Poison
-
ప్రమాదకరమైన విషం నుంచి ఔషధాలు తయారయ్యాయి ఇలా..!
మానవుడికి అత్యంత హానికరమైన విషాలతోనే ప్రాణాలను కాపాడే శక్తిమంతమైన ఔషాధాలను తయారు చేశారు శాస్త్రవేత్తలు. అత్యంత ప్రమాదకరమైన పాయిజన్ల నుంచే డయాబెటిక్, ఊబకాయం, బ్రెయిన్ ట్యూమర్, లుకేమియా వంటి కేన్సర్లను నివారించే ఔషధాలను తయారు చేశారట పరిశోధకులు. అసలు పాయిజన్లతో ప్రమాదకరమైన వ్యాధులను నివారించే ఔషధాల ఆవిష్కరణ ఎలా జరిగింది..?. ఏ విష జంతువు పాయిజన్తో ఎలాంటి మందులను తయారు చేశారు తదితరాల గురించి చూద్దాం.!గిలా మాన్ స్టర్ అనే బల్లిలో విషపూరితమైన పాయిజన్ ఉంటుంది. వీటిని అమెరికాలో కొందరు పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. అయితే దీనిలో ఉండే విషం మానవులు ప్రాణాలను హరిస్తుంది. ఈ విషంతో శాస్త్రవేత్తలు ఓజెంపిక్ అండ్ వెగోవీ వంటి ఆధునిక మందులను తయారు చేశారు. వీటిని డయాబెటిస్, ఊబకాయం చికిత్సలలో ఉపయోగిస్తారు. 20 వ శతాబ్దంలో ఆకలిని అణిచివేసే డ్రగ్ని కనిపెట్టే పనిలోపడ్డారు పరిశోధకులు. అలా గిలా అనే రాక్షస బల్లిలో ఆకలిని నియంత్రించే జీఎల్పీ-1ని పోలి ఉండే ప్రోటీన్ని గుర్తించారు. దాంతో ఆ పాయిజన్తో డయాబెటిక్ని కంట్రోల్ చేసే డ్రగ్ని, ఓబిసెటీకి చెక్పెట్టే మందులను తయారు చేశారు. రక్తపింజరి విషంతో..అలాగే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన మందులలో ఒకటైన లిసినోప్రిల్ డ్రగ్ ఒకటి. ఇది రక్తపోటుని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది దేనితో తయారు చేశారో వింటే షాకవ్వుతారు. రక్తపోటుని తగ్గించగలిగే ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇది శరీరంలోని రక్తనాళాలను గట్టిగా కుదించకుండా నిరోధిస్తుంది. దీన్ని బ్రెజిలియన్ వైపర్(ప్రమాదకర రక్తపింజరి) విషం నుంచి తయారు చేశారట పరిశోధకులు. ఇది గుండెపోటు చికిత్సలో కూడా ఉపయోగిస్తారట.కీమో థెరపీ ఔషధాలుగా..అలాగే పురాతన సముద్రస్పాంజ్ల కూడా ఆధునిక చికిత్సలో ఉపయోగిస్తున్నారట పరిశోధకులు. ముఖ్యంగా కరేబియా స్పాంజ్ నుంచి తయారు చేసిన ఔషదాలు లుకేమియా, నాన్హాడ్జికిన్స్ లిఫోమా వంటి కేన్సర్ చికిత్సలలో ఈ డ్రగ్ని కీమోథెరపీ ఔషథంగా ఉపయోగిస్తారట. తేలు విషం కూడా అద్భుతమైన వైద్య పురోగతిని అందించిందట. 2004లో, ఆంకాలజిస్ట్ జిమ్ ఓల్సన్ ఒక టీనేజ్ అమ్మాయి తలలోని బ్రెయిన్ ట్యూమర్ని తొలగించడానికి 14 గంటల పాటు క్రిటికల్ సర్జరీని చేశారు. అయితే బొటనవేలంత పరిమాణంలోని కేన్సర్ కణాలు తొలిగించలేకపోతారు. దీంతో సూక్ష్మాతి కేన్సర్ కణాలను కూడా తొలగించే దిశగా సాగిన ప్రయోగాల్లో తేలు విషం ఉపయోగపడుతుందని గుర్తించారు పరిశోధకులు. అలా ఆ తేలు విషంలో ఉండే..పెప్టైడ్ అనే క్లోరోటాక్సిన్ మెదడు కణితిని కణాలతో బంధిస్తుందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ డ్రగ్ అతి చిన్న కేన్సర్ సముహాలను కూడా సమర్థవంతంగా నిర్మూలించగలదు. ఈ ప్రకృతే ప్రాణాంతకమైన వాటిని ఇస్తూ దాన్నుంచే ప్రాణాలు పోసే ఆవిష్కరణలు చేసేలా పరిష్కారాన్ని అందిస్తోంది. సమస్యలోనే పరిష్కారం ఉంటుందనే అద్భుతమైన విషయ్నాని అందించింది. ఈ భూమిపై అన్ని జాతుల మనుగడే సమర్థవంతమైన పర్యావరణానికి కీలకం. అదే మానువ మనుగడకు మూలధారం కూడా.(చదవండి: Preetisheel Singh Dsouz: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!) -
‘యమున’పై ఈసీకి కేజ్రీవాల్ వివరణ
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయానికి వచ్చారు. యుమునా నదీ జలాల్లో విషం కలిసిందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికారులు జారీ చేసిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేసే యమునా జలాల్లో అమోనియాను కలిపి విషపూరితం చేసిందని ఈ నెల 27న కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు ఆ విషయం తెలిసి, వెంటనే ఢిల్లీకి ఆ నీరు రాకుండా ఆపేశారు. ఆ నీరే తాగు నీటిలో కలిసినట్లయితే ఎంతో పెద్ద విపత్తు జరిగి ఉండేది’అని అన్నారు. దీనిపై ఈసీ కేజ్రీవాల్కు రెండుసార్లు నోటీసులు పంపించింది. దీనిపై శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ అధికారుల ఎదుట తన వాదనను వివరించారు. జనవరి 15న 3.2 పీపీఎం ఉన్న అమోనియా స్థాయిలు జనవరి 27వ తేదీ నాటికి 7 పీపీఎంకు పెరిగినట్లు తెలిపే నివేదికను అందజేశారు. ఆయన వెంట సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఈసీని కలిసేందుకు ఆయన ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తున్నందున కేజ్రీవాల్తో సమావేశమై ఆయన వాదనను సావధానంగా విన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వాసులకు విష జలాలను సరఫరా చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రను కేజ్రీవాల్ ఈసీ అధికారులకు వివరించారని అనంతరం ఆప్ తెలిపింది. అమోనియా కలుషితాలున్న విషయం తెలిపేందుకు మూడు బాటిళ్లలో యమునా నీటిని కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపిందని పేర్కొంది. -
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
‘ఆప్’ను ప్రజలు క్షమించరు
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు. -
బషర్ అసద్పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి
అల్వాల్ (సికింద్రాబాద్): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల వేధింపులు భరించలేక..ఇంటికి తిరిగి వచ్చేసిన కూతురి వేదన చూసి కుంగిపోయిన ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందిన జగన్మోహన్రెడ్డి (60) ఆర్టీసీ ఉద్యోగి. 2021లో తన కుమారై సేహ్న (30)కు సూరారం ప్రాంతానికి చెందిన నవీన్రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన వెంటనే నవీన్రెడ్డి, స్నేహలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లారు. మార్చి 2024లో నవీన్రెడ్డి, స్నేహ దంపతులకు ఒక పాప పుట్టింది. డెలివరీ సమయంలోనే స్నేహ అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త నవీన్రెడ్డి భార్యను నెలన్నర పసిపాపతో సహా అల్వాల్ రీట్రీట్ కాలనీలో ఉంటున్న స్నేహ తండ్రి జగన్మోహన్రెడ్డి వద్దకు పంపించేశాడు. ఈ క్రమంలో నవీన్ తల్లిదండ్రులు మహేందర్రెడ్డి, పద్మలు వీరిని వేధించారు. అనారోగ్యానికి గురయ్యావంటూ నిందించారు. అనంతరం చిన్నారిని బలవంతంగా సూరారం తీసుకెళ్లారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జగన్మోహన్రెడ్డి, స్నేహలు సూరారం వెళ్లి పాపను తమకు ఇచ్చేయాలని కోరారు. దీనికి నిరాకరించిన నవీన్ కుటుంబ సభ్యులు దూషించారు. వారి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురైన కుమార్తెను తీసుకొని జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు చూపించి.. తిరిగి వస్తూ బోయిన్పల్లిలో బిర్యానీ కొనుగోలు చేసి..దాంట్లో విషం కలుపుకొని కారులో కూర్చొని తిన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం జగన్మోహన్రెడ్డి మృతి చెందగా కూతురు స్నేహ కోలుకుంది. కూతురు జీవితం చిన్నాభిన్నం అయిందన్న వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్వాల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఊహించని విధంగా మరణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు.. -
పాము గుడ్లు కూడా విషపూరితమేనా? తింటే ఏమవుతుంది?
పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ నివాసి, స్నేక్ క్యాచర్ మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని, ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని మహదేవ్ పటేల్ వివరించారు.సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
ఆ మొక్కలే ఏనుగుల మృతికి కారణం
భోపాల్: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ అభయారణ్యంలో 10 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. దీనినిపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు వీటి మృతికి ‘న్యూరోటాక్సిన్ సైక్లోపియాజోనిక్ ఆమ్లం’ కారణమని తెలిపారు. ఏనుగులకు విషం ఇవ్వడం కారణంగానే అవి మరణించాయని వస్తున్న వార్తలను ఒక అటవీశాఖ అధికారి ఖండించారు. వాటి మృతికి విషపూరితమైన మొక్కలు కారణమని స్పష్టం చేశారు.అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏనుగులు పెద్ద మొత్తంలో ‘కోడో’ మొక్కలను తినడం వలన వాటి శరీరంలోకి విషం వ్యాపించిందని అన్నారు. అక్టోబర్ 29 బాంధవ్గఢ్ పులుల అభయారణ్యంలో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఆ తరువాత వాటి మరణాల సంఖ్య 10కి చేరింది.ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన దరిమిలా ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. ఈ దర్యాప్తులో కోడో మొక్కలే ఆ ఏనుగుల మృతికి కారణమై ఉండవచ్చని తేలింది. కాగా ఏనుగుల మృతి గురించి తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏనుగుల మరణాలను నివారించడం, మానవులపై వాటి దాడులను ఆపడం అనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఇది కూడా చదవండి: ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా! -
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
Madhya Pradesh: తవ్వకాల్లో 35 కల్తీ మద్యం డ్రమ్ములు.. కంగుతిన్న పోలీసులు
మధ్యప్రదేశ్లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. -
Uttar Pradesh: కలుషిత ఆహారం తిన్న 60 మందికి అస్వస్థత
మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్లోని ఆస్పత్రికి తరలించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు. -
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.కాగా అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో.. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాషువా, భవాని, శ్రద్ధ మరణించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆసుప్రతిలో 17 మంది విద్యార్ధులకు చికిత్సం అందిస్తుండగా.. నర్సీపట్నం ఆసుపత్రిలో ఏడుగురు విద్యార్ధులకు చికిత్స పొందుతున్నారు. -
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
విజయవాడ: మదర్సాలో ఫుడ్ పాయిజన్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి, విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. నిన్న( గురువారం) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, మదరసా చారిటబుల్ ట్రస్ట్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురు కరిష్మా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ట్రస్ట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. డీప్ ఫ్రీజ్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌస్.. మాంసాన్ని పరిశీలించారు.ఫ్రీజ్లో 100 కేజీల మటన్ ఉందని.. ఈ నెల 17వ తేదీన తెచ్చిన మటన్ నేటికి వాడుతున్నారని తెలిపారు. బుధవారం పుడ్ పాయిజన్ జరిగింది.. కరిష్మా అనే బాలిక మృతి చెందింది. 8 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. మదర్సాకు నోటీసులు ఇచ్చాం’ అని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్ఫిష్.ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.ఈ సంగతి గురించి మీకు తెలుసా?‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్ప్లాంట్ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
వివాదాస్పద నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు....!
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు. -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్లోని ఈ ల్యాబ్లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్చేశారు. -
పక్కా ప్లాన్తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
సంతకం పెట్టలేదని భార్యకు విషమిచ్చి చంపిన భర్త!
మద్దిరాల: మద్దిరాల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరికొందరి సహకారంతో భార్యకు బలవంతంగా గడ్డిమందు తాపగా ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కుంచం వెంకన్న, కళమ్మ (46) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు సంతానం. మండల కేంద్రంలో రెండు షటర్లను నిర్మించుకుని ఒకటి అద్దెకి ఇచ్చి మరో దాంట్లో వీరు నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అద్దెకిచ్చిన షటర్ను వెంకన్న మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం చేయాలని వెంకన్న కొద్ది రోజులుగా భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకన్న రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం కళమ్మను కోరాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో మరికొందరి సహకారంతో కళమ్మ బలవంతంగా గడ్డి మందు తాపించాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఇంటికి రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. భర్త పురుగుల మందు తాపిన విషయం ఆస్పత్రిలో వంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంకన్నతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కళమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బ్రహ్మమురారి తెలిపారు. -
ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!
బల్మూర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. పెద్దల సమక్షంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. బల్మూర్ మండలంలోని బాణాలకు చెందిన కోట్ర శారద, అదే గ్రామానికి చెందిన మల్లేష్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది కిందట యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అతడికి విడాకులు ఇవ్వాలని.. నేను పెళ్లి చేసుకుంటానని మల్లేష్ నమ్మించడంతో మూడు నెలల కిందట శారద తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం మల్లేష్ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బల్మూర్లో పంచాయితీ పెట్టి మాట్లాడుతుండగా.. మల్లేష్ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో పాటు కొందరు పెద్దలు శారదను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నారని, ప్రేమికుడితో పెళ్లి చేయించాలని కోరుతున్నారని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. -
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్టాక్లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
26/11 కుట్రదారుడు సాజిద్ మీర్పై విష ప్రయోగం!
ఇస్లామాబాద్: ఒకవైపు వరుసగా జరుగుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కమాండర్ల మరణాలు అంతచిక్కని మిస్టరీగా మారాయి. మరోవైపు తాజాగా మరో ఎల్ఈటీ కమాండర్ సాజిద్ మీర్పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్లోని కోట్ లఖ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాజీద్ మీర్.. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో వెంటిలేటర్పైన ఉన్న సాజిద్పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అతనికి గత ఏడాది జూన్లో శిక్ష విధించగా.. ప్రస్తుతం లఖ్పత్ జైల్లో ఖైదీగా ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో మరో జైలుకు బదిలీ చేసే సమయంలో ఆస్పత్రి పాలు కావటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. BIG BREAKING: Bharat's Most Wanted Lashkar-e-Taiba terrorist, the main conspirator in the 26/11 Mumbai attacks, Sajid Mir, poisoned by 'UNKNOWN MEN' inside Central Jail Dera Ghazi Khan in Pakistan.Sajid is in critical condition and on a ventilator support; air-lifted by Pak… pic.twitter.com/efICEzadhs— Treeni (@_treeni) December 4, 2023 భారత్లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల కుట్రదారుల్లో ఒకడైన సాజిద్ మీర్ గత ఏడాది అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగం రుజువు కావడంతో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాజిద్ మీర్ను తమకు అప్పగించాలని అమెరికా.. గత కొంతకాలంగా పాక్పై ఒత్తిడి తెస్తోంది. అమెరికాకు అప్పగించడం ఇష్టం లేని ISI.. సాజిద్పై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాజిద్ తలకు అమెరికా FBI 5 మిలియన్ డాలర్ల వెల కట్టింది. 26/11 మంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడైన సాజిద్.. ఉగ్రవాదులు ముంబై చేరడానికి తెర వెనక కావాల్సిన సాయం చేశాడు. ఇది కూడా చదవండి: బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. -
నితీష్ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ తినే ఆహారంలో విషం కలుపుతున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితన్ రాం మాంజీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకే నితీష్ మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని తెలిపారు. అయితే విషం కలిపే వారు సీఎం కుర్చీ కోసమే ఈ పనిచేస్తున్నారని మాంజీ చెప్పారు. పాట్నా అసెంబ్లీ బయట శుక్రవారం మాంజీ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్లే నితీష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేగాక పెద్దవాన్ని అని చూడకుండా అసెంబ్లీలో తనను కూడా నితీష్ తిట్టారని మాంజీ తెలిపారు. నితీష్ కుమార్కు ఇస్తున ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ చేయాల్సిందిగా గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని మాంజీ చెప్పారు. బీహార్లో నెలకొన్న దారుణ పరిస్థితులపైనా వివరిస్తాని తెలిపారు. ఇటీవలే రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుపై డౌట్లు లేవనెత్తినందుకుగాను మాంజీపై అసెంబ్లీలో సీఎం నితీష్ నోరుపారేసుకున్నారు. -
పసుపు ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం! దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియా డిసీజ్ రీసెర్చ్ బృందాలు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్సేల్ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్ బజార్లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది. దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కూల్డ్రింక్లో విషం కలిపి.. బలవంతంగా తాగించి.. ఆపై..
సాక్షి, కరీంనగర్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్బజార్ ప్రాంతానికి చెందిన బోడ చంద్రకళ అనే మహిళకు బలవంతంగా కూల్డ్రింక్లో విషం కలిపి తాగించిన గోవర్దన్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నటేశ్ తెలిపారు. చంద్రకళ విద్యుత్ శాఖలో ఫిల్టర్ మెకానిక్ గ్రిడ్గా పని చేస్తుంది. అదే శాఖలో పని చేసే గోవర్దన్ అక్టోబర్ 30న కూల్డ్రింక్ తీసుకొచ్చి చంద్రకళకు ఇవ్వగా.. ఆమె తాగేందుకు నిరాకరించింది. బలవంతం చేయడంతో ఆమె కూల్డ్రింక్ తాగగా.. అస్వస్థతకు గురైంది. ఫోన్లో భర్త బోడ మోహన్కు సమాచారమందించింది. మోహన్ కార్యాలయానికి వెళ్లి చంద్రకళను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు కూల్డ్రింక్లో విషం కలపడం వల్లే అస్వస్థతకు గురైందని వెల్లడించారు. మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇవి చదవండి: ‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్లో స్టేటస్ పెట్టి.. యువకుడు.. -
నాన్నా.. హాస్పిటల్కు పోదాం
ధర్మపురి: నాన్నా.. ఎట్లనో అయితంది.. హాస్పిటల్కు పోదాం.. అంటూ విషజ్వరంతో బాధ పడిన ఓ చిన్నారి మృతిచెందింది. పాప మాట లను గుర్తు చేసుకుంటూ త ల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురికి చెందిన కొత్తకొండ రాజు–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రా జు స్థానికంగా ఓ రెడీమేడ్ షాపు నిర్వహిస్తుండగా.. తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మూడో తరగతి చదువుతున్న పెద్ద పాప సమన్వి(8)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చే యించారు. న యం కాకపోవడంతో జగిత్యాల తరలించగా వై ద్యులు విష జ్వరంగా తేల్చారు. చికిత్స తర్వా త కొంత నయం కావడంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జి చేయడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మనస్వి సోమవారం సాయంత్రం మృతి చెందింది. -
తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..
నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్ జిల్లాకు విద్యుత్ స్తంభాలు లోడ్తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్ గుగులోతు నితిన్(20) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా?
మోతాదుకు మించి ఆల్కహాల్ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం. ఈ ఆల్కహాల్కి చెందిన ఛాలెంజింగ్లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే.. ఓ వ్యక్తి ఛాలెంజ్ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. సంకేతాలు లక్షణాలు.. ఆల్కహాల్తో ఇలాంటి ఛాలెంజ్లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా.. నడవలేకపోతున్నా హృదయస్పందన సరిగా లేకపోయినా మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి చికిత్స! నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు అలాగే ఆల్కహాల్ పాయిజనింగ్తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్లు లేకుండా శుభ్రం చేయడం రక్తంలోఇన ఆల్కహాల్ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు డయాలసిస్ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
మనస్తాపంతో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
మహబూబ్నగర్: మనస్తాపం చెంది ఓ వివాహిత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం మండలంలోని గుంపన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాత్లావత్ భాస్కర్కు లింగాల మండలం ఎంసీతండాకు చెందిన నందిని(18)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల పాటు అన్నోన్యంగా ఉన్న దంపతులు రెండు రోజులుగా చిన్నపాటి గొడవ అయ్యిందని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నాగర్కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాకోడ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రకాడే సందీప్(33) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని మృతుడి తండ్రి రకాడే కారేబా, భార్య ఆశ తరుచుగా చెబుతున్నప్పటికీ మారడం లేదు. బుధవారం సైతం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సందీప్ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కోపంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సందీప్ గుర్తు తెలియని పురుగుల మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్కి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
విష వాయువు పీల్చి.. అయిదుగురు కార్మికులు మృతి
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది. ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు. -
అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం..
హైదరాబాద్: మియాపూర్లో దారుణం జరిగింది. సొంత అల్లుడే అత్తింటి కుటుంబంపై విషప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటివారిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే బాధిత కుటుంబానికి చెందిన అల్లుడు వారిపై విష ప్రయోగం చేశాడని పోలీసులు తెలిపారు. అత్తింటివారిని అంతం చేయాలని పథకం పన్నిన అల్లుడు అజిత్.. వారు తినే ఆహారంలో విషం కలిపాడు. విషయం తెలియక ఆ విష ఆహారాన్ని తిన్న బాధితుల ఆరోగ్యం క్షీణించసాగింది. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసిన నిజానిజాలను పసిగట్టారు. నిందితుడు ముప్పవరపు అజిత్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు. శిరీష తల్లి మహేశ్వరి మృతి చెందింది. ఇతర కుటుంబ సభ్యులకు హస్పిటల్లో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్పూర్లో పేలుడు.. -
AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్వోఎస్కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు.. -
ఈ కప్పలు మనుషుల్ని చంపేస్తాయని మీకు తెలుసా?
ఈ భూమ్మీద ఎన్నో రకాల విష జంతువులు ఉన్నాయి.విషపూరీతమైనవి అంటే ముందుగా గుర్తొచ్చేవి పాములు. అయితే విషపూరిత కప్పల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటి కప్పలు కూడా అంత ప్రమాదకరమా అని ఆలోచిస్తున్నారా? అవును.. అలాంటి విషపూరితమైన కప్పలు కూడా ఉన్నాయి. చూడటానికి అందంగా కనిపించే ఈ కప్పలు యమ డేంజర్. వీటిని గోల్డెన్ పాయిజన్ కప్పలు అని అంటారు. వీటికి ఒళ్లంతా విషమే. ఆఖరికి ఈ కప్పలను ముట్టుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ► ఈ పాయిజన్ కప్పలు కొలంబియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా రెండు అంగుళాలు లేదా కాస్త పెద్దగా ఉండే ఈ కప్పలో పదిమందిని చంపేంత విషం ఇందులో ఉంటుంది. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట. ► ఈ కప్పలను తాకినా ప్రాణాలు పోతాయట. పొరపాటున వీటిని టచ్ చేసినా చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పల విషం నేరుగా చర్మంపై పడినా పల్స్ రేటు వెంటనే పడిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ► ఈ కప్పలు పసుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రదేశాన్ని బట్టి అవి వాటి రంగులను మార్చుకుంటాయి. ► ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఈ కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలోని విషాన్ని కొన్ని కెమికల్ పద్దతులను ఉపయోగించి పెయిన్ కిల్లర్స్ను తయారు చేసేందుకు రీసెర్చ్ చేస్తున్నారు. -
విషప్రయోగంతోనే అవతార్ ఖాందా కన్నుమూత?
బ్రిటన్లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతోంది. అవతార్ సింగ్ ఖాందా.. కేఎల్ఎఫ్ చీఫ్ మాత్రమే కాదు, మార్చి 19వ తేదీన లండన్లోని భారత్ హైకమిషన్ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి కూడా. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది కూడా. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉండి. పోలీసులకు అమృత్పాల్ సింగ్ దొరకకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్ అతనికి సహకరించినట్లు తేలింది కూడా. అవతార్ ఖాందా బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే.. కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ తనయుడే ఈ అవతార్. బాంబ్ ఎక్స్పర్ట్ కూడా. 2007లో యూకేకి స్టడీ వీసా మీద వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్ఎఫ్ మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్యానంతరం.. కేఎల్ఎఫ్లో రాంజోధ్ సింగ్ కోడ్ నేమ్తో అవతార్ కొనసాగాడు. దీప్ సింగ్ మరణాంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్గా అమృత్పాల్ సింగ్ నియామకంలోనూ అవతార్ సింగ్దే కీలక పాత్ర కూడా. మెంటార్ రోల్లో అమృత్పాల్ ప్రతీ వ్యవహారాన్ని అవతార్ చూసుకుంటూ వచ్చాడు కూడా. ఇక 37 రోజులపాటు అమృత్పాల్ సింగ్ పరారీలో ఉండగా.. ఆ సమయంలో యూకే నుంచి అవతార్ సహాయసహకారాలు అందించాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించుకున్నాయి. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న అవతార్ సింగ్ బర్మింగ్హమ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాల నడుమ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 23వ తేదీన పంజాబ్ మోగాలో అమృత్పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోగా.. అసోం దిబ్రుఘడ్ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్పాల్, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. సంబంధిత వార్త: వేట ముగిసింది.. అమృత్పాల్ అరెస్ట్ -
ఆఫ్గాన్లో దారుణం.. 80 మంది బాలికలపై విషప్రయోగం
అఫ్గానిస్థాన్లో దారుణం జరిగింది. దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. సర్ ఎ పుల్ ప్రావిన్సు, సంగ్చారక్ జిల్లాలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో ఈ దాడులు జరిగాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. వ్యక్తిగత కక్షతోనే ఈ దారుణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించినట్లు విద్యా శాఖ అధికారి మహమ్మద్ రహమానీ వెల్లడించారు. ఈ ఘటనలో దుండగులు ఉపయోగించిన విషపదార్థం ఎంటో తెలియలేదు. చికిత్స పొందుతున్న బాలికల గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కాగా.. తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్లో బాలికలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. స్కూళ్లు, కళాశాలల్లో బాలికలపై దాడులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి:తీవ్రంగా చలించిపోయా: బైడెన్ -
ప్రపంచంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
పెళ్లి చేసుకోవాలిని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు
భోపాల్: పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన వధూవరులు విషం తాగి అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతోంది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగి ఈ విషయాన్ని వధువుకు తెలియజేశాడు. వరుడు విషం సేవించాడని తెలిసిన వెంటనే వధువు కూడా తాగింది. వధూవరుల బంధువుల వారిద్దరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వరుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వధువు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తన పెళ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేస్తోందని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కెరీర్ దృష్ట్యా తమ పెళ్లికి రెండేళ్లు గడువు కావాలని కోరడంతో యువతి వినక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
అయ్యయ్యో.. చేపలు! లోటస్పాండ్ చెరువులో 3 వేలకుపైగా మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని లోటస్పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విష ప్రయోగమా? కలుషిత నీరా..? వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఎని్వరాన్మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు. చేపలకు ఆహారం... నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు. చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం -
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్లతో సూపర్నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్ కారా–ముర్జా జూనియర్(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. -
ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులు గుర్తింపు
కిలకిలరావాలతో అలరించే పక్షులంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకోవడం చాలామందికి ఒక చక్కటి అభిరుచి. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ వాటి ఎదుగుదలను చూసి ఆనందిస్తుంటారు. పక్షులంటే మనుషులకు ప్రియనేస్తాలే. కానీ, ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు కనిపెట్టారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. ► అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తన రెక్కల్లో నిల్వ చేసుకొనే సామర్థ్యం ఈ పక్షుల్లో అభివృద్ధి చెందింది. ► విష ప్రభావాన్ని తట్టుకొని జీవించే శక్తి సమకూరింది. ► కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్లోని నేచురల్ హస్టరీ మ్యూజియం ప్రతినిధి జాన్సన్ చెప్పారు. ► ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటన సందర్భంగా ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ► తాజాగా గుర్తించిన రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్ విజ్లర్(పచీసెఫాలా స్లీ్కగెల్లీ), రఫోస్–నేప్డ్ బెల్బర్డ్(అలిడ్రియాస్ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి. ► సౌత్, సెంట్రల్ అమెరికాలో ఉండే డార్ట్ కప్పలు (గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్) అత్యంత విషపూరితమైనవి చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది. ► డార్ట్ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ► పక్షుల్లో బాట్రాసోటాక్సిన్ అనే విషం అధిక మోతాదులో ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు. ► ఇలాంటి విషమే గోల్డెన్ పాయిజన్ కప్పల చర్మంలో ఉంటుంది. ► విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది. ► పక్షుల శరీరంలో సోడియం చానళ్లను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యుటేషన్స్(మార్పులు) వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకొని నిల్వచేసుకోవడంతోపాటు తట్టుకొనే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్డ్రింక్లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉగాది రోజు విషాదం.. విషవాయువుతో ఊపిరాడక అన్నాదమ్ములు మృతి
సాక్షి, భద్రాద్రి: ఉగాది పండగ రోజున ఓ వలస కార్మికుల కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. అట్టల ఫ్యాక్టరీలో పల్ఫ్ (పేపర్గుజ్జు) ఉండే బావిని శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఛత్తీస్గఢ్కు చెందిన అన్నదమ్ములు విషవాయువుతో ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఎస్ఎస్ అట్టల ఫ్యాక్టరీలో బుధవారం చోటుచేసుకుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫల్ప్ బావిని శుభ్రం చేసేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన కావాసి జోగా (21), కావాసి బుద్ధరామ్ (23) అనే వలస కార్మిక సోదరులు పది అడుగుల లోతు ఉన్న బావిలోకి నిచ్చెన సాయంతో దిగారు. వెంటనే ఇద్దరూ ఊపిరాడక కుప్పకూలారు. గమనించిన తోటి కార్మికులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని, వారిని బయటకు తీసేందుకు ఐదుగురు బావిలోకి దిగారు. వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో మరో ఇద్దరు కూడా విషవాయువులతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొగ్గలి రాంబాబును భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొదట బావిలోకి దిగిన వలస కారి్మకులను బయటకు తీసుకురాగానే బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కావాసి జోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుద్ధరామ్ భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మృతులిద్దరూ ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా కాంకిపొర గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో ఛత్తీస్గఢ్కు చెందిన పది మంది కారి్మకులు పని చేస్తున్నారు. సోదరులిద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో అక్కడున్న వారిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు! -
ఇరాన్లో ‘బాలికలకు విషం’...
దుబాయ్: ఇరాన్లో ను విద్యకు దూరం చేసేందుకు వారి స్కూళ్లపైకి విష వాయువులు వదులుతున్న ఉదంతాలపై యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది. స్కూళ్లలో బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని సూచించింది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను తన మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయని యునెస్కో సారథి ఆద్రే అజౌలే అన్నారు. -
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్లు ఉండగా, 21 ప్రావిన్స్ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం
ఇరాన్లో వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ మరువుక మునుపే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్లో కోమ్లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు. అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి కూడా. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుపోతోంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
వివాహేతర సంబంధం వివాదం: విషం తాగి పోలీస్స్టేషన్కి వచ్చి..
సాక్షి, బనశంకరి: విషం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చిన డెలివరి బాయ్ని పోలీసులు ఆస్పత్రికి తరలించిన ఘటన చంద్రాలేఔట్లో చోటుచేసుకుంది. వివరాలు...డెలివరి బాయ్ అనిల్ (30)కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొద్దిరోజుల క్రితం మహిళ భర్తకు తెలిసింది. దీంతో అతను అనిల్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనిల్ను హెచ్చరించినప్పటికీ మహిళను కలవడానికి ప్రయత్నించాడు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను వేధింపులకు పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన మహిళ అనిల్పై ఫిర్యాదు చేయడానికి గురువారం చంద్రాలేఔట్ పోలీస్స్టేషన్కు వెళ్లింది. తనపై కేసు నమోదు అవుతుందని తెలియగానే పోలీస్స్టేషన్కు అనిల్ వచ్చాడు. తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని, తాను చనిపోవడానికి విషం తాగానని అనిల్ పోలీసులకు తెలిపాడు. తక్షణం పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
విషపునీరు తాగి 43 పశువులు మృతి
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయిలో పురుగుమందు కలిసిన నీరు తాగి శుక్రవారం వరకు 30 పశువులు చనిపోగా శనివారం వాటి సంఖ్య 43కు చేరింది. నేరడుకొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన కృష్ణయ్య, బుచ్చయ్య సోదరులకు పశువుల పెంపకమే జీవనాధారం. తమ ప్రాంతంలో పశుగ్రాసం దొరకని సమయాల్లో మందను ఇతర ప్రాంతాలకు తోలుకుని వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోదరులిద్దరితోపాటు మరో ఎనిమిది మంది 250 పశువుల మందను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి వచ్చారు. అక్కడ పొలాల్లోంచి వదిలిన పురుగుమందున్న నీటిని తాగిన కొన్ని పశువులు మృత్యువాతపడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే 43 పశువులు మృతిచెందడంతో స్థానిక పశువైద్యాధికారుల సమాచారం మేరకు జేడీ యాదగిరి, ఏడీ విశ్వేశ్వర్రావు, ఇతర అధికారులు శనివారం మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆ పశువుల శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. అయితే, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకలేదని, క్రిమిసంహారక నీటిని తాగడంతోనే మృతి చెందాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ‘పశువులను మేపుకుని జీవనం సాగిస్తున్నాం. పశువుల మృతితో రూ.లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి’అని పశువుల కాపరులు నేతాళ్ల కృష్ణయ్య, లింగమ్మ కోరారు. -
నాపై అభిమానే విష ప్రయోగం చేశాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవిపై విష ప్రయోగం జరిగిందా? ఆయనపై ఓ అభిమాని చేసిన ప్రయోగం ప్రాణాల మీదకు తీసుకొచ్చిందా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ అభిమాని పిచ్చి వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మరణమృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని తన ప్రాణాల మీదకు తెచ్చిందన్నారు మెగాస్టార్. ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టారని తెలిపారు. ఆ కేక్ చేదుగా అనిపించడంతో వెంటనే తినకుండా పడేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో సెట్లో ఉన్నవారితో ఈ విషయం చెప్పగా అసలు విషయం బయటకొచ్చింది. అతన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజం చెప్పాడని తెలిపారు. అది విని అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారని తెలిపారు. అతన్ని పట్టించుకోలేదనే తనపై వశీకరణ ప్రయోగం చేసినట్లు ఆ అభిమాని వివరించారు. కానీ చిరుకి హాని తలపెట్టినా కూడా అతన్ని క్షమించి వదిలేసినట్లు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ మాట్లాడూతూ..' తన అభిమాని నాపై విషప్రయోగం చేయడం జరిగింది. అతను నాకు పిచ్చి అభిమాని. మరణమృదంగం షూటింగ్లో కేక్ కట్ చేశాం. అ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించారు. స్పూన్తో తినడం నాకు అలవాటు. ఆ తర్వాత నాకు చేదుగా అనిపించడంతో బయట పడేశా. దీంతో వెంటనే రామారావు అతన్ని పట్టుకున్ని కేక్ శాంపిల్ టెస్టింగ్కు పంపారు. ఆ తర్వాత అతన్ని రామారావు కొట్టారు. దీంతో అతను తప్పు ఒప్పుకున్నారు. నాతో చిరంజీవి తనతో మాట్లాడటం లేదని అలా చేశాడట. కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చినట్లు తెలిపారు. నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా.' అని అన్నారు. -
'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో టీ తాగేందుకు నిరాకరించారు ఎస్పీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. పోలీసులపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. టీలో విషం కలిపి ఇస్తారేమో? అని వ్యాఖ్యానించారు. తాను బయటి నుంచి టీ తెప్పించుకుంటానని అన్నారు. అవసరమైతే కప్పు మాత్రం తీసుకుంటానన్నారు. ఆదివారం ఉదయం లక్నోలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి అఖిలేశ్ ఇలా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #WATCH समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव ने पुलिस मुख्यालय में चाय पीने से इंकार किया। उन्होंने कहा,"हम यहां की चाय नहीं पियेंगे। हम अपनी (चाय) लाएंगे, कप आपका ले लेंगे। हम नहीं पी सकते, ज़हर दे दोगे तो? हमें भरोसा नहीं। हम बाहर से मंगा लेंगे।" (वीडियो सोर्स: समाजवादी पार्टी) pic.twitter.com/zwlyMp8Q82 — ANI_HindiNews (@AHindinews) January 8, 2023 సమాజ్వాదీ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసే మనీశ్ జగన్ అగర్వాల్ను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనీశ్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలేశ్ యాదవ్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అతడ్ని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చదవండి: 'ఉత్తరాదిలో జెండా పాతేస్తాం.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..' -
కాలనాగుతో ఆటలు.. చావుబతుకుల్లో యూట్యూబర్!
జైపూర్: అతను తన క్రేజీ వీడియోలతో దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జిస్తున్న యూట్యూబర్లలో ఒకడు. ఉన్నత చదువులు చదివాడు. ఆ చదువుకు తగ్గట్లు మంచి ప్యాకేజీతో ఉద్యోగం దక్కదే. కానీ, విచిత్రంగా యూట్యూబ్ వీడియోల వైపు ఆసక్తి చూపించాడు. అది అతనికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది. అయితే.. చివరికి వ్యూస్ కోసం చేసిన యత్నమే ఆ యూట్యూబర్ ప్రాణం మీదకు తెచ్చింది. 24 ఏళ్ల వయసున్న అమిత్ శర్మ.. రాజస్థాన్లో టాప్ యూట్యూబర్. అల్వార్ అతని స్వస్థలం. ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నం చేయకుండా.. యూట్యూబ్ ఛానెల్ వైపు అడుగులు వేశాడు. క్రేజీ ఎక్స్వైజెడ్ అనే పేరుతో గత ఐదేళ్లుగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు అతను. స్నేహితుల సహకారంతో నడిపిస్తున్న ఆ ఛానెల్కు 25 మిలియన్ల సబ్స్క్రయిబర్స్ ఉన్నారు కూడా. ఈ ఛానెల్ ద్వారా నెలకు అతని సంపాదన రూ. 9 కోట్లు అని, అన్బాక్సింగ్(కొత్త ప్రొడక్టుల డెమో, రివ్యూల) ద్వారా అతని ప్రత్యేక ఛానెల్ ద్వారా నెలకు మరో రూ.2.5 కోట్లు సంపాదిస్తున్నాడంటూ అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురిస్తుంటాయి. అయితే.. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీద వీడియోలు తీసే అమిత్ శర్మ.. తాజాగా కాలనాగుతో ఓ వీడియో తీయాలని యత్నించాడట. ఆ ప్రయత్నంలోనే అది వేలిని కాటేసింది. కాసేపు అతను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఆపై విషం శరీరానికి వ్యాపించడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. బాడీ మొత్తం పాము విషం వ్యాపించడంతో చావు బతుకుల్లో ఉన్నట్లు అతని స్నేహితులు ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతను ప్రాణాపాయం నుంచి బయటపడాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని వ్యూయర్స్ను, సబ్స్క్రయిబర్స్ను కన్నీళ్లతో వాళ్లు కోరారు. అమిత్ శర్మ వీడియోలకు అక్కడ క్రేజ్ ఉంది. అతను బతకాలని, త్వరగా కోలుకుని మళ్లీ వీడియోలు తీయాలని అతని ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు. -
Crime News: గోరుముద్దలు కాస్త కాలకూట విషమై..
ఎల్ఎన్ పేట (హిరమండలం): జన్మనిచ్చిన అమ్మే ఆ పాప ఆయుష్షు ఆపేసింది. ఊపిరినిచ్చిన తల్లి ఉసురు తీసింది. గోరుముద్దలు తినిపించిన చేతితోనే విషం పెట్టింది. తానూ ఆ విషమే తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రజని(27) అనే మహిళ ఆత్మహత్య చేసుకుని తన కుమార్తె జ్యోత్స్న(3)కు కూడా విషమిచ్చింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఒడిషా హిరమండలం మేజర్ పంచాయతీ శుభలయ కాలనీ ఎస్టీ వీధికి చెందిన తంప వెంకటరమణ తాపీ మేస్త్రీగా పని చేస్తుంటారు. ఈయనకు జలుమూరు మండలం జమినివలసకు చెందిన రజనీతో 2015లో వివాహమైంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతుండేవారు. వీరికి హర్షిణి (5), జ్యోత్స్న (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ వలస వెళ్తూ ఉండేవారు. ఇటీవలే సొంతూరు వచ్చేశారు. ఈ నెల 2వ తేదీ శుక్రవారం వెంకటరమణ రోజూ లాగానే తన పనికి వెళ్లిపోయారు. ఇంటిలో చిన్నపిల్ల జ్యోత్స్న అపస్మారక స్థితిలో ఇరుగుపొరుగు వారికి కనిపించడంతో వారు పాపను హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని వెంకటరమణకు చెప్పగా.. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక డాక్టర్లు 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ గొడవలో ఉండగానే వెంకటరమణకు మరోసారి బంధువులు ఫోన్ చేశారు. రజనీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని, ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. దీంతో ఆయన తన బావమరుదులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రజనీని హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. రిమ్స్లోనే చిన్నారి జ్యోత్స్న శనివారం అర్ధరాత్రి తర్వాత కన్నుమూయగా.. ఆదివారం రజనీ మృతి చెందారు. రజనీ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని, పాపకు కూడా అదే విషం ఇచ్చిందని వారికి వైద్యులు తెలిపినట్లు సమాచారం. భర్త వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హిరమండలం ఇన్చార్జి ఎస్ఐ ఎం.గోవింద్ తెలిపారు. అఘాయిత్యానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ప్రాణం పోసే విషం.. లీటర్కు రూ.84 కోట్లు
సాధారణంగా విషం అంటే ప్రాణాలు తీసేది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా. అలాంటిదే ‘డెత్స్టాకర్’ తేలు విషం. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైనది కూడా. మరి దీని విశేషాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ‘ విషం నుంచే ఔషధం తేలు కుట్టిందంటే మంటతో విలవిల్లాడిపోతాం. కుట్టిన తేలును బట్టి కొన్నిసార్లు అస్వస్థత పాలవడం, మరికొన్నిసార్లు అయితే ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం తేలు కొండిలోని విషం. అందులోని న్యూరో ట్యాక్సిన్లు. అంటే మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు. ఈ న్యూరో ట్యాక్సిన్లలో కొన్నిరకాలను అసాధారణ వైద్య చికిత్సల్లో వినియోగిస్తుంటారు. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. ‘ మెదడు కేన్సర్ చికిత్సలో.. భూమ్మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ ‘డెత్స్టాకర్’ తేళ్లు అత్యంత విషపూరితమైనవి. ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు బతుకుతాయి. పది సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి విషంలో ‘క్లోరోట్యాక్సిన్’గా పిలిచే అత్యంత అరుదైన రసాయన పదార్థంతోపాటు మరికొన్ని ముఖ్యమైన న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి. ఈ క్లోరోట్యాక్సిన్ మెదడులోని కేన్సర్ కణితులు మరింతగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా మెదడులో కేన్సర్ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీనివల్ల వైద్యులు సర్జరీ చేసి కేన్సర్ సోకిన భాగాన్ని/కణాలను పూర్తిగా తొలగించేందుకు వీలవుతుంది. సాధారణంగా సర్జరీ తర్వాత కేన్సర్ కణాలు ఏమైనా మిగిలి ఉంటే.. వాటి వల్ల మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. క్లోరోట్యాక్సిన్ను మార్కర్గా వాడటం వల్ల ఈ సమస్య తప్పుతుంది. ‘ అత్యంత విలువైన విషం! ‘డెత్స్టాకర్’ తేలు విషం ధర ఒక లీటర్కు సుమారు రూ.84 కోట్లు (కోటి డాలర్లకుపైనే..). ఎందుకంత ధర అంటే.. ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్ ఉండటం, సేకరణ అత్యంత కష్టమైన పని అవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటమే. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. ‘ప్రత్యేకంగా పరికరాన్ని రూపొందించి.. మామూలుగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం.. మొదట వాటికి స్పల్ప స్థాయిలో కరెంట్ షాక్ ఇచ్చి, వాటి విష గ్రంధులను పరికరాలతో నొక్కుతారు. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండిలను పరికరంలో పెడతారు. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. అవి గాయపడటం ఉండదు, ఎక్కువ విషం సేకరించవచ్చు. ‘ పాముల విషం నుంచి కూడా.. పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటితో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాల కేన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. -
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..
సాక్షి, బెంగళూరు(మండ్య): పచ్చని సంసారంలో అక్రమ సంబంధం వ్యవహారం చిచ్చు పెట్టింది. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసుకుంది. ఈఘటన మండ్య జిల్లా మద్దూరులో జరిగింది. మద్దూరు పట్టణ పోలీసుల కథనం మేరకు హోళె వీధిలో అఖిల్ ఆహ్మద్, కౌసర్(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు హ్యారిస్ అహ్మద్(8), కుమార్తెలు అలిసా(4), ఆనం ఫాతిమా(2) ఉన్నారు. ఉస్నాకౌసర్ స్థానిక ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తోంది. అఖిల్ ఆహ్మద్ రామనగర జిల్లా చెన్నపట్టణలో కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. అఖిల్ అహ్మద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై కుటుంబలో గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీ కూడా చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది. అనంతరం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఖిల్ అహ్మద్, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన) -
చెట్లకు సెలైన్లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..
సాధారణంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారికో, సర్జరీలు జరిగిన వారికో సెలైన్ పెట్టడం చూస్తూనే ఉంటాం. కానీ చెట్లకు పెద్ద పెద్ద సెలైన్లు పెడితే..!? ఇదేం పిచ్చి ఆలోచన, చెట్లకు సెలైన్ ఎందుకు? దానితో లాభమేంటి? అనిపిస్తోంది కదా.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు ఇలాంటి ఎన్నో సందేహాలు, అభిప్రాయాలను మోసుకొచ్చాయి.. నిరసనో.. చికిత్సనో అనుకుని.. చెట్లకు సెలైన్ పెట్టిన ఫొటోలను చూసి చాలా మంది.. అడవుల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమమేమో అనుకున్నారు. కొందరైతే ఫంగస్ సోకిన చెట్లకు చికిత్సగా మందు పెట్టారని అన్నారు. కానీ అసలు విషయం తెలిసి చాలా మంది అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఈ చెట్లకు సెలైన్ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి మరి. రక్షణ కోసం సుగంధం.. ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి. పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు. నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్ సోకినప్పుడు.. దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్ను విడుదల చేస్తాయి. ఈ రెసిన్ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది. పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు. ఆ విషాన్నే ఎక్కిస్తూ.. నిజానికి ఈ ఫంగస్ చెట్లకు విషం వంటిది. దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్ను విడుదల చేసుకుంటాయి. దీనిని గుర్తించిన పెంపకందారులు.. సదరు ఫంగస్ కలిపిన ద్రావణాన్ని సెలైన్ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు. దీనితో చెట్లు రెసిన్ విడుదల చేస్తాయి. కాండం సుగంధ కలపగా మారుతుంది. నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు. కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ. ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు. సెలైన్లో ఫంగస్తో.. ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు. ఫంగస్ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్ నిండుతుంది. అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్ ద్రావణాన్ని సెలైన్లా ఎక్కిస్తుంటారు. ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చెట్టును కొట్టి.. కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు. సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు. ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది. ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట. - సాక్షి, సెంట్రల్డెస్క్ Before agarwood can be harvested, the Aquilaria malaccensis tree must be infected with mold first pic.twitter.com/oFW90CDNYD — Business Insider (@BusinessInsider) November 14, 2022 -
కోడలిపై దుర్మార్గం: ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి.. పాలలో విషప్రయోగం
గుంటూరు: ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామల విషప్రయోగంతో కోడలు వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుబ్బయ్యపాలేనికి గ్రామానికి చెందిన గాడిపర్తి వేణుతో బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020లో వివాహమైంది. శ్రావణికి మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. రెండోసారి గర్భం దాలి్చంది. భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండోసారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. ఇష్టం లేని అత్తమామలు ఆమెపై మజ్జిగ, పాలలో విషప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా శ్రావణి రక్తం, చిన్న పేగు ముక్కలతో వాంతి చేసుకుంది. ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమెకు అక్కడనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. -
57 మంది విద్యార్థులపై విష ప్రయోగం!
మెక్సికో సిటీ: పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులపై గుర్తు తెలియని పదార్థంతో విష ప్రయోగం చేశారని స్థానిక మీడియాలు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ప్రైవేటు ప్రయోగశాల పరిశోధనల్లో విద్యార్థులకు కొకైన్ పాజిటివ్గా తేలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు.. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవటం వల్లే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విష ప్రయోగం జరిగిన వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. విద్యార్థులపై విష ప్రయోగం జరగటం రెండు వారాల్లో ఇది మూడో సంఘటన కావటం ఆందోళన కలిగిస్తోంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 మంది చిన్నారులు విష ప్రయోగం జరిగిన లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని.. ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించగా..మిగిలిన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. శనివారం 15 మందిపై విష నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్గా తేలాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం -
Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి
సాక్షి, వికారాబాద్: కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మోమిన్పేట మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. భార్య గోవిందమ్మ కుమారులను చేరదీసి ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూమిని అమ్ముదామని ఇంట్లో గొడవ పడుతుండేవాడు. అవసరం లేనిది భూమి అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు. తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు చదవండి: అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్లో ఆందోళన