Running
-
ట్యాంక్ బండ్ వేదికగా : చీర కట్టి..పరుగు పెట్టి.. (ఫోటోలు)
-
హైదరాబాద్లో తనైరా శారీ రన్.. అందంగా ముస్తాబైన మహిళలు (ఫోటోలు)
-
పుట్టిన రోజే కబళించిన మృత్యువు
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది. పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్కుమార్ గురువారం హాజరయ్యాడు. మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్లో విమ్స్కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 8 నెలల క్రితం తండ్రి మృతి శ్రావణ్కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. -
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో
సూపర్ స్టార్ 'రజనీ కాంత్' రోబో సినిమా వచ్చిన తరువాత.. బహుశా రోబోలు ఇలాగే ఉంటాయేమో అని చాలామంది భావించారు. అయితే ఇటీవల టెస్లా రూపొందించిన నడిచే రోబోకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు చైనా కంపెనీ ఏకంగా పరుగెత్తే రోబోను తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.చైనీస్ కంపెనీ ‘రోబో ఎరా’ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘స్టార్1’ పేరుతో రూపొందించిన ఈ రోబో శరవేగంగా పరుగులు తీయగలదు. ఇది గంటకు 8 మైళ్లు (12.98 కి.మీ.) వేగంతో పరుగెడుతోంది. ఈ రోబోకు హైటార్క్ మోటార్లు, ఏఐ సెన్సార్లు అమర్చడం వల్ల.. ఇది ఎలాంటి ఎగుడు దిగుడు దారుల్లోనైనా అదే వేగంతో పరుగెతూనే దాటేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు‘రోబో ఎరా’ చూడటానికి సగటు మనిషి పరిమాణంలోనే 5.6 అడుగుల ఎత్తు, 64.86 కేజీల బరువుతో ఉంటుంది. ఇలాంటి పరుగుల రోబోలను ‘టెస్లా’ కంపెనీ ‘ఆప్టిమస్’ పేరుతోను, ‘బోస్టన్ డైనమిక్స్’ కంపెనీ ‘అట్లాస్’ పేరుతోను రూపొందించాయి. అయితే, ‘రోబో ఎరా’ తాజాగా రూపొందించిన ‘స్టార్ 1’ వాటి కంటే వేగంగా పరుగులు తీయగలగడంతో, అత్యంత వేగవంతమైన రోబోగా రికార్డు సాధించింది. -
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్పై ఇంట్రెస్ట్తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు -
ఆ గుర్రం పరుగు గంటకు 100 కి.మీ.. రోజూ నెయ్యితో మాలిష్
సోన్ పూర్ : బీహార్లో సోన్పూర్ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ జంతు మేళాకు పలు ప్రత్యేకతలు కలిగిన జంతువులను వాటి యజమానులు తీసుకువచ్చారు. వాటిలో ఒకటి అనంత్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్కు చెందిన గుర్రం. దీని పేరు డార్లింగ్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెడుతుంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే దీని ధర వింటే ఒకపట్టాన ఎవరూ నమ్మలేరు.గుర్రపు యజమాని రుడాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గుర్రం ఏకే 56 సింధీ జాతికి చెందినదనని తెలిపారు. ఇది యజమాని దగ్గర ఎంతో విధేయంగా మెలుగుతుందన్నారు. ఈ జాతికి చెందిన గుర్రాల సగటు ఎత్తు 64 అంగుళాలు. అయితే ‘డార్లింగ్’ ఎత్తు 66 అంగుళాలు. సాధారణ గుర్రాల నిర్వహణకు ప్రతినెలా రూ. 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రత్యేక గుర్రం సంరక్షణకు ప్రతినెలా రూ.35 వేలు ఖర్చవుతుంది.ఈ గుర్రాన్ని సంరక్షణలో దాని యజమాని రుడాల్ యాదవ్ ప్రత్యేక మెళకువలను అవలంబిస్తుంటాడు. ఈ గుర్రానికి ప్రతీరోజు ప్రత్యేకమైన నెయ్యితో మాలిష్ చేస్తుంటాడు. ఈ గుర్రం వేగం విషయానికి వస్తే రికార్డులు తీరగరాయాల్సిందే. ఈ గుర్రానికి ఏడాది వయస్సు నుంచే పరుగులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రుడాల్ యాదవ్ తెలిపారు. ఈ గుర్రం సాధారణంగా గంటకు 45 కి.మీ వేగంతో పరిగెడుతుంది. అయితే దీని పూర్తి వేగం గంటకు 100 కి.మీ.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సింధీ జాతి గుర్రాలు ఓర్పు, చురుకుదనానికి ప్రసిద్ధి చెందాయి. గుర్రపు ప్రేమికులు ఈ జాతి గుర్రాలను అమితంగా ఇష్టపడుతుంటారు. దీని ధర విషయానికొస్తే గుర్రం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏకే 56’ ధర సుమారు రూ.1.11 కోట్లు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్షిప్లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
Kargil Vijay Diwas: 4 రోజులు.. 160 కి.మీ.లు
ముంబై: కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ మాజీ అధికారిణి సాహసోపేతమైన ఫీట్ చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ వర్షారాయ్ 4 రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. రన్ జూలై 19న ప్రారంభమై జూలై 22న ముగిసింది. శ్రీనగర్ నుండి ద్రాస్ సెక్టార్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ఆమె సగటున రోజుకు 40 కి.మీ. పరుగెత్తారు. పరుగు పూర్తయిన సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అరి్పంచారు. ఆమెతో పాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ వర్షా రాయ్ భర్త కశ్మీర్లో ఆర్మీ అధికారిగా ఉన్నారు. -
పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో కుప్పకూలి.. యువకుడు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. పుణెలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్లో కుప్పకూలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని 27 ఏళ్ల తుషార్ బాబన్గా గుర్తించారు.శివాజీనగర్ ఏరియాలోని పోలీస్ గ్రౌండ్లో శనివారం పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఫిజికల్ టెస్ట్లలో భాగమైన పరుగు పందెంలో పరుగెత్తుతూ అహ్మద్ నగర్లోని సంగమ్నేర్కు చెందిన తుషార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తేలిందని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్లో జరిగిన పారా ఒలింపిక్లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్పూర్లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
గుడ్లగూబ పరుగులు చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవేంలేదు. తాజాగా గుడ్లగూబకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో గుడ్లగూబ పరిగెత్తడాన్ని చూడవచ్చు. నేటి రోజుల్లో గుడ్లగూబను చూడటమే అంత్యంత అరుదు. ఎప్పుడైనా కనిపించినా అది చెట్టుపైనే కనిపిస్తుంది. అయితే ఒక గుడ్లగూబ నేలపై పరిగెత్తడాన్ని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇంటిలోపల గుడ్లగూబ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గుడ్లగూబను చూసిన తర్వాత అది ఆ ఇంటిలోని వారి పెంపుడు జంతువు అని అనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా చాలామంది జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఇష్టపడతారు. ఈ వీడియోను అమేజింగ్ నేజర్ అనే పేరుగల ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ ‘ఇది అద్భుతమైన వీడియో’ అని రాయగా, మరొకరు ‘నేను మొదటిసారిగా గుడ్లగూబ నడవటాన్ని చూస్తున్నాను’ అని రాశారు. ఇది కూడా చదవండి: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? Have you ever seen a owl run ? pic.twitter.com/roSdhAUSyX — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 30, 2023 -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
Asian Games 2023: భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్ (ముహమ్మద్ అనాస్ యహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్) 4X400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్లో 70 పతకాలు) అధిగమించిన భారత్.. నీరజ్, ఫురుషుల రిలే టీమ్ స్వర్ణాలతో ఏషియన్ గేమ్స్ ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్ స్వర్ణాల విషయంలో ఆల్టైమ్ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి. -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. మరో 2 స్వర్ణాలు
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాశ్ సాబ్లే.. షాట్పుట్లో తజిందర్పాల్ సింగ్ తూర్ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్తో ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్, 16 సిల్వర్, 16 బ్రాంజ్) చేరింది. 13th Gold Medal for India 🇮🇳 in Asian Games. - Tajinderpal Singh Toor is a hero.pic.twitter.com/dIfl9NN0DB — Johns. (@CricCrazyJohns) October 1, 2023 పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్, 71 సిల్వర్, 38 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్ 110 మెడల్స్తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి. Avinash Sable - the hero of India today in Asian Games!A Gold Medal in record time in 3000m Steeplechase.pic.twitter.com/EpLjVD83YF— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2023 రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే.. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకం. నాలుగో షాట్పుటర్.. షాట్పుట్లో స్వర్ణంతో మెరిసిన తజిందర్ పాల్ సింగ్ తూర్ వరుసగా రెండో ఏషియన్ గేమ్స్లో (2018, 2023) గోల్డ్ మెడల్స్ సాధించిన నాలుగో షాట్పుటర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగిందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982) ఈ ఘనత సాధించారు. ప్రస్తుత క్రీడల్లో తూర్ సాధించిన పతకం భారత్కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో స్వర్ణ పతకం సాధించాడు. -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
చీరకట్టులో మారథాన్.. 80 ఏళ్లయినా తగ్గేదే లే.. బామ్మ వీడియో వైరల్
ముంబై: పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించవచ్చని మరోమారు నిరూపించారు మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ బామ్మ. 80 ఏళ్ల వయసులో మారథాన్లో పాల్గొన్నారు. స్నీకర్స్ ధరించి చీరకట్టులో పరుగులు తీశారు. చేతిలో జాతీయ జెండా కూడా పట్టుకున్నారు. 51 నిమిషాల్లో 4.2కిలోమీటర్లు పరుగెత్తి శభాష్ అనిపించుకున్నారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 55,000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 80 ఎళ్ల బామ్మ కూడా ఇందులో భాగమయ్యారు. ఆమె మనవరాలు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. दुनिया में कोई काम असंभव नहीं, बस हौसला और मेहनत की जरूरत है।#thursdayvibes #ThursdayMotivation #marathon #mumbai #grandmother pic.twitter.com/dDzvGxmFG9 — Dr. Vivek Bindra (@DrVivekBindra) January 19, 2023 ఈ బామ్మ చాలా మందికి స్ఫూర్తి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని ఈమె నిరూపించారు. అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. కాగా.. ఈ మారథాన్లో పాల్గొనడం తనకు ఇది ఐదోసారి అని బామ్మ తెలిపారు. తాను భారతీయురాలినని సగర్వంగా చెప్పేందుకే చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్లు వివరించారు. చదవండి: పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన -
పరుగులోనే ఆగిన ప్రాణం
సూర్యాపేట: ఎస్ఐ కొలువుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడి కల నెరవేరకుండానే ఊపిరి ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (24) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి నిర్వహించే శారీరక, దేహ దారుఢ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం పరుగు సాధన చేస్తున్నాడు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం పరుగు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్కం దాబా హోటల్లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
కుక్క నోట్లో మనిషి తల.. అక్కడంతే!
చిమ్మ చీకట్లో.. మనిషి తల నోట కర్చుకుని రోడ్ల వెంట పరిగెడుతున్న ఓ కుక్క. సడన్గా ఆ దృశ్యం చూసిన ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. అయితే ఆ వీడియోనే ట్విట్టర్ ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. చివరికి.. రంగంలోకి దిగిన పోలీసులు దాని వెంటపడ్డారు. ఓ పోలీస్ అధికారి బలవంతంగా దాని నోటి నుంచి ఆ తలను బయటకు తీశాడు. అయితే.. ఆ వీడియో ఎక్కడిది అనే విషయంపై ఇప్పుడొక స్పష్టత వచ్చింది. మెక్సికో దేశంలోని జకాటెకాస్ స్టేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత బుధవారం ఈ ఘటన జరిగిందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. క్రైమ్ సీన్ నుంచి తల తీసుకుని ఆ వీధి కుక్క పరిగెత్తిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోంటే ఎస్కోబెడో టౌన్లోని ఓ బూత్లో ఆ తలను దుండగులు ఉంచినట్లు నిర్ధారించారు. అంతేకాదు.. అక్కడ ‘తర్వాతి తల నీదే’ అనే హెచ్చరికను సైతం గుర్తించారు. అయితే.. ఇలాంటి వ్యవహారాలను అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కారణం.. అది అక్కడ సర్వసాధారణం కాబట్టి. కార్టెల్ జలిస్కో న్యుయెవ జెనెరసియాన్.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్స్ ముఠాలకు అడ్డా. సినాలోవా, జలిస్కో డ్రగ్ కార్టెల్స్ అక్కడ అత్యంత శక్తివంతమైన గ్యాంగ్లను నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలోనే సదరు మొండెం లేని తల పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా.. కిందటి నెలలో గుర్రెరో స్టేట్లో రెండు ముఠాలు.. భారీ ఎత్తున హింసకు పాల్పడ్డాయి. ఈ ముఠా కక్షలో పద్దెనిమిది మంది మృతి చెందగా.. అందులో ఓ మేయర్, మాజీ మేయర్ కూడా ఉన్నారు. warning: some viewers may find the following video disturbing Dog running down the street with a human head. #dogs #head #mexico #running #crazyvideos #wtfvideos #lookatthis💩 #huemongrind pic.twitter.com/vob1vUAfKM — the HUEMON GRIND (@SuperHuemon) October 28, 2022 -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్షిప్లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
ట్రెండ్ సెట్ చేశాడు.. భారత ఆర్మీ జాబ్ కోసం పెద్ద సాహసం
సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యంలో చేరాలన్నది అతని కల. ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అధికారులు మాత్రం రిక్రూట్మెంట్ జరపకపోవడంతో ఓ యువకుడు పెద్ద సాహాసం చేశాడు. ఏకంగా 350 కిలోమీటర్లు పరుగెత్తి సోషల్ మీడియాలో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, కోవిడ్ కారణంగా సుమారు 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వందలాది మంది యువకులు జంతర్ మంతర్లో నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాజస్థాన్కు చెందిన సురేశ్ భిచార్(24).. రాజస్థాన్ నుంచి పరుగెత్తుకుంటూ ఢిల్లీ చేరుకున్నాడు. దాదాపు 350 కి.మీ పరుగెత్తి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని 50 గంటల్లో 350 కి.మీ పరుగెత్తాడు. అనంతరం నిరసనల్లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సురేశ్ మాట్లాడుతూ.. ‘‘మార్చి 29న పరుగు యాత్రను ప్రారంభించాను. ప్రతీరోజు ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి.. 11 గంటలకు ఎక్కడో ఓ చోట పెట్రోల్ బంకుకు చేరుకున్న తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకుంటాను. సమీప ప్రాంతంలో ఉన్న ఆర్మీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థుల నుండి ఆహారం తీసుకుని తింటాను. ప్రతీ గంటకు దాదాపు 7 కి.మీలు పరిగెత్తుతాను. భారత సైన్యంలో చేరేందుకు యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా పరుగు యాత్ర ప్రారంభించా’’ అని చెప్పాడు. #WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI — ANI_HindiNews (@AHindinews) April 5, 2022 -
పరుగుల ప్రదీప్ మెహ్రాకు ఊహించని సాయం
Midnight Runner Pradeep Mehra News: అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు.. అదీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ఇంకేం ప్రదీప్ మెహ్రా ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. ఆపై ఆ కుర్రాడిని ఈ-సెలబ్రిటీని చేసేందుకు ప్రయత్నాలు సాగగా.. తన ప్రయాణాకి ఆటంకం కలిగించొద్దంటూ సున్నితంగా మీడియాను వేడుకున్నాడు ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు. ఈ తరుణంలో.. ప్రదీప్ మెహ్రాకు సాయం మాత్రం అందుతోంది. ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ రెండున్నర లక్షల రూపాయల చెక్ సాయం అందించింది షాపర్స్ స్టాప్. ఈ విషయాన్ని మొదటి నుంచి మెహ్రాకు తోడుగా ఉంటున్న జర్నలిస్ట్, దర్శకుడు వినోద్ కాప్రీ తెలియజేశాడు. తనకు సాయం అందిస్తున్న వాళ్లకు ప్రదీప్ సైతం కృతజ్ఞతలు చెప్తున్నాడు. చదవండి: అమ్మ అనారోగ్యం.. ఆర్మీ కల.. ప్రదీప్ పరుగుల కథ ఇది! నోయిడా సెక్టార్ 16 దగ్గర మెక్డొనాల్డ్లో పని చేసే ప్రదీప్ మెహ్రా.. తానుండే చోటుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం పరుగుల మీదే ప్రతీరోజూ చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓరోజు ఆ కుర్రాడి గురించి ఆరా తీసిన వినోద్ కాప్రీ.. లిఫ్ట్ ఇస్తానని చెప్పినా వద్దంటూ తనమానాన తాను పరుగులతోనే వెళ్లిపోయాడు. ఆ వీడియో ఆనంద్ మహీంద్రా లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మందిని కదిలించింది కూడా. This is PURE GOLD❤️❤️ नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया मैंने सोचा किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu — Vinod Kapri (@vinodkapri) March 20, 2022 This morning @atulkasbekar took my address and with in few hours , a @PUMA sports kit with Running shoes, Apparels, backpack , socks was there at my door step for #PradeepMehra and with in no time we delivered it to him. Love you Atul ❤️ love you Tweeple❤️❤️ Thanks #Puma pic.twitter.com/MZws0nBd8L — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
‘డార్లింగ్’ ప్రదీప్.. ఆర్మీలో చేరేందుకు ఏం చేస్తున్నాడంటే.. వీడియో వైరల్
లక్నో: సోషల్ మీడియాలో ఓ యువకుడు చేసిన ఫీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ప్రతీ రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకో కారణం తెలిస్తే మీరు ఫిదా అయిపోతారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ప్రదీప్(19) పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళ పరిగెత్తుతుండగా ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చూశాడు. ఇంతలో వినోద్.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి ఎందుకిలా పరిగెత్తుతున్నావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానం విని ఫిదా అయిపోయాడు. తాను ప్రతీ రోజు ఇలాగే 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానని ప్రదీప్ చెప్పాడు. ఎందుకని మళ్లీ ప్రశ్నించగా.. తన కల భారత ఆర్మీలో చేరడమేనని.. అందుకే తాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ క్రమంలో వినోద్.. ఉదయం సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగ్గా.. తాను మెక్డోనాల్డ్ సెక్టార్-16లో పని చేస్తున్నానని అన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు లేచి వంట చేయాలని చెప్పాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడిందని చెప్పిన ప్రదీప్.. తన తమ్ముడికి సైతం వంట చేసిపెట్టాలని సమాధానం ఇచ్చాడు. అందుకే తాను రాత్రి సమయంలోనే ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. ప్రదీప్ రన్నింగ్ కొనసాగిస్తూనే ఇలా సమాధానాలు చెప్పడం విశేషం. చివరకు.. ప్రదీప్ను వినోద్ కాప్రీ తన కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పగా.. అతను నో చెప్పాడు. కారులో వస్తే ఈరోజు ప్రాక్టీస్ మిస్ అవుతానని చెప్పడంతో వినోద్ మరోసారి ఫిదా అయిపోయాడు. కాగా, అతను రన్నింగ్ చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే నా #MondayMotivation ఏమిటో మీకు తెలుసా? అతను చాలా గ్రేట్, రైడ్ ఆఫర్ను తిరస్కరించడం వాస్తవం. అతనికి సహాయం అవసరం లేదు. ఆయనే ఆత్మనిర్భర్ అంటూ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. Inspiring…all the best #Pradeep 👏🏼👏🏼👏🏼 https://t.co/Y1YMQBV5jW — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 21, 2022 ప్రదీప్ వీడియోపై టాలీవుడ్ హీర్ సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. స్పూర్తిదాయకం.. ఆద్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. The only impossible journey is the one you never begin 👍 Video Via @vinodkapri pic.twitter.com/ue5x482T2s — Defence Squad (@Defence_Squad_) March 20, 2022 టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ.. What an exemplary person 🌟 Run #Pradeep Run 🏃♂️ https://t.co/hAibkgRU7U — Krish Jagarlamudi (@DirKrish) March 20, 2022 -
రన్నింగ్లో రేసుగుర్రం.. సానబెడితే.. చిరుతే..
అనపర్తి(తూర్పు గోదావరి): ఆ యువకుడు పరుగెత్తాడంటే చిరుత కూడా వెనుకబడాల్సిందే. పరుగుల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలన్నదే అతడి ఆశయం. పేదరికం అడ్డుపడుతున్నా.. మెళకువలు నేర్పే కోచ్ లేకున్నా.. లక్ష్యాన్ని సాధించాలన్న కసితో ముందుకు దూసుకుపోతున్న ఆ యువకుడి పేరు ఉందుర్తి రమేష్. అనపర్తికి చెందిన ఈ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి లక్ష్మి కూలి పనులు చేస్తోంది. చిన్నప్పటి నుంచీ పరుగులో రమేష్ది ముందంజే. యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయిల్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించాడు. చదవండి: Extramarital Affair: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి.. అథ్లెటిక్స్లో 10కే, 5కే ఆఫ్ మారథాన్ పూర్తి చేశాడు. నిత్యం స్థానిక జీబీఆర్ మైదానంలో నిరంతరం సాధన చేస్తూ కనిపిస్తాడు. ఇతడి సంకల్పానికి జీబీఆర్ యోగా, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, జీబీఆర్ విద్యాసంస్థల అధినేత తేతలి కొండబాబు తోడుగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం వంద కిలోమీటర్ల దూరాన్ని 9.20 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా 140 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో పరుగెత్తాలనే లక్ష్యాన్ని 70 నిమిషాలు ముందే చేరుకుని అబ్బురపరిచాడు. బుధవారం రాత్రి జీబీఆర్ కళాశాల నుంచి, బలభద్రపురం, బిక్కవోలు, జి.మామిడాడ, పెదపూడి, ఇంద్రపాలెం లాకులు, కాకినాడ, జగన్నాథపురం వంతెన, కోరంగి మీదుగా యానాం సరిహద్దు చేరుకుని తిరిగి అదే దారిలో గురువారం ఉదయం సుమారు 7.30 గంటలకు అనపర్తి జీబీఆర్కు చేరుకున్నాడు. ఇతడి పరుగు ప్రతిభకు ముచ్చటపడిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తేతలి కొండబాబుతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. రికార్డును తిరగరాస్తా.. జాతీయ స్థాయి రన్నింగ్ రేస్ పోటీల్లో పాల్గొని రికార్డులు నెలకొల్పడడమే తన లక్ష్యమని రమేష్ చెబుతున్నాడు. వికాస్ మాలిక్ అనే రన్నర్ 160 కిలోమీటర్ల దూరాన్ని 18.20 గంటల్లో పూర్తి చేసి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని వివరించాడు. ప్రభుత్వ సహకారం లభిస్తే మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. కనీసం ఈ రంగంలో తనకు కొంచెం మార్గదర్శకంగా నిలిస్తే అబ్బురపరిచే విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
Belly Fat: పొట్ట, బరువు తగ్గి, చక్కగా స్లిమ్గా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా తగ్గేవారు మాత్రం తక్కువే. కారణం... తగ్గడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం, ఒకవేళ ఎంచుకున్నా, ఆ నియమాలను పాటించకపోవడం. కొన్ని వ్యాయామాలు పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి, కానీ కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల లేదా కేవలం ఆహార నియమాలు మాత్రమే పాటించడం వల్ల పొట్ట తగ్గదు. ఆహార నియమాలతోపాటు వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతాం. ఆ మార్గాలేమిటో చూద్దాం. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైలు, మసాలాలు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఉదయానే నిద్రలేవడం: కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందేమంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రన్నింగ్ : రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. రన్నింగ్ చేయలేకపోతే కనీసం వేగంగా నడవడం మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. క్యారెట్: క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి వాటిని స్మూతీ, సలాడ్, జ్యూస్గా తినవచ్చు. మీ డైట్ చార్ట్లో క్యారెట్లను చేర్చండి, ఇది మీ బరువును సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతులు: సహజంగా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగుపరచడంలో మెంతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ప్రత్యేక ఔషధ గుణాలు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పానీయాలలో మొలకెత్తిన మెంతులను ఉపయోగించడం మంచి ఫలితాలనిస్తుంది. జామ: పేదల యాపిల్గా పేరుగాంచిన జామకాయకు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది చలికాలంలో పుష్కలంగా లభించే పండు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెర్రీస్: బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీలు తినడం ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది. వేపుళ్లు, పాక్డ్ ఫుడ్ వద్దు: ఆయిల్తో డీప్ ఫ్రై చేసి తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఆయిల్తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆయిల్స్తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి. వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్: మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ ఉపయోగపడుతుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
ఆరోగ్యంగా, చురుగ్గా... యవ్వనంగా కనిపించాలంటే బరువు సమానంగా ఉండాలి. అధిక బరువు వల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే బరువును అదుపులో పెట్టుకోవడం అవసరం. బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. వీటిలో సైక్లింగ్, జాగింగ్ సులువైనవి. ఇప్పుడు జాగింగ్ గురించి చెప్పుకుందాం. ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటో చూద్దాం... జాగింగ్ చేయడానికి జిమ్లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్గా జాగింగ్ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. శారీరకంగా ఫిట్గా, క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్గా కనబడేందుకు దోహదం చేసే వాటిలో జాగింగ్ మెరుగైనది. ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. బ్లడ్గ్లూకోజ్ను, కొలెస్ట్రాల్ను అదుపు చేస్తుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా ముఖం తేటగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు.. ►జాగింగ్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. ►బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ►ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. ►జాగింగ్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉండి శారీరక శక్తిని పెంచుతుంది. ►తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి. ►కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పాజిటివ్ శక్తి వస్తుంది. ►చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు. అయితే కేవలం జాగింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలూ శరీరానికి సమకూరతాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. -
లాహోర్ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్
లాహోర్: ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చింది ఒక ఆస్ట్రిచ్. లాహోర్ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్ రోడ్లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తోనా.. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ వ్యూవ్స్తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్లో ప్రతి రోజు ఉదయం బస్ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్బాయ్ మాత్రమే హ్యండిల్ చేయగలడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా -
Flying Sikh: ‘ది గ్రేట్’ మిల్కా...
అతని పరుగు... భారత క్రీడను ‘ట్రాక్’పై ఎక్కించింది అతని పరుగు... పతకాలు తెచ్చింది అతని పరుగు... రికార్డులకెక్కింది అతని పరుగు... పాఠమైంది అతని పరుగు... తెరకెక్కింది ఇప్పుడాయన ఊపిరి ఆగిపోతే ఆ పరుగు... గుండెలను బాదుకొంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ భోరున విలపిస్తోంది. క్రీడా, రాజకీయ, సినీరంగాలను విషాదంలో ముంచింది. అథ్లెట్ ఆణిముత్యం లేడని, ఇక రాడనే వార్తను ఎంతకీ జీర్ణించుకోలేకపోతోంది. ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్ అంటే త్రుటిలో చేజారిన పతకం, చేతికందిన స్వర్ణాలు, రికార్డుకెక్కిన ఘనతలు, విడుదలైన సినిమానే కాదు. కచ్చితత్వం. కష్టపడేతత్వం. దేశవిభజనలో సర్దార్జీ ప్రాంతం పాక్లో కలిసింది. బాల్యంలోనే అనాథ అయ్యాడు. విభజనానంతర ఘర్షణల్లో మిల్కా తల్లిదండ్రుల్ని పాకిస్తానీయులు చంపేశారు. 15 ఏళ్ల కుర్రతనంలో బిక్కుబిక్కుమంటూ భారత్ వచ్చాడు. బూట్లు తుడిచాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్లోని షాప్లో క్లీనర్గా చేరాడు. చిల్లర దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు. అతని సోదరి నగలు అమ్మి మిల్కాను బయటకి తీసుకొచ్చింది. పడరాని పాట్లు ఎన్నో పడి నాలుగో ప్రయత్నంలో భారత ఆర్మీ(1952)లో చేరాడు. సికింద్రాబాద్లో విధులు. ఇక్కడే అతని అడుగులు ‘పరుగు’వైపు మళ్లించాయి. ఆ పరుగు కాస్తా అథ్లెటిక్స్తో ప్రేమలో పడేసింది. ఆ ప్రేమే పతకాల పంటకు దారితీసింది. ఈ పతకాలు భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్లో దిగ్గజాన్ని చేశాయి. టాప్–10లో నిలిస్తే మరో గ్లాసు పాలు! సర్దార్ జీ చరిత్ర అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడైనా ఘన చరితే. భవిష్యత్ తరాలకు అతని జీవన యానం పాఠం నేర్పుతుంది. మన పయనం పూలపాన్పు కాదని... గమ్యం చేరేదాకా పోరాటం తప్పదని బోధిస్తుంది. సికింద్రాబాద్లో విధులు నిర్వర్తిస్తుండగా... క్రాస్ కంట్రీ పోటీల్లో పరుగెత్తేవాడు. ఆర్మీ కోచ్ గురుదేవ్ ఆ పోటీల్లో టాప్–10లో నిలిస్తే మరో గ్లాస్ పాలు ఇచ్చే ఏర్పాటు చేస్తానంటే ఆరో స్థానంలో నిలిచాడు. అక్కడ ప్రత్యేక శిక్షణతో తన పరుగులో వేగాన్ని అందుకున్నాక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో పోటీపడ్డాడు. తర్వాత రెండేళ్లకే సర్దార్ చరిత్ర లిఖించడం మొదలు పెట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ (1958–ఇంగ్లండ్)లో 400 మీ. పరుగులో స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కాడు. అదే ఏడాది టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీ., 400 మీ. బంగారు పతకాలు సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్లో 0.1 సెకను తేడాతో 400 మీ. ఈవెంట్లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. కానీ అతని 45.6 సెకన్ల జాతీయ రికార్డు 38 ఏళ్లపాటు చెక్కు చెదరలేదు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... చండీగఢ్: తీరని శోకాన్ని మిగిల్చివెళ్లిన మిల్కా సింగ్ మృతి యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కరోనాతో కనుమూసిన ఆయన అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో ముగించారు. ప్రముఖ గోల్ఫర్, మిల్కా కుమారుడు జీవ్ మిల్కాసింగ్ అంత్యక్రియలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ గవర్నర్ వి.పి.సింగ్ బద్నోర్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల మంత్రులు మన్ప్రీత్ సింగ్ బాదల్, సందీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నివాళి మిల్కా సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్, కెప్టెన్ కోహ్లితో పాటు సినీలోకానికి చెందిన హేమాహేమీలు అమితాబ్ బచ్చన్, మోహన్లాల్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేశ్బాబు అజయ్ దేవ్గణ్, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, తాప్సీ, సన్నీ డియోల్, సోనూ సూద్, సంజయ్దత్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పించారు. భారత అథ్లెటిక్ ఆణిమూత్యాన్నే కోల్పోయిందని, యువతకు ఆయనే స్ఫూర్తి ప్రదాత అని ఈ సందర్భంగా సినీ దిగ్గజాలంతా కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ
గుహవటి: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నిన్న టీ ఎస్టేట్లో కూలీలతో కలిసి ఆమె కూడా తేయాకు తెంపిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ప్రియాంక గాంధీకి సంబంధించిన మరో వీడియో వైరలవుతోంది. ఆమె పరిగెత్తుతూ సభా వేదిక వద్దకు వస్తోన్న వీడియో ఇది. ఆ వివరాలు.. ప్రియాంకా గాంధీ మంగళవారం అస్సాంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వేదిక వద్దకు వచ్చారు. మెరూన్ రంగు చీరలో ఉన్న ప్రియాంక గాంధీ మట్టిలో పరుగులు తీస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె చుట్టు బాడీగార్డులు కూడా ఉన్నారు. ప్రియాంక గాంధీ పరిగెత్తుకుంటూ వస్తుండగా.. అక్కడ నిల్చొన్న జనం చప్పట్లు కొడుతూ ఆమెకు స్వాగతం పలికారు. వారందరికి చేతులు జోడించి నమస్తే చెబుతూ.. ప్రియాంక వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘రెండు నెలలుగా 3లక్షల మందికి పైగా రైతులు ధర్నాలో కూర్చున్నారు. వారంతా ప్రధాని ఉండే ప్రాంతానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. కానీ, ప్రధానికి వారిని కలవడానికి తీరిక దొరకడం లేదు. ఒకసారి వెళ్లి రైతులను కలిస్తే ఏమవుతుంది. చట్టాల వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తే బాగుంటుంది కదా. అప్పడు వారికి లాభం చేకూర్చేలాగే మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఈ చట్టాలు, పాలసీలు ధనికుల కోసమే అన్నట్లుగా ఉంది’’ అంటూ ప్రియాంక మండి పడ్డారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్ను వాడుకుని డెవలప్మెంట్ పాలసీలు ఏమీ లేకుండానే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్తో పాటు మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి హక్కులు, సీఏఏ, ఎన్నార్సీ లాంటి అంశాలపై అస్సాంలో ప్రచారం చేపడుతున్నాయి. ఇవన్ని ఇక్కడ చాలా సున్నితమైన అంశాలు’’ అన్నారు ప్రియాంక. ఇక అస్సాంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు వేర్వేరు రోజులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చదవండి: ‘సరిగానే వేశానా.. బుట్టలో పడిందా?’ గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు.. -
ట్రయినింగ్లో...సింగ్ ఈజ్ కింగ్
క్రీడాకారులు ఎవరైనా గెలవాలనే లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించి పోటీల్లో పాల్గొంటారు. కానీ ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. తాను ఎంతో కష్టపడి ప్రాక్టిస్ చేసినప్పటికీ పోటీలో పాల్గొనలేకపోయాడు. ఆరేళ్లపాటు శిక్షణ తీసుకుని దేశం తరపున అథ్లెటిక్స్లో పాల్గొనాలన్న కరణ్ కల విధి వక్రీకరించడంతో... అనేకమార్లు మోకాళ్ల గాయాలు, సర్జరీల మూలంగా ఆ ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఎప్పటికీ తాను పోటీలలో పాల్గొనలేను అని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ప్రతిభ ఉండి మరుగున పడిపోతున్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా తన కలను నిజం చేసుకోవచ్చని అనుకున్నాడు కరణ్. అమెరికాలో అంతర్జాతీయ కోచ్ల వద్ద ఆరేళ్లపాటు శిక్షణ పొందిన కరణ్ అప్పటి తన అనుభవంతో ఊటీ జార్ఖండ్ ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. మిడిల్, లాంగ్ డిస్టెన్స్, రన్నింగ్ కాంపిటీషన్లలో వీరిని బరిలో నిలిపేందుకు గట్టిగా తీర్చిదిద్దుతున్నారు. 2028 లా ఒలింపిక్స్ బరిలో ఈ పిల్లలను నిలపడం తన కల అని కరణ్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే తన సొంత ఊరు అయిన న్యూఢిల్లీ నుంచి ఊటీకి తన మకాం మార్చి 2018 ఆగస్టులో ఊటీలో ‘ఇండియన్ ట్రాక్ ఫౌండేషన్’(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశాడు. ఊటీ పరిసర ప్రాంతాల్లోని గిరిజన తండాల్లోని పిల్లలకు రన్నింగ్లో శిక్షణ ఇస్తున్నాడు. 10–16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందర్ని ఒక ఇంట్లో ఉంచి కరణ్, అతని భార్య ఇద్దరు కలిసి వారి బాగోగులు చూసుకుంటున్నారు. వీరి అవసరాలకయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తూ.. వారికి రన్నింగ్లో శిక్షణతోపాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఏటా ఇక్కడ చేరే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీఎఫ్ ఏర్పాటు చేసేందుకు కరణ్కు మూడేళ్లు పట్టింది. ఐటీఎఫ్లో శిక్షణ పొందుతున్న పిల్లలు వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించడంతోపాటు స్టేట్ ఛాంపియన్, నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్లుగా నిలుస్తున్నారు. 2028 లా ఒలింపిక్స్లో తమ అకాడమీ పిల్లలు తప్పక విజయం సాధిస్తారని కరణ్ చెబుతున్నారు. -
అలా సరదాగా రేసుకు వెళ్దామా!
ఒహియో: జంతువులు ఆనందంతో ఉన్నప్పుడు పరుగులు తీస్తాయి. అంలాటి సందర్భంలో దానికి సంబంధించిన మరో జంతువు జతకూడితే ఆ పరుగుకు జోరు పెంచుతాయి. సాధారణంగా జిరాఫీలు అరుదైన సందర్భాల్లో మాత్రామే పరుగెత్తుతాయి. భారీ శరీరం, ఎతైన మెడను కలిగి ఉండే ఇవి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్తాయి. అయితే తాజాగా ఓ చిన్న జిరాఫీ ఆనందంతో పరుగులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి జూలోని థియో అనే చిన్న జిరాఫీ సంతోషంగా పరుగెత్తుకుంటూ జూలో తిరుగుతుంది. అదే సమయంలో దాని సోదర జిరాఫీ ఫెన్ జతచేరడంతో మరింత వేగంగా పరుగుతీస్తుంది. ఈ వీడియోను సన్సినాటి జూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘బేబీ జిరాఫీ థియో తనలోని శక్తి కూడదీసుకుని తన సోదర జిరాఫీ ఫెన్తో సరదాగా పరుగులు తీసింది’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 15వేల మంది నెటిజన్లు వీక్షించారు. బేబీ జిరాఫీ పరుగును చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘థియో జిరాఫీ చాలా అందంగా ఉంది. అది తన సోదర జిరాఫీ ఫెన్ వద్దకు వెళ్లి అలా సరదాగా రేసుకు వెళ్దామా! అని అడిగింది’ అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఈ వీడియోను చూసిన నాకు ఉదయం చాలా సంతోషం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
మాస్క్లతో రన్నింగ్ చేయవచ్చా?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా లాక్డౌన్ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. వాకింగ్, జాగింగ్ల కోసం, వాహ్యాలీకి పార్కులకు వెళ్లేందుకు యూరప్ దేశాలు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. మున్ముందు భారత్లో కూడా వాకింగ్, జాగింగ్లకు అనుమతిచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి మాస్క్లు ధరించి జాగింగ్లు, వాకింగ్లు చేయవచ్చా? ముఖ్యంగా జాగింగ్లు చేసేటప్పుడు ఆయాసం రాదా? అదే క్రీడాకారులు రన్నింగ్ చేస్తే మరింత ఇబ్బంది ఉండదా? మాస్క్లు ధరించిన సాధారణ ప్రజలే దమ్మాడడం లేదని, ఆయాసం వస్తోందని చెబుతున్నారుగదా! మాస్క్లు ధరించడం వల్ల సరిగ్గా ఆక్సిజన్ అందగా ఆయాసం వస్తోందని, అనారోగ్యం కూడా ఏర్పడవచ్చని కొందరు వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. చైనాలో ఇటీవల ఓ 26 ఏళ్ల జాగర్ ముఖానికి మాస్క్ ధరించి నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి కుప్పకూలిపోయారు. ఆయన్ని వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో చేర్చగా, అతని ఎడమ ఊపిరితిత్తి 90 శాతం కుంచించుకు పోయిందని, గుండె కూడా కుడి వైపునకు జరిగిందని వైద్యులు తేల్చారు. అదే చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల పిల్లలు మాస్క్లు ధరించి జాగింగ్ చేస్తూ కుప్ప కూలిపోయి చనిపోయారు. మాస్క్లు ధరించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయా? చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలకు అటాప్సీ చేయలేదు కనుక మాస్క్ల కారణంగానే వారు మరణించారని చెప్పలేం. కరోనా నుంచి తప్పించుకోవాలంటే బయటకు వెళ్లినప్పుడు మూడు లేయర్లుగల మాస్క్లు, లేదా ఎన్95 మాస్క్లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి ధరించినా గాలిని పీల్చుకోగలం. ముక్కు, నోరుకు ఎలాంటి ఫిల్టర్ ఉన్నా గాలి పీల్చుకోవడం ఇబ్బందే అవుతుంది. పరుగెత్తుతున్నప్పుడు ముక్కుతోపాటు, నోటితో కూడా గాలిని ఎక్కువగా పీలుస్తారని, ఆ సమయంలో నోటికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుందని ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’లో పని చేస్తోన్న డాక్టర్ అమోల్ పాటిల్ తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించి పరుగెత్తడం కన్నా మాస్క్లు లేకుండా పరుగెత్తడమే బాగుంటుందని దర్శన్ వాగ్ లాంటి పలువురు కోచ్లు తెలిపారు. మాస్క్లు ధరించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని క్రమంగా అలవాటు చేసుకోవడం మంచిదని వారు సూచించారు. మొదట్లో మాస్క్లతోని మెల్లగా ప్రాక్టీస్ చేయాలని, తర్వాత క్రమేణ వేగం పుంజుకోవాలని చెప్పారు. పరుగెత్తడం ఆపి, ఆయాసం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరులకు దూరంగా వెళ్లి మాస్క్లను తొలగించి గాలి పీల్చుకోవచ్చని చెప్పారు. మాస్క్లను ధరించి పరుగెత్తడం వల్ల ఊపిరితిత్తులు మరింత బలపడే అవకాశం ఉందని దర్శన్ వాగ్ తెలిపారు. -
మరణం దరి చేరకుండా ఉండాలంటే.
వాషింగ్టన్: అనారోగ్య కారణాలతో మరణం దరి చేరకుండా ఉండాలంటే..రోజూ పరుగు తీయాల్సిందే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హృద్రోగులు, కేన్సర్ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్/జాగింగ్ చేస్తే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా వారికి ఆయా వ్యాధులతో మరణం వచ్చే అవకాశాలు 27 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ఐదున్నరేళ్ల నుంచి 35 ఏళ్లలోపు 2,32,149 మంది జీవనశైలి, దినచర్య, ఆరోగ్య నివేదికల పరిశీలన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. వ్యాయామానికి బాటలు వేస్తే వ్యాధులకు చెక్ దేశంలో మధుమేహం, కేన్సర్, హృద్రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే నగరాల్లో పర్యావరణ పరిరక్షణ,మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. కొరవడిన శారీరక వ్యాయామం, ముసురుకుంటున్న కాలుష్యం ప్రజలను వ్యాధిగ్రస్తుల్లా మారుస్తోందని తెలిపింది. దీంతో పడిపోతున్న ప్రజల ఆయుర్దాయాన్ని పెంచాలంటే నగరపాలక సంస్థలు ఇకనైనా మేల్కొనాలని కోరింది. రోడ్లపై పాదచారుల వంతెనలు, వాకింగ్/జాగింగ్ చేసేవారి కోసం రోడ్ల పక్కన కుర్చీలు, ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నివేదించింది. వెన్నునొప్పి, నిద్రలేమికి యోగా, పీటీతో చెక్ వెన్నునొప్పి, నిద్రలేమి సమస్యలకు యోగా, ఫిజికల్ థెరపీ (పీటీ) తో కళ్లెం వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యలకు వైద్యం తీసుకునే అవసరాన్ని కూడా యోగా, పీటీ తగ్గిస్తాయని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి, నిద్రలేమి సమస్య ఉన్న 320 మందికి ఓ థెరపిస్టు దగ్గర 12 వారాల పాటు యోగా, పీటీ చేయించారు. అనంతరం వారిలో ఈ సమస్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి, వెన్నునొప్పి సమస్యలకు వాడే మందులతో దుష్ప్రభావం పడొచ్చని, దీంతోపాటు అతిగా మందులు వాడే ప్రమాదం ఏర్పడవచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవ్చని హెచ్చరించారు. -
వారానికి 50 నిమిషాల జాగింగ్తో..
లండన్ : సమయం సరిపోవడం లేదనో..మరే కారణాలతోనో వ్యాయామం జోలికి వెళ్లని వారికి తాజా అథ్యయనం ఊరట ఇస్తోంది. వారానికి ఒకసారి 50 నిమిషాల పాటు జాగింగ్ చేసినా మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. జాగింగ్తో అకాల మరణం ముప్పు 30 శాతం తగ్గుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పునూ ఇది గణనీయంగా నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు. రన్నింగ్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటకే పలు సర్వేలు తేల్చిచెప్పాయి. వారంలో ప్రతి ఒక్కరూ కనీసం 75 నిమిషాల పాటు రన్నింగ్, స్విమ్మింగ్ వంట కఠిన వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచించారు. 2,33,149 మందికి సంబంధించిన 14 అథ్యయనాల గణాంకాలను పరిశీలించిన మీదట విక్టోరియా యూనివర్సిటీ ఈ వివరాలు వెల్లడించింది. 30 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసిన క్రమంలో సర్వే సాగిన మూడు దశాబ్ధాల కాలంలో వారిలో 25,951 మంది మరణించారు. అసలు పరగెత్తని వారితో పోలిస్తే రన్నింగ్ చేసే వారిలో ఏ కారణం చేతనైనా మరణించే రేటు 27 శాతం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. రన్నింగ్లో వేగం ఎంతైనా ఫలితాల్లో మాత్రం వ్యత్యాసం లేదని వెల్లడైంది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వారానికి కనీసం 50 నిమిషాలు పరిగెత్తినా మెరుగైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. అథ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్లో ప్రచురితమయ్యాయి. -
బ్రదర్స్.. అదుర్స్
పశ్చిమగోదావరి, పోడూరు: జిన్నూరు నర్సింహరావుపేటకు చెందిన పెచ్చెట్టి నాగచైతన్య, పెచ్చెట్టి రాధాకృష్ణ సోదరులిద్దరూ చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తున్నారు. అన్న నాగచైతన్య జిన్నూరు ఐడియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు రాధాకృష్ణ 2వ తరగతి చదువుతున్నాడు. నాగచైతన్య కరాటేలో రాణిస్తూ పలు పతకాలను సాధించాడు. పాలకొల్లు, నిడదవోలు పట్టణాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను, ప్రశంసాపత్రాలను అందుకున్నాడు. రాధాకృష్ణ రన్నింగ్లో చిచ్చరపిడుగు. స్కూల్స్థాయిలో ఎప్పుడు పోటీలు నిర్వహించినా ఫస్ట్ వస్తాడు. ఇటీవల పాలకొల్లులో అపుస్మా ఆధ్వర్యంలో జోనల్స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. భవిష్యత్తులో మరింత రాణిస్తామని చెప్పారు. -
నడక వేగం ఆయుష్షును సూచిస్తుంది!
డాక్టర్ దగ్గరకు వెళితే.. ఒకట్రెండు పరీక్షలు చేస్తాడు మీకు తెలుసు కదా! వాటికి నడక వేగం కూడా చేరిస్తే మేలంటున్నారు సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా ఉందా? మీ నడక వేగం మీ ఆరోగ్యాన్ని, ఆయుష్షును కూడా సూచిస్తుందన్నది వీరి అంచనా. వేగం ఎంత ఎక్కువగా ఉంటే మీ ఆరోగ్యం కూడా అంత బాగుంటదని, గుండె, మెదడు సంబంధిత సమస్యలకు నడక వేగం సూచిక కూడా కావచ్చునని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ డెలీ కాన్రైట్ వివరిస్తున్నారు. అలాగని ఈ రోజు నుంచి ఎక్కువ వేగంగా నడవడం కోసం ప్రయత్నించాల్సిన అవసరమేమీ లేదని దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదని కాన్రైట్ తెలిపారు. నడక వేగం గణనీయంగా తగ్గిందంటే ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలని... అంతేకాకుండా నడక లాంటి సాధారణ వ్యాయామం కూడా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందన్నది దీనివల్ల తెలుస్తుందని అన్నారు. రొమ్ము కేన్సర్ నుంచి బయటపడ్డ వారిపై వ్యాయామం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుతం కాన్రైట్ ప్రయత్నిస్తున్నారు. -
జీవితాన్ని ఆగి చూద్దామా..!
అది ప్రాణిక్ హీలింగ్ వర్క్షాప్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్హాల్లో జరుగుతోంది. వెళ్లేసరికి అప్పటికే హాల్ నిండిపోయింది! వర్క్షాప్కి వచ్చిన వారిలో 80 శాతం యువతే ఉండటం ఆశ్చర్యమనిపించింది. ‘‘పరుగెడుతున్నాం. పరుగెడుతూనే ఉన్నాం.ఈ పరుగుకు అర్ధమేంటో తెలియాలి కదా! అందుకే అప్పుడప్పుడు కాస్త ఆగి మనల్ని మనం చూసుకోవాలి’’.. వేదిక మీద మాట్లాడుతున్న దినేష్.. పుట్టెడు ఇంటి సమస్యలు మీదేసుకొని జీవితాన్ని లాగలేక లాగే మధ్యతరగతి తండ్రి ఏమీ కాదు. బి.టెక్ పూర్తిచేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడట. ఇన్నాళ్లూ చదువు, ఇప్పుడు ఉద్యోగ విధుల పరుగులో పడిపోయి తనని తాను మర్చిపోతున్నానని, ఆన్లైన్లో హీలింగ్ వర్క్షాప్స్ గురించి తెలుసుకుని పేరు ఎన్రోల్ చేసుకున్నానని చెప్పాడు. ‘‘ఎస్.. నేను కూడా అంతే! ఎంత కాదనుకున్నా మైండ్సెట్లో చాలా చెత్త చేరుతుంది. అది రోజువారీ పనిలో ఉండే ఒత్తిళ్లు అవ్వచ్చు, రకరకాల ఇగోస్ అవ్వచ్చు.. వీటిని క్లీన్ చేసుకోవాలంటే కొన్ని మెథడ్స్ అవసరం. ఇలాంటి వర్క్షాప్స్ గురించి కొంత తెలుసు. నేరుగా తెలుసుకుందామని వచ్చాను’’ అంది రేడియో ఆర్జేగా వర్క్ చేస్తున్న వర్ష. ఇలాగే మరికొందరు. వారంలో ఆదివారం జాలీడే అంటూ ఇంట్లో బద్ధకంగా గడిపేస్తుంటారంతా అనే మాటలకు అర్ధం లేదనిపించింది వీరిని కలిశాక. లంచ్ టైమ్ అయ్యింది. ఆఫీస్కు వెళుతున్నట్టు ఎవరి లంచ్ బాక్స్ వాళ్లే తెచ్చుకున్నారు. కొత్త పరిచయస్తులతో కలిసి నవ్వుతూ భోజనం చేస్తున్నారు. వారిలో డిగ్రీ చదివేవాళ్లు, కాల్సెంటర్లలో పనిచేసేవాళ్లు, గృహిణులతో పాటు వ్యాపారులూ ఉన్నారు. ‘‘యోగా, ధ్యానం చేసే పద్ధతులను తెలుసుకోవడం కోసమే కాదు ఒకేలాంటి అభిరుచి ఉన్న మరికొందరితో పరిచయాలు ఏర్పడతాయి. దీని వల్ల కొత్త జీవనంలోకి ఉత్సాహం వస్తుంది’’ అంటోంది ఇంటివద్దే బొటిక్ నిర్వహిస్తున్న శ్రీవాణి. జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి ఆధ్యాత్మిక ప్రయాణమూ అవసరమే అన్నది ఆమెకున్న మరొక నమ్మకం. ‘‘కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగుండటం లేదు. మానసిక సమస్యలే అందుకు కారణం. వాటిని క్లియర్ చేసుకోవడానికే ఇక్కడకు వచ్చాను’’ అని చెప్పారు ఆరుపదుల వయసు దాటిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పూర్ణచందర్రావు. ‘‘పదేళ్లుగా హెల్త్ అండ్ హీలింగ్, బాడీ అండ్ సోల్, స్పిరిచ్యువల్ ప్రాణిక్ హీలింగ్ వంటి వర్క్షాప్స్కి హాజరవుతున్న’ట్టు చెప్పారు యోగా టీచర్ సుభద్ర. ‘ఇంటి వద్ద చుట్టుపక్కల వారికి ఉచితంగా హీలింగ్ క్లాసులూ తీసుకుంటున్నాను’ అంటూ విజిటింగ్ కార్డుతో ఆహ్వానం పలికారు ఆమె. ఆరోగ్య సమస్యలకు మైండ్పై చూపే చెడు ప్రభావాలే కారణం అంటూ సాయంత్రం వరకు రకరకాల పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నారు నిర్వాహకులు. ఈ వర్క్షాప్స్ను ఏడాదిపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు గురించి హీలింగ్ గురు శివ ను అడిగితే ‘హాజరయ్యేవారి ఆసక్తే’ అన్నారు. మరుసటి రోజు ఆఫీస్కొచ్చి రోజువారీ షెడ్యూల్ని చెక్ చేస్తుంటే స్నేహితురాలు రమ్య నుంచి ఫోన్ ‘ఈ వీక్ కుదిరితే ఇంటికి రా! మా అబ్బాయి విపాసన ధ్యానకేంద్రలో చేరాడు. పది రోజుల వరకు ఫ్రీ’ అంది. ‘ఇంకా వాడు డిగ్రీయే చదువుతున్నాడు కదా! అప్పుడే ఈ ధ్యానకేంద్రాల చుట్టూ తిరగడమేంటి?’ అని అడిగితే ‘తన గురించి తను తెలుసుకోవాలని ఉందన్నాడు. మంచిదేగా’ అంది. జీవితపు పరుగు పందాన్ని ఆగి ఆగి కొనసాగించడం ఈ రోజుల్లో అవసరమే అనే అభిప్రాయం మెల్లగా బలపడుతున్నట్లే ఉంది. పరుగుపందెంలో క్షణం ఆగినా వెనుకబడిపోతాం. ఓడిపోతాం. కానీ, జీవితం పరుగులో కాస్త ఆగి మనల్ని మనం సమీక్షించుకుంటే సక్సెస్ సాధిస్తామని నేటి తరం భావిస్తోంది! – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
నాన్న కష్టం చూసి.. పరుగు ఆపేద్దామనుకున్నా..
‘సాహసం నాపదం.. రాజసంనా రథం.. సాగితే ఆపడం.. సాధ్యమా’ అన్నట్టుగా అథ్లెటిక్స్తో పేదరికం అనే హర్డిల్స్ను దాటుతూ సత్తాచాటుతోంది. కష్టాల్లో పుట్టి పెరిగినా.. కన్నీళ్లను గుండెల్లో దాచుకుని తండ్రి ప్రోత్సాహంతో జాతీయస్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాపీమేస్త్రీ ఇంట పుట్టినా పరుగులో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో రాష్ట్రస్థాయి పతకాలు సొంతం చేసుకున్న ‘బంగారు’ కొండ నిడదవోలు అన్నపూర్ణనగర్కు చెందిన యితం నాగాంజలి. పూరిపాకలో కుటుంబం జీవనం సాగిస్తున్నా తండ్రి, కోచ్ ప్రోత్సాహంతో పరుగే శ్వాసగా మైదానంలో చెలరేగిపోతోంది. నాగాంజలి విజయగాథ ఆమె మాటల్లోనే.. నిడదవోలు: మాది పేద కుటుం బం. చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగి పెద్దాయ్యాను. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అథ్లెటిక్లో జాతీయ స్థాయిలో రాణిం చాలనే లక్ష్యంతో కష్టాలు, కన్నీళ్లను గుండెల్లో దాచుకుని అలుపెరుగని పరుగుపెడుతున్నాను. నిడదవోలు 7 వార్డు అన్నపూర్ణనగర్లో చిన్న పూరిపాకలో నివసిస్తున్నాం. నాన్న సత్తిబాబు, అమ్మ లక్ష్మితో పాటు ఇద్దరు చెల్లెళ్లు. నా న్న తాపీమేస్త్రీగా పనిచేస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా డు. చిన్నప్పటి నుంచి పరుగంటే నాకెంతో ఇష్టం. నిడదవోలు జెడ్పీ బాలికల హైస్కూ ల్లో ఆరో తరగతి చదువున్న రోజుల్లో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరంలో చేరాను. అక్కడ అ బ్బాయిలతో సమానంగా పరుగు పెట్టడంతో పీఈటీల దృష్టి నాపై పడింది. చక్కగా పరుగు పెడుతుందని, నాగాంజలిని మా పాఠశాలలో చేర్పించమని శెట్టిపేట, చాగల్లు, ఊనగట్ల, గుడివాడ, చిక్కాల హైస్కూళ్ల పీఈటీ సార్లు నాన్నను అడిగా రు. అయితే నాన్న మాత్రం ఇంటికి దగ్గరలో ఉన్న బాలికల హైస్కూల్లో చదువుతూ దుర్గా పీఈటీ దగ్గర శిక్షణ తీసుకో మన్నారు. అక్కడ నుంచి నిడదవోలు మండలం పెండ్యాల హైస్కూల్లో చేరిన తర్వాత పీఈటీ నాగరాజు సార్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అక్కడ ఉన్నప్పుడే ఒకే ఏడాది ఏడు బం గారు పతకాలను సాధిం చాను. అప్పుడే బలంగా నిశ్చయించుకున్నా జాతీయ స్థాయిలో రా ణించాలని. జాతీయస్థాయిలో పేరుతో పా టు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి నాన్న పడుతున్న కష్టానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. డైట్ లేక పస్తులున్నా.. పదో తరగతి పూర్తవగానే పట్టణంలోని కళాశాలలో ఇంటర్లో చేరాను. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మై దానంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేసేదానిని. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానకుండా ప్రాక్టీస్ చే స్తున్నా. అయితే నాన్న రోజంతా కూలీ పని చేసి తీసుకువచ్చిన రూ.400తో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నేనే మో రోజూ డైట్ తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి పస్తులున్న రోజులు ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా అమ్మా నేనున్నా నువ్వు బాధపడకు అని నాన్న ధైర్యానిచ్చేవారు. టోర్నమెంట్కు వెళ్లడానికి ఖర్చులు, రోజూ శిక్షణ అ నంతరం డైట్ కోసం పడు తున్న ఇబ్బందులు చూసి ప్రాక్టీస్ మానేద్దామనుకు న్నా. బాదం, శెనగలు, పాలు, పండ్లు, గుడ్లు డైట్ తీసుకోనేందుకు రోజుకి రూ.300 వర కు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టలేని నాన్నను చూసి కళ్లం టా నీళ్లు తిరిగేవి. ఆ సమయంలో వద్దు నాన్న ఇంక ప్రాక్టీస్ చేయనని చె ప్పాను. అయితే నాన్న ఒప్పుకోలేదు. తినో తినకో నీకు ఏ లోటు రానివ్వమని ఆయన అనడంతో మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాను. ఏం చేయాలో తెలియలేదు 2016లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బూట్లకు రాయి తగలడంతో ఎడమ కాలు పాదానికి గాయమైంది. నొ ప్పి భరించలేకపోయోదాన్ని. పరుగు పెడుతుంటే నొప్పి బా గా వచ్చేది. కనీసం మందులు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి. ఏం చేయాలో.. నాన్నకు ఎలా చెప్పాలో తెలియక ఒంటరిగా కూర్చుని బాధపడేదాన్ని. నన్ను గమనించిన నా న్న, పీఈటీ నాగరాజు సార్ రాజమండ్రి ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. నాలుగు నెలలు మందులు వాడిన త ర్వాత బాధ తగ్గింది. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నాలో పట్టుదల మరింత పెరిగింది. ఇంట్లో డైట్ సమస్యలు ఉన్నా అర్ధాకలితో ప్రాక్టీస్ చేశాను. పరుగులో ఈ స్థాయికి చేరుకున్న నేను దాతల సహకారంతో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ మొదటి సం వత్సరం చదువుతూ పరుగులో శిక్షణ తీసుకుంటున్నా. ఉ ద్యోగం సాధించి నా ఇద్దరు చెల్లెళ్లకు వివాహలు చేయడమే నా ముందున్న లక్ష్యం. -
స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా..!
లండన్: పొగతాగడం (స్మోకింగ్) పలు వ్యాధులకు దారితీస్తుందని అందరికీ తెలిసిందే. జీర్ణాశయం వాపు లాంటి పలు సమస్యలు స్మోకింగ్ వల్ల ఎదురవుతాయి. పొగతాగడం బాగా అలవాటున్న వారికి ఈ వ్యసనాన్ని మానుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే స్మోకింగ్ చేసేవాళ్లు ప్రతిరోజు కొద్దిసేపు రన్నింగ్ చేస్తే ఆ అలవాటు నుంచి బయడపడే అవకాశం ఉందంటున్నారు లండన్ నిపుణులు. సెయింట్ జార్జ్ యూనివర్శిటీ ఆఫ్ లండన్కు చెందిన కొందరు రీసెర్చర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ అలెక్సిస్ బెయిలీ అనే రీసెర్చర్ తన బృందంతో స్మోకింగ్ పై చేసిన పరిశోధన ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించారు. ప్రతిరోజు కొద్దిదూరం పరుగెడితే పొగతాగాలన్న ఆలోచన వారిలో తగ్గిపోతుందన్నారు. రీసెర్చర్ల బృందం కొన్ని ఎలుకలపై నికోటిన్ ను ప్రయోగించి చూశారు. ఆ ఎలుకలలో కొన్నింటిని పరుగెత్తించడం, వ్యాయామం చేయించడం లాంటి పనులు చేయించి చూడగా వాటిలో నికోటిన్ ప్రభావం చాలా మేరకు తగ్గినట్లు గుర్తించారు. మనుషుల్లో అయితే ఎక్కువ సమయం వ్యాయామం చేయడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనుల కంటే కాసేపు పరుగెత్తే వారిలో నికోటిన్ ప్రభావం తగ్గి, ధూమపానానికి దూరంగా ఉండాలని స్మోకర్స్ భావిస్తారని లండన్ నిపుణుల బృందం వెల్లడించింది. -
పరుగో.. పరుగు
ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఎడ్లపరుగు పోటీలు సీనియర్స్ విజేత విశాఖ జూనియర్స్ విజేత తూర్పుగోదావరి గొల్లప్రోలు : గొల్లప్రోలులోని మాదేపల్లి రంగబాబు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. స్థానిక గోదావరికాలువ గట్టుపై నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 47 జతల ఎడ్లు పాల్గొన్నాయి. రైతులు మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా చెట్లు, వరిచేలగట్లపై నిల్చొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. * సీనియర్స్ విభాగంలో ఏడు జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతగా విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన అద్దేపల్లి పాలవల్లికి చెందిన ఎడ్లు(5నిమిషాలు–54సెకన్లు–37పాయింట్లు), ద్వితీయస్థానంలో విశాఖజిల్లా చుక్కపల్లికి చెందిన మజ్జి రాజేష్ ఎడ్లుజత(5–54–44), అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన గుర్రం రాణిశ్రీయుక్తకు చెందిన ఎడ్లు(6–05–87) తృతీయస్థానంలో నిలిచాయి. * జూనియర్స్ విభాగంలో 30జతల ఎడ్లు పాల్గొనగా, విజేతగా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన చెరుకూరి రామసూర్యవర్షిత్ ఎడ్లుజత(4 నిమిషాలు, 39సెంకడ్లు––28పాయింట్లు) , ద్వితీయస్థానంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడుకు చెందిన బొజ్జా లక్ష్మీఅపర్ణకు చెందిన ఎడ్లు జత(4–49–25) , తృతీయస్థానంలో ప్రకాశంజిల్లా పంగులూరుకు చెందిన పెండ్యాల రాంబాబు ఎడ్లుజత(4–49–37) నిలిచాయి. విజేతలకు బహుమతులు సీనియర్స్లో విజేతకు లింగం రాజు రూ.15వేలు నగదు, ద్వితీయవిజేతకు నాగలక్ష్మిసీడ్స్ అధినేత గట్టెం విష్ణు రూ.12వేలు, తృతీమబహుమతిని పీఎంఆర్ విద్యామందిర్ అధినేత మాదేపల్లి వినీల్ రూ10వేలు, జూనియర్స్ విజేతకు మాధురివిద్యాలయ అధినేత కడారి తమ్మయ్యనాయుడు రూ.12వేలు, ద్వితీయబహుమతిని శివసాయి ఏజన్సీస్ అధినేత తెడ్లపు చిన్నారావు రూ.10వేలు, తృతీయ బహుమతిని అధమాకంపెనీ రూ.8వేలు ఆర్థికసహాయం అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వర్మ బహుమతులు, మెమెంటోలు, శివసాయి ఏజన్సీస్ అధినేత చిన్నారావు ప్రత్యేక మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి వినీల్, నగరపంచాయతీ చైర్మన్ శీరం మాణిక్యం, నీటి సంఘం అధ్యక్షులు కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలగా సిద్ధా నానాజీ వ్యవహరించారు. ఏర్పాట్లను రంగబాబు మెమోరియల్ కమిటీ పర్యవేక్షించింది. శ్రీశ్రీనివాసా ఏజన్సీస్ అధినేత కేదారిశెట్టినానాజీ మజ్జిగ పంపిణీ చేశారు. -
కర్నూలు ఎస్ఐ ఎంపిక పరీక్షల్లో అపశృతి
పరుగు పందెంలో ఆగిన కానిస్టేబుల్ గుండె కర్నూలు (హాస్పిటల్): కర్నూలులో నిర్వహిస్తున్న ఎస్ఐ ఎంపిక పరీక్షల్లో శనివారం అపశృతి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారి తండాకు చెందిన రమావత్ బాలాజీనాయక్ (30) అదే పట్టణంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఎస్ఐగా పదోన్నతి పొందాలని కర్నూలులో జరిగే ఎస్ఐ సెలెక్షన్స్కు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయం స్థానిక ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్లో నిర్వహించిన 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనగా, గమ్యం చేరుకునేలోపు అస్వస్థతకు గురయ్యాడు. కాగా అక్కడి అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఆలస్యంగా నడిచిన విమానాలు
విమానాశ్రయం (గన్నవరం) : దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు ఎయిర్పోర్టు పరిసరాలను పొగమంచు కమ్మేసింది. రన్వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 7.30 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్కోస్టా విమానం 10 గంటలకు బయలుదేరింది. ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం 10.10 గంటలకు చేరుకుంది. ఈ విమానానికి రన్వే క్లియరెన్స్ రాక సుమారు పది నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టి 10.20కు రన్వేపై దిగింది. హైదరాబాద్ నుంచి ఉదయం 9.15 గంటలకు రావాల్సిన స్పైస్జెట్ విమానం 11.10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి 9.30 గంటలకు రావాల్సిన ఎయిరిండియా ఏటీఆర్ విమానం 11.30కి చేరుకుంది. విమానాలు సుమారు రెండు నుంచి రెండున్న గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్వేపై దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు. సాయంత్ర విమాన సర్వీసులు కూడా సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. -
అభ్యర్థుల వేట మొదలైంది..
కానిస్టేబుల్ ఎంపికలో కీలక ఘట్టం ∙ ప్రారంభమైన దేహధారుఢ్య పరీక్షలు 800 మంది అభ్యర్థులకు 509 మంది హాజరు ∙ ఆధునిక పరికరాలు ఆలస్యంగా రాక ఇబ్బంది పడిన అభ్యర్థులు కాకినాడ క్రైం : కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన శారీరక దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రోజువారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు పరీక్షలకు 800 మంది హాజరు కావాల్సి ఉండగా, 509 మంది పాల్గొన్నారు. మిగిలిన 291 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ వెల్లడించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్వయంగా చేపట్టారు. ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన శారీరక దేహదారుఢ్య పరీక్షలు రాత్రి 9 తొమ్మిది గంటల వరకు కొనసాగాయి. ముందుగా అభ్యర్థుల క్వాలిఫికేష¯ŒS పత్రాల పరిశీలన తర్వాత బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేశారు. అనంతరం ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్ల పరుగు పరీక్ష పూర్తి చేశారు. అనంతరం అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్కానింగ్ చేసి అప్లోడ్ చేశారు. మూడు గంటల విరామం తర్వాత వంద మీటర్లు, లాంగ్జంప్ పరీక్షలను నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానంతో... అభ్యర్థుల ఎంపిక పరీక్షలను పోలీసులు ఆధునిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నారు. 1600 మీటర్లు, వంద మీటర్ల పరుగు పందాలలో అభ్యర్థుల బాడీకి ఆధునిక పరిజ్ఙానం కలిగిన సెన్సార్లు(చిప్ అమర్చిన జాకెట్లు) ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు ఎన్ని సెకండ్లలో, ఎన్ని రౌండ్లు వేశారనే విషయాన్ని పారదర్శకంగా సెన్సార్ల ద్వారా వచ్చిన సమాచారం తెలుస్తుంది. ఎత్తు కొలతలను కూడా మెషీన్ల ద్వారా తీశారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలిచే పరికరాలు సకాలంలో పోలీస్ పెరేడ్ మైదానంలోకి చేరకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం పది గంటల తర్వాత ఇవి రావడంతో సుమారు మూడు గంటల పాటు ఈవెంట్స్ ఆలస్యంగా జరిగాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. చీకట్లో విద్యుత్తు లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రానికి పూర్తికావాల్సిన ఈవెంట్స్ రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. -
స్త్రీ చైతన్యమే ఈమె పరుగు లక్ష్యం!
ఇటీవలే ఎవరెస్టు అధిరోహించిన తెలుగు అమ్మాయి నీలిమ పూదోట. ధైర్యసాహసాలకు పెట్టింది పేరైన ఈ ధీర వనిత.. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది. ఇంత దూరం పరుగుపెట్టడమే కష్టమనుకుంటే.. పాదరక్షలు లేకుండా ఒట్టి పాదాలతోనే పరుగు కొనసాగించి మరింత సంచలనం సృష్టించింది నీలిమ. ఇదేదో పబ్లిసిటీకి చేసిన కార్యమని ఎంత సర్దిచెప్పుకున్నా.. ఆమె మారథాన్ లక్ష్యమేంటో తెలుసుకుంటే మాత్రం మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం..! దేశంలో.. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే అతి వేగంగా వ్యాప్తి చెందుతోన్న జబ్బు రొమ్ము క్యాన్సర్. మహిళలను మానసికంగా శారీరకంగా కుంగదీస్తోన్న ఈ మహమ్మారిపై అవగాహన పెంచేందుకే నీలిమ ఇంత సాహసం చేసింది. రొమ్ము క్యాన్సర్ దరిచేరకుండా మహిళల జీవన శైలి మారేలా చైతన్య పరచాలి. అందుకోసమే నడుం బిగించింది ‘పింకథాన్’. మెట్రో నగరాల్లో త్రీకే, ఫైవ్ కే, టెన్ కే రన్ నిర్వహిస్తూ మహిళలను, యువతులను ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే నీలిమ ఒట్టి కాళ్లతో లాంగ్ రన్ చేయాలని నిశ్చరుుంచుకుంది. అలా విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఏదైనా అనుకుంటే చేసేయడం నీలిమకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. పింకథాన్లో పాల్గొనడానికి నీలిమ 5 నెలలు ప్రాక్టీస్ చేసింది. సూర్యోదయం కంటే ముందే పరుగు ప్రారంభించి సాయంత్రానికి ఆగిపోయేది. ఇదొక్కటే కాదు.. నీలిమ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్నీ రికార్డులే. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ మంచి రైటర్, డాన్సర్. హార్స్ రైడింగ్ తెలుసు. పాటలు కూడా పాడుతుంది. ఏదైనా చేయాలని అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా మారుతుంది. ఆమెకు తల్లిదండ్రులూ ఏనాడూ అడ్డుచెప్పలేదు. మొన్నటికి మొన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ 570 కి.మీ. దూరం సైకిల్ మీద ప్రయాణించింది. తాజాగా పింకథాన్ లో బేర్ఫుట్ రన్నర్గా మరో అరుదైన ఫీట్ సాధించింది. నీలిమ సంకల్ప బలం ముందు ముళ్లబాటలు కూడా పూల బాటలవుతున్నారుు. ఈమె ప్రయాణం మరింత దూరం సాగాలని కోరుకుందాం..! -
నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
గుంటూరు (నగరంపాలెం) : సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున శనివారం డివిజను పరిధిలో పలు రైళ్లు రద్దు చేశామని, మరికొన్ని దారి మళ్లించామని గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలో 17 రైళ్లను రద్దు చేయగా 23 రైళ్లను న్యూగుంటూరు, గుంతకల్, ఖాజీపేట, మీదుగా దారిమళ్లించినట్లు పేర్కొ న్నారు. ట్రైన్ నం 57619 రేపల్లె–సికింద్రాబాద్, ట్రైన్lనం 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు, ట్రైన్ నం 12795/12796 విజయవాడ– సికింద్రా బాద్– విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును యథావిధిగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. న్యూ గుంటూరు మీదుగా దారి మళ్లించిన రైళ్లు ట్రైన్నం 17229/17230 తివేండ్రమ్–హైదరాబాద్ – త్రివేండ్రమ్ శబరి ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 12703/ 12704 చెన్నై–హైదరాబాద్–చెన్నై ఎక్స్ప్రెస్ ఖాజీ పేట, విజయవాడ మీదుగా న్యూగుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్లించామన్నారు. ఖాజీపేట, విజయవాడ వైపునకుదారిమళ్లించిన రైళ్లు ట్రైన్ నం 17016/17015 భువనేశ్వర్–సికింద్రా బాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 12704/12703 సికింద్రాబాద్– హౌరా – సికిం ద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 17203 బావానగర్ – కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్, ట్రై న్ నం 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్, ట్రైన్నం 17255/17256 నర్సాపూర్–హైద్రాబాద్– నర్సా పూర్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 07418 నాగ ర్సోల్–తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం–హౌరా ఎక్స్ప్రెస్ ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు దారిమళ్లించారు. యథావిధిగా విజయవాడ మార్గంలో నడుస్తున్న రైళ్లు విజయవాడలో సిగ్నలింగ్ పనుల కారణంగా గుం టూరు డివిజను మీదుగా సికింద్రాబాద్ వైపు దారి మళ్లించిన ట్రైన్ నం 17405/17406 తిరుపతి – ఆదిలాబాద్–తిరుపతి కష్ణా ఎక్స్ప్రెస్, ట్రైన్ నం 12705/12706 సికింద్రాబాద్– గుంటూరు– సికిం ద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, 12764/12763 సికింద్రాబాద్– తిరుపతి– సికింద్రాబాద్ పద్మవతి ఎక్స్ప్రెస్ యథావిధిగా ఖాజీపేట మీదుగా విజయ వాడ వైపునకు నడుస్తున్నాయి. -
కొనసాగుతున్న ఎయిర్ఫోర్స్ ర్యాలీ
కడప కల్చలర్: జిల్లా యువజన నర్వీసుల శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో కడప నగరం మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ మంగళవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఐదు వేల మంది వరకు యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ఫోర్స్ అధికారులు రామకృష్ణమఠం నుంచి అభ్యర్థులకు పరుగుపందెం పోటీలను నిర్వహించి వారి శారీరక ధారుడ్యాన్ని పరిశీలించారు. వారిలో 374 మంది అర్హత సాధించారు. పూర్తి స్థాయి ఫలితాలను బుధవారం ప్రకటిస్తామని స్టెప్ సీఈఓ మమత తెలిపారు. -
అద్దె ఇళ్లల్లో అంగన్వాడీ కేంద్రాలు
–మునగాలలో 50కేంద్రాలకు 15మాత్రమే పక్కాభవనాలే –ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, చిన్నారులు మునగాల: మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలల్లోనే కొనసాగుతున్నాయి. సరిౖయెన వసతి సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, సిబ్బంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 50అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో కేవలం 15 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మండలంలోని ఆకుపామల, ముకుందాపురం, బరాఖత్గూడెం–1,2, గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, నారాయణగూడెం, మునగాల–1,3,4, తాడువాయి, వెంకట్రాంపురం, నేలమర్రి, విజయరాఘవపురం గ్రామాల్లోమాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దె ఇళ్లల్లో నడుస్తున్నాయి. ఇళ్లను అద్దెకు తీసుకోవడంతో సదరు ఇళ్లల్లో వసతి సౌకర్యాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో బొడ్రాయి వద్ద 2014లో దాదాపు రూ.4లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం నేటికి ప్రారంభం కాకపోడంతో నిరూపయోగంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న ఓ వ్యాపారి ఈ భవనాన్ని స్టోర్రూంగా వాడుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన చిన్నారులు లేకపోవడంతో ఈ భవనం నేటికి నిరూపయోగంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ భవనాన్ని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకొని పలువురికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి సొంత భవన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కొనసాగుతున్న ‘పరీక్షలు’
వరంగల్ : కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో శనివారం 1028 మందికి పరుగు పందెం నిర్వహించారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ఝూ పర్యవేక్షించారు. హన్మకొండ జేఎన్ఎస్ మైదానంలో ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించిన సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన పోటీల్లో 826 మంది పురషు లు, 142 మంది మహిళలు పాల్గొన్నారు. అర్హత పొందిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎంపికలో అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఎఎస్పీ విశ్వజిత్ కంపాటీ, ఏసీపీలు శోభన్కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్కుమార్, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర పాల్గొన్నారు. -
రన్నింగ్ ఒక్కటే మెదడుకు మంచిది
న్యూయార్క్: మానవులు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తెలివితేటలు పెరుగుతాయని గ్రీకులు, రోమన్ల కాలం నుంచి వస్తున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని శాస్త్ర విజ్ఞానపరంగా నిరూపించేందుకు గత రెండు దశాబ్దాలుగా న్యూరోసైన్స్పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ వస్తున్నారు. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మెదడులోని కణాల అభివృద్ధికి తోడ్పడే ప్రొటీన్లు పెరుగుతాయని, కణాలు పెరగడం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఇది పాక్షికంగా మాత్రమే నిజం. మెదడులో జ్ఞాపకశక్తి విస్తరించడానికి, కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి మెదడు కణాల్లో జరిగే జీవన క్రియను వైద్య పరిభాషలో హిప్పోక్యాంపస్ అని పిలుస్తాం. ఈ హిప్పోక్యాంపస్ ప్రక్రియ అభివృద్ధి చెందడానికి శారీరక వ్యాయామం తోడ్పడుతుందనే విషయం కూడా వాస్తవమే. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల ఈ ప్రక్రియ అభివృద్ధి చెందుతుందనే విషయం ఇంతకాలం సంక్లిష్టంగా ఉంటూ వచ్చింది. కొందరు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ఏరోబిక్స్ చేస్తే మెదడు క్రియాశీలకంగా మారుతుందని, జిమ్కెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మెదడు కణాలు అభివృద్ధి చెందుతుందని, ఏరకమైన ఎక్సర్సైజ్ అయినా మెదడుకు మంచిదేనని రకరకాలుగా చెబుతున్న వారు ఎందరో ఉన్నారు. శరీరంలో కొవ్వు కరగడానికి, కండరాలు బలపడడానికి ఏ వ్యాయామమైనా సరిపోవచ్చుగానీ తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడే మెదడు కణాల అభివృద్ధికి మాత్రం పరుగెత్తడం ఒక్కటే మార్గమని ఇటీవల జరిపిన రెండు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో ఓ అధ్యయనాన్ని ఫిన్ల్యాండ్కు చెందిన పరిశోధకులు వెల్లడించగా, మరో అధ్యయనాన్ని ‘సెల్ మెటబాలిజమ్’ తన తాజా సంచికలో వెల్లడించింది. ఈ అధ్యయనాలు జరిపిన రెండు బృందాలు వేర్వేరుగా హెచ్ఐటీ, ఆర్టీ వ్యాయామాలు చేసిన వారిలోని మెదడు కణాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. హెచ్ఐటీ అంటే హై ఇంటెన్సిటివ్ ఇంటర్వెల్ ట్రేనింగ్, అంటే ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడం, ఆర్టీ అంటే రిసిస్టెంగ్ ట్రేనింగ్, అంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేయడం. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాలు స్వల్పంగా అభివృద్ధి చెందాయి. వెయిట్లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరుగెత్తే వారి మెదడులో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా వారిలో హిప్పోక్యాంపస్ ప్రక్రియ వేగవంతమై మెదడులోని కణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పాత కణాలు బలపడడమే కాకుండా కొత్త కణాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ పరిశోధనల ద్వారా పరుగెత్తడమే మెదడుకు మంచిదని, జ్ఞాపక శక్తి పెరిగి తెలివి తేటలుపెరుగుతాయని పరిశోధకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రోజూ పరుగెత్తే వారందరికి తెలివి తేటలు వాటంతట అవే వస్తాయనుకుంటే పొరపాటు. అలా అయితే పోటీల్లో పాల్గొనే రన్నర్లు అందరూ తెలివితేటలు కలిగిన వారై ఉండాలి. తెలివితేటలు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన శక్తి మాత్రమే మెదడుకు సంక్రమిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై దృష్టిని కేంద్రకరిస్తే వాటిల్లో మన తెలివితేటలు పెరుగుతాయి. -
నాలుగు నెలలు...పదిహేను కేజీలు!
‘బంచిక్ బంచిక్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా....’ అంటూ సన్నబడాలనుకునేవాళ్లు యోగా చేసి చిక్కుతారు. లావవ్వాలంటే.. కండలు పెరగాలంటే మాత్రం జిమ్ చేయాలి. కడుపు నిండా తినాలి. ఆ మధ్య ఆమిర్ఖాన్ అదే చేశారు. మల్లయోధునిగా ఆమిర్ నటిస్తున్న చిత్రం ‘దంగల్’. ఈ సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగారు ఆమిర్. సినిమా మొత్తం ఈ వెయిట్తో కనిపించరు. చిక్కిన ఆమిర్ కూడా కనిపిస్తారు. అందుకే ముందు పెరిగి, ఆ సీన్స్ తీశాక తగ్గారు. ఇంతకీ ఈ హీరోగారు ఎలా బరువు తగ్గారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జస్ట్ రన్నింగ్తోనే 15 కేజీలు తగ్గారట. నాలుగు నెలల్లో రోజుకు 7 నుంచి 9 కిలోమీటర్ల చొప్పున పరిగెత్తారట. అంటే.. మొత్తం వెయ్యి కిలోమీటర్ల పైనే. రన్నింగ్తో పాటు స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అయ్యారు. దాంతో నాలుగు నెలల క్రితం ఆమిర్ని చూసినవాళ్లు ఇప్పుడు చూసి, ‘ఔరా’ అనకుండా ఉండలేకపోతున్నారు. -
పరుగు పోటీలో కుప్పకూలిన అభ్యర్థి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్: దేహ దారుఢ్య పరీక్షల నిమిత్తం సీఆర్పీఎఫ్ నిర్వహించిన పరుగు పోటీలో పాల్గొన్న ఏఎస్సై అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన శనివారం బార్కాస్ సీఆర్పీఎఫ్ క్యాంపస్లో జరిగింది. ఒడిశా రాష్ట్రం రాంపూర్కు చెందిన హిమాన్షు చంద్ర జానా(29) ఏఎస్సై పోస్టుల భర్తీ కోసం సీఆర్పీఎఫ్లో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం నగరానికి వచ్చారు. చాంద్రాయణగుట్ట బార్కాస్ సీఆర్పీఎఫ్ క్యాంపస్లో ఉదయం 7 గంటలకు నిర్వహించిన 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 800 మీటర్లకు చేరుకోగానే ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆయన్ను డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. -
కర్నాటక మట్టిలో పుట్టాడు.. దేశం వదిలిపోడు..!
మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాక, దేశం వదిలి పారిపోయారన్న ప్రచారంతో ఇటీవల ప్రధానంగా వార్తల్లో నిలిచిన లిక్కర్ కింగ్ విజయమాల్యాపై మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాంకులకు 9000 కోట్ల రూపాయలు ఎగవేసి, గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారంటూ మాల్యాపై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన వెనకేసుకొచ్చారు. ''అతడు కర్నాటక మట్టిలో పుట్టాడు. దేశం వదిలి పారిపోడు'' అంటూ మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ట్విట్ చేశారు. ఓ టాప్ బిజినెస్ మెన్ ను పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సిందిగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సమన్లు పంపింది. అయితే తాను దేశం వదిలి పరారైనట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాల్యా ట్విట్టర్ లో ఖండించిన విషయం తెలిసిందే. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని, విదేశాలకు వెళ్ళి రావడం తనకు మామూలేనని, పరారైనట్లుగా మీడియా ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాల్యాను సపోర్ట్ చేస్తూ మాజీ ప్రధాని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నట్లు చెప్తున్నా కచ్చితమైన సమాచారం మాత్రం దొరకలేదు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఆయన ఈనెల 18న భారత్ కు తిరిగి వస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే అనుకున్నట్లుగా మాల్యా భారత్ తిరిగి వస్తే ...ఆయన పరారైనట్లు జరిగిన ప్రచారం ఉత్తదేనని తేలిపోవడంతోపాటు.. దేవెగౌడ వ్యాఖ్యలకూ ఊతం చేకూరే అవకాశం ఉంది. -
పరుగుల వీరుడు అనిల్
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎనిమిది పతకాలు చదవులోనూ దిట్ట కనగానపల్లి: కనగానపల్లికి చెందిన అంకె అనిల్ ఓంకార్ పరుగు పందెంలో పాఠశాల నుంచి రాష్ర్ట స్థాయి పోటీల వరకు రాణిస్తూ పరుగుల వీరుడిగా గుర్తింపు పొందుతున్నాడు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఈ విద్యార్థి ఒక విద్యా సంవత్సరం(2014-15)లోనే ఎనిమిది పతకాలు సాధించాడు. వంద మీటర్ల పరుగు పందెంలోనే కాకుండా సుదీర్ఘ దూరం పరిగెత్తే (800 మీటర్లకు పైగా) పరుగు పందెం పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తూ అనేక పతకాలు, సర్టిఫికెట్లు సాధించాడు. 2014, అక్టోబర్లో చిత్తూరు జిల్లా బీరకుప్పంలో జరిగిన జోనల్ స్థాయి పరుగు పోటీల్లో రాణించి 1500 మీటర్లు, 600 మీటర్ల పోటీలలో మొదటి స్థానంలో నిలిచాడు. 800 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచి పతకాలు సాధించాడు. 2014 నవంబర్లో చిత్తూరు జిల్లా పుంగనూరులో జిల్లా స్థాయిలో జరిగిన 3000 మీటర్లు పరుగులో మొదటి స్థానం, 800 మీటర్ల పరుగులో మూడో స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అనంతరం 2015 జనవరిలో కృష్ణా జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థి ఐదో తరగతిలో రెసిడెన్షియల్ స్కూల్లో సీటు సాధించి చదువులోనూ ముందున్నాడు. ఇతని తల్లిదండ్రులు సుబ్రమణ్యం, నాగలక్ష్మమ్మ గ్రామంలో టీకొట్టు నడుపుకొంటూ జీవనం చేస్తున్నారు. -
నైన్త్ వండర్
తల్లి కాబోతుందని తెలిస్తే చాలు... ఇంటి నుంచి కాలు కదపొద్దంటారు. అవి తినొద్దు... ఇవి తినొద్దు... పథ్యం పాటించాల్సిందేనంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కామారపు లక్ష్మి (42) మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఏకంగా రన్నింగే చేసేశారు! రన్నింగ్ చేస్తే పోయేదేమీ లేదు అనారోగ్యాలు తప్ప అని చెబుతున్నారు. నిండు గర్భిణిగా ఉంటూ కిలోమీటర్ల కొద్దీ రన్నింగ్ చేస్తున్నారు లక్ష్మి. బొప్పాయిసహా అన్ని రకాల పండ్లను ఆరగిస్తున్నారు. అంతేకాదు, చంద్ర గ్రహణం రోజు బయటకు వెళ్లొద్దని పెద్దలు చెప్పిన మాటలను కూడా పట్టించుకోకుండా స్టేడియానికి వెళ్లి కిలోమీటర్ల కొద్దీ రన్నింగ్ చేసి వచ్చారు. మొన్నటికి మొన్న (ఆదివారం) 9 నెలల నిండు గర్భిణిగా అయినప్పటికీ, మరో వారం పది రోజుల్లో కాన్పు అయ్యే అవకాశాలున్నాయని తెలిసినప్పటికీ 30 నిమిషాల 20 సెకన్లలో ఏకంగా 5 కిలో మీటర్ల రన్నింగ్ చేసి ఔరా అనిపించారు. 120 కోట్ల జనాభాగల భారతదేశంలో నిండు గర్భిణిగా 5 కిలోమీటర్లు ఏకధాటిగా రన్నింగ్ చేసిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించి సాహస ‘లక్ష్మి’గా అవతరించారు. అయినా ఇంత సాహసం ఎందుకు చేశారని అడిగినప్పుడు లక్ష్మి చెప్పిన విశేషాలివి. సిలివేరి మహేందర్, సాక్షి, కరీంనగర్ మాది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్. ఆరేళ్ల కిందట శ్రీనివాస్తో పెళ్లయింది. ప్రస్తుతం రెండేళ్ల కూతురు. పేరు ఆశ్రీత. నాన్న పోలీస్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడాయన లేరు. నేను పదవ తరగతిలోనే బడి మానేసా. అప్పట్లో ఈ ఆట పాటలు లేవు. నాలుగేళ్ల నుంచి భర్త శ్రీనివాస్ తో కలిసి రోజు రన్నింగ్ చేస్తున్నాను. ఏదో సాధించాలనే పట్టుదల కంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా తపనతోనే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. నా విజయం వెనుక ఉన్నది ఆయనే ! నా విజయం వెనుక మా వారు శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది. పెళ్లయినప్పటి నుంచి ‘నీలో ఏదో టాలెంట్ ఉంది’ అని చెబుతుండేవారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా వారు రోజూ ఉదయం సాయంత్రం స్టేడియంకు వెళ్లి రన్నింగ్ చేసేవారు. ఓ సారి ఆయన కూడా వెళ్లినప్పుడు నాకూ రన్నింగ్ చేయాలని అనిపించింది. మరుసటిరోజే రన్నింగ్ చేయడం ప్రారంభించాను. ఫస్ట్ రెండు రౌండ్లు కొట్టాను. రన్నింగ్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే అలసట రాదు? ఎక్కువ సేపు పరుగెత్తాలంటే ఎలా చేయాలి... ఇలాంటివన్నీ మావారు నేర్పేవారు. ఆయన ఇచ్చిన కోచింగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చంఢీఘర్ స్ఫూర్తి తొలిరోజుల్లో నేను వ్యాయామం కోసం కొంతసేపు రన్నింగ్ చేసేదాన్ని. ఒకసారి చంఢీఘర్లో జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలుండటంతో మా ఆయన తీసుకెళ్లారు. అ పోటీల్లో 70 ఏళ్ల వయస్సున్న మహిళలు రన్నింగ్ చేయడం కన్పించింది. వాళ్లను చూశాకే తెలిసింది... మా వారు నాలో టాలెంట్ ఉందని ఎందుకు అంటున్నారో అని. తిరిగొచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ 2, 3, 5 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేయడం ప్రారంభించాను. అప్పుడు మొదలైన రన్నింగ్ నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అమ్మ ఏడ్చింది... నేను తొలిసారి ప్రెగ్నెంట్ అని తెలియగానే సంతోషించిన అమ్మ రోజూ వ్యాయామం చేస్తున్నట్లుగా తెలియగానే చాలా భయపడింది. అయినా వినకుండా వ్యాయామం, వాకింగ్ చేశాను. ఆపరేషన్ లేకుండా తొలికాన్పు జరిగింది. ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ సమయంలో నేను రన్నింగ్, ఎక్సర్సైజులు చేస్తుండటంతో అమ్మ వారించింది. వినకపోవడంతో చాలా ఏడ్చింది. నా బిడ్డను ఏమో చేస్తున్నావని మా ఆయనను దూషించింది. మొన్న (ఆదివారం) కూడా 5 కిలోమీటర్లు ఆగకుండా రన్నింగ్ చేయబోతున్నానని తెలిసి బాగా ఏడ్చేసింది. కానీ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడంతో అమ్మ ఊపిరి పీల్చుకుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకే ఈ సాహసం! మొదటి కాన్పుకు ముందు కూడా వ్యాయామం బాగా చేశాను. అప్పుడు ఈ 5 కిలో మీటర్ల రన్నింగ్ చేయలేదు కాని 2, 3 కిలో మీటర్ల రన్నింగ్ చేశాను. పాప ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒకే దగ్గర ఉండి పని చేయడం కాదు. అటు ఇటు కదిలే పనులూ చేసుకుంటూ పోవాలి. అప్పుడే పుట్టబోయే వారు ఆరోగ్యంగా ఫుడతారు అని మా వారు చెప్పారు. పెద్ద పాప ఆశ్రీత ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఈ కాన్పు కూడా అలాగే ఉండాలని 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం ప్రారంభించాను. సుమారు 4 నెలలు నిండినప్పటి నుంచి రోజు ఉదయం, సాయంత్రం స్టేడియంలో 13 రౌండ్లు తిరిగేదాన్ని. నాకెలాంటి నొప్పులు, అనారోగ్యాలూ, ఇబ్బందులూ ఏమీ లేవు. చాలా సంతోషంగా ఉన్నాను. ఆశయాలు ఏమీ లేవు... నేను ఏదో రికార్డు సాధించాలని ఈ సాహసం చేయలేదు. ఆశయాలు కూడా ఏమీ లేవు. రికార్డ్ ను సాధిస్తానని కూడా అనుకోలేదు కూడా. రికార్డ్ మీట్లో నన్ను చాలా మంది ప్రోత్సహించారు. రోజూ నువ్వు ఏ విధంగా రన్నింగ్ చేస్తావో ఇప్పుడు కూడా అదే విధంగా చేయమని చెప్పారు. అలాగే చేశాను. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కినందుకు ఆనందంగా ఉంది. గిన్నిస్ బుక్ కూడా పంపుతారట. చాలా సంతోషం. కెనడా దేశం మహిళా అమీ గర్భిణిగా ఉండి మారథాన్ ను 6 గంటల 12 నిమిషాల్లో చేసిందని విన్నాను. నాకా ఛాన్స్ లేదు కదా. (నవ్వుతూ). ఫోటోలు: గుంటపల్లి స్వామి మనమే స్పూర్తి కావాలి పాశ్చాత్య దేశాల్లో గర్భిణీ స్త్రీలకు వ్యాయామము తప్పనిసరి. వ్యాయామంతో పుట్టబోయే పాపకు సరియైన ఆక్సిజన్ అందుతుంది. ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. గర్భిణుల సుఖ ప్రసవానికి వ్యాయామ అవసరమని తెలియజేయడానికి, వారిలో స్పూర్తిని నింపడానికి నేనీ సాహసం చేశాను. అందరూ సహకరించారు. రికార్డ్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని మహిళలందరికీ భారతీయులే స్పూర్తిగా నిలవాలన్నదే నా ఆకాంక్ష. - కామారపు లక్ష్మి -
అమ్మాయిల పరుగుపై నిషేధం
మెల్బోర్న్: ఆధునిక కాలంలోనూ విద్యాసంస్థలకు కూడా మూడనమ్మకమత మౌఢ్యాలు తప్పడం లేదు. ఆస్ట్రేలియాలోని ఓ ఇస్లామిక్ కాలేజీలో అమ్మాయిలకు పరుగు పోటీలను నిషేధించారు. వారు కన్యత్వాన్ని కోల్పోతారని ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు ఏకంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ పని చేశాడు. దీంతో ఇప్పుడతనిపై కేసు నమోదైంది. ట్రుగానినా సూబర్బ్లోని అల్ తఖ్వా అనే కాలేజీలో ఉన్నపలంగా అమ్మాయిలెవరూ ఆటల్లో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అదే కళశాలలో గతంలో పనిచేసిన ఓ ఉపాధ్యాయుడు విక్టోరియన్ రిజిస్ట్రేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (వీఆర్ క్యూఏ)కి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నాడని, వారిని తప్పుడు ఉద్దేశాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విచారణ చేపట్టిన అథారిటీ అసలు విషయం రాబట్టింది. కళశాల ప్రిన్సిపాల్ ఒమర్ హల్లాక్ మూఢ మత విశ్వాసాలకు బద్ధుడై ఉండి అమ్మాయిలు పరుగెత్తితే వారి కన్యత్వాన్ని కోల్పోతారని, సాకర్ వంటి ఆటలు ఆడటం వల్ల సంతాన లేమి సమస్యలు కూడా వస్తాయని భావించి వారిని ఆటల్లో పాల్గొనకుండా నిషేధం విధించాడని తెలిసింది. దీంతో అతడిని నిందితుడిగా చేర్చారు. -
నా ఫిట్ నెస్ రహస్యం అదే: సానియా మీర్జా
హైదరాబాద్: ఫిట్నెస్లో పరుగుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తాను రన్నింగ్ను ఎంతో ఇష్టపడతానని.. తన ఫిట్నెస్కు అదే కారణమని ఆమె వెల్లడించారు. శనివారం ఇక్కడ ‘ఆడిడాస్ ఆల్ట్రా బూస్ట్ రన్నింగ్ షూస్’ను ఆమె మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగరవాసుల్లో ఆరోగ్యంపట్ల అవగాహన పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మార్టినా హింగిస్తో జతకడుతున్నానని, తామిద్దరం మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అంతా హడావుడే !
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జిల్లా ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరకు ఉసూరుమంటూ వెనుదిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు మార్గాన వస్తున్నారని, కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారని సీఎం పేషీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు పడిన హడావుడి ఇది. ముఖ్యమంత్రి విమానంలో విశాఖపట్నం నుంచి వస్తూ రాజధాని ప్రాంతంపై ఓ లుక్కేసి తిరుపతి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఉంటుందని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఉంటారని సోమవారం ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో మంత్రులు, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీఎం రాజధాని ప్రాంతానికి రోడ్డు మార్గాన వస్తున్నట్లు సంక్రాంతి సంబరాల్లో ఉన్న జిల్లా కలెక్టర్కు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడును వెంటతీసుకొని హడావుడిగా వేదిక దిగివెళ్లి పోయారు. జిల్లా ఎస్పీలను, తుళ్లూరులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట వరకు బందోబస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటికి సంక్రాంతి సంబరాల వేదికపై ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సమాచారం అందడంతో ఆయన కూడా హడావుడిగా కార్యక్రమాన్ని ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి వెంకటపాలెం చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం విశాఖపట్నం నుంచి విమానంలో వస్తూ రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి తిరుపతి వెళ్లిపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగారు. ఇదిలావుండగా, రాజధాని ప్రాంతంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఖరారు అవుతుండటంతో జిల్లా ఉన్న తాధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
* 7 జిల్లాల నుంచి 6 వేలమందికి పైగా పాల్గొన్న అభ్యర్థులు * ఎత్తు ప్రాతిపదికన 3597 మంది ఎంపిక * ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం పరుగు, లాంగ్ జంప్ పోటీలు విద్యానగర్(గుంటూరు) :నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈనెల 20 వతేదీవరకు వివిధ విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిరోజు గుంటూరు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు 6 వేల మందికి పైగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎంపిక కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ముందుగా అభ్యర్థులను 400 మంది చొప్పున మైదానంలోకి అనుమతించారు. అనంతరం వారిని క్యూ పద్ధతిలో ఎత్తు ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పంపారు. కనీస ఎత్తు 166 సెంటీమీటర్లుగా నిర్ణయించడంతో వచ్చిన అభ్యర్థుల్లో 3597 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికయ్యారు. వారిని ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా టెంట్లను ఏర్పాటుచేసి విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్మీ సిబ్బంది సహకారంతో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ప్రధానంగా నివాస ధ్రువీకరణ పత్రాలు, ఐడీ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికెట్లు పరిశీలించారు. తదనంతరం అభ్యర్థులకు తాము ప్రకటించిన పర్సంటేజ్ మార్కుల జాబితాలో ఉందా, లేదా అని ఆర్మీ అధికారులు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. సర్టిఫికెట్ల ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రన్నింగ్, లాంగ్జంప్ తదితర పోటీలు నిర్వహిస్తామని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాఫ్రి తెలిపారు. నిర్ణీత ఎత్తు కంటే తక్కువ ఎత్తుగల అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ నుంచి తొలగించి వారి చేతికి రంగు రాసి వెనక్కి పంపారు. తక్కువ ఎత్తు ఉండి గురువారం ఎంపిక కాని అభ్యర్థులు తక్కువ ఎత్తు ఉన్న ట్రేడ్ల ఎంపిక రోజున తిరిగి పాల్గొనవచ్చని చెప్పారు.శుక్రవారం జరుగనున్న పరుగు పందెంలో 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలని తెలిపారు. 9 అడుగుల లాంగ్ జంప్, పుష్ అప్స్ తదితర ఈవెంట్స్ కూడా నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు టెక్నికల్ విభాగానికి ఎంపిక జరుగుతుందని కల్నల్ తెలిపారు. విలువైన వస్తువులు వెంట తేవద్దు ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థుల కోసం మంచినీరు, తదితర వసతులను సంబంధిత శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది తమ సెల్ఫోన్లు, విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నామని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కల్నల్ జాఫ్రి అభ్యర్థులు తమ విలువైన వస్తువులు తమ వెంట తీసుకురావద్దని, కేవలం సర్టిఫికెట్లను మాత్రమే జాగ్రత్తగా తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికలో ఆర్మీ అభ్యర్థులకు సహకరించి విధులు నిర్వహించిన ఈస్ట్ డీఎస్పీ గంగాధరానికి, పోలీసు సిబ్బందికి కల్నల్ జాఫ్రి కృతజ్జతలు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఇతర జిల్లాలనుంచి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఎంపికలో పాల్గొనాలనే తపనతో అభ్యర్థులు తోసుకుంటుండడంతో పోలీసులు కర్రలు తీసుకుని దాడి చేసినంత పని చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 మంది పోలీసులు విధులు నిర్వహించారు. -
జీవితానికి రన్వే...
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు. ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు. క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్ల కోసం ఒకరు... ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ మారథాన్ నిర్వహిస్తున్న వేళ విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి... అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్లు, పది హాఫ్ మారథాన్లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్లో 100 కి.మీ రేస్లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న ఏకైక మహిళ ఆమె. ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు! ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్లోకి తెచ్చుకున్నారు. గత ఏడాది మే నెల నుంచి మారథాన్లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె. ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె. మారిన జీవన శైలి! ఇప్పటికి 12 హాఫ్ మారథాన్లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్లో పాల్గొంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం. - వాకా మంజులారెడ్డి -
ప్రపంచంలో అత్యంత కష్టమైన క్రీడ
ఐరన్మ్యాన్ ట్రయాథ్లాన్ స్విమ్మింగ్.. సైక్లింగ్.. రన్నింగ్.. ఈ మూడు కలిస్తే ట్రయాథ్లాన్. 1.5 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్.. 40 కిలోమీటర్ల సైక్లింగ్.. 10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసే వారే విజేతలుగా నిలుస్తారు. క్లిష్టమైన క్రీడల్లో ఒకటైన ట్రయాథ్లాన్ను మించిన కష్టసాధ్యమైనది మరొకటి ఉంది. అదే ఐరన్మ్యాన్ ట్రయాథ్లాన్. ప్రపంచంలోనే దీన్ని అత్యంత కష్టమైన క్రీడగా చెబుతుంటారు. ప్రపంచ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతీయేటా జరిగే ఐరన్మ్యాన్లో పాల్గొనే అథ్లెట్లు 3.86 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి... ఆ తర్వాత 180.25 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. ఆ వెంటనే 42.2 కిలోమీటర్ల మారథాన్ను పూర్తి చేయాలి. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారే విజేత. అయితే ఐరన్మ్యాన్ ట్రయాథ్లాన్ను కేవలం 17 గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ ట్రయాథ్లాన్లో తొలి దశలో స్విమ్మింగ్ను ఉ. గం. 9.20 ని. కల్లా పూర్తి చేయాలి. సైక్లింగ్ను సా. గం. 5.30 ని.లకు (8 గం. 10 ని. ల్లో) పూర్తి చేసి మారథాన్ను మొదలుపెట్టాలి. అర్ధరాత్రి 12 కల్లా (6 గం. 30 ని.ల్లో) ముగించాలి. ఇలా మూడు దశలను వేగంగా ముగించిన వారే ఐరన్మ్యాన్ టైటిల్ను అందుకుంటారు. హవాయ్ వేదికగా... కష్టసాధ్యమైన ఐరన్మ్యాన్ ట్రయాథ్లాన్ పోటీలు హవాయ్ వేదికగా ప్రతీయేడాది జరుగుతాయి. 1978 నుంచి ఈ ట్రయాథ్లాన్ను నిర్వహిస్తున్నారు. ఐరన్మ్యాన్ ప్రపంచ చాంపియన్షిప్ పేరుతో పోటీలను జరుపుతున్నారు. -
పురుషోత్తమా...పరుగెత్తుమా!
మెన్స్ హెల్త్ పరుగు ప్రస్తావన రాగానే...‘‘ఏదో స్కూలు రోజుల్లో పరుగెత్తేవాడిని’’, ‘‘కాలేజీ రోజుల్లో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు పరుగెత్తేవాడిని’’... ఇలాంటి మాటలు సహజంగానే వినిపిస్తాయి. పరుగు గురించి ప్రస్తావించబోతే ‘‘ఈ వయసులో పరుగేమిటి?’’ అని కూడా ఆశ్చర్యపోతారు. అంతో ఇంతో ఆరోగ్యస్పృహ ఉన్నవాళ్లు కూడా పరుగుకు దూరంగా ఉంటారు. చాలామంది పురుషులకు ‘పరుగు’ అనేది ఒక బాల్య జ్ఞాపకం మాత్రమే. పరుగు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. పరుగు వల్ల ప్రయోజనాలు ఇవి... * శరీరంలోని ప్రతి భాగం ఉత్తేజితం అవుతుంది. * మూడ్(మానసికస్థితి) తాజాగా, హుషారుగా ఉంటుంది. * రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. * బరువు తగ్గడానికి పరుగు అనేది ఉత్తమ మార్గం. * ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. * ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుంది. * టెన్షన్ తలనొప్పులను దూరం చేస్తుంది. * కుంగుబాటును దరి చేరనివ్వదు. (కుంగుబాటు నుంచి తక్షణం బయటపడడానికి పరుగును మించిన ఔషధం లేదంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు) -
పరుగు పోరాటం!
అభివృద్ధిలో వెనుక ఉన్నా... ఆదాయం అంతంత మాత్రమైనా... ఆకలితో అలమటిస్తున్నా... ఆహార్యం ఆకట్టుకునేలా లేకపోయినా... ఇవేమీ వారు పట్టించుకోరు. బరిలో దిగితే విజయమే లక్ష్యంగా గమ్యంవైపు సాగిపోతారు. పతకాలు, పైసలు అందించే తొలి మూడు స్థానాలు సొంతం చేసుకోవాలని ఆరాటపడతారు. అమెరికాలో అయితేనేం... యూరోప్లో అయితేనేం... భారత్లో అయితేనేం... ప్రపంచంలో వేదిక ఏదైనా మధ్య, సుదూరపు లక్ష్యం (మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్) పరుగు రేసులు జరుగుతున్నాయంటే ఆఫ్రికా దేశాలు కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ లేకుండా విజేతల జాబితా కనిపించదు. - కరణం నారాయణ ప్రపంచ జనాభాలో ఒక శాతం కూడా లేని కెన్యా, ఇథియోపియా తదితర జాతీయులు ప్రపంచ అథ్లెటిక్స్ను శాసించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మధ్య, సుదూరపు రేసుల్లో పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ఆధిపత్యం వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు పలు పరిశోధనలు గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. అయితే కచ్చితంగా ఫలానా కారణంతోనే వారు విజేతలుగా నిలుస్తున్నారనే విషయం తేలడంలేదు. సహజసిద్ధ జన్యుపరమైన శరీర నిర్మాణం అని ఒకరంటే... వారి జీవనశైలి నేపథ్యమని మరికొందరంటారు. ఇంటి నుంచి స్కూల్కు వెళ్లేటపుడు... మళ్లీ ఇంటికి వచ్చేటపుడు పరుగెడుతూ వెళ్తారని... ఈ విధంగా వారికి పరుగు జీవనంలో భాగమైపోతుందని... ఈ తరహా జీవనం అలవాటుపడిన వారికి పరుగు పందెం సమయాల్లో అనుకూలిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గణాంకాలు కూడా ఆఫ్రికా అథ్లెట్స్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పర్వతప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్స్ మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తున్నారని మరికొందరి వాదన. శ్రేష్టమైన వాతావరణానికితోడు భీకరమైన సాధన, లక్ష్యంపై పట్టుసడలని ఏకాగ్రత తదితర అంశాలే వారిని విజయవంతం చేస్తున్నాయని కెన్యా అథ్లెట్స్పై పరిశోధన చేసిన మాల్కమ్ గ్లాడ్వెల్ వివరిస్తున్నారు. ‘ఈ ప్రపంచంలో కష్టపడనిదే ఏదీ లభించదు. పరుగు కూడా మానసిక ప్రవృత్తితో కూడుకున్నది’ అని 1968 మెక్సికో ఒలింపిక్స్లో 1500 మీటర్ల విభాగంలో... 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో స్వర్ణ పతకాలు నెగ్గిన కెన్యా విఖ్యాత అథ్లెట్ కిప్చోజ్ కీనో అభిప్రాయం. ఇతర క్రీడల మాదిరిగానే రన్నింగ్లోనూ శారీరక శ్రమ ఉంటుంది. లారీ బర్డ్, మైకేల్ జోర్డాన్ పొడుగ్గా ఉన్నందుకే బాస్కెట్బాల్లో దిగ్గజ హోదా సంపాదించలేదు. అలాగే అనుకూల వాతావరణం ఉన్నందుకే కెన్యా అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారనడం భావ్యం కాదు. శరీరంలోని జన్యువులు మనలో మేటి అథ్లెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో నిర్ణయిస్తాయి. ఆ తర్వాత విజ్ఞత, అంకితభావం, ప్రణాళికతో కూడిన సాధన తదితర అంశాలే గెలుపోటములను శాసిస్తాయి. కెన్యా, ఇథియోపియాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల అథ్లెట్స్లో ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్నాయి. కెన్యా టాప్ - ఇథియోఫియా రన్నరప్ 1983లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మొదలయ్యాక ఇప్పటివరకూ ఓవరాల్గా కెన్యా 43 స్వర్ణాలు, 37 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి 112 పతకాలు సాధించింది. ఓవరాల్గా పతకాల జాబితాలో కెన్యాది మూడో స్థానం. అలాగే ఇథియోపియా 22 స్వర్ణాలు, 19 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 64 పతకాలతో ఏడో స్థానంలో ఉండటం విశేషం. ప్రపంచంలో ప్రతిష్టాత్మక మారథాన్లుగా పేరొందిన న్యూయార్క్, బోస్టన్, లండన్, చికాగో, బెర్లిన్, టోక్యో రేసుల్లోనూ కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ పలుమార్లు విజేతలుగా నిలిచారు. 1956లో తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగిన కెన్యా ఇప్పటివరకు 25 స్వర్ణాలు, 32 రజతాలు, 29 కాంస్యాలు సాధించింది. ఇందులో అథ్లెట్స్ మాత్రమే 24 స్వర్ణాలు, 31 రజతాలు, 24 కాంస్యాలు అందించడం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కెన్యా అథ్లెట్స్ పురుషుల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్ల స్టీపుల్చేజ్, మారథాన్లో... మహిళల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి సంచలనం సృష్టించారు. 1956లోనే ఒలింపిక్స్లో తొలిసారి అడుగుపెట్టిన ఇథియోపియా ఇప్పటివరకు 21 స్వర్ణాలు, ఏడు రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలు సాధించింది. ఈ పతకాలన్నీ అథ్లెటిక్స్లోనే రావడం విశేషం. ఇథియోపియా విఖ్యాత అథ్లెట్స్ అబీబి బికిలా: బూట్లు లేకుండా పరుగెత్తి 1960 రోమ్ ఒలింపిక్స్ మారథాన్ రేసులో స్వర్ణం సాధించాడు. 1964 టోక్యో ఒలింపిక్స్లోనూ బికిలా మారథాన్లో పసిడి పతకం గెలిచాడు. హెయిలీ గెబ్రెసెలాసీ: వరుసగా రెండు ఒలింపిక్స్లలో (1996 అట్లాంటా, 2000 సిడ్నీ) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు సాధించాడు. వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్షిప్లలో (1993, 1995, 1997, 1999) 10,000 మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. కెనెనిసా బెకెలె: వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్షిప్లలో (2003, 2005, 2007, 2009) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గాడు. ఏథెన్స్ ఒలింపిక్స్లో 10,000 మీటర్ల రేసులో... బీజింగ్ ఒలింపిక్స్లో 10,000 మీటర్లు, 5000 మీటర్ల రేసులో పసిడి పతకాలు సాధించాడు. తిరునెష్ దిబాబా: బీజింగ్ ఒలింపిక్స్లో 10,000, 5000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గింది. లండన్ ఒలింపిక్స్లో 10,000 మీటర్ల రేసులో పసిడి పతకం. ప్రపంచ చాంపియన్షిప్లో ఐదు స్వర్ణాలు. కెన్యా మేటి అథ్లెట్స్ కెంబోయ్ ఎజికిల్: రెండు ఒలింపిక్స్లో (ఏథెన్స్, లండన్) 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో స్వర్ణాలు నెగ్గాడు. వరుసగా మూడు ప్రపంచ చాంపియన్షిప్లలోనూ (2009, 2011, 2013) పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. వివియన్ చెరుయోట్: రెండు ప్రపంచ చాంపియన్షిప్లలో (2009, 2011) మూడు స్వర్ణాలు సాధించిన చెరుయోట్ లండన్ ఒలింపిక్స్లో రజతం, కాంస్యం నెగ్గింది. నాన్సీ లాంగత్: ఐదు అడుగుల ఎత్తు ఉన్న నాన్సీ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 1500 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో 800, 1500 మీటర్లలో పసిడి పతకాలు నెగ్గింది. డేవిడ్ రుదిషా: లండన్ ఒలింపిక్స్లో 800 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు సమయంతో స్వర్ణం నెగ్గిన 25 ఏళ్ల రుదిషా... 2011 ప్రపంచ చాంపియన్షిప్లోనూ పసిడి సాధించాడు. పమేలా జెలిమో: బీజింగ్ ఒలింపిక్స్లో 18 ఏళ్ల ప్రాయంలోనే 800 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గి కెన్యా తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు పొందింది. -
41 అంగల్లో ‘ఫినిష్’
భూమి మీద ప్రాణికోటి పుట్టినట్లుగా చెబుతున్న గత 2 లక్షల సంవత్సరాల కాలంలో అందరికంటే వేగవంతమైన మనిషిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. పరుగు ప్రయాణంలో అతని ఒక్కో అడుగుకు ఎంతో విలువ ఉంది. కనీసం ఇతరుల ఊహకు కూడా అందని అనేక రికార్డులు అలవోకగా సొంతం చేసుకున్న ఆ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ప్రపంచ క్రీడా రంగానికి పరిచయం అవసరం లేని పేరు. వాస్తవానికి బోల్ట్ గెలుపు ప్రస్థానానికి కారణం ఇదీ అంటూ ఏ పరిశోధనా నిరూపించ లేకపోయింది. అయితే అతని పరుగు సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు కనిపించాయి. ఆ ఆసక్తికర అంశాలు, లక్షణాలు అతడిని ఇతరులతో పోలిస్తే ముందు నిలబెట్టాయి. దీనికి సంబంధించి మెక్సికోలోని నేషనల్ అటానమస్ యూనివర్సిటీ బోల్ట్ పరుగుపై ప్రయోగాలు చేసింది. 100 మీ. పరుగులో 9.58 సెకన్లు, 200 మీ. పరుగులో 19.19 సెకన్లతో రికార్డులు ప్రస్తుతం బోల్ట్ పేరిట ఉన్నాయి. అతని ప్రపంచ రికార్డు పరుగును ఉదాహరణగా తీసుకుంటూ అతి క్షుణ్ణ పరీక్ష జరిపారు. ఆ విశేషాలేమిటో చూద్దామా.... - మొహమ్మద్ అబ్దుల్ హాది (సాక్షి స్పోర్ట్స్) 100మీ., 200 మీ. పరుగులో అతను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్...ఈ రెండు విభాగాల్లోనూ అన్ని రికార్డులు అతని పేరిటే ఉన్నాయి. ఆరు ఒలింపిక్ స్వర్ణాలు...ఎనిమిది ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు...ఈ జాబితా చాలా పెద్దది. ఇవన్నీ బోల్ట్కు మాత్రమే సాధ్యమయ్యాయి. మరి ఈ జమైకన్లో గొప్పతనం ఏమిటి? అసలు బోల్ట్ పరుగు మిగతా అథ్లెట్లకంటే ఏ రకంగా భిన్నం? నైపుణ్యం, దేహదారుఢ్యం, ప్రాక్టీస్...ఇవన్నీ సాధారణంగా చాలా మంది అంతర్జాతీయ అథ్లెట్లలో కనిపించే లక్షణాలే. ఇక సమతలంగా ఉండే మోకాళ్లు అనేవి చాలా మంది జమైకా క్రీడాకారుల్లో కనిపించాయి. ఉసేన్ బోల్ట్ ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలు...ఒక స్ప్రింటర్కు సంబంధించి ఇది సాధారణంకంటే ఎక్కువ. అందుకే తన ప్రత్యర్థులకన్నా తక్కువ అడుగుల్లో అతను లక్ష్యం చేరగలడు. బోల్ట్ బరువు 207 పౌండ్లు. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం...అథ్లెట్లు ఎంత బలంగా నేలపై పాదాలను తోస్తారో అంతే వేగంగా ముందుకు కదలగలరు. అందరూ తమ బరువు కంటే రెండున్నర లేదా మూడు రెట్ల బలంతో నేలపై ఒత్తిడి పెంచి ముందుకు దూసుకుపోతారు. కానీ బోల్ట్ 1000 పౌండ్ల ఫోర్స్తో ఆ పని చేస్తాడు. అతని శరీర బరువుకు ఇది దాదాపు ఐదు రెట్లు. మామూలుగానైతే ఇంత ఎత్తు, ఇంత బరువు ఉన్నవారికి అది చాలా కష్టం. బోల్ట్ ప్రపంచ రికార్డు పరుగు 9.58 సెకన్లకు సంబంధించి ఇందులో ప్రతీ 0.1 సెకన్లో ఎలా పరిగెత్తాడో దానిని పరిశీలించారు. దీని ప్రకారం 7వ సెకన్లో అతను అమిత వేగంతో అంటే దాదాపు గంటకు 27 మైళ్ల వేగంతో పరిగెత్తినట్లు తేలింది. మొత్తంగా 3.5 హార్స్ పవర్ వేగంతో బోల్ట్ పరిగెత్తాడు. పరుగు మధ్యలో పాదం నేలను తాకుతున్న సమయంలో సాధారణ అథ్లెట్లు తమ కాలును 0.12 సెకన్లు నేలపై ఉంచితే వారికంటే 33 శాతం మెరుగ్గా బోల్ట్ కాలు 0.08 సెకన్లు మాత్రమే ఉంటుంది. వరల్డ్ రికార్డు (9.58 సె.) సమయంలో నమోదైన కొన్ని గణాంకాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఈ సమయంలో బోల్ట్ పరిగెత్తిన అత్యధిక వేగం...గంటకు 27.45 మైళ్లు. ఇందులో 5.29 సెకన్ల పాటు నేలను తాకకుండా అతని కాళ్లు గాల్లోనే ఉన్నాయి. 100 మీ. పరుగులో బోల్ట్ వేసిన అడుగులు కూడా కీలకమే. ఇందులో అతను 41 అడుగుల్లో రేస్ పూర్తి చేశాడు. అదే మిగతా అథ్లెట్లు 45 అడుగుల వరకు తీసుకుంటారు. ఇక్కడే గెలుపు, ఓటమి మధ్య తేడా వస్తుంది. ఒలింపిక్స్ ఫైనల్లో పోటీ పూర్తి చేసేందుకు గాట్లిన్ 42.5...బ్లేక్ 46 అడుగులు తీసుకున్నారు. ఈ రేస్లో బోల్ట్ వేసిన అన్నింటికంటే పెద్ద అంగ 2.85 మీ. (9.35 అడుగులు) ఉండటం విశేషం. ఇక బోల్ట్ తీసుకునే ఆహారం కూడా ఒక రహస్యమే. అతను తన ఆహారంగా ఏయే ప్రత్యేక పదార్థాలను తీసుకుంటాడో ఎప్పుడూ వివరాలు వెల్లడించలేదు. అయితే తాను తీసుకునే సూపర్ ఫుడ్ ఎలా ఉంటుందో మాత్రం బోల్ట్ చెప్పాడు. 177 కేలరీల శక్తినిచ్చే ఒక కప్ ఆహారం గురించి అతను వివరించాడు. ఇందులో 34 శాతం విటమిన్ సి, 40 శాతం విటమిన్ బి6, 26 పొటాషియం (ఎలక్ట్రోలైట్) ఉంటాయి. బోల్ట్ చేసే కసరత్తులు ఇలా... జిమ్లో గంటల కొద్దీ గడపడం...భిన్నమైన ఎక్సర్సైజ్లు ప్రయత్నిస్తూ కండలు పెంచుకునే ప్రయత్నం చేయడం ఈతరం యువకుల్లో చాలా మందికి రొటీన్. మరి ప్రపంచంలో ఫాస్టెస్ట్ రన్నర్ అంటే ఎలా ఉంటాడు. అతని ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉంటుంది. ఇదే విషయం ఉసేన్ బోల్ట్ను అడిగితే ఇందులో రహస్యాలు ఏమీ లేవంటూ గట్టిగా నవ్వేస్తాడు. తాను ప్రపంచంలోని ఎక్కడా లేని ఎక్సర్సైజ్లు చేయనని, అందరిలాగే...అందరికీ అందుబాటులో ఉండే ఫిట్నెస్ పద్ధతులే అవలంభిస్తానని అతను చెప్పాడు. అయినా ఇందు కోసం ఉండాల్సిందల్లా కాస్త క్రమశిక్షణ, కూసింత పట్టుదల అనేది బోల్ట్ సిద్ధాంతం. అందుకే తాను ఎంచుకునే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ల గురించి కొన్ని కిటుకులు చెప్పాడు. బలం, వేగం, నైపుణ్యం కీలకమంటూ బోల్ట్ తన పంచ రత్నావళి చెప్పాడు. అవేంటో చూద్దాం... బన్నీ హాప్స్ (5 సెట్లు, ఒక్కోటి 20 సార్లు చొప్పున) బాక్స్ జంప్స్ (4 సెట్లు, ఒక్కోటి 8 సార్లు చొప్పున) బౌండింగ్ (3 సెట్లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున) నడుము కింది పటిష్టత కోసం... ముఖ్యంగా మోకాళ్లలో బలం, సుదీర్ఘ సమయం పాటు పరిగెత్తేందుకు మరో రెండు రకాల ఎక్సర్సైజ్లు చేయమని బోల్ట్ చెబుతున్నాడు. ఎనిమిది వారాల పాటు హిప్ ఫ్లెక్సియాన్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే సాధారణంకంటే 9 శాతం ఎక్కువ వేగంతో పరిగెత్తగలరని, ఇకపై ఆఫీసుకు వెళ్లే వారు ఎవరైనా కొద్ది తేడాతో బస్సును మిస్ కాలేరని బోల్ట్ సరదాగా అంటాడు. కేబుల్ నీ డ్రైవ్స్ (3 సెట్లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున) హ్యాంగింగ్ లెగ్ రెజైస్ (3 సెట్లు, ఒక్కోటి 10 సార్లు చొప్పున) మరి మీలో ఎంత మంది బోల్ట్ను ఫాలో అవుతారో చూద్దామా... -
తాత్కాలికంగా రన్నింగ్ చేయలేకపోతున్నాను...
నేను రోజూ వ్యాయామంలో భాగంగా రన్నింగ్ చేస్తాను. అయితే ఇటీవలే నాకు కాలికి దెబ్బ తగిలింది. కొంతకాలం పాటు నా బరువంతా కాలిపై మోపడం సరికాదని డాక్టర్లు చెప్పారు. వ్యాయామం చేయకుండా ఉంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది. నేను వ్యాయామం మిస్ కాకుండా రన్నింగ్కు బదులుగా ప్రత్యామ్నాయం చూపండి. - వెంకటేశ్వర్లు, నిజామాబాద్ మీరు మీ ఒంటి బరువునంతా కాలిపై వేసి రన్నింగ్ చేయలేని పరిస్థితుల్లో ఒక పని చేయవచ్చు. ఒకవేళ మీరు గనక మీ కాలితో పెడల్ తిప్పగలిగే పరిస్థితి ఉంటే సైక్లింగ్ చేయండి. అది కూడా ఆరుబయట వద్దు. ఎందుకంటే బయట సైక్లింగ్ చేయాలంటే ఎక్కడో ఒకచోట కాలు కింద ఆన్చాల్సి వస్తే మళ్లీ మీ ఒంటి బరువు దానిపై పడుతుంది. అదీగాక ఆయరుబయట రోడ్లు ఎగుడుదిగుడుగా ఉంటాయి. దాంతో ఎదురుగడ్డ (స్టీప్ గ్రేడియంట్) ఉన్నచోట కాలిపై ఎక్కువ బరువు పడటం వంటివి జరిగితే మళ్లీ కాలినొప్పి తిరగబెట్టవచ్చు. అందుకే ఒకచోట స్థిరంగా ఉండే స్టేషనరీ బైక్ను ఎంచుకుని ఇంట్లో/జిమ్లో సైక్లింగ్ చేయండి. ఇదే మీకు సురక్షితం. మీరు ఉన్న పరిస్థితుల్లో స్లైకింగ్ అన్నది రన్నింగ్కు ప్రత్యామ్నాయం అవుతుంది. మీరు రన్నింగ్ చేయడం వల్ల గుండెకు కలిగే ప్రయోజనంలో దాదాపు 80% సైక్లింగ్ వల్ల కూడా చేకూరుతుంది. అయితే మీరు 45 నిమిషాల రన్నింగ్ వల్ల ఎంత ప్రయోజనం పొందుతారో... అంతే ప్రయోజనాన్ని సైక్లింగ్లో పొందాలంటే కనీసం పది నిమిషాలు అదనంగా సైక్లింగ్ చేయాలన్నమాట. ఉజ్జాయింపుగా 45 నిమిషాలు రన్నింగ్ చేసేవారు... సైక్లింగ్ అయితే దాదాపు మరో పది నిమిషాలు ఎక్కువ చేస్తే అదే ప్రయోజనం చేకూరుతుంది. పైగా ఒంటి బరువు కాళ్ల మీద పడదు. ఇది మరో ప్రయోజనం. ఒకసారి మీరు పెడలింగ్ చేయగలుగుతున్నారేమో చూసి, అది సాధ్యమైతే మీరు మీ పాదం మీద మీ బరువు మోపగలిగేవరకు నిరభ్యంతరంగా సైక్లింగ్ను కొనసాగించవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ - ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్