్రుల అనుమానాలతో కేసు ఉత్కంఠగా మారింది. అయితే.. సాయంత్రం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిసిన నవ దంపతులు.. రక్షణ కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో.. ఆ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఆయన.. పెద్దలను పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తన ఇష్ట ప్రకారమే తన ప్రియుడితో వెళ్లానని తెలిపిన ఎస్పీకి షాలిని వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే.. షాలిని అప్పటికి మైనర్ కావడంతో.. వివాహం చెల్లదని చెబుతూ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ క్రమంలో.. మైనార్టీ తీరాక వివాహం చేసుకుందామని షాలినితో చెప్పాడు జ్ఞానేశ్వర్. త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని ఆమెకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. అయితే.. షాలిని గుడికి వెళ్తుందనే సమాచారం జానీకి ముందే తెలుసు!. అందుకే ఆమెను తీసుకెళ్లే యత్నం చేశాడట. కానీ.. ముఖానికి అడ్డుగా కర్చీఫ్ ఉండడంతో ఎవరో అనుకుని ఆమె భయపడి ప్రతిఘటించినట్లు షాలిని వెల్లడించింది. తీరా కారులోకి వెళ్లాక.. అది అతనే అని తెలిసి వెంట వెళ్లినట్లు చెప్పింది. తమ ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, తల్లిదండ్రుల నుంచి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని ఆ నవ దంపతులు జిల్లా ఎస్పీని కోరారు. దీంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ గురైందనుకున్న యువతి షాలిని.. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మా బిడ్డను మా ముందు నిలబెట్టండి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్తున్న షాలిని వ్యవహారంలో తమ గోడును కూడా వినాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బలవంతంగా షాలినిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని ఉంటాడని, తమ బిడ్డను తమ ముందు నిలబెడితే అసలు విషయం తేలుతుందని షాలిని తల్లిదండ్రులు వాపోతున్నారు.భయపెట్టి లేదంటే తమను చంపుతామని బెదిరించి.. తమ కూతురితో జానీ అలా చెప్పించి ఉంటారని షాలిని తల్లిదండ్రులు చంద్రయ్య-పద్మ ఆరోపిస్తున్నారు. -
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
-
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను జ్ఞానేశ్వర్ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది శాలిని. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొంది. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది. ‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది. కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అవ్వగా .. మంగళవారం తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసేందుకు వెళ్లిన శాలిని గుడి ముందే నలుగురు యువకులు అపహరించారు. అడ్డుకున్న యువతి తండ్రిని కొట్టి ఆమెను లాక్కెళ్లారు. యువతి కిడ్నాప్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటి వరకు యువతిని కిడ్నాప్ చేశారని అంతా భావిస్తుండగా.. తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. చదవండి: రాజన్న సిరిసిల్ల: మాడపల్లి కిడ్నాప్ ఉదంతంపై కేటీఆర్ స్పందన -
మాడపల్లి కిడ్నాప్ ఉదంతంపై కేటీఆర్ స్పందన
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మాడపల్లి యువతి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తండ్రితో కలిసి వేకువ ఝామున గుడికి వెళ్లిన యువతిని అపహరించుని వెళ్లారు దుండగులు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి.. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న ఆయన.. కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని సూచించారాయన. ఇదిలా ఉంటే.. చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. ఎంగేజ్మెంట్ అయిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో బాధితురాలిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడే.. ఈ నేరానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్రెడ్డి సోదరుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్రెడ్డి, వంశీభరత్రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి! -
మన్నెగూడ కిడ్నాప్: నవీన్ రెడ్డి వీడియోపై వైశాలి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ కిడ్నాప్ కేసు సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తోంది. తన తప్పేమీ లేదంటూ నిందితుడు నవీన్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో వైశాలిని సాక్షి టీవీ సంప్రదించగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ రెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు వైశాలి. తమకు పెళ్లి జరగలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ‘మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. నవీన్ రెడ్డితో నాకు పెళ్లి జరగలేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు. నవీన్ రెడ్డిది వన్సైడ్ లవ్. అతడి తల్లి చెపినవన్నీ అబద్ధాలే. నవీన్ రెడ్డే నాతో పెళ్లి కాలేదని ఒప్పుకున్నాడు. గోవాకు నవీన్తో ఒంటరిగా వెళ్లలేదు.. ఫ్యామిలీతో కలిసి వెళ్లా. అతడిని స్నేహితుడిగా మాత్రమే చూశా. ఆరోగ్యం బాలేదని గోవాకు ఎందుకు వెళ్లాడు. జనవరిలోనే పెళ్లి చేసుకోనని చెప్పాను. నవీన్రెడ్డి లాంటి వారిని ఏ అమ్మాయి ఒప్పుకోదు.’ అని స్పష్టం చేసింది వైశాలి. ఇదీ చదవండి: Manneguda Kidnap Case: వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో -
వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది? తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు. చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
యువతి కిడ్నాప్ కేసు.. నవీన్రెడ్డి రిమాండ్కు తరలింపు
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మొబైల్ లోకేషన్ ఆధారంగా గోవాలోని బీచ్లో అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్కు తరలించారు. సరూర్ నగర్ ఓస్ఓటీ కార్యాలయంలో నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ జరిగిన డిసెంబర్9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్ రెడ్డి గోవా పారిపోయాడు. నవీన్రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్రెడ్డిన రిమాండ్కు తరలించాం. నవీన్రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న రూమన్, పవన్ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా నవీన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
రంగారెడ్డి యువతి కిడ్నాప్ కేసు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్ 9న కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. సాక్షి చేతికి అందిన వైశాలి కేసు రిమాండ్ రిపోర్టులో.. ‘గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో ఇద్దరి మధ్య పరిచయం. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరుచూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేశాడు. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మధ్యలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. వైశాలి ఇంటి వద్ద దాడికి పాల్పడుతున్న నవీన్ గ్యాంగ్ వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. అయిదు నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాడిలో ధ్వంసమైన ఇంట్లోని సామాగ్రి వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్కు ప్లాన్ చేశాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్రెడ్డి, రుమాన్, చందూ, సిద్ధూ, సాయినాథ్, భాను ప్రకాష్తో కలిసి వైశాలి కిడ్నాప్కు ప్లాన్ వేశారు. వైశాలితోపాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు. చదవండి: ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం డిసెంబర్ 9వ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఇంటి వద్ద పార్క్ చేసిన అయిదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంటిపై దాడి చేసి వస్తువులను సీసీటీవీ కెమెరాలను నాశనం చేశారు. డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారు. అనంతరం నల్గొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగి పారిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్ వోల్పో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చారు. కిడ్నాప్ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తండ్రికి కాల్ చేసి చెప్పింది. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. నిందితులను 5 రోజుల కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ3 భాను ప్రకాశ్, ఏ4 సాయినాథ్, ఏ8 ప్రసాద్, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. -
ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ చేసినవే: వైశాలి
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి వైశాలి స్టేట్మెంట్ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు.. ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. ఏడాదిగా నవీన్రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె. పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి అంటోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో రోజూ హంగామా చేసేవాడట నవీన్. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. అయితే.. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. సంబంధిత వార్త: వైశాలిని ఇప్పటికీ కూడా అంగీకరిస్తా! -
నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదు : వైశాలి
-
యువతి కిడ్నాప్ కేసు.. ‘హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు, కొరికారు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్కు గురైన యువతి వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్ రెడ్డితో తనకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్ తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు. నాకు నవీన్ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు. నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్తోనా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్గా ఉంటుందని నవీన్ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని నవీన్రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు. మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు. అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేశారు. చదవండి: టెక్కీ భర్త నిర్వాకం.. స్నేహితులతో పడుకోవాలని భార్యను బలవంతం -
కిడ్నాప్ కథా చిత్రమ్ : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు
-
Adibatla: యువతి కిడ్నాప్ వ్యవహారం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు గంటల్లోనే బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. యువతిని తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించినట్లు వెల్లడించారు.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామన్నారు. 10 సెక్షన్ల కింద కేసుల నమోదు చేస్తామన్నారు. కిడ్నాప్కు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేస్తున్నారు. బాధితురాలి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరా సహా నిందితులు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కిడ్నాప్కు ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చదవండి: ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు: నవీన్రెడ్డి తల్లి ఆవేదన దాడికి ముందు ఏం జరిగిందంటే! ‘యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డీ అందర్నీ పార్టీ పేరుతో తన ఆఫీస్కు పిలిపించుకున్నాడు. టీస్టాల్లో పనిచేసే సిబ్బందితోపాటు మరికొంతమంది బిహారీలను కార్యాలయానికి రమ్మని చెప్పాడు. పార్టీ పేరుతో మద్యం ఏర్పాటు చేసి.. తరువాత మద్యం మత్తులో ఉన్న వారందరినీ కారులో తీసుకొని వైశాలి ఇంటికి వచ్చాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ముందుగా నవీన్ రెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడగా.. తరువాత వెనకాల ఉన్న అందరూ కూడా దాడి చేశారు. వైశాలి కిడ్నాప్ తరువాత అందరూ వివిధ మార్గాల్లో పారిపోయారు’ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా శుక్రవారం ఆదిభట్లలోని యువతి ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దుండగుల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.డీసీఎం, కార్లలో సినీ ఫక్కీలోఎంట్రీ ఇచ్చిన దాదాపు వందమంది యువకులు.. యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లోని వస్తువులు, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారు. అమ్మాయిని తీసుకెళ్లిన వ్యక్తిని మిస్టర్ టీ ఓనర్ నవీన్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. అంతేగాక వైశాలికి ఇటీవలే మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే, వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. గతంలో నవీన్రెడ్డిపై ఆదిభట్ల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వైశాలి ఎందుకిలా చేసిందో!.. నవీన్రెడ్డి తల్లి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలి-నవీన్రెడ్డికి చెందిన వాళ్లు.. ఎవరి వెర్షన్లో వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం నవీన్రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది. రెండేళ్లుగా వైశాలి-నవీన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది.. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది. ‘‘నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నారాయణమ్మ. ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్ అండ్ డౌన్ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నవీన్రెడ్డి చెప్పాడు. అయితే.. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారంలాంటిదేం నడవలేదని వైశాలి కుటుంబం చెబుతోంది. నవీన్రెడ్డి ప్రేమ పేరుతో వైశాలిని వేధించాడని చెబుతోంది. ఈ తరుణంలో అన్ని విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదీ చదవండి: మన్నెగూడ కిడ్నాప్ ఘటన.. వైశాలి కుటుంబానికి భద్రత కల్పించండి -
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో..
ఇబ్రహీంపట్నం రూరల్ / తుర్కయాంజాల్ / సాక్షి, హైదరాబాద్: శుక్రవారం ఉదయం 11.20. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో ఓ ఇల్లు. ఆ ఇంటి యజమాని కుమార్తెకు పెళ్లిచూపులు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆ సమయంలో మూడు వాహనాలు అక్కడికి దూసుకువచ్చాయి. వాటిలోంచి పదుల సంఖ్యలో దుండగులు కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని దిగారు. ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అడ్డొచ్చిన ఇంటి యజమాని, ఇతర కుటుంబసభ్యులపై దాడి చేశారు. యువతిని కూడా కొడుతూ బలవంతంగా కారెక్కించి తీసుకెళ్లారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో అంతా సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించగా..చివరకు యువతి క్షేమంగా బయటపడటంతో కొన్ని గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్రెడ్డి, నిర్మల దంపతులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలో ఉంటున్నారు. దామోదర్రెడ్డి మిలటరీ విశ్రాంత ఉద్యోగి. వీరి కుమార్తె (24) వైద్య విద్యార్థిని. మొయినాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీడీఎస్ (ఐదో సంవత్సరం) హౌస్ సర్జన్ చేస్తోంది. కరోనా సమయంలో ఆమె బొంగ్లూర్ సమీపంలోని షెటిల్ కోర్టుకు వెళ్లేది. ఇక్కడికి సమీపంలోనే ‘మిస్టర్ టీ’స్టాల్ నిర్వహించే నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన కొడుదుల నవీన్రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకునేందుకు నవీన్రెడ్డి ఇద్దరు మధ్యవర్తులతో రాయబారం పంపగా.. యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారని తెలిసి.. యువతికి శుక్రవారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నవీన్రెడ్డి.. దుండగులను తీసుకొని మన్నెగూడలో యువతి ఉండే సంపద హోమ్స్కు వచ్చాడు. అంతా కలిసి ఇంట్లో చొరబడి విధ్వంసం సృష్టించారు. కర్రలు, ఇనుపరాడ్లతో కిటికీలు, అద్దాలను పగులగొట్టారు. సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువతి తండ్రి దామోదర్రెడ్డిని, మేనమామను చితకబాదారు. తల్లి నిర్మలను మెడ పట్టుకొని కిందపడేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని ధ్వంసం చేసి డీవీఆర్ను వెంట తీసుకెళ్లారు. యువతిని కొడుతూ కాళ్లు, చేతులు పట్టుకొని కార్లో పడేసి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్రావు, ఆదిభట్ల సీఐ నరేందర్ సంపద హోమ్స్కు చేరుకున్నారు. నా బిడ్డను కాపాడండి.. దండం పెడ్తా యువతి తల్లిదండ్రులు దామోదర్రెడ్డి, నిర్మలతో మాట్లాడారు. ఈ సందర్భంగా యువతి తల్లి ‘సార్.. నా బిడ్డను కాపాడండి.. మీకు దండం పెడ్తా’అంటూ జాయింట్ సీపీ కాళ్లమీద పడి ప్రాధేయపడ్డారు. ఆందోళన చెందవద్దని, మీ బిడ్డను క్షేమంగా తీసుకొస్తామంటూ ఆయన ఓదార్చారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి తల్లితో ఫోన్లో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధైర్యంగా ఉండాలని, సీపీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నవీన్రెడ్డి గోదాం కూల్చివేత.. ఫర్నిచర్కు నిప్పు మరోవైపు ఒక్కసారిగా వంద మంది ఇంటిపై దాడి చేసి కిడ్నాప్కు పాల్పడటంతో యువతి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆగ్రహానికి గురయ్యారు. యువతి ఇంటిముందే నవీన్రెడ్డి ఏర్పాటు చేసుకున్న గోదాం, స్థావరం, గదులను జేసీబీతో కూల్చివేశారు. అందులోని ఫర్నిచర్కు నిప్పుపెట్టారు. యువతి ఫోన్కాల్తో లొకేషన్ ట్రాక్ చేసి.. యువతిని కిడ్నాప్ చేసిన నవీన్రెడ్డి కారులో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వైపు పరారయ్యాడు. జిల్లా సరిహద్దులు దాటి వెళ్తుండగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం, గాలింపుతో భయాందోళనకు గురైన కిడ్నాపర్లు.. హాలియా వద్ద యువతిని వదిలేసి వెళ్లినట్లు సమాచారం. దీంతో యువతి ‘క్షేమంగా ఉన్నా డాడీ..’అని ఫోన్ చేయడంతో సెల్ టవర్ ఆధారంగా పోలీసులు యువతి ఉన్న స్థలాన్ని గుర్తించి హాలియా పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులు యువతిని రక్షించి తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించారు. ఈ కేసులో 8 మంది నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రణాళిక ప్రకారమే యువతిని కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. అపహరణ అనంతరం యువతిని బాగా కొట్టారని, ఆమెకు గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె తీవ్రమైన ఒత్తిడిలో ఉందని, మాట్లాడే పరిస్థితుల్లో లేదని వివరించారు. -
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు.. పక్కా స్కెచ్తో!
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్లలోని మన్నెగూడలో కిడ్నాప్ అయిన డాక్టర్ వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. యువతిని పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పట్టపగలే 100 మంది ఇంట్లోకి వచ్చి యువతిని కిడ్నాప్ చేయడం వెనక స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నాప్కు పాల్పడిన నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. తన కూతురు కిడ్నాప్కు మరికొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. కూతురిని నవీన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఒత్తిడి చేశారని తెలిపారు. నవీన్ రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లిచూపులు ఉన్నాయని తెలిసే ఇదిలా ఉండగా.. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని గత ఆరు నెలలుగా నవీన్ రెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ గతంలో వైశాలి, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే వైశాలి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని టీస్టాల్ ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో వివాహం చేసుకునేందుకు వైశాలి సిద్ధపడిందని, ఈ రోజు పెళ్లిచూపులు ఉన్నాయని తెలుసుకున్న నవీన్ రెడ్డి 100 మంది కిరాయి గుండాలతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వైశాలి తండ్రిని, అడ్డుకోబోయిన పలువురు స్థానికులను కూడా చితకబాదారు. యువతి ఇంటి సమీపంలోనే టీస్టాల్ నడుపుతున్న నవీన్ రెడ్డి.. అక్కడికి వచ్చే వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్కు డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే 40 మందికి పైగా యువకులను గుర్తించారు. కిడ్నాప్ తర్వాత అమ్మాయిను నవీన్ రెడ్డికి అప్పగించి యువకులు పరారయ్యారు. పథకం ప్రకారమే సెల్ ఫోన్లు వాడకుండా స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకవద్దని వైశాలి ఇంటివద్ద పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కిడ్నాప్ కేసు కొలిక్కి సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేయడంతో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. యువతి నల్గొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నల్గొండ పోలీసులకు సమాచారం ఇచ్చిన రాచకొండ పోలీసులు వైశాలి ఉన్న స్పాట్కు తండ్రితోపాటు వెళ్లారు. కిడ్నాపర్ నవీన్ను అదుపులోకి తీసుకొని.. వైశాలిని రక్షించారు. కాగా అంతకుముందే వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేసి సేఫ్గా ఉన్నట్లు, ఆందోళన చెందవద్దని చెప్పిన సంగతి తెలిసిందే. -
రంగారెడ్డి: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్కు ఫోన్ చేసింది. తను సిటీలోనే సేఫ్గానే ఉన్నానని తండ్రికి చెప్పింది. తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది. మరోవైపు యువతి కిడ్నాప్ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. యువతి కిడ్నాప్కు గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్ చేసిన నవీన్రెడ్డి టీస్టాల్ను తగలబెట్టారు. తమ కూతురు కిడ్నాప్కు సీఐ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి గ్యాంగ్ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు కాల్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్ రాహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో నవీన్రెడ్డిపై ఆదిభట్ల పీఎస్లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. -
థ్రిల్లర్ సినిమాను తలపించే కథ...పాపం కొడుకు కోసం ఆ తల్లే..
ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ. వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు. ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్లో ట్రాక్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్ఏ టెస్ట్లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి సింగ్ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు. దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రేప్ అండ్ కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. మొత్తం ఆరు వందల పేజీలతో కూడిన ఛార్జ్షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. ఛార్జ్షీట్లో అన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు నెలలపాటు జైల్లోనే ఉన్న నాగేశ్వరరావు బెయిల్పై విడుదలయ్యాడు. ఇక పోలీస్ విభాగం ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంటూ.. నాగేశ్వరరావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. సర్వీసు నుంచి తొలగించారు. ఛార్జ్షీట్లో సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్.. ఇలా మొత్తం వివరాలను నమోదు చేశారు. నాగేశ్వరరావుకు శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించింది పోలీస్ శాఖ. -
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్గౌడ్, అస్లంఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
కాలేజీ ఫీజు కోసం బాలుడి ‘కిడ్నాప్’.. డిగ్రీ స్టూడెంట్ ప్లాన్తో షాక్!
బెంగళూరు: కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? బ్యాంకులో విద్యారుణం తీసుకోవటం, తెలిసినవార వద్ద అప్పుగా తీసుకోవటం వంటివి చేస్తారు? కొందరు తప్పని పరిస్థితుల్లో చదువు మానేస్తారు కూడా. కానీ, ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్కు చెందిన వైవీ నగేశ్ని సైతం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే కార్పొరేట్ వర్కర్ కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేకపోవటంతో.. బాలుడిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. బాలుడి తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నతర్వాత నిందితుడు.. కళాశాలలో ఫీజు కట్టాడు. అందులోంచి ఓ బైక్, డిజిటల్ కెమెరాను కొనుగోలు చేశాడు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. గడ్డిఅన్నారం కార్పొరేటర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న లంకా సుబ్రమణ్యం (24) కిడ్నాప్ కేసును సరూర్నగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి ప్రధాన సూత్రధారిగా తేల్చారు. సుబ్రమణ్యం తండ్రి లంకా లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ బృందం బాధితుడితో పాటు నిందితులను నల్లగొండ జిల్లా చింతలపల్లి వద్ద గుర్తించారు. కిడ్నాప్నకు గురైన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎసీపీ శ్రీధర్రెడ్డి, ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఅండ్టీ కాలనీకి చెందిన బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కార్పొరేటర్ అనుచరుడు శ్రవణ్ బంధువులను సైతం ఆయన వేధిస్తున్నాడని, అలాగే లక్ష్మీనారాయణ సోదరుడు లంకా మురళి కూడా తమ ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని శ్రవణ్ను వేడుకున్నాడు. ఈ విషయాలను శ్రవణ్ కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వనస్థలిపురానికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పునీత్ తివారీతో మాట్లాడిన కార్పొరేటర్.. లక్ష్మీనారాయణకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కిడ్నాప్ చేసి కొట్టాలని పురమాయించాడు. 8 మందితో ముఠా ఏర్పాటు.. పునీత్ తివారి తన ఎనిమిది మంది స్నేహితులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. గురువారం అర్ధరాత్రి లంకా లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. లక్ష్మీనారాయణ కుమారుడు సుబ్రమణ్యం ఇంటి ముందు ఉన్నాడు. రెండు కార్లలో వెళ్లిన పునీత్ బృందం సుబ్రమణ్యాన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గమధ్యలో అతడిని చిత్రహింసలు పెట్టి నల్లగొండ జిల్లా చింతాలపల్లికి తీసుకెళ్లారు. ఈలోగా బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కార్పొరేటర్ సూచనల మేరకే తాము కిడ్నాప్నకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. కార్పొరేటర్తో పాటు పునీత్ తివారి అతని అనుచరులు పోతబోయిన మంజునాథ్, పాలపర్తి రవి, కందాల పవన్కుమార్, రవల హేమంత్, రేవళ్ల చంద్రకాంత్, బలివాడ ప్రణీత్, కుంభగిరి కార్తీక్, మరుపోజు రవివర్మలను సాయంత్ర 7 గంటల ప్రాంతంలో రిమాండ్కు తరించారు. కేసులో నందితులుగా ఉన్న శ్రవణ్ గౌడ్, లంకా మురళి, మహేష, సాయి కిరణ్లు పరారీలో ఉన్నట్లు ఏసీపి తెలిపారు. మరో కేసు నమోదు లంకా సుబ్రమణ్యం కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అరెస్ట్ చేసిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి, పునీత్తివారి, రవివర్మ, హేమంత్లతో పాటు కార్పొరేటర్ మరో అనుచరుడు కోటేశ్వరరావులపై సరూర్నగర్ పోలీసులు మరో కిడ్పాప్ కేసు నమోదు చేశారు. పీఅండ్టీ కాలనీకి చెందిన భువనగిరి జయశంకర్, కార్పొరేటర్ అనుచుడు బొమిడిశెట్టి కోటేశ్వరరావుల మధ్య డబ్బు లావాదేవీలు ఉన్నాయి. ఇదే క్రమంలో గత నెల 28న రాత్రి 10 గంటల సమయంలో పునీత్ తివారి, రవివర్మ, కోటేశ్వరరావులు కారులో ఎక్కించుకుని సైదాబాద్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎదురుగా ఉన్న భవనంలోకి తీసుకెళ్లి డబ్బులు త్వరగా ఇవ్వాలని బెదిరించారు. అక్కడ నుంచి కార్పొరేటర్ కార్యాలయంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లాలని బెదిరించినట్లు కార్పొరేటర్ మిగిలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
Hyderabad: అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్
నాగోలు: కారు, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండుగులు ఓ యువకుడిని అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గడ్డిఅన్నారం డివిజన్ పిఅండ్టి కాలనీకి చెందిన లంక సుబ్రహ్మణ్యం (24) గురువారం అర్ధరాత్రి శ్రవణ్, దినేష్ స్నేహితులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారు సుబ్రహ్మణ్యం తండ్రి గురించి వాకబు చేశారు. తన తండ్రి నిద్రపోతున్నాడని చెప్పాడు. చౌరస్తా వద్దకు రావాలని చెప్పడంతో శ్రవణ్, దినేశ్లు అక్కడికి వెళ్లారు. ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్యంను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ విషయమై సుబ్రమణ్యం తండ్రి లంక లక్ష్మీనారాయణ సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ గురైన సుబ్రహ్మణ్యం నల్గొండ జిల్లా చింతపల్లిలో ఉన్నారనే సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి సుబ్రహ్మణ్యం తో పాటు కిడ్నాప్ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్న వివరాలను సరూర్ నగర్ పోలీసులు వెల్లడించడం లేదు. కిడ్నాప్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా! -
తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన పసికందు.. ‘బీజేపీ’ నేత ఇంట్లో ప్రత్యక్షం!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న తల్లి ఒడిలోనుంచి ఈనెల 23న 7 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి సంఘటన ఇటీవల సంచలనంగా మారింది. కిడ్నాప్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీని కనుగొన్నారు. మథురాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఫిరోజాబాద్లో ఓ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో బాలుడిని గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కిడ్నాప్ గ్యాంగ్లో భాగమైన ఇద్దరు డాక్టర్ల నుంచి బాలుడిని రూ.1.8 లక్షలకు కొనుగోలు చేశారు బీజేపీ నేత వినిత అగర్వాల్, ఆమె భర్త. వారికి ఇదివరకే కూతురు ఉన్నప్పటికీ కొడుకు కావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేశారు. ఈ కేసులో రైల్వే స్టేషన్లో పిల్లాడిని ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు. చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. వైద్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫికింగ్ గ్యాంగ్పై వివరాలు వెల్లడించారు సీనియర్ పోలీస్ అధికారి మహమ్మెద్ ముస్తాఖ్. ‘దీపక్ కుమార్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. అతడితో పాటు హత్రాస్ జిల్లాకు సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తోన్న ఇద్దరు డాక్టర్లు ఈ గ్యాంగ్లో భాగస్వాములు. కొంత మంది ఆరోగ్య కార్యకర్తలకు సైతం ఇందులో భాగం ఉంది. చిన్నారి ఆచూకీ లభించిన ఇంటి సభ్యులను విచారించాం. వారికి ఒకే కూతురు ఉందని, కుమారుడు కావాలని చెప్పారు. అందుకే ఈ డీల్ కుదుర్చుకున్నారు.’ అని వెల్లడించారు ముస్తాఖ్. అయితే, ఈ అంశంపై అరెస్ట్ అయిన కార్పొరేటర్, బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया। इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये। आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में। मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा। pic.twitter.com/fTnuGbSlsi — SACHIN KAUSHIK (@upcopsachin) August 27, 2022 ఇదీ చదవండి: CCTV Footage: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు -
యువకుడి కిడ్నాప్.. బలవంతంగా పెళ్లి
చైతన్యపురి: కండిషన్ బెయిల్కు కోసం సంతకం పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చి వెళుతున్న యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి జరిపించిన ఘటన ఆదివారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్నకు చెందిన ననావత్ వెంకటేష్ నాయక్ (26) కొన్నాళ్ల క్రితం ఓ యువతిని వేధించిన కేసులో జై లుకు వెళ్లి బెయిల్పై వచ్చాడు. కండిషన్ బెయిల్ ఉండటంతో ఆదివారం ఉదయం సంతకం చేసేందుకు సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. కారులో వచ్చిన తన స్నేహితుడు విజయ్ను వేచి ఉండాలంటూ స్టేషన్లోకి వెళ్లాడు. వీరు తిరిగి వెళుతుండగా చైతన్యపురి చౌరస్తాలో గుర్తు తెలి యని వ్యక్తులు వెంకటేష్ను బలవంతంగా బైక్పై ఎక్కించుకుని వెళ్లారు. ఇదే విషయాన్ని వెంకటేశ్ స్నేహితుడు విజయ్ అతని సోదరుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వెంకటేష్ను సింగరేణి కాలనీకి తీసుకెళ్లి అక్కడ దేవాలయంలో వారు గతంలో తనపై కేసు పెట్టిన యువతి దివ్యతో వివాహం జరిపించారు. అక్కడకు వెళ్లిన విజయ్కుమార్ ఈ విషయంపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం వెంకటేశ్ ను పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. తనపై కేసు పెట్టిన యువతి కుటుంబానికి చెందిన వారు తనను బలవవంతంగా తీసుకెళ్లి ఆమెతో వివాహం చేశారని పోలీసులకు చెప్పాడు. గజానాయక్, నిరంజన్ నాయక్, ఆర్.గోపా ల్ మరికొందరిపై ఫిర్యాదు చేశాడు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. (చదవండి: పెళ్లికి అంగీకరించలేదని... ఒంటిపై డీజిల్ పోసుకుని..) -
తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..?
సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజులుగా బాలుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కిడ్నాప్ చేసిన మహిళే మరోసారి బాలుడిని తిరుమలకు తీసుకురావడంతో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కాగా, కిడ్నాప్ చేసిన మహిళను కర్నాటకకు చెందిన పవిత్రగా పోలీసులు గుర్తించారు. గోవర్దన్ను మొదట తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించి అనంతరం పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మరోవైపు.. కిడ్నాపర్ పవిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సరూర్నగర్లో పరువు హత్య -
నరసరావుపేట కిడ్నాప్ కేసు విషాదాంతం
సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేటలో కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన రామాంజనేయులు హత్యకు గురయ్యాడు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలలో రామాంజనేయులు మృతదేహం లభ్యమైంది. రామాంజనేయుల్ని చంపిన దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి హైవేలో ఓ బ్రిడ్జి కింద పడేశారు. కళ్యాణ్ జ్యువలరీలో సేల్స్మెన్గా పనిచేస్తున్న రామాంజనేయుల్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే బాజీ, అన్నవరపు కిషోర్లే తన భర్తను చంపారని రామాంజనేయులు భార్య ఆరోపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామాంజనేయులు కిడ్నాప్ ఉపయోగించిన ఆటోను గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను విజువల్స్ ద్వారా మొత్తం ఐదుగురు కిడ్నాప్కు పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
చిన్నారి మిస్సింగ్! రెండున్నరేళ్ల తర్వాత.. దిమ్మతిరిగే ట్విస్టులు
ఏదో మలయాళం సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు.. ఇప్పుడు చెప్పుకోబోయే కేసులో ఉంటాయి.. ఉన్నపళంగా ఓరోజు నాలుగేళ్ల ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో అంతా ఆమె కోసం వెతికారు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఈ లోపు ఆ చిన్నారి మీద అయినవాళ్లు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, కేసును టేకప్ చేసిన పోలీసులు, ప్రైవేట్ డిటెక్టివ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండున్నరేళ్ల తర్వాత తమకు అందిన ఫోన్ టిప్తో ఓ ఇంటిపై దాడి చేశారు. నాటకీయ పరిణామాల నడుమ అక్కడ వాళ్లకు ఊహించని సీన్ కనిపించడంతో కంగుతిన్నారు. రెండున్నరేళ్లు వెనక్కి వెళ్తే.. అది.. న్యూయార్క్ స్టేట్లోని కయుగ హైట్స్ గ్రామం. 2019 జులైలో ఓ రోజు నాలుగేళ్ల చిన్నారి పైస్లీ తన అక్క స్కూల్కి వెళ్లడంతో ఒంటరిగా బయట ఆడుకుంటోంది. కాసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది జరిగిన రెండున్నరేళ్ల తర్వాత.. పక్కా సమాచారంతో మొన్న ఫిబ్రవరి 14వ తేదీన సౌగర్టిస్(అల్బెనీకి 45 మైళ్ల దూరం..కయుగ హైట్స్కి 150 మైళ్లకు పైగా దూరం) లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారే.. పైస్లీనే.. రెండున్నరేళ్ల తర్వాత కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అయితే ఆ చిన్నారి అలా కనిపించడం వెనుక బోలెడన్ని ట్విస్టులు దాగున్నాయండోయ్. సీక్రెట్ గదిలో హాయిగా.. ఆ చిన్నారి అదే ఇంట్లోనే ఉందన్న సమాచారంతో డిటెక్టివ్ ఎరిక్ థెయిలె నేతృత్వంలో సౌగర్టిస్ పోలీసులు సుమారు గంటపాటు సోదా నిర్వహించారు. అంతా వెతికినా లాభం లేకపోయింది. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించిన ప్చ్.. ప్రయోజనం కనిపించలేదు. ఇక వెళ్లిపోతున్న క్రమంలో.. డిటెక్టివ్ ఎరిక్కు మెట్ల మధ్య ఓ దుప్పటి కప్పి ఉండడం, దాని కింద ఏదో వెలుతురు కనిపించడంతో అనుమానంతో తొలగించి చూశాడు. అక్కడ చిన్న సందు కనిపించింది. అనుమానంతో.. చెక్క మెట్లను పదునైన టూల్స్తో తొలగించి చూడగా.. ఓ సీక్రెట్ చాంబర్లో బయటపడింది. ఆ చాంబర్లో కింబర్లీ కూపర్ ఒడిలో చిన్నారి పైస్లీ హాయిగా నిద్రపోతూ కనిపించింది. పోలీసుల దాడులు.. ఊహించని ఆ పరిణామంతో ఆ ఇంటి ఓనర్ క్రిక్ షుల్టిస్(సీ.), అతని కొడుకు క్రిక్ షుల్టిస్(జూ.)లు బిత్తరపోయారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్ల వయసున్న చిన్నారి పైస్లీని స్వయంగా దగ్గరుండి డిటెక్టివ్ ఎరిక్.. ఆమె అక్క దగ్గరికి చేర్చాడు. ఇంతకీ ఈ కిడ్నాప్కు పాల్పడింది ఆ చిన్నారి కన్నతల్లిదండ్రులే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. కన్నవాళ్లే వాళ్లు.. పైస్లీ షుల్టిస్.. క్రిక్ షుల్టిస్(జూ.) కింబర్లీ కూపర్ చిన్న కూతురు. కయుగ హైట్స్లో కాపురం ఉన్న ఈ జంటకు.. ఇద్దరు కూతుళ్లు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. తమ ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. కోర్టు ఆ పిల్లలను సంరక్షణను అదే ఊరిలో ఉండే ఓ లీగల్ గార్డియన్కు(ఐడెంటిటీ రివీల్ చేయలేదు) అప్పగించింది. దీంతో పైస్లీ షుల్టిస్, ఆమె అక్కను లీగల్ గార్డియన్ దగ్గరికి చేర్చింది ఆ జంట. కానీ, కన్నప్రేమపై మమకారం చంపుకోని ఆ పేరెంట్స్.. అలా పైస్లీని ఎత్తుకెళ్లి ఈ రెండున్నరేళ్లు తమతో పాటే ఉంచుకున్నారు. మధ్యలో పైస్లీ అక్కను కూడా ఎత్తుకెళ్లాలనే ప్లాన్ వేసినా.. అది జరగలేదట. పైస్లీ కనిపించకుండా పోయినా టైంలో.. వీళ్లు పడిన బాధ(నటన) వర్ణనాతీతం. అందుకే ఎవరికీ వీళ్ల మీద అనుమానం రాలేదు. అఫ్కోర్స్.. ఆ చిన్నారి తాత క్రిక్ షుల్టిస్ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ వాళ్లు పోలీసులకు దొరికేవాళ్లు కాదేమో!. తాతే ఎందుకు పట్టించాడంటే.. క్రిక్ షుల్టిస్ సీనియర్, జూనియర్లు, కింబర్లీ కూపర్ అరెస్ట్తో ఆ ప్రాంతం ఒక్కసారిగా షాక్ తింది. రెండున్నరేళ్లు ఒక చిన్నారిని బయటకు రాకుండా.. జాగ్రత్తగా మ్యానేజ్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు వాళ్లు. అయితే.. మనవరాలు కొడుకు కోడలుతో సంతోషంగా ఉన్నప్పటికీ.. పైస్లీ అలా ఆ బంధీఖానాలో మగ్గిపోవడం భరించలేకపోయాడట ఆ పెద్దాయన. అందుకే పోలీసులకు ఆ చిన్నారి గురించి సమాచారం అందించాడు. ఈ రెండున్నరేళ్లలో ఆ పేరెంట్స్ మీద, ఆ పెద్దాయన మీద పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.. వాళ్లెంత పక్కాగా ఆ చిన్నారిని కాపాడుకున్నారో!. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. భార్యపై అనుమానం, శారీరక వేధింపులతో
సాక్షి, తెనాలి రూరల్(గుంటూరు): కోర్టు వాయిదాకు వచ్చి వెళ్తున్న సమయంలో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసును పోలీసులు ఛేదించారు. భార్య కుటుంబీకులే అతడిని హతమార్చారని తేల్చారు. దీంతో హతుడి మామ, ఇద్దరు బావమరుదులు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక వన్టౌన్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.స్రవంతిరాయ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడని.. వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నలుకుర్తి సుబ్బయ్యకు తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన జయశ్రీతో 2011లో పెళ్లైంది. భార్యపై అనుమానంతో సుబ్బయ్య ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. దీంతో జయశ్రీ 2018లో భర్త, అత్త, మరిదిపై తెనాలి త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు వాయిదాలు నడుస్తున్న క్రమంలో 2019లో కోర్టు ప్రాంగణం సమీపంలో జయశ్రీ కుటుంబసభ్యులు, సుబ్బయ్య కుటుంబసభ్యులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. చదవండి: వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్చల్ దీనిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తన మంచిది కాదని సుబ్బయ్య కోర్టులో బహిరంగంగా చెప్పాడు. మరోవైపు పెద్ద బావమరిది జయచంద్ర కాపురాన్ని లేనిపోనివి చెప్పి సుబ్బయ్య చెడగొట్టాడు. ఇటీవల వివాహమైన రెండో బావమరిది సుధాకర్ కాపురాన్నీ చెడగొట్టే యత్నం చేస్తున్నాడని తెలుసుకున్న జయశ్రీ కుటుంబ సభ్యులు ఎలాగైనా సుబ్బయ్యను అంతమొందించాలని పథకం రచించారు. చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 31న కోర్టు వాయిదాకు తెనాలి వచ్చి వెళ్తున్న సుబ్బయ్యను బావమరుదులు జయచంద్ర, సుధాకర్, మామ రవి కారులో వెంబడించారు. తెనాలి–చందోలు రహదారిలో కూచిపూడి లాకులు దాటాక యలవర్రు వంతెన సమీపంలో కారుతో అడ్డగించి ఒక్కసారిగా హెల్మెట్తో దాడి చేశారు. షాక్లో ఉన్న సుబ్బయ్యను కారులో ఎక్కించి, కండువాను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం కారు డిక్కీలోకి మృతదేహాన్ని మార్చి కొల్లిపర మండలం అన్నవరపులంకకు తీసుకెళ్లారు. అక్కడ తమ బంధువులైన కాకాని రమేష్, అతని కుమారుడు సతీష్బాబుతో కలసి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అయిలూరు పంచాయతి ములకలపల్లి లంక గ్రామానికి వెలుపల కృష్ణా నది ఒడ్డున పిచ్చి తుమ్మ చెట్లలో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు. చదవండి: మైనర్ను గర్భవతిని చేసిన ఘనుడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే.. వీఆర్వో వద్ద లొంగుబాటు కోర్టు వాయిదాకు వచ్చిన తన సోదరుడు కనిపించటం లేదంటూ సుబ్బయ్య తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు జనవరి 2న అదృశ్యం కేసు నమోదు చేశారు. సుబ్బయ్య మామ, బావమరుదులు, భార్య, అత్త, చిన మామపై నిఘా ఉంచారు. మృతుడి కాల్ డేటా, నిందితుల కాల్ డేటాను లోతుగా పరిశీలించారు. 31న అనేకసార్లు ఫోన్లు చేసిన నిందితులు అనంతరం వాటిని స్విచాఫ్ చేసినట్టు గుర్తించారు. సతీష్బాబు కొత్త సిమ్ వాడుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అన్నవరపులంక వెళ్లి అతని కదలికలపైనా నిఘా పెట్టారు.దీంతో పోలీసులకు తెలిసిపోయిందనే భయంతో నిందితులు మల్లెపాడు వీఆర్వో వద్దకు వెళ్లి లొంగిపోయారు. వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితులు వినియోగించిన కారు, రెండు మోటారుసైకిళ్లు, మృతుడి మోటారుసైకిల్తోపాటు అతని ఎముకలు, బూడిదను గుర్తించి స్వాధీనపర్చుకున్నట్టు డీఎస్పీ వివరించారు. ప్రాథమిక ఆధారాల్లేకున్నా నిందితులను గుర్తించి, సాక్ష్యాలనూ సేకరించిన వన్టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఉమామహేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. -
ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి కిడ్నాప్.. విషయం తెలిసి తల్లిదండ్రుల షాక్
సాక్షి, రాంగోపాల్పేట్: ఇంటర్మీడియేట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్బజార్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియేట్ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు. సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్.. ఆ రెండు పరీక్షలు రద్దు -
ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!
జైపూర్: దళితులు,వెనుక బడిన వర్గాలపై అఘాయిత్యాలు.. వివక్షతలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొన్నిచోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్తాన్లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్తాన్లోని చురులోని రుఖాసర్ గ్రామానికి చెందిన.. 25 ఏళ్ల రాకేష్ మేఘ్వాల్ని కొంత మంది వ్యక్తులు అతని ఇంటి నుంచి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత.. అదే బాటిల్లో మూత్రవిసర్జన చేసి బాధితుడితో బలవంతంగా తాగించారు. అయితే, వీరిమధ్య పాతకక్ష్యల నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జనవరి 26 న జరిగింది. బాధితుడిని రాత్రి 11ల ప్రాంతంలో.. బలవంతంగా కిడ్నాప్ చేసి పొలాల్లోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మద్యం తాగారు. బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టి, అతనిచేత మూత్రం తాగించారు. వారి ఆధీపత్యం చూపించుకోవడానికి ఇలా క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మేఘ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. ఉమేష్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రతన్గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు. Rajasthan | A Dalit man was allegedly abducted, beaten, & forced to drink urine by some men in Churu. Two people have been arrested& other accused will be arrested soon: Jagdish Prasad Bohra, Addl Superintendent of police, Churu The incident took place on Jan 26, police said pic.twitter.com/nWanMTDkoy — ANI (@ANI) January 30, 2022 చదవండి: రాహుల్కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి -
ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు డిమాండ్!
Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు రామ్జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్ఖేడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు. అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
Hyderabad Kidnap Case: చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
-
మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. తెలిసిన వ్యక్తి పనే.. 9 గంటల్లోనే..
సాక్షి, రాంగోపాల్పేట్(హైదరాబాద్): ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు తొమ్మిది గంటల్లోనే పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రెజిమెంటల్ బజార్లో నివసించే శ్రీనివాస్, ఉమా దంపతులకు తరుణ్ (6), కీర్తన (3) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు తల్లి ఉమా కిచెన్లోకి వెళ్లగా చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చింది. 10 నిమిషాలకు తల్లి వచ్చి చూసేసరికి పాప కనిపించ లేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. శ్రీనివాస్ ఇంటికి కొద్ది దూరంలో ఇద్దరు యువకులు తచ్చాడినట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ వీరిని ప్రశ్నించగా... సాయి కోసం వచ్చామని చెప్పడంతో పాటు అక్కడ కొందరు ఆ పేరున్న వాళ్లు ఉండటంతో తెలిసిన వారై ఉండవచ్చని ఆమె భావించింది. కాసేపటికి చిన్నారిని యాక్టివా వాహనంపై తమ మధ్య కూర్చోబెట్టుకుని వెళ్లడాన్ని గుర్తించిన ఎల్లోరా అనే వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. వాళ్లు చిన్నారితో మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్లినట్లు చెప్పింది. చదవండి: న్యూఇయర్ వేడుకలు.. గ్రాము కొకైన్ ధర.. బంగారం కంటే 3 రెట్లు ఎక్కువ దీంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించారు. రంగంలోకి దిగిన ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్లి గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటలకు జీడిమెట్లలో నిందితుల ఆచూకీ గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూత్రధారి బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. పాపకు మామ వరసైన వ్యక్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కిడ్నాప్ చేశారని, ఇంకొకరు బాలికను దాచిపెట్టడానికి సహకరించారని తేల్చారు. వ్యక్తిగత కారణాలతోనే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ఆన్లైన్లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు.. -
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ వల.. లాంగ్ డ్రైవ్ పేరుతో కిడ్నాప్
రాజమహేంద్రవరం: ఓ యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి, పథకం ప్రకారం బయటకు తీసుకువెళ్లి కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఓ యువతితో భీమవరం సమీపంలోని కొత్త పూసలమర్రుకు చెందిన మోకా ఫణీంద్ర ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 15న లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తానని చెప్పి ఫణీంద్ర.. రాజానగరం వచ్చాడు. ఆ యువతిని తన బైక్పై ఎక్కించుకుని, భీమవరం సమీపంలోని బలుసుమూడి 31వ వార్డులోని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బంగారు చైన్, చెవి దిద్దులు తీసుకున్నాడు. తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి గాయపర్చాడు. అనంతరం ఆమె తండ్రికి ఫోన్ చేశాడు. అతడి కూతురిని కిడ్నాప్ చేశానని, రూ.5 లక్షలు ఇస్తేనే వదిలిపెడతానని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు వెంటనే రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అప్రమత్తమై ఎనిమిది బృందాలుగా ఏర్పడి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని కిడ్నాపర్ ఫణీంద్ర అదే ఇంట్లో ఉంచి ఈ నెల 16న తాళం వేసి, బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లోనే బందీగా ఉన్న ఆ యువతి ఇంటి తలుపును గట్టిగా బాదింది. దీనిని గమనించిన స్థానికులు బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీసు గంగాభవానీకి సమాచారం అందించారు. ఆమె ఈ విషయాన్ని అక్కడి టూ టౌన్ పోలీసులకు తెలపడంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి, యువతిని రక్షించారు. రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో వారు కిడ్నాపర్ ఫణీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీస్ గంగాభవానీని ఎస్పీ ప్రశంసాపత్రం, నగదు, మెమెంటో, శాలువాతో సత్కరించారు. -
అనుపమ అలుపెరగని పోరాటం...ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!
Kerala Baby Kidnap Case Finally Woman Gets Custody Of Her Infant Son: కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. స్వయంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు ఇది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటంలో కేరళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైన సంగతి తెలిసిందే. పైగా యావత్తు ప్రజలంతా కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని ఆకాంక్షించిన విచిత్రమైన కేసు ఇది. అయితే అనుపమ ఎస్ చంద్రన్ గతేడాది అక్టోబర్లో ఓ బిడ్డకు తల్లి అయిన సంగతి విధితమే. అంతేకాక ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. పైగా ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో స్వయానా ఆమె తండ్రే బిడ్డను కిడ్నాప్ చేసి కూతుర్నీ మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. (చదవండి: చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్) అయితే ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా వెనుకడుగు వేస్తున్నారంటూ శిశు సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రిని వేడుకుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలివచ్చి ఆమె బిడ్డను సత్వరమే వెతికే చర్యలు తీసుకోవడమే కాక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన కేరళ పోలీసులు ఆ బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. అంతేకాదు ఆ బిడ్డ ఆ తల్లికే చెందాలని అక్కడి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షించారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారని చెప్పడంతో అనుపమ ఎంతో ఆవేదనగా ఎదురుచూస్తూ ఉంది. ఈ మేరకు న్యాయమూర్తి ఛాంబర్లో గంటన్నరసేపు జరిగిన విచారణలో నిర్మల శిశు భవన్లో సీడబ్ల్యూసీ కస్టడీలో ఉన్న బాబుని కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతేకాదు బాబుకి అన్ని వైద్యపరీక్షలు నిర్వహించడమే కాక చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన సత్వరమే ఆ చిన్నారిని తల్లికి అప్పగించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఈ కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. అయితే శిశువును వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వ ప్లీడర్ విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు అనుపమ ఒడికి ఆ చిన్నారి చేరుకుంది. అంతేకాదు సంవత్సరం నిరీక్షణ వారాల న్యాయ పోరాటాలు అన్ని ఫలించి ఈ రోజు అనుపమ తన భర్త అజిత్తో కలిసి తన చిన్నారిని ఎత్తుకుని ఆనందంగా కోర్టు నుంచి బయటకు వచ్చింది. అయితే మూడు రోజుల వయస్సు ఉన్నప్పుడు ఆమె చివరిసారిగా చూసిన తన బిడ్డ సంరక్షణ బాధ్యతను కోర్టు నేడు ఆమెకు అప్పగించింది. (చదవండి: వామ్మో!...పైప్లైన్లో నోట్ల కట్టలు..!!) -
కారణం ఏదైనా వారే టార్గెట్: కిడ్నాప్లు.. హత్యలు.. లైంగిక దాడులు
సాక్షి, పహాడీషరీఫ్: పాత కక్షలు.. ఆస్తి తగాదాలు.. ఇంట్లో గొడవలు.. ఇలా కారణమేదైనా చిన్నారులు బలవుతున్నారు. తరచూ ఏదో ఒక చోట కిడ్నాప్లు.. హత్యలు.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం. దగ్గరి బంధువులు, పక్కిళ్ల వారే ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మత్తులో మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. నగర శివారులో వెలుగుచూస్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా బాబాయి ముసుగులో పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం.. ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వయసు నుంచే చిన్నారులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తూ.. ఇంటర్నెట్ మాయా ప్రపంచానికి వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను గంటల తరబడి పట్టించుకోని సందర్భాలు నెలకొంటున్నాయి. పిల్లలను ఓ కంట కనిపెట్టాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. మత్తుకు చిత్తవుతున్న యువత మాదకధ్రవ్యాలకు అలవాటు పడి యువత పెడదోవ పడుతోంది. 15 ఏళ్ల వయసులోనే మద్యం తాగడం.. చెడు స్నేహాలు.. గంజాయి, వైట్నర్ లాంటి మత్తుపదార్థాలకు బానిలవుతున్నారు. బర్త్డేలు, ఫంక్షన్ల పేరుతో హంగామా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు ► 2021 నవంబర్ 20న పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీరాం కాలనీలో లక్కీ అనే నాలుగేళ్ల బాలుడిని బాబాయి వీరేశ్ దారుణంగా హత్య చేశాడు. ►2019 మే 8న రాత్రి పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి జల్పల్లిలోని వాదే ముస్తఫా బస్తీలో కూల్డ్రింక్ కోసం వెళ్లిన యాసిన్ అనే ఏడేళ్ల బాలు డిపై స్థానికంగా ఉండే యువకుడు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చాడు. ►2014 సెప్టెంబర్ 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్(10)ను మల్లికార్జున్, మోహన్ కిడ్నాప్ చేసి బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదేరోజు దారుణంగా హత్య చేశారు. అనంతరం రూ.2 లక్షలు కావాలంటూ పది రోజుల పాటు తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టారు. ►2014 ఏప్రిల్ 5న ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు డి.కార్తీక్ (10)ను బంధువైన శివకుమర్ (22) కిడ్నాప్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేలోపే బాలుడిని షాద్నగర్లో దారుణంగా బండరాయితో మోది హత్య చేశాడు. ►2017 జూన్ 28న ఆటోడ్రైవర్ మహ్మద్ జమీల్ ఖాన్ కుమారుడు మహ్మద్ ఖాన్(10)కు ఇంటి పక్కన ఉండే 17 ఏళ్ల యువకుడు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. ►2017 మార్చి 28న నమాజ్కని వెళ్లిన బండ్లగూడకు చెందిన మహ్మద్ యవరుద్దీన్ కుమారుడు రఫి(7)ని పొరుగింట్లో ఉండే మునీర్ సోని (20) టీవీలో ప్రసారమయ్యే క్రైం పెట్రోల్ సీరియల్ను అనుసరించి దారుణంగా హత్య చేశాడు. మా నాన్న ప్లాటు అమ్మాడని.. కోటి రూపాయలు వచ్చాయని చెప్పిన పాపానికి డబ్బుల కోసం ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. ►2010 డిసెంబర్లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి సదరు ఏజెంట్ కుమారుడిని కిడ్నాప్ చేసి బీచ్పల్లి కృష్ణానది వద్ద దారుణంగా హత్య చేశాడు. -
అప్పు తీర్చడం లేదని ముగ్గురు కలిసి కిడ్నాప్
రాజేంద్రనగర్: అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మెరుపు దాడి చేసి బందీ అయిన వ్యక్తిని విడిపించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన తన్వీర్ హుస్సేన్(45) స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఖుద్బుద్దీన్ వద్ద అప్పుగా రూ.8.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బు కోసం తన్వీర్ హుస్సేన్ను తిరిగి ఇవ్వాలని ఖుద్బుద్దీన్ ఎన్నిసార్లు అడిగినా రేపు, మాపు అంటూ దాట వేస్తున్నాడు. దీంతో ఖుద్బుద్దీన్ తన స్నేహితులు మహమూద్, ఇబ్రహీంతో కలిసి ఈ నెల 6వ తేదీన తన్వీర్ హుస్సేన్కు ఫోన్ చేసి ఇంటి వద్దకు రావాలని తెలిపారు. తన్వీర్ హుస్సేన్ రాగానే డబ్బు విషయం అడిగారు. తన వద్ద లేవని.. రాగానే ఇస్తానంటూ తెలిపాడు. దీంతో ముగ్గురు కలిసి తన్వీర్ హుస్సేన్ను ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించి చితకబాదారు. తన్వీర్ హుస్సేన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించి.. జాడ తెలియకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఖుద్బుద్దీన్కు డబ్బులు ఇచ్చే విషయమై తెలపడంతో అతడిపై నిఘా పెట్టారు. సోమవారం ఉదయం ఇంటిపై దాడి చేసి ఓ గదిలో బందీగా ఉన్న తన్వీర్ హుస్సేన్ను విడిపించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖుద్బుద్దీన్తో పాటు సహకరించిన ఇబ్రహీం, మహమూద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్ దొరికాడు..!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడు డానియెల్ కేసును వరంగల్ కమిషరేట్ పోలీసులు ఛేదించారు. పక్కా ప్లాన్ ప్రకారం బాబు ను కిడ్నాప్ చేసి అమ్మాలని నిర్ణయించుకున్న లోకల్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు.. పిల్లల అక్రమ రవాణా ఉద్దేశం ఏమైనా ఉందా అనే దిశగా లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క డానియెలేనా.. లేక గతంలో ఈ తరహాలో ఎంత మందిని కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలి సింది. రెండేళ్ల బాబు సురక్షితంగా దొరకడంతో ఇటు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అటు తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి: పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..? ) 14 రోజులుగా గాలింపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానిఝెల్ ఉన్నాడు. వీరు వరంగల్ మట్టెవాడ ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్ సమీపంలోనే దోమ తెరలు, దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకు దెరువు కోసం నెలక్రితం ఇక్కడికొచ్చారు. అయితే వీరి కుమారుడు డానియెల్పై అగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్ టాప్ ఆటో’లో నుంచి దిగిన ఓ వ్యక్తి ఉదయం 5.03 గంటలకు బాబును కిడ్నాప్ చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్ ప్లేట్ లేని ఆటోలో బట్టలబజార్ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేక మార్గదర్శనంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. అయితే నిందితుల అచూకీ కోసం హైదరాబాద్లోనూ గాలించిన పోలీసులకు ఆధారం చిక్కడంతో పట్టుకున్నారు. వీరు డానియెల్ను అమ్మడానికే కిడ్నాప్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో 75 పేజీల చార్జీషీట్ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్రావు ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత ప్రవీణ్రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ సమయంలో ఒక్కొక్కరి పాత్రను వివరించారు. చదవండి: Bhuma Akhila Priya: బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు -
అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. గంటల్లో..
చెన్నె: ఇటీవల కొత్త తరహా నేరాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త తరహాలో నేరాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాల్గా మారింది. అయితే సినిమాల్లో చూపించిన మాదిరి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అచ్చం సినిమా కథ మాదిరే తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. వ్యాపారి కుమారుడిని కొందరు కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. డబ్బుతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువకుడు కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి కుమారుడు శివప్రదీప్ (22) కడయూరులోని రైస్ మిల్లుకు ఆదివారం రాత్రి కారులో శివప్రదీప్ వెళ్తున్నాడు. వీరచోళపురం ప్రాంతానికి చేరుకోగానే మొత్తం ఏడు మందితో కూడిన గ్యాంగ్ అతడి వాహనాన్ని అడ్డుకున్నారు. శివప్రదీప్ను వెంటనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం డబ్బుల కోసం యువకుడి తండ్రికి ఫోన్ చేశారు. రూ.3 కోట్లు ఇస్తేనే కుమారుడిని వదిలేస్తామని హెచ్చరించారు. కిడ్నాపర్ల హెచ్చరికలతో భయపడిన అతడి తండ్రి అడిగిన మొత్తాన్ని ఇచ్చేయడంతో కిడ్నాపర్లు ఆ యువకుడిని వదిలేశారు. (చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్) అయితే రూ.మూడు కోట్లు అప్పనంగా పోయాయని భావించిన ఈశ్వరమూర్తి కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని వ్యాపారవేత్తకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. వారిలో ముగ్గురి నుంచి రూ.1.69 కోట్లు, మరొకరి నుంచి రూ.20.44 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఆరు గంటల వ్యవధిలోనే పోలీసులు కేసు చేధించడంపై పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును సులువుగా చేధించారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
వనపర్తి కిడ్నాప్, దాడి కేసు: శ్రీకాంత్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: వనపర్తి జిల్లాలో కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో బాధితుడి శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతన్ని శనివారం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. కాగా వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం సంపత్ రావుపల్లికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తికి, హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్కు మధ్య డబ్బు విషయంలో గొడవ ఏర్పడగా.. శ్రీకాంత్ను అతని కుటుంబ సభ్యులను చంద్రయ్య సంపత్రావుపల్లిలో తన ఇంట్లో నిర్భంధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా.. కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఇవి విన్న చుట్టుపక్కల వారు వెంటనే డయల్ 100కి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు విముక్తి కల్పించారు. పోలీసుల రాకను గమనించిన చంద్రయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న విపనగండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: డబ్బు విషయంలో తగాదా.. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి.. -
చందర్ దేశ్పాండే కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్ట్
సాక్షి, నిర్మల్ : చందర్ దేశ్పాండే కిడ్నాప్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన ఐదుగురిలో రియల్టర్ కృష్ణారావు కూడా ఉన్నారు. నిందితులు కిడ్నాప్కు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. రెండు కోట్ల లావాదేవీలపై విభేదాలు రావటంతో ఈ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. -
రూ.50లక్షలు డిమాండ్ చేసి.. ప్రాణం తీశారు
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకున్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం పోతవరం సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.50లక్షలు ఇస్తే విడిచిపెడతామని అన్నారు. దీంతో ఏం చేయాలో తెలియని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు రూ.50లక్షలు డిమాండ్ చేశారని యువకుడి తండ్రి పోలీసులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. -
కానిస్టేబుల్తో కలిసి కూతురుని కిడ్నాప్ చేసిన తల్లి!
చెన్నై: తమిళనాడుకు చెందిన మరియా నాదర్ అనే మహిళను ఆమె తల్లి, ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2019 లో దాహిసర్కు చెందిన పాల్ సింగ్ నాదర్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మరియా నాదర్ అనే మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే పాల్ సింగ్ను విడిచిపెట్టి తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ అరుణ్ దేవేంద్రను వివాహం చేసుకోవాలని తల్లి కోరింది. దీనిపై పలు మార్లు తల్లి, కూతుళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. కాగా బుధవారం కూతురిని కలువడానికి ఓ చోటుకు రమ్మని ఆమె తల్లి, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మరియాను కిడ్నాప్ చేశారు. అయితే భర్త పాల్కు మరియా సమాచారం అందించింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తల్లి కోయిల్ అమ్మల్ దేవేంద్ర (46), అత్త పొన్ను తాయ్ (43), అరుణ్ దేవేంద్ర (26), డ్రైవర్ నాదర్ స్వామి (30)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా..కోర్టు పోలీసు కస్టడీకీ అప్పగించింది. కాగా మరియా 2019, అక్టోబర్ 22న ముంబైలో పాల్ (30)ను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సీసీటీవీ దృశ్యాలు: బాలిక కిడ్నాప్నకు యత్నం, తల్లి వెంటపడటంతో
సాక్షి, జవహర్నగర్: ఇటీవల దమ్మాయిగూడలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం రాచకొండ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. రంగంలోకి రాచకొండ సీపీ ఐదు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్భగవత్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు దాదాపు 600 మంది పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దమ్మాయిగూడ ప్రగతినగర్తో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆయా కాలనీల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జవహర్నగర్ సీఐ భిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్గౌడ్ల నేతృత్వంలో విస్తృతంగా విచారణ చేపట్టారు. మరో బాలిక కిడ్నాప్నకు యత్నం.. వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్లో ఎరుపు రంగు టీషర్టు.. నల్లరంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమవ్వడంతో అనుమానిత వ్యక్తిని నిలదీసింది. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో ఆమె దుండగుడిని వెంబడించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కీసర పోలీస్స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్రామ్లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్కు సహకరించిన జగత్ విఖ్యాత్తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్లో పనిచేసే రత్నాకర్లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్లను రిమాండ్కు తరలించారు. భార్గవరామ్, జగత్విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం.