Nose
-
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
ముక్కుదిబ్బడ బాధిస్తోందా?!
అదో చిత్రమైన పరిస్థితి. చూడ్డానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ముక్కు రంధ్రాల్లో ఏదో అడ్డు ఉన్న భావనతో గాలి ఆడటం కష్టమవుతుంది. ఒక్కోసారి ఒక్కో ముక్కు రంధ్రం నుంచి మాత్రమే గాలాడుతుంటుంది. అదీ అతి కష్టంగా. నలుగురితో ఉన్నప్పుడు ముక్కు ఎగబీలుస్తూ, గాలాడని ముక్కు రంధ్రాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి గురక కూడా వస్తుంది. ఈ గాలి ఆడకపోవడం సమస్యకు అదనంగా చికాకూ, చిరాకూ కలుగుతుంటాయి. ఈ సమస్య ఎందుకొస్తుంది, పరిష్కారాలేమిటో చూద్దాం.ముక్కుదిబ్బడ కారణంగా శ్వాస పీల్చుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలతో వచ్చే అలర్జీలు, సైనసైటిస్, ముక్కులోని రెండు రంధ్రాల మధ్యన ఉండే దూలం (సెప్టమ్) సరిగా లేకపోవడం, (అంటే) ముక్కు దూలం పూర్తిగా నిటారుగా లేకుండా అది ఎంతో కొంత ఒంపు తిరిగి ఉండటం వంటి అనేక అంశాలు శ్వాస సరిగా తీసుకోలేకపోవడానికి కారణమవుతాయి. నిజానికి ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లేలోపు... ఊపిరి పీల్చుకునే సమయంలోనే ముక్కులో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ముందుగా బయటి నుంచి ముక్కులోకి ప్రవేశించిన గాలి ఉష్ణోగ్రతను... ఊపిరితిత్తుల వద్ద ఉన్న ఉష్ణోగ్రతతో దాదాపు సమం చేయడానికి ముక్కులోని మ్యూకస్ పొరలపై ఉండే నేసల్ టర్బినేట్స్ ప్రయత్నిస్తాయి. బయటి తేమను ఊపిరితిత్తుల వద్ద ఉన్న తేమతో సమం చేయడానికీ ఈ టర్బినేట్స్ కృషిచేస్తాయి. ముక్కులోపలి వెంట్రుకల సహాయంతో గాలిలోని కాలుష్యాలు కొంత ఫిల్టర్ అవుతాయి. అయితే అలర్జీల సమస్య ఉన్నవారిలో ముక్కులోని మ్యూకస్ పొరల్లో ఇన్ఫ్లమేషన్ కారణంగా వాపు వచ్చే అవకాశముంది కాబట్టి ముక్కు ద్వారా గాలి సాఫీగా లోపలికి వెళ్లే ప్రక్రియలో కొంత అడ్డంకులు ఏర్పడతాయి. ఈ అడ్డంకుల కారణంగానే ‘ముక్కు దిబ్బడ’ వస్తుంది. దాంతో గాలిని బలంగా పీల్చడం లేదా నోటితో గాలి పీల్చాల్సి రావడం జరుగుతుంటుంది. ఇలాంటివారు కాస్త పక్కకు ఒరుగుదామన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పడుకుంటే ఈ బాధ మరింత పెరుగుతుంది. కూర్చున్నప్పుడే కొద్దిమేర ఈ సమస్య తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని వైద్య చికిత్సలు... ముక్కుదిబ్బడ సమస్య ఉపశమనం కోసం కొన్ని రకాల సింపుల్ చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాతో డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్, నేసల్ స్ప్రేస్ వంటి మందుల్ని వాడటం మేలు. వీటితో చాలా వరకు మంచి ప్రయోజనం ఉంటుంది. ∙యాంటీహిస్టమైన్స్ : ట్యాబ్లెట్స్ రూపంలో లభ్యమయ్యే ఈ మందులు కఫం రూపంలో ఉండే మ్యూకస్ను వీలైనంతగా తొలగించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని దూరం చేసి, శ్వాస సాఫీగా జరిగేలా చూస్తాయి. అయితే యాంటీహిస్టమైన్స్లో ప్రతికూలత ఏమిటంటే ఇవి వాడినప్పుడు బాధితులు చాలావరకు మందకొడిగా కనిపిస్తుంటారు. చురుకుదనం ఎక్కువగా ఉండదు. డీకంజెస్టెంట్స్ : ముక్కులో కేవలం రెండు చుక్కలతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ చుక్కల మందు... ముక్కులోని అడ్డంకి ఫీలింగ్ను తొలగించడానికి, టర్బినేట్స్ డీ–కంజెషన్కు ప్రయత్నిస్తాయి. ముక్కు కారడం వంటి సమస్యలు పరిష్కారం దొరకక΄ోయినా శ్వాస సాఫీగా అయ్యేందుకు ఇవి చాలావరకు తోడ్పడతాయి. ∙సెలైన్ నేసల్ స్ప్రే : ముక్కులోకి స్ప్రే చేసుకునే ఈ మందులు ముక్కుదిబ్బడను తాత్కాలికంగా తగ్గిస్తాయి. ఆవిరి పట్టడం : అనేక శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఇంటి చిట్కా ఇది. ముక్కు దిబ్బడ పట్టిన సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా ప్రయత్నించదగిన ప్రక్రియ ఆవిరి పట్టడం. విక్స్ లాంటి మందును వేడి నీటిలో వేసి ఆవిరి పట్టే ఈ ప్రక్రియ చాలా సురక్షితమైనది. అయితే వీటిన్నింటితో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు ముక్కు దూలం సరిచేయడానికి శస్త్రచికిత్సను సూచిస్తారు. లేదా ఇతరత్రా కారణాలను బట్టి చికిత్స అందిస్తారు. మరికొన్ని అనర్థాలు కూడా... తరచూ ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుండేవారిలో దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వాళ్లలో గురక, స్లీప్ ఆప్నియా, తగినంత నిద్ర లేకపోవడం, పట్టిన కొద్దిపాటి నిద్రలో నాణ్యత లేకపోవడం, రాత్రి నిద్ర సరిపోకపోవడంతో అసహనం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్ (చదవండి: ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?) -
రూ. 15 కోసం మహిళ ముక్కును తెగనరికి..
అరారియా: ఒక్కోసారి చిన్నపాటి వివాదాలే దారుణాలకు దారి తీస్తుంటాయి. ఇటువంటి ఉందంతం బీహార్లోని అరారియాలో చోటుచేసుకుంది. కేవలం రూ. 15 కోసం ఒక ప్రబుద్ధుడు ఒక మహిళ ముక్కును తెగనరికాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం బాధితురాలి పిల్లలు ఏదో ఒక దుకాణానికి వెళ్లి అక్కడ చిప్స్ వగైరా కొనుగోలు చేశారు. అయితే ఆ మహిళ వద్ద చిల్లర డబ్బులు లేవని, బకాయి ఉన్న మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని దుకాణదారునికి హామీ ఇచ్చింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలై కొద్దిసేపటికే పెద్ద గొడవకు దారితీసింది. ఇంతలో ఆ దుకాణం యజమాని ఆ మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముక్కు కోసుకుపోయింది. ఈ ఘటన ఫోర్బ్స్గంజ్ బ్లాక్లోని వార్డు నంబర్ ఆరులో చోటుచేసుకుంది.హలీమా ఖాతూన్, రోష్ని, సోనీతో పాటు నిందితుడి కుటుంబ సభ్యులు తన కుమార్తెపై దాడి చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తన కుమార్తె ముక్కుకు తీవ్ర గాయమయ్యిదని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
26 ఏళ్లుగా ముక్కులోనే ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ముక్క!..కట్చేస్తే ..!
చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్కి. లెగో బ్రాండ్కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా. View this post on Instagram A post shared by 🇵🇭 Ben Havoc (@bigoompalumpia) (చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
బాబోయ్ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్ను కలిసాడు. అయినా ఫలితం లేదు.బొద్దింకను ఎలా గుర్తించారు?ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు. -
Hyderabad: ముక్కువోని దీక్షతో..ముక్కే.. కుంచై..
⇒కొనతేలిన ముక్కునే కుంచెగా.. అబ్బురపరుస్తున్న చిత్రకారుడు⇒ఆకర్షించే వందలాది నాసిక చిత్రాలు..⇒అబ్దుల్కలాం ప్రశంసలు.. మరెన్నో అవార్డులు, బిరుదులు..⇒సత్యవోలు రాంబాబు అసాధారణ ప్రతిభ.. ఇప్పటి వరకూ పెన్సిల్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, నెయిల్ ఆర్ట్, బ్రష్ ఆర్ట్, నైఫ్ ఆర్ట్, ఆఖరికి కాళ్లతోనూ బొమ్మలు వేసేవాళ్లను.. ఇలా.. అనేక రకాల పెయింటింగ్స్ వినుంటాం... కానీ అతను ముక్కునే కుంచెగా ఎంచుకున్నాడు.. ముక్కుతో ఆర్ట్ ఎలా వేస్తారండీ బాబూ అనొచ్చు... అదే ఇందులో ఉన్న గొప్పతనం.. పూర్తిగా చూస్తూ వేస్తేనే చాలా కష్టమనిపించే ఆర్ట్ని ముక్కుతో వేయడమంటే.. ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి.. ఎందరో ప్రముఖుల చిత్రాలను సైతం తన ముక్కుతో గీసి వారికి అభిమానాన్ని చూరగొన్నాడు. అతడే నిజాంపేటకు చెందిన సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సత్యవోలు రాంబాబు. తన చిత్రకళా ప్రస్థానంలో ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. ఆయన గురించి మరిన్ని వివరాలు మీ కోసం... డాక్టరో..యాక్టరో..సాఫ్ట్వేరో..ఇలా తాము ఎంచుకున్న రంగాన్ని ఏలేసేయాలన్న కసితో నగరానికి వచ్చేవారెందరో..వారందరి లాగే ఓ యువకుడు చిత్ర కళను తన ఊపిరిగా చేసుకుని, భుజాన ఓ సంచి..అందులో కొన్ని ఖాళీ పేపర్లు.. నాలుగైదు పెన్సిళ్లు.. చాలన్నట్లు హైదరాబాద్లో అడుగుపెట్టాడు. చిత్రకళ కడుపు నింపుతుందా ‘భాయ్’.. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా.. అన్నవాళ్లు నోరెళ్లబెట్టేలా చేశాడు.. ఎంచుకున్న కళే జీవితంగా బతికాడు.. రాణించాడు.. మరెందరికో ఆదర్శంగా నిలిచాడు.. అయితే అందరిలా గుర్తింపు తెచ్చుకుంటే మజా ఏంటి అనుకున్నాడో ఏమో.. కొనదేలిన నాసికాన్నే తన కుంచెగా ఎంచుకున్నాడు. క్షణాల్లో ఔరా.. అనే చిత్రాలను సాక్షాత్కరింపజేస్తున్నాడు.ముక్కుతో ఏడేళ్ల సాధన తన కెరీర్లో మామూలు చిత్రకారుడిగా మిగిలిపోకూడదని తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనే నాసికా చిత్రకారుడిగా మలిచింది. ఏడేళ్ల పాటు సాధన చేసి ముక్కును కుంచెగా చేసుకుని వందలాది బొమ్మలను గీసి ఎందరో మన్ననలను పొందారు. ముక్కుతో బొమ్మలు గీసే అరుదైన చిత్రకారుడంటూ అతని ప్రతిభను గుర్తించిన బీబీసీ వార్తా సంస్థ సైతం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజల సమక్షంలో నాసికా చిత్రాలు గీశారు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ సమక్షంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్కలాం బొమ్మను చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. అబ్దుల్కలాం సైతం అబ్బురపడి ప్రశంసిస్తూ రాంబాబుకు లేఖ రాశారు.లైవ్లోనూ మేటిగా.. ఒకవైపు నృత్య విన్యాసాలు.. వాటిని అనుకరిస్తూ మరోవైపు ముక్కుతో చిత్రాలు గీయడమంటే ఆషామాషీ కాదు. సంగీత, నృత్య, చిత్ర సంగమంగా గతంలో డిజైర్స్ పేరిట రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాంబాబు అసాధారణ ప్రతిభను కనబరిచారు. వేదికపై నృత్యకారిణులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుంటే రాంబాబు నాట్యభంగిమలు, హావభావాలను, ముఖ కవళికలను చకచకా చిత్రించి ఔరా అనిపించారు. రెండు నిమిషాలకో చిత్రం చొప్పున కేవలం పది నిమిషాల్లో ఐదు నృత్య భంగిమలకు ప్రాణం పోసి చూపరులను ఆకట్టుకున్నారు.ఎన్నో అవార్డులు.. ప్రశంసలు..👉 ఏషియా వేదిక్ రీసెర్చ్ యూనివర్శిటీ నాసికా చిత్రలేఖనం, సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్.👉 మానవతా స్వచ్ఛంద సంస్థ అమలాపురం వారిచే చిత్రకళా రత్న అవార్డు.👉 లంక ఆర్ట్స్థియేటర్ వారిచే నాసిక చిత్రకళా రత్న.👉 యువ కళావాహిని వారిచే స్వామి వివేకానంద అఛీవ్మెంట్ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిచే బెస్ట్ టీచర్ అవార్డు.👉 ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే బెస్ట్ ఆరి్టస్ట్ అవార్డు. 👉 సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ వారిచే గురుబ్రహ్మ అవార్డు.👉 లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి బెస్ట్ సరీ్వసు అవార్డు.👉 సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ హ్యూమానిటీ అవార్డు.👉 ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ నుంచి స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు. 👉 కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ నుంచి కళాప్రతిభ అవార్డు. 👉 సుధా ఆర్ట్స్ అకాడమీ నుంచి కళానిధి అవార్డు. 👉 జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నుంచి కళాభిషేకం అవార్డు. 👉 మెగా రికార్డ్స్ సంస్థ నుంచి కళా ప్రతిభ మూర్తి, ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు. 👉 యశోద ఫౌండేషన్ నుంచి కళారత్న అవార్డు.విశ్వగురు అవార్డ్స్ను స్థాపించి..విభిన్న రంగాల్లో మేటిగా సేవలందించే వారిని గుర్తించి వారిలో నూతనోత్తేజాన్ని కలిగించాలన్న ఉద్దేశ్యంతో విశ్వగురు అవార్డ్స్ను నెలకొల్పి ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఏటేటా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులను అందించి సన్మానించడం ఆనవాయితీ. అలాగే నిజాంపేటలో సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా చిత్రకళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిక్షణ అందిస్తున్నారు.రెండు దశాబ్దాల క్రితం..ఓ 20 ఏళ్ల క్రితం..అసలు చిత్రకళ అంటే అంతగా పట్టించుకోని రోజులు.. పశి్చమ గోదావరి జిల్లా వేగివాడకు చెందిన సత్యవోలు రాంబాబు పాఠశాల స్థాయిలో చిత్రకళపై ఎంతో మక్కువ పెంచుకున్నాడు. తన గురువు ఇజ్రాయిల్ ప్రేరణతో పాఠశాల స్థాయిలోనే లోయర్, హయ్యర్ పూర్తి చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుని చిత్రకళపై తనకున్న అభీష్టాన్ని చాటిచెప్పాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. చదివింది ఇంటరీ్మడియెట్ అయినా కళలో తనకున్న ప్రావీణ్యాన్నే నమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాడు. అడపాదడపా జరిగే పోటీల్లో పాల్గొనడం, అక్కడ ఇచ్చే పారితోíÙకంతో జీవితాన్ని నెట్టుకురావడం చేశాడు. ఇంటర్తో ఆగిపోయిన చదువును కొనగించాలని డిగ్రీలో చేరి మరోవైపు చిత్రకళను కొనసాగించారు. అలా తన ప్రస్థానం మొదలై ఎందరికో ఆ కళను పంచే స్థాయికి ఎదిగారు. -
మనోళ్లు ముక్కుతో కూడా రికార్డులు కొట్టేస్తారు; వరుసగా మూడోసారి
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసింది. వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai— Guinness World Records (@GWR) May 30, 2024ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం. -
మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు
ఇటీవల కంటి నుంచి పురుగులు పడటం, పొట్టలో పురుగులును గుర్తించి తీయడం విన్నాం. అంతవరకు బాగానే ఉంది. కలుషిత ఆహారం లేదా శుభ్రత పాటించకపోవడం వచ్చిందని అన్నారు వైద్యులు. కొందరూ కొన్ని రకాల జంతువులను తినడం వల్ల కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడొక మహిళ ముక్కులో ఒకటి రెండు కాదు ఏకంగా వందలకొద్ది పురుగులు బయటపడ్డాయి. వైద్యులు సైతం విస్తుపోయారు. ఈ భయానక ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..థాయిలాండ్కి చెందిని 59 ఏళ్ల మహిళ ముక్కు మూసుకుపోయి విపరీతమైన బాధని అనుభవించింది. ఒక వారం రోజుల నుంచి ముక్కు నుంచి రక్త కారడంతో భయపడి థాయిలాండ్లోని చియాంగ్ మాయిలోని నాకోర్న్సింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దుమ్ముకు సంబంధించిన ఎలర్జీగా భావించి సైనసైటిస్కు చికిత్స ఇవ్వడం జరిగింది. అక్కడ నివాసితలు అలెర్జీలు, రినిటిస్ వంటి శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఆ సమస్యగానే భావించి చికిత్స అందించారు. అందులో భాగంగానే ముక్కుకి స్కానింగ్ చేయగా..వందలకొద్ది పురుగులు కనిపించాయి. ఒక్కసారిగా వైద్యులు సైతం కంగుతిన్నారు. వెంటనే సదరు మహిళకు ఎండోస్కోపి ద్వారా ఆ పురుగులన్నింటిని తీసేశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఒక వేళ వీటిని సకాలంలో గుర్తించి తొలగించనట్లయితే మెదడు వరకు ఈ పురుగులు వలసపోయి తీవ్రమైన సమస్యలు తలెత్తి మరణానికి దారితీస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య సరైన శుభ్రత పాటింకపోవడం వల్లే వస్తుందని అన్నారుఆమె రెండు నాసికా కుహరాల్లో వందలకొద్ది పురుగులు ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఎక్స్రే తీసినప్పుడూ ఆమె ఎడమ జెగోమాటిక్ సైనస్లో తెల్లటి మచ్చ ఉండటంతోనే పురుగులు ఉన్నాయన్న అనుమానం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి అరుదైన కేసు 2022లో పోర్చుగల్లో నమోదయ్యింది. అక్కడ ఒక వృద్ధుడి చెవిలో మాంసంతినే పురుగులును గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. (చదవండి: అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!) -
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్) ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?
ఓ చిన్నారి పుట్టుకతో ముక్కు లేకుండా జన్మించాడు. ఆ చిన్నారి తల్లికి 20 వారాల గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డలో ఏదో సమస్య ఉందని తెలిసింది. ఆ తర్వాత స్కానింగ్లో బిడ్డ ముక్కు కనిపించ లేదని, అలాగే బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేడని చెప్పారు వైద్యులు. అయితే ఆ తల్లి అబార్షన్ చేయించుకునేందకు ఇష్టపడలేదు. ఎలా ఉన్నా.. భూమ్మీదకు తీసుకురావాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. చివరికీ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించాడు. ఆ బిడ్డ బతికే క్షణాలు కూడా తక్కవే అని పెదవి విరిచారు డాక్టర్లు. సీన్ కట్ చేస్తే..22 ఏళ్ల తర్వాత.. అసలేం జరిగిందంటే..యూఎస్కి చెందిన జాన్, మేరీ జో దంపతులు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీ జో సరిగ్గా 20 వారాల గర్భతగా ఉండగా.. ఏదో సమస్య తలెత్తుందని అనిపించింది. వారి ఊహించినదే నిజమైంది. స్కానింగ్లో పుట్టబోయే బిడ్డ మెదడు సరిగా అభివృద్ధి చెందలేదని, అలాగే ముక్కు కూడా లేదని తేలింది. శిశువు పుట్టిన బతకడం కష్టం అని గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా మేరీ జోకి సూచించారు. అయితే అందుకు ఆ దంపతుల మనసు అంగీకరించ లేదు. దీంతో వారు ఏం జరిగినా ఆ బిడ్డను ఈ భూమ్మీదకు తెచ్చి పెంచుకుందామని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అయితే ఆ బిడ్డ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించడం జరిగింది. అదీకూడా డెలీవెరీకి ఐదువారాల ముందుగానే సీజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఇక ఆ శిశువుకి పుట్టడంతోనే ముక్కు, కనురెప్పలు ఏర్పడలేదు. పైగా శిశువు మెదడులో ఎడమవైపు భాగం కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆ శిశువు పాదాలకు వేళ్లు కూడా లేవు. దీంతో డాక్టర్లు ఎంతసేపో ఆ శిశువు బతకదని పెదవి విరిచారు. ఎందుకంటే? ముక్కు లేదు కాబట్టి అస్సలు శ్వాస పీల్చుకోగలుగుతుందా లేదనది ఒక ప్రశ్న అయితే ఆక్సిజన్ మెదడకు సక్రమంగా అందకపోతే బతికే ఛాన్స్ అనేది కచ్చితంగా ఉండదు. ఈ రసవత్తరకరమైన ఆందోళనల మధ్య ఓ అద్భుతంలా ఆ శిశువు శ్వాస పీల్చుకోవడం బతకడం చకచక జరిగిపోయింది. వైద్యులు కూడా ఊహించని రీతీలో ఆ శిశువు కోలుకుంటూ..జస్ట్ డెలివరీ అయిన ఒక్క వారంలోనే డిశ్చార్చ్ అయ్యి తల్లిదండ్రలతో వెళ్లిపోయాడు. అయితే తల్లిదండ్రలు ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ అత్యంత భద్రంగా పెంచారు. ఎందుకంటే ముక్కులేదు కాబట్టి రంధ్రంగా ఉన్న ఆ ప్లేస్లో ఒక సన్నని నెట్మాదిరి క్లాత్ని అడ్డంగా ఉంచేవారు. అలాగే కళ్లకు రెప్పలు లేవు కాబట్టి నిద్ర వచ్చే సమయంలో వైద్యులు ఇచ్చిన ఒక రకమైన ద్రవాన్ని రక్షణగా ఉంచేవారు. అలా ఆ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు ఓ గాజు ముక్కలా కాపడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే వరకు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 సర్జరీలు దాక చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 22 ఏళ్లు. ఇప్పుడు అతను అందరిలానే సంగీతం, బేస్బాల్ వంటి ఆటలు ఆడుతూ హాయిగా గడుపుతున్నాడు. ఆ చిన్నారికి పేరు గ్రే కెనాల్స్. పుట్టుకతో ముక్కు లేకపోవడంతో కేవలం దీని పునర్నిర్మాణం కోసం ఏకంగా 11 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా కొద్దిమందికి మాత్రమే జరగుతుందని వైద్యులు చెబుతున్నారు. పైగా పూర్తి ముక్కుని పునర్నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన సర్జరీ కూడా. అలాగే అతడి తల్లిందండ్రులు కూడా అతడు ఎదిగే క్రమంలో తన తోటి పిల్లలతో చులకనకు గురవ్వకూడదని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు. అలాగే తన పట్ల ఎవ్వరూ జాలి చూపకుండా ఎలా మసులుకోవాలో కూడా కెన్నాల్కి తల్లిదండ్రులు నేర్పించారు. అంతేగాదు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి బాధపకడ పోగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేకమైన తల్లిదండ్రులకే ఇస్తాడని సగర్వంగా చెప్పారు. పైగా వైకల్యంతో పుట్టిన పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు వ్యవహరించాలనేందుకు స్ఫూర్తిగా నిలిచారు ఆ దంపతులు. బిడ్డ సమస్యను ముందు తల్లిదండ్రులే ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీ అయితేనే బిడ్డలో స్థైర్యాన్ని నిపంగలమని చాటి చెప్పారు. ఇక కెన్నాల్ కూడా తాను ఇన్ని సర్జరీలు చేసి నరకయాతన చూసిన తల్లిదండ్రులు ఇచ్చిన స్థైర్యాన్ని ఆశని వదులకోకపోవడం విశేషం. ఇక కెనాల్స్ కూడా ఈ సర్జరీల వల్ల తన జీవితానికి కలుగుతున్న అంతరాయన్ని అధిగమించి చక్కగా ముందుకు సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. మరీ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా!. (చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..) -
ముక్కుతో 'ఈల' పాట విన్నారా?
ఈల పాటలు వినే ఉంటారు. కానీ ఇలాంటి ఈల పాట విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే? ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండి ఉండరు కూడా. వింటే ఇలా కూడా ఈల వేస్తారా అని ఆశ్చర్యోవడం ఖాయం.! ఈలపాట పాడటం అంత ఈజీ కాదు. చాలామంది హుషారుగా ఉన్నప్పుడు ఏదో కొద్ది క్షణాల సేపు ఈలతో కూనిరాగాలు తీస్తుంటారు గాని, పూర్తిపాటను శ్రుతిలయలు తప్పకుండా పాడలేరు. అలా పాడగలిగే వారు చాలా అరుదు. అందుకే ఈలపాట కచేరీలు చేసేవారిని అంతా అబ్బురంగా చూస్తారు. ఆరితేరిన ఈలపాట గాయకులు సైతం నోటితో ఈలవేసే బాపతే గాని, వారెవరూ ముక్కుతో ప్రయత్నించలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ యువతి మాత్రం ఇంచక్కా ముక్కుతో ఈలపాటలను ఇట్టే పాడేస్తోంది. ఈమె పేరు లులు లోటస్. కెనడాలోని ఒంటారీయోకు చెందిన ఈమె ముక్కు దగ్గర మైకుపెట్టుకుని పాడుతుంటే జనాలు ఉర్రూతలూగుతారు. ముక్కు ద్వారా 44.1 డెసిబల్స్ ధ్వనితో ఈలపాటలు పాడగలగడమే ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ఈమెను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ..
ఎన్నో రకాల క్యాన్సర్ల గురించి విన్నాం. కానీ ముక్కు క్యాన్సర్గా గురించి విని ఉండం. ఐతే ఇది ఎందువల్ల అనేది? కారణాలు తెలియాల్సి ఉంది. గానీ దీని కారణంగా పలువురు పేషెంట్లు ముక్కును కోల్పోయారు. తాజాగా బ్రిటన్కి చెందిన ఓ మహిళా ఇలానే మొత్తం ముక్కును కోల్పోయింది. అసలేంటి ముక్కు క్యాన్సర్? వస్తే మొత్తం ముక్కునే తొలగించక తప్పదా..? ముక్కు లోపాల కణితి వచ్చి అసాధారణంగా పెరగడం ప్రారంభమైతే దాన్ని ముక్కు క్యాన్సర్ లేదా నాసికా క్యాన్సర్ అంటారు. వీటిలో రకాలు కూడా ఉంటాయి. కణ క్యాన్సర్, అడెనోకార్సినోమా, న్యూరోబ్లాస్టోమా, అడినాయిడ్ సిస్టిక్ కార్సినోమా, సార్కోమా తదితరాలు. ఇది నాసికా కుహరం లేదా పారానాసల్ లోపల ప్రారంభమయ్యే స్థితిని బట్టి ముక్కుకి సంబంధించిన ఆ రకమైన క్యాన్సర్లుగా నిర్థారిస్తారు వైద్యులు. ఈ వ్యాధి బారిన బ్రిటన్కి చెందిన 40 ఏళ్ల టీనా ఎర్ల్స్ పడింది. ఆమె ఐదుగురు పిల్లల తల్లి. ఆమె తరుచుగా ముక్కు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండేది. ముఖం ఎడమవైపు మొద్దబారిపోతున్నట్లు ఉండేది. లోపాల ఒక విధమైన గడ్డ ఉండి నొప్పి వచ్చేది. సాధారణంగా ముక్కులో వచ్చే గడ్డలనే ఆమె భావించింది. తరచుగా ముక్కు రక్తస్రావం అయ్యేంది కూడా. ఇక ఈ బాధను భరించలేక వైద్యలను సంప్రదించింది టీనా. అక్కడ తాను ముక్కుకు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుసుకుని షాక్కి గురయ్యింది. రెండో దశలో ఉందని సత్వరమే రెడియోథెరఫీ వంటి చికిత్సలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఈ చికిత్సలో ముక్కును తొలగించక తప్పదని కూడా చెప్పారు. దీంతో టీనా ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ప్రాణాలు నిలబడాలంటే టీనా ఆ ట్రీట్మెంట్ తీసుకోక తప్పలేదు. చికిత్సలో భాగంగా టీనా ముక్కును తొలగించారు వైద్యులు. ముక్కు లేకపోవడం కారణంగా గొంతు తడిగా ఉండకుండా పొడబారిపోతుంది. అందుకోసం ప్రోస్టేటిక్స్తో తయారు చేసిన ముక్కు లేదా మరేదైన రక్షణ కవచాన్ని ధరించాల్సి ఉంటుంది. అయితే ఆమెకు కృత్రిమ ముక్కు అసౌకర్యంగా ఉండటంతో క్లాత్ మాదిరి గాజును ధరించి బయటకు తిరిగేది. అంతేగాదు ఈ పరిస్థితి కారణంగా జీవితాంతం ట్యూబ్ ద్వారే ఆమెఆహారాన్ని స్వీకరించాల్సి ఉంది. ఇన్నీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా టీనా పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న కృతనిశ్చయంతో ఉండటం విశేషం. తన ముఖాన్ని చూసి ఎవరైనా కామెంట్ చేసినా వాటిని ఎదుర్కొనగలను, ఇదివరకటి టీనాలా కాకుండా మరింత స్ట్రాంగ్గా ఉంటానని నమ్మకంగా చెప్పింది. ఎవరికీ వస్తుందంటే.. నిపుణులు అభిప్రాయం ప్రకారం 55 ఏళ్ల పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధూమపానం, కలప, తోలు దుమ్ము, వంటి వాటికి సంబధించిన వృత్తులు చేసే వారికి ఈ నాసికా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం.. కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులు దెబ్బతిన్నప్పుడు లేదా అసాధారణంగా మారినప్పుడు కణితులు ఏర్పడతాయి. ఈ జన్యు మార్పులు ఎందుకు సంభవిస్తాయో ఇప్పటి వరకు నిపుణులకు కచ్చితమైన కారణాలు తెలయరాలేదు. లక్షణాలు.. దీర్ఘకాలిక ముక్కు సమస్య లేదా సైనస్ వాసన కోల్పోవడం ముక్కు నుంచి రక్తం కారడం తలనొప్పులు తరుచుగా ముక్కు కారిపోవడం(జలుబు) నీళ్ళు నిండిన కళ్ళు ముక్కు, కళ్ళు, చెవులు బుగ్గల చుట్టూ నొప్పి ముక్కు, ముఖం, మెడ లేదా మీ నోటి పైభాగం పెరుగుదల దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు వినికిడిలో ఇబ్బంది అస్పష్టమైన దృష్టితో కూడిన కంటి సమస్యలు (చదవండి: వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?) -
ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!
ఆభరణాలు ఎన్ని ఉన్నా ఆ ఒక్క అలంకారం తక్కువైతే అందానికి పరిపూర్ణత చేకూరదు. ఆ ఒక్కటే ముక్కుపుడక లేదా ముక్కెర. వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోతూ నోస్పిన్గా స్టైల్లో తనదైన శైలిని చూపుతూ మురిపెంగా మెరిసిపోయే ముక్కున సింగారపు వేడుకలకు ప్రత్యేకం. వ్యక్తిగత శైలికి బలమైన ప్రతిబింబంగా నిలిచే ముక్కెర ఎంపిక కోసం కొన్ని కసరత్తులు చేయాల్సిందే. గుండ్రని ముఖం ఉన్న మహిళలు పొడవుగా ఉండే నోస్రింగ్ ఎంచుకోవడం మంచిది. అలాగే, ముఖం కోలగా ఉండేవారు గుండ్రని నోస్పిన్ డిజైన్స్ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. సంప్రదాయంలో మెరుపు బ్రైడల్ కలెక్షన్లో భాగంగా స్వచ్ఛమైన బంగారు, డైమండ్ ముక్కు ఆభరణాలను ఎంచుకుంటుంటారు. అయితే గ్రాండ్గా ఉండేందుకు బంగారం, డైమండ్, ముత్యాలు, ఇతర రత్నాలతో ఉండే ముక్కెరలను ఎంచుకోవచ్చు. ఇటీవల బ్రైడల్ నోస్ రింగ్స్లో డిజైన్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉంటున్నాయి. ఆధునిక శైలి వృత్తి, ఉద్యోగాలలో ఉంటున్న మహిళలైతే ఎలాంటి హంగులూ లేని సింపుల్ డిజైన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో డ్రెస్సులకు తగినట్టు మార్చుకోగలిగే ట్రెండింగ్ డిజైన్స్ను ఎంచుకుంటున్నారు. వీటిలో అన్ని రకాల స్టోన్స్కు మాత్రమే కాదు సిల్వర్, స్టీల్ నోస్రింగ్స్కు ఓటేస్తున్నారు. వీటిలో సెంట్రల్ నోస్ రింగ్స్ మరింత ట్రెండీగా మారాయి. రాష్ట్రాల వారీగా... మహారాష్ట్రీయుల ముక్కెర చంద్రవంక లేదా జీడిపప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది. ముత్యాలూ, వజ్రాలు, రాళ్లు, పూసలు జత చేసి ఉంటాయి. మహారాష్ట్ర పెళ్లికూతురు కేవలం ముక్కెర కోసమే వధువు కావాలని కోరుకునేంత అందంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల మహిళలు బులక్ అనే పేరున్న వెడల్పాటి నోస్ రింగ్స్ను ఎంచుకుంటారు. పంజాబీయుల నథ్ అనే పేరు గల ముక్కు ఉంగరాలు చాలా తేలికగా ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్ మహిళల నోస్ రింగ్స్ కూడా నథ్ లేదా నాథూరి అని పిలిచే నోస్ రింగ్స్ను పోలి ఉంటాయి. ఇవి బంగారం లేదా వెండితో ఉంగరంలా తయారుచేస్తారు. వీటిలో విలువైన రత్నాలను పొదుగుతారు. వేడుకలలో ధరించేవి పెద్దవిగా ఉంటాయి. ముక్కు నుంచి జుట్టుకు జత చేసే గొలుసు ఉన్న నోస్ రింగ్స్ను కూడా వాడుతుంటారు. ఇవి బ్రైడల్, ప్రత్యేక సంప్రదాయ వేడుకల అలంకారాలలో కనిపిస్తుంటాయి. ప్రాచీన భారతీయ రాజకుటుంబీకులు వీటిని ధరించేవారు. ఆ తర్వాతి కాలాల్లో పెళ్లి కూతురు అలంకరణలో భాగమైంది. ఉత్తరాఖండ్ మహిళల ఆభరణాల్లో నోస్ రింగ్ను టెహ్రీ నథ్ అని పిలుస్తారు. దీని అలంకారం అద్భుతంగా చెప్పుకుంటారు. ఈ నోస్ రింగ్లో విలువైన కెంపులు, ముత్యాలతో పొదిగిన వెడల్పాటి బంగారు తీగ ఉంటుంది. నెమలి డిజైన్స్ కూడా ఇందులో చూస్తాం. ఇక్కడి వివాహిత మహిళలు ఈ నోస్ రింగ్ను శుభప్రదంగా భావిస్తారు. ఆభరణాల కళాత్మకతలో ఈ నోస్ రింగ్ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తామర పువ్వు, హంస ఆకారంలో ఉన్న ముక్కెరలు గోవా, కోంకణ్ ప్రాంతాల వధువులు ఎంపిక చేసుకుంటారు. ఈ డిజైన్స్ కర్నాటక, కేరళలో కూడా ధరిస్తారు. దక్షిణాన శాశ్వతం తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ముక్కు ఉంగరాల కన్నా స్టడ్స్కే ప్రాధాన్యత. డైమండ్స్, కెంపులు, బంగారంతో తయారుచేసినవి ఉంటాయి. దక్షిణ భారత దేశాన ముక్కుపుడక ఒక శాశ్వత ఎంపికగా ఉంటుంది. ముక్కుపుడక అందం వారి అనుభవంతో కలిసి ప్రకాశిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. (చదవండి: అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!) -
ఆ అలవాటే కరోనా అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమా?
కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు. నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం. (చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!) -
చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..
ఈ సీజన్లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి. ముక్కుపైన ఐస్ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్ / ఈఎన్టీ స్పెషలిస్ట్ను కలవాలి. (చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..) -
ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్!
ప్రస్తుతం టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. వైద్య శాస్త్రంలో కూడా మానవుడు చాలా పురోగతి సాధించాడు. ఈ క్రమంలో గతంలో సాధ్యం కానివాటిని కూడా సాధ్యపడేలా చేస్తున్నారు వైద్యులు. ఇటీవల కొందరు తమ రూపాన్ని మార్చుకోవడానికి తరచుగా ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ శస్త్రచికిత్సలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల, 20 ఏళ్ల మహిళ ముక్కుపై కుక్క కొరికింది. అందుకే ఆమె శస్త్రచికిత్స చేయించుకుంది, అయితే ఆపరేషన్ చేసిన ప్రదేశంలో వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి. అసలు అలా ఎందుకు జరిగిందంటే.. గత సెప్టెంబరులో ట్రినిటీ రౌల్స్ అనే యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లగా.. అక్కడ ఒక కుక్క దాడి చేసి ఆమె ముక్కును కొరికింది. ఈ ఘటనలో ట్రినిటి తన ముక్కు కొనను కోల్పోయింది. ముఖం, చెవి, ముక్కు మీద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కుక్క దాడి కారణంగా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే ఆమె ముఖాన్ని పునర్నిర్మించడానికి అనేక సర్జరీలు చేశారు. కానీ స్కిన్ గ్రాఫ్ట్ అని పిలువబడే ఒక ఆపరేషన్ ఆమె ముఖంలో భారీ మార్పులకు దారితీసింది. ప్రస్తుతం ఇప్పుడేమో ఆమె కోలుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. ఆపరేషన్లో భాగంగా వైద్యులు ఆమె నుదిటిపై ఉన్న ప్రాంతం నుండి చర్మాన్ని తీసి ఆమె ముక్కుపైకి అమర్చారు. ఇది ఆమె ముఖంలో సాధారణ రూపాన్ని పునరుద్ధరించింది, కానీ కొన్ని రోజుల్లో, ఆమె సమస్య మరింత తీవ్రమైంది. దీని వల్ల ఆమె ముక్కుపై వెంట్రుకలు మొలవడం మొదలైంది. ప్రస్తుతం ఈ వెంట్రుకల తొలగింపుకు ట్రినిటీ చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన బాధను పంచుకుంది ట్రినిటి. నెటిజన్లు కూడా ట్రినిటి ఫోటోని చూసి ఆశ్చర్యపోతున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు. చదవండి: Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే -
ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని..
గర్ల్ఫ్రెండ్ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కును తెగ్గోశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతనిని వెదికి పట్టుకున్నారు. బాంస్తాలీ గ్రామానికి చెందిన విక్రమ్కు కొన్నేళ్ల క్రితం మొహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమాదేవితో వివాహం జరిగింది. తరువాత వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే ఇంతలో విక్రమ్.. గ్రామానికి మరో యువతితో అఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీమ భర్తతో గొడవపడుతుండేది. రాత్రి భోజనాలయ్యాక.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి భోజనాలయ్యాక భార్యాభర్తల మధ్య ఆ యువతితో అఫైర్ విషయమై వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్ ఆ కోపాన్ని తన కుమార్తెపై చూపించాడు. దీనిని భార్య అడ్డుకుంది. దీంతో విక్రమ్ ఒక పదునైన ఆయుధంతో సీమ ముక్కును తెగ్గోశాడు. దానిని జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న స్థితిలో.. వెంటనే ఆమె అదే స్థితిలోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు నిందితుడు విక్రమ్ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి నిందితుడిని జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్!
వాసన అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పదార్థాలను వాసన చూసి, అదేమిటో గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి వాసనను పసిగట్టి ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఇంటిలోని విద్యుత్ వైర్ ఏదైనా ఓవర్హీట్ అయినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. దానిని వెంటనే పసిగడితే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొన్ని వాసననలు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఉదాహరణకు తొలకరి చినుకులు పడుతున్నప్పడు మట్టి నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు. పెట్రోల్ వాసన, కొత్త పుస్తకాల వాసనను ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. కొందరు అయోడెక్స్, నెయిల్ పాలిష్ వాసనలను ఇష్టపడుతుంటారు. అయితే కొందరికి ఏ వాసనలు నచ్చుతాయో అవే మరికొందరికి అస్సలు నచ్చవు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసనల వెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు గ్రహిద్దాం. సువాసన, దుర్వాసనల వెనుక.. ప్రముఖ శాస్త్రవేత్త రేచల్ ఎస్ హర్జ్ రాసిన The Scent of Desire పుస్తకంలో ఏ వాసన అయినా బాగుందని, బాగోలేదని విభజించలేమన్నారు.అయితే మనం వాసన పీల్చుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్ ప్రకారం అది బాగుందని, లేదా బాగోలేదని చెబుతుంటామన్నారు. మనం మానసిక భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఏదైనా స్మెల్ బాగుందనో లేదా బాగోలేదనో చెబుతుంటాం. దీనిప్రకారం చేస్తూ మనం ఎమోషన్స్కు దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన అయినా మనకు సాధరణంగానే అనిపిస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం మనకు పాజిటివ్ ఫీల్ కలిగించిన వాసనలను మనం ఇష్టపడుతుంటాం. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు మొదలైన వాటి వాసన ఈ కోవలోకే వస్తుంది. కొందరు విచిత్రమైన వాసనలను ఇష్టపడుతుంటారు. అంతమాత్రాన వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతీవాసనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీకరిస్తారు. అందుకే కొందరికి సువాసన అనిపించేది మరికొందరికి నచ్చదు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్ ప్రారంభం
స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేగాదు ఈ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్కి రూ. 325లకి, ప్రైవేట్ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్కు సంబంధించిన వ్యాక్సిన్ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: అండమాన్లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు) -
ముక్కుస్రావం (చీమిడి) రంగును బట్టి వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చు..!
ముక్కుస్రావాల గురించి మాట్లాడటం, జనబాహుళ్యంలో దానికి ఉండే పేరుతో పిలవడం అంత సభ్యత కాదనే అభిప్రాయంతో దాని గురించి పెద్దగా మాట్లాడరు. అయితే ముక్కుస్రావం ఏ రంగుతో ఉందనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని చెప్పవచ్చంటున్నారు నిపుణులు. స్రావం ఏ రంగుతో ఉంటే ఎలాంటి సూచన అందుతుందో తెలిపే కథనం ఇది. ఏ రంగుతో ఏ సూచన అంటే..? రంగులేని స్వచ్ఛమైన స్రావం స్రావం స్వచ్ఛంగా ఉందంటే అందులో నీరు, ప్రోటీన్లు, కొన్ని లవణాలు ఉన్నాయని అర్థం. అలా ఉంటే ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అని సూచన (ఒకవేళ పరిమాణం ఎక్కువగా ఉంటే జలుబు లేదా అలర్జీ ఉండి ఉండవచ్చు.) ముక్కులో ఉండే మ్యూకస్ అక్కడి తేమను, ముక్కు లోపలి పొరల లైనింగ్ను రక్షిస్తుంది. మంట (ఇరిటేషన్) రాకుండా కా΄ాడుతుంది. తెలుపు ముక్కు దిబ్బడ వేసి, ముక్కురంధ్రాలు మూసుకుపోయి (నేసల్ కంజెష్చన్) ఉండవచ్చు. ముక్కు లోపలి పొరల్లో వాపు లేదా ముక్కు లోపలి కణజాలంలో మంట (నేసల్ టిష్యూ ఇరిటేషన్) ఉండవచ్చు. ముక్కులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండి ఉండవచ్చు. ముక్కులో అలర్జీల కారణంగా అలా ఉండవచ్చు లేదా డీహైడ్రేషన్ను సూచించవచ్చు. పసుపుపచ్చ జలుబు కారణంగా దేహం జలుబుతో లేదా ఇతర ఇన్ఫెక్షన్తో పోరాడుతుండవచ్చు. మంట (ఇరిటేషన్)కు సూచన కావచ్చు. ఇన్ఫెక్షన్తో పోరాడి నశించిన తెల్లరక్తకణాలు... ఇలా పసుపురంగుతో బయటపడతాయి. కచ్చితంగా వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం లేదుగానీ... జబ్బుతో బాధపడుతున్న (సిక్) ఫీలింగ్ ఉండవచ్చు. ఆకుపచ్చ మన వ్యాధినిరోధక శక్తి చాలా ఎక్కువగా పోరాడుతోందని అర్థం. స్రావాల్లో నశించిన తెల్లరక్తకణాలూ, ఇతరత్రా మరికొన్ని నశించిన కణాల సమూహమని అర్థం. సైసన్ ఇన్ఫెక్షన్ ఉన్నదనడానికి సూచన కావచ్చు. ఆకుపచ్చ స్రావాలు వరసగా 12 రోజులకు పైగా కనిపిస్తే డాక్టర్ను కలవాలనడానికి సూచన. పింక్ / ఎరుపు ముక్కు స్రావాలు ఎండినట్లుగా కావడం, మంట (ఇరిటేషన్) రావడం, అక్కడి కొద్దిగా దెబ్బతిన్నదనడానికి సూచన. ఈ పింక్ లేదా ఎరుపు రంగు... రక్తపు చారికకు సూచన. బ్రౌన్ ఆ ప్రాంతాల్లో రక్తస్రావమై అది ఎండిపోయినదడానికి సూచన. ఆ రంగు పదార్థాన్ని (ముక్కు΄÷డం లాంటిది) దేన్నైనా పీల్చి ఉండవచ్చు. వెంటనే ప్రమాదకరం కాక΄ోయినా, అప్రమత్తంగా ఉండాలి. దగ్గు సమయంలోనూ బ్రౌన్ రంగు కళ్లె/గళ్ల పడితే బ్రాంకైటిస్కు సూచన కావచ్చని అనుమానించాలి. డాక్టర్ను సంప్రదించాలి. నలుపు పొగతాగే అలవాటు ఉన్నవారై ఉండవచ్చు. కాలుష్యమూ కారణం కావచ్చు. డ్రగ్స్ తీసుకుని కూడా ఉండవచ్చు. దేహంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కి సూచన కావచ్చు. ఈ సందర్భాల్లోనూ, పై సమస్యలేవీ కానప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. -
వాట్! చేతిపై 'ముక్కు' పెరగడమా? దాంతో ట్రాన్స్ప్లాంట్!
శరీరంలో కొన్ని అవయవాలు కోల్పోతే ట్రాన్స్ప్లాంట్ చేయడం పరిపాటే. కొన్ని అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేయడమనేది కాస్త క్రిటికల్. కానీ క్యాన్సర్ కారణంగా ముక్కుని కోల్పోయిన ఒక మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్సతో విజయవంతంగా ముక్కుని ట్రాన్స్ప్లాంట్ చేశారు. వైద్య ప్రక్రియలోనే ఇదోక అద్భతమైన చికిత్స విధానమనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్లోని టౌలౌస్కు చెందిన ఒక మహిళ 2013లో నాసిక కుహరం క్యాన్సర్ కారణంగా ముక్కున్ని కోల్పోయింది. దీంతో ఆమె అవయవం లేకుండానే కొన్ని ఏళ్లు గడిపింది. అయితే ఒక సరికొత్త వైద్య విధానం ద్వారా కొత్త ముక్కును పొందగలిగింది. అదీకూడా అమె చేతిపైనే పెరిగిన ముక్కుతో. అదేలా సాధ్యం అని సందేహం తలెత్తుంది కదా. కానీ సాధ్యమే అంటూ చేసి చూపించారు ఫ్రాన్స్ సర్జన్లు. ఈ మేరకు వైద్యులు మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింటెడ్ బయోమెటీరియల్తో తయారు చేసిన ముక్కును ఆమె ముంజేయికి అమర్చి పరీక్షిస్తారు. ఏకంగా రెండు నెలలు పాటు వైద్య పరికరంతో కూడిన ముక్కును అలా ఉంచి పెరిగిన తర్వాత ముఖానికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. చేతిలోని రక్తనాళాలు ముఖంలోని రక్త నాళాలతో అనుసంధానం చేసి సర్జరీ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సర్జరీని చేయలేదు. ఇది ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్ వైద్య బృందాల సహకారంతో ఈ సర్జరీని విజయంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. (చదవండి: నర్వ్ స్టిమ్యులేషన్తో... పక్షవాతానికి చెక్!) -
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
Health: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఉల్లిపాయ, కొత్తిమీర, విటమిన్ ఇ క్యాప్సూల్తో!
Nose Bleeding Problem: ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. తగ్గడం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తారు. అయితే కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది... ఇలా చేయండి! ►ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ఉల్లిపాయను గుండ్రంగా కట్ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూడాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్లా పని చేస్తుంది. ఇలా చేయటం తొందరగా ఉపశమనం పొందుతారు. ►రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్నిస్తుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు రాసుకుంటే సరిపోతుంది. ►ముక్కు నుంచి రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి. ►చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్ ఇ క్యాప్సూల్ను కత్తిరించి అందులో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి డ్రాపర్తో ముక్కులో రెండు చుక్కలు వేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ►ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్ ’సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది. ►అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్, ఐరన్, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
గుడిలో దళితుడికి ఘోర అవమానం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్ కుమార్ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్ కుమార్ మేఘవాల్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. -
విమ్స్లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్లో ప్రారంభించినట్టు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ఎథిక్స్ కమిటీ అనుమతుల మేరకు విమ్స్లో మొదలు పెట్టామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇంట్రా మస్క్యులర్ ఇంజక్షన్ రూపంలో మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని చెప్పారు. అలా కాకుండా పోలియో డ్రాప్స్ తరహాలో ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందన్నారు. ఇంజక్షన్ టీకా కంటే డ్రాప్స్ టీకా వల్ల వచ్చే యాంటీబాడీస్ సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు మొదటి, రెండు ట్రయల్ రన్స్లో తేలిందని చెప్పారు. ట్రయల్ రన్లో భాగంగా 18 ఏళ్లు దాటిన 3,160 మందికి టీకా వేయనున్నట్టు తెలిపారు. ఇంజక్షన్ టీకా తరహాలోనే మొదటి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తామన్నారు. ఇంజక్షన్గా వేసే టీకా ద్వారా ఒక రకమైన రక్షణ ఉంటే.. ముక్కులో వేసే డ్రాప్స్ టీకా ద్వారా రెండురకాల రక్షణ ఉంటుందని చెప్పారు. చదవండి: (డీజిల్ బస్సులకు టాటా.. ఇ–బస్సులకు స్వాగతం) ఇంజక్షన్ టీకాతో సిస్టమిక్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుందని, డ్రాప్స్ టీకా వల్ల సిస్టమిక్తో పాటు, మ్యూకోజల్ ఇమ్యూనిటీ లభిస్తుందని ఆయన తెలిపారు. మూడోదశ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా డాక్టర్ పి.విజయకుమార్, సహాయకులుగా డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ షాఫినా వ్యవహరిస్తున్నారు. -
పుట్టింటికి వెళ్లాలన్న భార్య.. కోపంతో ముక్కు కోసేసిన భర్త
జైపూర్: భార్య పుట్టింటికి వెళ్లాలని అడిగింది. భర్త ఇప్పుడు కాదన్నాడు. అయినా వినలేదని ఆ వ్యక్తి తన భార్య ముక్కు కోసేశాడు. గృహ హింసకు సంబంధించిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్తాన్లోని జోధ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్, పూనమ్ దేవి భార్యాభర్తలు. ఇటీవల పూనమ్ దేవి తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని ఓ సారి పుట్టింటికి వెళ్లి వస్తానని భర్తను కోరింది. కానీ ఆమె భర్త ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత వెళ్లమని వీలైతే అప్పుడు తాను కూడా వస్తానని చెప్పాడు. అయితే ఈ క్రమంలో శుక్రవారం మరోసారి పుట్టింటికి వెళ్లాలని అడగగా అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో క్షణికావేశంలో భూమా కత్తితో పూనమ్ దేవి ముక్కు కోసేశాడు. దీంతో ఆమె బిగ్గరగా అరవడంతో ఇరుగుపొరుగు వారు మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత పూనమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం వారు ఈ విషయాన్ని తన సోదరుడికి కూడా తెలియజేశారు. పూనమ్ సోదరుడు తన బావమరిది భూమ రామ్పై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ ఫ్రెండ్ని నమ్మి 300 కి.మీ వెళితే అఘాయిత్యం.. అశ్లీల వీడియోలు తీసి.. -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
ఊపిరితిత్తులను ఇలా కాపాడుకుందా..!
ఊపిరితిత్తులు ఎప్పుడూ శ్వాసిస్తూ ఉంటాయి. కాబట్టి బయటి నుంచి కాలుష్యాలూ కరోనా వైరస్సులూ కలగలిసి దెబ్బతీసే అవకాశాలు ఎక్కువే. అయితే వాటి రక్షణ కోసం ఏర్పటైన వ్యవస్థ మన దేహంలోనే ఉంటుంది. ముక్కునుంచే మొదలయ్యే రక్షణ... శ్వాసం కోసం తీసుకునే గాలి ప్రవేశించే ప్రవేశద్వారమైన ముక్కు నుంచి రక్షణ వ్యవస్థ మొదలైపోతుంది. ముక్కులో ఉండే వెంట్రుకలు పెద్ద కాలుష్యపు కణాలను (పార్టికల్స్ను) చాలావరకు అక్కడే కట్టడి చేస్తాయి. దానికి తోడు ముక్కు ఓ ఎయిర్కండిషనర్లా కూడా పనిచేస్తూ ఊపిరితిత్తులకు రక్షణ కలిగిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బయటి గాలిని ముక్కు ఒకింత చల్లబరిచాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా జాగ్రత్త తీసుకుంటుంది. అలాగే వాతావరణం బాగా చల్లబడే ఈ సీజన్లో ఆ చలిగాలి ప్రవేశించకుండా, దాంతో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు బాగా సంకోచించుకుని పోకుండా అదే ముక్కు జాగ్రత్తపడుతుంది. ఈ సీజన్లో చలిగాలిని కాసింత వేడిగా మారాకే ముక్కు గాలిని లోనికి పంపుతుంది. ఇలా మన ముక్కు ఊపిరితిత్తులకు దాదాపుగా ఒకేలాంటి ఉష్ణోగ్రత ఉన్న గాలిని అందజేస్తుంది. నిర్మాణమే అద్భుతం... ముక్కు చివరన ఉండే వాయునాళం (ట్రాకియా) మొదటి అంతస్తు అనుకుంటే ఊపిరితిత్తుల చివరి అంచెలో ఉండే ఆల్వియోలస్ అనే గాలిగదిది చివరి అంతస్తు. ఇలా మన శ్వాస వ్యవస్థలో 28 అంతస్తులుంటాయి. లంగ్స్కు ప్రతిరోజూ 16 వేల లీటర్ల గాలి అందుతున్నప్పుడు... కేవలం ఒక కిలో కంటే కాస్తంత ఎక్కువ బరువు ఉండే ఊపిరితిత్తుల్లో ఇంత పెద్దమొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఎయిర్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. చివరి అంతస్తు అయిన ఆల్వియోలైలో అతి సన్నగా చీలిన రక్తనాళాలుంటాయి. ఆల్వియోలైకు చేరినప్పుడు ద్రవంలా ఉండే రక్తం... ఒక పల్చని పేపర్షీట్లా మారి అలా నిలబడిపోతుంది. అప్పుడు ఆ 28వ అంతస్తులో బయటి ఆక్సిజన్ దేహానికి అంది, శరీరంలోని కార్బన్డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. ఇలా వెళ్లే క్రమంలో ఊపిరితిత్తులను బయటి కాలుష్యాల నుంచి రక్షించడానికి సన్నటి సీనియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ వెలుగుతున్న కొవ్వొతి మంట చివరిభాగంలా, ఒక్కోసారి కొరడా ఝుళిపించినట్లుగా కదులుతూ గాలిలోని పొగ, కాలుష్యాలను బయటకు పంపిస్తుంటాయి. సాధారణంగా మన శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ తయారవుతూ ఉంటుంది. అలాగే కాలుష్య పదార్థాలను బయటకు నెట్టివేసే సీలియా సక్రమంగా పనిచేయడానికి వీటి చుట్టూ పలచని మ్యూకస్ ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. అందుకే మన ముక్కు ఉపరితలం వద్ద ఉంటే మ్యూకస్ ఎప్పుడూ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. ఇలా మ్యూకస్తో కలిపి కాలుష్యాలను బయటకు నెట్టేసే చర్య కారణంగా ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియరీ వ్యవస్థల నిర్మాణాన్ని మ్యూకోసీలియరీ ఎస్కలేటర్స్ అని కూడా అంటుంటారు. ఇలా అవి శరీరంలోకి వచ్చే పదార్థాలను (ఫారిన్ బాడీ) బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్నుంచి మనల్ని కాపాడతాయి. చలికాలంలో మరింత జాగ్రత్త అవసరం... ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఉదయం వేళ మినహా గాలి పొడిగా ఉంటుంది. (అందుకే ఈ సీజన్లో ఒంట్లో ఉన్న తేమను వాతావరణం బయటకు లాగేస్తూ ఉన్నందుకే ఒళ్లు, చర్మం, పెదవులు పగిలినట్లుగా అయిపోతాయి. దాన్ని అరికట్టేందుకే మనం వాజిలెన్ వంటివి రాస్తూ ఒంట్లోని తేమను బయటకు పోకుండా రక్షించుకుంటూ ఉంటాం). గాలిలో తేమ తక్కువగా ఉండి, గాలి పొడిగా ఉండటంతో దాని ప్రభావం సీలియరీ వ్యవస్థ మీద కూడా పడి అది దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఈ పొడిదనం కారణంగా మ్యూకస్ ఎండిపోయి చిక్కగా మారి కాలుష్యాలను బయటికి నెట్టడం కూడా కష్టమవుతుంది. పొగతాగే అలవాటుతోనూ, కొన్నిసార్లు కొన్ని రకాల మందులు వాడటం ద్వారా (ఉదాహరణకు ఎట్రోపిన్ వంటివి), మద్యపానంతో కూడా మన ఊపిరితిత్తుల సొంత రక్షణ వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నామని గ్రహించి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ఏం చేయాలి? మనం ఈ కరోనా సీజన్లో వాడే మాస్క్ చలిగాలిని నేరుగా ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చాలావరకు కాపాడుతుంది. అలాగే కాలుష్యాలనూ అరికట్టగలుగుతుంది. కాబట్టి ఇటు కరోనా నివారణతో పాటు ఊపిరితిత్తుల రక్షణకూ మాస్క్ ఉపయోగపడుతుందని గ్రహించి... తప్పక వాడాలి. ∙సీలియా బాగా పనిచేయడానికి గాలిలో తేమ పెంచాలి. ఇందుకోసం తరచూ ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలు చేపడితే అది తేమను పెంచడంతో పాటు ఈ సీజన్లో శ్వాసనాళాలు కుచించుకుపోకుండా చూస్తూ... ఊపిరితిత్తులకు గాలి ధారాళంగా అందేందుకూ దోహదపడుతుంది. ∙పెదవులతో పాటు గాలి ప్రవేశ ద్వారమైన ముక్కు చివరల వద్ద ఉండే చర్మం కూడా ఈ సీజన్లో పగిలే అవకాశం ఉన్నందున, అక్కడి చర్మం సెన్సిటివ్గా మారకుండా అక్కడ కూడా వాజిలెన్ రాయడం మంచిది. ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే మానేయాలి. -
ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ..
-
ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ.. అలరిస్తోన్న వ్యక్తి
సాక్షి, మహబూబ్నగర్: ప్రతి ఒక్కరిలో ఏదో ఓ కళ ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన చేస్తే అందులో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నోటితో వేణుగానం చేయటం సహజమే.. కాని మహబూబ్నగర్ జిల్లాలో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పిల్లనగ్రోవిని ముక్కుతో వాయించి ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గట్టు కురుమన్న కుటుంబ పోషణ కోసం గడచిన 30 ఏళ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. వాటిని మేపే క్రమంలో ఖాళీ సమయాన్ని వృధా చేయటం ఎందుకని భావించిన ఆయన కురుమూర్తి స్వామి జాతరలో ఓ ప్లూట్ కొనుగోలు చేసి సినిమా పాటలు, జానపద గేయాలు ఆలపించటం మొదలు పెట్టాడు. ఇలా అందరు చేస్తారు... కానీ తాను ప్రత్యేక ఉండాలని భావించి ముక్కుతో ప్లూట్ వాయించటం సాధన చేశాడు కురుమన్న. సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం కురుమన్న ముక్కుతో ఫ్లూట్ వాయిస్తూ మధుర గీతాలు ఆలపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముక్కుతో గానం చేస్తున్న తనకు గ్రామస్తుల నుంచేకాక ఇతర ప్రాంతాల వారిని నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నాడు కురుమన్న. ఎవరికైనా ఆసక్తి ఉంటే తాను వారికి ముక్కుతో ఫ్లూట్ వాయించటం నేర్పుతానని అంటున్నాడు. -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
‘వ్యాక్సిన్ ఇలా ఇస్తే అద్భుత ఫలితాలు’
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు రూపొందించిన వివిధ రకాల వ్యాక్సిన్లను హ్యూమన్ ట్రైల్స్ చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లలో మూడో దశ వ్యాక్సిన్లను విన్నూతంగా రూపొందిస్తున్నారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులతో పాటు, రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తోంది. దీంతో చాలా సందర్భాలలో మనుషులు శ్వాస ఆడక మరణిస్తున్నారు. కాబట్టి మొదటే ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ వ్యాక్సిన్ అందించగలిగితే ఎలా ఉంటుందనే దానిపై సైంటిస్ట్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ వైద్యులు ఈ తరహా ప్రయోగాలు చేశారు. ఇక ఈ పరీక్షలలో విజయవంతమైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీని గురించి అలబామా యూనివర్శిటీ నిపుణులు మాట్లాడుతూ, మిగిలిన వ్యాక్సిన్ల కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ఎక్కువ ఫలితాన్ని అందిస్తోంది. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని, ఒకవేళ వస్తే మాత్రం ఇది తప్పకుండా మంచి ఫలితాల్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: మరణాల్లో ముందున్న మహారాష్ట్ర -
ఇలా కరోనా వైరస్ రానే రాదట!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ తలుపుల హ్యాండిల్స్, ఇంటి తలుపుల హ్యాండిల్స్, మెట్ల రెయిలింగ్, కరెంటు స్విచ్చులు, టేబుల్ ఉపరితలాలు, టూ వీలర్ల హాండిల్స్, కారు స్టీరింగ్ తదితర ఉపరి తలాలను కరోనా రోగులు ముట్టుకున్నట్లయితే వాటిపై వైరస్ ఉండి పోతుందని, ఆ తర్వాత వాటిని ఇతరులు ముట్టుకున్నట్లయితే వారి చేతులకు వైరస్ అంటుకుంటుందని, ఆ చేతులతో ముక్కును, నోటిని లేదా కళ్లను తాకితే కరోనా వైరస్ సోకుతుందని తొలినాళ్లలో తెగ ప్రచారం అయింది. (చదవండి: జూలైకి 25 కోట్ల మందికి టీకా) అందువల్ల అట్టలు, కాగితాలు, రాగి ఉపరితలాలపై కరోనా వైరస్ నాలుగు గంటలపాటు, ప్లాస్టిక్పై ఏడు నుంచి 10 గంటల వరకు బతికి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. అందుకని ప్రజలు వార్తా పత్రికలను మాన్పించారు. పాల ప్యాకెట్లను డెటాల్తో కడగడం మొదలు పెట్టారు. ఆన్లైన్ పార్శల్స్ను ఒకటి, రెండు రోజుల పాటు ముట్టుకోకుండా దూరంగా ఉంచారు. ఇలా వస్తువుల ఉపరి తలాల వల్ల ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందదని, కరోనా రోగులకు సమీపంలోకి వెళ్లడం వల్ల వారి నోరు, ముక్కు నుంచి వచ్చే ఉఛ్వాస నిశ్వాసాల వల్ల, వాటి నుంచి వెలువడే తుంపర్ల వల్ల ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తోందని అమెరికాకు చెందిన ప్రాఫెసర్ గాంధీ అమెరికా సైన్స్ వెబ్సైట్ ‘నాటిలస్’కు తెలిపారు. (పది నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ!) కరోనా రోగులు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలను ముట్టుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఒక్క శాతం కన్నా తక్కువేనని గాంధీ తెలిపారు. అయితే ఈ అపోహల వల్ల ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునే మంచి అలవాటైతే ప్రజలకు అబ్బింది. అయితే చేతులు కడుక్కోవడం కన్నా ఇతరులకు భౌతిక దూరం పాటించడమే ఉత్తమమని ఆయన చెప్పారు. ఆయన తన అధ్యయన వివరాలను ‘లాన్సెట్’ జర్నల్కు వెల్లడించారు. (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం) -
వైరల్: అతడు ముక్కు కత్తిరించేసుకున్నాడు!
బ్రెసీలియా: ఏదైనా అవయవానికి లోపముంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి సరి చేయించుకుంటాం. అదేంటో కానీ ఈ మధ్య కొందరికి అన్ని అవయవాలు బాగుంటే నచ్చడం లేదు. మొన్నా మధ్య ఓ వ్యక్తి తన చెవులను కత్తిరించి జాడీలో భద్రపరుచుకున్నాడని చదివాం కదా! ఇప్పుడో వ్యక్తి ఏకంగా ముక్కును కత్తిరించేసుకుని అందరినీ షాక్కు గురి చేస్తున్నాడు. ఇది చదవగానే మీకు రామాయణంలోని శూర్పణఖ గుర్తొస్తుంది కదూ! పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా ముక్కును కత్తిరించేసుకున్న తర్వాత రాక్షసుడిలానే కనిపిస్తున్నాడు. ఎందుకిలా చేశాడు అంటే.. అది ఓ సరదా అని చెప్తున్నాడు. (చదవండి: ఇదేం పిచ్చి: చెవులను కత్తిరించి భద్రంగా..) బ్రెజిల్ దేశానికి చెందిన మైకెల్ ఫరోడో ప్రాడో ఓ టాటూ ఆర్టిస్టు. అతడి భార్య, స్నేహితులు కూడా టాటూ ఆర్టిస్టులే కావడంతో మైకేల్ శరీరమంతా పచ్చబొట్లు పొడిచారు. అయినప్పటికీ అతడికి సంతృప్తి కలగలేదు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది. సైతాన్గా అవతరించాలనే కోరిక పుట్టింది. ఇందుకోసం సంవత్సరాల తరబడి ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఎట్టకేలకు ముక్కును తొలగించుకున్నాడు. దీంతో అప్పటికే తల మీద ఉన్న కొమ్ములు, వికృతంగా మార్చుకున్న ముఖభాగం, ఇప్పుడు కోసేసిన ముక్కుతో నిజంగానే దయ్యంలా కనిపిస్తున్నాడు. భయంకరమైన తన కొత్త రూపాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచానికి తన పేరును డెవిల్ ప్రాడోగా పరిచయం చేసుకున్నాడు. కాగా ప్రపంచంలోనే నాసికాన్ని తొలగించుకున్న మూడో వ్యక్తిగా మైఖేల్ అవతరించాడు. (చదవండి: ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!) View this post on Instagram A post shared by #DIABÃOPRADDO (@diabaopraddo) on Sep 24, 2020 at 7:12pm PDT -
శంకరప్పా.. శభాష్!
కర్నూలు, మహానంది: సాధారణంగా నోటితో పిల్లనగ్రోవితో పాటలు పాడుతుండడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన నాసికారంధ్రాలతో పిల్లనగ్రోవిని ఊదుతూ సంగీత స్వరాలను పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బూరగమాడకు చెందిన శంకరప్ప మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్ణాటకలో ఓ ఉత్సవానికి వెళ్లిన ఆయన పిల్లనగ్రోవిని కొనుక్కుని మేకలు కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా ఊదుతూ కొన్నేళ్లకు పాటలు పాడే స్థాయికి వెళ్లాడు. అయితే ఏదో ఒక కొత్తదనం ఉండాలన్న కాంక్షతో ముక్కురంధ్రాలతో ఊదడం ప్రాక్టీస్ చేశాడు. నోరు మూసుకుని ముక్కురంధ్రంతో పిల్లనగ్రోవిని ఊదుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడేళ్ల నుంచి ఇలా చేస్తున్నానని, ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి భక్తుల ముందు ప్రదర్శిస్తూ వారు ఇచ్చిన పదో ఇరవయ్యో తీసుకుంటూ ఉంటానని శంకరప్ప ‘సాక్షి’తో తెలిపారు. మహానందీశ్వర దర్శనానికి వచ్చిన తన ప్లూట్ ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. -
నీ ముక్కు చాలా పొడవు.. నిన్ను పెళ్లి చేసుకోలేను!
సాక్షి, బెంగళూరు: కాబోయే భర్త ముక్కు పొడవుగా ఉందంటూ ఓ యువతి నిశ్చితార్థం చేసుకున్నాక పెళ్లికి నిరాకరించింది. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న యువకుడి తరఫు బంధువులు లబోదిబోమంటున్నారు. కోరమంగలకు చెందిన జ్యోతిప్రకాష్ బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఓ మాట్రిమోనీ సైట్ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయం కాగా.. ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుకున్నారు. ఇద్దరి ఉద్యోగాలు, అభిరుచులూ నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలు గతేడాది సెప్టెంబర్ 9న వీరి నిశ్చితార్థం నిర్వహించారు. యువతి కోరిక మేరకు తిరుపతిలో జనవరి 30 వివాహం చేసేందుకు నిర్ణయించారు. దీంతో యువకుడి బంధువులు తిరుమలలో 70 రూమ్లు బుక్చేశారు. రూ.4 లక్షలతో పెళ్లిదుస్తులు కొనుగోలు చేశారు. అంతలో తనకు పెళ్లి ఇష్టం లేదంటూ అక్టోబర్ 23న హిమబిందు కబురు పంపింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని.. ప్లాస్టిక్ సర్జరీతో సరిచేయించుకుంటే పెళ్లికి ఒప్పుకుంటానని షరతు విధించింది. అతని ఫోన్ నంబర్నూ బ్లాక్ చేసింది. దీంతో జ్యోతిప్రకాష్.. కుటుంబ సభ్యులతో కలిసి కోరమంగల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. -
ముక్కు చేసే ముఖ్యమైన పనులివి...!
ఊపిరి పీల్చే ప్రక్రియలో ఆక్సిజన్ను ఊపిరితిత్తులకు అందించడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన పనులనూ చేస్తుంది ముక్కు. అవేమిటో, వాటి సంక్లిష్టతలెలా ఉంటాయో తెలుసుకుందాం. ముక్కు చేసే పనుల్లో అతి పెద్ద పని అదో ఎయిర్ కండిషనర్లా వ్యవహరించడం. ముక్కు ప్రతిరోజూ దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది. చలికాలంలో వాతావరణంలో చాలా పొడిగాలి ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో గాలిలో తేమ ఒక్కోసారి 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి గాలి లాంటిది కావాలి. అందుకే ఒక పెద్ద చెట్టు సైజ్లో ఉండే ఎయిర్ కండిషనర్ను కేవలం రెండు సెంటీమీటర్లకు కుదిస్తే ఎలా ఉంటుందో ముక్కులో గాలి తేమను ఒకేలా ఉంచే వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ముక్కు రంధ్రాల పని ఇది... ఒకప్పుడు ఇంట్లో బల్బుల దగ్గరికి, దీపాల దగ్గరికి కీటకాలు రాకుండా చూసేందుకు నూనెలో ముంచి తీసిన పేపర్ను వేలాడగట్టేవారు. దానికి పురుగులు అంటుకుపోయేవి. అచ,్చం ముక్కులోని వెంట్రుకలు కూడా ఇదే పని చేస్తాయి. ఆ వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే అలా చిక్కుకుపోయే వాటిని ముక్కు అక్కడే పేరుకుపోయి ఉండనివ్వదు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా హానికరమైన క్రిములు పేరుకుపోతాయి. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్ను ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది ముక్కు. అలా తొలగించడానికి సీలియా అనే అతి చిన్న (మైక్రోస్కోపిక్) చీపుర్లు పనిచేస్తుంటాయి. అవి కొరడాల్లా కదులుతూ మ్యూకస్ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. అక్కడ అత్యంత ప్రభావపూర్వకమైన యాసిడ్ స్రవించి, ఆ బ్యాక్టీరియాను కాల్చేస్తుంది. ముక్కులోని ఆ సీలియా చీపుర్లు ప్రతి ఒక్క సెకండ్కూ పదిసార్లు కొరడా ఝళిపించినట్లుగా కదులుతూ మ్యూకస్ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. జలుబు చేసినప్పడు ఈ మ్యూకస్ మరింత ఎక్కువగా స్రవిస్తుంది. అది గొంతులోకి చేరడానికి బదులు ముక్కు రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. దాన్నే ముక్కు కారడంగా మనం చెబుతుంటాం. ముక్కు వాసనలను గుర్తుపడుతుందిలా... ముక్కు విధుల్లో ముఖ్యమైనది వాసన చూడటం కూడా. అది దాదాపుగా 4,000 రకాల వాసనలను గుర్తించగలదు. నిజానికి కొంతమందిలో వాసన పసిగట్టే సామర్థ్యం మిగతావాళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సామర్థ్యం ఉన్నవారు దాదాపు 10,000 రకాల వాసనలు గుర్తుపట్టగలరు. ప్రతి ముక్కు రంధ్రంలోనూ పేపర్ కంటే పలచగా ఉండే పసుపు–బ్రౌన్ రంగుల్లో ప్యాచుల్లా ఉండే కణజాలం ఉంటుంది. ప్రతి ప్యాచ్లోనూ దాదాపు కోటి రిసెప్టార్ కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ ఆరు నుంచి ఎనిమిది అతి సన్నటి కేశాల్లా ఉండే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ ముక్కు నుంచి మెదడుకు అనుసంధానితమై ఉంటాయి. ఏదైనా వాసన రాగానే... పదార్థాల నుంచి వచ్చిన మాలెక్యూల్స్ వాసన గుర్తించే ప్యాచ్లను తాకుతాయి. ఆ వెంటనే అక్కడి నుంచి అత్యంత తక్కువ మోతాదులో ఉండే విద్యుత్ తరంగాలు వెలువడి మెదడును చేరతాయి. ఆ విద్యుత్ తరంగాలను మెదడు గుర్తించి అది పూలవాసనా లేక వంటింట్లో మరుగుతున్న పులుసా, కాలుతున్న రొట్టెనా మరింకేదైనా వాసనా అని గుర్తిస్తుంది. కేవలం మంచి వాసనల విషయంలోనే కాదు... దుర్వాసనలూ ఇలాగే తెలుస్తాయి. -
ముక్కు..సూటి మనిషి..
టర్కీకి చెందిన మెహ్మత్ నిజంగానే ముక్కుసూటి మనిషి.. మీకేమైనా డౌటా.. కావాలంటే ఆయన ముక్కును చూడండి.. ఎంత పొడవుగా ఉందో.. నోస్ బ్రిడ్జి నుంచి అంటే ముక్కును ముట్టుకుంటే మనకు ఎముక ఉన్నట్లు తగులుతుందే.. అక్కడి నుంచి చివరి వరకూ లెక్కేస్తే.. 3.46 అంగుళాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇంత పెద్ద ముక్కు మరెక్కడా చూడలేదంటూ గిన్నిస్ బుక్ వారు రికార్డును కట్టబెట్టేశారట. ఊరంత నోరు.. అంగోలాకు చెందిన ఫ్రాన్సిస్కోతో మాట్లాడటమంటే చాలా కష్టం. ఎందుకంటే.. ఆయన నోరు తెరిచాడంటే మన నోరు ఆటోమేటిగ్గా మూతపడిపోతుంది.. చూశారుగా.. ఆ నోరులో ఓ ఊరును సర్దేయొచ్చు. ఫ్రాన్సిస్కో నోరు తెరిస్తే.. 6.69 అంగుళాల వెడల్పు ఉందట. అయ్యబాబోయ్ అన్న గిన్నిసోళ్లు.. వెంటనే నోర్మూసుకుని.. రికార్డు ఆయన చేతికిచ్చి వెళ్లిపోయారట. -
ముక్కుకు మరో పేరేమిటి?
పెద్ద పెద్ద యుద్ధాలు టీవీ డిబేట్లలోనే కాదు... మా ఇంట్లో కూడా జరుగుతుంటాయ్. ఉదాహరణకు టూ డేస్ బ్యాక్ నాకూ మా బుజ్జిగాడికీ మధ్య ఒక డిబేట్ మొదలయ్యింది. ‘‘పిట్టకు ఉండేది ముక్కా... నోరా? అప్పుడు పిట్టకు జలుబు చేస్తే అది తుడుచుకునేదేమిటి?’’ అని. ఆ కథ ఏమిటో తెలియాలంటే మీరీ కమామిషులో అడుగుపెట్టాల్సిందే.మా ఇంటి ముంగిట్లోకి తరచూ ఒక పిట్ట వస్తోంది. రోజూ వస్తుండటంతో మా బుజ్జిగాడు దానికి ధాన్యం గట్రా వేయడం మొదలుపెట్టాడు. వాకిలిలో వాలి అదీ ఇన్ని గింజలు హాయిగా తినేసి వెళ్తోంది. మావాడు గింజల్ని విసురుతున్నప్పుడు అదేమీ బెదరడం లేదు. కాస్తంత వెనక్కు వెళ్లినట్టే వెళ్తోంది... గింజలు పడగానే ముందుకొచ్చి ముక్కుతో పొడిచి పొడిచి తింటోంది. గుప్పెట్లో గింజలు పట్టి చేయి విసురుతున్నా భయపడటం లేదు. దాని ధోరణి మావాణ్ణి ఇంకాస్త ఎంకరేజ్ చేసింది.మొన్నోరోజు పిట్ట రాగానే గింజలు వేయాలని చూశాడు. ఇంట్లో మామూలుగా బియ్యం, పప్పులే ఉన్నాయి తప్ప అది తినగల గింజలేమీ లేవు. అంటే పుట్నాలు, సజ్జలు, జొన్నల్లాంటివన్నమాట. కానీ మావాడి ఉత్సాహాన్ని కాదనలేక వాడికి కాసిన్ని వేరుశెనక్కాయలను ఇచ్చింది మా ఆవిడ. అవన్నీ మేం తినడం కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు. సదరు డీప్ ఫ్రైడ్ పల్లీలను ఆ పిట్ట లొట్టలేసుకు తినడం చూసి మావాడు మరింత ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొన్ని పల్లీలు పెట్టాడు. పిట్టకొంచెం మేత ఘనం అని ఆరోజే తెలిసింది. ఆరోజు చెట్నీ ముడిసరుకునంతా ఆ పిట్ట ఇట్టే స్వాహా చేసేసింది. అదలా గుప్పిళ్లకొద్దీ పల్లీలు లాగించేయడంతో ఆరోజు మా ఇంటిల్లిపాదీ ఇడ్లీల్ని కేవలం కారప్పొడితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకంతే... ఆరోజు నుంచి అదే ధోరణి. ‘‘తినే పిట్టదే గింజ. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా... పిట్టా తేరా గింజ రహేగా. వేయించిన వేరుశెనక్కాయలు మనుషులకేనా? ఇంకెంతకాలం ఈ వివక్ష? పిట్టా మనిషీ భాయ్ భాయ్. పిట్టల హక్కులు వర్ధిల్లాలి. మా నాన్న నైజం నశించాలి’’ అనే టైపులో ఉంది వాడి వ్యవహారం. దాంతో ‘ఎందుకైనా మంచిది’ పాలసీ కింద నేను సైలెంటైపోయాను. నా ధోరణిని అలుసుగా తీసుకున్నాడు మావాడు. ‘‘పిట్ట ఎలాగూ వేయించిన వేరుశెనక్కాయలు ఇష్టంగా తింటోంది కదా. ఇక మనం దానికి ఫ్రిజ్జులోని ఐస్వాటర్ కూడా పోద్దాం నాన్నా. ఏమో... దానికి విపరీతంగా దాహం వేస్తోందేమో? నీళ్లు కూల్గా ఉంటే అదీ హ్యాపీగా తాగుతుంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్ అది ఐస్వాటర్ తాగదురా. నేచురల్ వాటర్ తప్ప వేరేదేదీ దానికి ఇష్టం ఉండదు’’ అన్నాన్నేను. ‘‘ఎందుకుండదు. గత జన్మలో నువ్వేమన్నా పిట్టవా? అది వేయించిన పల్లీలు తినదన్నావు. కానీ తిన్నది కదా. ఇప్పుడు ఐస్వాటర్ తాగదంటున్నావ్. కానీ తాగుతుందేమో? అన్నీ నీకు తెలుసా? అసలు నీకేం తెలుసు? అయినా తన రెక్కల కష్టానికి తగినట్టుగా ప్రిజ్జువాటర్ రూపంలో దానికి ‘గిట్టుబాటునీరు’ దక్కితే నీకేంటి కష్టం’’ అంటూ నిలదీశాడు. దాంతో నేను వాడిని కన్వీన్స్ చేయడానికి కాస్త వేరే దారి తొక్కాల్సి వచ్చింది. ‘‘ఒరేయ్ నాన్నా. మొన్న నువ్వు బోల్డంత ఐస్వాటర్ తాగేశావ్. అప్పుడేమైందీ? నీకు జలుబు చేసింది. నీకు గొంతు నొప్పి వచ్చింది. డాక్టర్ నీకు సిరప్పూ, మందులూ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఫ్రిజ్జువాటర్ తాగాక పిట్టకూ నీలాగే జలుబు చేసిందనుకో. పాపం దానికి మందులివ్వడానికి డాక్టరూ లేడు. ముక్కు తుడుచుకునే రుమాలివ్వడానికి తల్లీ లేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్తో గొంతులో ఖిచ్ఖిచ్ వస్తే దానికెవ్వడూ ఇంత విక్స్ ఇచ్చే దిక్కులేదు. అసలు ఇవన్నీ ఎందుకు?... కూల్నీళ్ల కారణంగా లోపల పేరుకుపోయేదాన్ని చీదడానికి... అసలు దానికి ముక్కే లేదు. అందుకే ఐస్వాటర్ వద్దురా‘‘ వివరంగా చెప్పిచూశాను. ‘‘ముక్కు లేదంటావేమిటి? అది గింజల్ని పొడుచుకునేది ముక్కుతోనే కదా. దాని మౌత్ను నేనెప్పుడో నోరు అంటే... నువ్వే కదా ఇంత పెద్ద క్లాసు తీసుకొని దాన్ని ముక్కు అనాలన్నావ్’’ నిలదీశాడు వాడు. ‘‘ముక్కులా ముందుకు పొడుచుకొచ్చింది కాబట్టి తెలుగులో దాన్ని మనం ముక్కు అంటాం గానీ వాస్తవంగా అది నోరు రా’’ ‘‘ఇప్పుడూ... పిట్టకు ముక్కే లేదన్నప్పుడు దానికి జలుబు ఎలా చేస్తుంది చెప్పు? అయినా... ఏమో నాన్నా... నాకు నువ్వూ అర్థం కావు... నీ భాషా అర్థం కాదు. పిట్టకు రెక్కలుంటాయి. నీకు ఉండవు. అయినా నీ చేతుల్ని నువ్వు రెక్కలంటావ్. రెక్కాడితేగానీ డొక్కాడదనీ, రెక్కల కష్టమనీ ఏదేదో మాట్లాడతావ్. దానికి ఉండీ నీకు లేని వాటిని నీకున్నాయంటావ్. దానికి నోరున్నా సరే ఇగ్నోర్ చేసి, దాన్ని నువ్వు ముక్కంటావ్. దానిది టియ్యూ టియ్యూ భాష అనీ... మన తెలుగు దానికెలాగూ దానికి అర్థం కాదని... దాని బాడీ పార్ట్స్ను నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తావ్. అందుకే ఐ హేట్ యూ’’ అలిగాడు వాడు. వాడంటున్నదీ నిజమే కదా. ఇప్పుడనిపిస్తోంది నాకు... పిట్ట ముక్కును ముక్కు అని కాకుండా పేరు మార్చాల్సిన అవసరం ఉందని!! అలా మారిస్తే అది పిట్ట ముక్కు కాదూ... నోరు అని తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా... తెలుగుభాషలో మాటలు కొరవడి నోటికీ, ముక్కుకూ ఒకే మాట వాడతారనే అపప్రథ తప్పిపోవడంతో పాటు వాడి పిచ్చి లాజిక్కుల చిక్కులూ తప్పిపోతాయని!! – యాసీన్ -
వారం రోజులుగా ముక్కులోనే జలగ
-
వైరల్ : ముక్కులో జలగ
బీజింగ్ : చైనాకు చెందిన ఓ వ్యక్తి ముక్కు నుంచి వారం రోజులుగా తరచు రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతని సమస్య విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన డాక్టర్కు అలా జరగడానికి గల కారణం అంతుపట్టలేదు. కొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అతని ముక్కు కుడి వైపు రంధ్రంలో రక్తం పీల్చే జలగ ఉందని గుర్తించి షాక్ తిన్నాడు. అందువల్లే ముక్కు నుంచి రక్తం కారుతుందని నిర్ధారణకు వచ్చిన డాక్టర్.. అతని ముక్కులో నుంచి జలగను బయటకు తీశాడు. అది అప్పటికి ప్రాణాలతోనే ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంత పెద్ద జలగ ముక్కులో దూరిన అతనికి తెలియకపోవడం కాసింత ఆశ్చర్యం గొలిపే అంశమే. ముక్కు నుంచి రక్తం కారడాన్ని మొదట తేలికగా తీసుకున్న అతను తన భార్య ముక్కులో ఏదో చూశానని చెప్పడంతోనే ఆస్పత్రికి వెళ్లడాని సమాచారం. -
దాడి చేసి అన్న ముక్కు కొరికేశాడు!
లక్నో : తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అన్నపై దాడి చేశాడో తమ్ముడు. సోదరుడి దాడిలో అన్నకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్ జిల్లా రామ్లాల్పురాకు చెందిన శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అన్న శోబ్రాన్ వద్దకు వెళ్లి తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు సోదరుడు నిరాకరించడంతో అప్పటికే తాగిన మైకంలో ఉన్న శ్రీకాంత్, తన అన్న శోబ్రాన్ మీద పడి దాడిచేసి ముక్కు కొరికేశాడు. ముక్కుకు తీవ్రగాయం కావడంతో నొప్పి భరించలేక శోబ్రాన్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కటుంబసభ్యులపై కూడా శ్రీకాంత్ దాడి చేశాడు. హాస్పిటల్లో కోలుకుంటున్న శోబ్రాన్ మాట్లాడుతూ.. ‘తమ్ముడు మా అమ్మానాన్నలతో పాటు మావయ్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా నాపై దాడిచేసి ముక్కు కొరికేశాడు. నా పొట్ట, చేతులపై కూడా దాడి చేసి గాయపరిచాడని’ వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
ఈఎన్టీ కౌన్సెలింగ్
ముక్కులు మూసుకుపోతున్నాయి ఫ్రీ అయ్యేదెలా..? నా వయసు 26 ఏళ్లు. నా ఎడమ చెవిలో వినికిడి సమస్యతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాను. కుడి చెవి బాగానే ఉంది. పదిహేను రోజుల క్రితం ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాను. ఆయన నా చెవులను పరీక్షించి ఎడమ చెవిలో ఎముక కొద్దిగా మందం అయింది, అందువల్లనే మాటలు అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పారు. అంతేకాకుండా ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని, లేజర్ సర్జరీ అవసరం కావచ్చని చెప్పారు. కొన్ని మందులు రాశారు. నా సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు లేజర్ సర్జరీ అవసరమవుతుందా? – మదన్మోహన్, నల్లగొండ మీ సమస్యను విశ్లేషించడానికి మీరు ఇచ్చిన వివరాలు సరిపోవు. మీరు మొదట ఆడియాలజీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిలో మీకు ఉన్న సమస్య తీవ్రత ఎంత, చెవిలోని ఏ భాగంలో సమస్య ఉంది అన్న వివరాలు తెలుస్తాయి. అయితే... మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు ‘ఓటోస్లి్కరోసిస్’ అనే సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. మధ్య చెవిలోని ఎముకల గొలుసులో ఉండే చిన్న ఎముక అయిన ‘స్టెపీస్’లో ఒక ఎముక మందం కావడం, స్పాంజిజోన్ పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఉన్నవారికి శబ్దం, మాటలు వినిపిస్తాయి. కానీ అవి అర్థం కావు. సమస్య తీవ్రత పెరిగే కొద్దీ వినికిడి సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు వెంటనే ప్యూటర్టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెక్స్ ఆడియోమెట్రీ, ఓటోస్కోపీ మొదలైన పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్ చేయించి మీ సమస్యను నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు సాధారణంగా మందులతో తగ్గవు. సమస్య తీవ్రతను, పరిస్థితిని బట్టి చేయాలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పైన చెప్పిన సమస్య ఉన్నట్లయితే మీరు హియరింగ్ ఎయిడ్ వాడటం లేదా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ముక్కుఎప్పుడూ ఏదో అడ్డండి తగ్గేదెలా? నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. – పి. సూర్యనారాయణ, నెల్లూరు ఈమధ్య కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. -డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి –ఈఎన్టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
ముక్కుతోనే చిక్కు!
వంటలు ఘుమఘుమలాడుతుంటే ఎవరైనా రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తారు. దీంతో కొంచెం ఒళ్లు చేయడం సహజమే. అయితే మీకు వాసన పీల్చే శక్తి ఎక్కువగా ఉంటే చాలు.. మోతాదుగా ఆహారం తీసుకున్నా లావెక్కిపోతారని అంటున్నారు కాలిఫోర్నియా బర్క్లీ శాస్త్రవేత్తలు. ఘ్రాణశక్తి బాగా ఉన్న ఒక ఎలుకకు.. ఆ శక్తి అసలు లేని ఇంకో ఎలుకకు ఒకే రకమైన ఆహారం పెట్టారు. కొంతకాలానికి మొదటి ఎలుక బాగా లావెక్కిపోతే.. రెండోది ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. దీంతో ఘ్రాణ శక్తిలేని ఎలుకకు వాసన పీల్చే శక్తిని కృత్రిమంగా పెంచి మరోసారి ప్రయోగం చేశారు. ఫలితం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వాసన శక్తి ఎక్కువగా ఉన్న ఎలుకలు మరింత లావెక్కిపోయాయి. దీన్ని బట్టి.. శరీరం స్వీకరించే కేలరీలతో ఏం చేయాలన్నది ఈ వాసనపై ఆధారపడి ఉంటుంది అని! వాసన రాకపోతే.. శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది.. ఎంత వాసన పసిగట్టే శక్తి ఉంటే అంత మేర ఎక్కువగా కేలరీలను శరీరంలో నిల్వ చేస్తుంది అనీ! ఇంకోలా చెప్పాలంటే.. వాసన ఎక్కువ వస్తే శరీరంలో కొవ్వు అంత ఎక్కువ పెరుగుతుందన్న మాట. జీవక్రియలను నియంత్రించే మెదడులోని హైపోథలమస్కూ.. వాసనలను గుర్తించే వ్యవస్థకూ మధ్య సంబంధాలు ఉండటం వల్లే ఇలా జరుగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న క్లైన్ రియారా అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు వల్ల, వ్యాధుల వల్ల, లేదా గాయాల వల్ల వాసన పీల్చే శక్తి తగ్గినప్పుడు మనం సన్నబడటానికి కారణం ఇదేనని చెబుతున్నారు. -
ముక్కులో ఏదో అడ్డంకి... ఎందుకిలా?
ఇఎన్టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అవి వాడినప్పుడు మాత్రం సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా మళ్లీ వస్తోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. – సుదర్శనమూర్తి, మహబూబాబాద్ ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాల్సిరావచ్చు. ఈ పరీక్షలతో ముందుగా మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే ఫలితాల ఆధారంగా చికిత్స ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ హఠాత్తుగా హైబీపీ... ఏం చేయాలి? కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజూ వాకింగ్కు వెళ్తాను. ఆర్నెల్ల క్రితం హఠాత్తుగా 160/100 బీపీ వచ్చింది. ఈ నెల అదికాస్తా 190/100కు పెరిగింది. బీపీ కంట్రోల్ కాకపోతే అనేక సమస్యలు వస్తాయని మిత్రులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమస్యలు వస్తాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఏ.వి.జి.రావు, ఆదిలాబాద్ మీరు క్రమం తప్పకుండా వాకింగ్కు వెళ్తుండటం, వ్యాయామం చేయడం మంచి అలవాటు. ఇక రక్తపోటు విషయానికి వస్తే... పూర్తిగా ముదిరే వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా హఠాత్తుగా దెబ్బతీసే హైపర్టెన్షన్ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది కాబట్టి దానికి ఆ పేరు. దీనిలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలుంటాయి. చాలామందిలో ఏ ప్రత్యేక కారణం లేకుండా వ్యక్తమయ్యే రక్తపోటును ప్రైమరీ హైపర్టెన్షన్గా పేర్కొనవచ్చు. ఇది నెమ్మదిగా ఏళ్లతరబడి పెరుగుతూ వచ్చి, అకస్మాత్తుగా కనిపిస్తుంది. మరికొందరిలో పైకి కనిపించని కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీన్ని సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ మరింత ప్రమాదకరమైనది. ఈ రకమైన రక్తపోటుకు దారితేసే కారణాలు... కిడ్నీల సమస్యలు, ఎడ్రినల్ గ్లాండ్లో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, గురకతో నిద్రకు అంతరాయం, పుట్టుకతో వచ్చే రక్తనాళ సమస్యలు, బర్త్ కంట్రోల్ పిల్స్, మితిమీరిన మద్యపానం. బీపీ సమస్య మెదడు, గుండె, కిడ్నీ, కళ్లు... ఇలా మనలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రైమరీ హైపర్టెన్షన్ను ఒకింత సులభంగా అదుపు చేయవచ్చు గానీ... సమస్యల్లా సెకండరీ ౖహె పర్టెన్షన్తోనే. దీనిని అదుపు చేసేందుకు జాగ్రత్తగా, నేర్పుతో చికిత్స చేయాలి. మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని రోజూ 1.5 – 2 గ్రాములకు మించకుండా పరిమితం చేయాలి. కొవ్వుపదార్థాలు తక్కువగానూ, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగానూ ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని అదుపు చేసుకునే ప్రశాంతమైన దృక్పథాన్ని కలిగి, ఉద్వేగాలకు దూరంగా ప్రశాంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. డాక్టర్ వరద రాజశేఖర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఎముకల్లో నొప్పి, వాపు ఎందుకు? ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత నెల రోజులుగా నా కాళ్ల ఎముకలలో రాత్రి సమయాల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. కొద్దిగా వాపు కూడా కనిపిస్తోంది. డాక్టర్ను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. నా సమస్య ఏమిటి? దీనికి చికిత్స ఏదైనా ఉందా? – నాగభూషణం, ఒంగోలు రాత్రి వేళ ఎముక నొప్పి రావడం అంత మంచి లక్షణం కాదు. ఇలా వస్తున్నప్పుడు మొదట ఎముక క్యాన్సర్ను అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్లలో నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. మృదుకణజాలంతో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం నొప్పి, వాపు ముందుగా కనిపిస్తాయి. చికిత్స : ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఇలా రక్తం ద్వారా ఇది శరీరంలో మరికొన్ని చోట్ల క్యాన్సర్ను కలిగించవచ్చు. క్యాన్సర్ ట్యూమర్ చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. ఇది వ్యాపించకుండా చూడటం కోసం మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత మేరకు ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి ఇది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రొస్థెసిస్ అనే కృత్రిమ ఎముక లేదా రాడ్ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి తిరిగి దాన్ని అమరుస్తారు. దీన్ని ఎక్స్ట్రా కార్పోరల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలామంది ఎముకలో నొప్పి, వాపు రాగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర్ కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఎముకలో నొప్పి, వాపు కనిపించనప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జిన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ముక్కు, చెవులు కోసిన కుమారుడు
కేకే.నగర్: తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రి చెవులనే కోసాడు కన్న కొడుకు. ఆగ్రహంతో తండ్రిపై దాడిచేసి కత్తితో ముక్కు, చెవులు కోసి కొడుకు పరారైనాడు.ఈ సంఘటన చెన్నై పుదుపేట సౌత్లో జరిగింది. మోసల్ (50) కుమారుడు వేలాంకని అలియాస్ వేలా (38). ఈ ప్రాంతంలో రౌడీగా చెలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. గురువారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు తండ్రిని అడిగాడు. ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల వారు వేలాను సమాధానపరచి బయటికి పంపారు.అర్ద రాత్రి పొద్దు పోయాక ఇంటికి వచ్చిన కుమారుడు. ఆదమరచి నిద్రపోతున్న తండ్రి ముక్కు, చెవులను కత్తితో కోసి పరారైయ్యాడు. రక్తం మడుగులో పడి ఉన్న మోసల్ను ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. దీనిపై మోసల్ ఎగ్మూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న వేలా కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు. -
మీ ముక్కు సైజును నిర్ణయించేది ఇదే!!
న్యూయార్క్: అప్పుడే పుట్టిన పిల్లల్లో పోలికలను పరిశీలించేటప్పుడు ముందుగా పరిశీలించేది ముక్కునే. ఆ ముక్కును చూసే తండ్రిలా ఉన్నాడు.. తల్లిలా ఉన్నాడు.. అచ్చం తాతయ్య పోలికలే.. అని చెబుతుంటారు. అయితే ముక్కు పరిమాణాన్ని, ఆకారాన్ని నిర్ణయించేవి వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కావని, స్థానిక వాతావరణ పరిస్థితులే మన ముక్కు పరిమాణం, ఆకారాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తెలిసింది. స్థానిక వాతావరణంలోని గాలిలో నీటి ఆవిరి, ఉష్ణోగ్రత వంటివి ముక్కు పరిమాణాన్ని నిర్దేశిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, గాలిలో నీటిఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు కాస్త వెడల్పుగా ఉంటుందని, ఆర్ధ్రత తక్కువగా ఉండి, శీతల ప్రాంతాల్లో నివసించేవారి ముక్కు వెడల్పు తక్కువగా ఉండి, పొడవుగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవపరిణామక్రమంలో వచ్చిన మార్పు కారణంగానే ఇలా ఆకారాలు, పరిమాణాల్లో మార్పులు సంభవిస్తున్నాయని చెప్పారు. -
ముక్కు సూటిగా...
ముక్కు దూలం వంకర ఉన్నప్పటికీ దానివల్ల శ్వాస తీసుకోవడానికి ఎలాంటి అంతరాయాలూ లేకపోతే శస్త్ర చికిత్స చేయించనవసరం లేదు. ముక్కు దూలం వంకర వల్ల ఒకవేళ సమస్యలు ఉన్నవారైనా మందులు వాడిన తర్వాత వారికి ఉపశమనం కలుగుతుంటే శస్త్ర చికిత్స అవసరం లేదు. కోటేరులాంటి ముక్కు... అంటూ ఆ నాసికా సౌందర్యాన్ని వర్ణిస్తుంటారందరూ. అంటే నేల మీద నాగలిని నిలబెట్టినప్పుడు ఉండే ఆకృతిలా ఉంటుందని దాని అర్థం. అయితే ఆ నాగలి కర్ర అటు ఇటు వంకర్లు పోకుండా చక్కగా ఉండాలి. కానీ మన దేశంలో సుమారుగా కోటి మంది తమ ముక్కులోని రెండు రంధ్రాల మధ్య ఉండే దూలం తిన్నగా లేకపోవడంతో వచ్చే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యనే ఇంగ్లిష్లో ‘డీవియేటెడ్ నేసల్ సెప్టమ్’ అని అంటుం టారు. దీన్ని సరిచేసుకోడానికి సెప్టల్ డీవియేషన్ కరెక్షన్ సర్జరీ అనే చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ సమస్యనూ, ముక్కును సూటిగా చేసే ఆ శస్త్ర చికిత్స వివరాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. ముక్కు దూలం వంకర అవడం అంటే ఏమిటి? మన రెండు ముక్కు రంధ్రాల మధ్యలో కిందివైపున ఒక పలచటి గోడలాంటి చర్మంతో పాటు పై వైపున ఎముకతో కూడిన భాగం ఉంటుంది. రెండు రంధ్రాల మధ్యగా ఉండే ఈ బ్రిడ్జి వంటి భాగాన్ని ‘నేసల్ సెప్టమ్’ అంటారు. తెలుగులో దీన్ని ముక్కు దూలం అంటారు. ఇది రెండు ముక్కు రంధ్రాలను సమానంగా విభజించి గాలి ప్రసరణ సరిగా అయ్యేందుకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ముక్కు దూలం ఒక వైపుకు వొంగి ఉండడం లేదా మూసుకుపోయి ఉండటం జరుగుతుంది. దీనినే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. ఈ సమస్యలో తీవ్రత అన్నది ముక్కు మధ్య భాగం ఎంతగా వంగి ఉందో అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. సెప్టమ్ లేదా దూలం పూర్తిగా వంగి ఉంటే వారిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతే కాకుండా కొంతమందిలో ముక్కు రంధ్రాలు పొడి బారటంతో పాటు కొన్నిసార్లు రక్తస్రావమూ కావచ్చు. ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి? ⇒ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే లక్షణాలలో ఒకటిగానీ లేదా అంతకుమించి గానీ చాలా ఎక్కువ కాలం పాటు బాధపెడుతూ ఉంటే ∙ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లయితే ∙తరచూ రక్తస్రావం అవుతుంటే ∙సైనస్ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటే ⇒నిద్ర పట్టకపోవడం జరుగుతుంటే ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే లక్షణాలలో ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. వారు మొదట క్లినికల్ పరీక్షలు చేస్తారు. ఇందులో మీ సమస్యలు, సంబంధించిన హిస్టరీ, వాడిన మందులు లేదా చికిత్స వివరాలు మొదలైనవి తెలుసుకుంటారు. అలాగే హెడ్లైట్ మిర్రర్ ద్వారా, నేసల్ స్పెక్యులమ్ ద్వారా పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి సి.టి.స్కాన్ – ముక్కు, ఎండోస్కోపి, కొన్ని సందర్భాలలో రైనోమానో మెట్రీ అనే సరికొత్త పరీక్ష ద్వారా సమస్య తీవ్రతను అంచనా వేసి, దాన్ని బట్టి అందించాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్లో కనిపించే లక్షణాలు ఇతర ముక్కు సంబంధిత సమస్యలలో కూడా గమనించవచ్చు. అందులో ప్రధానమైనవి నేసల్ పాలిప్స్ (ముక్కులో పెరిగే అదనపు కండ వంటి భాగాలు), అలెర్జిక్ రైనైటిస్, పిల్లల్లో అడినాయిడ్స్, నేసో ఫారెంజెయల్ గ్రోత్. కొంతమందిలో ముక్కుకు సంబంధించిన అలర్జీ వల్ల ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల అటువంటి వారికి నేసల్ అలర్జీకి సంబంధించిన ప్రశ్నలతో కూడుకున్న పరీక్షలతో పాటు సంబంధిత ఇతర పరీక్షలు చేయించాలి. కొన్నిసార్లు ఈ ముక్కు దూలం వంకర అనేది సైనసైటిస్, ఇతర సమస్యలతో కలిపి ఉంటుంది. అందువల్ల ఇతర సమస్యలకు సంబంధించిన పరీక్షలూ చేయించాలి. చాలావరకు సి.టి.స్కాన్ మరియు ఎండోస్కోపి (నేసల్) ద్వారా వైద్యులకు కావాల్సిన సమాచారం లభిస్తుంది. చికిత్స : మొదటగా మీకు ఉన్న లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. చాలావరకు మందులనే (నేసల్ డికంజెస్టెంట్స్, యాంటిహిస్టమిన్స్), నేసల్ స్టెరాయిడ్స్ స్ప్రే వాడతారు. ముక్కు మూసుకుపోవడం, నీరు కారడం మొదలైన లక్షణాలకు ఈ మందుల ద్వారా ఉపశమనం లభించవచ్చు. అలర్జీ సంబంధిత సమస్యలు గుర్తించనప్పుడు పైన తెలిపిన మందులు, స్ప్రేతో పాటుగా అలర్జీకి సంబంధించిన మందులు, జాగ్రత్తలు, సంబంధిత చికిత్స ఇవ్వాలి. మందులు, స్ప్రే, జీవనశైలిలో మార్పులు చేసినా ఎటువంటి ఉపశమనం కలగకపోయినా లేదా ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ఎక్కువగా ఉన్నా శస్త్ర చికిత్స ద్వారా ముక్కుదూలాన్ని సరిచేయాల్సి ఉంటుంది. చాలాసార్లు ముక్కు దూలం వంకరతో పాటుగా ముక్కులోని సైనస్లలో తరచు ఇన్ఫెక్షన్లు, నేసల్ టర్బినెట్స్లో లోపాలు, నేసల్ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా శస్త్రచికిత్స అవసరమవుతుంది.కేవలం ముక్కు దూలం వంకర సరిచేసే ప్రక్రియను సెప్టొప్లాస్టీ అంటారు. ఈ సెప్టోప్లాస్టీలో ముక్కు దూలంను రెండు ముక్కు రంధ్రాలకు మధ్యలో ఉండేలా సరిచేసి, ఎటువంటి వొంపులు లేకుండా చూస్తారు. అలర్జీ కూడా ఉన్నవారిలో ముందుగా సంబంధిత చికిత్స తర్వాతనే శస్త్రచికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా అందుకు సంబంధించిన మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక ప్రక్రియను రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ ముక్కు ఆకారం సరిగా లేనివారికి చేస్తారు. ఈ శస్త్ర చికిత్సలో ముక్కులోని ఎముక భాగం, కార్టిలేజ్ భాగాలను సరిచేయడం ద్వారా సరైన ఆకృతికి తీసుకురావడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో సెప్టోప్లాస్టీని, రైనో ప్లాస్టీతో కలిపి చేయవలసి ఉంటుంది. దీనినే సెప్టో రైనో ప్లాస్టీ అంటారు. అలానే నేసల్ టర్బినేట్స్ లోపాలు ఉన్నవారికి సెప్లోప్లాస్టీతో పాటుగా టర్బినోప్లాస్టీ కూడా చేస్తారు. క్లుప్తంగా ముక్కుదూలం వంకరకు ముందుగా పరీక్ష ఫలితాలు ఆధారంగా మందులు, స్ప్రే అలర్జీ సంబంధిత మందులు వాడి వాటి వల్ల ఫలితం లేనప్పుడు శస్త్రచికిత్సకు సూచిస్తారు. ముక్కు దూలం వంకర రాకుండా జాగ్రత్తలు పుట్టుకతో వచ్చే లోపాలను మనం ఏమి చేయలేం. కానీ... ఫుట్బాల్, క్రికెట్ వంటి ఆటలలో జరిగే ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం, ఇతర ఆటలు ఆడేటప్పుడు సంబంధిత రక్షణ పరికరాలు ధరించడం వంటి జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. కారణాలు ⇒పుట్టుకతో వచ్చేవి ∙ముక్కుకు దెబ్బ తగలడం లక్షణాలు ⇒ చాలామందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మనలో కూడా చాలామందికి ఈ సమస్య ఉండచ్చు కానీ అది ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఇబ్బంది పడేవారిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి ∙ఒకటి లేదా రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం ⇒ ముక్కు నుంచి రక్తం కారడం లేదా తరచుగా నీరు కారడం ∙ఒక వైపు ముఖంలో నొప్పి (పేషియల్ పెయిన్ ఆన్ వన్ సైడ్). ముఖ్యంగా మూసుకుపోయిన చెవి రంధ్రం వైపు భాగం ∙రాత్రి వేళల్లో లేదా నిద్రలో గురక పెట్టడం ∙ఒక వైపు మాత్రమే గాలి పీల్చుకోవడం ∙ఒక వైపే నిద్రపోవడం ∙నోటితో గాలి పీల్చుకోవడం ∙తరచుగా తలనొప్పి. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
సైనసైటిస్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్తో బాధపడుతున్నాను. ముక్కుతో గాలి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు తలనొప్పితో బాధపడుతుంటాను. చాలా రకాల మందులు వాడాను. వాడినప్పుడు కొద్దిపాటి ఉపశమనమేగానీ సమస్య తగ్గడం లేదు. హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? – రవిందర్, కరీంనగర్ సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్పొర ఉంటుంది. సైనస్లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి వేడిమిని మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్లు ఉపయోగపడతాయి. సైనస్లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్ను నిర్ధారణ చేస్తారు. సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... హెపార్ సల్ఫూరికమ్: అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. మెర్క్సాల్: రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి వయసు 45 ఏళ్లు. ఈమధ్య ఆమెకు కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్క్యాన్సర్ అని తెలిసింది. దాంతో షాక్ అయ్యాము. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. – మాధురి, నల్లగొండ రక్తకణాల ఉత్పత్తి సక్రమమైన తీరులో జరగకపోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడే మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా లక్షణాలు: బ్లడ్క్యాన్సర్లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో తమ విధులను అవి సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోయి, రోగికి రక్తహీనత రావచ్చు. ఫలితంగా వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం ∙తలనొప్పి, కాలేయం, స్పీ›్లన్, ఎముకల నొప్పి. సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి. శైలేశ్ ఆర్. సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్టీ స్పెషలిస్ట్ సెంచరీ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రక్త కన్నీరు..
ఈ పిల్లాడి పేరు అఖిలేశ్ రఘువంశీ(10). మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో ఉంటాడు. తండ్రి వ్యవసాయదారుడు. చూశారుగా.. సమస్య ఏమిటో.. ఒక్క కంటి నుంచే కాదు.. తల నుంచి.. చెవి నుంచి.. ముక్కు నుంచి.. కాళ్ల నుంచి రక్తం ధారలా కారుతుందట. ఒక్కోసారి రోజుకు 10 సార్లు వస్తే.. ఒక్కోసారి మూడు నెలల వరకూ దాని జాడే కనిపించదట. మూడేళ్ల నుంచి అఖిలేశ్ ఈ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్లు చూశారు. ఎయిమ్స్ వైద్యులు సైతం పరీక్షించారు. కారణం ఇదీ.. అని ఎవరూ చెప్పలేకపోయారు. దెబ్బ తగలకున్నా.. రక్తం కారిపోతూ ఉంటుందని.. ఇలా వచ్చినప్పుడు తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అఖిలేశ్ చెబుతున్నాడు. ఇతడు ‘హీమోలక్రియా’ తో బాధపడుతుండొచ్చని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా నిర్ధారించడం లేదు. హీమోలక్రియాతో బాధపడుతున్నవారి కంటి నుంచి రక్తం వస్తుంటుంది. వైద్యులు ఏదీ సరిగా చెప్పకపోవడంతో తన కొడుకు ఏమైపోతాడా అన్న ఆందోళన అతడి తండ్రిలో నెలకొంది. ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులు అఖిలేశ్కు వచ్చిన వ్యాధికి చికిత్సను సూచించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. -
తెగిన ముక్కు తిరిగొచ్చింది!
విజయవంతంగా అమర్చిన అపోలో వైద్యులు సాక్షి, హైదరాబాద్: కత్తిపోటు ఘటనలో ముక్కు తెగిన ఓ వ్యక్తికి అపోలో ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స చేశారు. టాంజానియాకు చెందిన సిలాహ్ క్వాహు (46)కు 2014 సెప్టెంబర్లో జరిగిన ప్రమాదంలో ముక్కు తెగిపోయింది. చికిత్స కోసం స్థానిక వైద్యులను ఆశ్రయించినా పోయిన ముక్కు తిరిగి రాలేదు. ముక్కు లేకపోవడంతో బయట తిరుగలేని పరిస్థితి. దీంతో సిలాహ్ ఇటీవల జూబ్లిహిల్స్ అపోలోకు చెందిన కన్సల్టెంట్ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ప్రసాద్ను సంప్రదించాడు. ఇండియన్ రైనో ప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేయాలని డాక్టర్ నిర్ణరుుంచారు. ఈ మేరకు తొలిదశలో కుడి మోచేతి నుంచి చర్మాన్ని, చెవి భాగంలోని మెత్తని ఎముకలను సేకరించారు. ఎడమ మోచేతిపై ముక్కు ఆకారాన్ని, రక్తనాళాలను వృద్ధి చేశారు. మోచేతిపై తయారైన ముక్కు ఆకారాన్ని తీసి కత్తిపోటు ఘటనలో పోయిన ముక్కు భాగంలో విజయవంతంగా అమర్చారు. వెంట్రుక కన్నా సన్నగా ఉండే దారంతో కుట్లు వేసి, రక్తనాళాలను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాతి దశలో పక్కటెముకల నుంచి కొంత ఎముకను తీసి ముక్కు దూలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాధారణ ముక్కు ఏర్పడింది. బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు తెలిపారు. -
చీమ కుట్టినట్టు కూడా ఉండదు!
గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారం లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీసెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. అయితే డాక్టర్ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు, లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముక్కు, చెవులు కుట్టించడం మరింత అందంగా, ఆకర్షణీయంగా చేయవచ్చు. అనర్థాలు ఇవి... ఇన్ఫెక్షన్స్: కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్/గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం: కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ను సంప్రదించాలి. అలర్జీలు: కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు... చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని విచారించడం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచి పద్ధతి. చెవులు, ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి.మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ... ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది.చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఒక పెద్ద ఏసీ మిషన్ = ముక్కు!
పోరాటం నోస్ ఫ్యాక్ట్స్ ముక్కు ఒక ఎయిర్ కండిషనర్లా వ్యవహరిస్తుంది. ప్రతిరోజూ అది దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది. ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో ఉన్న గాలి కావాలి. అందుకే తేమ తక్కువగా ఉన్న గాలిలో తేమ కల్పించడానికి ఒక్కో సీజన్లో ముక్కు దాదాపు లీటరు తేమను స్రవిస్తుంటుంది. ముక్కులోని ఎర్రటి స్పాంజ్ కణజాలం నుంచి ఈ తేమ ఊరుతూ ఉంటుంది. ముక్కు రంధ్రాలు గాలిని శుభ్రం చేస్తుంటాయి. నూనెలో ముంచితీసినట్టుగా ఉండే పేపరును గాల్లో వేలాడదీస్తే, దానికి పురుగులు అంటుకున్నట్లుగా ముక్కులోని వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే ముక్కు రంధ్రాలు వాటిని అక్కడ పేరుకోనివ్వవు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా బ్యాక్టీరియా మయం అయిపోతుంటుంది. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్ను ముక్కు... ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది. -
ముక్కులో కండ.. తగ్గుతుందా..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 సంవత్సరాలు. నాకు గత కొంతకాలంగా ముక్కులో కండమాదిరి పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుండడంతో డాక్టర్ని సంప్రదించాను. వారు వాటిని నాజల్ పాలిప్స్గా నిర్ధారించి, కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నాను కానీ పూర్తి ఉపశమనం లభించడం లేదు. . హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు. - నాగేంద్రకుమార్, కడప నాజల్ పాలిప్స్ అనేది దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్య. చల్లని వాతావరణం ఏర్పడితే ఈ వ్యాధితో బాధపడేవారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ తిరగబెట్టొచ్చు. మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మీ సమస్య పూర్తిగా నయం అవుతుంది. ముక్కు, సైనస్లలో ఏర్పడే మృదువైన కండ కలిగిన వాపును నాజల్ పాలిప్స్ అంటారు. ఇది ముక్కు రెండు రంధ్రాలలోనూ, సైనస్లలోనూ ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ యుక్త, మధ్యవయస్సు కలిగిన వారిలో, స్త్రీలలో కంటే 2-4 రెట్లు పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ముక్కు లోపలిభాగం, సైనస్లు ఒకవిధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒకవిధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కునూ, సైనస్లనూ తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన దుమ్మూధూళీ ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి వాటి సాయంతో గొంతులోకి, ముక్కులోకీ చేర్చి తద్వారా బయటకు పంపేస్తుంటుంది. ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురయితే అది వాచి గురుత్వాకర్షణ వలన కిందకు వేలాడటం మూలాన పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కారణాలు: ఈ సమస్యకి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ తర చు ఇన్ఫెక్షన్కు గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలికంగా సైనసైటిస్కు గురికావడం, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ లాంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటి అంశాలు మాత్రం ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయని చెప్పొచ్చు. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం తద్వారా నోటిద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ సమస్య వల్ల రాత్రిళ్లు నిద్రలో కొంత సమయం ఊపిరి ఆడకపోవడం వల్ల నిద్రసరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గ్రహించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి. చికిత్స: హోమియోలో అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేస్తారు. తద్వారా నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
మోమే వనం...ముక్కెరే సుమం
తగరపువలస : ఆడవాళ్లకు ముక్కెర(నత్తు) ఓల్డ్ ఫ్యాషన్. ప్రస్తుతం అమ్మవారి విగ్రహాలకు తప్ప ముక్కెర ఎవరూ ధరించడంలేదు. కానీ ఇప్పటికీ ముక్కెరను సంప్రదాయంగా ధరిస్తున్న భీమిలి మండలం మజ్జిపేట గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరికి ముక్కెర అలంకారప్రాయంగా కనిపిస్తుంది. -
పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది?
న్యూయార్క్: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లయింది అమెరికాలో ఓ మహిళ పరిస్థితి. తన ముక్కుపై చర్మ క్యాన్సర్ కారణంగా పెరిగిన అకారణ చర్మ బొడిపెను పొగోట్టుకునేందుకు ఆమె 1990నాటి రోజుల్లో ఉపయోగించిన బ్లాక్ సాల్వ్ అనే సహజ సిద్ధమైన పద్ధతిలో తయారుచేసిన ఆయిట్ మెంట్ ను ఉపయోగించడందో ఆమె ముక్కుకు, నుదుటి భాగానికి అతిపెద్ద సమస్య ఏర్పడింది. ఆ హెర్బల్ క్రీమ్ కాస్త ఆమె ముక్కును రివర్స్లో మొత్తం తినేసి నల్లటి పుండుగా మారింది. అలా మారిన పుండును ఆమె గట్టిగా రుద్ది చూడగా ఏకంగా ముక్కుపై పెద్ద రంధ్రమే పడింది. అది ఎంతపెద్దగా ఉందంటే ప్రస్తుతం ఆమె శ్వాస కూడా ఈ రంధ్రం ద్వారా వెళుతుంది. ఇక నుదురు భాగంలో కూడా నల్లగా కమిలిపోయి చర్మం రాలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఎంతో అందంగా ఉండే ఆమె ముఖంలో ఇలా వికారమైన గాయాలు తయారవడంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయిన ఆమె వెంటనే తన బాధను ఆన్లైన్ లో పంచుకుంది. ఇలాంటి ప్రయోగాలు చేసి తనలా ఎవరూ మారిపోవద్దంటూ బాధపడింది. ఈ వీడియోను, ఫొటోలను ఇప్పటికే లక్షల మంది చూశారు. -
నేను మీ ముక్కుని..
ఆనంద్ తన ముఖంలోని కళ్ల గురించి, చెవుల గురించి కాస్త ఎక్కువగా ఆరాటపడిపోతాడు. వాటి గురించి తెగ బెంగపడతాడు. కానీ ముఖంలోనే ఉన్నా నా గురించి అంతగా పట్టించుకోడు. నేను ఆనంద్ ముక్కును. ఆనంద్కు జలుబు చేసి నా నుంచి ధార కారుతుంటే లేదా తరచూ తమ్ములు వస్తూ నాలో దురద పెడుతూ ఉంటే తప్ప నన్ను అంతగా గుర్తించడు. తాను గుర్తించకపోయినా నేను చాలా ముఖ్యమైన అవయవాన్ని. ఆనంద్కు తెలియకుండానే చాలా ముఖ్యమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటా. ఉదాహరణకు ఆనంద్ నిద్రపోతూ ఎడమవైపునకు ఒరిగాడనుకోండి. అతడి ఎడమ ముక్కు రంధ్రం నుంచి క్రమంగా గాలి ఆడకుండా పోయిందనుకోండి. వెంటనే అతడి మెదడు నుంచి అవసరమైన సిగ్నల్స్ పంపి, అతడు కాస్తా నిద్ర నుంచి మేల్కొనేలా చేసి కుడివైపునకు తిరిగేలా చేస్తుంటా. నిజానికి ఆనంద్ తినే సమయంలో అతడి నోటి కంటే వాసన ద్వారా రుచిని నేనే ముందుగా ఆస్వాదిస్తుంటా. అలా ఆహారాన్నీ ఆనంద్ ఆస్వాదించేందుకు దోహదం చేస్తుంటా. ఇదే సమయంలో పాడైపోయిన ఆహారాన్ని ఆనంద్ తినకుండా కూడా హెచ్చరిస్తుంటా. ఆహారం నుంచి పసందైన సువాసన వస్తుందనుకోండి.. వెంటనే అతడి లాలాజలగ్రంథులను ప్రేరేపించి నోరూరేలా చేస్తుండేది నేనే. ఆ మరుక్షణమే అతడి జీర్ణగ్రంథుల నుంచి జీర్ణరసాలు ఊరేలా తోడ్పడుతుంటాను. ఆనంద్కు జలుబు చేసిందనుకోండి... ఏ ఆహారపు సువాసనా తెలియదు సరికదా బొత్తిగా రుచి కూడా తెలియకుండా పోతుంది. దాంతో ఏదో తినాలని తింటుంటాడు తప్ప ఇష్టంగా తినడు. ఇక నిర్మాణపరంగా నేను గొప్ప చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నన్ను చూస్తేనే తెలుస్తుంది. నిజానికి నోటి పైకప్పుకూ, మెదడుకూ మధ్యన నేను ఉంటా. నేను ఒకే అవయవంలా కనిపిస్తాను... కానీ ముక్కులో రెండు రంధ్రాల మధ్య పార్టిషన్ గోడ ఉంటుంది. దాంతో రెండు ముక్కు రంధ్రాలుగా విడివడి ఉంటా. దాని వెనక, ఆనంద్ నోటి పైభాగమంతా నా కార్యక్షేత్రం. ఆనంద్ కళ్లకూ, నాకూ మధ్య భాగంలోనూ దాని వెనక... ఇలా తల భాగం మొత్తంలో నాకు ఇరువైపులా ఎనిమిది ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఇవి పుర్రెను బోలుగా ఉంచడంతో పాటు నేను పీల్చుకునే గాలిలో తేమ ఉండేలా చూస్తుంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలను సైనస్లు అంటారు. ఈ ఖాళీలలో బ్యాక్టీరియా చేరితే నాకు ఇబ్బంది కలగడంతో పాటు ఆనంద్ను తలనొప్పి బాధిస్తుంది. పెద్ద ఎయిర్కండిషన్ను రెండు సెం.మీ.కు కుదిస్తే... నా పనులన్నింటిలోనూ అతి పెద్ద పని ఒక ఎయిర్ కండిషనర్లా వ్యవహరించడం. ప్రతిరోజూ నేను దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతాను. వాతావరణంలో ఒక్కోసారి పొడిగాలి ఉంటుంది. మరికొన్నిసార్లు గాలిలో తేమ ఒక్కోసారి 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో ఉన్న గాలి కావాలి. అందుకే ఒక పెద్ద చెట్టు మొద్దు అంతటి సైజ్లో ఉన్న ఎయిర్ కండిషనర్ను కొన్ని సెంటీమీటర్లకు కుదిస్తే ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను. నేనూ ఆ ఎయిర్ కండిషనర్లాగే పని చేస్తాను. గాలిలో తేమ కల్పించడానికి దాదాపు లీటరు తేమను స్రవిస్తాను. ఇదంతా మ్యూకస్ రూపంలో కాస్త జిగురుగా ఉంటుంది. నాలోని ఎర్రటి స్పాంజ్ కణజాలం నుంచి ఈ తేమ ఊరుతూ ఉంటుంది. కాస్త రఫ్గా ఉండే ముక్కు రంధ్రాలు గాలిని శుభ్రం చేస్తుంటాయి. నూనెలో ముంచితీసినట్టుగా ఉండే పేపరును గాల్లో వేలాడదీస్తే, దానికి పురుగులు అంటుకున్నట్లుగా నాలోని వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అంటుకుంటాయి. అయితే స్వాభావికంగా అలా చిక్కుకుపోయే వాటిని నేను అక్కడ పేరుకోనివ్వను. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా బ్యాక్టీరియామయం అయిపోతుంటుంది. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్ను ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటాను. ఆ మ్యూకస్ను తొలగించడానికి సీలియా అని పిలిచే అతి చిన్న (మైక్రోస్కోపిక్) చీపుర్లు ఉంటాయి. అవి కొరడాల్లా కదులుతూ మ్యూకస్ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. అక్కడి నుంచి మ్యూకస్ కడుపులోకి పడిపోతుంటుంది. అక్కడ అత్యంత ప్రభావపూర్వకమైన యాసిడ్ స్రవించి, ఆ బ్యాక్టీరియాను కాల్చేస్తుంది. నాలోని సీలియా అనే ఆ చీపుర్లు ప్రతి సెకనుకు పదిసార్లు కొరడా ఝళిపించినట్లుగా కదులుతూ మ్యూకస్ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. ఆనంద్కు జలుబు చేసినప్పడు ఈ మ్యూకస్ మరింత ఎక్కువగా స్రవిస్తుంది. అది గొంతులోకి చేరడానికి బదులు మరింత ముందుకు వచ్చి నాలోని ముక్కు రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. అలా జరగడాన్ని ముక్కు కారడంగా చెబుతుంటారు అందరూ! అతి సన్నటి రక్తనాళాలు... ముక్కులో రక్తనాళాలు ఒక పరుపులా పరుచుకొని ఉంటాయి. గాలిలోకి తేమ నింపే గాలి మరల్లాంటి టర్బినేట్స్ నాలో ఉంటాయి. ఆ టర్బినేట్స్ అన్నీ ముక్కు రంధ్రాలకు ఇరువైపులా ఒక అంగుళం పొడవుతో పొడుచుకువచ్చినట్లుగా ఉంటాయి. అవన్నీ అత్యంత చిన్న వైన కారుల్లోని రేడియేటర్లలోని ఫ్యాన్లలాంటివవి. వాటన్నింటికీ అతి సన్నగా పరుచుకున్న రక్తనాళాలనుంచి చాలా సమృద్ధిగా రక్తప్రసరణ జరుగుతుంటుంది. అవన్నీ ఒక బెడ్లా పరుచుకొని ఉండటానికి కారణం... పీల్చుకున్న చల్లగాలినంతటినీ ఊపిరితిత్తులకు అనువుగా అందించేందుకు వీలయ్యేలా ఎక్కువ స్థలాన్ని (ఏరియాను) కల్పించడమే. ఎన్నెన్నో జబ్బులకు గురయ్యే ప్రమాదం... నేను దేహం బయటే ఉంటాను కాబట్టి ఎన్నెన్నో వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు సిఫిలిస్, టీబీ వంటి క్రిములతో నా కార్టిలేజ్ దెబ్బతిని, నా ఆకృతే మారిపోయే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి నాలో అదనపు కండ పెరిగి అవి పుట్టగొడుగు షేప్లో పెరగవచ్చు. వీటినే నేసల్ పాలిప్స్ అంటారు. అవి ముక్కులోకి వచ్చే వాయుప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. లేదా సైనస్ గదులకు అడ్డుగోడగా మారవచ్చు. దాంతో అవి ఆనంద్కు బాధాకరంగా పరిణమించవచ్చు. అలర్జీ కలిగించే పదార్థాలైన పొగ, పొగాకు వాసనలు నాలోని మ్యూకస్ పొరలను ప్రేరేపించి, వాటిని వాచిపోయేలా చేస్తాయి. ఫలితంగా రక్షణాత్మక ద్రవాలు ఎక్కువగా గొంతులోకి ప్రవహిస్తాయి. ముక్కుదిబ్బడ కలిగేలా చేస్తాయి. దాంతో ఊపిరి సరిగా అందక ఆనంద్ ముక్కు చీదుతుంటాడు. ఫలితంగా గొంతులోని సూక్ష్మజీవులు బలవంతంగా సైనస్లలోకిగానీ లేదా మధ్య చెవిలోకిగానీ ఎవరో తోసినట్లుగా ప్రవేశించవచ్చు. ముక్కులోని పొరల వాపు తగ్గడానికి ఆనంద్ నేసల్ డ్రాప్స్ వాడుతుంటాడు. కానీ నిజానికి అతడు వాడే డ్రాప్స్ వల్లనే అతడి ముక్కులోని పొరల్లో మరింత వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఆనంద్కు వయసు పెరుగుతున్న కొద్దీ అతడి వాసన సామర్థ్యాలూ తగ్గుతాయి. ఒకప్పుడు బాగా పరిమళంగా అనిపించిన కాఫీ ఘుమఘుమలు ఇప్పుడు అంతే గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఆనంద్ పీల్చే గాలిని శుభ్రపరచడం, అతడికి రక్షణ కల్పిస్తూ అతడి తరఫున పోరాటం చేయడం మాత్రం అతడి తుదిశ్వాస వరకూ కొనసాగిస్తుంటా. వినసొంపైన స్వరానికి కారణం నేనే... ఆనంద్కు తన గొంతు అంటే చాలా ఇష్టం. ఆనంద్ గొంతు ఇంతగా బాగుండటానికి నాకు కృతజ్ఞుడై ఉండాలి. ఏదీ... ఒక్కసారి తన ముక్కు రంధ్రాలు రెండూ వేళ్లతో మూసుకొని, మాట్లాడమనండి చూద్దాం! ఆ తేడా అతడికే తెలుస్తుంది. నాలోంచి వచ్చే ప్రకంపనల (రిజొనెన్స్) వల్లనే అతడి గొంతు అంత బాగుంటుంది. వాసనలు ఎలా గుర్తుపడతానంటే... నా విధుల్లో ముఖ్యమైన వాటిల్లో ఒకటి వాసన చూడటం. నేను దాదాపుగా 4,000 రకాల వాసనలను గుర్తించగలను. నిజానికి గుర్తింపు శక్తి చాలా ఎక్కువగా ఉన్నవారిలో దాదాపు 10,000 రకాల వాసనలూ గుర్తుపడతా. నా ప్రతి ముక్కు రంధ్రంలోనూ పేపర్ కంటే పలచగా... పసుపు-బ్రౌన్ రంగుల్లో ప్యాచ్ల మాదిరిగా ఉండే కణజాలం ఉంటుంది. ప్రతి ప్యాచ్లోనూ దాదాపు కోటి రిసెప్టార్ కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ ఆరు నుంచి ఎనిమిది అతి సన్నటి కేశాల్లా ఉండే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ నా నుంచి కేవలం మూడు సెంటీమీటర్ల దూరంలో ఉండే మెదడుకు అనుసంధానితమై ఉంటాయి. ఏదైనా వాసన రాగానే... పదార్థాల నుంచి వచ్చిన మాలెక్యూల్స్.. వాసన గుర్తించే ప్యాచ్లను తాకుతాయి. ఆ వెంటనే అక్కడి నుంచి అత్యంత తక్కువ మోతాదులో ఉండే విద్యుత్ తరంగాలు వెలువడి మెదడును చేరతాయి. ఆ విద్యుత్ తరంగాలను మెదడు స్వీకరించి.. అది మరుగుతున్న పులుసా, అప్పుడే వేస్తున్న తాలింపా, కాలుతున్న రొట్టెనా, మరింకేదైనా వాసనా అని గుర్తించి, తన తీర్పు వెలువరిస్తుంది. చెడు వాసనల విషయంలోనూ అంతే. అయితే వాసనను గుర్తించడం అన్నది కేవలం ఇక్కడ పేర్కొన్నంత సులువు కాదు. రంగుల్లో మూడు ప్రైమరీ కలర్స్ ఉండి... అవి వేర్వేరు పాళ్లలో కలిసినప్పుడు ఎన్నో షేడ్స్ ఏర్పడ్డట్లుగానే వాసనల్లోనూ ప్రైమరీ వాసనలు ఉండి, అవి వేర్వేరు పాళ్లలో కలిసి... వేర్వేరు వాసనలుగా మనకు తెలుస్తాయి. ఒకవేళ నేను ఏదైనా వాసనను అదేపనిగా పీలుస్తూ ఉన్నాననుకోండి. ఒక దశలో ఆ వాసనకు అలవాటైపోయి... దాన్ని గుర్తించలేను. ఉదాహరణకు ఆనంద్ తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడనుకుందాం. అప్పుడు ఆనంద్ క్రమంగా తోళ్ల పరిశ్రమ నుంచి వచ్చే ఘాటైన వాసనను గుర్తించలేడు. కానీ మిగతా వాసనలు గుర్తించడంలో అతడి నైపుణ్యాలను మాత్రం కోల్పోడు. ఉదాహరణకు మంచి గులాబీల వాసన వచ్చిందనుకోండి. అతడు తోళ్లపరిశ్రమలో ఉన్నంత మాత్రాన అతడి ముక్కు మొద్దుబారదు. మునుపటిలాగే గులాబీల పరిమళాలను ఆఘ్రాణించగలడు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
ఫ్రిజ్కి ‘ముక్కు’ వచ్చింది!
కుళ్లిపోయిన లేదా కుళ్లిపోవ డానికి సిద్ధంగా ఉన్న ఏ ఆహార పదార్థాలనైనా, మనం వాసనను బట్టి ఇట్టే పసిగడుతుంటాం. కానీ ఫ్రిజ్లో ఉన్నవి అలా గుప్పుమని వాసన వేయవు. దాంతో మనం వాటిని పట్టించుకోం. బాగానే ఉంటాయ్లే అనుకుంటాం. తీరా అవసరమై చూసేసరికి అవి కాస్తా కుళ్లిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రిజ్కి ఓ ముక్కుని తగిలించండి. అంటే... ఈ ‘ఫ్రిజ్ నోస్’ అనే పనికరాన్ని బిగించండి. ఇది ఓ ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఫ్రిజ్లో పదార్థాలు పాడైపోయే దశకు కనుక చేరుకుంటే ఇది పసిగట్టేస్తుంది. అలారం మోగించి మనల్ని అలర్ట్ చేస్తుంది. దాంతో మనం వెంటనే వాటిని వాడేయవచ్చు. వద్దు అనుకుంటే కుళ్లిపోయేలోపే తీసి పారేయొచ్చు. భలేగా ఉంది కదూ ఈ ‘ముక్కు’ ముచ్చట! -
ఫేస్ ద ప్రాబ్లమ్స్
సమస్యల్ని ఫేస్ చేయడం కష్టమే సమస్య వచ్చాక ఫేస్ చేయడం ఇంకా కష్టం ఫేస్లో ఉన్న... కళ్లు, ముక్కు, చెవులు, నోరు ప్రాబ్లమ్స్ను ఎలా ఫేస్ చేయాలో చూద్దాం అంతకంటే ముందు వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం! చెవి చెవి ఇన్ఫెక్షన్ అందరిలోనూ చెవుల నుంచి గొంతులోకి ఒక యూస్టేషియన్ ట్యూబ్ అనే నాళం ఉంటుంది. అలర్జీలు లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల యూస్టేషియన్ ట్యూబ్లోకి క్రిములు చేరుతాయి. అవి మధ్యచెవికి చేరినప్పుడు పిల్లల్లో తీవ్రమైన చెవి నొప్పి వస్తుంది. ఈ కారణం వల్లనే కొందరు పిల్లల్లో జలుబు చేసిన తర్వాత చెవి నొప్పి వస్తుంది. నిర్ధారణ : ఓటోస్కోప్ ఉపయోగించి ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జీ మందులతో ఈ సమస్యకు చికిత్స చేస్తారు. ఇది దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా మారినప్పుడు పిల్లల వినికిడిని తెలుసుకునే ఆడియోగ్రామ్ పరీక్ష, చెవిలోని పొర ఇయర్ డ్రమ్ సాధారణంగా కదులుతుందో లేదో తెలుసుకునే టింపనోగ్రామ్ పరీక్షలు అవసరం కావచ్చు. నివారణ: జబులు చేసిన వ్యక్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడగడం, మురికి చేతులను ముక్కుకు, కళ్లకు అంటకుండా చూడటం వంటి జాగ్రత్తలతో పిల్లలను చెవి ఇన్ఫెక్షన్ల నుంచి నివారించవచ్చు. ముక్కు సైనసైటిస్ ముక్కుకు ఇరువైపులా ముఖంలో గాలి ఉండే కొన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ ఖాళీ స్థలాలలో వచ్చే ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అంటారు. సాధారణంగా పిల్లల్లో జలుబు లేదా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ తర్వాత ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇది వచ్చిన వారిలో ముక్కు కారడం, తలనొప్పి, నోటిదుర్వాసన (బ్యాడ్ బ్రెత్), దగ్గు, జ్వరం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. నిర్ధారణ : ఎక్స్రే, సీటీ స్కాన్, సైనస్ స్రావాల కల్చర్ పరీక్షలతో ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, అసిటమైనోఫెన్, ఛాతీ పట్టేసినట్లు ఉండటాన్ని తగ్గించే డీ కంజెస్టెంట్స్తో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అవసరం కావచ్చు. అలర్జిక్ రైనైటిస్ ఏదైనా సరిపడని పదార్థం ముక్కులోకి వెళ్లి, అది తీవ్ర ఇబ్బంది కలిగించడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది కుటుంబ చరిత్రలో ఉండే రుగ్మత. సాధారణంగా పుప్పొడి, దుమ్ములో ఉండే డస్ట్మైట్స్, బొద్దింకలు వాటి విసర్జకాలు, జంతువుల ఒంటి నుంచి వెలువడే వాసనలు, పొగాకు పొగ వంటివి అలర్జిక్ రైనైటిస్కు కారణమవుతాయి. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, ముక్కులో దురద, ముక్కు కారుతూ ఉండటం వంటివి కనిపిస్తాయి. నిర్ధారణ : కుటుంబ వైద్య చరిత్రతో పాటు బయటకు కనిపించే లక్షణాల ఆధారంగా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. నివారణ / చికిత్స: ఈ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. పుప్పొడి వ్యాపించే సీజన్లో ఎయిర్కండిషన్లో ఉండటం, దుమ్ము ధూలికి ఎక్స్పోజ్ కాకపోవడం, బూజు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం కూడా నివారణకు మంచి మార్గం. ఇక యాంటీహిస్టమైన్స్, కార్టికోస్టెరాయిడ్స్, ముక్కులో వాడే స్ప్రేలు, యాంటీట్యూకోట్రైన్స్ వంటి మందులు వాడుతుంటారు. కళ్లు కళ్ల సమస్యలు కళ్ల సమస్యలు: పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు ఈ కింది కారణాల వల్ల రావచ్చు. అవి... కళ్లను అదేపనిగా రుద్దుతూ ఉండటం కాంతికి తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఒకేచోట దృష్టినిలపడంలో ఇబ్బందులు ఏదైనా వస్తువును చూడటంలో సమస్యలు ఆర్నెల్ల వయసు తర్వాత రెండు కనుగుడ్లు ఒకేవైపునకు, ఒకేలా కదలకపోవడం (అబ్నార్మల్ అలైన్మెంట్) దీర్ఘకాలికంగా కళ్లు ఎర్రగా ఉండటం కళ్లలో నల్లగుడ్డు ఉండాల్సిన చోట తెల్లటి మచ్చ ఉండటం. నిర్ధారణ: సాధారణంగా కళ్ల సమస్యలు ఆసిటీ చార్ట్ వంటి కొన్ని స్క్రీనింగ్ పరీక్షలతో స్కూల్కు వెళ్లే ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక కాంతి కిరణాలు అవసరమైన చోట కేంద్రీకృతం కాకపోవడం వంటి సమస్యలను రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు. ఇందులో దగ్గరి దృష్టిలో కేవలం దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను మయోపియా అంటారు. ఇక కొందరు పిల్లల్లో దూరంగా ఉన్నవి కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఈ సమస్యను హైపరోపియా అంటారు. ఇక కన్ను ముందువైపున ఉండే వంపు సరిగా లేకపోవడం వల్ల చూసే ప్రక్రియ ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఆస్టిగ్మాటిజమ్ అంటారు. ఈ మూడు సమస్యలను కళ్లజోడు ఉపయోగించడం ద్వారా సరిచేయవచ్చు. నోరు నోటిలో పుండ్లు (ఓరల్ అల్సర్స్) ఇవి పిల్లలో చెంపలు, పెదవుల లోపలి వైపున, చిగుర్లపైన కనిపిస్తాయి. కొందరిలో నాలుకపైన కూడా కనిపిస్తుంటాయి. కారణాలు : ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, ఐరన్ వంటి లోపాల వల్ల ఇవి వస్తుంటాయి. కొందరిలో నోటిలో అయ్యే గాయాల వల్ల, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలర్జీల వల్ల కూడా కనిపిస్తుంటాయి. చికిత్స/ నివారణ : సాధారణంగా ఈ సమస్య రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఇలా పిల్లలో నోటిలో పుండ్లు వస్తున్నప్పుడు పోషకాహార లోపాలు లేక వ్యాధి నిరోధకతలోపాలు ఏవైనా ఉన్నాయా అని చూడాలి. కొన్ని ఆహారాలు సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీ) కూడా ఉందేమో అని తెలుసుకోవాలి. డాక్టర్ శివనారాయణరెడ్డి వెన్నపూస కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ - ఇన్టెన్సివిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్,విక్రమ్పురి, సికింద్రాబాద్ -
పాప్కార్న్ లంగ్ అంటే..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోయినట్లుగా ఉండటం, వాసనలు తెలియకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. చాలామంది వైద్యులను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. - సూర్యప్రకాశ్, నందిగామ మిమ్మల్ని వేధించే ఇదే సమస్యతో ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. దీన్నే ‘అలర్జిక్ రైనైటిస్’ అంటారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికు వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నాసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ ⇒ అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం. ⇒ సరైన పోషకాహారం తీసుకోవడం. ⇒ ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం. ⇒ చల్లని వాతావరణానికి దూరంగా ఉడటం. ⇒ పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. ఈమధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటిన్ 10, యూరియా 320 ఉన్నట్లు తెలిసింది. స్కానింగ్లో కిడ్నీ సైజ్ తగ్గింది. సీకేడీ ఫిఫ్త్ స్టేజ్ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి) చేయించుకోవాలని అన్నారు. ట్రాన్స్ప్లాంట్ కాకుండా వేరే ఏమైనా మార్గాలున్నాయా? ఒకవేళ తప్పకపోతే దాత (డోనర్)గా ఎవరు ఇవ్వవచ్చో చెప్పండి. - శ్రీనివాస్, రామగుండం మీకు అన్ని విధాలా శ్రేయస్కరమైన మార్గం కిడ్నీ మార్పిడి చేయించుకునే చికిత్సే. మీ సోదరులుగానీ, సోదరీమణులుగానీ, మీ తల్లిదండ్రుగానీ దాతలుగా వ్యవహరించవచ్చు. దాతగా ముందుకు వచ్చిన వారికి అన్ని విధాలా పరీక్షలు నిర్వహించి, వారికి ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయితేనే డాక్టర్లు వారిని దాతగా ఆమోదిస్తారు. కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా దాతలకు ఎలాంటి సమస్యా రాదు. దాతలు రక్తసంబంధీకులు అయితే, మార్పిడి తర్వాత కూడా మూత్రపిండాలలో ఎలాంటి ఇబ్బందులు గానీ లేకుండా వ్యవహరించే అవకాశం ఉంది. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న కిడ్నీ మార్పిడి తర్వాత కూడా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాతలు అందుబాటులో లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్ను చేయించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులలో దాత లభించనప్పుడు క్యాడెవరస్ ఆర్గన్స్ కోసం కోసం తమ పేరును నమోదు (రిజిస్టర్) చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జీవన్మృతుల (బ్రెయిన్డెడ్ పర్సన్)నుంచి కిడ్నీను స్వీకరించి, దాన్ని కిడ్నీ అవసరమైన రోగికి అమర్చుతారు. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మాత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రావచ్చా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - సర్ఫరాజ్, నిజామాబాద్ ఇలా చాలాసార్లు మూత్రంలో రక్తం పోతున్నట్లయితే, ఏ కారణం వల్ల ఇలా జరుగుతోందో తెలుసుకొని, దానికి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు (గ్లోమెరూలస్ నెఫ్రైటిస్ వంటివి) ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్ వంటివి లేకుండా రక్తం పోవడం జరుగుతూ ఉంటే తప్పక డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ విక్రాంత్రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా చిన్నప్పుడే స్మోకింగ్ మొదలుపెట్టి చాలా కాలం క్రితం ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్, హుక్కా మొదలుపెట్టాను. అయితే నా ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ అది కూడా వద్దని అంటున్నారు. అవి అలాగే కొనసాగితే ‘పాప్కార్న్’ లంగ్ రావచ్చని అంటున్నారు. అంటే ఏమిటి? - రాధేశ్యామ్, హైదరాబాద్ పాప్కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. ‘కృత్రిమ వెన్న’ను తీసుకునేవారిలో కూడా ఈ పాప్కార్న్ లంగ్ కనిపిస్తుంది. ఇది తొందరగా ‘డై అసిటైల్’ అనే ఆవిరైపోయే ఒక రసాయన పదార్థం. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్కార్న్లను వెన్నలో వేయించడానికి బదులు దీనిలో వేపుతుంటారు. దానితో ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి దీన్ని సాధారణ పరిభాషలో ‘పాప్కార్న్ లంగ్’ అంటుంటారు. పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నకు దీర్ఘకాలం పాటు ఎక్స్పోజ్ అయినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు.దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్కార్న్ లంగ్ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు. ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. అయితే అది చాలా కష్టం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
గొడ్డలితో భార్య ముక్కు తెగ్గొట్టాడు..
నారాయణఖేడ్ (మెదక్) : తాగిన మైకంలో ఓ వ్యక్తి భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె ముక్కు తెగిపోవటంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణం దత్తాత్రేయకాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఉబ్ది పాండు, కేశమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాండు తరచూ తప్పతాగి వచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. ఇదే విధంగా ఇటీవల కేశమ్మ పుట్టింటికి వెళ్లిపోగా మద్యం తాగనని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని భార్యను తెచ్చుకున్నాడు. అయినప్పటికీ బుధవారం రాత్రి తల్లి పోచమ్మతో కలసి పూటుగా మద్యం తాగాడు. అనంతరం పాండు భార్య, తల్లితో గొడవకు దిగాడు. కోపంలో ఉన్న పాండు భార్య కేశమ్మపై గొడ్డలితో వేటువేయగా ఆమె ముక్కు తెగి, తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన కాలనీవాసులు తల్లి, కొడుకుకు దేహశుద్ధి చేశారు. అనంతరం గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కేశమ్మ తండ్రి కేశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
ముక్కు స్థానంలో కళ్లు!
జన్యులోపం కారణంగా ఓ మేక ముక్కు లేకుండా దాని స్థానంలో రెండు కళ్లతో జన్మించింది. ఈ సంఘటన మండలంలోని కప్పపహాడ్ గ్రామంలో మంగళవారం ఉదయం జన్మించింది. గ్రామానికి చెందిన దొడ్డి యాదయ్య మందలో ఉన్న ఓ మేక మొదటి ఈతలో ఒక మేక పిల్లకు జన్మనిచ్చింది. ఈ మేకకు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఒకే దగ్గర ఉన్నాయి. నోరు చిన్నగా ఎడమవైపు ఉంది. ఆ మేక పిల్ల ఆరోగ్యంగానే ఉంది. - ఇబ్రహీంపట్నం రూరల్ -
చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!
జ్ఞానేంద్రియాల్లో ముక్కు, శ్వాస పీల్చుకోవడంతోపాటు, వాసనలను పసికట్టేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెదడులో భావాలను కలిగించే 'లిమ్బిక్' వ్యవస్థ వల్ల ముక్కు వాసనలను పసిగట్టగల్గుతుంది. ఇలా ముక్కునుంచి మెదడుకు సంబంధం ఉండటం మనకు తెలుసు.. కానీ ఆ బాలుడికి ఏకంగా మెదడే ముక్కులో పెరుగుతుండటం వైద్య రంగాన్నే విస్తుపోయేలా చేసింది. అయితే అనేక ఆపరేషన్ల తర్వాత బిర్మింగమ్ పిల్లల ఆస్పత్రి వైద్యులు చిన్నారి లోపాన్ని సరి చేయగలిగారు. పుట్టుకతో వచ్చిన లోపంతో ఇబ్బందిపడుతున్న వేల్స్ మీస్టెగ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్క నెల్ల ఒల్లీ ట్రీజీజ్ కు మెదడు భాగం చిట్లి దాని ద్వారా ముక్కులో ఓ తిత్తిలా మెదడు పెరగటం ప్రారంభించింది. వైద్య శాస్త్రంలో ఎన్సెఫలోసెల్ గా పిలిచే ఈ పరిస్థితిని గుర్తించేందుకు డాక్టర్లు కూడ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చిన్నారికి ఇరవై వారాల వయసులో స్కాన్ తీసిన వైద్యులు ముక్కులో కండ పెరుగుతున్నట్లుగా భావించారు. ఒల్లీ తల్లి ఇరవై రెండేళ్ళ యామీ... వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కు గురైంది. భర్తకు దూరమైన యామీ ఒల్లీని తన వరంగా భావించింది. చిన్నారికి ఏమౌతుందోనని ఖంగారు పడిపోయింది. తొమ్మిది నెలలు గడిచే సరికి ఒల్లీ రూపం పినాచియో బొమ్మలా మారుతూ వచ్చింది. దీంతో వైద్యులు అతడి ముక్కుకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేదంటే అతడు ఊపిరి పీల్చడం కూడ కష్టంగా మారుతుందని యామీకి చెప్పారు. ఆమెకు అవగాహన కూడ కల్పించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత బిడ్డ ముక్కులో పెరుగుతున్నది కండకాదు.. ఓ తిత్తిలా పెరుగుతున్న మెదడు అని తేల్చారు. పుట్టుకతో వచ్చిన లోపంగా కూడ గుర్తించారు. 2014 నవంబర్ లో ఒల్లీకి బిర్మింగమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండుగంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. పుర్రె భాగాన్ని కత్తిరించి మెదడు నుంచి ముక్కులోకి అధికంగా ఉన్న తిత్తివంటి ఫ్లూయిడ్ భాగాన్ని తీసి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం ఒల్లీ పూర్తిగా కోలుకున్నాడు. నాలుగేళ్ళ తన అక్క అన్నతో హాయిగా ఆడుకుంటున్నాడు. అయితే చిన్నారికి భవిష్యత్తులో చికిత్సలు చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్నిప్రస్తుతానికి వైద్యులు నిర్థారించ లేదు. అతడి మెదడు పెరుగుదలను బట్టి భవిష్యత్ చికిత్స ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. -
చెంపలపై...బటర్ఫ్లై
మెడిక్షనరీ ముక్కుకు ఇరువైపులా చెంపల మీద సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే చర్మం మీద కనిపించే మచ్చల వల్ల ఈ సమస్యకు ‘బటర్ఫ్లై ర్యాష్’ అని పేరు. ల్యూపస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వల్ల కనిపించే లక్షణమిది. ఇదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన వ్యాధి నిరోధకత మనపైనే దుష్ర్పభావం చూపడం వల్ల ఈ వ్యాధి కనిపిస్తుందన్నమాట. ఆటో ఇమ్యూన్ వ్యాధి కావడం వల్ల ఇది ఒక పట్టాన తగ్గే అవకాశం అంతగా ఉండదు. కానీ సన్స్క్రీన్ లోషన్స్ రాయడం, ఎండవేడిమి వెళ్లకుండా ఉండటం, కొన్ని రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడటం, ‘డీఎమ్ఏఆర్డీ’స్అని పిలిచే డిసీజ్ మాడిఫయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడటం వంటి చికిత్సల వల్ల ఇది కాస్త అదుపులోకి వస్తుంటుంది. -
ముక్కుపెద్దన
తిక్క లెక్క అష్ట దిగ్గజాల్లో ముక్కు తిమ్మన బిరుదు ఉన్నది నంది తిమ్మనకు కదా అనుకుంటున్నారా..? ఔను... నిజమే! అల్లసాని పెద్దనకు ముక్కు పెద్దన అనే బిరుదేమీ లేదు. ముక్కు గురించి, ముక్కందం గురించి ముచ్చటైన పద్యాలు అల్లినందుకు నంది తిమ్మనకే ముక్కు తిమ్మన అనే బిరుదు దఖలు పడింది. అయితే, ఈ ఫొటోలోని టర్కీ పెద్దన్న అసలు పేరు మెహ్మెత్ ఓజ్యురెక్. ఆయన ముక్కు పొడవును చూసిన వాళ్లెవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎందుకంటే, సాక్షాత్తూ గిన్నిస్ బుక్ రికార్డుల నిర్వాహకులే ప్రపంచంలోకెల్లా ముక్కుపెద్దన ఈయననేనంటూ బేషరతుగా సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఈయనగారి ముక్కు పొడవు ఏకంగా 8.8 సెంటీమీటర్లు ఉంది మరి. -
ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు
హైదరాబాద్: నగరంలోని వీఎన్ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాలకు చెందిన మాస్టర్ రాంబాబు బ్లాక్ పేయింట్ను ముక్కుసాయంతో వాడుతూ అద్భుతమైన గణనాధుని విగ్రాహాన్ని ఆవిష్కరించారు. -
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..
పిలిబిట్: ఉత్తరప్రదేశ్లోని పిలిబిట్లో అమానుషం చోటుచేసుకుంది. కట్నం కోసం ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. భార్య అనే కనికరం కూడా లేకుండా కత్తెరతో ఆమె ముక్కు, జడ కోశాడు. కోత్వాలీ పూరాన్పూర్లో ఈ దారుణం బుధవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే ఆలమ్ భార్య రుబీనాను కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. రూ.20వేలతో పాటు బైక్ ఇవ్వాలంటూ అత్తమామలను డిమాండ్ చేశాడు. అయితే కట్న దాహం తీరకపోవటంతో ఆలమ్ ఈ దారుణానికి తెగబడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు రుబీనాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. -
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..
-
తుమ్మితే రాలిపోని విషయాలు
ట్రివియా ⇒ ముక్కు. ఊపిరి తీసుకోవడానికి, వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ముఖసౌందర్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మనుషుల ముక్కుల్లో ప్రధానంగా పదిహేడు రకాలు ఉన్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది. ⇒ మనుషుల్లో పదేళ్ల వయసు వచ్చేసరికి ముక్కు తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, పురుషుల్లో 17-19 ఏళ్లు, మహిళల్లో 15-17 ఏళ్ల వరకు ముక్కు ఎదుగుదల కొనసాగుతుంది. ⇒ మనుషులు కనీసం పదివేలకు పైగా వాసనలను గుర్తించగలరు. ⇒ మనుషుల ముక్కులో ఆఘ్రాణశక్తిని ఇచ్చే కణాలు దాదాపు 1.20 లక్షల వరకు ఉంటాయి. అయితే, అందరి ఘ్రాణశక్తి ఒకేలా ఉండదు. ⇒ ఎలాంటి వాసనలను గుర్తించలేని పరిస్థితిని ‘అనోస్మియా’ అని, స్వల్పస్థాయిలోని వాసనలను సైతం గుర్తించగల శక్తిని ‘హైపరోస్మియా’ అని అంటారు. ⇒ పురుషుల కంటే మహిళల్లోనే ఘ్రాణశక్తి ఎక్కువ. పసిపిల్లల్లోనూ ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. పసిపిల్లలు వాసన ఆధారంగా తల్లులను గుర్తించగలుగుతారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఘ్రాణశక్తి క్రమంగా క్షీణిస్తుంది.. ⇒ కేవలం ముక్కుతోనే ఉపాధి పొందే వాళ్లు కూడా ప్రపంచంలో లేకపోలేదు. ఘనమైన ఘ్రాణశక్తి గల వారికి మద్యం ఉత్పత్తి సంస్థలు, పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థల్లో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగులు తమ ముక్కులకు బీమా చేయించుకుంటారు. ఇల్జా గోర్ట్ అనే డచ్ వైన్మేకర్ తన ముక్కును 80 లక్షల డాలర్లకు ఇన్సూర్ చేయించాడు. ⇒ ముక్కుకు ఎంతటి ఆఘ్రాణశక్తి ఉన్నా, ఇంధనంగా వాడే సహజ వాయువు ఉనికిని పసిగట్టలేదు. దీనివల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో గ్యాస్ కంపెనీలు ఇందులో వాసన కలిగించే పదార్థాన్ని కలుపుతారు. -
ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డు!
ఈఎన్టీ కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి చాలా రకాల మందులు వాడాను. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. అయితే ఆ మందుకు అలవాటు అవుతానేమో అనే ఆందోళనతో మానేశాను. దాంతో రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - హుసేన్ మియా, విజయవాడ ఇటీవల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల మీరు చెబుతున్న సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పైగా చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట బయటపడే వాటిల్లో ముక్కుకు సంబంధించిన సమస్యలే ఎక్కువ. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడమో లేదా అలర్జీ ఉండటమో లేదా ముక్కులో పాలిప్స్ ఉండటమో లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండటమో జరగవచ్చు. మొదట మీరు నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చిన సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులకు దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఈసీ వినయకుమార్ హెచ్ఓడి అండ్ ఇఎన్టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్ -
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
-
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో విచక్షణ మరచిన భర్త...ఆమె ముక్కు, చెవులు కోసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా భార్య రజితను అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. -
సొంత కణాలతో.. కొత్త ముక్కు
లండన్: ప్రమాదాల్లోనో, కేన్సర్ కారణంగానో ముక్కును పోగొట్టుకున్నవారికి శుభవార్త. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కార్టిలేజ్ (మృదులాస్థి)తో ముక్కును పూర్తిస్థాయిలో రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇవాన్ మార్టిన్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్కు చెందిన బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ తరహా శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశారు కూడా. ముందుగా బాధితుల ముక్కులోని కార్టిలేజ్ కణాలను తీసుకుని.. టిష్యూ ఇంజనీరింగ్ (కణజాల వర్థనం) పద్ధతిలో కొల్లాజెన్ మెంబ్రేన్గా అభివృద్ధి చేశారు. అనంతరం దానిని బాధితుల్లో దెబ్బతిన్న ముక్కు భాగానికి అనుగుణంగా.. అవసరమైన ఆకారంలోకి మలిచి.. శస్త్రచికిత్స చేసి అమర్చారు. అయితే, 76 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురికి ఈ తరహా శస్త్రచికిత్స చేశామని ఇవాన్ మార్టిన్ చెప్పారు. శస్త్రచికిత్స చేసిన ఆనవాళ్లు ఏడాదిలోగా మాయమయ్యాయని, ఇతర దుష్ర్పభావాలేమీ కనిపించలేదని వెల్లడించారు. ముక్కుతో పాటు చెవులు, కనురెప్పలు వంటివి దెబ్బతిన్నప్పుడు కూడా ఈ తరహా చికిత్స చేయవచ్చని పేర్కొన్నారు. -
కొవ్వు నుంచి ముక్కు, చెవులు!
లండన్: శరీరంలోని కొవ్వు నుంచి ముక్కు, చెవులు, ఎముకలను తయారు చేసే వినూత్న టెక్నిక్ను లండన్లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు ఆవిష్కరించారు. పిల్లల శరీరంలోని కొవ్వు నుంచి మూలకణాలు సేకరించి వాటితో మృదులాస్థిని తయారు చేయవచ్చని, ఆ మృదులాస్థిని మూసలలో అభివృద్ధిపర్చి చెవి, ముక్కు వంటి అవయవాలను రూపొందించవచ్చని వారు అంటున్నారు. పుట్టుకతోనే చెవులు, ముక్కు సరిగ్గా ఏర్పడని పిల్లలకు, కేన్సర్ వంటి వ్యాధుల వల్ల ముక్కు వంటి మృదులాస్థి అవయవాలు దెబ్బతిన్నవారికి ఈ పద్ధతిలో ఆయా అవయవాలను తయారు చేసి అమర్చవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం బయటి చెవులు సరిగా ఏర్పడని పిల్లలకు వారి పక్కటెముకల నుంచి మృదులాస్థిని సేకరించి చె వులు తయారు చేస్తున్నారు. అయితే దీనివల్ల వారి ఛాతీపై శాశ్వత గాయం ఏర్పడటంతోపాటు పక్కటెముకను పునరుద్ధరించడం సాధ్యం కావడం లేదు. ఇలాంటివారికి తాము కనుగొన్న పద్ధతి బాగా ఉపయోగపడనుందని వైద్యులు చెబుతున్నారు. -
చెవి, ముక్కు, గొంతు సమస్యలు-హోమియో చికిత్స
చెవి, ముక్కు, గొంతు సమస్యలు కూడా ఒక దానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని కూడా రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన, మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన సమస్య తీవ్రత పెరిగి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది. 3)తల తిరగటం: ఇది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో గమనిస్తూనే ఉంటాము. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాని, పడుకుని చాలా తొందరగా లేచినప్పుడు, సడెన్గా పైకి చూసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవటం వలన కూడా ఇది వస్తుంది. 4) మీనియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో ముఖ్యంగా తల తిరగటం, సరిగ్గా వినిపించక పోవటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. 5) ఎకోస్టిక్ న్యూరోమా: ఇది చెవిలోపల ఒక కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరుమని శబ్దాలు, నడిచేటప్పుడు కూడా సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవటం, మొహం అంతా తిమ్మిరి రావటం వంటి లక్షణాలు వస్తాయి. కఖఐ పరీక్ష చేయించుకుంటే కణితి సైజ్ ఎలా ఉన్నది తెలుస్తుంది. 6) ల్యాబరింథైటిస్, వెస్టిబ్యులార్ మ్యారైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వలన ఈ సమస్య వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన వస్తుంది. చెవి మధ్యపొర నుంచి వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో కూడా ముఖ్యంగా తల తిరగటం, వికారం, వినికిడిలోపం వంటివి ఉంటాయి. 7) ఓటో స్ల్కీరోసి్స్, టినిటస్ లాంటి సమస్యలు: ఇవి చెవిలోపల సర్వ సాధారణంగా గమనిస్తుంటాము. ఇదేవిధంగా ముక్కు లోపల కూడా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించి, ఎలర్జీ వంటి సమస్యలు వస్తూంటాయి. అవి... ఎలర్జిక్ సైనసైటిస్ ఎపిస్టాక్సిస్ సైనసైటిస్. ఈ పైన చెప్పిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి క్షీణించటం వలన, సాధారణమైన జలుబు, తుమ్ములు, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారటంతో మొదలయి, సరైన రీతిలో చికిత్స తీసుకోక, విపరీతమైన కఫం లేదా శ్లేష్మం గాలి రంధ్రాలలో పేరుకుపోయి, వాటికి వాపు వస్తుంది. ఈ సమస్యను సైనసైటిస్ అంటారు. దీనిలో తలబరువు, వికారం, వాంతులు, వాసన తెలియకపోవటం, నీరసం, అలసట, ఎవరి పనులు వారు చేసుకోలేక పోవటం వంటి సమస్యలు వస్తాయి. చెవి, ముక్కుకు వచ్చే సమస్యలు గొంతు సమస్యలకు కూడా దారి తీస్తుంటాయి. వీటిలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి రోజురోజుకి తగ్గి మొత్తం చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా వచ్చే గొంతు సమస్యలు: స్వరపేటికలో వచ్చే సమస్యలు: ఇవి ముఖ్యంగా, గొంతు ఎక్కువగా వాడటం వలన అంటే ఎక్కువగా మాట్లాడే వారిలో, పాటలు పాడే వాళ్ళలో, హైపోథైరాయిడిజమ్, సైనసైటిస్తో ఎక్కువ కాలంగా బాధపడుతున్న, విపరీతమైన దగ్గు ఉండే వాళ్ళల్లో వస్తుంది. అరుగుదల సమస్య ఉండే వాళ్ళల్లో కూడా గొంతు దగ్గర మంట, నొప్పి, తీసుకున్న ఆహారం మింగలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’కు దారి తీస్తాయి. చెవిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఇవి 1) చెవి వెలుపలి పొర 2) మధ్య భాగంలో ఉండే పొర 3) లోపలి పొర. సాధారణంగా ఈ 3 పొరలకు ఇన్ఫెక్షన్స్ గాని, వేరే ఇతర వ్యాధులు గాని రావటం జరుగుతుంది. సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు 1) చెవి వెలుపలి పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: దీనివలన దురద, నొప్పి, వాపుతో కూడి చెవి నుంచి స్రావం వస్తుంది. ఆ స్రావం ఒక్కొక్కసారి నీరు లేదా చీముతో కూడిన స్రావం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవటం వలన, ఒక్కొక్కసారి త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా కూడా చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. త్వరితంగా వచ్చేవి అంటే ఎక్యూట్ పర్స్పరేటివ్ ఒటైటిస్ మీడియా దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ పర్స్పరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటారు. ఇన్ఫెక్షన్స్ తీవ్రతను బట్టి అది ఎక్యూట్ లేదా క్రానిక్ అని గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుంది. 2) మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ఇది ముఖ్యంగా ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంతే గాకుండా ఎలర్జీ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తరచుగా ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూంటాయి. దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు: చెవినొప్పి సరిగ్గా వినబడకపోవటం చెవి అంతా పట్టేసినట్లు ఉండడం జ్వరం తలంతా బరువుగా ఉండి ఏ పనిచెయ్యాలని అనిపించకపోవటం తల తిరగటం. పాజిటివ్ హోమియోపతిలో పేషెంట్ తత్త్వాన్ని బట్టి మందులు ఇచ్చి, వ్యాధి యొక్క మూలకారణాన్ని ఎనాలసిస్ చేసుకుని ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆపడమే కాకుండా, పూర్తిస్థాయిలో చికిత్స ఇవ్వడం జరుగుతుంది. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com