nomination filed
-
చీపురుతో తుడిచేస్తా.. కేజీవాల్ నామినేషన్
-
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్యాదవ్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్వీత్సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
సాక్షి, విశాఖపట్నం: మరికాసేపట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిపి ఇంటి నుంచి కలెక్టరేట్కు బొత్స బయలుదేరనున్నారు.కాగా, రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఆరు మంది సభ్యులతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా.. అభ్యర్థి ఎంపికపై నేడు మరోసారి నాయకులు సమావేశం కానున్నారు. బొత్స పై పోటీకి స్థానిక నాయకులు ముందుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపోతున్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. -
ఏపీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్తో సరిపెట్టవచ్చని సమాచారం.అయ్యన్నపాత్రుడి కామెంట్స్.. చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను. -
నామినేషన్ వెనక్కి.. ప్రముఖ నటుడికి ఊరట
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్లోని కరకట్ లోక్సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.ఈ సీటు నుంచి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.దీనికి ముందు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం టిక్కెట్ను బీజేపీ పవన్ సింగ్కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్పూర్ -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. మోదీ నామినేషన్ను నలుగురు నేతలు బలపర్చారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో ఇద్దరు ఓబీసీ నేతలు ఉన్నారు.మోదీ నామినేషన్ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్టీయే నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు.#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR— ANI (@ANI) May 14, 2024 #WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG— ANI (@ANI) May 14, 2024నామినేషన్ వేయడానికి ముందు.. దశ అశ్వమేథ ఘాట్లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గుజరాత్కు చెందిన నరేంద్ర మోదీ.. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలు-2024 చివరి ఫేజ్లో భాగంగా జూన్ 1వ తేదీన వారణాసి పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరగనుంది. #WATCH | Uttar Pradesh: PM Narendra Modi offers prayers at Dasaswamedh Ghat in VaranasiPM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. PM is the sitting MP and BJP's candidate from Varanasi. pic.twitter.com/tnZNsQCnmV— ANI (@ANI) May 14, 2024 -
ప్రధాని మోదీ నామినేషన్కు సీఎం నితీష్ గైర్హాజరు.. కారణమిదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం)వారణాసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది. అయితే ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురయిన నేపధ్యంలో ఆయన నేడు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన ఎన్నికల ప్రచారానికి, బహిరంగ సభలకు కూడా హాజరుకారు. అయితే ఈరోజు సుశీల్ కుమార్ మోదీ నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆయన నితీష్ కుమార్కు సన్నిహితునిగా మెలిగారు.ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా పాల్గొననున్నారు. -
14న ప్రధాని మోదీ నామినేషన్?
దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 14న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించారు.మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మర్నాడు అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ
కోల్కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.#WATCH | TMC candidate from Diamond Harbour seat, Abhishek Banerjee files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/SLymSD1IHq— ANI (@ANI) May 10, 2024 -
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
రాజ్నాథ్ సింగ్తో పోరుకు దిగిన నీలమ్ ఎవరు?
యూపీలోని లక్నో లోక్సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్నాథ్ సింగ్ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. స్టయిలిష్ లుక్లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం. -
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్ననల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు. -
Lok Sabha Election 2024: రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి రాహుల్ తన నామినేషన్ పత్రాలను రాయ్బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ హర్షితా మాథుర్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్తో బరిలో నిలిచారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షికాదాయం రూ.1.02 కోట్లు. మా కర్మభూమి రాయ్బరేలీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్ వెల్లడించారు. -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్ల మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
మతతత్వ శక్తులను ఓడించండి
ఖమ్మం వన్టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది. -
నేడు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 7.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు.స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీదర్లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
సీఎం జగన్ నామినేషన్ కు.. డేట్ ఫిక్స్
-
వయనాడ్లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్కు ముందు జరిగే రోడ్ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్లో త్రిముఖ పోటీ నెలకొంది. వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. -
వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. కాగా బుధవారం ఉదయం వయనాడ్ చేరుకున్న రాహుల్.. కాల్పేట నుంచి సివిల్ స్టేషన్ వరకు రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ వయనాడ్ ప్రజలతో ఉంటానని చెప్పారు. ఇక్కడి ప్రతివ్యక్తి తనపై ప్రేమ, అభిమానాన్ని అందించారని, సొంత వ్యక్తిలా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఏడు లక్షల ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్ధి సునీర్పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే వయనాడ్ నుంచి బీజేపీ తరపు రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, సీపీఐ నేత అనీ రాజా పోటీలో నిలిచారు. రెండో ఫేజ్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్ -
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డీకే సురేష్ వెంట రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ్ముడే ఈ డీకే సురేష్. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామిని 2013 ఉప ఎన్నికలో ఆయన ఓడించారు. మరోవైపు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బావమరిది అయిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ సీఎన్ మంజునాథ్ను బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీకి దింపింది. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న మంజునాథ్ 17 ఏళ్ల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్కు సారథ్యం వహించి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు. -
అరుణాచల్లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బిహార్ సీఎం నితీష్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది. చదవండి: 'సందేశ్ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్ ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు. -
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్కుమార్కు రేవంత్రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు
-
పాక్ ఎన్నికల బరిలో.. ఎవరీ సవీరా ప్రకాష్?
సవీరా ప్రకాష్.. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన వేళ మారుమోగుతున్న పేరు. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారీమె. తద్వారా ఈ ఎన్నికల్లో ఆ ప్రావిన్స్ నుంచి నామినేషన్ ఫైల్ చేసిన తొలి మహిళగా.. అలాగే పోటీ చేయబోతున్న తొలి హిందూ మహిళగా వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఈ మధ్యే కీలక సవరణ చేసింది. సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేయడం అందులో ఒకటి. సవీరా తండ్రి ఓం ప్రకాశ్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. ఆయన అక్కడ పేరుపొందిన వైద్యుడు. మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా ఆయనకంటూ పేరుంది అక్కడ. ఈ మధ్యే వైద్య వృత్తికి దూరంగా జరిగారు. అంతేకాదు.. 35 ఏళ్లుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. సోమవారం బర్నర్లోని పీకే-25 స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా. సవీర, అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకుంది. ఆ సమయంలో బనర్ పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తన రాజకీయ అడుగులకు కారణమని ఇప్పుడు చెబుతున్నారామె. గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత.. సంక్షేమ సాధన తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. మరోవైపు బనర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్న ఇమ్రాన్ నోషాద్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. సవీరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అంటున్నాడు. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇదే బిలావల్ భుట్టో.. భారత్, కశ్మీర్పై గతంలో పలుమార్లు విషం చిమ్మడం తెలిసిందే. పాక్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది. -
శుభకార్యాలు.. ప్రచారాలు
జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరి దారిలో వారు ప్రచారం చేపడుతున్నారు. ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైంది కావడంతో ప్రధాన అభ్యర్థుల నుంచి స్వతంత్రుల వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకు వెళ్తున్నారు. ఎవరైనా మరణించినా, ఏమైనా సంఘటనలో గాయపడ్డా ఉదయమే అక్కడకు వెళ్లి పరామర్శిస్తున్నారు. గతంలో రాని నాయకులు ఈసారి ప్రతిదానికి వెళ్లడంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓటు విలువ ఎంత ఉందో తెలుస్తుంది. ఈనెల 16 నుంచి మంచి ముహూర్తాలు ► రానున్న రెండురోజుల్లో వివాహ వేడుకలు సైతం ఊపందుకోనున్నాయి. ► కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో 8 నుంచి 10 రోజుల పాటు వివాహాలు జరగనున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ► ఈనెల 30న పోలింగ్ ఉండగా, ఇంతకంటే ముందే వివాహ వేడుకలు అత్యధికంగా ఉండటంతో ప్రతీ వేడుకకు హాజరయ్యేందుకు అభ్యర్థులు సైతం ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించుకుంటున్నారు. ► గతంలో వివాహ వేడుకలకు రావాలని స్వయాన కుటుంబ సభ్యులు శుభలేఖలు అందజేసినా సమయం ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కోసం పిలవకపోయినా వివాహ వేడుకలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ► దాదాపు పెళ్లిల్లో చాలా జనాలు ఉంటారు కాబట్టి వివాహ వేడుకలకు హాజరైతే ఓట్లు వచ్చే అవకాశాలుంటాయని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ► ఒకవైపు పరామర్శించడంతో పాటు, మరోవైపు శుభకార్యాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఈనెలలో 16 నుంచి 29 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ సమయంలోనే ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటింటికీ వెళ్తూ అవ్వలను, మహిళలను, వృద్ధులను, యువతను కలుస్తూ ఓటు తమకే వేయాలంటూ వేడుకుంటున్నారు. ► ఎన్నికలకు మరో మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయం 4 నుంచి 5 గంటలలోపే గ్రామాలు, మండలాల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ► మున్సిపాలిటీల్లో రాత్రిపూట విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఏదేమైనా అభ్యర్థులకు ప్రచారంలో ముచ్చెమటలు పడుతున్నాయి. -
అమలు గ్యారంటీ
సాక్షి, కామారెడ్డి: కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని, తెలంగాణలో ఏం అమలు చేస్తుందంటూ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. హామీలు అమలవుతున్నాయో లేదో వచ్చి చూడాలని కేసీఆర్ను ఆహా్వనిస్తే ముఖం చాటేశారని.. పైగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో తాము ఇచ్చిన ‘గ్యారంటీ’ హామీలను అమల్లోకి తెచ్చామని.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ తరఫున బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మిత్రపక్షాలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నేత చాడ వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. సభలో సిద్ధరామయ్య ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కర్ణాటకలో మేం ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో 4 గ్యారంటీలు 2 నెలలుగా అమలవుతూనే ఉన్నాయి. యువనిధి పథకాన్ని జనవరిలో మొదలు పెడుతున్నాం. మేం ప్రజలకు ఇచ్చిన హామీల మేర కు అన్ని పథకాలను అమలు చేస్తుంటే ఇక్కడి సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మేం అమలు చేస్తున్న పథకాలు నిజమో కాదో తెలుసుకునేందుకు రమ్మని పిలిస్తే ముఖం చాటేస్తున్నారు. కేసీఆర్కు గుణపాఠం తప్పదు తెలంగాణలో కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీలేదు. బీసీలకు 34శాతంగా ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్కే దక్కింది. సీఎం కేసీఆర్కు అవినీతి డబ్బులతో ఎన్నికలకు వెళ్లడం అలవాటు. ఈసారి ఆయన ప్రయత్నాలు ఫలించవు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని తేలిపోతోంది. ప్రజలు 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఓడింది తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కు వ. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 రోడ్షోలు, సభల్లో పాల్గొన్నారు. ఆయన సభలు జరిపిన చోటల్లా కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీతో గెలిచింది. మోదీకి అక్కడి ఓటర్లు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోదీకి ఇక్కడి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా పనిచేస్తోంది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కచి్చతంగా అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలి..’’అని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ద్రోహులను పక్కన పెట్టుకుని నీతులా?: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్ మాట్లాడటమంటే వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్సార్తోపాటు మరెందరో సీఎంలు రోజూ ప్రజల సమస్యలు వినేందుకు దర్బార్ నిర్వహించేవారని, సీఎం కేసీఆర్ పదేళ్లలో ఒక్కనాడూ ప్రజల కష్టాలు విన్నపాపాన పోలేదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఎమ్మెల్యేను యాభై లక్షలకు కొంటూ రేవంత్ దొరి కిండని అంటున్న కేసీఆరే తెలంగాణను కొనుగోళ్లు, అమ్మకాలకు కేంద్రంగా మార్చారు. 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వందలాది మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిండు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధ మా? సిద్ధమైతే 24 గంటల్లో సీబీఐకి లేఖ రాయాలి. అమ్మ పుట్టిన ప్రాంతమని గుర్తుకు రాలేదా? కామారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య 2017లో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచి్చ, సీఎం అవకాశం ఇవ్వలేదన్న ఆవేదనతో సెక్రటేరియట్ ఎదురుగా ఉరివేసుకుని చనిపోయినపుడు.. ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు.. సీఎం కేసీఆర్కు కామారెడ్డి తన తల్లి పుట్టిన ప్రాంతమని గుర్తుకురాలేదా? ఇప్పుడు గజ్వేల్ ప్రజలు నమ్మే స్థితిలో లేక కామారెడ్డికి వచ్చి పోటీ చేçస్తున్నప్పుడు గుర్తుకువచ్చిందా? కామారెడ్డి ప్రజలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. మీ తీర్పు కోసం దేశ, విదేశాల్లో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ను ఓడించేందుకే నేను కామారెడ్డి వచ్చా. భూములు కొల్లగొట్టేందుకు వస్తున్నారు కామారెడ్డిని బంగారు తునక జేస్తనంటున్న కేసీఆర్ గజ్వేల్కు ఏం చేశారు. అక్కడి ప్రజలను ముంచి, రోడ్డున పడేసి ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేశారు. ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కుట్ర చేశారు. రైతులు తిరగబడటంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు ఆయన కొడుకు కేటీఆర్ చెప్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రూ.2 లక్షల దాకా రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ఆరు గ్యారంటీలను, బీసీ డిక్లరేషన్ను పక్కాగా అమలు చేస్తాం.’’ అని రేవంత్ ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ గాలిని జూసి సీఎం కేసీఆర్కు భయం పట్టుకుందని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రేవంత్కు ‘కోనాపూర్’నామినేషన్ డబ్బులు కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న రేవంత్రెడ్డి నామినేషన్ కోసం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ వాసులు డబ్బును అందజేశారు. కేసీఆర్కు పదేళ్లుగా కోనాపూర్ గుర్తుకురాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ ఊరి పేరు వాడుకుంటున్నారని వారు విమర్శించారు. కాగా సభలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య కన్నడ భాషలో ప్రసంగించగా.. కాంగ్రెస్ నేతలు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది చాలా నిదానంగా సాగడంతో సభకు హాజరైనవారిలో నిరాశ కనిపించింది. సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, సుదర్శన్రెడ్డి, మదన్మోహన్, ఆది శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్కు గుణపాఠం తప్పదు: నారాయణ తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసగించిన సీఎం కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులను చంకనెత్తుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్ ప్రజల సమస్య లు వినేందుకు రోజూ ప్రజా దర్బార్ నిర్వహించేవారని.. ఈ పదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలు సీఎంను కలిసే అవకాశం దొరకలేదని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేశారు: కోదండరాం ఎన్నెన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేదని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. ఈ అన్యాయాలు చూస్తుంటే గుండెలు మండుతున్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు ఓటుతో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ -
మంత్రి జగదీష్రెడ్డి ఆస్తుల విలువ రూ.4.26 కోట్లు
సూర్యాపేట : బీఆర్ఎస్ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గురువారం వేసిన నామినేషన్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రూ.1.58 కోట్ల స్థిర ఆస్తులు, రూ.2.68 కోట్ల చరాస్తులు మొత్తం కలిపి రూ.4.26 కోట్లు ఉన్నాయని.. రూ.2.60 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.2.86 లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణి సునీత చేతిలో రూ.9.8 లక్షలు ఉండగా.. ఆమె పేరున రూ.5.94 కోట్ల స్థిరాస్తులు, రూ.4.66 కోట్ల చరాస్తులు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. రూ.3.27 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన పేరున ఒక కారు, తన సతీమణి పేరున రెండు కార్లు, ఒక బైక్, ట్రాక్టర్ ఉన్నట్లు చూపారు. తనపై ఒక కేసు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. సంకినేని కుటుంబ ఆస్తి రూ.రూ.22.63 కోట్లు సూర్యాపేట : బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్రావు ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను రూ.22.63 కోట్లుగా చూపారు. వెంకటేశ్వర్రావు పేరున రూ.1.51 కోట్ల చరాస్తులు, రూ.40 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.1.50 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి లక్ష్మి చేతిలో రూ.13.75 లక్షలు ఉండగా.. 730 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25.32 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. తనపై నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. దామోదర్రెడ్డిపై నాలుగు కేసులు.. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్రెడ్డి రూ.13.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.88 కోట్ల స్థిరాస్తులు తన చేతిలో రూ.25 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
అట్టహాసంగా సంజీవ్రెడ్డి నామినేషన్..
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అల్లూరి సంజీవ్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మందితో డప్పుచప్పుళ్ల నడుమ శాంతినగర్లోని దివంగత చిల్కూరి రాంచంద్రారెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం రిటర్నింగ్ అధికారి స్రవంతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇందులో సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్లో నిర్వహించిన రోడ్షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్ను ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
సెంటు భూమి లేదు! కేసీఆర్ అఫిడవిట్లో ఇంకా ఏముందంటే..
సాక్షి, సిద్ధిపేట/కామారెడ్డి: భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ నామినేషన్లు వేశారు. గజ్వేల్తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం గజ్వేల్లో, మధ్యాహ్నాం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత.. గజ్వేల్లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఆపై విశ్రాంతి తీసుకుని హెలికాఫ్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ తొలుత బీఆర్ఎస్ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆపై కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ. 2లక్షల 96వేల క్యాష్ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పేర్లపై బ్యాంక్లలో డిపాజిట్లు అయిన నగదు రూ. 17కోట్లకు పైగా ఉంది. కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయ్యాయి. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడది మరో 11.16 కోట్లకు పెరిగింది. కేసీఆర్ సతీమణి శోభ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.6.29 కోట్లకు చేరింది. బంగారు ఆభరణాలు 2.8 కేజీలు(రూ. 17లక్షలు విలువచేసే) ఉన్నట్లు తాజా అఫిడవిట్లో వెల్లడి. గత పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడేవిట్లో చూపించారు కేసీఆర్. స్థిర ఆస్తుల రూపంలో రూ. 17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నాయి కేసీఆర్కు. ఆయన భార్య శోభ పేరు మీద రూ.7.78 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. కేసీఆర్ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు.. కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉంది. సొంతంగా కారు, బైక్ లేదు కేసీఆర్కు.బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయి. వీటి విలువ రూ.1.16 కోట్లుగా పేర్కొన్నారు. తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని చెప్పుకునే కేసీఆర్.. తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్లో ప్రస్తావించడం కొసమెరుపు. కేసీఆర్, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. -
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్
-
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
నామినేషన్లకు ఇంకా కొన్ని గంటలే...
హైదరాబాద్: నామినేషన్ల ఘట్టం ముగియడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. దీంతో ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిథుల రీత్యానూ గురు, శుక్రవారాలు శుభ దినాలుగా భావిస్తుండటంతో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టెన్షన్.. టెన్షన్ ఆయా పార్టీల నుంచి టికెట్లు లభించిన వారు ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, అభ్యర్థులను ప్రకటించని నియోజక వర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చార్మినార్ సీటును ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ చార్మినార్ సీటును దానికి కేటాయించనుందనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదని చెబుతున్నారు. బీజేపీలో జనసేన కిరికిరి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గ్రేటర్ పరిధిలోని సీట్లపైనా ఆ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్ స్థానాలను అది ఆశించగా కుత్బుల్లాపూర్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు ఇచ్చారు. కూకట్పల్లిని జనసేనకు కేటాయించడంతో అది తన అభ్యర్థిగా ప్రేమ్కుమార్ను ప్రకటించింది. ఇటీవలి కాలం వరకు బీజేపీలో ఉన్న ప్రేమ్కుమార్ జనసేనలో చేరి వెంటనే టికెట్ దక్కించుకున్నారు. శేరిలింగంపల్లిని జనసేనకు కేటాయించకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపుల్లో ఆ మేరకు సఫలమైనట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్కాజిగిరి, మేడ్చల్, నాంపల్లి, కంటోన్మెంట్ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు ఎవరికి దక్కనున్నాయనేది సస్పెన్స్గా మారింది. -
తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క.. నామినేషన్ దాఖలు
నాగర్కర్నూల్: రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన బర్రెలక్క గుర్తుందా?. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని వీడియో ద్వారా తెగ వైరల్ అయ్యిందామె. ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకప్పుడు ఊపు ఊపిన వీడియో అది. ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శిరీష నిర్ణయించుకుంది. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్ కర్నూల్) నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసింది కూడా. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించుకుంది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Telugu Scribe (@telugu_scribe) -
బీఆర్ఎస్ అవినీతికి పాతరేద్దాం
గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్హౌస్కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల ఈ ఎన్నికల్లో గజ్వేల్లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్కు ఓటమి తప్పదని కిషన్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. గజ్వేల్ రోడ్షోలో ప్రసంగిస్తున్న కిషన్రెడ్డి. చిత్రంలో ఈటల -
కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్
జగిత్యాల: ఆమె 82 ఏళ్ళ వృద్ధురాలు .. భర్త స్వాతంత్య్ర సమరయోధుడు.. కుమారుడు విదేశాలకు వెళ్లి వచ్చాడు.. కానీ తల్లికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే అమ్మేసుకున్నాడు. దాంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతూ.. న్యాయం చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్కు సైతం లేఖ రాసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పదిమందికీ తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని ఆ పెద్దావిడ భావించి నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు చీటి మురళీధర్ భార్య, 82ఏళ్ల చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై నిరసనగా.. తన సమస్య పరిష్కారం కావాలనే నామినేషన్ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. -
ఓ తల్లి అసహనం.. ఎన్నికల్లో నామినేషన్
సాక్షి, జగిత్యాల : జిల్లా పరిధిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందామె. అనుకున్నదే తడవుగా మంగళవారం జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో నామినేషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఆమె పోటీ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సీటీ శ్యామల జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్లో ఉన్న తన ఇంట్లో నుంచి కొడుకు బయటకు గెంటేశాడు. దీంతో ఆమె ప్రస్తుతం జగిత్యాలలో ఉంటున్నారు. తప్పుడు పత్రాలు చూపించి ఇల్లు తనదే అని కొడుకు ఆమెను నడిరోడ్డు మీద పడేశాడు. దీంతో.. ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. కానీ, ఆ కేసులో విచారణ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో.. మొత్తం వ్యవస్థ మీదే శ్యామల తీవ్ర అసహనానికి గురైంది. అందుకు నిరసనగా జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. -
TS Election 2023: ఓవర్ టు హైదరాబాద్.. ఆశావహుల ఢిల్లీబాట..
వరంగల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు మలిదశకు చేరింది. త్వరలోనే ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 53మంది వివిధ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలు ఆ దరఖాస్తులను పరిశీలించి జిల్లా కాంగ్రెస్ కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రెండు రోజుల్లో సీడబ్ల్యూసీ, పార్టీ కేంద్ర ఎన్నికల పరిశీలన కమిటీకి పంపనున్నారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే వారినే ఈసారి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్న అధిష్టానం.. ఆశావహుల జాబితాపై త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. భూపాలపల్లి, ములుగుకు ఒక్కొక్కటి.. మిగతా చోట్ల పోటాపోటీ.. ఈ నెల 18న మందకొడిగా సాగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ.. మూడు రోజులుగా పోటెత్తింది. ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్య నాయకులంతా గురు, శుక్రవారాల్లో తమ దరఖాస్తులను హైదరాబాద్ గాంధీభవన్లో దాఖలు చేశారు. శుక్రవారం రాత్రి వరకు పార్టీ వర్గాల సమాచారం మేరకు 53 మంది ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున దరఖాస్తు చేసుకోగా.. నర్సంపేట నుంచి రెండు దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా వర్ధన్నపేట నుంచి పదకొండు మంది వరకు పోటీ పడుతున్నారు. 12 నియోజకవర్గాలనుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఓవర్ టు హైదరాబాద్.. ఆశావహుల ఢిల్లీబాట వారం రోజుల్లోపే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు పలువురు అప్పుడే ఢిల్లీబాట పట్టారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు హైదరాబాద్లోనే మకాం వేసిన పలువురు నేతలు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పయనం అయ్యారు. కొందరు డీసీసీ నేతలను, మరికొందరు టీపీసీసీ పెద్దలను వెంటబెట్టుకుపోగా.. మరికొందరు ఏకంగా ఏఐసీసీ పెద్దలతోనే లాబీయింగ్ చేస్తుండడం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో వేడిని పెంచింది. నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల వివరాలు.. వరంగల్ తూర్పు: కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, ఎంబాడి రవీందర్, అజ్మతుల్లా హుస్సేనీ వరంగల్ పశ్చిమ: నాయిని రాజేందర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి, కట్ల శ్రీనివాస్, రేపల్లె శ్రీనివాస్, తక్కళ్లపల్లి సారిక, రేపల్లె రంగనాథ్ జనగామ: కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రమళ్ల సుధాకర్, గిరి కొండల్రెడ్డి పాలకుర్తి: అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, బండి సుధాకర్గౌడ్, అనుమాండ్ల తిరుపతిరెడ్డి, డా.లక్ష్మీనారాయణనాయక్ పరకాల: ఇనగాల వెంకట్రామ్రెడ్డి, కొండా మురళీధర్రావు, అవేలి దామోదర్, కట్కూరి దేవేందర్ రెడ్డి, బొమ్మతి విక్రమ్ మహబూబాబాద్: బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ భుక్యా మురళినాయక్, నునావత్ రాధ, నునావత్ రమేశ్, దస్రునాయక్. స్టేషన్ ఘన్పూర్: దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, చేపూరి వినోద్, డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ, గంగారపు అమృతరావు, డాక్టర్ రాజమౌళి డోర్నకల్: జాటోత్ రాంచంద్రు నాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, ననావతు భూపాల్ నాయక్ ములుగు: ధనసరి సీతక్క భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ రావు నర్సంపేట: దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి వర్ధన్నపేట: నమిండ్ల శ్రీనివాస్, కేఆర్ నాగరాజు, బక్క జడ్సన్, సిరిసిల్ల రాజయ్య, సుంచు రవి, బందెల భద్రయ్య, పులి అనిల్, ఆనంద్కుమార్, నరుకుడు వెంకటయ్య, యాక స్వామి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ -
10వేల కాయిన్స్ తో నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థి
-
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం -
Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు. -
కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు
-
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తా: వెన్నపూస రవి
-
మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాశ్ నామినేషన్
-
మునుగోడు ప్రజలు కేసీఆర్కు తగిన బుద్ధి చెబుతారు: బండి సంజయ్
-
మునుగోడు: బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డి నామినేషన్ దాఖలు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా చండూర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వెంట వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. -
వారం, తిథి బాగుందా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 14కావడంతో ఈలోపే నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మంచి రోజుతోపాటు తిథులను చూసుకుంటున్నారు. తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుందని పండితులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 10, 12, 13, 14 తేదీల్లో వారాలతోపాటు తిథులు కూడా బాగున్నాయని, అయితే అభ్యర్థి జాతకాన్ని బట్టి కలిసివచ్చే రోజును ఎంచుకుంటుంటారని ఓ పండితుడు పేర్కొన్నారు. ఈ నెల 10 సోమవారంతోపాటు పాడ్యమి ఉంది. 12వ తేదీ బుధవారం కావడంతోపాటు తదియ అవుతోంది. 13వ తేదీ గురువారం అయినా చవితి అవుతోంది. 14వ తేదీ శుక్రవారం మంచిరోజు కావడంతోపాటు ఆరోజు పంచమి ఉంది. కాబట్టి వారం, తిథి రెండూ బాగున్నాయి. 11వ తేదీ విదియ అయినా మంగళవారం కావడంతో ఆరోజు నామినేషన్ వేసేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 10వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 13వ తేదీ లేదా 14న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
నామినేషన్ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. #WATCH | Opposition's Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena's Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3 — ANI (@ANI) July 19, 2022 -
ప్రధాని సమక్షంలో నామినేషన్ వేసిన జగదీప్ ధన్కర్
సాక్షి, ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన నామినేషన్ సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరుల ధన్కర్ వెంట ఉన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA. Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO — ANI (@ANI) July 18, 2022 #WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi. (Source: DD) pic.twitter.com/jyUOddtxOe — ANI (@ANI) July 18, 2022 -
రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మికుంట వాసి నామినేషన్
హుజూరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ శనివారం ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాంత్ 2018లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2019లో కరీంనగర్ ఎంపీగా, 2019లో హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీలో నిలిచారు. 2020లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో.. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
Kapil Sibal: కాంగ్రెస్కు కపిల్ సిబల్ గుడ్ బై
లక్నో: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జి–23లోని కీలక సభ్యుడు కపిల్ సిబల్ (73) కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. మే 16వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక సమాజ్వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఆయనతో పాటున్నారు. నామినేషన్ అనంతరం సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్తో తనది మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ నెల 16వ తేదీనే కాంగ్రెస్కు రాజీనామా చేశా. నేనిక ఆ పార్టీ నాయకుడిని కాదు’’ అని తేల్చిచెప్పారు. అంతా ఒక్కతాటిపైకి రావాలి ‘‘కాంగ్రెస్తో నాకు లోతైన అనుబంధముంది. 30–31 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం మాములు విషయం కాదు. నేను కాంగ్రెస్లో చేరడానికి ముఖ్య కారణం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 31 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానంటే ఏం జరిగిందో ఆలోచించండి. అందుకే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు (పార్టీకి రాజీనామా) తీసుకోకతప్పదు. అయితే నా సిద్ధాంతం కాంగ్రెస్తో ముడిపడి ఉంటుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి నేను దూరం కాలేదు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ పాటించాలి. అదేసమయంలో స్వతంత్రంగా గొంతుక వినిపించే అవకాశం ఉండాలి. మీరు గొంతెత్తినప్పుడు మరో పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతం కృషి చేస్తా. అన్ని సిద్ధాంతాలను కలుపుకొని ముందుకెళ్తాం. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), స్టాలిన్ (తమిళనాడు సీఎం).. ఇలా ఎవరైనా కావొచ్చు. అందరూ చేతులు కలపాలి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలి’’ అని కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ: కె.సి.వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ నిష్కృమణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ అని, అందులో చాలామందికి చోటు ఉందని వ్యాఖ్యానించారు. హరియాణాలో రెండు రోజుల క్రితం 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, దానికి మీడియాతో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అజంఖాన్ సిఫార్సుతోనే.. సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్వాదీ మద్దతు వెనక ఆ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మద్దతుందని చెప్తున్నారు. ఆయనకు బెయిల్ ఇప్పించడంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఎస్పీ నాయకత్వాన్ని అజంఖాన్ కోరినట్లు తెలిసింది. ఎస్పీకి యూపీ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపింత సంఖ్యాబలం ఉంది. సిబల్ వంటి సీనియర్ నేత, లాయర్ రాజ్యసభలో ఉండడం దేశానికి మంచిదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సిబల్ రాజ్యసభ పదవీ కాలం జూలై 4తో ముగియనుంది. సిబల్ కొంతకాలంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తి వార్తల్లోకెక్కారు. గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ను వీడటం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022 -
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ ప్రక్రియ
-
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
-
పీపీఈ కిట్లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
నామినేషన్ దాఖలు చేసిన సిద్ధూ
అమృత్సర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నగరానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, అది కొనసాగుతుందని, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మజీతియా అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినా.. మజీతాను మాత్రం వీడటం లేదని వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే మజీతాను వీడి, తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని నాశనం చేసిందే అకాళీదల్ అని సిద్ధూ ఆరోపించారు. తనను గెలవనివ్వబోనన్న అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధూ... ఆయనకు దమ్ముంటే పటియాలాను వీడి తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. 30 ఏళ్ల క్రితం మరణించిన తన తల్లి ప్రస్తావన తెచ్చిన తన ప్రత్యర్థులపై ఆయన మండిపడ్డారు. వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్న సిద్ధూ... ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
AP: మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా జకియా ఖానమ్ నామినేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు అయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్మన్ పదవి అవకాశం దక్కనుంది. శుక్రవారం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చదవండి: అల్పపీడనం: భారీ వర్షాలు! సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. జకీయా ఖానమ్కు మండలి వైఎస్ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షదాయకమని అన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం కీలక నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలపై సీఎం జగన్కు ఉన్న ప్రేమ స్పష్టమైందని పేర్కొన్నారు. -
లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు
కైరో: లిబియా నియంత, దివంగత గడాఫీ కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం వచ్చే నెల 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది. గఢాఫీ ప్రభుత్వంలో ఆయన 8 మంది కుమారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ముగ్గురు వివిధ ఘటనల్లో చనిపోయారు. -
ఈటల జమున నామినేషన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యా హ్నం తన అనుచరుడు అరవింద్ భిక్షపతి ద్వారా ఆర్డీవో కార్యాలయానికి నామినేషన్ పత్రాలను పంపారు. తాను బీజేపీ నుంచి గానీ లేదా ఇండిపెండెంట్గా గానీ పోటీ చేస్తానని అఫిడవిట్లో పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా జమున తన ఆస్తులు, తన భర్త ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దంపతులకు కలిపి మొత్తం రూ.73.12 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులివీ.. చరాస్తులు.. ►జమున చేతిలో ఉన్న సొమ్ము రూ. 1,50,000.. రాజేందర్ వద్ద రూ. లక్ష ►కెనరా బ్యాంకులో రూ.4.33 లక్షలు సేవింగ్స్, రూ.58.84 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 43 వేలు సేవింగ్స్. ఎలక్ట్రిసిటీ డిపాజిట్ కింద రూ.89,404 ఉన్నాయి. ►మ్యూచువల్ ఫండ్స్లో రూ. 20,10, 633, జమునా హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రూ.1.05 కోట్ల షేర్లు. అభ య డెవలపర్స్ రూ.43.90 లక్షలు, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్ రూ.2.06 కోట్లు, ఎస్వీఎస్ అర్చవన్లో రూ.4,15,137. ►రూ.16,44 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.20.80 లక్షల విలువైన హోండా కారు, రూ.12.21 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారు, రూ.50 లక్షల విలువైన కిలోన్నర బంగారం. కలిపి మొత్తంగా రూ. 28,68,21,894 విలువైన చరాస్తులు ఉన్నాయి. ►ఈటల రాజేందర్కు ఎస్బీఐలో రూ. 20,097 సేవింగ్స్ ఉన్నాయి. మొత్తంగా రూ.6,20,097 లక్షల చరాస్తులు కలిగి ఉన్నట్టు అఫిడవిట్లో చూపారు. ►2019–20లో జమునకు రూ.1,33, 40,372, రాజేందర్కు రూ.30,16, 592 ఆదాయం వచ్చినట్టు చూపారు. స్థిరాస్తులు..: జమున పేరిట రూ.7.23 కోట్లు, రాజేందర్ పేరిట రూ.60లక్షల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ►జమున డెవలప్మెంట్ ప్రాపర్టీ రూ.1.56 కోట్లు, ఈటల రాజేందర్ పేరిట రూ.7.70 కోట్లు. ►జమున ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.14.78 కోట్లు, రాజేందర్ ఆస్తుల విలువ రూ.12.50 కోట్లు (తనకు దేవరయాంజాల్, శామీర్పేటలో పౌల్ట్రీఫారాలు, గోదాములు, వ్యవసాయ స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు.) ►అభ్యర్థిగా తనకు రూ.4.89 కోట్లు రుణాలు, రాజేందర్కు రూ.3.62 కోట్లు లోన్లు ఉన్నట్టు తెలిపారు. రెండోరోజు ఐదు నామినేషన్లు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సోమ వారం మరో ముగ్గురు అభ్యర్థులకు సం బంధించి ఐదు నామినేషన్లు దాఖలయ్యా యి. ఈటల భార్య జమున ఒకటి, సిలి వేరు శ్రీకాంత్ అనే స్వతంత్ర అభ్యర్థి రెం డు సెట్లు, నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రేకల సైదులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు వచ్చినా.. సాంకేతిక కారణాలతో వారి నామినేషన్లను స్వీకరించలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా నామినేషన్లు వేసేందుకు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. వారికి స్థానికంగా మద్దతిచ్చే 10 మంది లేకపోవడంతో స్వీకరించలేదు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆఫీసు వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు
సాక్షి, హుజురాబాద్: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సొంత వాహనం లేదంట. ఒక్క గ్రాము బంగారం కూడా తన వద్ద లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక తన చేతిలో కేవలం రూ.10 వేలు ఉన్నాయని వెల్లడించాడు. శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించాడు. అయితే గెల్లు శ్రీనివాస్ అఫిడవిట్లో సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా మారింది. తన వద్ద కేవలం రూ.10 వేలు, తన భార్య వద్ద రూ.5 వేల నగదు మాత్రమే ఉందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. బ్యాంకుల్లో రూ.2,82,402 డిపాజిట్లు అతడి వద్ద ఉన్నాయి. అదే విధంగా భార్యకు 25 తులాల బంగారం, బ్యాంకు డిపాజిట్ల కింద రూ.11,94,491 చూపించారు. వీటితోపాటు వీణవంకలో సొంతిల్లు, 10.25 గుంటల స్థలం విలువను రూ.20 లక్షలుగా చూపించారు. అలాగే గెల్లు శ్రీనివాస్కు సొంత వాహనం, కనీసం గ్రాము బంగారం కూడా లేకపోవడం గమనార్హం. పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ భార్య : గెల్లు శ్వేత కేసులు : మూడు -
హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
సాక్షి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఈ.పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: జీ‘హుజుర్’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ -
నామినేషన్ దాఖలు చేసిన మమత
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్.. భవానీపూర్లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్కు మిలాన్ ఘోష్, జంగీపూర్కు సుజిత్ దాస్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. -
వరంగల్ ఎన్నికలు: టికెట్ ఎవరికిచ్చినా ఓకే..
వరంగల్: వరంగల్ బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు టీఆర్ఎస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్లు భారీగానే దాఖలయ్యాయి. నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, చివరిరోజు పలు వార్డుల్లో తల్లీకూతుళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఎదురుకావద్దనే భావనతోనే ముందస్తుగా ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్టు వారు చెప్పుకొచ్చారు. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నేత యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి పోటీలో ఉన్నారు. 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్జీ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి నామినేషన్లు సమర్పించారు. 19వ డివిజన్ నుంచి నామినేషన్లు వేసిన తల్లి ఝాన్సీ, కుమార్తె మౌనిక గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా? -
గ్రేటర్ వరంగల్ ఫైట్: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?
వరంగల్ : గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. చివరిరోజు అదివారం మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి 29వ డివిజన్ కార్పొరేటర్గా నామినేషన్ అందజేశారు. అలాగే, దివంగత మంత్రి దాస్యం ప్రణయ్భాస్కర్ కుమారుడు అభినవ్భాస్కర్ 60 డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. ఇక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోదరి నల్లా స్వరూపరాణి 57వ డివిజన్ నుంచి, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ 10వ డివిజన్ నుంచి, మాజీ స్టాండింగ్ కమిటి చైర్మన్ గుండేటి నరేందర్ 20వ డివిజన్ నుంచి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి 34వ డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బంక సరళాయాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కేడల పద్మ, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ ఒకరు కాకపోతే ఇంకొకరు... నగరంలోని పలు డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరేసి కార్పొరేటర్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42వ డివిజన్ నుంచి, ఆమె కుమార్తె శంకేసి కరుణశ్రీ అదే డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు యోగానంద్ 41 డివిజన్ అభ్యర్థిగా, ఆయన సతీమణి కొల్లూరి స్వరూప 42 డివిజన్ నుంచి, బీజేపీ నాయకులు, సోదరులైన చాచర్ల చిన్నారావు 41 డివిజన్, దీనదయాళ్ 40వ డివిజన్ నుంచి, 40వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున గడ్డం యుగేందర్, ఆయన సతీమణి గడ్డం స్రవంతి, అదే డివిజన్ నుంచి ఆరేళ్లి రవితో పాటు ఆయన సతీమణి కూడా నామినేషన్లను దాఖలు చేశారు. స్రూ్కటినీలో ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైనా మరొకరు పోటీలో ఉండొచ్చనే భావనతో ఇద్దరేసి నామినేషన్లు సమర్పించినట్లు తెలిపారు. నేడు నామినేషన్ల పరిశీలన వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో భాగంగా అదివారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ము గిసింది. ఇక సోమవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేష న్లు స్వీకరించిన వరంగల్లోని ఎల్బీ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో పరిశీలనకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల సమర్పించిన అభ్యర్థుల్లోఉత్కంఠ నెలకొంది. పరిశీలన విధివిధానాలు నామినేషన్ల పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధి కారి(ఆర్ఓ)కి నిబంధనలకు లోబడి సర్వ అధికా రాలు ఉంటాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థితోపాటు ప్రతి పాదించి వ్యక్తి,ఏజెంట్,సమీప బంధువు హాజ రుకావొచ్చు. లేదంటే న్యాయ సలహాదారుడి పరి శీ నలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లోని ఫారం – 8లో పొందుపరిచిన వివరాలను పరిశీలించి అభ్య ర్థి, ప్రతిపాదిత వ్యక్తుల పేర్లు, వివరాలు, సంతకాలను సరిచూస్తారు. అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, ఓటరు జాబి తాలో ఉన్నాయో, లేదో పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల్లో జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీ చేసే వ్యక్తి బీ – ఫారం సమర్పించారా, లేదా అని చూస్తారు. (నావిునేషన్ ఉపసంహరణ గడువు వరకు బీ – ఫారం సమర్పించే వెసులుబాటు ఉంది.) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి చివరి వరకు కూడా బీ – ఫారం సమర్పించకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారనే వివరణ పత్రాన్ని పరిశీలిస్తారు. స్వతంత్య్ర అభ్యర్థిగానై బరిలో ఉంటారా, లేదా అని తెలుసుకుంటారు. గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినప్పటికీ అధికారులు ఇచ్చిన గుర్తుల్లో తాను కోరుకునే గుర్తు ముందుగానే నమోదు చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన డివిజన్లకు సంబంధించి అభ్యర్థి ఆన్లైన్ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు. ఎన్నికల నియమావళి ఆధారంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థి నిబంధనలకు లోబడి ఉంటానని, ప్రచారం ఖర్చుల వివరాలు తప్పక అందజేస్తానని జత చేసిన ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ధృవీకరణ పత్రాల్లో అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు తప్పక నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా నమోదైన కేసులు ఉన్నాయో, లేదో కూడా వెల్లడించి ఉండాలి. డిపాజిట్ జమ చేసిన బిల్లును కూడా పరిశీలించాక అన్నీ సక్రమంగా ఉంటే నామినేషన్ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఏ అభ్యర్థి నామినేషన్ విషయంలోనైనా ప్రత్యర్థులు కానీ, ఇతర వ్యక్తులు కానీ గడువులోగా అభ్యంతరాలు, అభియోగాలు చేసే అవకాశం కల్పిస్తారు. అయితే, తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అభియోగాలను పరిశీలించి నిజమేనని తేలితే నామినేషన్ను తిరస్కరించడంతో పాటు ఇరువర్గాల నుంచి సంతకాలు తీసుకుంటారు. -
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు
నెల్లూరు (అర్బన్): తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ తరుఫున రత్నప్రభ సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి, తమ పార్టీకి నడుమ జరుగుతోందని, రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోయిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రాయలసీమకు నీటి కరువు లేకుండా చేస్తామని చెప్పారు. నామినేషన్ వేసిన సీపీఎం అభ్యర్థి యాదగిరి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సీపీఎం అభ్యర్థి యాదగిరి సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక, మతోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఎం ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తోందన్నారు. బీజేపీ దుర్మార్గాలన్నింటినీ ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. -
నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి