Maneka Gandhi
-
Lok Sabha Election 2024: చోటీ బహూకు ఇంటిపోరు
సుల్తాన్పూర్. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచి్చన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ బరిలోకి దిగారు. అయితే సొంత పారీ్టయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనక కేవలం 14,500 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులూ అంటున్న పరిస్థితి! ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్ పూర్ పరీక్షలో 67 ఏళ్ల ఈ ‘చోటీ బహు’ ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠ రేపుతోంది... భర్త సంజయ్గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్ గాం«దీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్గాం«దీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరఫున ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. పిలిభిత్ను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్గా కూడా విజయకేతం ఎగరేయడం విశేషం. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్కు వదిలి తొలిసారి సుల్తాన్పూర్కు మారారు. వరుణ్కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఓబీసీలు, ముస్లింలే కీలకం... సుల్తాన్పూర్లో నిషాద్లతో పాటు కురీ్మలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. ప్రచారానికి మోదీ, షా దూరం సుల్తాన్పూర్లో శనివారం ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం! ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం! అయోధ్య రామ మందిర నిర్మాణం, వరుణ్కు టికెట్ నిరాకరణ వంటివేవీ సుల్తాన్పూర్లో ఎన్నికల అంశాలు కావు. నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానాంశాలు. వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషే నన్ను మళ్లీ గెలిపిస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపిస్తా. – మేనకా గాంధీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maneka gandhi: కరిగిన కల నుంచి లేచిన అల
మేనకా గాంధీ. సైనిక కుటుంబంలో పుట్టిన ఆమె జీవితమంతా పోరాటాలమయమే. ప్రధాని ఇందిర ఇంటి కోడలయ్యారు. కానీ కళ్లముందు కని్పంచిన బంగారు భవిష్యత్తు చూస్తుండగానే కరిగిపోయింది. భర్త హఠాన్మరణంతో అంతా తలకిందులైంది. అయితే.. అత్తపై తిరగబడాల్సి వచి్చనా, రెండేళ్ల పసిబాబుతో అత్తింటికి శాశ్వతంగా దూరమైనా డీలా పడలేదు. ఒంటరిగానే రాజకీయాల్లో రాణించారు. బీజేపీలో చేరిన గాంధీ కుటుంబీకురాలిగా సంచలనం సృష్టించారు... భర్త మరణంతో... సంజయ్తో మేనక వైవాహిక బంధానికి ఆరేళ్లకే నూరేళ్లు నిండాయి. 1980లో భర్త విమాన ప్రమాదంలో మరణించే నాటికి మేనకకు కేవలం 23 ఏళ్లు. కొడుకు వరుణ్ 100 రోజుల పసికందు! భర్త ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నారు. అందుకామె వయసు చాలలేదు. రాజ్యాంగ సవరణ చేసి ఎన్నికల్లో పోటీకి కనీస వయసును తగ్గించాల్సిందిగా ప్రధాని అయిన తన అత్తగారు ఇందిరను కోరారు. ఆమె ఒప్పుకోలేదు. బావ రాజీవ్ అమేథీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. మరుసటేడు 1982లో సంజయ్ అనుచరులు లక్నోలో ఏర్పాటు చేసిన భేటీలో మేనక పాల్గొని ప్రసంగించారు. దీన్ని తనపై తిరుగుబాటుగా ఇందిర భావించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొస్తూనే కోడలిపై కన్నెర్రజేశారు. ఇంటినుంచి వెళ్లిపొమ్మన్నారు. మనవడు వరుణ్ను తనతోనే ఉంచుకునేందుకు విఫలయత్నం చేశారు. 1982 మార్చిలో రెండేళ్ల కొడుకును వెంటబెట్టుకుని అత్తింటిని శాశ్వతంగా వదిలి వెళ్లారు మేనక.సొంత పార్టీ .. బీజేపీ తీర్థం... 1983లో అక్బర్ అహ్మద్తో కలిసి రా్రïÙ్టయ సంజయ్ మంచ్ను స్థాపించారు మేనక. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిని గెలుచుకున్నారు! 1984 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో రాజీవ్పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పార్టీని జనతాదళ్లో విలీనం చేశారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1989లో జనతాదళ్ టికెట్పై పిలిభిత్ నుంచి లోక్సభకు ఎన్నికవడమే గాక కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 1996లో అక్కణ్నుంచే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. 1998లో రెండోసారి గెలిచారు. 1999లో బీజేపీలో చేరారు. వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలుపొందారు. ఈసారీ అక్కణ్నుంచే బరిలో ఉన్నారు. పిలిభిత్కు మేనక ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అక్కణ్నుంచి వరుణ్ రెండుసార్లు గెలిచారు. ప్రేమ, పెళ్లి, ఎడబాటు.. మేనక 1956 ఆగస్టు 26న జని్మంచారు. తల్లిదండ్రులు లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్, అమర్దీప్. లారెన్స్ స్కూల్, లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో జర్మన్ అభ్యసించారు. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో గెలుపొందారు. బాంబే డైయింగ్ మోడల్గా కూడా చేశారు. 1973లో సంజయ్ గాంధీని ఓ పార్టీ లో కలిశారు. రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రధాని కొడుకుతో సంబంధం అనగానే మేనక కుటుంబం సంకోచించినా ఇందిర మాత్రం ఈ బంధాన్ని సాదరంగా స్వాగతించారు. అలా 1974లో సంజయ్తో పెళ్లయింది. 1980లో వరుణ్ పుట్టాడు. తొలుత ఫిరోజ్ అని తాత పేరు పెట్టగా దానికి వరుణ్ అని ఇందిర చేర్చారు. జంతు ప్రేమికురాలిగా.. మేనక చేయి తిరిగిన రచయిత్రి, కాలమిస్ట్. జంతు హక్కుల కార్యకర్త. 1992లో పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ)ని స్థాపించారు. ఇది దేశంలో అతిపెద్ద జంతు సంక్షేమ సంస్థల్లో ఒకటి. కేంద్రంలో జంతు సంక్షేమ శాఖను సృష్టించి, దానికి మంత్రిగా కూడా పనిచేశారు. బహిరంగ ప్రదర్శనలకు జంతువుల వాడకాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు. కాస్మటిక్స్, ఆహార ఉత్పత్తులపై శాకాహారం, మాంసాహారం అని లేబుల్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. జంతువులు, పర్యావరణం పట్ల ఆమె నిబద్ధతకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సస్పెన్స్లో తల్లీకొడుకుల సీట్లు.. విడిగా వరుణ్ గాంధీ పోటీ?
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్పూర్, కైసర్గంజ్, రాయ్బరేలి, మైన్పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. -
ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?
రేవ్పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ ఎందుకు స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం... యూట్యూబర్, బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనప్రమేయం ఉందని తేలితే తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. అతడే కింగ్ పిన్, అరెస్ట్ చేయండి మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎంపి మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు. నోయిడా, గురుగ్రామ్లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న ఇస్కాన్.. ఇపుడు నేను, ఇలా అయితే లోక్ సభ సీటు వచ్చేస్తుందా? మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్ అనిపించాయని దీనిపై తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఎల్వీష్ ట్వీట్ చేశాడు. మొన్న ఇస్కాన్ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్ చేశారు... ఇలా లోక్సభ టిక్కెట్ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Judge saab proof ye rha pic.twitter.com/2db31v0bVb — Dr Nimo Yadav (@niiravmodi) November 3, 2023 పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్ మేనకా గాంధీ ఫౌండర్గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్ అనే అతను సెక్టార్ 51 బాంకెట్ హాల్కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విచారణ నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన సంగతి తెలిసిందే. Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime - that means… pic.twitter.com/26qX6gciG3 — ANI (@ANI) November 3, 2023 -
'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు'
లక్నో: బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ స్టేట్మెంట్కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్ సుల్తాన్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే మహిళలు చాలా అందంగా అవుతారని మేనకా గాంధీ అన్నారు. ఈజిప్టుకు చెందిన ప్రఖ్యాత రాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలలోనే స్నానం చేసేదని పేర్కొన్నారు. దీంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 'గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర ఢిల్లీలో రూ.500 ఉంది. మనం కూడా గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయడం ఎందుకు ప్రారంభించకూడదు?. లద్దాక్కు చెంది ఓ కమ్యూనిటీ గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వెల్లడించింది. అందుకే గాడిద పాలను వారు సబ్బుల తయారీకి వాడుతున్నారు. గాడిద పాలతో చేసిన సబ్బును వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు.' అని మేనకా గాంధీ అన్నారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/AlvguCEgE5— Shahzad Khan (@Shahzadkhanjou) April 2, 2023 చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్పూర్లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాస్తవమెంతంటే..
ఢిల్లీ: వీధి కుక్కలను ఆదరించేవాళ్లకు సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటూ ఓ కథనం జాతీయ మీడియా వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. ప్రతీరోజూ వాటికి తిండిపెట్టడమే కాదు.. వ్యాక్సినేషన్ వేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేసిందంటూ, ఒకవేళ అవి గనుక ఎవరినైనా కరిస్తే, ఆ పరిణామాలకూ వాటిని ఆదరించేవాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిందన్నది ఆ కథనాల సారాంశం. మూగజీవాల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపిందని, వీధికుక్కలను ఆదరించి.. తిండి పెట్టేవాళ్లూ వాటి బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ అవి ఎవరి మీదైనా దాడి చేస్తే గనుక.. ఆ ఘటనలకు వాళ్లే బాధ్యలవుతారు అంటూ బెంచ్ పేర్కొందని కథనం కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్ ద్వారా ప్రముఖంగా వైరల్ అయ్యింది. అయితే.. ఈ కథనంలో వాస్తవం లేదన్న విషయం ఇప్పుడు తేలింది. ఎంపీ, జంతు పరిరక్షణ సమితి సభ్యురాలు మేనకా గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయస్థానంగానీ, ఏ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం దురుద్దేశంతోనే కొందరు అలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో స్పష్టత ఇచ్చారు. కాబట్టి, వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. FAKE NEWS : "Those who feed stray dogs will be held liable if dogs attack : supreme court order" Maneka Gandhi, Member of Loksabha, animal rights activist, and environmentalist has given clarification on the same. We request everyone to continue to feed stray animals 🙏. pic.twitter.com/2AWptngja6 — BELAGAVI INFRA.co.in (@Belagavi_infra) September 10, 2022 ఇదిలా ఉంటే.. 2019 నుంచి దేశంలో 1.5 కోట్ల మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్లో కేసులు, ఆపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పెంపుడు కుక్కలంటే.. వీధికుక్కల దాడులే ఎక్కువగా ఉన్నాయి. కేరళ, ముంబైలలో పెనుముప్పుగా మారిన వీధికుక్కల దాడులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వ సంబంధిత పౌర విభాగాలు.. వాటిని చంపించడంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో పలు పిటిషన్లు నమోదుకాగా.. వాటిని కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో మూగజీవాల సంరక్షణ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది అత్యున్నత న్యాయస్థానం. తాజా విచారణ సందర్భంగా.. సెప్టెంబర్ 28కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో మణిపూర్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలిలో వీధి కుక్కల సంఖ్య సున్నాగా ఉందని అక్కడి అధికార యంత్రాంగాలు ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి: జొమాటో డెలివరీ బాయ్పై కుక్క దాడి.. వీడియో వైరల్ -
వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో వరుణ్ గాంధీకి మొండిచేయి చూపింది. 80 సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. వరుణ్ గాంధీ సహా ఆయన తల్లి మేనకా గాంధీకి కూడా కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ లోక్సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. సొంత పార్టీకి కంట్లో నలుసులా మారారు. మేనకా గాంధీ.. మధ్యప్రదేశ్లోని సుల్తాన్పూర్ ఎంపీగా ఉన్నారు. అందుకే చోటు దక్కలేదా? ఇటీవల కాలంలో మోదీ సర్కారు విధానాలను విమర్శిస్తూ వరుణ్ గట్టిగానే గళం విన్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు చట్టాలు, ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరి ఘటన నేపథ్యంలో ఆయన స్వరాన్ని మరింత పెంచారు. లఖీమ్పూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్ట్ చేయాలన్నారు. హింసాకాండకు బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని తాజాగా డిమాండ్ చేశారు. అన్నదాతల రక్తం కళ్లజూసిన వారిని బోనెక్కించాలని ట్విటర్ వేదికగా నినదించారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్, మేనకా గాంధీలకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జంబో కార్యవర్గం బీజేపీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు. 80 మంది సాధారణ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు(ఎక్స్ఆఫిషియో) సహా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లెజిస్లేటివ్ పార్టీ నేతలు, మాజీ డిప్యూటీ సీఎం, జాతీయ అధికార ప్రతినిధి, నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్, స్టేట్ ఇన్చార్జి, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. (చదవండి: లఖీమ్పూర్ హింస.. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా) అమిత్ షా, రాజనాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మాజీ మంత్రులు హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఎంపీలు, సీనియర్ నేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గం వివిధ అంశాలపై చర్చిస్తుంది. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలంగా జరగలేదు. -
ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి: మేనకా గాంధీ
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి పెంపుడు శునకాన్ని కారుతో తొక్కించి చంపిన ఘటనపై బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ స్పందించారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘శునకాన్ని కారుతో తొక్కించి చంపిన వ్యక్తి పేరు గురిందర్ సింగ్. పంజాబ్లోని కాపుర్తలా, దండూపుర్కు చెందిన వాడు. అతడు డాగ్స్ బ్రీడింగ్ చేయటంతో పాటు వాటిని పోట్లాటల కోసం అమ్ముతుంటాడు. కుక్కలతో అవసరం తీరిపోతే అతడు ఇలా హింసించి చంపుతుంటాడు. ఆ కుక్క అత్యంత బాధను అనుభవించి 30 నిమిషాల తర్వాత చనిపోయింది’’ అని తెలిపారు. This is Gurinder Singh s/o Harbans Singh, village Dandupur, Kapurthala in Punjab. He is a breeder and seller of dogs for dog fights. This is what he does to dogs when they are no longer useful. This dog died after 30 minutes of being in excruciating pain. pic.twitter.com/lIvBpzXOhp — Maneka Sanjay Gandhi (@Manekagandhibjp) August 18, 2020 ‘‘ఆ రోజు రాత్రి అతడి దగ్గర ఉన్న కుక్కలను ఇంటి వెనకాల ఉన్న ఓ చెరువులో పడేశాడు. ఓ కుక్క చనిపోయింది. మిగిలిన కుక్కలను స్థానికులు కాపాడారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
ప్రత్యర్థితో మేనకాగాంధీ వాగ్వాదం
లక్నో: కేంద్ర మంత్రి, సుల్తాన్పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్ల మద్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’ సోనూ సింగ్ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ‘నేను నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల పరిశీలనలో భాగంగా ఇక్కడికి వచ్చాను. పోలింగ్ సక్రమంగా జరుగుతుందో లేదో తెలసుకోవడం ఎలాంటి నేరం కాదు. సోనూ సింగ్తో ఉన్నవారిలో ఒక వ్యక్తి జైలు నుంచి పారిపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఓటు వేసే ముందు ఓటర్లను భయపెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ఉంద’ని మేనకా గాంధీ తెలిపారు. #WATCH: Minor argument between Union Minister and BJP's candidate from Sultanpur Maneka Gandhi and Mahagathbandhan candidate Sonu Singh after Gandhi alleged that Singh's supporters were threatening voters. #LokSabhaElections #Phase6 pic.twitter.com/l2Pn1yCRVO — ANI UP (@ANINewsUP) 12 May 2019 -
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
-
వాళ్లతో నా షూ లేసులు విప్పించుకుంటా..!
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్పూర్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు. ప్రతిపక్ష నాయకులతో తన షూ లేసులు విప్పించుకుంటానని వ్యాఖ్యానించారు. తమది నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ అని పరోక్షంగా చెప్పుకున్న వరుణ్ సుల్తాన్పూర్ బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్ని స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్కి స్థానికంగా పేరుంది. వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ రాజకీయ నేత అయివుండీ నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు మండిపడుతన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. వరుణ్ ఫిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. #WATCH BJP LS candidate from Pilibhit, Varun Gandhi in Sultanpur says, "Mai ek hi cheez aapko kehna chahta hoon, kisi se darne ki koi zarurat nahi hai....Mai khada hoon yaha pe, mai Sanjay Gandhi ka ladka hoon, mai in logon se apne jute khulvata hoon" (2.4.19) pic.twitter.com/LnA8kVDivu — ANI UP (@ANINewsUP) May 4, 2019 -
కేంద్రమంత్రికి ఈసీ మొట్టికాయలు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఈ నెల 16న సర్కోటా గ్రామంలో మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని బెదిరింపులకు దిగారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఈసీ ఆమెను రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈసీ మేనకాకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఓటర్లను బెదిరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరించింది. అంతకుముందు కూడా ఆమె నోరు జారారు. (చదవండి : మళ్లీ నోరు జారిన మేనకా!) తురబ్ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె షోకాజ్ నోటీసులు అదుకున్నారు. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మూడు రోజుల చొప్పున, బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారన్న కారణంగా ఈసీ వీరిపై చర్యలు తీసుకుంది. (చదవండి : ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది? -
ఓటర్లను హెచ్చరించిన మేనకా గాంధీ
-
ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ లోక్సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్ జిల్లా వాసులతో మాట్లాడుతూ తనకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఏబీసీడీలుగా విభజించి అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హెచ్చరించిన విషయం తెల్సిందే. అంటే, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘డీ’ కేటగిరీలుగా విభజిస్తానని చెప్పడం. అంతకుముందు వారం ఆమె ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓట్లేస్తేనే ముస్లిం బాగోగులు గురించి చూస్తనని హెచ్చరించడమే కాకుండా, ఏ యాభై, వందో ఓట్లేసి పనుల కోసం తన దగ్గరికొస్తే అప్పుడు వారి పని చెబుతానని కూడా హెచ్చరించారు. ఆమె హెచ్చరికల వెనకనున్న ఉచితానుచితాలను, తప్పొప్పులను ప్రస్తుతానికి పక్కన పెడితే ఏ ప్రాంతంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓట్లు వేశారనే విషయం బయటకు తెలియడం వల్ల ఎంత ముప్పుందో, ఓటు గుట్టును గుట్టుగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎంత అవసరమో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1951లోని ప్రజా ప్రాతినిథ్య చట్టం ఓటును గోప్యంగా ఉంచేందుకు గ్యారంటీగా ‘రహస్య బ్యాలెట్’ విధానాన్ని తీసుకొచ్చింది. రహస్య బ్యాలెట్ నిర్వహించినప్పటికీ గ్రామాల్లో లేదా చిన్న, చిన్న బూతుల్లో ఏ అభ్యర్థికి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుండడంతో, ఓ ప్రాంతం, ఓ బ్లాక్ నుంచి తీసుకొచ్చిన పోలింగ్ డబ్బాలన్నింటిని ఓ చోట చేర్చి వాటిలోని ఓట్లను మిశ్రమం చేసి లెక్కించాలని ప్రజాప్రాతినిధ్య చట్టానికి 1961లో ఓ సవరణ తీసుకొచ్చారు. అంటే ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థికి ఎక్కువ లేదా తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశమే సవరణ లక్ష్యం. ఈ విధానం 2009 వరకు కొనసాగింది. ఈవీఎంల ప్రవేశంతో సీన్ మారింది! 2009 ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు గోప్యత తగ్గుతూ వచ్చింది. సాధారణంగా వెయ్యి నుంచి 1500 ఓటర్లకు ఒక ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కో ఈవీఎంలో 200 నుంచి 600 వరకు ఓట్లు నమోదు అవుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ అధికారి ‘ఫామ్20’ నింపాలి. పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారో, ఒక్కో ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఫామ్లో తెలియజేయాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ప్రాంతం, ఏ పోలింగ్ బూత్, ఏ ఈవీఎంలో అభ్యర్థులకు ఎలా వచ్చాయో తెలిసిపోతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద, పార్టీల వద్ద పోలింగ్ కేంద్రం ప్రాతిపదికన చిరునామాలతో సహా ఓటర్ల జాబితా లభిస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఏ కులస్థులు, ఏ మతస్థులు, పురుషులు లేదా మహిళలు ఎవరికి ఓటు వేశారో సులభంగానే తెలుసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో కుల, మతాల ప్రస్థావన ఉండకపోయినా రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న డేటాలో ఆ వివరాలు ఉంటున్నాయి. చిన్న పోలింగ్ కేంద్రాలలో ఎవరు, ఎవరికి ఓటు వేశారో ఇంకా సులువుగా తెలుసుకోవచ్చు. ఎప్పుడూ బీజేపీకే ఆ ఓటు గుజరాత్లోని గిరి అడవుల్లో బనేజ్ తండాలో ఒకే ఒక ఓటరు ఉన్నారు. భరత్దాస్ దర్శన్దాస్ అనే 55 ఏళ్ల ఆ ఓటరు గత కొన్ని పర్యాయాలుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని మాలేగామ్ పర్వతాల్లో సొకేలా తయాంగ్ అనే 39 ఏళ్ల ఏకైక ఓటరు కోసం ప్రత్యేక పోలీంగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపున ఆమె ఎవరికి ఓటు వేశారో సులభంగా తెలిసి పోతుంది. (చదవండి: ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది) అమిత్ షా ఆదేశాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి వీలుగా కేంద్ర సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న దేశంలోని 22 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలుసుకొని ఓట్లను కోరాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. నేటి డిజిటల్ యుగంలో లబ్ధిదారుల్లో ఓటర్లను గుర్తించడం కష్టం కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘సేవామిత్ర’ యాప్ ద్వారా ఓటర్లలో ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నించిన విషయం తెల్సిందే. తీవ్రమైన పర్యవసనాలు ఏ ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. మేనకా గాంధీ హెచ్చరించినట్లు ఓటు వేయని వారిపై కక్ష సాధించవచ్చు. వారికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందకుండా చేయవచ్చు. ఇంకేమైనా చేయవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదంటూ ఓ ప్రాంతం ఓటర్లను చితక బాదారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పునరావతం కావచ్చు! పరిష్కారం ఏమిటీ ? ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు నుంచే, అంటే 2008 నుంచి ఈవీఎంలను విడివిడిగా కాకుండా కలిపి లెక్కించేందుకు వాటికి ‘టోటలైజర్’ను అనుసంధించాలనే డిమాండ్ వస్తోంది. బూత్ స్థాయిలో 14 ఈవీఎంలకు ఒక టోటలైజర్ను అనుసంధానించవచ్చని కూడా నిపుణులు తేల్చారు. టోటలైజర్ ఓట్ల లెక్కింపును ‘క్లస్టర్ కౌంటింగ్’ అని కూడా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విధానాన్ని అమలుకు ప్రతిపాదించగా 2017లో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఉన్నత స్థాయి కమిటీ ద్వారా తేలిందని సుప్రీం కోర్టు ముందు వాదించింది. అలా తేల్చిన కమిటీ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల కమిటీ. ఇదే విషయమై 2018లో క్లస్టర్ కౌంటింగ్ కోసం ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, విచారించకుండానే కోర్టు దాన్ని కొట్టివేసింది. యాభై శాతం ఓటింగ్ యంత్రాలకు ఓటర్ వెరీఫైయింగ్ (వీవీపీఏటీ) స్లిప్లు ఉండాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామంటూ ఆదివారం నాడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. వాటికన్నా కూడా ఈ ‘క్లస్టర్ కౌంటింగ్’ అత్యవసరం. ఈ ఎన్నికలకు క్లస్టర్ కౌంటింగ్ సాధ్యం కాదు కనుక, ‘ఫొమ్ 20’ నింపకుండానైనా చూడాలి. -
ఆజంఖాన్కు గట్టి షాక్ ఇచ్చిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై వేటు వేసింది. 72గంటలు (మూడు రోజులు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఈసీ నిషేధం విధించింది. అదేవిధంగా ముస్లింల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మేనకా గాంధీపైన ఈసీ చర్యలు తీసుకొంది. 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా ఆమెపై నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా మూడు రోజులు (72 గంటల పాటు), రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది -
మళ్లీ నోరు జారిన మేనకా!
లక్నో : తనకు ఓటు వేస్తేనే సాయం చేస్తానని ముస్లిం ఓటర్లను బెదిరించి వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి మేనకా గాంధీ.. మరోసారి నోరు జారారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏబీసీడీ కేటగిరిలుగా విభజించి.. గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని ప్రకటించారు. బీజేపీ 80 శాతం ఓటర్లు మద్దతుగా ఉండే గ్రామాలను ఏ కేటగిరిగా.. 60 శాతంలోపు ఉండే గ్రామాలను బీ.. 50 శాతంకు తక్కువగా ఉండే ఊర్లను సీ.. 30 శాతం కన్నా తక్కువగా ఉన్న గ్రామాలను డీ కేటగిరిలుగా విభజించారు. గెలిచిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కేటగిరిల మాదిరిగానే ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పిలిబిత్ నియోజకవర్గంలో ఈ కేటగిరి సిస్టమ్ను అమలు చేశామన్నారు. పిలిభిత్ నుంచి ఆరసార్లు గెలుపొందిన మేనకా.. ఈ సారి సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ అయిన ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పిలిబిత్ నుంచి పోటీ చేస్తున్నారు. మస్లిం ఓటర్లను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకావడంతో ఈసీ వివిరణ కోరుతూ ఆమెకు నోటీసులు జారిచేసింది. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలని, తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ మేనకా బ్లాక్ మెయిలింగ్కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
నాకు ఓటేయకపోతే శపిస్తా : బీజేపీ ఎంపీ
ఉన్నావ్ : 2019లో 'మోదీ సునామీ' నేపథ్యంలో 2024లో ఎన్నికలే జరగవని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్.. తాజాగా ఓటర్లను బెదరించారు. తనకు ఓటేయ్యకపోతే శపిస్తానని హెచ్చరించారు. ఉన్నావ్ సిట్టింగ్ ఎంపీ అయిన సాక్షిమహరాజ్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరించారు. తాను ఒక సన్యాసినని, సన్యాసి అడిగింది ఇవ్వకపోతే.. చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందన్నారు. సుఖాలకు దూరమై చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నారు. తానేం ఆస్తులు అడుగటం లేదని, 125 కోట్ల మంది భవిష్యత్తు నిర్ణయించే ఓటును మాత్రమే అడుగుతున్నాన్నారు. కేంద్రమంత్రి మనేకాగాంధీ సైతం ఇలానే ఓటర్లను బెదిరించి అభాసుపాలైనవ విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం ఓటర్లను బెదరించారు. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషాన్నివ్వదని, తనకు ఓటు వేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ.. వారికందే సహాయం ఓటేసేదానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో ఈసీ ఆమెను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. -
మేనకా గాంధీకి షోకాజ్ నోటీసులు!
లక్నో : ముస్లింలు తనకు ఓటేయాలని, గెలిచిన తర్వాత తనతో వారికి పడుతుందంటూ బ్లాక్మెయిలింగ్ ధోరణిలో మాట్లాడిన కేంద్రమంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీకి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుల్తాన్పూర్లోని తురబ్ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా సుల్తాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. కాగా గతంలో ఫిలిబిత్ నుంచి పోటీ చేసిన మేనకా గాంధీ ఈసారి తన కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న సుల్తాన్పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. అదే విధంగా వరుణ్ గాంధీ పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో మేనక మాట్లాడుతూ.. పిలిభిత్ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని పేర్కొన్నారు. ముస్లింలను ఉద్దేశించి.. ‘మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చిపుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Maneka Gandhi threatening voters that she will watch booth wise votes to decide whom to be helped once she wins. Sakshi Maharaj says as a ‘Sanyasi’ he’ll curse people if they won’t vote for him! BJP is a Party with a Difference 😁 pic.twitter.com/sG1X65WJ5s — Ravi Nair (@t_d_h_nair) April 12, 2019 -
నేనే గెలుస్తా..కేంద్రమంత్రి బెదిరింపు - వీడియో వైరల్
సాక్షి, లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతలు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత సాక్షి మహారాజ్ తాను 'సన్యాసి' గనుక తనకు ఓటు వేయని వారిని శపిస్తానని బెదింరించారు. తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇలాంటి బెదిరింపులకు దిగారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనక ఎన్నికల ప్రచారంలో ముస్లింలనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలన్నారు. అలాగే తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు. మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చు పుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. పిలిభిత్ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో ఈ సారి ఎన్నికల్లో కూడా తాను ఎలాగూ గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన మేనకా ..ముస్లింలు కూడా తనకు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు ఓటు వేయకపోతే తన మనసుకు కష్టంగా ఉంటుందనీ, అలాంటి వారికి తానెందుకు పనిచేయాలనే ఆలోచన మనసులో వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంతేకాదు ప్రతీసారి సాయం చేస్తూ పోవడానికి మనమేమైనా మహాత్మాగాంధీ వారసులమా అంటూ కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తుండగా, ఫిలిబిత్ నుంచి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. Maneka Gandhi threatening voters that she will watch booth wise votes to decide whom to be helped once she wins. Sakshi Maharaj says as a ‘Sanyasi’ he’ll curse people if they won’t vote for him! BJP is a Party with a Difference 😁 pic.twitter.com/sG1X65WJ5s — Ravi Nair (@t_d_h_nair) April 12, 2019 -
‘అద్భుతం జరిగితే తప్ప ఆయన ప్రధాని కాలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశానికి ప్రధాని కాలేరని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై స్పందిస్తూ.. ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రచారం వల్ల మా పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్పూర్ల నుంచి పోటీ చేయగా.. ఈ సారి వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో నా కుమారుడు వరుణ్ గాంధీ కూడా విజయం సాధించారు. ఇక ఈ సారి నా వంతు. నేను కూడా తప్పక విజయం సాధిస్తాన’ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సుల్తాన్పూర్ టికెట్ను అమ్ముకున్నారనే అంశంపై స్పందిస్తూ.. ‘ఆమె టికెట్లు అమ్ముకుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో సుల్తాన్పూర్ టికెట్ను ఆమె రూ. 15 కోట్లకు అమ్ముకుంది. అయితే గతంలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడాలంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాతో పాటు ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి వారి గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని’ పేర్కొన్నారు. రాయ్బరేలీ, అమేథీలో ప్రచారం చేయమని పార్టీ తనను కోరలేదని తెలిపారు. ఒకవేళ అలా అడిగితే.. తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. -
రాంపూర్ బరిలో జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరిన సినీ నటి జయప్రదను ఊహించినట్టే యూపీలోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో నిలిపింది. యూపీ, పశ్చిమ బెంగాల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తాజా జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కాన్పూర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని తప్పించి కేంద్ర మంత్రి సత్యదేవ్ పచౌరీకి చోటు కల్పించారు. ఇక కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్పూర్ల నుంచి పోటీ చేయగా వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు. యూపీ మంత్రి రీటా బహుగుణ జోషికి అలహాబాద్ స్ధానం నుంచి పోటీకి నిలిపారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన శ్యామ చరణ్ గుప్తా సమాజ్వాదీ పార్టీలో చేరడంతో జోషీ వైపు బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది. -
ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్
-
45 మంది ఎన్నారై భర్తల పాస్పోర్టులు రద్దు
న్యూఢిల్లీ: భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించినట్లు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్పోర్టులను రద్దుచేసినట్లు వెల్లడించారు. కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాత్సవ నేతృత్వంలో సమీకృత నోడల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్పోర్ట్ చట్టం, 1973 నాటి క్రిమినల్ ప్రొసిజర్లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు. -
చిన్మయి ఫిర్యాదు.. స్పందించిన మేనకా గాంధీ
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి. ‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు) I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6 — Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019 -
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్జీవోలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రధాన కేటాయింపులు ► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు. ► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం. ► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు. ► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల. ► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల. ► అంగన్వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు. ► నేషనల్ క్రెచ్ స్కీమ్కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు. ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు. ► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు. ► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ► మహిళా సాధికారత, సశక్తిత మిషన్కు బడ్జెట్ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల. ‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
‘అవని’ని చంపడంపై అన్ని అనుమానాలే
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో 13 మంది మనుషుల ప్రాణాలను తీసిన ‘అవని’ అనే ఆడపులిని చంపేయడం పట్ల ఇప్పుడు అన్నీ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా జీవ కారుణ్య కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పులిని చంపేశారని ఆరోపిస్తున్నారు. ఏడాది పిల్లలున్న ఆరేళ్ల ‘అవని’ లేదా టీ వన్గా పిలిచే పులి.. మానవ మాంసానికి అలవాటు పడిందన్న కారణంగా దాన్ని చంపేందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతి మంజూరు చేసింది. అయితే ముందుగా ‘ట్రాంక్విలైజ్’ మత్తు కలిగిన చిరు బాణాన్ని ప్రయోగించడం ద్వారా పులిని ప్రాణాలతో నిర్బంధించేందుకు ప్రయత్నించాలని విధిలేని సమయంలోనే చంపాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సూచించింది. వాటిని పాటించలేదన్నది జీవ కారుణ్య కార్యకర్తల ఆరోపణ. పులిని చంపేందుకు షవత్ అనీ ఖాన్ అనే వేటగాడికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా ఆయన తన వెంట తన కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ను వేటకు తీసుకెళ్లారు. పగటిపూట పులిని వేటాడాల్సి ఉండగా రాత్రిపూట వేటాడారు. వేటాడే బృందంలో ప్రభుత్వానికి చెందిన వైద్య నిపుణుడు ఉండాలి. లేరు. పైగా రాచరిక వ్యవస్థలోలాగా పులి మృతదేహంతో వేటగాడు, అధికారులు ఫోజుగా ఫొటో దిగారు. ఈ అంశాలన్నింటినీ ఏకరువు పెట్టిన జీవకారుణ్య కార్యకర్తలు.. అధికారులకు అసలు పులిని సజీవంగా పట్టుకోవాలనే ఉద్దేశం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణాలు పోకుండా పులిని కాపాడి ఉండాల్సిందా ? అని ప్రశ్నించగా, పులి పంజాకు ప్రాణాలు కోల్పోయిన 13 మంది ప్రాణాలను ఎలాగైతే రక్షించి ఉండాల్సిందో, అలాగే పులిని రక్షించి ఉండాల్సిందని వారంటున్నారు. -
#మీటూ ఎఫెక్ట్: రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
మీటూ కేసుల విచారణపై రిటైర్డ్ జడ్జీలతో కమిటీ
-
మీటూ కేసుల విచారణ : రిటైర్డ్ జడ్జీలతో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లోమహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో కేంద్రం స్పందించింది. ఈ తరహా లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు పదవీవిరమణ చేసిన నలుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. మీటూ క్యాంపెయిన్ ద్వారా మహిళలు తమపై జరిగిన నేరాలపై ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని ఇటీవల కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పది, పదిహేనేళ్ల తర్వాత సైతం లైంగిక వేధింపుల ఫిర్యాదులను అనుమతించాలన్నారు. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడ్డారనేది బాధితులకు తెలుస్తుందని అందుకే తాము ఫిర్యాదులకు ఎలాంటి కాలపరిమితి ఉండరాదని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పదేళ్ల కిందట ఓ సినిమా సెట్లో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. -
స్త్రీలోక సంచారం
లైంగిక వేధింపుల బాధిత మహిళలు బయటికి వచ్చి మాట్లాడ్డం ఎంత అవసరమో, వారు చెప్పేది సమాజం వినడం కూడా అంతే అవసరం అని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఎప్పుడో జరిగిన దాని గురించి, ఇప్పుడు మాట్లాడ్డం ఎందుకని బాధిత మహిళలను కొందరు ప్రశ్నించడంపైన కూడా మేనక ఢిల్లీలోని ఒక సభలో స్పందించారు. ‘‘అనుచితమైన స్పర్శను స్త్రీ ఎప్పటికీ మరిచిపోలేదు. తను లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని బయటికి చెబితే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె పరువుకు, ప్రాణాలకు తెగించి నోరు తెరిచిందంటే.. ఆమె పడుతున్న వేదన ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకుని.. ఆమె చెబుతున్నది వినాలి. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుంటే సరిపోదు. వెంటనే నిందితులపై యాక్షన్ తీసుకోవాలి’’ అని మేనక అన్నారు. ‘మీ టూ’ ఉద్యమం ఇండియాలోనూ మొదలైనందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నానాపటేకర్ వేధించిన సంగతి పదేళ్ల క్రితం నాటిదే అయినా బాధితురాలు తనుశ్రీ దత్తా ఇప్పటికైనా ఆ విషయాన్ని బహిర్గతం చెయ్యడం అభినందనీయం అని మేనక సమర్థించారు. తనుశ్రీ దత్తాకు మద్దతు తెలిపారు. సగటు కన్నా దిగువనున్న జీవితాలను సౌకర్యవంతం చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఇన్ఫోసిస్ కంపెనీ ‘సి.ఎస్.ఆర్’ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగమైన ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్’.. ‘ఆరోహణ్’ అనే అవార్డును ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యురాలైన సుధామూర్తి కోటీ యాభై లక్షల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, సాధికారతతో పాటు మొత్తం ఆరు కేటగిరీలలో (ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, అభాగ్యరక్షణ; విద్య, క్రీడలు, నిరంతరత) ఈ అవార్డులను ఇస్తారు. లైంగిక వేధింపులపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క ‘మీ టూ’ ఆరోపణపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ నిర్ణయించింది. ఈ విషయమై కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎవరైతే లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో.. వాళ్ల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ‘‘అంతేకాదు.. బాధితురాలికి ఫోన్ చేసి, స్వయంగా ఆమెను కలిసి స్టేట్మెంట్ తీసుకోబోతున్నాం’’ అని రేఖ వెల్లడించారు. ఇదిలా ఉండగా, పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్లో తనను లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదుపై పది రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ నటుడు నానా పటేకర్కు నోటీసులు పంపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ‘ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ’ (ఎం.ఇ.పి.) ప్రకటించింది. మానవహక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత సాధన, వక్ఫ్ ఆస్తి వివాదాల పరిష్కారం తమ పార్టీ అజెండాలోని ముఖ్యాంశాలని పార్టీ అధినేత్రి డాక్టర్ నవేరా షేక్ తెలిపారు. 2019లో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో సైతం ఎం.ఐ.పి. పోటీ చేస్తుందని చెప్పారు. బ్రెజీలియన్ నటి, మోడల్ జిసెల్ బుంద్చెన్.. తన స్తన్యంలో ఔషధ గుణాలు ఉన్నాయని చేసిన ఒక ప్రకటన.. తల్లిపాల విశిష్టతపై ఆరోగ్యకరమైన చర్చకు దోహదపడింది. జిసెల్కు బెంజమిన్ బ్రాడీ అనే 8 ఏళ్ల కొడుకు, వివియన్ లేక్ బ్రాడీ అనే కూతురు ఉన్నారు. వీళ్లిద్దరూ పాలు తాగే వయసులో వారికి వచ్చే చిన్న చిన్న కంటి, ముక్కు ఎలర్జీలకు కూడా తన పాల చుక్కల్ని వేసేదాన్నని, అవి వారికి చక్కటి ఔషధంగా పని చేసేవని జిసెల్ తెలిపారు. -
‘ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంటాడు కదా’
హాలీవుడ్ సినీ దిగ్గజం హార్వీ వీన్స్టీన్ బాగోతం బట్టబయలైన నాటి నుంచి పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ధైర్యంగా గళం విప్పుతున్నారు. సెలబ్రిటీలు మొదలు ప్రతీ ఒక్కరూ ‘మీటూ’ అంటూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ.. ప్రముఖ నటుడు నానా పటేకర్ నుంచి వేధింపుల గురించి నోరు విప్పడంతో భారత్లోనూ మీటూ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. నాణేనికి రెండు వైపులు ఉన్నట్లుగానే కొంతమంది తనుశ్రీకి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం అవన్నీ అవాస్తవాలంటూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. అంతటితో ఆగకుండా పదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టడం ఎందుకు, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ నిందిస్తున్నారు కూడా. ఇవన్నీ కొంతమంది అభిప్రాయాలు మాత్రమే. కేవలం నిబంధనల కారణంగానే..! ఇవన్నీ కాసేపు పక్కన పెడితే...‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(సింటా) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. కఠినంగా శిక్షిస్తాం! ఈ క్రమంలో తనుశ్రీకి మద్దతుగా నిలిచిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా మీటూ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో... ఘటన జరిగిన మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాలనే నిబంధన కారణంగా చాలా మందికి ఫిర్యాదు చేసే అవకాశం లభించడం లేదు. ఈ విషయంపై స్పందించిన మేనకా గాంధీ... పని ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు.. ఘటన జరిగిన పది నుంచి పదిహేనేళ్ల తర్వాత కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు సవరించే విధంగా న్యాయశాఖకు లేఖ రాశామని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘మిమ్మల్ని వేధించిన వ్యక్తి ఎవరో జీవితకాలం గుర్తు ఉంటాడు కదా. అందుకే ఫిర్యాదు చేసే విషయంలో నిబంధనలు సరిచేయాలంటూ న్యాయశాఖకు లేఖ రాశాం. వేధింపులు ఎదురైన పదేళ్ల తర్వాత కూడా మీ ఫిర్యాదు స్వీకరిస్తారు. కాలం గడుస్తున్నంత మాత్రాన ఆ చేదు అనుభవాల తాలూకు ఙ్ఞాపకాలు చెరిగిపోవు. అందుకే ఇకపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని’ మేనకా గాంధీ స్పష్టం చేశారు. అలాగే మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని, బాధితులు తమ బాధను పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకూడదని పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో ఉద్యమం పట్టు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. కాగా మహిళల సంఖ్యకు అనుగుణంగా ప్రతీ సంస్థలోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అలాగే వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని మూడేళ్ల లోపు సెల్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే 18 ఏళ్ల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిమితిని 30 ఏళ్లకు పెంచాల్సి ఉందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. -
తనుశ్రీకి మద్దతుగా నిలిచిన మేనకాగాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారన్నైనా సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. భారత్లో కూడా ‘మీటూ’ తరహా ఉద్యమం రావాలని ఆకాక్షించారు. మహిళల భద్రతపట్ల కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని వెల్లడించారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ‘షీ బాక్స్’ ఫిర్యాదుల వ్యవస్థ గురించి తెలిపారు. ఇకపై మహిళలు తమపై జరిగే ఏ చిన్న వేధింపుల వ్యవహారం గురించైనా క్షణాల్లో తమ దృష్టికి తీసుకురావొచ్చని అన్నారు. షీ బాక్స్ ఆన్లైన్ వేదిక ద్వారా వేధింపులకు గురైన మహిళలు క్షణాల్లో ఫిర్యాదు చేసి రక్షణ పొందొచ్చని వివరించారు. ఇదిలా ఉండగా.. మన దేశంలో కూడా ‘మీటూ’ వంటి ఉద్యమం మొదలవ్వాలనే మేనకా గాంధీ పిలుపపై తనుశ్రీ స్పందించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు జరిగిన అన్యాయాలపై నోరు విప్పడంతో కెరీర్ అంధకారంలో పడింది. అయినా, దేనికీ వెరవకుండా నా బాధను ప్రపంచానికి తెలియజేశా. కానీ, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ‘పెద్ద మనుషులు’ దర్జాగా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న దేశంలో మీటూ వంటి ఉద్యమాలు పురుడు పోసుకోలేవని అన్నారు. పెరిగిన మద్దతు.. 2008లో ‘హర్న్ ఓకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డ్యాన్స్ చేసే క్రమంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తీవ్ర విమర్శలు చేయడం సంచలనం రేపింది. నానా వేధింపులపై నోరు విప్పినందుకే తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2010 వచ్చిన ‘జగ్ ముంద్రా అపార్ట్మెంట్’లో తనుశ్రీ చివరగా నటించారు. దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై కూడా తనుశ్రీ ఆరోపణలు చేశారు. కాగా, బాలీవుడ్ ప్రముఖులు ఫరాఖాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, అనురాగ్ కశ్యప్, రేణుక షహానే తను శ్రీకి మద్దతుగా నిలిచారు. -
కృత్రిమ మాంసం తక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మాంసం తయారీ తక్షణ అవసరం అని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకట్రెండేళ్లలో ఈ మాంసం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నామని అధిక శాతం ప్రజలు పలు సర్వేల్లో తెలిపినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో శుక్రవారం ‘ది ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్’పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశుపోషణకు ఫుల్స్టాప్ పెట్టి కృత్రిమ మాంసం ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన తరుణం ఇదేనన్నారు. పశుపోషణ ఆపేస్తే నాలుగేళ్లలో భూతాపాన్ని అరికట్టొచ్చని చెప్పారు. భూతాపానికి మీథేన్ కూడా ఓ కారణమని, పశుపోషణ వల్ల మీథేన్ ఉద్గారాల తీవ్రత పెరుగుతోందని చెప్పారు. వరిసాగు, బొగ్గు మండించడం ద్వారా కూడా మీథేన్ వెలువడుతుందని పేర్కొన్నారు. అయితే కోళ్లు, గొర్రెలు, మేకల వంటి పశువుల పెంపకం ఆపేస్తే మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం కాకముందే పశువుల పెంపకాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జంతువుల నుంచి కొన్ని కణాలను తీసుకుని బయోరియాక్టర్లలో వృద్ధి చేయడం ద్వారా తయారయ్యే ఈ మాంసం ప్రకృతి వనరులెన్నింటినో ఆదా చేస్తుందని తెలిపారు. మాంసంలో చేరుతున్న కొన్ని రకాల వైరస్ల కారణంగా కేన్సర్లు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. కృత్రిమ మాంసాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు 53 శాతం మంది తెలిపినట్లు ఫొర్నెలిటిక్స్ సంస్థ సర్వే చెబుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం లక్షల సంఖ్యలో పశువులను పంపిణీ చేస్తున్న విషయంపై మాట్లాడుతూ.. గతంలో ఏపీలోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారని ఇంటికో ఆవు పంపిణీ చేస్తే అందులో 90 శాతం కబేళాలలకు తరలిపోయాయని గుర్తు చేశారు. మొక్కల నుంచి ఇలా..! ప్రోటీన్లు అధికంగా ఉండే మొక్కలు, వృక్షాల ఉత్పత్తులను తీసుకుని ల్యాబుల్లో మాంసంగా తయారు చేస్తారు. చూసేందుకే కాదు.. తినేందుకు కూడా అచ్చు మాంసంలాగే ఉంటుంది. జంతువుల నుంచి ఎలా? ఆరోగ్యవంతమైన జంతువులను సరైన మంచి పరిసరాల్లో పెంచి వాటి నుంచి కొన్ని కణాలను తీసుకుని ల్యాబ్ల్లో అభివృద్ధి చేసి, దాని నుంచి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. కృత్రిమ మాంసం తినడం వల్ల ఎలాంటి వ్యాధుల రావని, పైగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ‘కృత్రిమ మాంసం ఉత్పత్తి విషయంలో పరిశోధనలను ముమ్మరం చేసి, వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నం చేస్తోంది. ఈ రంగంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ మొక్కల ఆధారిత మాంసం, కృత్రిమ మాంసం ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నాం.’ –వరుణ్ దేశ్పాండే, గుడ్ఫుడ్ ఇన్స్టిట్యూట్ ‘కృత్రిమ మాంసం ఎలా తయారు చేయొచ్చో శాస్త్రవేత్తలకు తెలుసు. జంతువుల నుంచి కాకుండా మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుంటుంది. కొబ్బరి నీళ్లు, తేనె వంటి వాటి పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి ఫలిస్తే కృత్రిమ మాంసంలో కణాలు మినహా మరే ఇతర జంతు సంబంధిత పదార్థాలు ఉండవు’ – పవన్ కె.ధర్, కృత్రిమ బయాలజీ విభాగం, జేన్యూ, ఢిల్లీ ‘కృత్రిమ మాంసం తయారీని వాణిజ్య స్థాయిలో అభివృద్ధి చేయడం ఎలా అన్నది ఒక సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్లో కృత్రిమ మాంసం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం’ – రాకేశ్ మిశ్రా, డైరెక్టర్ సీసీఎంబీ, హైదరాబాద్ ‘పశుపోషణ కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంత ఇంత కాదు. ఈ నేపథ్యంలో జంతువులను చంపాల్సిన అవసరం లేకుండా కావాల్సిన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీలను ప్రొత్సహించాల్సి ఉంది.’ – సౌమ్యారెడ్డి, జంతు ప్రేమికురాలు -
షెల్టర్ షేమ్పై మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ముజఫర్పూర్, డియోరియా షెల్టర్ హోంలలో చిన్నారులపై అకృత్యాల ఘటనలు కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆమె ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా షెల్టర్ హోంలలో జరుగుతున్న దారుణ ఘటనలు మరిన్ని వెలుగులోకి రావచ్చన్నారు. సంవత్సరాల తరబడి వీటిని మనం పట్టించుకోకుండా వదిలివేయడంతో ఇలాంటి దారుణ ఉదంతాలు చాలా ఉంటాయని తనకు తెలుసన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని షెల్టర్ హోంలను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని ఆమె కోరారు. వారి నియోజకవర్గాల్లో వసతి గృహాల పరిస్థితిపై తనకు నివేదిక అందిస్తే తక్షణమే చర్యలు చేపడతానన్నారు. వేయి మంది చిన్నారులు, వేయి మంది మహిళలతో కూడిన అతిపెద్ద హోంలను నిర్మించి, మహిళలే సిబ్బంగిగా వీటిని నడపడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచించారు. దీనికి అవసరమైన నిధులను తాను మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. షెల్టర్ హోంలలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. -
టాన్స్జెండర్స్కు కేంద్రమంత్రి క్షమాపణలు
న్యూఢిల్లీ : కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ టాన్స్జెండర్స్కు క్షమాపణలు తెలిపారు. లోక్సభలో తప్పుగా సంభోదించినందుకు మన్నించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతూ.. ఆమె ట్రాన్స్జెండర్స్ను అభ్యతకరమైన పదంతో సంభోదించారు. దీంతో సభలో నవ్వులు పూసాయి. ఆమె వ్యాఖ్యలపై ట్రాన్స్జెండర్స్ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన తప్పును గుర్తించారు. తను కావాలని అలా చేయలేదని, క్షమించాలని కోరుతూ ట్వీట్ చేశారు. ‘అక్రమ రవాణా నిరోధక బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతూ.. నేను ట్రాన్స్జెండర్స్పై వాడిన పదానికి చింతిస్తున్నాను. నేను కావాలని అలా చేయలేదు. అనాలోచితంగా మాట్లాడినందుకు నాపై నాకే అసహ్యం వేస్తుంది. నిజానికి ట్రాన్స్జెండర్స్ను అధికారికంగా ఏమని పిలుస్తారో నాకు తెలియదు. భవిష్యత్తులో మళ్లీ మీ మనసులను నొప్పించను. ట్రాన్స్జెండర్స్ అనే పిలుస్తాను. క్షమించండి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మంత్రితో పాటు ఎంపీలు కూడా క్షమాపణలు తెలియజేయాలని టాన్స్జెండర్ సంఘం నేత మీరా సంఘమిత్ర డిమాండ్ చేశారు. I was not aware of the official terminology for the transgender community. In future, all official communication will use the term TGs. I would like to assure that the #AntiTraffickingBill2018 is gender neutral and provides protection to the aggrieved. — Maneka Gandhi (@Manekagandhibjp) July 30, 2018 -
ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న ఎనిమిది మంది ఎన్నారై భర్తల పాస్పోర్టులను రద్దు చేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు.. ఎన్నారై మోసాలను అరికట్టేందుకు నియమించిన కమిటీకి ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు అందినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పాస్పోర్టులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సదరు వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం..! ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏడు రోజుల్లోగా పెళ్లి ధ్రువీకరణ పత్రం అందజేయకపోతే సదరు జంటకు వీసా, పాస్పోర్టు జారీ చేసేందుకు నిరాకరిస్తామని సంబంధిత శాఖ పేర్కొంది. అదే విధంగా ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. -
ఎన్నారై పెళ్లిళ్లు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం తెలిపారు. దీనికి మందు ఎన్నారై పెళ్లి రిజిస్టర్కు నిర్దిష్ట కాల పరిమితి లేదు. అయితే, ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. నిందితులపై మోపిన నేరం నిరూపించడానికి, వారిని విదేశాల నుంచి రప్పించడానికి న్యాయ పరమైన సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. 48 గంటల్లో పెళ్లి రిజిస్టర్ చేయించడం ద్వారా కేంద్రం డాటాబేస్లోకి ఎన్నారై వివరాలు చేరుతాయి. తద్వారా భారత్కి వచ్చివెళ్లే ఎన్నారై కదలికలపై దృష్టి సారించవచ్చని మేనక తెలిపారు. వారిపై నిఘా ఉంచడం ద్వారా ఏదైనా నేరానికి పాల్పడి దేశం నుంచి పారిపోకుండా ఎన్నారైలను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు. వీసా, పాస్పోర్టును రద్దు చేసి నేర విచారణ చేపట్టొచ్చని వివరించారు. కాగా, తాజా నిర్ణయానికి ముందు ఎన్నారై పెళ్లిని 30 రోజులలోపు రిజిస్టర్ చేసేలా నిబంధన రూపొందించాలని ‘లా కమిషన్’ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు సూచించడం గమనార్హం. -
మీరిలా చేయడం సబబేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగి తనను ఆరేళ్ల పాటు లైంగికంగా వేధించారని, తన ఫిర్యాదుపై సంస్థ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎయిర్హోస్టెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ(డబ్ల్యూసీడీ) తప్పిదం వల్ల లైంగిక దాడికి గురైన ఆ ఎయిర్ హోస్టెస్ పేరు బహిర్గతమైంది. సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన డబ్ల్యూసీడీ.. ‘ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న మిస్***** మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీని కలిశారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం- 2013ను అనుసరించి ఆమె తన ఫిర్యాదును నమోదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించాల్సిందిగా మేనకా గాంధీ పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు, ఎయిర్ ఇండియా అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల(జూన్) చివరిలోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా మేనకా గాంధీ ఆదేశించారంటూ’ నోట్ను విడుదల చేసింది. అయితే వెంటనే తప్పును తెలుసుకున్న డబ్ల్యూసీడీ.. బాధితురాలి పేరును తొలగించింది. అత్యాచార బాధితులు, అత్యాచారానికి గురైన మైనర్ల పేర్లు, ఫొటోలు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటన బాధితురాలి పేరు, ఫొటోను బహిర్గతం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది కూడా. అయితే ఇప్పుడు ఏకంగా మహిళా సంక్షేమ శాఖే బాధితురాలి పేరు బహిర్గతం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘మరణదండనే వారికి సరైన శిక్ష’
న్యూఢిల్లీ : కథువా అత్యాచార ఉదతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జమ్మూకశ్మీర్లోని కథువా ప్రాంతానికి చెందిన అసిఫా(8)కి మాదకద్రవ్యాలు ఇచ్చి నాలుగు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బాలలపై అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. ఈ మేరకు బాలలపై లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం(పీఓఎస్సీఓ)ను సవరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి మరణ దండన విధించాలనే నిబంధనను నోట్గా కేబినేట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను మేనకా గాంధీ విడుదల చేశారు. కథువా లాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ దండనే సరైన శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. -
గంజాయిని చట్టబద్ధం చేయాలి: మేనకాగాంధీ
న్యూఢిల్లీ: మత్తు పదార్థంగా భావించే గంజాయి వినియోగాన్ని వైద్య అవసరాల కోసం చట్టబద్ధం చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ సూచించారు. మాదక ద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికాలో ఇలాంటి పద్ధతులనే అవలంభిస్తున్న సంగతిని ప్రస్తావించారు. నేషనల్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ విధానంపై కేబినెట్ నోట్ను అధ్యయనం చేస్తున్న మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ సూచన చేశారు. అమెరికాలో మాదిరిగానే భారత్లోనూ గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. -
ఎన్నారై ఉదంతంపై మంత్రిత్వశాఖ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్లో ఎన్నారై మహిళకు ఎదురైన చేదు అనుభవంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకుంది. ఈవ్యవహారంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రి మేనకా గాంధీ సోషల్మీడియాలో స్పందించారు. కేవలం సింగిల్ మహిళ అయిన కారణంగా హోటల్ లోకి ఎంట్రీ తిరస్కరించడం తీవ్రమైన విషయమని కేంద్ర మంత్రి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వివక్షాపూరిత విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కోరినట్టు ట్వీట్ చేశారు. కాగా సింగిల్ విమెన్ అన్నకారణంతో హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎన్నారై నుపుర్ సారస్వత్కు ఎర్రగడ్డలోని హోటల్ దక్కన్ ప్రవేశాన్ని నిరాకరించింది. దీంతో తనకు ఎదురైన అవమానం పై సోషల్మీడియాలో వెల్లడించడంతో దుమారం రేగింది. నగరంలోని హోటళ్లు అనుసరిస్తున్న పాలసీపై తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. It’s a matter of serious concern that a woman is denied entry into a hotel only because she was a ‘single’ woman. https://t.co/8a1rENIQOb /1 — Maneka Gandhi (@Manekagandhibjp) June 27, 2017 My Ministry has sought a report from the state government on such a discriminatory policy of the hotel. 2/2 — Maneka Gandhi (@Manekagandhibjp) June 27, 2017 -
కోలుకుంటున్న మేనకా గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ (60) మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చాలా బలహీనంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఉదరంలో ఉన్న రాయిని తొలగించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జూన్ 2 న మేనకా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తర ప్రదేశ్లోని పిలిభిత్లో పర్యటిస్తుండగా హఠాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నారు. స్కానింగ్ చేయగా ఆమె పిత్తాశయం (గాల్బ్లాడర్)లో ఓ రాయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసి రాయిని తొలగించినట్లు వైద్యులు వివరించారు. -
కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత
-
కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత
లక్నో : కేంద్రమంత్రి మేనకా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. యూపీ పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురి కావడంలో పిలిబిత్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మేనకా గాంధీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు సమాచారం. కాగా మేనకా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల ఆస్పత్రిలో చేరిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఏర్పడ్డాయని, దీంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్పై మేనక సంచలన వ్యాఖ్యలు: దుమారం
ముంబై: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. దీంతో దుమారం రేగింది. శుక్రవారం గోవా ఫెస్ట్కు హాజరైన ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాల పెరుగుదలకు సినిమాలే కారణమన్నారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రేమ ఈవ్ టీజింగ్ తో మొదలుతుందని పేర్కొన్నారు. బాలీవుడ్ అయినా, ప్రాంతీయ భాషా చిత్రంలోనైనా దీనికి అతీతం కాదన్నారు. అమ్మాయి చుట్టూ కొంతమంది చేరి గుమిగూడి, అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం ఆ తర్వాత ప్రేమలో పడుతూ ఉండటం చూపిస్తున్నారని విమర్శించారు. తద్వారా మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లోపెరుగుతోందన్నారు. అలా కాకుండా మహిళల ప్రాత చిత్రణ గౌరవప్రదంగా ఉండేలా చూడాలని బాలీవుడ్ని కోరారు. చేతకానిపురుషులే మహిళలపై హింసకి దారితీస్తుందనీ, పనిలో వైఫ్యల్యంతో పురుషులు మహిళలపై అసహనం ప్రదర్శిస్తారని,అరుస్తారని పేర్కొన్నారు. దీంతో బాలీవుడ్ తీవ్రంగా స్పందిస్తోంది. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చిత్రనిర్మాత అశోక్ పండిట్ చూడొద్దని కోరారు సినీ పరిశ్రమపై విమర్శలకు దిగడం ఫ్యాషన్గా మారిపోయిందని విమర్శించారు. శ్యాంబెనగల్ నుంచిమొందలు మాధుర భండార్కర్ దాకా చాలా అగ్రదర్శకులు విమెన్ ఓరియెంటెడ్ సినిమాలను తీశారని గుర్తుచేశారు. -
సినిమాల వల్ల నేరాలు పెరుగుతున్నాయి
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి సినిమాలే కారణమని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ విమర్శించారు. సినిమాల్లో మహిళలను ఉన్నతంగా, గౌరవంగా చూపించాలని సినీ పరిశ్రమ ప్రముఖులను ఆమె కోరారు. 'సినిమాలలో మహిళల పట్ల మగవాళ్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. సినిమాలను గమనిస్తే చాలా వరకు ఈవ్ టీజింగ్తో రొమాన్స్ మొదలవుతుంది. హీరో, అతని స్నేహితులు ఓ అమ్మాయి చుట్టూ చేరి ఆటపట్టిస్తారు. ఆమెను ఏడిపించడం, అనుచితంగా తాకడం వంటి పనులు హీరో చేస్తాడు. తర్వాత ఆమె నిదానంగా ప్రేమలో పడుతుంది. బాలీవుడ్, ప్రాంతీయ భాషా సినిమాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. మహిళలను కించపరిచేలా, అమర్యాదగా చూపిస్తారు. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల యువకులు అమ్మాయిల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు. మహిళలపై హింస పెరగడానికి ఇలాంటి సినిమాలే కారణం' అని మేనకా గాంధీ అన్నారు. -
‘కేజ్రీవాల్.. మీరు మెన్స్ డే స్టార్ట్ చేయండి’
న్యూఢిల్లీ: పురుషులకు కూడా ప్రత్యేకంగా ఒక రోజును అంకితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నో కొత్తకొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో పురుషుల దినోత్సవం పాటించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన రోజు. అయితే, పురుషులకు కూడా ఏడాదిలో ఒక ప్రత్యేకమైన రోజు అంటూ అంకింతం చేస్తే న్యాయం చేసినట్లవుతుందని నేను భావిస్తాను’ అంటూ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఢిల్లీలోని మహిళా కమిషన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లోని ఐయామ్ ఈక్వల్ అనే పేరుతో జరుగుతున్న ప్రచారంలో దేశంలోని మహిళలంతా చేరాలని విజ్ఞప్తి చేశారు. ‘మనమంతా ఒక్కటే అని చెప్పడం ప్రతి ఒక్కరూ ప్రారంభించాలి. ఏదో ఒక రోజు సమానత్వం వస్తుందని నేను బలంగా చెప్పగలను’ అని అన్నారు. అంతకుముందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేజ్రీవాల్ ట్విట్టర్లో పలు ట్వీట్లు చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిని అన్ఫాలో చేయాలని, మహిళలపై బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకోసం ఒక రోజు మాత్రమే జరుపుకుంటుంటే మిగితా 364 రోజులు పురుషుల దినోత్సవాల్లాగా కనిపిస్తోందని, మొత్తం 365 రోజులు కూడా మహిళలకే ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల ఏబీవీపీ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల మధ్య రేగిన వివాదం నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేసినట్లు పలువురు విమర్శించడంతో కేజ్రీవాల్కు ప్రత్యేకంగా మెన్స్ డే జరపాలని సూచించినట్లు తెలుస్తోంది. -
మా వాడు చాలా బిజీగా ఉన్నాడు, అందుకే..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని సుల్తానాపూర్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంపై ఆయన తల్లి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివరణ ఇచ్చారు. తన కొడుకు తీరికలేకుండా ఉన్నారని, అందుకే ఎన్నికల ప్రచారం చేయలేదని చెప్పారు. వరుణ్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ, పలు యూనివర్శిటీలను సందర్శిస్తూ, విద్యార్థులను కలుస్తున్నాడని తెలిపారు. యూపీ నుంచే లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనక కూడా ఎన్నికల ప్రచారంలో తక్కువగా పాల్గొన్నారు. సోమవారంతో యూపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి, ఏడో దశ ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నెల 11న కౌంటింగ్ జరగనుంది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా చాలామంది అగ్రనేతలు ప్రచారం చేశారు. మోదీ 23 ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. కాగా వరుణ్ ఎక్కడా కనిపించలేదు. గతేడాది రక్షణ వ్యవహారాల రహస్యాలను తెలుసుకునేందుకు వరుణ్ను ట్రాప్ చేశారని ఆరోపణలు వచ్చినపుడు బీజేపీ అండగా నిలవలేదని ఆయన కినుక వహించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. బీజేపీ తొలుత విడుదల చేసిన ప్రచారకర్తల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే రెబెల్స్గా బరిలోకి దిగుతామని వరుణ్ మద్దతుదారులు హెచ్చరించడంతో ఆయన పేరును చేర్చారు. యూపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని వరుణ్ ఆశించినా.. పార్టీ పెద్దలు ఆయనను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని మేనక గాంధీ చెప్పారు. -
'సీఎంను కూడా ఆమె లెక్కచేయడం లేదు'
తిరువనంతపురం: కేంద్ర మంత్రి మేనకా గాంధీ 'మోసకారి' అంటూ కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ చెన్నితల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో వీధి కుక్కలను చంపొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అని అసెంబ్లీలో ప్రశ్నించారు. గురువారం ఆయన శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ... 'మేనకా గాంధీ మోసకారి. ఆమె గురించి ఆమె ఏమనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కూడా ఆమె లెక్కచేయడం లేదు. ఈ అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమ'ని రమేశ్ అన్నారు. ఇటీవల కాలంలో కేరళలో వీధి కుక్క బెడద ఎక్కువైంది. తిరువనంతపురం జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలిని కుక్కులు పిక్కుతిన్నాయి. దీంతో కాంగ్రెస్(ఎం) యువజన నాయకులు పెద్ద సంఖ్యలో వీధి కుక్కలను పట్టుకుని విచక్షణారహితంగా చంపారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ దీన్ని ఖండించారు. వీధి కుక్కలను చంపిన వారిపై అసాంఘిక కార్యకలాపాల వ్యతిరేక చట్టం(కాపా) ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు. మూగజీవాలను చంపడానికి ఉసిగొల్పిన వారికి మరణశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ వ్యాఖ్యలపై బుధవారం కేరళ అసెంబ్లీలో దుమారం రేగింది. ఆమెను వ్యాఖ్యలను అధికార, విపక్ష సభ్యులు ఖండించారు. -
ఔరా! ఎస్ఐని ఊర కుక్క కరిచిందని..!
అసలే పోలీసోళ్లకు కోపం ఎక్కువ అంటారు. అందుకే ఓ సబ్ ఇన్స్పెక్టర్ తనను కరిచిన ఊరకుక్కను తుపాకీతో కాల్చిపారేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని లక్నోలోని చిన్హాత్ పోలీసు స్టేషన్ అధికారిని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు. చిన్హాత్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర ప్రతాప్ నివసిస్తున్నారు. డ్యూటీలో భాగంగా బరాబంకీ వెళుతుండగా ఓ ఊరకుక్క ఆయనను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర ప్రతాప్ వెంటనే ఇంటికి వెళ్లి లైసెన్స్డ్ రైఫిల్ తీసుకొని వచ్చి ఆ కుక్కను అక్కడికక్కడే కాల్చిపారేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సదరు ఎస్సైపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో జంతు హక్కుల కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిందితుడైన ఎస్సై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు మెంబరైన కమ్నా పాండే ఈ అంశాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారుల్ని ఆమె ఆదేశించారు. మరోవైపు ఎస్సై తుపాకీతో కాల్చిన కుక్క పరిస్థితి ఏమైందనేది తెలియకుండా ఉంది. కాల్పుల తర్వాత ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనకా
న్యూఢిల్లీ: వీధి కుక్కలను నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణ ఉద్యమకారిణి, కేంద్రమంత్రి మేనకాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కుక్కలను చంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదిగా, అశాస్త్రీయమైనదిగా పేర్కొన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుక్కులను నిర్మూలించడానికి వాటిని చంపడమే పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నగరంలో 5,00,000 ల కుక్కులుండేవని స్టెరిలైజేషన్ తర్వాత వాటి సంఖ్య 70 వేలకు తగ్గిందన్నారు. -
పశువులకూ కు.ని. కేంద్రం
డెహ్రాడూన్: వీధి కుక్కల సంతతిని నిరోధించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలను అనుసరిస్తూ దేశంలోనే మొట్టమొదటి పశు సంతతి నిరోధక కేంద్రం ఏర్పాటయింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పట్టణంలో ఏర్పాటుచేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్(ఏబీసీ)ను కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ శనివారం ప్రారంభించారు. దాదాపు ఎకరం స్థలంలో నిర్మించిన ఈ కేంద్రంలో వీధి కుక్కలకే కాక పెంపుడు కుక్కలకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నట్లు, ఇందుకోసం అన్ని వసతులతో కూడిన 72 దొడ్లను నిర్మించినట్లు మంత్రి మనేకా పేర్కొన్నారు. ఈ తరహా కేంద్రం దేశంలో ఇదే మొదటిదని, పశు సంతతి వ్యాప్తి నిరోధమేకాక కుక్క కాటు వల్ల సోకే రెబీస్ వ్యాధి నిరోధక కేంద్రంగానూ ఏబీసీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం-1960ని అనుసరించి ఏర్పాటుచేసే ఇలాంటి కేంద్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. -
పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరమా!
న్యూఢిల్లీ: 'నా పేరు ప్రియాంక గుప్తా. చిత్రహింసలు పెట్టే భర్త నుంచి దూరంగా ఉంటోన్న నేను.. ఒక్కగానొక్క బిడ్డ (గరీమా)ను ఉన్నత చదువులు చదివించా. ఇప్పుడు ఆమెకు మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గరీమా పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్ లో తండ్రి పేరు రాయాల్సిన చోట ఖాళీ వదిలేసింది. అధికారులు మాత్రం తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని అంటున్నారు. విడిపోయినా, చనిపోయినా తండ్రి పేరు రాయాల్సిందేనంటున్నారు. మేడం.. నన్ను, నా కూతురిని దారుణంగా హింసించిన ఆ వ్యక్తి పేరును వాడుకోవడం కాదుకదా కనీసం పలకడం కూడా మాకు ఇష్టం లేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నెన్నో మంచి తీర్పులు చెప్పాయి. మా సమస్యపైనా అలాంటి పరిష్కారాన్నే కోరుతున్నాం. మా అభ్యర్థనను మన్నించి పాస్ పోర్టులో తండ్రి పేరు తప్పనిసరనే నిబంధనను సవరించగలరు'.. ఇది ఢిల్లీకి చెందిన ప్రియాంక అనే మహిళ కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీకి రాసిన లేఖలోని సారాంశం. దాదాపు 45 వేల మంది ఈ లేఖను సమర్థించడంతో మంత్రి మనేకా గాంధీ రంగంలోకి దిగారు. పౌరుల పాస్ పోర్టుకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న తండ్రి పేరు నిబంధనను మార్చాల్సిందిగా మనేకా శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఒక లేఖ రాశారు. దేశంలో సింగిల్ పేరెంట్స్ సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని మనేకా అభిప్రాయపడ్డారు. ఆమె అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రెండు నెలల కిందట ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పు చెబుతూ.. దరఖాస్తు దారులను ఇష్టం లేకపోతే పాస్ పోర్టులో తండ్రి పేరు పేర్కొనాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారం లభిస్తుందని మనేకా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒబామాకు మేనకాగాంధీ లేఖ
నిషిక్: పర్యావరణ ఉద్యమకారిని, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. వినోదం కోసం స్పెయిన్ లో నిర్వహించే (సాన్ ఫర్మినా ఫెస్టివల్) ఎద్దుల పరుగుపందెం పోటీలకు హాజరు కాకూడదని ఆయనను కోరారు.ఈ నెలలో స్పెయిన్ లో తన పర్యటన సమయంలో పంప్లోనాలోని సాన్ ఫర్మిన్ లో నిర్వహించే ఉత్సవానికి ఒబామా హాజరుకానున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖను రాశారు. ఇలాంటి ఉత్సవాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ ఉత్సవంలో 48 ఎద్దులను ఉపయోగిస్తారని గాయాలతో ఇవి మరణిస్తాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. జంతువుల పట్ల మానవత్వాన్ని చూపాలని, స్పెయిన్ లోని 100 నగరాల్లో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. -
సిటీ హంటర్కు బెదిరింపులు
కేంద్ర మంత్రులు మేనకాగాంధీ - ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన హైదరబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చింది. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న ఓ జంతు ప్రేమికురాలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా తనను తీవ్రస్థాయిలో బెదిరించారని అలీ ఖాన్ ఆరోపించారు. దీనిపై ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలాతో పాటు ఆ నగర పోలీసు కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీహార్ రాష్ట్రంలోని మకామా ప్రాంతంలో అడవి నుంచి బయటకు వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్గయ్ల్ని నియంత్రించడానికి ఆ ప్రభుత్వం కోరడంతో గత వారం అలీ ఖాన్ అక్కడకు వెళ్లారు. బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకున్న ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్గయ్లను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గత గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మనేకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో ఓ ప్రముఖ ఛానల్ అలీ ఖాన్ను చర్చకు ఆహ్వానించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గౌరీ మౌలేఖీ అనే జంతు ప్రేమికురాలు పాల్గొన్నారు. చర్చ జరిగిన సమయంలోనే కాకుండా అది ముగిసిన తర్వాతా గౌరీ వ్యక్తిగత విమర్శలకు దిగారని అలీ ఖాన్ ఆరోపించారు. చర్చానంతరం తిరిగి వస్తున్న తనను ఆ ఛానల్ కార్యాలయంలోనే అడ్డగించిన గౌరి తీవ్రంగా బెదిరించారని, తప్పుడు కేసులు బనాయించడంతో పాటు భౌతిక దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించారని ఢిల్లీ సీఎం, పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. తనపై ఆరోపణలకు దిగిన గౌరి కేంద్ర మంత్రి మేనకా గాంధీని సలహాదారులు ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయం మంగళవారం ఈ-మెయిల్ ద్వారా అలీ ఖాన్కు జవాబు ఇచ్చింది. ఫిర్యాదులోని ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామని, ఆపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాలా ఓఎస్డీ అందులో స్పష్టం చేశారు. మూడు తరాల నుంచి సమాజం కోసం మ్యానీటర్స్గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే వేటాడుతున్నాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. ఇవన్నీ పట్టించుకోకుండా కొందరు వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడుల బెదిరింపులకు దిగడం సమంజసం కాదు’ అని నషత్ అలీ ఖాన్ సాక్షి’తో అన్నారు. -
మనేకా గాంధీపై మహిళా సమాఖ్య ఫైర్
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే శిశువు లింగ నిర్ధారణ చేసే హక్కు తల్లిదండ్రులకు ఉండాలన్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకాగాంధీ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుండగా కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సోమవారం పేర్కొన్నారు. 2011లో ప్రతి వెయ్యి మంది మగవారికి 914 మంది ఆడవారున్నారని, ఈ నిష్పత్తి 2014 వచ్చేసరికి మరింత తగ్గిందన్నారు. మనేకాగాంధీ వ్యాఖ్యల ప్రభావంతో భ్రూణహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
లింగ నిర్ధారణలు అవసరం: మేనకా గాంధీ
న్యూఢిల్లీ: లింగ నిర్ధారణపై ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు చేయలేదని కానీ ఆ విషయం మాత్రం చర్చల దశలో ఉందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలిపారు. భ్రూణ హత్యలను నివారించాలంటే మాత్రం లింగ నిర్ధారణ పరీక్షలు తప్పక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ప్రతీ గర్భిణి తనకు పుట్టబోయే శిశువు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు, పలు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో లింగ నిర్ధారణపై కేబినేట్ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్వీటర్ లో సమాధానమిచ్చింది. ఈ విషయంలో ప్రతి గర్భాన్ని రిజిస్టర్ చేసుకుని తల్లిదండ్రులకు లింగ నిర్ధారణను తెలియపరిస్తే ఎలాంటి భ్రూణ హత్యలకు తావుండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పద్ధతి గురించి ఆలోచిస్తున్నామని ఈ విషయంపై మీడియా ప్రతినిధులు, మేధావుల సలహాలు అందజేయాలని కోరింది. -
'లింగ నిర్ధారణ'పై సంచలన నిర్ణయం దిశగా కేంద్రం!?
- లింగ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేస్తే భ్రూణహత్యలు తగ్గుతాయన్న మేనకా గాంధీ - కేంద్ర క్యాబినెట్ కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి జైపూర్: 'ముళ్లపొదల్లో ఆడ శిశువు', 'అప్పుడే పుట్టిన పాపను చంపిన తండ్రి' తరహా వార్తలు నాగరిక సమాజంలో ఇకపై వినిపించవని ఆశించవచ్చేమో! కఠిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ భ్రూణహత్యలు విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణపై రెండు దశాబ్ధాలుగా అమలవుతోన్న నిషేధాన్ని ఎత్తివేసి, ఆ పరీక్షలను తప్పనిసరి చేయాలని, తద్వారా భ్రూణహత్యలకు పాల్పడేవారిని సులువుగా గుర్తించవచ్చని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను క్యాబినెట్ ముందర ఉంచామని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. జైపూర్ లో జరగుతున్న కేంద్ర మంత్రల ప్రత్యేక సమావేశానికి హాజరైన ఆమె సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 'గర్భస్త శిశువులకు లింగ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. 20 ఏళ్లుగా స్కానింగ్ పరీక్షలపై కొనసాగుతోన్న నిషేధాన్ని ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని ద్వారా భ్రూణహత్యలకు పాల్పడుతున్నవారిని సులువుగా కనిపెట్టే వీలుంటుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లోగల అంగన్ వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణుల పేర్ల నమోదుచేసుకుని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. నమోదయిన గర్భిణులందరికీ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు జారీచేస్తాం. ఒకవేళ వారు అబార్షన్ చేయించుకోదల్చుకుంటే అందుకుగల సహేతుకకారణాలను వివరించాలి. అడ్డగోలుగా భ్రూణహత్యలకు పాల్పడ్డవాని ఉపేక్షించం' అని మేనకా గాంధీ చెప్పారు. -
మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల విషయమై ప్రపంచ వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ అగ్రదేశాలపై విరుచుకుపడ్డారు. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదలాయించడం తప్పే అవుతుందని ఆయన పారిస్ లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలతో సాక్షాత్తు ఆయన క్యాబినెట్ సీనియర్ మంత్రి ఒకరు తీవ్రంగా విభేదించారు. 'వాతావరణ మార్పులకు పశ్చిమ దేశాలే కారణమని మనం నిందిస్తూ కూర్చోకూడదు. అవి వంద ఏళ్ల కిందట అలా చేసి ఉంటాయి. ప్రస్తుతం వాతావరణాన్ని ధ్వంసచేస్తున్న ప్రధాన శక్తుల్లో భారత్ కూడా ఉంది' అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ తేల్చి చెప్పారు. 'చైనా, బ్రెజిల్ తోపాటు మనం భారీగా రసాయన వాయువైన మెథీన్ ను విడుదల చేస్తున్నాం. అయినప్పటికీ దీని గురించి మనం ఆలోచించడం లేదు. వాతావరణ మార్పులకు కార్బన్ డై యాక్సెడ్ కన్నా ఇది 26 రెట్లు ఎక్కువ బలంగా కారణమవుతున్నది' అని మేనక పేర్కొన్నారు. చెన్నైలో వరదలు, వాతావరణ మార్పులపై ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి వాతావరణ మార్పులకు కారణమవుతున్నది మేము కాదు మీరేనంటు అగ్రదేశాలను ఉద్దేశించి మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
'నిర్భయ' బాలఖైదీపై నిరంతర పర్యవేక్షణ: మేనక
నిర్భయ గ్యాంగ్రేప్ కేసులో అరెస్టయి.. వచ్చే నెల విడుదల కాబోతున్న బాల ఖైదీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించనున్నట్లు సోమవారం కేంద్ర మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. అతని శిక్షా కాలాన్ని మరింత పెంచే అవకాశం లేదని, మైనర్ కావడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 2012లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్రేప్ ఘటనలో అరెస్టయిన పదిహేడున్నర ఏళ్ల మైనర్.. ఫ్రొహిబిషన్ సెంటర్లో మూడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రసుత్తం అతనికి 21 సంవత్సరాలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నారు. -
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతున్న హింసకు పురుషులే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. మగాళ్లే హింసకు పాల్పడుతున్నారని నిందించారు. లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలని పేర్కొన్నారు. ఫేస్ బుక్ యూజర్లతో ఆమె లైవ్ చాట్ చేశారు. లింగ వివక్షను రూపుమాపేందుకు పాఠశాల స్థాయి నుంచే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా కొద్ది నెలల క్రిత్రం 'జెండర్ చాంపియన్స్' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బాలికలను గౌరవించి, సాయం చేసే బాలురను ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని తెలిపారు. ప్రతి తరగతిలో ఒకరికి వార్షిక పురస్కారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే అసమాన తెగువ ప్రదర్శించిన బాలికలకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. -
'భార్యపై బలత్కారం తప్పే'
న్యూఢిల్లీ: భార్యపై బలాత్కారం (మారిటల్ రేప్) ఖండించదగిన చర్య అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి మేనకాగాంధీ అన్నారు. మహిళ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేది భర్త అయినా అది నేరమేనని చెప్పారు. ఓ పక్క వైవాహిక జీవితానికి సంబంధించిన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న భారత దేశంలో మారిటల్ రేప్ అనేది పరిగణించదగినది కాదని ఇప్పటికే కోర్టు స్పష్టం చేయడంతోపాటు.. కేంద్రం కూడా దానిని ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు మహిళా సంఘాలు ఈ అంశంపై పెదవి విరుస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మేనకా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'కేవలం సంబంధం లేనివారు మాత్రమే మహిళలను వేధింపులకు గురిచేస్తే ఒక నేరంగా పరిగణించకూడదనేది నా అభిప్రాయం. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతగా లొంగదీసుకోవడం అనేది పురుషుడి ఆధిక్యతకు ప్రదర్శించుకునేందుకు, బానిసగా మార్చుకునేందుకు చేసే చర్య. అలాంటప్పుడు దానిని తీవ్రమైన చర్యగానే పరిగణించాలి' అని మేనకా గాంధీ ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. -
'మేనకా గాంధీ నన్ను కొట్టారు'
కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని ఓ ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మేనక.. అడవుల్లో తరచూ మంటలు చెలరేగడంపై ఫారెస్టు అధికారుల్ని నిలదీశారు. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు అడవులకు వ్యాపిస్తున్నాయని చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న 57 ఏళ్ల కాపలాదారు రాంగోపాల్ వర్మ మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలిగించుకున్న కాపలాదారుపై మంత్రి అంతెత్తున ఎగిరిపడ్డారు. 'అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే' అంటూ చెంపపై ఒక్కటిచ్చారు. ఊహించని పరిణామానికి రాంగోపాల్ వర్మ బిత్తరపోయాడు. ఆ సమయంలో ఫారెస్టు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మేనకాగాంధీ తనపై దౌర్జన్యం చేశారని బాధితుడు పురాణ్పూర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కౌశలేంద్ర కుమార్ తెలిపారు. -
ఫినాయిల్ కాదు.. గోనాయిల్ మేలు
న్యూఢిల్లీ: ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు ఫినాయిల్కు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన గోనైల్ వాడాలని కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖామంత్రి మేనక గాంధీ సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రస్తుతం వాడుతున్న ఫినాయిల్ వల్ల వాతావరణానికి హాని కలుగుతుందని..దీనికి ఆవు మూత్రం మంచి ప్రత్యామ్నాయమని ఆమె అన్నారు. కెమికల్స్తో కూడిన ఫినాయిల్కు బదులుగా ఆవు మూత్రం నుండి తయారుచేసిన సహజ క్రిమిసంహారిణి(గోనాయిల్)ను వాడాలని ఆమె తన శాఖ ఉద్యోగులను కోరారు. ఈ గోనాయిల్ రోగక్రిమినాశినే కాకుండా వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని మేనకాగాంధీ తెలిపారు. హోలీ కౌ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గౌనాయిల్ విరివిగా తయారు చేస్తోందనీ, సింథటిక్ బేస్ తో ఉన్న ఫినాయిల్ కంటే గోనాయిల్ చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని మంత్రి చెబుతున్నారు. ఆయుర్వేద వైద్య విధానాలు, హిందూ సాంప్రదాయాల్లో ఆవుకున్న ప్రాధాన్యతను గురించి నొక్కి వక్కాణించిన వారిలో మేనకాగాంధీ ఒక్కరే కాదు మరో కేంద్రమంత్రి కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా నూతన ఆరోగ్య పాలసీ అమల్లోకి రానున్నట్టు ..ఆయుష్ వైద్య విధానాలకు అధిక ప్రాథాన్యత ఇవ్వనున్నట్లు ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పాదనాయక్ గతంలోనే ప్రకటించారు. ఆయుర్వేదిక్ కంపెనీలు తయారుచేస్తున్న మందులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఆవు నుండి లభించే పాలు, పెరుగు నెయ్యి,మూత్రం, పేడ లాంటి అయిదు పదార్థాలతో తయారుచేసి పంచగవ్యలో ఎన్నో ఔషధ విలువలున్నాయన్నారు. -
'వ్యభిచారం చట్టబద్ధం చేయం'
న్యూఢిల్లీ: దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసే ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో వ్యభిచారం చట్టబద్దత అంశంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ రాతపూర్వకంగాపై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే మహిళలు అక్రమ రవాణను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే లైంగికదాడికి గురవుతున్న మహిళలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మేనకా గాంధీ ఈ సందర్బంగా సభకు వివరించారు. -
14 మంది 'కమలం' కార్యకర్తలకు గాయాలు
బరేలి: ఉత్తరప్రదేశ్లో రాయబరేలి జిల్లా పర్థౌలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు డీవైడర్ను ఢీ కొట్టి... తిరగబడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా బీజేపీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీని పిలిబిత్లో కలసి... న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణంలో వస్తుండగా గత రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీ లేఖలు మనసు లోతులను తాకాయి
‘‘మీ లేఖలు మనసు లోతులను తాకాయి... నా మీద మీకున్న ప్రేమ, ఆప్యాయతలకు సదా కృతజ్ఞతలు.’’ అని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నటుడు సూపర్స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రి మేనకా గాంధీలకు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు. సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కారాగారవాసం వీడిన అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పోయెస్ గార్డెన్లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ భారత చలనచిత్ర సూపర్స్టార్ రజనీ కాంత్ జయలలితకు లేఖ రాశారు. ఆమెను పరామర్శించడంతోపాటుగా సానుభూతి తెలియజేస్తూ ఆ లేఖలో ప్రస్తావించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా సంజయ్ గాంధీ సైతం ఓ లేఖను రాశారు. తన మద్దతును తెలియజేస్తూ, సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని ఒడిదొడుకుల్ని విజయవంతంగా ఎదుర్కొని, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని కాంక్షించారు. తనను పరామర్శిస్తూ లేఖ రాసిన ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సోమవారం జయలలిత వేర్వేరుగా లేఖలు రాశారు. సమాధానం ఇలా : దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్కు రాసిన లేఖలో... ఁ్ఙమీరు రాసిన లేఖ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మీద మీకున్న గౌరవం, చూపిన ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు ఆయురారోగ్యాలతో, తల బెట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా, కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.రూ.రూ. అంటూ రాశారు. ఇక, మేనకా గాంధీకి రాసిన లేఖలో....్ఙ్ఙపని ఒత్తిడితో బిజీ బిజీగా ఉన్నా, నన్ను గుర్తుంచుకుని లేఖ రాయడం ఆనందంగా ఉంది. మీరు రాసిన ఆ లేఖ నా మనస్సును తాకింది. మీరు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.రూ.రూ. అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దేనికీ భయపడను
‘జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను. నిప్పులపై నడుస్తున్నాను. ప్రజల మద్దతు ఉన్నంత వరకు నేను దేనికీ భయపడను’అని అన్నాడీఎంకే అధినేత్రి జే.జయలలిత పేర్కొన్నారు. తనకు శిక్ష పడిన విషయం తెలుసుకుని షాక్తో మృతిచెందిన వారి కుటుంబాలకు తలా రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జయలలితను దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి మేనకాగాంధీ లేఖల ద్వారా పరామర్శించారు. సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రిజే.జయలలిత శనివారం బెయిల్పై విడుదలయ్యారు. తాను బయటకు రావాలం టూ రేయింబవళ్లు శాంతియుత నిరసనలతో, ఆలయాల్లో పూజాధి కార్యక్రమాల్లో నిమగ్నమైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తన జీవితాంతం మండుతున్న నదిలో ఈదుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు. ఎలాంటి బాధ, కష్టాన్ని అయినా ఎదుర్కొనే మనో ధైర్యం తనకు ఉందన్నారు. ప్రజా సేవకు అంకితమైన వారు ఎలాంటి ఒడిదొడుకుల్ని అయినా, కష్టాల్ని అయినా నిర్భయంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాడే తాను అన్ని విషయాల్ని గ్రహించానని, అందుకే ఎంజీయార్ అడుగు జాడల్లో, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీకి నేతృత్వం వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా, కష్టాలు చవి చూసినా, వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నానని, చివరకు గెలుపు తన వైపు నిలిచిందని వివరించారు. తన మీద ఉన్న ప్రేమతో, తాను భయటకు రావాలన్న కాంక్షతో ఎన్నో గుండెలు కన్నీళ్లు పెట్టాయని, పూజాధి కార్యక్రమాలు చేశాయని, మరెన్నో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారన్న విషయాన్ని తెలుసుకున్న తన హృదయం మరింతగా బరువెక్కిందన్నారు. వారందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. రూ.మూడు లక్షలు జయలలితకు శిక్షపడ్డ నేపథ్యంలో ఆత్మాహుతులు, ఆత్మహత్యల బాట పట్టిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే తీర్పు షాక్తో అనేక గుండెలు సైతం ఆగాయి. ఆ కుటుంబాల్ని ఆదుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయించారు. ఆ మేరకు తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గుండెలు ఆగి 139 మంది, అగ్నికి ఆహుతై 17 మంది, ఉరి పోసుకుని 20 మంది మరణించినట్టు జాబితాను విడుదల చేశారు. అలాగే, మిద్దె మీద నుంచి పడి తొమ్మిది మంది, బస్సు ముందు దూకి ఒకరు, రైలు కింద పడి ముగ్గురు, నీళల్లో దూకి ఇద్దరు, విద్యుత్ షాక్తో ఒకరు చొప్పున మొత్తం 193 మంది మరణించినట్టు అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. రజనీ, మేనక పరామర్శ దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా సంజయ్ గాంధీలు వేర్వేరు లేఖలతో జయలలితను పరామర్శించారు. ఈ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం ఆదివారం ప్రకటించింది. తన లేఖలో జయలలితకు సానుభూతి, మద్దతను మేనకా గాంధీ తెలియజేశారు. జీవితంలో తమరు ఎన్నో కష్టాల్ని, ఒడి దొడుగుల్ని చవి చూశారని, వాటిన్నింటిని ఎదుర్కొన్నట్టుగానే, ప్రస్తుత కష్టాన్ని అధిగమించి త్వరితగతిన తమరు బాధ్యతలు చేపడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, రజనీ కాంత్ తన లేఖలో మనో ధైర్యంగా ఉండాలని, ప్రశాంత పూరితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తమరు ఆరోగ్య వంతంగా మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆంక్షిస్తూ, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. -
మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్'
న్యూఢిల్లీ: కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నియోజకవర్గంలో 'లవ్ జిహాద్' కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ లోక్సభ నియోజకవర్గానికి మేనక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో 7-8 లవ్ జిహాద్ కేసులు తన దృష్టికి మేనక చెప్పారు. అయితే ఇలాంటి కేసులు తన మంత్రిత్వ శాఖకు రాలేదని తెలిపారు. హిందూ యువతీయువకులను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతం మార్చడాన్ని లవ్ జిహాద్ అంటారు. ఇలాంటి కేసులు ఎక్కువ ఉత్తరప్రదేశ్లో వెలుగు చూస్తున్నాయి. -
పింక్ టెర్రరిజం.. సరికొత్త ఉగ్రవాదం!
ఇప్పటివరకు రకరకాల ఉగ్రవాదాలు చూశాం. కానీ ఇప్పుడో సరికొత్త ఉగ్రవాదం వస్తోందట. అక్రమంగా జంతువులను వధిస్తూ, వాటితో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి కొంతమంది ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు. దానికి ఆమె 'పింక్ టెర్రరిజం' అని పేరుపెట్టారు. పాలిచ్చే జంతువులను వధించడం భారతదేశంలో ఒక వ్యాపారంగా ఉందని, దీంతో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నప్పుడు, దీన్నెందుకు అనుమతిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. చైనాలో కంటే ఎక్కువగా భారతదేశంలో జంతువులను వధిస్తున్నారని, పాలిచ్చే జంతువులను ఇలా అక్రమంగా వధిస్తూ, వాటిని బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. ఇందులో మతం ప్రసక్తి ఏమాత్రం లేదని, కేవలం డబ్బుకోసమే అంతా ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎప్పటినుంచో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న మేనకా గాంధీ, తాజాగా ఇండియా ఫర్ యానిమల్స్ అనే సదస్సులో మాట్లాడుతూ ఈ గులాబీ ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నాలుగేళ్ల క్రితమే దీనిగురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ఒక్క దేశానికే మన వద్ద నుంచి అక్రమంగా ఏటా 1.60 లక్షల టన్నుల ఆవుమాంసం పంపుతున్నామని, వాళ్లకు ఒక్క ఆవు కూడా లేదని ఆమె అన్నారు. ఇలా, పాలిచ్చే జంతువులను వధించడం.. దానికితోడు ఆ డబ్బును ఉగ్రవాదానికి ఉపయోగించడం విశృంఖలంగా సాగుతున్నందున.. దీన్ని అడ్డుకోడానికి అందరూ కృషిచేయాలని, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మేనక పిలుపునిచ్చారు. -
సీఎం పదవిపై ఎవరి ఆశలు వారివి!
లక్నో:ఉత్తరప్రదేశ్ లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఆశలను రేపుతోంది. యూపీ రాష్ట్ర అసెంబ్లీపై బీజేపీ ప్రభుత్వం కార్యాచరణను ఏమీ సిద్ధం చేయకపోయినా.. పార్టీ పెద్దలు మాత్రం ఎవరు ప్రయత్నాల్లో వారు నిమగ్నమైయ్యారు. యూపీ ఎన్నికలో సమీపంలో లేకపోయినా పార్టీ నాయకులు మాత్రం దీనిపై దృష్టి సారించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి అఖిలేష్ యాదవ్ కంటే తన కొడుకు వరణ్ గాంధీనే ఉత్తమం అని ప్రకటించి కేంద్ర మంత్రి మేనకా గాంధీ ముందుగానే కర్చీఫ్ వేశారు. దీనిపై అఖిలేష్ ప్రభుత్వంతో పాటు, యూపీ రాష్ట్ర బీజేపీ పెద్దలు కూడా పెదవి విరుస్తున్నారు. మేనక్, వరుణ్ ఇద్దరూ యూపీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆమె వ్యాఖ్యలపై రాష్ట్ర నేతలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. వరుణ్ గాంధీ సీఎం అంశంపై ముందుగా చర్చలకు తెరలేపడం అంత సమంజసం కాదంటున్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ స్పందిస్తూ.. 'బీజేపీ ప్రభుత్వం యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ విషయంపై మాట్లాడితే బాగుంటుందని మేనకాగాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే శాంతిభద్రతలు మెరుగుపడతాయనే ఆశాభావాన్ని మాత్రం ఆయన వ్యక్తం చేశారు.' ఎవరు ముఖ్యమంత్రి అనేది పార్టీ అధినాయకత్వానికి సంబంధించినది. దీని గురించి ముందే మాట్లాడటం సమంజసం కాదు. సరైన సమయంలో తగిన నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకుంటారు'అని బాజ్ పాయ్ స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి సీఎం రేసులో వరుణ్ గాంధీనే కాదు.. తనతోపాటు చాలామంది ఉన్నారన్న సంకేతాలను ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును స్వయంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అత్యుత్తమ వ్యక్తి అవుతారని అన్నారు. దాంతో పాటు ఉత్తరప్రదేశ్ లోఅఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో పాటు అంతర్లీనంగా ఉన్న తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించారు. ఇంతవరకూ పార్టీ పెద్దల ఆశలు బాగానే ఉన్నా.. అవి నెరవేరాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అత్యాచారం కేసుల్లో పిల్లలైనా పెద్దల్లాగే శిక్షించాలి
అత్యాచారాల్లాంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న బాలలను వయోజన నేరస్తులతో సమానంగా పరిగణించి శిక్షించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు. చెన్నైలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లైంగికపరమైన నేరాలకు పాల్పడుతున్న 16 ఏళ్లవారిలో సగం మందికి పైగా జువెనైల్ చట్టం గురించి బాగా తెలుసని పోలీసులు చెబుతున్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇలా చట్టాల గురించి తెలుసుకుని, వాటినుంచి తప్పించుకుంటూ దారుణమైన నేరాలకు పాల్పడుతున్నవారిని వయోజనులతో సమానంగానే పరిగణించి శిక్షించాలని, అలాగైతేనే ఇతరులు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా భయపడతారని ఆమె చెప్పారు. -
'అబ్బాయీ అలా మాట్లాడకు....'
అమేథీ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ తన దాయాది రాహుల్ గాంధీకి బిజెపి యువనేత వరుణ్ గాంధీ ఇచ్చిన ఖితాబు ఇప్పుడు రాజకీయరంగంలో సంచలనం సృష్టిస్తోంది. బిజెపి తనకు సరైన గుర్తింపునివ్వడం లేదన్న ఆవేదనతోనే వరుణ్ ఇలా అన్నాడా అన్న ప్రశ్న కూడా తలెత్తింది. నిజానికి వరుణ్ , రాహుల్ ల మధ్య అంత పెద్ద సఖ్యతేమీ లేదు. వరుణ్ తన వివాహానికి స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రం ఇచ్చినా రాహుల్, సోనియాలు హాజరుకాలేదు. సోనియా, మేనకల వైరం చాలా పాతది. అయినప్పటికీ రాహుల్ పై వరుణ్ ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో బిజెపిలో కలవరం చెలరేగింది. ఇప్పుడు కవర్ అప్ చేసేందుకు వరుణ్ తల్లి, బిజెపి సీనియర్ నేత మేనకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. 'ఏదైనా మాట్లాడేముందు వరుణ్ గాంధీ ముందు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తాను చూడని విషయాల గురించి ఏమీ మాట్లాడకూడదు' అని ఆమె వ్యాఖ్యానించారు. అంటే రాహుల్ అమేథీ చూడకుండానే అక్కడి అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని ఆమె సున్నితంగా చెప్పారు. ఇలా వివాదానికి మేనక తనదైన శైలిలో తెరదించారు. -
అఖిలేష్ యాదవ్ కు మేనకాగాంధీ లేఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం పథకం కింద పాఠశాల చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె సీఎంకు లేఖ రాశారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులకు వడ్డిస్తున్న భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. యూపీలోని తన నియోజకవర్గమైన అనొలలో పర్యటనలో భాగంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కూడా ఆ పరిసరాలు తగు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత నెలరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల చిన్నారులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారని, కానీ కొన్ని ప్రదేశాల్లో ఆ భోజనంలో క్రిమికీటకాలు ఉంటున్నాయని తెలిపారు. గతనెల్లో బీహార్ రాష్ట్రంలో శరన్ జిల్లాలోని చాప్రా డివిజన్లో గందమయిలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి 23 మంది మరణించిన సంగతిని మేనకా గాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు. అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే అఖిలేష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ రాయబరేలి జిల్లాలోని రైయిన్ గ్రామంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక పాఠశాలను ఆయన సందర్శించారు. భోజనంలో ఆహారం సరిగా ఉండటం లేదని పాఠశాల విద్యార్థులు అఖిలేష్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. స్థానిక విద్యాశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.