reentry
-
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్కు చెందిన సోమ్నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆరేళ్ల తర్వాత అమెరికన్ బ్రాండ్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హోమ్కేర్ సొల్యూషన్స్ సంస్థ బిస్సెల్ ఆరేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ఈసారి భారత్లో ఉత్పత్తుల పంపిణీ కోసం కావిటాక్ గ్లోబల్ కామర్స్ సంస్థతో జట్టు కట్టింది.స్పాట్క్లీన్ హైడ్రోస్టీమ్, స్పాట్క్లీన్ ప్రోహీట్ పేరిట పోర్టబుల్ వెట్, డ్రై వేక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్ల విక్రయాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు బిసెల్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మార్కెట్స్) మ్యాక్స్ బిసెల్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లోర్ సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్లో మార్కెట్ పరిమాణం చిన్నగానే ఉన్నప్పటికీ భవిష్యత్లో గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ముందుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి భాగస్వాములతో ఆన్లైన్లో అమ్మకాలతో పారంభించి, విక్రయాల పరిమాణాన్ని బట్టి క్రమంగా ఆఫ్లైన్లో కూడా కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని మ్యాక్స్ వివరించారు. అమెరికా, చైనా తదితర దేశాల్లో గణనీయంగా వ్యాపారం ఉన్న బిసెల్ సంస్థ 2018లో దేశీ మార్కెట్ కోసం యూరేకా ఫోర్బ్స్తో జట్టు కట్టింది. కానీ, ఆ తర్వాత భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించింది. -
విదేశీ బ్రాండ్ల చలో భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.యూరప్లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్తో తిరిగి భారత్లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్లో భారత్ మార్కెట్ను వీడింది.కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జాయింట్ వెంచర్లు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్తో టై అప్ పెట్టుకుని భారత్లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది. విధానాల ఫలితం.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్కార్ట్ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్ తెలిపారు. విస్మరించలేనివి...భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్మాధవ్ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
భారత్లోకి రీఎంట్రీ ఇస్తోన్న ఫోర్డ్!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టితో భారత మార్కెట్లోకి తిరిగి రావాలని యోచిస్తోంది. రీ-ఎంట్రీ అంశాన్ని కంపెనీ సీఈవో జిమ్ ఫార్లీ నేతృత్వంలోని ఫోర్డ్ గ్లోబల్ టీమ్ సమీక్షిస్తోంది.పాశ్చాత్య మార్కెట్లలో స్తబ్దత కారణంగా భవిష్యత్ వృద్ధికి కీలకమైన మార్కెట్గా భావించే భారత్లో తిరిగి ప్రవేశించే అవకాశాలను అంచనా వేయడానికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఫోర్డ్ గతంలో భారత్లో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఎకో స్పోర్ట్ మినీ-ఎస్యూవీ, ఫిగో చిన్న కారు వంటి మోడళ్లతో విజయాన్ని సాధించింది. మహీంద్రా & మహీంద్రాతో కలిసి జాయింట్ వెంచర్లతో చారిత్రక ఉనికి ఉన్నప్పటికీ, ఫోర్డ్ భారత్లో స్థిరమైన వ్యాపారాన్ని స్థాపించడంలో సవాళ్లను ఎదుర్కొంది. ఈ వెంచర్లు కంపెనీ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఫోర్డ్ తన గుజరాత్ ప్లాంట్ను టాటా మోటార్స్కు విక్రయించాలని, భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలనే ఆలోచనకు దారితీసింది.ఫోర్డ్ తన చెన్నై ప్లాంట్ను సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూకి విక్రయించే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించే పునరాలోచన ఊపందుకుంది. ఫోర్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న చెన్నై ప్లాంట్ను కంపెనీ పునరుద్ధరణ వ్యూహానికి కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.ఫోర్డ్ గ్లోబల్ టీమ్ రీ-ఎంట్రీ ప్లాన్ను ఆమోదించినట్లయితే, కంపెనీ గణనీయమైన చట్టపరమైన సన్నాహాలను చేపట్టవలసి ఉంటుంది. చెన్నై ప్లాంట్లో ఇప్పటికే ఉన్న మెషినరీని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఉత్పత్తి దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు. భారత్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా గత మార్చిలో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఫోర్డ్ పునరాలోచనకు కీలకమైన అంశాలు. -
మళ్లీ నటించడానికి సిద్ధం!
బాలీవుడ్ లెజెండ్రీ దిలీప్కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయేషాసైగల్. టాలీవుడ్ యువ నటుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన అఖిల్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి సాయేషా సైగల్. ఆ తర్వాత అజయ్దేవగన్ సరసన శివాయ్ చిత్రంతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రంతో నటిగానే కాకుండా తనలో మంచి డాన్సర్ ఉన్నట్లు నిరూపించుకున్నారు. ఆ తర్వాత తమిళంలో కార్తీ సరసన కడైకుట్టి సింగం, విజయ్సేతుపతితో జూంగా, ఆర్యకు జంటగా గజినీకాంత్, రెడీ, సూర్య సరసన కాప్పాన్ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అలాంటి సమయంలో ఆర్యను ప్రేమించి పెద్దల అనుమతితో 2019లో పెళ్లిచేసుకున్నారు. దీంతో నటనకు చిన్నగ్యాప్ ఇచ్చారు. ఈ సినీజంటకు హర్యానా అనే కూతురు పుట్టింది. కాగా చిన్నగ్యాప్ తర్వాత సాయేషా శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలో ఒక సింగిల్సాంగ్లో మెరిశారు. ప్రస్తుతం మళ్లీ నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పలు కథలు వింటున్నారని సమాచారం. దీంతో సాయేషా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తోంది. దీంతో త్వరలోనే సాయేషాసైగల్ రీఎంట్రీ షురూ అవుతుందని భావించవచ్చు. అయితే ఆమె తాజాగా ఏ నటుడి సరసన నటిస్తారన్నదే ఆసక్తిగా మారింది. -
చిన్నమ్మ రీఎంట్రీ.. ఆమె వెనుక ఎవరున్నారు?
శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు. ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు. ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. -
పద్దెనిమిదేళ్ల తర్వాత...
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఈ నెల 7న ముంబైలో ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో శోభన పేరు కూడా చేరింది. అయితే ఈ పాత్రల గురించి ప్రస్తుతానికి చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. ‘కల్కి 2898 ఏడీ’లో శోభన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. ఒకవేళ ‘కల్కి 2898 ఏడీ’లో ఆమె నటించినది వాస్తవం అయితే పద్దెనిమిదేళ్ల తర్వాత శోభన నటించిన తెలుగు సినిమా ఇదే అవుతుంది. -
సమంతకు రీ ఎంట్రీలోనే బిగ్ ఆఫర్..!
కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మైక్ మోహన్, అజ్మహల్, జయరామ్, ప్రేమ్జీ, వైభవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సరదాగా జరుగుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే ఈయన చివరి చిత్రం అవుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా ఇది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ లిస్టులో దర్శకుడు అట్లీ, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్జే బాలాజీ,హెచ్ వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో కార్తీక్ సుబ్బరాజు గానీ, ఆర్జే బాలాజీ గానీ, విజయ్ 69 చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో విజయ్ సరసన నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటి సమంతను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజమైతే నటి సమంత విజయ్తో జతకట్టే నాలుగో చిత్రం ఇది అవుతుంది. ఇంతకుముందు మెర్సల్, తేరి చిత్రాల్లో సమంత నటుడు విజయ్తో జత కట్టారు అన్నది గమనార్హం. లేకపోతే ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ఆ తర్వాత కథానాయకిగా నటించే భారీ దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది. -
కేసీఆర్ గ్రాండ్ బర్త్ డే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వచ్చే నెల నుంచి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకం కానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేర కు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ వచ్చేనెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కోలుకుంటున్న కేసీఆర్: ఎర్రవల్లి ఫామ్హౌస్లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే సన్నిహితులు, పార్టీ నాయకులు ఆయన్ను కలుస్తున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ను స్వయంగా పరామర్శించేందుకు గత నెల రోజులుగా పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, కేడర్ కూడా అధినేతను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఈ నెల 3నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రీ ఎంట్రీ పారీ్టకి మరింత జోష్ తెస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్వాగత సన్నాహాలు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనం మధ్యకు వస్తుండటంతో ఆ మేరకు ఘనంగా స్వాగత సన్నాహాలు చేయాలని పార్టీ భావిస్తోంది. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్తో కేసీఆర్ను తోడ్కొనిరానున్నారు. మరోవైపు కేసీఆర్ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వందల సంఖ్యలో ముఖ్య నేతలు హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ నేతలు, కేడర్ను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే నెల 20 తర్వాత గజ్వేల్కు.. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలుపొందిన కేసీఆర్ వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఇకపై రెగ్యులర్గా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్కు అందుబాటులో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా గజ్వేల్లో కూడా భారీగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు. తొలి పర్యటనలో నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చిస్తారని సమాచారం. వరంగల్లో భారీ బహిరంగ సభ! పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నారు. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్లు జరగనున్నాయి. ఒకవైపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఉద్యమ కాలంలో తనతో కలిసి పనిచేసిన వివిధ వర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడుతూ త్వరలో అందుబాటులో ఉంటానని చెప్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. -
TS: గులాబీ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్కు రానున్నారని సమాచారం. బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్కు కేసీఆర్ భారీ కాన్వాయ్తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందే వరంగల్లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతల సిద్ధమవుతున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్ -
భారత్లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
మళ్లీ వార్తల్లోకి వచ్చిన రజనీకాంత్ రెండవ కూతురు
కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి ఆమెజాన్ ప్రైమ్ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఓం రౌత్ను ప్రభాస్ డైలాగ్తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
#Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ రీఎంట్రీని ఘనంగా ఆరంభించాడు. దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఇక 2021లో చివరిసారి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో మూడు వికెట్లు తీశాడు. కాగా 2019 వరకు మాత్రం రెగ్యులర్గా ఐపీఎల్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 13 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్గా 93 మ్యాచ్ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే కొన్నేళ్లగా టెస్టులకే మాత్రమే పరిమితమయ్యాడు. 108 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. Ishant Sharma spearheads #DelhiCapitals' offence! Keep watching #DCvKKR - LIVE & FREE on #JioCinema | Available across all telecom operators 😊#TATAIPL #IPL2023 #IPLonJioCinema | @ImIshant pic.twitter.com/PYK3rcoRoo — JioCinema (@JioCinema) April 20, 2023 చదవండి: సైగ చేయగానే ఆగిపోయాడు.. నమ్మకాన్ని నిలబెట్టని కోహ్లి -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్షీల్డ్లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్కు చెల్లిగా..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్కు ఇలా! ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, నటుడు విష్ణు విశాల్తో పాటు నటి జీవిత రాజశేఖర్ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. #LalSalaam - Shoot to start on March 7 in Chennai - @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot - Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI — Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023 -
మరోసారి ఆ డైరెక్టర్కు అనుష్క గ్రీన్ సిగ్నల్?
అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి. కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ (ఫొటోలు)
-
Kangana Ranaut: దాదాపు రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ
ముంబై: స్టార్ నటి కంగనా రనౌత్ దాదాపు రెండేళ్ల తర్వాత ట్విటర్లోకి అడుగుపెట్టారు.మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఆమె అకౌంట్పై మే 2021లో బ్యాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని ట్విటర్ ఎత్తేసింది. ఈ తరుణంలో ఇవాళ సాయంత్రం ఆమె ట్విటర్లో ‘హలో ఎవ్రీవన్, ఇట్స్ నైస్ టు బ్యాక్ హియర్ అంటూ ట్విట్ చేశారు. అయితే.. ఆమె అకౌంట్కు బ్లూ టిక్ లేకపోవడం గమనార్హం. బహుశా ట్విటర్ కొత్త పాలసీ వల్లే ఆమె అకౌంట్కు బ్లూ మార్క్ పోయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. బెంగాల్ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన పోస్టులు అప్పట్లో ఆమె ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. ఈ తరుణంలో.. తమ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్పై బ్యాన్ వేటు పడింది. ఇక పునరాగమ ట్వీట్తో పాటు తన అప్కమింగ్ చిత్రం ఎమర్జెన్సీకి సంబంధించిన అప్డేట్స్ సైతం ఇచ్చారు.ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేశాక.. సెలక్టివ్గా కొంతమంది ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు పునరుద్ధరించబడుతున్నాయి. Hello everyone, it’s nice to be back here 🙂 — Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023 And it’s a wrap !!! Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 … 20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G — Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023 -
Twitter: ఆయన పునరాగమనం కావాలా? వద్దా?
శాన్ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ మళ్లీ ఆసక్తికర చర్చ వైపు దారి తీశాడు. ఒకవైపు ట్విటర్ ఉద్యోగులు కంపెనీని వీడుతున్నప్పటికీ.. తనకేం ఫరక్ పడదని, ఉత్తమ ఉద్యోగులు తన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పరోక్ష చర్యల ద్వారా అమెరికా రాజకీయాలను కదిలిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం కావాలా? వద్దా? అంటూ ఓ పోల్ నిర్వహించాడు ఈ అపరకుబేరుడు. అయితే అది ట్విటర్ వరకే అనుకుంటే పొరపాటే!. ట్రంప్ తాజాగా 2024-అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన ట్వీట్ పరోక్షంగా ఆయన రాజకీయ పునరాగమనం గురించి అని అర్థం చేసుకోవచ్చు!. 2020 జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్పై ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎలన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్న తర్వాత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ట్రంప్ రీఎంట్రీ ఉండొచ్చనే సంకేతాలు అందించాడు కూడా. అయితే.. ట్విటర్ను మస్క్ టేకోవర్ చేయడంపై అభినందించిన ట్రంప్.. తిరిగి ట్విటర్లోకి వస్తారా? అనే విషయంపై మాత్రం సరైన స్పందన ఇవ్వలేదు. Reinstate former President Trump — Elon Musk (@elonmusk) November 19, 2022 తాజాగా.. జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ ట్రంప్ ట్విటర్ రీ-ఎంట్రీపై జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో.. తాజాగా ఎలన్ మస్క్ ట్రంప్ ట్విటర్ పునరాగమనం ఉండాలా? వద్దా? అనే అంశంపై పోలింగ్ నిర్వహించాడు. దీనికి అవును అనే స్పందనే ఎక్కువగా లభిస్తోంది. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 ట్విటర్ నిషేధం అనంతరం సొంతంగా ట్రూత్సోషల్ యాప్ ప్రారంభించాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్విటర్లో ఆయనకు దక్కిన ఫాలోయింగ్కంటే(బ్యాన్ నాటికి 80 మిలియన్ ఫాలోవర్స్).. సొంత ప్లాట్ఫారమ్లో దక్కిన ఆదరణ చాలా చాలా తక్కువ. ఒకవేళ ఆయన ట్విటర్ అకౌంట్ను గనుక పునరుద్ధరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన ప్రయత్నానికి బాగా కలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోల్ నిర్వహణ ముందర.. ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన మరికొన్ని అకౌంట్లను పునరుద్ధరించేందుకు సుముఖంగా ఉన్నట్లు, ట్విటర్ చేసే పని స్వేచ్ఛవాదులకు ఫ్రీ హ్యాండ్ అని అర్థం వచ్చేలా వరుస ట్వీట్లు చేశాడు ఎలన్ మస్క్. -
ట్విట్టర్లోకి ట్రంప్ రీఎంట్రీ..? ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
-
ట్విట్టర్ లోకి ట్రంప్ రీ ఎంట్రీ ..?
-
ఎలన్ మస్క్ తెలివైనోడు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్ కొత్త ఓనర్ ఎలన్ మస్క్పై ప్రశంసలు గుప్పించాడు. మస్క్ తెలివైనోడంటూ వ్యాఖ్యలు చేశాడాయన. అయితే.. ట్విటర్ నిషేధం ఎదుర్కొంటున్న ట్రంప్.. తిరిగి చేరతారా? అనే సస్పెన్స్కు మాత్రం ఆయన ఫుల్స్టాప్ పెట్టలేదు. టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను కొనుగోలు చేసిన వ్యవహారం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. నెలల తరబడి ఊగిసలాట నడుమ ఎట్టకేలకు గురువారం రాత్రి ఈ డీల్ ముగిసింది. టేక్ ఓవర్ కంటే ముందే తన మార్క్ను చూపించుకునేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నాలపైనా జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఈ పరిణామంపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో స్పందించారు. మన దేశాన్ని(యూఎస్) నిజంగా ద్వేషించే రాడికల్ లెఫ్ట్ వెర్రితలలు, ఉన్మాదులు ఇకపై ట్విట్టర్ను నిర్వహించబోరు. ఆ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఒక తెలివైన వ్యక్తి(ఎలన్ మస్క్) చేతుల్లోకి వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది అంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ట్విట్టర్ నిషేధ సమయానికి ట్రంప్ ఖాతాకు 80 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సొంత సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ట్రూత్ సోషల్లో మాత్రం ఇప్పటిదాకా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే ఉండడం గమనార్హం. మస్క్తో ట్రంప్ (పాత చిత్రం) ఇక ట్రంప్పై ట్విటర్ బ్యాన్ ఎత్తివేతకు సంకేతాలిస్తూ గతంలోనే కామెంట్లు చేశాడు ఎలన్ మస్క్. తానేం ట్రంప్ అభిమానిని కాదంటూనే.. మస్క్ నిషేధ నిర్ణయం సరికాదన్నారు. మరోవైపు ఫాక్స్ న్యూస్ డిజిటల్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందిస్తూ.. ట్విటర్ పునరాగమనంపై ఎటూ తేల్చలేదు. కాకపోతే తాను మస్క్ను బాగా ఇష్టపడతానని, అతనికి ట్విట్టర్ డీల్ అన్ని విధాల కలిసిరావాలని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశాడు. నేను లేకుండా ట్విట్టర్ విజయవంతం కాగలదని నేను అనుకోను అంటూ సరదా వ్యాఖ్య చేశారాయన. యూఎస్ కాపిటల్ దాడి నేపథ్యంలో ట్రంప్పై ట్విట్టర్ నిషేధం విధించింది. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నట్లు ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్.. తిరిగి ట్విట్టర్లోకి రావడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. -
షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ
హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది. చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ టాక్లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్ కుమార్తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్ తీస్తున్నా డైలాగ్ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్ నాపై అరిచారు. బ్రేక్లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ 15 షాట్స్ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్ రెడీ కాగానే వెళ్లి డైలాగ్ చెప్పాను. సింగిల్ షాట్స్లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్ రోల్. ఆయనను డైరెక్ట్గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది. -
సీనియర్ నటి రీఎంట్రీ.. ఐటెం సాంగ్స్ అయినా ఒకే అట
తమిళసినిమా: నటిగా, శృంగార తారగా 1980 ప్రాంతంలో ఊపేసిన తార బబిత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కమలహాసన్ కథానాయకుడిగా నటించిన నాయగన్ చిత్రంలో నాన్ సిరిత్తాల్ దీపావళి పాట వినగానే గుర్తొచ్చేది నటి బబిత పేరే. తెలుగులోనూ మొరటోడు నా మొగుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. కె.భాగ్యరాజ్ హీరోగా నటించిన చిన్నవీడు చిత్రంలో ఆయనకు రెండో భార్యగా నటించి అలరించారు. ఈమెది సినీ కుటుంబం అనే చెప్పాలి. ఈమె తండ్రి జస్టిస్ ఎంజీఆర్కు పలు చిత్రాల్లో విలన్గా నటించడంతో పాటు నిజ జీవితంలోనూ ఆయనకు నీడలా నిలిచిన వ్యక్తి. ఇక బబిత భర్త ఫైట్ మాస్టర్గా పలు చిత్రాలకు పని చేశారు. కాగా వివాహ అనంతరం నటి బబిత నటనకు దూరంగా ఉండి పిల్లలతో బాధ్యత గల తల్లిగా నడుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్ష్యను హీరోయిన్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించారు. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తరువాత బబిత నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నా సినిమా రంగంలో సాంబార్ ఇడ్లీ తినకపోతే ఉండలేకపోతున్నానన్నారు. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యా నని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి పొస్ కుమరస్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. మళ్లీ శృంగార తారగా ఐటమ్ డాన్స్ చేయడానికి కైనా.. అక్క, అమ్మ పాత్రలకైనా సిద్ధమని ప్రకటించారు. -
బ్యాట్ పట్టి రీ ఎంట్రీ ఇస్తున్న మిస్టర్ IPL సురేష్ రైనా
-
ఎస్యూవీల్లోకి హోండా రీఎంట్రీ: వచ్చే ఏడాది కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్యూవీలైన సీఆర్-వి, బీఆర్-వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్-వి, జాజ్ ఎస్యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు,బైక్స్తో ఎల్ఎంఎల్ కొత్త ఇన్నింగ్స్
సాక్షి,ముంబై: టూవీలర్ మార్కెట్లో సంచలనం ఎల్ఎంఎల్ (లోహియా మెషీన్స్ లిమిటెడ్) స్కూటర్స్ గుర్తున్నాయా? ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-స్కూటర్లతో మళ్లీ మర్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధునిక డిజైన్, రెట్రో లుక్లో ఈ-స్కూటర్లు, బైక్స్ను లాంచ్ చేయనుంది. కాన్పూర్కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ యాజమాన్యం కింద, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తన కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్తో మూడు వాహనాలను పరిచయం చేయనుంది. బైక్స్, ఇ-స్కూటర్లు రెండింటికీ సంబంధించి ప్రకటన ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ బైక్లు 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. అంతేకాదు వీటిని దేశీయ మార్కెట్కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. రానున్న 3-5 ఏళ్లలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హర్యానా మనేసర్లోని హార్లే-డేవిడ్సన్ తయారీ యూనిట్లోనే ఈ బైక్లను ఉత్పత్తి చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000ఎల్ఎమ్ఎల్ డీలర్షిప్లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది. కాగా 90లలో ఎల్ఎంఎల్ వెస్పా పేరు తెలియని వారుండరు. 100 సీసీ శ్రేణితో బజాజ్ స్కూటర్లతో పెద్ద పోటీనే ఉండేది. ఈ పోటీని తట్టుకోలేక 2018లో మూతపడింది ఎల్ఎంఎల్. -
అమలాపాల్ మాజీ భర్త డైరెక్షన్లో.. అమీ జాక్సన్ రీఎంట్రీ
హీరోయిన్ అమీ జాక్సన్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈత దుస్తులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన లండన్కు చెందిన నటి ఈ బ్యటీని మద్రాసు పట్టణం చిత్రంతో దర్శకుడు ఎఎల్ విజయ్ కోలీవుడ్కు పరిచయం చేశారు. తొలి చిత్రంలోని బ్రిటీష్ బ్యూటీగా తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించింది. తెలుగులోనూ రామ్చరణ్కు జంటగా ఎవడు చిత్రంలో సందడి చేసింది. ఈమె కోలీవుడ్లో చివరగా తెరపై కనిపింన చిత్రం 2.0. ఇందులో రజనీకాంత్కు జంటగా నటింంది. అయితే అంతకుముందే హిందీలో ఏక్ దివానా థా చిత్రంలో నటించి ఆ చిత్ర కథానాయకుడు ప్రతీక్ ప్రేమలో పడింది. అయితే కొద్ది రోజులకే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత హాలీవుడ్ టీవీ సీరియల్పై దృష్టి సారించిన ఎమీ జాక్సన్ జార్జ్ పనమిట్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. పెళ్లికి ముందే సహజీవనం చేసి ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అతనితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఎమీ జాక్సన్ తరువాత ఏమైందో గాని అతనికి దూరమైంది. ప్రస్తుతం కొత్త బాయ్ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్న ఈమె త్వరలో కోలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ అమ్మడిని మద్రాసు పట్టణం చిత్రంతో పరిచయం చేసిన దర్శకుడు ఎఎల్ విజయ్, మళ్లీ తన తాజా చిత్రంలో కథానాయికగా నటింపచేస్తున్నట్లు తెలిసింది. ఈయన ప్రస్తుతం నటుడు అరుణ్ విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా దీనికి సంబంధింన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
త్రివిక్రమ్ సినిమాతో హీరో తరుణ్ రీఎంట్రీ!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్ని తీసుకుంటాడు. తాజాగా SSMB28 సినిమా కోసం లవర్ బాయ్ తరుణ్ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వివాదస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆటనుంచి కూడా అతను విరామం తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు టాస్మేనియా ప్రాక్టీస్ సెషన్లో అతను కూడా పాల్గొన్నాడు. అక్టోబర్ 6 నుంచి జరిగే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ తొలి మ్యాచ్లో పెయిన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టిమ్ పైన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు. -
కాజల్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మథర్వుడ్ని ఆస్వాదిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కాజల్ మళ్లీ సినీ కెరీర్ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా నేహా ధూపియాతో ఇన్స్టా లైవ్లో ముచ్చటించిన కాజల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాతో త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై మెరవనుంది. కమల్హాసన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్లో ప్రమాదం జరగడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్, ఇతరాత్ర కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ప్రసవం తర్వాత కాజల్ నటిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్లను కూడా ఈ టూర్కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్బాబు భార్య నమ్రత శిరొద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంశీ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే సమయంలో మహేశ్తో ప్రేమలో పడిపోయింది. అంజీ మూవీ తర్వాత మహేశ్ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పింది. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, బిజినెస్ వ్యవహరాలతో బిజీగా ఉంది. ఇక మహేశ్ సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటే.. భర్తకు సంబంధించిన వ్యాపారాలు, జీఎమ్బీ ప్రొడక్షన్స్ వ్యవహరాలతో పాటు పిల్లల బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది. చదవండి: గ్రాండ్గా నయన్-విఘ్నేశ్ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్ అయితే ఆమె సినిమాల్లో నటించకపోయిన అప్పుడప్పుడు భర్త మహేశ్తో కలిసి ప్రకటనలో నటించడం, మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్స్ ఇవ్వడం చేస్తూనే ఉంటుంది. దీంతో ఆమె మళ్లీ తను నటించే అవకాశం ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తన రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నమ్రత. ఇటీవల తన స్నేహితులు ప్రారంభించి స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవానికి నమ్రత ముఖ్య అతిథిగా హజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. మహేశ్కు షాపింగ్ అంటే అసలు నచ్చదని, ఆయన కోసం కూడా తానే షాపింగ్ చేస్తానని చెప్పింది. చదవండి: నయన్పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్ ఆ తర్వాత సినిమాల్లోకి తన రీఎంట్రీపై స్పందిస్తూ.. ‘తిరిగి నేను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని ఎప్పుడు హర్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అందుకే నటించాలనే ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇక నమ్రతను తెరపై చూసే అవకాశం లేదా? అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తనయుడికి నీల్ కిచ్లూ అని ఇప్పటికే పేరు కూడా పెట్టేసింది. ఇక చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో కాజల్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని వినికిడి. చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్లు కాగా ప్రెగ్నెన్సీ సమయంలో ‘ఆచార్య’ మూవీతో పాటు అప్పటికే సైన్ చేసిన పలు ప్రాజెక్ట్స్ నుంచి కూడా ఆమె తప్పుకుంది. దీంతో కాజల్ పూర్తి కుటుంబంతో దృష్టి పెట్టాలనుకుంటోందని, అందుకే సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై కాజల్ కూడా స్పందించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బోద్దుగా తయారైన కాజల్ బిడ్డ పుట్టిన అనంతరం నాజుగ్గా తయారవుతోంది. చదవండి: దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్ను ఏమార్చలేం: డైరెక్టర్ కొడుకు నీల్ కిచ్లు పుట్టిన అనంతరం ఆమె తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో కాజల్ రోజురోజుకు కాస్తా నాజుగ్గా, గ్లామరస్గా కనిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకే తను శరీరాకృతిపై ఫోకస్ పెడుతుందని, వీలైనంత త్వరగా బరువు తగ్గి సినిమాలు చేయాలని భావిస్తోందని సన్నిహితుల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి తగిన కథ కోసం చూస్తున్నారట. మరి ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చి అభిమానులను ఎంతమేర అలరిస్తుందో వేచి చూడాలి. -
ట్విటర్లోకి ట్రంప్ రీ-ఎంట్రీ.. ఆ వెంటనే షాక్!
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వచ్చారు. నిషేధం తర్వాత చాలాకాలానికి ఆయన మళ్లీ ట్విటర్లో పోస్టులు చేయగలిగారు. కానీ, అంతలోనే ఆయనకు మళ్లీ షాక్ తగిలింది. ట్విటర్ బ్యాన్ ఎఫెక్ట్తో ట్రూత్ సోషల్ అంటూ ఓ కొత్త ప్లాట్ఫామ్ను లాంచ్ చేశారు డొనాల్ట్ ట్రంప్. అక్కడ ఆయన స్వేచ్ఛగా పోస్టులు చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో.. చాలాకాలం బ్యాన్ తర్వాత ఆయన ట్విటర్లోకి రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గప్చుప్ @PresTrumpTS యూజర్ నేమ్తో ట్విటర్లో ఆయన వరుస పోస్టులు చేస్తున్నారు. అయితే.. ఈ వ్వవహారం ఎంతో కాలం కొనసాగలేదు. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్ ఆ వెంటనే ఆ అకౌంట్ను కూడా నిషేధించేసింది. మంగళవారం ఆ ట్విటర్ హ్యాండిల్పై నిషేధ నిర్ణయం తీసుకున్నామని, అప్పటికే 210 ట్వీట్లు పోస్ట్ అయ్యాయని, ఇవి ట్రంప్ సోషల్ ట్రూత్ నుంచి కాపీ పేస్ట్ చేసినవేనని ట్విటర్ పేర్కొంది. ఇంకో హైలైట్ ఏంటంటే.. ఈ అకౌంట్ ఏప్రిల్ నుంచి యాక్టివ్గా ఉందట!. ట్విటర్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న వ్యక్తులు, ఖాతాలు.. ఆ సస్పెన్షన్ను అధిగమించడానికి ప్రయత్నిస్తే.. ఆ ఖాతాను పూర్తిగా నిషేధించే పాలసీని ట్విటర్ కలిగి ఉంది. ఇదిలా ఉంటే.. యూఎస్ కాపిటోల్పై దాడి నేపథ్యంగా.. జనవరి 6వ తేదీ, 2021 నుంచి ట్విటర్ ఆయనపై నిషేధం విధించింది. ట్రంప్ ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉండడమే.. హింసకు కారణమని ప్రకటించింది ట్విటర్. ఎలన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేస్తాడన్న నేపథ్యంలో.. ట్రంప్ రీ-ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది కూడా. చదవండి: అమెరికాలో మంకీపాక్స్ వైరస్ తొలికేసు.. లక్షణాలు ఇవే! -
ఆఫ్టర్ ఎ గ్యాప్.. రీఎంట్రీకి రెడీ అయిన హీరోయిన్స్
‘మేరా నామ్ చిన్ చిన్ చు..’ పాట సౌండ్ బాగుంది. మరి ఆట.. అదుర్స్. చేసిందెవరు? పంథొమ్మిదేళ్ల హెలెన్. ఆ పాట సోలో డాన్సర్గా ఆమెకు పెద్ద బ్రేక్. ఆ తర్వాత చేసిన పాటల్లో ‘పియా తూ అబ్ తో ఆజా’ (ప్రియుడా ఇప్పటికైనా రా అని అర్థం) ఒకటి. అలాంటి పాటలెన్నింటికో కాలు కదిపారు. ఎన్నో పాత్రలు చేశారు హెలెన్. పదేళ్ల క్రితం నటనకు బ్రేక్ ఇచ్చిన హెలెన్ని అప్పటి తరం అభిమానులు తలుచుకుంటూనే ఉన్నారు. వెండితెరకు ‘అబ్ తో ఆజా’ (‘ఇప్పటికైనా రా’) అంటున్నారు. హెలెన్ వచ్చేస్తున్నారు. ఇక హెలెన్ తర్వాతి తరాలకు చెందిన సోనాలీ బెంద్రే రాక కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘అబ్ తో ఆజా’ అంటున్నారు. ఆమె కూడా వచ్చేస్తున్నారు. వీరితో పాటు హిందీలో రీ ఎంట్రీకి రెడీ అయిన తారలు కూడా ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. ‘మేరానామ్ చిన్ చిన్ చు’ సాంగ్లో డ్యాన్స్తో రెచ్చిపోయిన హెలెన్కి నాటి తరంలో ఎందరో అభిమానులు ఉన్నారు. 1958లో వచ్చిన ‘హౌరా బ్రిడ్జ్’ చిత్రంలో ‘మేరా నామ్ చిన్ చిన్ చు..’ అంటూ ఎంత ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేశారో అంతే ఎనర్జీని 1971లో వచ్చిన ‘కారవాన్’లోని ‘పియా తు అబ్ తో ఆజా’, 1975లో వచ్చిన ‘షోలే’లోని ‘మెహబూబా మెహబూబా..’ పాటల్లోనూ చూపించారు హెలెన్. 70ఏళ్ల కెరీర్లో దాదాపు 700 చిత్రాల్లో నటించిన హెలెన్ దశాబ్దకాలంగా వెండితెరకు దూరమయ్యారు. ఇప్పడు ఆమె కెమెరా ముందుకు రానున్నారు. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘హీరోయిన్’ చిత్రం తర్వాత మరోమారు వెండితెరపై హెలెన్ కనిపించలేదు. తాజాగా ‘బ్రౌన్: ది ఫస్ట్ కేస్’లో హెలెన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. అభినవ్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ ఫిల్మ్లో కరిష్మా కపూర్, సూర్య శర్మ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కోల్కతా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అభీక్ బారువా రాసిన ‘సిటీ ఆఫ్ డెత్’ బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘‘నేను యాక్ట్ చేసినప్పటి సమయంతో పోలిస్తే ఇప్పుడు చాలా విషయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కాస్త భయంగా, ఆందోళనగా అనిపిస్తున్నా ఓ చాలెంజ్గా తీసుకుని నటిస్తున్నాను’’ అని హెలెన్ పేర్కొనడం విశేషం.. మరోవైపు ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్దాదా ఎమ్బీబీఎస్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సోనాలీ బెంద్రేను అంత ఈజీగా మర్చిపోలేం. 2013లో హిందీలో వచ్చిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబార’ చిత్రంలో గెస్ట్గా కనిపించిన తర్వాత సోనాలీ నటిగా మేకప్ వేసుకోలేదు. ఆ మధ్య క్యాన్సర్ మహమ్మారితో పోరాడారామె. క్యాన్సర్పై గెలిచి మళ్లీ యాక్టర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్లో ఓ యాంకర్గా నటించారామె. ఇందులో జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. సోనాలీకి ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘తిరిగి సెట్స్లోకి వచ్చి కో స్టార్స్, దర్శకులు, స్టోరీ డిస్కషన్స్తో బిజీ అవుతున్నందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు సోనాలీ బెంద్రే. మరోవైపు 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇటీవలే నటిగా మేకప్ వేసుకున్నారు అనుష్కా శర్మ. మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి బయోపిక్లో నటిస్తున్నారామె. ఈ చిత్రానికి ప్రోజిత్ రాయ్ దర్శకుడు. ఇలా బ్రేక్లో ఉన్న తారలు మళ్లీ నటించడం అభిమానులు ఆనందపడే విషయం. ఇంకా గ్యాప్ తీసుకున్న మరికొంతమంది తారలు మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. -
తొలి సినిమా డైరెక్టర్తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్కు ఏ డైరెక్టర్తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి
Laila Returns To Movies After 16 Years: ‘ఎగిరే పావురమా..’ మూవీతో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన అలనాటి తార, సొట్టబుగ్గల బ్యూటీ లైలా రీఎంట్రీ ఇవ్వబోతోంది. వివాహం అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పిన ఆమె దాదాపు 16ఏళ్ల తర్వాత కోలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. హీరో కార్తీ తాజా చిత్రం సర్ధార్ మూవీలో లైలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొందని, ఆమెకు సంబంధించిన 15 రోజుల షూటింగ్ షెడ్యుల్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో లైలా పాత్ర కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ‘దుష్మన్ దునియా కా’ అనే హిందీ మూవీతో మొదట సినీరంగ ప్రవేశం ఇచ్చిన లైలా ఎగిరేపావురంతో టాలీవుడ్కు పరిచయమైంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే అయిన తన క్యూట్ స్మైల్తో కుర్రకారు మనసులను దొచుకుంది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన లైలా చివరిగా ‘నువ్వే కావాలి’ సినిమాలో స్పెషల్ సాంగ్తో మెప్పించింది. తెలుగులో నటిస్తూనే తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలో లైలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని నటకు బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్లిపోయిన లైలా వెండితెరపై కనిపించి 16 ఏళ్లు గడిచిపోయింది. చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో హీరో కార్తీ సినిమాతో లైలా కోలీవుడ రీఎంట్రీ ఇస్తుండంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్కి కూడా ఆమె త్వరలోనే రీఎంట్రీ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా లైలా తమిళంలో చివరిగా అజిత్ హీరోగా 2006లో వచ్చిన ‘తిరుపతి’ సినిమాలో కనిపించింది. సర్ధార్ మూవీలో మొదట లైలా పాత్రకు నటి సిమ్రాన్ అనుకున్నారట. ఆమె వేరే ప్రాజెక్ట్స్తో బిజీ ఉండటంతో తన స్థానంలో లైలాను పరిశీలించి సంప్రదించారట దర్శక-నిర్మాతలు. కథ నచ్చడంతో లైలా వెంటనే గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని సమాచారం. కాగా ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీకి పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
18ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న 'మురారి' హీరోయిన్
మురారి సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్లింది. కొన్నాళ్ల క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. అమెరికాలోని న్యూయార్క్లో చికిత్స తీసుకొని కోలుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ.. గోడకు కొట్టిన బంతిలా
ఒక క్రికెటర్ ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే అతనిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ క్రికెటర్ పేరు కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులొచ్చి ఉంటాయి. అతని స్థానంలో ఎంతో మంది కొత్త క్రికెటర్లు వచ్చారు. కొందరు రాణిస్తే.. ఇంకొందరు కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితమయిన వాళ్లుంటారు. అలాంటి స్థితిలో అతని ఎంట్రీ గొప్పగా జరిగితే అంతకుమంచి ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అతని పేరు వాషింగ్టన్ సుందర్. చదవండి: Mohammad Siraj: 'ఏంటో సిరాజ్.. నీ సెలబ్రేషన్స్తో భయపెడుతున్నావు' వెస్టిండీస్తో తొలి వన్డే ద్వారా సుందర్ ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చాడు. సుందర్ టీమిండియా తరపున 2017లోనే తొలి వన్డే ఆడాడు. అప్పుడు శ్రీలంకతో ఆడిన వన్డే అతనికి మొదటిది.. చివరిది కావడం విశేషం. ఈ ఐదేళ్లలో మళ్లీ వన్డే మ్యాచ్ ఆడని సుందర్కు వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ రెండోది మాత్రమే. తరచూ గాయాలు బారిన పడడం.. ఫిట్నెస్ సమస్యలు సుందర్ను చుట్టు ముట్టాయి. అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన సుందర్ గోడకు కొట్టిన బంతిలా తయారయ్యాడు. తన బౌలింగ్ పవర్తోనే తానెంటో నిరూపించుకున్నాడు. సుందర్ను నమ్మిన రోహిత్ పవర్ ప్లేలో అతని చేతికి బంతిని ఇచ్చాడు. సుందర్ తన కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తే ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే వికెట్ తీశాడు. బ్రాండన్ కింగ్ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. అదే ఓవర్ చివరి బంతికి డారెన్ బ్రావోను ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడం.. రోహిత్ శర్మ రివ్య్వూకు వెళ్లడం.. ఫలితం సుందర్ ఖాతాలో రెండో వికెట్ పడింది. ఇక మ్యాచ్లో ఓవరాల్గా 9 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ది ఘనమైన పునరాగమనం అనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల దాటికి 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీకి ఎంపికైన కొత్తలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కోహ్లి.. అయితే ఇదే వాషింగ్టన్ సుందర్కు టెస్టు అరంగేట్రం ఎవరు ఊహించని విధంగా జరిగింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు సుందర్ నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టు ద్వారా సుందర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ను ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ సాధించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనప్పుడు సుందర్.. శార్దూల్ ఠాకూర్తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్లో అర్థసెంచరీతో పాటు శార్దూల్తో కలసి ఏడో వికెట్కు 127 పరుగులు జోడించడం హైలెట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో టీమిండియా లక్ష్యచేధనలో విజృంభించి మ్యాచ్తో పాటు సిరీస్ను కైవసం చేసుకుంది. అలా సుందర్.. గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయం వెనుక సుందర్ పాత్ర మరువలేం. ఓవరాల్గా 4 టెస్టులు ఆడిన సుందర్ 265 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు తీశాడు. చదవండి: మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు! -
రీ ఎంట్రీ ఇస్తున్న నటుడు వేణు తొట్టెంపూడి..
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. స్వయంవరం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి మూవీల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో నటించి తన గ్రాఫ్ను పెంచుకున్నాడు. హీరోగా, కమెడియన్గా తన నటనతో నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. రీసెంట్గానే రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్డ్యూటీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న ధమాకా సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల నటించనుంది. -
రీఎంట్రీకి రెడీ..పెళ్లయినా హీరోయిన్స్గానే
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... ‘బొమ్మరిల్లు’లో ఇలాంటి డైలాగుల్లో జెనీలియా అమాయకత్వాన్ని మరచిపోలేం. అమ్మాయి.. బాగుంది.. చూడచక్కగా ఉంది.. నటన కూడా బాగుంది. ‘అమ్మాయి బాగుంది’తో తెలుగు తెరకు వచ్చిన మీరా జాస్మిన్కి లభించిన ప్రశంసలు.గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.. హిందీలో అనుష్కా శర్మకు దక్కిన అభినందనలు. ఈ ముగ్గురు భామలూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు బ్రేక్కి ఫుల్స్టాప్ పెట్టారు. సినిమాలు సైన్ చేశారు. అభిమానులను ఆనందపరచడానికి మళ్లీ వస్తున్నారు. పెళ్లయిన నాయికలకు ‘లీడ్ రోల్స్’ రావు అనే మాటని ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జ్యోతిక, రాణీ ముఖర్జీ వంటి తారలు అబద్ధం చేశారు. కథానాయికలుగా చేస్తున్నారు. అంతెందుకు? దాదాపు పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శ్రీదేవి రీ–ఎంట్రీ ‘ఇంగ్లిష్–వింగ్లిష్’లో చేసిన లీడ్ రోల్తోనే జరిగింది. ఆ తర్వాత ‘మామ్’లోనూ లీడ్ రోల్ చేశారామె. శ్రీదేవి హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లేకుంటే ఈ ఫిఫ్టీ ప్లస్ తారను మరిన్ని మెయిన్ రోల్స్లో చూడగలిగేవాళ్లం. మామూలుగా హాలీవుడ్లో ఫిఫ్టీ, సిక్స్టీ ప్లస్ తారలు కూడా నాయికలుగా చేస్తుంటారు. ఇండియన్ సినిమాలోనూ అది సాధ్యం అని నిరూపించారు శ్రీదేవి. ఇక రీ ఎంటర్ అవుతున్న తారల్లో జెనీలియా గురించి చెప్పాలంటే.. ‘బొమ్మరిల్లు, రెడీ, శశిరేఖా పరిణయం, ఆరెంజ్’.. ఇలా తెలుగులో మంచి సినిమాలు జెనీలియా ఖాతాలో ఉన్నాయి. 2012లో చేసిన ‘నా ఇష్టం’ తర్వాత ఈ నార్త్ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు. అదే ఏడాది హిందీ నటుడు రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు హిందీ చిత్రాల్లో, ఓ మరాఠీ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించడంతో పాటు కొన్ని చిత్రాలకు నిర్మాతగా చేశారు. 2014లో ఒక బాబుకి, 2016లో ఓ బాబుకి జన్మనిచ్చారు జెనీలియా. ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నారు. మరాఠీ సినిమా ‘వేద్’తో ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జెనీలియా. ఇక, మీరా జాస్మిన్ విషయానికొస్తే.. ‘అమ్మాయి బాగుంది’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ అంతకు ముందే మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. వాటిలో తమిళ చిత్రం ‘రన్’ తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో అనిల్ జాన్ని పెళ్లాడిన మీరా ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించారు. వాటిలో అతిథి పాత్రలు ఉన్నాయి. బ్రేక్కి ముందు ట్రెడిషనల్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసిన మీరా జాస్మిన్ రీ–ఎంట్రీలో అందుకు పూర్తి భిన్నమైన ఇమేజ్ని కోరుకుంటున్నట్లున్నారు. మళ్లీ వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, గ్లామరస్గా ఫొటోషూట్ చేయించుకున్నారు. అంతేకాదు.. అభిమానులకు అందుబాటులో ఉండాలని సోషల్ మీడియాలోకీ ఎంట్రీ ఇచ్చారు. ‘మక్కళ్’ అనే మలయాళ సినిమా అంగీకరించారు మీరా. ‘అందం హిందోళం.. అదరం తాంబూలం’ అంటూ ‘యముడికి మొగుడు’లో స్టైల్గా స్టెప్పులేసిన రాధ 30 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్. తెలుగులో ‘అగ్నిపర్వతం’, ‘సింహాసనం’, ‘రాముడు భీముడు’ వంటి పలు చిత్రాల్లో కథానాయికగా 1980 నుంచి 1990 వరకూ నాటి తరానికి పాపులర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో నటించారామె. 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్ని పెళ్లాడాక సినిమాలకు బ్రేక్ వేశారు. 30ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.. అయితే స్మాల్ స్క్రీన్కి. తమిళంలో ఈ మధ్యే ప్రసారం ప్రారంభమైన ‘సూపర్ క్వీన్’కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు రాధ. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ నటించే ఆలోచనలో రాధ ఉన్నారని సమాచారం. అటు హిందీ వైపు వెళితే.. అనుష్కా శర్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లవుతోంది. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడాక, బ్రేక్ తీసుకున్నారామె. గత ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఐదేళ్ల బ్రేక్లో నటించలేదు కానీ, నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బ్రేక్కి ఫుల్స్టాప్ పెట్టి, హీరోయిన్గా ‘చక్ద ఎక్స్ప్రెస్’ సినిమాకి సైన్ చేశారు అనుష్క. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్గా ఈ చిత్రం రూపొందుతోంది. జులన్ పాత్రను అనుష్క చేస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయోజనాత్మకమైన సినిమా ద్వారా వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అనుష్కా శర్మ.రాధ, జెనీలియా, మీరా జాస్మిన్, అనుష్కా శర్మ.. వీరి ఎంట్రీ మరికొంతమంది తారలకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీలైతే నాలుగు సినిమాలు లేదా అంతకు మించి.. కుదిరితే లీడ్ రోల్స్లో తమ అభిమాన తారలను చూడాలని ఫ్యాన్స్ కోరుకోకుండా ఉంటారా! -
ఇన్స్టాలోకి రాజ్ కుంద్రా రీఎంట్రీ.. ఒక్కరిని మాత్రమే ఫాలో
Raj Kundra Reentry To Instagram Fallows Only One Account: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూలై 19, 2021న అరెస్టయిన రాజ్ కుంద్రా సెప్టెంబర్లో బెయిల్పై విడుదల అయ్యాడు. పోర్నో గ్రఫీ కేసులో ఇరుక్కోవడంతో తన ఇన్స్టాలోని పోస్టులను తొలగించడమే కాకుండా పూర్తిగా డిలీట్ కూడా చేశాడు. తాజాగా మళ్లీ తిరిగి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుంద్రా. ఇన్స్టా గ్రామ్ అకౌంట్ను తిరిగి ఓపెన్ చేసి ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు ఈ వ్యాపార వేత్త. ప్రస్తుతం రాజ్ కుంద్రా ఫాలో అయ్యే అకౌంట్ ఎవరిదా అనే ఆలోచనలో పడ్డారు నెటిజన్స్. రాజ్ కుంద్రా కొత్త అకౌంట్కు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఆ అకౌంట్కు వెరిఫైడ్ మార్క్ కూడా ఉంది. రాజ్ కుంద్రాను 10 లక్షల మంది ఫాలో అయితే అతను మాత్రం ఒకే ఒక అకౌంట్ను ఫాలో అవుతున్నాడు. ఆ అకౌంట్ అతని భార్య శిల్పా శెట్టిదో లేదా అతని కుమారుడు వియాన్ది అని అనుకుంటే పొరపడినట్లే. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా బాంద్రాలోని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ను ఫాలో అవుతున్నాడు. ఆ రెస్టారెంట్లో అతడికి భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ అకౌంట్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్లో తాను ఫోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించలేదని, డిస్ట్రిబ్యూట్ చేయలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదీ చదవండి: సాయిబాబా సన్నిధిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా -
యెజ్డీ మళ్లీ వచ్చింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుర్రకారును 90వ దశకం వరకు ఉర్రూతలూగించిన చెక్ బ్రాండ్ యెజ్డీ బైక్స్ మళ్లీ భారత్లో అడుగుపెట్టాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఒకేసారి మూడు మోడళ్లు గురువారం ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్స్టర్ ఉన్నాయి. 26 ఏళ్ల విరామం తర్వాత పోటీ ధరతో యెజ్డీ కొత్త జర్నీ ప్రారంభించడం విశేషం. మహీంద్రా గ్రూప్నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ భారత్లో జావా, బీఎస్ఏతోపాటు తాజాగా యెజ్డీ బ్రాండ్ను పరిచయం చేసింది. 1996 వరకు యెజ్డీ బైక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, కేటీఎంకు ఇప్పుడు యెజ్డీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ధర మోడల్, వేరియంట్నుబట్టి రూ.1.98 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ వద్ద ఉన్న ప్లాం టులో ఇవి తయారవుతున్నాయి. ఏటా 5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇవీ ఫీచర్ల వివరాలు.. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్స్టర్ మోడళ్లు 334 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ ఇంజిన్తో తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, కాన్స్టాంట్ మెష్ 6 స్పీడ్ గేర్ బాక్స్, ఏబీఎస్, 29.1–30.2 పీఎస్ పవర్, డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. ట్యాంక్ సామర్థ్యం మోడల్నుబట్టి 12.5–15.5 లీటర్లు. బరువు 182–188 కిలోలు. సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్తో అడ్వెంచర్, ట్విన్ ఎగ్జాస్ట్తో మిగిలిన రెండు మోడళ్లు రూపుదిద్దుకున్నాయి. విస్తృత స్థాయిలో 14 రంగులు కస్టమర్లను అలరించనున్నాయి. రూ.5 వేలు చెల్లించి బైక్ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సైతం మొదలైనట్టు క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా ఈ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ పునరుద్ధరణ, డిజైన్, ఆర్అండ్డీ, పారిశ్రామికీకరణకు క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. It's not a motorcycle, it's an emotion. It's an era. It's a way of life. And we're back, thundering thrice in three new avatars! Book your test rides now - https://t.co/esLonZ0DEr .#NotForTheSaintHearted #Yezdi #YezdiIsBack #YezdiMotorcycles #YezdiForever pic.twitter.com/WvwiiVoA2Z — yezdiforever (@yezdiforever) January 13, 2022 -
ఫ్యాన్స్కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్..
Senior Actress Radha Re Entry To Small Screen After Long Gap: అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాధ.. అప్పటి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయం, నటన.. అంతకు మించి డ్యాన్స్తో ఎంతో ప్రేక్షకులను గుండెల్లో ఆమె నిలిచిపోయారు. 80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పలువురి హీరోలందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో పోటీ పోడుతూ డ్యాన్స్ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. అలా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధ తమిళ్, మలయాళంలో కూడా హీరోయిన్గా నటించారు.అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రానూరానూ సినిమాలు తగ్గించిన రాధ పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, వ్యాపారంతో బిజీ అయిపోయారు. ఆమె తెరపై కనిపించి ఓ దశాబ్దమే గడిచింది. ఈక్రమంలో అప్పుడప్పుడు పలు ఈవెంట్స్లో మెరిసిన ఆమె పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసే ఓ తీపి కబురు అందించారు రాధ. మళ్లీ వస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ మేరకు రాధ ట్వీట్ చేస్తూ.. త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను వదిలారు. ‘చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్నా. ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్ వ్యవహరిస్తున్న ఈ సూపర్ క్వీన్స్ షో జీ తమిళ్లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్గా ఆమె కనిపించడం ఇదే తొలిసారి. కాగా ఈ షో జనవరి 16 నుంచి జీ తమిళంలో ప్రసారం కానుంది. After pretty long time , again as a judge for a reality show ! Nakul, my co judge is such a sweetheart ❤️That too on Zee Tamil! Enjoyed every bit of it! So proud to witness our talented girls!https://t.co/Kae1rQA7ax @ZeeTamil — Radha Nair (@ActressRadha) January 11, 2022 -
భర్త రితేష్ దర్శకత్వంలో జెనీలియా రీ ఎంట్రీ
పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. 2012లో రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకున్నాక ఓ మరాఠీ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు మరాఠీ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. దర్శకుడిగా రితేష్కి ఇది తొలి సినిమా కావడం మరో విశేషం. ‘వేద్’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు జెనీలియా. వచ్చే ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. -
సినిమాల్లోకి సుమ రీఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన యాంకర్
Anchor Suma Re-Entry To Movie Soon She Gave Clarity: యాంకర్ సుమ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఆమె బాగా సుపరిచితురాలు. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్లో తనకు సాటి లేరు ఎవరూ అనే విధంగా ముందుకు సాగుతున్నారు. తన మాటలు, పంచ్లు, కామెడీ టచ్తో యాంకర్గా టాలీవుడ్లో ఆమె చక్రం తిప్పుతున్నారు. యాంకర్లు ఎంతమంది ఉన్నా సినిమా కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్స్ అంటే యాంకర్గా సుమ ఉండాల్సిందే అనేలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. చదవండి: ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్సైట్పై రానా అసహనం ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్స్గా రాణిస్తున్న మేల్, ఫీమేల్ యాంకర్స్ అంతా వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. శ్రీముఖి, అనసూయ, ప్రదీప్, రవి, రష్మీ, సుధీర్, వర్షిణీతో పాటు తదితరులు సినిమాల్లో సహా నటీనటులుగా కనిపిస్తున్నారు. కానీ సుమ మాత్రం యాంకరింగ్తోనే ఫుల్ బిజీగా ఉంటున్నారు. తను లీడ్రోల్లో ‘కల్యాణ ప్రాప్తిరస్తూ’ అనే మూవీలో నటించిన సుమ ఆ తర్వాత మలయాళం సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్ పాత్ర పోషించిన సుమ సహా నటిగా అప్పడప్పుడు మెరిసారు. ఇక చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్గా కనిపించారు. చదవండి: హీరో బాలకృష్ణకు సర్జరీ అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు. ఈ క్రమంలో సుమ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వెండితెర రీఎంట్రీపై క్లారిటీ వచ్చింది. దీనిపై సుమ ఓ వీడియో ద్వారా తనదైన శైలిలో స్పష్టత ఇచ్చారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ‘ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే’ అంటూ సుమ చెప్పుకొచ్చారు. ఈ వీడియో పీఆర్ఓ దుద్ది శ్రీను తన ట్విటర్లో పంచుకున్నాడు. మరి సుమ ఎలాంటి పాత్రతో రీఎంట్రీ ఇవ్వనుందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎప్పుడూ తన యాంకరింగ్ సరికొత్త ఉండాలనుకునే సుమ సినిమా విషయంలో ఏమాత్రం తగ్గదని, తను ఓ మంచి పాత్రతోనే ఫ్యాన్స్ అలరిస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. Anchor @ItsSumaKanakala into Cinemas 🤔🎬 Idhi Nijame Antara ? 🤷♂️ More Details Loading S👀N! #SUMAinCINEMA pic.twitter.com/LY6kcNClJr — Duddi Sreenu (@PRDuddiSreenu) November 2, 2021 -
నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ.. అందరూ సమానమే: శశికళ
సాక్షి, చెన్నై: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేందుకు దివంగత సీఎం జె.జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమవుతున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్ను ఉద్దేశించి ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాలకు చిన్నమ్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనంతో మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా కేడర్లోకి చొచ్చుకువెళ్లేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా నమదు ఎంజీఆర్ పత్రిక ద్వారా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ మేరకు తాజా ప్రకటనలో నేనొస్తున్నా అంటూ సంకేతాన్ని కేడర్లోకి పంపించారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
భారత్లోకి ‘ప్లే బాయ్’ వచ్చేస్తున్నాడు..!
ముంబై: లీజర్ లైఫ్స్టయిల్ సంస్థ ప్లేబాయ్ ఎంటర్ప్రైజెస్ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశిస్తోంది. ఇందుకోసం జే జే క్యాపిటల్ సంస్థతో జట్టు కట్టింది. ప్రఖ్యాత ప్లేబాయ్ మ్యాగజైన్ సహా వివిధ ప్లేబాయ్ బ్రాండ్ల యాజమాన్య సంస్థ పీఎల్బీవై గ్రూప్ సీఈవో బెన్ కాన్ ఈ విషయాలు తెలిపారు. (చదవండి: రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!) నాలుగేళ్లలో రూ.800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, ప్రధాన నగరాల్లో ప్లేబాయ్ బ్రాం డ్ క్లబ్లు, కేఫ్లు, బీర్ గార్డెన్లు, నైట్క్లబ్లు ప్రారంభించనున్నట్లు చెప్పారు. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) -
రీఎంట్రీ ఇస్తున్న మహేశ్ సోదరి.. ఫస్ట్ లుక్ అవుట్
సూపర్ స్టార్ మహేశ్బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సిల్కర్ స్క్రీన్పై మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతోన్న మళ్లీ మొదలైంది చిత్రం ద్వారా రీఎంట్రీకి సిద్దమయ్యారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజుల 'డాక్టర్ మిత్ర'-థెరపిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూవీ విడుదల తేదీపై ఎగ్జయిటెడ్గా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 1998లో సమ్మర్ ఇన్ బెత్తెహామ్ సినిమాతో తొలిసారి వెండితెరకు కనిపించిన మంజుల ఆ తర్వాత నాని సినిమాతో నిర్మాతగా మారింది. పోకిరి, కావ్యాస్ డైరీ, యే మాయ చేశావే చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్గా గుర్తింపు పొందింది ఆ తర్వాత 2018లో మనసుకు నచ్చింది సినిమాకు దర్శకత్వం వహించింది. చివరగా 2013లో సేవకుడు చిత్రంలో కనిపించారు. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల అనంతరంనటిగా వెండితెరపై కనిపించనున్నారు. It was fun and exciting to act in the movie "malli modalaindi" as Dr.Mitra - the therapist. Eagerly looking forward to the movie release.@tgkeerthikumar@iSumanth@NainaGtweets@tej_uppalapati#MalliModalaindi #manjulaghattamaneni pic.twitter.com/L7NluBokIv — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 8, 2021 -
క్రికెట్లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే?
లాహోర్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అమీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా కరాచీ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇస్లామాబాద్ బ్యాట్స్మెన్ ఇఫ్తికార్ అహ్మద్తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా అని కయ్యానికి కాలు దువ్వారు. చివరకు అంపైర్లు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Source: Sony Sports Network #PSL6 #PSL #PSL2021 #MohammadAmir #KKvsIU pic.twitter.com/61d7xKsBC5 — Cricket (@ZombieCricketer) June 14, 2021 కాగా, 29 ఏళ్ల అమీర్.. పాక్ జట్టు మేనేజ్మెంట్ మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ గతేడాది పాక్ క్రికెట్తో సంబంధాలు తెంచుకుని ఇంగ్లండ్కి వెళ్లి సెటిలయ్యాడు. అనంతరం బ్రిటీష్ సిటిజన్షిప్ పొందాక ఐపీఎల్లో ఆడేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పీసీబీ చీఫ్ వసీమ్ ఖాన్.. పీఎస్ఎల్ ఆడేందుకు పాక్కు వచ్చిన అమీర్తో చర్చలు ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ఇంటికి స్వయంగా వెళ్లి.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా మహ్మద్ అమీర్పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాపై మరోసారి అక్కసు వెల్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత.. -
VK Sasikala: పార్టీ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోలేను.. త్వరలోనే వస్తా!
చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. గతంలో ఏఐఏడీ ఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆమె ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తానంటూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలతో పేర్కొనడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీ యాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆమె ఆ సమయంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, ఏఐఏడీఎంకే నాయకత్వం కోసం అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య విభేదాల గురించేనని స్పష్టమైంది. తాజాగా, శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారాయి. మొదటి వీడియోలో శశికళ ‘పార్టీని కచ్చితంగా గాడిలో పెడదాం, నేను తప్పక వస్తాను’అని అన్నట్లుగా ఉంది. రెండో ఆడియోలో ఏఐఏడీఎంకేను ఉద్దేశించి.. ‘నాతోపాటు అనేక మంది నేతల కృషితోనే పార్టీ ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య పోరుతో పార్టీ నాశనమై పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కరోనా వేవ్ తగ్గాక మద్దతుదారులతో మాట్లాడతా. ఆందోళన వద్దు. త్వరలోనే వస్తా. పార్టీని బలోపేతం చేస్తా్త’అని శశికళ అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి. శశికళ ఏఐఏ డీఎంకేపై మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు. -
రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్బాస్ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్కు దగ్గరయ్యాడు. సీజన్-3లో మిస్టర్ కూల్ అనే ట్యాగ్ లైన్ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ వరుణ్ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్బాస్ సీజన్-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్ తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం నిర్మిస్తుంది. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇందువదన అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో వస్తోన్న వరుణ్ సందేశ్ సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్ బోల్డ్గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్ వేరె లెవల్లో ఉందంటూ వరుణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్ యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
ఆరేళ్లుగా నటనకు దూరం.. రీ ఎంట్రీకి సిద్ధమైన హీరోయిన్
తన క్యూట్ ఎక్సెప్రెషన్స్, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ మీరా జాస్మిన్ అభిమానులకు గుడ్ న్యూస్. దాదాపు ఆరేళ్లకు పైగా సినిమాలకు గుడ్బై చెప్పిన కేరళ భామ మీరా జాస్మిన్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రకటించారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్లో మీరా జాస్మిన్ నటించనున్నట్లు వెల్లడించారు. అల వైకుంఠపురంలో ఫేం జయరాం, మీరా జాస్మిన్లు ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. జూలైలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మాధవన్ సరసన రన్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్..ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్ను పెళ్లి చేసుకుంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా వీరు విడాపోయారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా నటనకు దూరమైన మీరా జాస్మాన్..మరోసారి వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి : ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో ఫ్లైట్లో తమన్నా: అక్కడ కోహ్లి ఏం చేస్తున్నాడు? -
లవర్ బాయ్ తరుణ్ రీఎంట్రీ, ఈ సారి..
తరుణ్..టాలీవుడ్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి లవర్ బాయ్గా పేరు పొందాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తొలి సినిమా ‘నువ్వే కావాలి’తో రికార్డులు సృష్టించి టాలీవుడ్ లవర్ బాయ్గా విశేష ప్రేక్షకాదరణ పొందాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లోనే 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించిదంటే తరుణ్కు ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఆ తర్వాత నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలతోతరుణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తరుణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంట్ అని నిర్మాతలకు గట్టి నమ్మకం ఉండేది. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఈయన కెరీర్ దారుణంగా దిగజారిపోయింది. వరుసగా లవ్ స్టోరీలనే చేస్తూ రావడం తరుణ్కు మైనస్గా మారింది. వరస ప్లాప్స్ తో కెరీర్ లో వెనుకబడ్డాడు. తొలి ఏడేళ్లలో తరుణ్ నుంచి దాదాపు 14 సినిమాలు వస్తే.. ఆ తర్వాత 14 ఏళ్లలో ఈయన నుంచి 7 సినిమాలు కూడా రాలేదు. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తరుణ్ తీవ్ర నిరాశ చెందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల జోలికి వెళ్లలేదు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు. నాలుగేళ్ళ అనంతరం తన స్నేహితుడితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన ఫ్రెండ్ రాసిన లవ్ స్టోరీ తరుణ్ కు బాగా నచ్చిందట. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ప్రస్తుతం తరుణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
ఐదేళ్ల తర్వాత క్రికెటర్ రీఎంట్రీ
కరాచీ: వివాదాస్పద క్రికెటర్ షార్జీల్ ఖాన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ టి20 జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగే సిరీస్కు ఎంపికయ్యాడు. 2017లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా షార్జీల్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2019లో షార్జీల్ భేషరతు క్షమాపణలు చెప్పడంతో పాక్ బోర్డు నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం తొలిగాక షార్జీల్ జాతీయ టి20 కప్లో, పాక్ సూపర్ లీగ్లో నిలకడగా రాణించి జట్టులోకి వచ్చాడు. ఫాలోఆన్లో జింబాబ్వే అబుదాబి: అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో జింబాబ్వే క్రికెట్ జట్టు ఎదురీదుతోంది. ఓవర్నైట్ స్కోరు 50/0తో ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 287 పరుగులవద్ద ఆలౌటైంది. సికిందర్ రజా (85; 7 ఫోర్లు, సిక్స్), ప్రిన్స్ మాస్వెర్ (65; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు, అమీర్ హంజా మూడు వికెట్లు తీశారు. 258 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది. ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే జింబాబ్వే మరో 234 పరుగులు చేయాలి. -
ఏడేళ్ల తర్వాత తొలి వికెట్.. ఏడ్చేసిన శ్రీశాంత్
టీమిండియాలో కోపానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుచ్చే పేరు కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్. 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ మొదటి నుంచే అగ్రెసివ్ క్రికెటర్గా పేరు పొందాడు. తన కెరీర్ మొత్తంలో ఎక్కువశాతం గొడవలతోనే ఫేమస్ అయ్యాడు. తాను వేసే బంతుల కన్నా చూపులతోనే ప్రత్యర్థి బ్యాట్స్మన్లను భయపెట్టడానికి ప్రయత్నించేవాడు. తాజాగా ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ తొలి మ్యాచ్లోనే వికెట్ పడగొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తం 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్ స్వయంగా ట్విటర్లో పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత సొంత జట్టు తరపున వికెట్ తీయడం ఆనందంగా ఉంది. నా జీవితంలో చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఇన్నాళ్ల తర్వాత కూడా అభిమానులు నాపై చూపించిని ప్రేమ, మద్దతుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న శ్రీశాంత్ తన సహచర క్రికెటర్లైన అంకిత్ చవాన్, అజిత్ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది. అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్తో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది. దీంతో కేరళ తరపున ముస్తాక్ అలీ ట్రోపీలో ఆడేందుకు శ్రీశాంత్కు లైన్ క్లియర్ అయింది. కొన్ని వారాల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా ప్రత్యర్థి బ్యాట్స్మన్పై కోపంగా చూడడం.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏడేళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. Thanks a lot for all the support and love ..it’s just the beginning..with all of ur wishes and prayers many many many more to go..❤️🇮🇳🏏lots of respect to u nd family .. #blessed #humbled #cricket #bcci #kerala #love #team #family #india #nevergiveup pic.twitter.com/bMnXbYOrHm — Sreesanth (@sreesanth36) January 11, 2021 -
బిగ్బాస్: కుమార్ సాయి రీఎంట్రీ?
కుమార్ సాయి.. ఈ కంటెస్టెంటు మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. బిగ్బాస్ నాల్గో సీజన్ నుంచి సూర్య కిరణ్ బయటకు అడుగు పెట్టగానే తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి లోనికి వెళ్లాడు. మంచివాడే కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ. ఈ ఒక్క కారణంతోనే పదేపదే నామినేషన్లోకి వచ్చి చివరికి ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే అనధికార పోల్స్లో కుమార్ కన్నా మోనాల్ స్వల్ప ఓట్లతో చివరి స్థానంలో ఉంది. అయినా సరే, మోనాల్ను కాదని అతడిని ఎలిమినేట్ చేయడంతో చాలామంది ప్రేక్షకులు బిగ్బాస్ను తిట్టిపోశారు. ఎలిమినేషన్ మీద ఎన్నో ప్రశ్నలను లేవనెత్తారు. ఎలిమినేషన్ ప్రేక్షకుల చేతిలో లేదని అంతా బిగ్బాస్ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో అతడు మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే కనక నిజమైతే ఎవరి వల్ల అతడు బిగ్బాస్ను వీడి వచ్చాడో ఆమె డేంజర్ జోన్లో పడే అవకాశముంది. అంటే పొరపాటున మోనాల్ నామినేషన్లోకి వస్తే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: అఖిల్ అవుట్: ఆలస్యంగా తెలుసుకున్న బిగ్బాస్!) ఎందుకంటే అక్కడున్న వారితో పోలిస్తే మోనాల్ అందరికన్నా వీక్ కంటెస్టెంటుగా కనిపిస్తోంది. కానీ ఎప్పటి నుంచో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న బిగ్బాస్ మోనాల్ను వదులుకుంటాడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కుమార్ రీ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. అతడు రావడం వల్ల హౌస్లో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అతడిని తీసుకురావడం వెనక కుట్ర ఉందని మరో కోణాన్ని ఎత్తి చూపుతున్నారు. అతడు వస్తే కచ్చితంగా వచ్చేవారం మళ్లీ అతడే ఎలిమినేట్ అవుతాడని, తద్వారా లాస్య, మోనాల్ను సేవ్ చేయాలనుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు కుమార్ సాయి రీఎంట్రీ ఉంటుందా? లేదా? అన్నది అధికారికంగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: జోకర్ ఎలిమినేటెడ్, కానీ ఆ కోరిక నెరవేరనుంది) -
దక్షిణాఫ్రికా వన్డే జట్టులో రబడ పునరాగమనం
జొహన్నెస్బర్గ్: ఇంగ్లండ్తో వచ్చే నెలలో జరిగే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. స్టార్ పేస్ బౌలర్ కగిసో రబడ పునరాగమనం చేశాడు. గత మార్చిలో భారత్తో జరిగిన సిరీస్కు గాయంతో రబడ దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రబడ ఐపీఎల్ టి20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15 మ్యాచ్ల్లో ఆడిన రబడ 25 వికెట్లు తీశాడు. 24 మంది సభ్యులతో ప్రకటించిన ప్రస్తుత జట్టులో పేస్ బౌలర్ స్టర్మన్కు తొలిసారి స్థానం లభించింది. దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డికాక్ (కెప్టెన్), బవుమా, డాలా, డు ప్లెసిస్, ఫార్చూన్, బ్యూరన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, క్లాసెన్, జార్జి లిండె, కేశవ్ మహరాజ్, మలాన్, మిల్లర్, ఇన్గిడి, నోర్జే, ఫెలుక్వాయో, ప్రెటోరియస్, రబడ, షమ్సీ, సిపామ్లా, స్మట్స్, స్టర్మన్, బిల్జాన్, డుసెన్, వెరియన్. -
మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్
సాక్షి, ముంబై: ఒకపుడు దిగ్గజంగా వెలిగిన దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధపడుతోంది. దేశంలో చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. పోటీ మార్కెట్ లో చైనా మొబైల్ సంస్థలు వస్తే.. ఒకే కానీ, సరిహద్దులో అనిశ్చితి సరైనది కాదు అంటూ ఆయన చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో, ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానాన్నిఈ వీడియోలో వివరించారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన మైక్రోమాక్స్ జర్నీని ప్రస్తావించారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగినా, తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని చెప్పుకొచ్చారు. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు. ఏం చేయాలి.. ఎవరికోసం చేయాలి అని చాలా ఆలోంచించాను.. అయితే ఎక్కడినుంచి మొదలు పెట్టానో.. మళ్లీ అక్కడ్నించే మొదలు పెట్టే అవకాశాన్ని జీవితం ఇచ్చింది. కానీ ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే చేస్తానని రాహుల్ ప్రకటించారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్తో తిరిగి వస్తోందని వెల్లడించారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్ఫోన్ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను కూడా వీడియోలో షేర్ చేశారు. ఇంతకుమించి వివరాలను ఆయన ప్రకటించపోయినప్పటికీ, 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ ఆరంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుందని టెక్ నిపుణుల అంచనా. ఇందుకోసం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. We're #INForIndia with #INMobiles! What about you? #IndiaKeLiye #BigAnnouncement #MicromaxIsBack #AatmanirbharBharat pic.twitter.com/eridOF5MdQ — Micromax India (@Micromax__India) October 16, 2020 -
ధోని ఆంతర్యం ఏమిటో ?
సాక్షి క్రీడా విభాగం: మ్యాచ్లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్తో గెలిపించడం మహేంద్ర సింగ్ ధోనికి ‘ఐస్’తో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం అతనికి అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు అతనికి కొత్త కాదు. అభిమానులను అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది ధోనికే చెల్లింది. కొందరి దృష్టిలో అతనో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో అతనో ‘సుడిగాడు’ మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్లో ధోని ఒక అద్భుతం. ‘నేను సిరీస్ గెలిచినా ఓడినా నా ఇంట్లో పెంపుడు కుక్కలు నన్ను ఒకే తరహాలో చూస్తాయి’ అంటూ విమర్శకులకు ఘాటుగా జవాబిచ్చినప్పుడు ‘మిస్టర్ కూల్’లోని మరో రూపం బయటకు వస్తుంది. ఓటమికి కారణాలు విశ్లేషించమని కోరినప్పుడు ‘మీరు చనిపోవడం ఖాయమైనప్పుడు ఎలా చస్తే ఏం. అది కత్తితోనా, తుపాకీతోనా అని అడిగితే ఎలా’ అన్నప్పుడు అతనిలో వ్యంగ్యం వినిపిస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ధోని ధోనిలాగే ఉన్నాడు. ఎవరి కోసమో అతను మారలేదు. ధోని పేరు ప్రఖ్యాతులను పట్టించుకోలేదు. కానీ అవే అంగవస్త్రాల్లా అతని వెంట నడిచాయి. తాను బ్యాట్స్మన్గా ఆటలో ఎంతో నేర్చుకున్నాడు. అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్నాడు. అంతే కానీ తన బ్యాటింగ్ శైలి బాగుండకపోవడం గురించి ఎప్పుడూ చింతించలేదు. కీపింగ్ శైలి కూడా ఇంటి ఆవరణలో తనకు తాను నేర్చుకున్నదే తప్ప కోచింగ్ సెంటర్లో కుస్తీలు పట్టడం వల్ల రాలేదు. కానీ అదే అతనికి కీర్తి కనకాదులు తెచ్చి పెట్టింది. నాయకత్వ ప్రతిభ కవచ కుండలాల్లా ధోనితో కలిసిపోయింది. ఫలితంగా ఎన్నో అరుదైన ఘనతలు, గొప్ప విజయాలు, మరెన్నో రికార్డులు. మహేంద్రుడి సారథ్యం మన క్రికెట్పై చెరగని ముద్ర వేసింది. 2019 జూలై 9న ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోని తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుటికి సరిగ్గా ఏడాదవుతోంది. ఆ తర్వాత అతను కనీసం స్థానిక మ్యాచ్లో కూడా బరిలోకి దిగలేదు. రేపు నిజంగా ఏదైనా సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఈ సంవత్సరపు విరామాన్ని సెలక్టర్లు ఎలా చూస్తారు. ఎంత గొప్ప ధోని అయినా అసలు ఇంత కాలం ఆడకుండా అతడిని నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాగలరా అనేదానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఎమ్మెస్ తనంతట తానుగా ఏదైనా చెబితే తప్ప ఏదీ తెలీదు. అయినా ధోని నిజంగా తప్పుకోవాలనుకుంటే ముహూర్తాలు, పుట్టిన రోజు సందర్భాలు చూసుకునే రకం కాదు. భవిష్యత్తు ఎలా ఉన్నా క్రికెట్ అభిమానులకు ఎమ్మెస్ పంచిన మధుర జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరుగులు, గణాంకాల గురించి కాసేపు పక్కన పెడితే ‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్స్టయిల్’ అనే కేక మీ చెవుల్లో ఎప్పటికీ మారు మోగిపోతూనే ఉంటుంది. ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ముగిసిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ధోని క్రికెట్ పరుగు పిచ్ మధ్యలో ఆగిపోయింది. ఏదో ఒక ఎండ్కు చేరుకోకుండా ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉంది. నిస్సందేహంగా మాహికి ఆటపై పిచ్చి ప్రేమ ఉంది. కానీ కనుచూపు మేరలో క్రికెట్ కనిపించని వేళ అతని ఆలోచనలేమిటో కనీసమాత్రంగా కూడా ఎవరూ ఊహించలేరు. తన ఆంతర్యం ఏమిటో బయట పెట్టడు. తన మౌన ముద్రను వీడి మాట్లాడడు. బాహ్య ప్రపంచానికి దూరంగా తన మానాన తాను ఫామ్ హౌస్లో కుటుంబంతో, పెంపుడు కుక్కలతో ఆడుకోవడం మినహా క్రికెట్ గురించి పట్టించుకోడు. ఐపీఎల్ కోసం మొదలు పెట్టిన సాధన కరోనా దెబ్బతో ఆగిపోయింది. అక్కడ ఆడితే అనుభవం కోసమైనా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్కు వెళ్లవచ్చని అంతా అనుకున్నారు. కానీ అటు ఐపీఎల్ లేదు ఇటు ప్రపంచకప్ సంగతి దేవుడెరుగు. అనుభవాన్ని, అందించిన విజయాలను గౌరవిస్తూ గత సెలక్షన్ కమిటీ విశ్రాంతి అంటూనో, మరో కారణం చెప్పో అధికారికంగా వేటు మాట చెప్పలేకపోయింది. బోర్డులో మరెవరూ ధోని ఆట ముగిసిందని చెప్పే సాహసం చేయలేదు. గంగూలీ కూడా నాకు అతని భవిష్యత్తు గురించి అంతా తెలుసు అంటాడే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కచ్చితంగా చెప్పడు. కోచ్ రవిశాస్త్రితోనో, కోహ్లి నోటి వెంటనో ధోనికి ఆసక్తి తగ్గిందన్నట్లుగా పరోక్ష సంకేతాలే వస్తాయి తప్ప ఆట ముగిసిపోయిందని స్పష్టంగా ఎవరూ ఏమీ చెప్పరు. కొత్త సెలక్షన్ కమిటీకి ఇంకా ఇప్పటి వరకు పని చేయాల్సిన అవసరమే రాలేదు. -
శ్రీశాంత్ మళ్లీ వస్తున్నాడు...
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన భారత పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కేరళ రంజీ ట్రోఫీ జట్టులోకి అతడిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైంది. రంజీ కోసం ఎంపిక చేసే ప్రాబబుల్స్లో 37 ఏళ్ల శ్రీశాంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జట్టు కోచ్ టిను యోహానన్ వెల్లడించాడు. దాంతో అతని పునరాగమనం లాంఛనమే కానుంది. ‘కేరళ తరఫున శ్రీశాంత్ మళ్లీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది రంజీ ట్రోఫీ కోసం అతని పేరును కూడా పరిగణలోకి తీసుకుంటాం. కేరళలో కూడా ప్రతీ ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఇదంతా అతని ఫిజికల్ ఫిట్నెస్, బౌలింగ్ సత్తాను బట్టి ఉంటుంది. జట్టు నిర్దేశించిన ప్రమాణాలను శ్రీశాంత్ అందుకోవాల్సి ఉంటుంది’ అని యోహానన్ చెప్పాడు. కోవిడ్–19 కారణంగా ఎప్పటినుంచి క్రికెట్ మళ్లీ మొదలవుతుందో, రంజీ మ్యాచ్లు ఎప్పటినుంచో జరుగుతాయో ఎవరికీ తెలీదని... అయితే సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం శ్రీశాంత్కు ఉంది కాబట్టి అతను తన ఆటపై దృష్టి పెట్టవచ్చని టిను సూచించాడు. నేపథ్యమిదీ... భారత్ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. మరో సారి క్రికెట్ ఆడేందుకు తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్న శ్రీశాంత్... కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సన్నిహితులు, కేరళ క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలిపాడు. -
‘రామాయణ్’ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్ ఇండియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ‘రామాయణ్ ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్ ఛానల్లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది. -
కొత్త కొత్తగా ఉంటుంది!
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చీ రాగానే హోబర్ట్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో గాయంతో వెనుదిరిగినా... ఫెడ్ కప్లో భారత జట్టు రన్నరప్గా నిలువడంతో, తొలిసారి ప్రపంచగ్రూప్నకు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించింది. సర్క్యూట్లో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్–19 కారణంగా టెన్నిస్ ఆగిపోయింది. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సానియా చెప్పింది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనాలనుకున్న తన ఆశలకు ఇది ఇబ్బందేనని వ్యాఖ్యానించింది. ‘నేను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్లో ఆడేందుకు. నాలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించాను. ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ నాకు ప్రతికూలమే. అప్పటికి నా వయసు మరో ఏడాది పెరుగుతుంది. 2021 అంటే ఇంకా చాలా దూరం ఉంది. అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుంది. దానికి సమయం పట్టడం సహజం. టోర్నీలు, ఇందులో గెలుపోటములు ఉంటాయి. నేను ఆ స్థాయిలో ఆడేందుకు సిద్ధమై వచ్చాను. కానీ ఇప్పుడు అంతా మారిపోతుంది. ఆటలో లయ తప్పుతుంది. మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతా బాగైతే మళ్లీ ఆడతాను కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది’ అని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై ఆట ఇలా ఉండదు... కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనా ఇకపై అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని మాజీ వరల్డ్ నంబర్వన్ డబుల్స్ ప్లేయర్ వ్యాఖ్యానించింది. ‘కచ్చితంగా అంతా మారిపోతుంది. ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేను కానీ సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయం. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడతారేమో. ఇప్పటికే చాలా మారిపోతోంది. ఎందరినో కలుస్తాం కానీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేం. క్రీడలు కూడా చాలా మారిపోతాయి. ఎన్నో రకాల కొత్త ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు ఉన్నట్లుగా మాత్రం ఆటలు కనిపించవనేది ఖాయం’ అని సానియా వివరించింది. ఏ దేశంలో ఆడగలం... కరోనా కారణంగా ఇతర క్రీడలతో పోలిస్తే టెన్నిస్కు ఎక్కువ నష్టం జరుగుతోందని సానియా పేర్కొంది. మహమ్మారి తగ్గినా ఇప్పట్లో కోలుకోవడం అంత సులువు కాదని ఆమె చెప్పింది. ‘టెన్నిస్ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఆడుతున్నారు. ఏ ఒక్క చోట అయినా కరోనా ఇంకా తగ్గలేదంటే దాని ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. మరో దేశానికి ప్రయాణం చేయలేకపోతే టోర్నీలు ఎలా జరుగుతాయి. ఇదే టెన్నిస్కు ప్రధాన సమస్య. రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్లో ఇది ఉండదు. భారత్లో, పక్కనే ఉన్న శ్రీలంకలో కరోనా ప్రభావం తగ్గిందంటే ఈ రెండు దేశాల మధ్య సిరీస్ నిర్వహించుకోవచ్చు. కానీ టెన్నిస్లో అది సాధ్యం కాదు. ఏదో మంత్రం వేసినట్లు కరోనా ఒక్కసారిగా అదృశ్యమైపోతే తప్ప రాబోయే కొన్ని నెలల్లో ఆటలు జరిగే అవకాశం లేదు’ అని ఈ హైదరాబాదీ విశ్లేషించింది. ప్రేక్షకులు లేకున్నా ఓకే... తాము ఆట ఆడేది ప్రేక్షకుల కోసమేనని, మైదానంలో వారు ఉత్సాహపరుస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పిన సానియా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆట జరిగితే చాలని కోరుకుంటోంది. ‘ఇంతకంటే ఏమీ చేయలేని పరిస్థితి మాది. వేరే ప్రత్యామ్నాయం లేదు కదా. టెన్నిస్ ఆడకుండా ఎలాగూ ఉండలేం. ప్రేక్షకులు లేకుండా టోర్నీలు ఆడటంలో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్య లేదు. రెండేళ్ల తర్వాత ఆటలో తిరిగి వచ్చేందుకు ఎంతో శ్రమించాను. బాబు కు జన్మనిచ్చిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆట అర్ధాంతరంగా ఆగిపోయింది. కాబట్టి మళ్లీ టెన్నిస్ ఆడేందుకు నేను దేనికైనా సిద్ధమే. అయితే నా సమస్య ప్రయాణాలతోనే. ఎక్కడికి వెళ్లగలం, ఎలా సిద్ధం కాగలం. కాబట్టి ఇది చెప్పినంత సులువేమీ కాదు’ అని మీర్జా అభిప్రాయ పడింది. లాక్డౌన్తో అందరికీ కఠిన పరిస్థితి ఎదురైంది. అదృష్టవశాత్తూ నాకు అన్నీ ఉన్నాయి. తిండి, ఇల్లులేనివారి గురించి ఆలోచించాలి. కరోనా చాలా మంది జీవన విధానాన్ని మార్చింది. మనలో మళ్లీ మానవత్వం మేల్కొలిపేలా చేసింది. నేను చేసేదాని గురించి చెప్పుకోవడం నాకిష్టం లేదు. గత నెల రోజుల్లో సుమారు రూ. రెండున్నర కోట్లు సేకరించి లక్షలాది మందికి మేము భోజనాలు అందించాం. అయితే ఎంత చేసినా ఇది తక్కువే అవుతుందని నాకు తెలుసు. టెన్నిస్పరంగా చూస్తే సోమ్దేవ్ నేతృత్వంలో మా జూనియర్లకు సహాయం అందించే ప్రయత్నంలో ఉన్నాం. జర్మనీలో చిక్కుకుపోయిన యువ ఆటగాడు సుమీత్ నాగల్ దగ్గర డబ్బులు లేవు. వేర్వేరు మార్గాల ద్వారా అతడిని ఆదుకుంటున్నాం. కుటుంబ విషయానికి వస్తే మా అబ్బాయి ఇజ్హాన్ను టెన్నిస్ కోర్టులోకి తీసుకెళ్లడం మినహా ఏమీ చేయలేకపోతున్నాం. 17 నెలల బాబుకు నేను బయటకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కాదు కదా. -
లక్ష్మీమీనన్ రీఎంట్రీ షురూ?
లక్ష్మీమీనన్ రీఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. కుంకీ చిత్రంతో కోలీవుడ్కు పరచయమైన కేరళా కుట్టి లక్ష్మీమీనన్. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంది. కుట్టిపులి, పాండినాడు, కొంబన్ నాన్ సిగప్పు మణిదన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతేకాదు పక్కింటిఅమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న లక్ష్మీమీనన్ నటిగా మంచి ఫామ్లో ఉండగా చదువు, పరీక్షలు అంటూ నటనకు గ్యాప్ ఇచ్చింది. ఇది తన కెరీర్లో చేసిన పెద్ద పొరపాటు అని చెప్పక తప్పుదు. ఆ తరువాత ప్లస్టూ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాను. మళ్లీ నటిస్తాను అని చెప్పినా అవకాశాలు ముఖం చాటేశాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: నిఖిల్ వివాహం రద్దయ్యే ఛాన్స్ ఆ తరువాత విజయ్సేతుపతికి జంటగా రెక్క అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశపరచడంతో పాటు, అందులో అమ్మడు బాగా లావెక్కిందనే విమర్శలను మూటగట్టుకుంది. జయంరవితో మిరుదన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం 2016లో విడుదలైంది. అంతే ఆ తరువాత అక్ష్మీమీనన్ను తమిళ తెరపై చూడలేదు. కాగా ఆ మధ్య ప్రభుదేవాతో యంగ్ మంగ్ సంగ్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందనేది తెలియలేదు. కాగా చాలాకాలానికి అంటూ నాలుగేళ్ల తరువాత తాజాగా లక్ష్మీమీనన్ ఒక అవకాశాన్ని అందుకుంది. ఆమెకు కుట్టిపులి, కొంబన్ చిత్రాలతో సక్సెస్ను అందించిన దర్శకుడు ముత్తయ్యనే ఇప్పుడు రీఎంట్రీ కల్పిస్తున్నారు. ఈ దర్శకుడు తాజాగా నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా చిత్రం చేయనున్నారు. అందులో నటి లక్ష్మీమీనన్ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా దర్శకుడు ముత్తయ్య ఇంతకుముందు గౌతమ్ కార్తీక్ హీరోగా దేవరాట్టం చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా గౌతమ్మీనన్, లక్ష్మీమీనన్ జంటగా ఇంతకుముందు సిపాయ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదన్నది గమనార్హం. అన్నట్టు ఆ మధ్య బొద్దుగా బరువెక్కిన నటి లక్ష్మీమీనన్ ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది. చదవండి: 'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ' -
'పాండ్యా తొందరపడకు.. సమయం చాలా ఉంది'
ముంబై : గత కొంతకాలంగా వెన్నునొప్పితో సతమతమవుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన పాండ్యా గాయం నుంచి కోలుకొని నెల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.న్యూజిలాండ్-ఎ జట్టుకు హార్దిక్ను మొదట ఎంపిక చేసినా ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలవడంతో జట్టు నుంచి అతని పేరును తొలగించారు. ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో హార్దిక్ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ హార్దిక్ పాండ్యాకు ఒక సలహా సూచించాడు. 'ఐపీఎల్కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా నువ్వు 120 శాతం ఫిట్నెస్తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఎంతో అసహనంతో ఉంటాం. కానీ.. ఓపికతో ఉంటేనే తిరిగి కోలుకోగలం. మన శరీరం మాట మనం వినాలి. అందుకే ఇప్పుడు నీకు ఓపిక అనేది చాలా అవసరం' అని జహీర్ పేర్కొన్నాడు. సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్తో పాటు వైద్య సిబ్బంది మాటను పాండ్యా వినాల్సిన అవసరం ఉందని జహీర్ పేర్కొన్నాడు. (ఇంకా కోలుకోని హార్దిక్ పాండ్యా) కాగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై జహీర్ స్పందించాడు.'న్యూజిలాండ్ను సొంతగడ్డపై టీ20 సిరీస్లో క్లీన్స్వీప్ చేసి భారత్ సత్తాచాటింది. టీమిండియా 5-0తో విజయం సాధించడం ఎంతో గొప్ప విషయం. ప్రస్తుతం కివీస్ క్లిష్ట సమయంలో ఉంది. భారత్ను ఎదుర్కోవడానికి వారు ఇతర మార్గాలు అన్వేషించాలి. బుధవారం నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ కూడా కివీస్కు సవాలుగా నిలవనుంది. టీమిండియా ఇదే జోరుని కొనసాగిస్తూ వన్డే, టెస్టు సిరీస్లను గెలచుకోవాలని కోరుకుంటున్నా. జట్టును గాయాలు వేధిస్తున్నా రిజర్వ్ బెంచ్ ఎంతో పటిష్ఠంగా ఉంది. ఈ విషయంలో జట్టు దిగులు చెందాల్సిన అవసరం లేదని' జహీర్ చెప్పుకొచ్చాడు.('వారి ఆటతీరు చిన్నపిల్లల కంటే దారుణం') -
భారత్లోకి శాన్సుయ్ బ్రాండ్ రీ–ఎంట్రీ..!
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన కన్సూమర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘శాన్సుయ్’ మళ్లీ భారత్లోకి ప్రవేశించనుంది. మొబైల్ హ్యాండ్సెట్స్ బ్రాండ్ ‘కార్బన్ మొబైల్స్’ మాతృసంస్థ జైనా గ్రూప్తో ఒప్పందం ద్వారా ఇక్కడ మార్కెట్లోకి రీ–ఎంట్రీ కానుంది. ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు.. పరిశోధన, అభివృద్ధి నిమిత్తం వచ్చే మూడేళ్లలో రూ. 1,000 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా బ్రాండ్ను మళ్లీ ప్రవేశపెట్టనున్నామని జైనా గ్రూప్ గురువారం ప్రకటించింది. ఈ మేరుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గతంలో ఈ బ్రాండ్ తయారీ, మార్కెటింగ్ హక్కులను వీడియోకాన్ ఇండస్ట్రీస్ కలిగి ఉంది. అయితే, ఈ కంపెనీ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్రాండ్ను జైనా గ్రూప్ చేపట్టింది. -
మళ్లీ తెలుగులో నటించాలని ఉంది
చార్మి అందరికీ తెలుసు. చార్మిలా తెలిసి ఉండకపోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీ జంటగా నటించిన ‘ప్రాణదాత’ (1992) సినిమా చూసినవారికి చార్మిలా తెలిసే ఉంటుంది. అందులో ఏయన్నార్, లక్ష్మీ కూతురిగా నటించిందామె. ఆ తర్వాత భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘అసాధ్యురాలు’లో నటించింది. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్గా నటించింది. ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులో కనిపించాలనుకుంటోంది. ‘‘అప్పట్లో తెలుగులో హీరోయిన్గా నటించాను. ఇప్పుడు తమిళ, మలయాళ భాషల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలు చేస్తున్నాను. అవకాశం వస్తే తెలుగులోనూ ఆ పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు చార్మిలా. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ నటించిన ‘నల్లదొరు కుటుంబం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. హీరోయిన్ కావాలన్నది తన కల. మలయాళ చిత్రం ‘ధనమ్’ ద్వారా ఆ కల నెరవేరింది. ప్రశాంత్ సరసన చేసిన ‘కిళక్కే వరుమ్ పాట్టు’ ద్వారా కథానాయికగా తమిళ్కి çపరిచయం అయ్యారు. తమిళంలో పది సినిమాలకుపైగా, మలయాళంలో 40 సినిమాలకు పైగా కథానాయికగా నటించారు. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న చార్మిలా బాబు పుట్టాక ఇంటిపట్టున ఉండాలనుకున్నారు. ‘‘మా అత్తగారితో నాకు సఖ్యత లేకుండాపోయింది. నా భర్తతో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. దాంతో విడిపోయాం. అయితే పిల్లలకు తల్లీదండ్రీ ఇద్దరూ ముఖ్యమే కాబట్టి నెలకోసారి ఆయన వచ్చి బాబుని చూసి వెళతారు. మేం ఫ్రెండ్లీగా ఉంటాం’’ అన్నారు చార్మిలా. సింగిల్ పేరెంట్గా కొడుకు బాధ్యతను మోస్తున్న చార్మిలాకి తల్లి, పెద్దమ్మ, బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీకి రీ–ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఆమె ‘కన్నిరాశి’, మలయాళంలో ‘కొచ్చిన్ షాదీ అట్ చెన్నై 03’, ప్రియపట్టవర్’.. ఇలా నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ‘‘అమ్మ, వదిన, అక్క పాత్రలంటే ఒక్కో సినిమాకి ఒకటీ రెండు రోజుల్లో షూటింగ్ చేసేస్తారు. నెలకి మహా అయితే ఓ పది రోజులు షూటింగ్ ఉంటుంది. అదే ఎక్కువ భాషల్లో చేస్తే ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా. అందుకే తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు చార్మిలా. -
మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!
దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్ సైకిల్ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్ బ్రాండ్ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్ లాంబ్రెటాను డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్ లాంబ్రెటా డిజైనింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎక్స్పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మిలన్లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) భారత్లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్ను విజయ్ సూపర్ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్ఐఎల్ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్ ఇండియాతో ట్రేడ్మార్క్ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది. లోహియా ఆటోతో జట్టు.. భారత్లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్వ్యాగన్ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం మార్కెట్.. విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్ డిజైన్లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి. ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్ బ్రాండ్గా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. అయితే, వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!! -
డైరెక్షన్ చేయాలనుంది
‘ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు’ వంటి చిత్రాలతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించారు లైలా. 2006లో వ్యాపారవేత్త మెహ్దిన్ని వివాహం చేసుకొని సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారామె. అయితే, పన్నిండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారట లైలా. సినిమాల్లో కమ్బ్యాక్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘దక్షిణ రాష్ట్రాల నుంచి మళ్లీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, మంచి రోల్తో కమ్బ్యాక్ చేయాలని ఎదురుచూస్తున్నాను. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే ఇంకా సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఎలాంటి క్యారెక్టర్తో లైలా తిరిగొస్తారో వేచి చూడాలి. -
వన్డేల్లోనూ తిరిగొస్తా
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ సురేశ్ రైనాకు పునరాగమనంలాంటిది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఈ సిరీస్లో 15, 31, 43 పరుగులు చేశాడు. చివరి టి20లో బౌలింగ్లో కూడా రాణించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో ఇదే జోరు కొనసాగించి వన్డే జట్టులోకి కూడా తిరిగొస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. రైనా భారత్ తరఫున 2015 అక్టోబరులో ఆఖరిసారిగా వన్డే ఆడాడు. ‘తిరిగి జట్టులోకి రావడం నాకు కీలక మలుపులాంటింది. ఇప్పుడు గెలిచిన జట్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మూడో స్థానంలో నాకు అవకాశమిచ్చి దూకుడుగా ఆడమంటూ కోహ్లి నాపై నమ్మకముంచడం వల్లే ఇది సాధ్యమైంది. మున్ముందు శ్రీలంకతో టోర్నీతో పాటు ఐపీఎల్లో కూడా పెద్ద సంఖ్యలో మ్యాచ్లకు అవకాశం ఉంది. గత రెండేళ్లుగా చాలా కష్టపడ్డాను. భారత్కు మళ్లీ ఆడాలనే పట్టుదలతో మైదానంలో, జిమ్లో కూడా తీవ్రంగా శ్రమించాను. వన్డేల్లో నేను గతంలో ఐదో స్థానంలో రాణించాను. రాబోయే మరికొన్ని మ్యాచ్లలో బాగా ఆడితే చాలు వన్డేల్లో కూడా తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’ అని రైనా చెప్పాడు. -
మార్కెట్లోకి మళ్లీ స్పైస్ మొబైల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ స్పైస్ భారత మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. 8 కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో మూడు స్మార్ట్ఫోన్లు కాగా మిగిలినవి ఫీచర్ ఫోన్లు. మొబైల్స్పై ఏడాదిపాటు రీప్లేస్మెంట్ వారంటీ ఆఫర్ చేస్తోంది. ధరల శ్రేణి రూ.1,180 నుంచి రూ.9,500 వరకు ఉంది. సులభంగా వినియోగించే వీలున్న ఫీచర్లతో వీటిని రూపొందించినట్టు స్పైస్ డివైసెస్ సీఈవో సుధీర్ కుమార్ తెలిపారు. చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ ట్రాన్సన్ హోల్డింగ్స్, భారత్కు చెందిన స్పైస్ మొబిలిటీ ఈ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాయి. టెక్నో, ఐటెల్, ఇన్ఫినిక్స్ బ్రాండ్లతో 58 దేశాల్లో మొబిలిటీ ఉత్పత్తులను ట్రాన్సన్ గ్రూప్ విక్రయిస్తోంది. భారత్లో ప్రస్తుతం థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో మొబైల్స్ను తయారు చేస్తారు. అమ్మకాలు నిర్దేశిత స్థాయికి చేరిన తర్వాత సొంతంగా ప్లాంటును నెలకొల్పుతామని స్పైస్ మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దిలీప్ మోది వెల్లడించారు. -
గ్రాసరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్ రీ–ఎంట్రీ
కంపెనీ మార్కెట్ప్లేస్ హెడ్ అనిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో గ్రాసరీ విభాగంలోకి ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. బెంగళూరు, హైదరాబాద్తోపాటు పలు నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సేవలను పరీక్షిస్తోంది. ఆగస్టులో ఈ సేవలను ఆవిష్కరించే చాన్స్ ఉంది. గ్రాసరీ కోసం ప్రత్యేకంగా నియర్బై పేరుతో ఫ్లిప్కార్ట్ 2015 అక్టోబరులో యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, సౌందర్య సాధనాలను సూపర్ మార్కెట్ల నుంచి సేకరించి కస్టమర్లకు డెలివరీ చేసేది. వినియోగదార్ల నుంచి స్పందన అంతంతే ఉండటంతో కొన్ని నెలల్లోనే నియర్బై యాప్కు స్వస్తి పలికింది. రూ.3,900 కోట్ల ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ విపణిలో పోటీ కంపెనీ గతేడాది అమెజాన్ నౌ పేరుతో ప్రవేశించింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సైతం తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. కొన్ని నెలల్లోనే ఈ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్కార్ట్ మార్కెట్ప్లేస్ హెడ్ అనిల్ గోటేటి మంగళవారమిక్కడ తెలిపారు. కంపెనీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రాసరీ రంగంలో విభిన్న తరహాలో సేవలు అందించేందుకు సిద్ధం అవుతున్నట్టు చెప్పారు. ధరలు తగ్గుతాయి..: జీఎస్టీ రాకతో రానున్న రోజుల్లో రవాణా ఖర్చులతోపాటు ఉత్పత్తుల అంతిమ ధర కూడా తగ్గుతుందని అనిల్ వెల్లడించారు. జీఎస్టీ పూర్తి స్థాయిలో అమలైతే ఇది సాధ్యమని అన్నారు. నూతన పన్ను విధానంపై విక్రేతలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జూలై 1 తర్వాత అమ్మకాలు తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్ కస్టమర్ల సంఖ్య 10 కోట్లపైనే. దీనిని 50 కోట్ల స్థాయికి చేర్చేందుకు అంతర్గతంగా లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 28 లక్షల మంది వినియోగదార్లు ఉన్నట్టు చెప్పారు. కంపెనీ అమ్మకాల పరంగా టాప్–6 నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. -
కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు
తమిళసినిమా: చిత్ర రంగానికి చెందిన వారి ప్రేమ వివాహాలు చిరకాలం కొనసాగుతాయన్నది అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో ఆదర్శ దంపతులుగా ఆనంద జీవితాన్ని గడుపుతున్న జంట సూర్య, జ్యోతిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక తరంలో సూపర్స్టార్ రజనీకాంత్, కమలహాసన్ల నుంచి శింబు, ధనుష్ల వరకూ జత కట్టి ప్రముఖ కథానాయకిగా రాణించిన జ్యోతిక అత్యధిక చిత్రాల్లో జత కట్టింది మాత్రం నటుడు సూర్యతోనే. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యాన్ని, ఆ తరువాత ప్రేమను, ఆపై పెళ్లికి దారి తీసింది. సూర్య, జ్యోతికలకు ఇప్పుడు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. అలా అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న జ్యోతిక సుదీర్ఘ విరామం తరువాత 36 వయదినిలే చిత్రం ద్వారా నటిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రేక్షకామోదం పొందడంతో తాజాగా మగళీర్ మట్టుం చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాలు అటుంచితే సూర్య లాంటి మంచి లక్షణాలున్న మగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని జ్యోతిక ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయనకు తానింత వరకూ ఒక కప్పు కాఫీ కూడా కలిపివ్వలేదన్నారు. పలాన పని చేయమని సూర్య తనకు చెప్పింది లేదని అన్నారు. సూర్యలో సగం మంచి గుణాలు తన కొడుకు దేవ్కు అబ్బినా చాలని జ్యోతిక పేర్కొన్నారు. ఇక సూర్య కూడా జ్యో తనకు భార్యగా లభించడం తన అదృష్టం అని చాలా సార్లు బహిరంగంగానే చెప్పారన్నది గమనార్హం. -
నటనపై ఆకలిగా ఉన్నా!
తమిళసినిమా: నటనపై ఆకలిగా ఉన్నానని, ఎలాంటి పాత్రయినా చేడానికి రెడీ అని అంటోంది నటి పద్మప్రియ. పెళ్లి తరువాత రీఎంట్రీ అయిన నటి జ్యోతిక, అమలాపాల్, మంజువారియర్ వంటి నటీమణులు కథానాయికలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో నాయకిగా రాణించిన నటి పద్మప్రియ కెరీర్లో తవమాయ్ తవమిరిందు, మృగం, పట్టియల్ వంటి సక్సెస్ఫుల్ తమిళ చిత్రాలు ఉన్నాయి. 2014లో జాస్మిన్షా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. అప్పట్లో గ్లామర్ తన వంటికి నప్పదు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఈ అమ్మడికి తాజాగా మళ్లీ నటనపై ఆశ పుట్టిందట. అంతే కాదు ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అని అంటోంది. ప్రస్తుతం పటేల్సర్ అనే తెలుగు చిత్రంలో జగపతిబాబుతో కలిసి నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.ఆయనకు జంటగా 15 ఏళ్ల క్రితమే నటించే అవకాశం వచ్చిందని, అప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని, మళ్లీ ఇప్పుడు అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఇకపై నటనపై దృష్టిసారించి ఎక్కువ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పద్మప్రియ చెప్పింది. -
మార్చికల్లా భారత్లో నోకియా స్మార్ట్ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం నోకియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. నోకియా–6 పేరుతో కంపెనీ తొలి ఆన్డ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను హెచ్ఎండీ గ్లోబల్ చైనాలో ఆవిష్కరించింది. ధర రూ.16,739 ఉంది. భారత్లో మార్చికల్లా అడుగు పెట్టనుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.2.5డీ గొరిల్లా గ్లాస్తో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ పొందుపరిచారు. ఎండ వెలుతురులోనూ స్క్రీన్ను చక్కగా చూడొచ్చు. మెటల్ బాడీతో రూపొం దించారు. ఆన్డ్రాయిడ్ నౌగట్ ఓఎస్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ డ్యూయల్ టోన్ ఫ్లాష్తో 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా,డాల్బీ అట్మోస్ టెక్నాలజీ డ్యూయల్ యాంప్లిఫయర్స్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. మైక్రోసాఫ్ట్ నుంచి నోకియా బ్రాండ్ లైసెన్సింగ్ హక్కులను ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండీ గ్లోబల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నోకియా ఫోన్లనుఫాక్స్కాన్ తయారు చేయనుంది. -
ధోనితో రీఎంట్రీ
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమికా చావ్లా తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ క్యారెక్టర్స్తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతమైన చిత్రాల్లోనటించిన భూమిక బాలీవుడ్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. విజయవంతమైన భారత క్రికెట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో భూమిక మరోసారి వెండితెరమీద దర్శనమివ్వనుంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాలో భూమిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. బాలీవుడ్లో తేరేనామ్, గాంధీ మై ఫాదర్, రన్ లాంటి సినిమాల్లో నటించిన భూమిక నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ప్రస్తుతానికి బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నభూమిక సరైన క్యారెక్టర్ దొరికితే సౌత్లో కూడా ఎంట్రీకి రెడీ అంటోంది. -
పోలీస్ గెటప్లో రీఎంట్రీ
సౌత్లో టాప్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్, కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయాత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆమె వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవల జివి ప్రకాష్ హీరోగా నటించిన 'త్రిష లేదా నయనతార' సినిమాలో అతిథి పాత్రలో నటించిన సిమ్రాన్ మళ్లీ తన రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. గతంలో చేసినట్టుగా గ్లామర్ రోల్స్లో కాకుండా, ఈ సారి ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతుంది సిమ్రాన్. సొంత నిర్మాణ సంస్థ ద్వారా తన భర్త దీపక్ నిర్మిస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన మర్థాని తరహా కథా కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌరీ శంకర్ అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభించనున్నారు. -
జెనీలియా రీఎంట్రీ
తమిళసినిమా : కొందరు తారామణులు వివాహానంతరం నటనను కొనసాగిస్తుంటే మరి కొందరు పెళ్లి తరువాత నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి ఒకరిద్దరు పిల్లల్లి కన్నతర్వాత రీఎంట్రీ అవుతుంటారు. నటి జెనీలియా రెండవ కోవకు చెందిన హీరోయిన్ల జాబితాలో చేరుతున్నారు.ఈ బ్యూటీకి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తమిళ, తెలుగు, హిందీ తదితర భాషలలో హీరోయిన్గా నటించి తనకంటూ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళంలో విజయ్, ధనుష్, జయం రవి, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో నటించారు. బాయ్స్, సంతోష్ సుబ్రమణియన్, వేలాయుధం తదితర చిత్రాలు జెనీలియాకు పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ బొమ్మరిల్లు, రెడీ లాంటి పలు చిత్రాలు ఈ ఉత్తరాది భామ కేరీర్ ఎదుగుదలకు దోహదం చేశాయి. నటిగా మంచి స్ప్రింగ్లో ఉండగానే హిందీ నటుడు రితేష్ దేశ్ ముఖ్ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం రితేష్ దేశ్ ముఖ్కు ఇష్టం లేకపోవడంతో జెనీలియా నటనకు దూరంగా ఉన్నారు. మగబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. ఆల్రెడీ రెండు కమర్శియల్ ప్రకటనల్లో నటించిన జెనీలియా ఇప్పుడు ఒక హిందీ చిత్రానికి సైన్ చేశారని సమాచారం. మూడేళ్ల తరువాత షూటింగ్లో పాల్గోనడం సంతోషంగా ఉందని జెనీలియా ట్విట్టర్లో పేర్కొన్నారు. భర్త ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.