Sam Curran
-
శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్
ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లొర్కన్ టక్కర్ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ ఎన్గరవ, ట్రెవర్ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ప్రారంభించిన బెన్ కరన్ తొలి వికెట్కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (59 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ ఎక్స్ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్ ఏ బాయ్!.. అద్బుత ఇన్నింగ్స్’’ అని ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కరన్కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్ కరన్ పెద్దవాడు కాగా.. బెన్ కరన్ రెండోవాడు. ఇక సామ్ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్, సామ్ మాత్రం ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్కే దక్కింది. 28 ఏళ్ల బెన్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. 26 ఏళ్ల సామ్ కరన్ బౌలింగ్ ఆల్రౌండర్. లెఫ్టార్మ్పేస్ మీడియం బౌలర్ అయిన అతడు లెఫ్టాండర్ బ్యాటర్. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్ కరన్ కూడా బౌలింగ్ ఆల్రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగనుంది.చదవండి: సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్ -
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విజేత దుబాయ్ క్యాపిటల్స్.. ఫైనల్లో వైపర్స్ చిత్తు
2025 ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) టైటిల్ను దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) చేజిక్కించుకుంది. నిన్న (ఫిబ్రవరి 9) జరిగిన ఫైనల్లో క్యాపిటల్స్ డెజర్ట్ వైపర్స్ను (Desert Vipers) 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో రోవ్మన్ పావెల్ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సికందర్ రజా (12 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్ను గెలిపించారు. Pride. Ecstacy. Honour. Valour. Glory. Legacy. ✨No better & prouder moment for the @Dubai_Capitals, than when they get their hands on the 🏆#Final #DPWorldILT20 #TheFinalPush #AllInForCricket pic.twitter.com/vgOOrqjDid— International League T20 (@ILT20Official) February 9, 2025190 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే మూడు వికెట్లు (డేవిడ్ వార్నర్ (4), గుల్బదిన్ నైబ్ (5), సామ్ బిల్లింగ్స్ (6)) కోల్పోయిన క్యాపిటల్స్ను పావెల్, షాయ్ హోప్ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరూ క్యాపిటల్స్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. ఈ దశలో సామ్ కర్రన్ హోప్ను పెవిలియన్కు పంపి వైపర్స్ను తిరిగి గేమ్లోకి తెచ్చాడు. అయితే హోప్ ఔటయ్యాక కూడా పావెల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్యాపిటల్స్ను గెలుపు రేసులో ఉంచాడు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో సికందర్ రజా మ్యాజిక్ చేశాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన 19వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన రజా.. చివరి ఓవర్లో సిక్సర్, బౌండరీ బాది క్యాపిటల్స్ను తొలి టైటిల్ను అందించాడు. పావెల్ ఔటయ్యాక దుసన్ శనక (10 బంతుల్లో 21; 2 సిక్సర్లు) సికందర్ రజాకు మద్దతుగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్తో క్యాపిటల్స్ టైటిల్ సాధించేందుకు దోహదపడిన రోవ్మన్ పావెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సామ్ కర్రన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓబెద్ మెక్కాయ్ ధాటికి వైపర్స్ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్, అలెక్స్ హేల్స్ తలో ఐదు పరుగులు చేసి మెక్కాయ్ బౌలింగ్లో ఔటయ్యారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన మ్యాక్స్ హోల్టన్ (51 బంతుల్లో 76; 12 ఫోర్లు), కెప్టెన్ సామ్ కర్రన్ (33 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వైపర్స్ ఇన్నింగ్స్కు జీవం పోశారు. వీరిద్దరు మెరుపు అర్ద శతకాలు చేసి వైపర్స్కు భారీ స్కోర్ అందించారు. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (13 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్యాపిటల్స్ బౌలర్లలో మెక్కాయ్ 2, హైదర్ అలీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన క్యాపిటల్స్ ఆదిలో తడబడింది. షాయ్ హోప్, రోవ్మన్ పావెల్ బాధ్యతాయుతమై ఇన్నింగ్స్లు ఆడి క్యాపిటల్స్ను గేమ్లో ఉంచారు. ఆఖర్లో సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి క్యాపిటల్స్ను విజయతీరాలకు చేర్చాడు. పావెల్, హోప్, రజా దెబ్బకు క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, డేవిడ్ పేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, నాథన్ సౌటర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, దుబాయ్ క్యాపిటల్స్ ఈ టోర్నీలో మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ఎడిషన్లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్లో ఎంఐ ఎమిరేట్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్పై గెలుపొంది టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరిన క్యాపిటల్స్ ఎట్టకేలకు టైటిల్ను కైవసం చేసుకుంది. -
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
సామ్ కుర్రాన్ విధ్వంసం.. విండీస్పై ఇంగ్లండ్ ఘన విజయం
సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్ గడ్డపై టీ20 సిరీస్ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(54) టాప్ స్కోరర్గా నిలవగా..షెఫర్డ్(30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 41) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్(39), విల్ జాక్స్(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్ స్పిన్నర్ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్ 16న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్కు గుడ్ బై! -
సామ్ కర్రన్ వీర బాదుడు
టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి. -
సామ్ కర్రన్ ఆల్రౌండ్ షో
హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ అద్భుత ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో బ్యాట్తో, బంతితో చెలరేగిపోతున్న సామ్.. తాజాగా మరోసారి ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో సామ్.. తొలుత బంతితో (20-7-28-2), ఆతర్వాత బ్యాట్తో (18 బంతుల్లో 35; 5 సిక్సర్లు) చెలరేగి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో సామ్ సోదరుడు టామ్ కూడా రాణించాడు. టామ్ నాలుగు వికెట్లు తీసి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాశించాడు. సామ్, టామ్ బంతిలో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రేవ్ ఇన్నింగ్స్లో జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. అలెక్స్ డేవిస్ (5), ఆండ్రీ ఫ్లెచర్ (1), లూస్ డి ప్లూయ్ (4), లారీ ఈవాన్స్ (4), కీరన్ పోలార్డ్ (18), జోఫ్రా ఆర్చర్ (10), అకీల్ హొసేన్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సామ్, టామ్తో పాటు విల్ జాక్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. సామ్ కర్రన్, జోర్డన్ కాక్స్ (29 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్లో విల్ జాక్స్ 6, డేవిడ్ మలాన్ 14, సామ్ బిల్లింగ్స్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, టైమాల్ మిల్స్, క్రిస్ జోర్డన్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు. -
సామ్ కర్రన్ ఆల్రౌండ్ షో.. మెరుపు హాఫ్ సెంచరీ.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు
మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్లో భాగంగా హాంప్షైర్తో జరిగిన మ్యాచ్లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్షైర్పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్లో 18 ఫస్ట్క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్షైర్ స్టీల్బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్షైర్, కెంట్ స్పిట్ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్హాం 18 పాయింట్లతో టాప్లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్లోనైనా గెలిచి సీజన్ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
PBKS Vs RR: మళ్లీ ఓడిన రాజస్తాన్
గువాహటి: పంజాబ్ కింగ్స్ ఆల్రౌండ్ ‘షో’ ధాటికి రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. కెప్టెన్ స్యామ్ కరన్ (2 వికెట్లు; 41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్యామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. జితేశ్ శర్మ (20 బంతుల్లో 22; 2 సిక్స్లు), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లతో స్యామ్ కరన్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పరాగ్ నిలబడటంతో... ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన రాజస్తాన్ జట్టు బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు యశస్వి (3), కొహ్లెర్ (18), టాపార్డర్ బ్యాటర్ సామ్సన్ (18) వికెట్లు పారేసుకోవడంతో మెరుపులు కాదుకదా... పరుగుల్లో వేగమే కనిపించలేదు. పరాగ్, అశ్విన్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు ఇన్నింగ్స్ మెరుగవుతుందనిపించింది. కానీ అశ్విన్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ఐదుగురు బ్యాటర్లలో బౌల్ట్ (12) మినహా ఇంకెవరూ పది పరుగులైనా చేయలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ సులువైన లక్ష్యమే అయినా పంజాబ్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ (6)... అవేశ్ వేసిన ఐదో ఓవర్లో రోసో (13 బంతుల్లో 22; ఫోర్లు), శశాంక్ (0) అవుట్ కావడంతో 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. కాసేపటికే బెయిర్స్టో (14)ను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ సంబరాల్లో మునిగింది. 48/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్ను కెప్టెన్ స్యామ్ కరన్... జితేశ్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరు వికెట్ను కాపాడుకొని తర్వాత భారీషాట్లపై దృష్టి పెట్టారు. జట్టు స్కోరు 100 దాటాకా ఐదో వికెట్కు 63 పరుగులు జోడించాక జితేశ్ ఆటను చహల్ ముగించాడు. ఈ దశలో స్యామ్ కరన్ పంజాబ్ను లక్ష్యంవైపు తీసుకెళ్లాడు. అశుతోష్తో కలిసి మరో వికెట్ పడకుండా 19వ ఓవర్లోనే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్యామ్ కరన్ 4; టామ్ కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చహర్ 18; సామ్సన్ (సి) చహర్ (బి) ఎలిస్ 18; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 48; అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 28; జురెల్ (సి) హర్ప్రీత్ (బి) స్యామ్ కరన్ 0; పావెల్ (సి అండ్ బి) చహర్ 4; ఫెరీరా (సి) రోసో (బి) హర్షల్ 7; బౌల్ట్ (రనౌట్) 12; అవేశ్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–42, 4–92, 5–97, 6–102, 7–125, 8–138, 9–144. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–24–2, అర్ష్ దీప్ 4–0–31–1, ఎలిస్ 4–0– 24–1, హర్షల్ 4–0–28–2, రాహుల్ చహర్ 4–0– 26–2, హర్ప్రీత్ 1–0–10–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) చహల్ (బి) బౌల్ట్ 6; బెయిర్స్టో (సి) పరాగ్ (బి) చహల్ 14; రోసో (సి) యశస్వి (బి) అవేశ్ 22; శశాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 63; జితేశ్ (సి) పరాగ్ (బి) చహల్ 22; అశుతోష్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6, 2–36, 3–36, 4–48, 5–111. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–1, సందీప్ 4–0–28–0, అవేశ్ ఖాన్ 3.5–0–28–2, అశ్విన్ 4–0–31–0, చహల్ 4–0–31–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X గుజరాత్ వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు కోచ్గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్తో బుధవారం నాటి మ్యాచ్తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
IPL 2024: బోణీ కొట్టిన పంజాబ్.. రీఎంట్రీ తొలి మ్యాచ్లోనే ఓడిన పంత్
ముల్లన్పూర్: కొత్త సీజన్లో, కొత్త మైదానంలో పంజాబ్ కింగ్స్ భాంగ్రా ఆడుకుంది. తొలి పోరులో చక్కటి విజయంతో బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షై హోప్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ పొరేల్ (10 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (47 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్), లయమ్ లివింగ్స్టోన్ (21 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఐదో వికెట్కు 42 బంతుల్లో 67 పరుగులు జోడించి గెలిపించారు. అంతా అంతంతమాత్రంగా... ఢిల్లీ ఇన్నింగ్స్ను ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ మార్‡్ష (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ప్రారంభించారు. తొలి 3 ఓవర్లలో వీరిద్దరు 33 పరుగులు రాబట్టారు. మార్ష్ వెనుదిరిగినా...కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న హోప్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 10.3 ఓవర్లలో స్కోరు 94/3తో మెరుగ్గా అనిపించింది. అయితే ఈ దశలో బ్యాటింగ్ తడబడింది. పంత్ (18) ప్రభావం చూపలేకపోగా...భుయ్ (3), స్టబ్స్ (5) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. అయితే చివర్లో పొరేల్ దూకుడు ఢిల్లీకి చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. స్కోరు 137/7 వద్ద క్రీజ్లోకి వచ్చిన అతను హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 6, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. రాణించిన లివింగ్స్టోన్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో శిఖర్ ధావన్ (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) జోరు ప్రదర్శించాడు. అయితే అతనితో పాటు బెయిర్స్టో (9) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరగ్గా...ప్రభ్సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 26; 5 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. కానీ ప్రభ్సిమ్రన్తో పాటు జితేశ్ శర్మ (9) తన వరుస ఓవర్లలో అవుట్ చేసి కుల్దీప్ ఆశలు పెంచాడు. గెలుపు కోసం 51 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో కరన్, లివింగ్స్టోన్ జత కలిశారు. 33 పరుగుల వద్ద కరన్ ఇచ్చిన క్యాచ్ను స్టబ్స్ వదిలేయడం కలిసొచ్చింది. వీరిద్దరిని కొద్ది సేపు ఢిల్లీ బౌలర్లు నిలువరించగలిగారు. అయితే మార్‡్ష వేసిన 15వ, 17వ ఓవర్లలో కలిపి మొత్తం 3 ఫోర్లు, 3 సిక్స్లతో పంజాబ్ 36 పరుగులు రాబట్టడంతో ఆట స్వరూపం మారిపోయింది. విజయానికి పది పరుగుల దూరంలో కరన్ అవుటైనా...లివింగ్స్టోన్ మిగతా పనిని పూర్తి చేశాడు. మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఆరో ఓవర్లోనే ఇషాంత్ గాయపడటం కూడా ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రధాన బౌలర్ దూరం కావడంతో ప్రత్యామ్నాయం లేక పరుగులు ఇస్తున్నా సరే మార్ష్తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జితేశ్ (బి) హర్షల్ 29; మార్ష్ (సి) చహర్ (బి) అర్ష్దీప్ 20; హోప్ (సి) బ్రార్ (బి) రబాడ 33; పంత్ (సి) బెయిర్స్టో (బి) హర్షల్ 18; భుయ్ (సి) జితేశ్ (బి) బ్రార్ 3; స్టబ్స్ (సి) శశాంక్ (బి) చహర్ 5; అక్షర్ (రనౌట్) 21; సుమీత్ (సి) జితేశ్ (బి) అర్ష్దీప్ 2; పొరేల్ (నాటౌట్) 32; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–39, 2–74, 3–94, 4–111, 5–111, 6–128, 7–138, 8–147, 9–174. బౌలింగ్: స్యామ్ కరన్ 1–0–10–0, అర్‡్షదీప్ 4–0–28–2, రబాడ 4–0–36–1, హర్ప్రీత్ బ్రార్ 3–0–14–1, రాహుల్ చహర్ 4–0–33–1, హర్షల్ 4–0–47–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఇషాంత్ 22; బెయిర్స్టో (రనౌట్) 9; ప్రభ్సిమ్రన్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 26; స్యామ్ కరన్ (బి) అహ్మద్ 63; జితేశ్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 9; లివింగ్స్టోన్ (నాటౌట్) 38; శశాంక్ (సి) పంత్ (బి) అహ్మద్ 0; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–34, 2–42, 3–84, 4–100, 5–167, 6–167. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–43–2, ఇషాంత్ 2–0–16–1, మార్ష్ 4–0–52–0, అక్షర్ 4–0–25–0, కుల్దీప్ 4–0–20–2, సుమీత్ 1.2–0–19–0. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
WI VS ENG 1st ODI: చెత్త రికార్డు మూటగట్టుకున్న సామ్ కర్రన్
వెస్టిండీస్తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో వికెట్ లేకుండా (9.5 ఓవర్లు) 98 పరుగులు సమర్పించుకున్న కర్రన్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కర్రన్కు ముందు ఈ చెత్త రికార్డు స్టీవ్ హార్మిసన్ పేరిట ఉండేది. 2006లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హార్మిసన్ వికెట్ లేకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అతి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో క్రిస్ జోర్డన్ (2015లో 1/97), జేక్ బాల్ (2017లో 1/94) కర్రన్, హార్మిసన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్తో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్లో హోప్తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్గా శిఖర్ ధవన్ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో జితేశ్ శర్మ ప్రభ్సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
పంజాబ్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడికి గుడ్బై!?
ఐపీఎల్-2024 సీజన్ కోసం ఆయా ప్రాంఛైజీలు అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి గడువు నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 4లోపు ఫ్రాంచైజీలు తమ రిటేన్షన్ లిస్ట్ను అందజేయాలి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్ యువ సంచలనం సామ్ కుర్రాన్ను పంజాబ్ కింగ్స్ వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 మినీవేలంలో కుర్రాన్ను ఏకంగా రూ.18.5 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ గత సీజన్లో తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కుర్రాన్ విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్లో తీవ్రనిరాశపరిచాడు. 14 మ్యాచ్లు ఆడిన అతడు 276 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు. ధావన్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైతే కుర్రానే జట్టును నడిపించాడు. అయితే అతడిని విడిచిపెట్టి వేలంలో మరో యువ ఆల్రౌండర్ సొంతం చేసుకోవాలని పంజాబ్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఐపీఎల్-2024 సీజన్కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా: ఏబీ డివిలియర్స్ -
రసవత్తర పోరు.. ఆఖర్లో హైడ్రామా.. ఎట్టకేలకు గెలిపించిన సామ్ కర్రన్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన రసవత్తర పోరులో ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్వల్ప తేడాతో గటెక్కింది. ఇన్విన్సిబుల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి లండన్ స్పిరిట్ 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), విల్ జాక్స్ (42 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 46 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (17 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. లండన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, డారిల్ మిచెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ టీమ్.. ఆఖరి బంతి వరకు పోరాడి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సామ్ కర్రన్ వేసిన 98వ బంతిని క్రిచ్లీ సిక్సర్ బాది లండన్ గెలుపుపై ఆశలు చిగురింపజేయగా.. ఆఖరి బంతికి డాట్ బాల్ వేసి సామ్ కర్రన్ లండన్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఈ మధ్యలో పెద్ద డ్రామా జరిగింది. లండన్ 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో వైట్లీ అద్భుతమైన ఫీల్డింగ్తో బౌండరీకి వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని 2 పరుగులు సేవ్ చేయగా, ఆఖరి బంతిని కర్రన్ నో బాల్ వేసి మళ్లీ లండన్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఈ బంతికి క్రిచ్లీ రెండు పరుగు రాబట్టడంతో పాటు నో బాల్ ఫలితంగా లండన్కు అదనంగా మరో పరుగు, ఫ్రీ హిట్ లభించాయి. దీంతో ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సామ్ కర్రన్ ఆఖరి బంతిని అద్భుతమై యార్కర్గా సంధించడంతో లండన్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఫలింతగా ఇన్విన్సిబుల్స్ రసవత్తర పోరులో విజయం సాధించింది. లండన్ ఇన్నింగ్స్లో ఆడమ్ రొస్సింగ్టన్ (61) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో మాథ్యూ క్రిచ్లీ (13 బంతుల్లో 32 నాటౌట్) ఇన్విన్సిబుల్స్ ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ చాపెల్, సామ్ కర్రన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సర్రే క్లికెట్ క్లబ్కు సామ్ కర్రాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లండన్లోని ఓవల్ మైదానంలో , గ్లామోర్గాన్తో జరిగిన ఈ మ్యాచ్లో కర్రాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో గ్లామోర్గాన్ జట్టు బౌలర్లను కర్రాన్ ఊచకోత కోశాడు. కర్రాన్ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కర్రాన్ తన పేరిట లిఖించకున్నాడు. ఓవరాల్ ఈ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఓపెనర్లు విల్ జాక్స్(69), ఏవెన్స్(40) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే..238 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. గ్లామోర్గాన్ బ్యాటర్లలో క్రిస్ కోక్(49) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సర్రే బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, నరైన్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని Sam Curran was in electric form with the bat last night ⚡️ His 59 from 22 helped Surrey to their third-highest T20 total ever - 238/5!#Blast23 pic.twitter.com/ymYCoQRux3 — Vitality Blast (@VitalityBlast) June 21, 2023 -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్ల్లో బ్యాట్తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ
టీ20 బ్లాస్ట్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్స్, బ్రదర్స్ సామ్ కర్రన్, సామ్ కర్రన్లు విధ్వంసం సృష్టించారు. ససెక్స్తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్లో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత సామ్ (35 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో టామ్ (9 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అసలుసిసలు టీ20 మజాను ప్రేక్షకులకు అందించారు. వీరికి తోడు లారీ ఈవాన్స్ (51 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సర్రే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 బ్లాస్ట్లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్. ససెక్స్ బౌలర్లలో తైమాల్ మిల్స్, హెన్రీ క్రొకోంబ్ తలో 2 వికెట్లు, మెక్ ఆండ్రూ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ససెక్స్.. సునీల్ నరైన్ (3/12), కెమరూన్ స్టీల్ (3/41), విల్ జాక్స్ (2/29), టామ్ లావెస్ (2/17) ధాటికి 14.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా సర్రే 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ససెక్స్ ఇన్నింగ్స్లో టామ్ క్లార్క్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. టామ్ అల్సోప్ (17), మైఖేల్ బుర్గెస్ (12), డానియల్ ఇబ్రహీం (17), హడ్సన్ ప్రెంటిస్ (11)లు రెండంకెల స్కోర్లు చేశారు. A 🆕 entry on the highest Blast totals list 👀 @surreycricket with an astonishing display of hitting tonight!#Blast23 pic.twitter.com/xF1zYWKo5q — Vitality Blast (@VitalityBlast) June 9, 2023 కాగా, ఐపీఎల్లో కోట్లు కుమ్మరించినా ఆడని సామ్ కర్రన్ స్వదేశంలో జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో మాత్రం చెలరేగిపోతున్నాడు. కర్రన్ ఈ లీగ్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో మెరుపు వేగంతో పరుగుల సాధించడంతో (237, 13 సిక్సర్లు) పాటు వికెట్లు (7) కూడా తీస్తున్నాడు. కర్రన్ మెరుపు ఇన్నింగ్స్ల కారణంగా సర్రే పలు మ్యాచ్ల్లో విజయం సాధించింది. చదవండి: బజ్బాల్ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్కు స్టీవ్ స్మిత్ వార్నింగ్ -
జోస్ బట్లర్ వీరవిహారం.. శివాలెత్తిన సామ్ కర్రన్
టీ20 బ్లాస్ట్లో భాగంగా నిన్న (జూన్ 7) జరిగిన వివిధ మ్యాచ్ల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు పేట్రేగిపోయారు. వార్సెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో లాంకాషైర్కు ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. గ్లామోర్గన్పై ససెక్స్ ఆటగాళ్లు లారీ ఈవాన్స్ (60 బంతుల్లో 118 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు), సామ్ కర్రన్ (29 బంతుల్లో 66; ఫోర్, 7 సిక్సర్లు, 2/36) రెచ్చిపోయారు. ఫలితంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఘన విజయం సాధించాయి. బట్లర్ వీరవిహారం.. లాంకాషైర్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్సెస్టర్షైర్ ఆడమ్ హోస్ (29 బంతుల్లో 42), మిచెల్ సాంట్నర్ (33 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. లాంకాషైర్ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, కొలిన్ డి గ్రాండ్హోమ్ 2, లూక్ వుడ్, టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో జోస్ బట్లర్, స్టీవ్ క్రాఫ్ట్ (40), డారిల్ మిచెల్ (33 నాటౌట్), లివింగ్స్టోన్ (23) రాణించడంతో లాంకాషైర్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్సెస్టర్షైర్ బౌలర్లలో పెన్నింగ్టన్, పాట్రిక్ బ్రౌన్ తలో 2 వికెట్లు, ఆడమ్ ఫించ్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన ఈవాన్స్.. శివాలెత్తిన సామ్ కర్రన్ గ్లామోర్గన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. లారీ ఈవాన్స్, సామ్ కర్రన్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన గ్లామోర్గన్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సర్రే బౌలర్లలో కర్రన్, అట్కిన్సన్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, సీన్ అబాట్,సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. నిన్న జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఎసెక్స్పై కెంట్ 4 వికెట్ల తేడాతో.. వార్విక్షైర్పై డెర్బీషైర్ 6 వికెట్ల తేడాతో.. సోమర్సెట్పై హ్యాంప్షైర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా -
ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ న్ని వదిలించుకుంటున్న పంజాబ్
-
IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..?
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు (రూ. 18.5 కోట్లు) సామ్ కర్రన్ను పంజాబ్ కింగ్స్ వదిలించుకోనుందా.. ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐపీఎల్-2023లో సామ్ కర్రన్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పంజాబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం పరోక్షంగా సమర్ధించాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు పంజాబ్.. కర్రన్ను తప్పక వదించుకోవాలని భావిస్తుంటుందని అన్నాడు. కర్రన్.. సీఎస్కే తరఫున అడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు పంజాబ్ తరఫున ఆడలేదని, అతనిపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్కప్-2022లో కర్రన్ ప్రదర్శన చూసి పంజాబ్ యాజమాన్యం తొందరపడిందని , అతనిపై వెచ్చించిన సొమ్ముతో నలుగురు నిఖార్సైన ఆల్రౌండర్లను సొంతం చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కర్రన్పై వెచ్చించిన సొమ్ములో పంజాబ్ కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయిందని, అతనిపై భారీ అంచనాలే పంజాబ్ను వరుసగా తొమ్మిదో సారి ప్లే ఆఫ్స్కు చేరనీయకుండా చేశాయని తెలిపాడు. గత సీజన్లో కర్రన్కు కొత్త బాల్ అప్పజెప్పిన పంజాబ్.. అర్షదీప్కు అన్యాయం చేసిందని, అర్షదీప్ ఫెయిల్యూర్కు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కొత్త బంతితో కర్రన్ అద్భుతంగా చేయగలిగినప్పటికీ... భారత పిచ్లు అందుకు సహకరించవని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్లో కర్రన్ 13 ఇన్నింగ్స్ల్లో 135.96 స్ట్రయిక్ రేట్తో 276 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..?
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కర్రన్.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో చెలరేగిపోయాడు. నిన్న (మే 25) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన సామ్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు).. అన్న టామ్ కర్రన్ (33 బంతుల్లో 50; 8 ఫోర్లు) సహకారంతో తన జట్టు సర్రేను గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన మిడిల్సెక్స్.. విల్ జాక్స్ (3/17), గస్ అట్కిన్సన్ (3/20), సునీల్ నరైన్ (2/37), సీన్ అబాట్ (1/22) ధాటికి 14.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ హోల్డెన్ (43), పీటర్ మలాన్ (30), జాన్ సిమ్సన్ (15), జో క్రాక్నెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంతితో ఇరగదీసిన విల్ జాక్స్ బ్యాటింగ్లోనూ (22 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు కనబర్చి, తన జట్టులో గెలుపులో కీలకపాత్ర పోషించిన సామ్ కర్రన్పై కొందరు భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించని సొమ్మునిచ్చిన ఐపీఎల్లో ఏం చేయలేకపోయాడు కానీ, సొంత దేశ లీగ్లో మాత్రం ఇరగదీస్తున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2023లో 18.50 కోట్లు పెడితే ఒక్క మ్యాచ్లో కూడా పంజాబ్ను గెలిపించలేకపోయిన సామ్.. టీ20 బ్లాస్ట్లో వచ్చీ రాగానే అన్న సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లు ఆడిన సామ్ కర్రన్.. 27.60 సగటున, 135.96 స్ట్రయిక్ రేట్తో ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 276 పరుగులు చేశాడు. అలాగే 10 వికెట్లు కూడా పడగొట్టాడు. సామ్ తీసుకున్న మొత్తంతో పోలిస్తే అతని ప్రదర్శన రవ్వంత కూడా కాదు. 10 లక్షల కనీస ధర పెట్టిన ఆటగాళ్లు సైతం అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇరగదీస్తున్న వేల కోట్లు కుమ్మరించి కొనుక్కున్న సామ్ తేలిపోవడం నిజంగా బాధాకరం. చదవండి: IPL 2023: అత్యుత్తమ భారత ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదే..! -
ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్కింగ్స్, లక్నోసూపర్జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. బెన్ స్టోక్స్(సీఎస్కే): Photo: IPL Twitter ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్కే తరపున రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్): Photo: IPL Twitter జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్లో కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు. హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్): Photo: IPL Twitter ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్పై మంచి అంచనాలున్నాయి. ఎస్ఆర్హెచ్ ఏరికోరి బ్రూక్ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు. కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. సామ్ కరన్(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్ల్లో పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు. చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!' -
లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో పంజాబ్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్.. ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఈ పంజాబ్ విజమంలో ఆ జట్టు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్, లైమ్ లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ప్రభ్సిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రభ్సిమ్రాన్ కేవలం 65 బంతుల్లోనే 10ఫోర్లు, 6 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. పంజాబ్ 161 గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ప్రభ్సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన ప్రభ్సిమ్రాన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా పంజాబ్ ఆల్రౌండర్ సామ్ కర్రాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవతున్నాడని సెహ్వాగ్ విమర్శించాడు. కాగా ఐపీఎల్లో వేలంలో శామ్ కర్రాన్ను పంజాబ్ కింగ్స్ రూ.18. 5 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన శామ్ కర్రాన్ 216 పరుగులతో పాటు కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఈ నేపథ్యంలో క్రిక్బజ్తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రభ్సిమ్రన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అతడు ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. పంజాబ్కు చాలా బెనిఫిట్ కలుగుతుంది. ప్రభ్సిమ్రన్ తన అరంగేట్ర సీజన్లో భారీ మొత్తం (రూ. 4.8 కోట్లు) దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం రూ. 60 లక్షలకు మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ తన టాలెంట్ ఎంటో చూపించాడు. అతడికి సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉంది అని నిరూపించాడు. ఇటువంటి యువ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్లతో జట్టును గెలిపిస్తుంటే అంతకు మించి ఏమి కావాలి. సామ్ కర్రాన్ను 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగొలు చేసింది. ఏం లాభం. ఒక్క మ్యాచ్లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా 𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥 Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM — JioCinema (@JioCinema) May 13, 2023 -
అర్ష్దీప్ సూపర్ బౌలింగ్.. పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడి ఓడింది.215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు, కామెరాన్ గ్రీన్ 43 బంతుల్లో 67, రోహిత్ శర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేయగా.. టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 25 నాటౌట్ పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఉన్నంతసేపు మ్యాచ్ ముంబైవైపే ఉంది. కానీ సెకండ్ స్పెల్ బౌలింగ్కు వచ్చిన అర్ష్దీప్ సూర్యకుమార్ వికెట్తో పాటు.. తన చివరి ఓవర్లో తిలక్ వర్మ, నెహాల్ వదేరాలను ఔట్ చేసి పంజాబ్ వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. సూర్యకుమార్ ఔట్.. ముంబై 184/4 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు కావాలి. 14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 132/2 తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 46 ,సూర్యకుమార్ 39 పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ(44) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబై 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ లివింగ్స్టోన్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. గ్రీన్ 43, సూర్యకుమార్ 20 పరుగులతో ఆడుతున్నారు. 9 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 79/1 తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 35, రోహిత్ శర్మ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ముంబై ఇండియన్స్ 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 24, రోహిత్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఒక్క పరుగు చేసిన ఇషాన్ కిషన్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో షార్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు.. ముంబై టార్గెట్ 215 ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ కరన్ 55 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. హర్ప్రీత్ బాటియా 41 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ ఏడు బంతుల్లోనే 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో పంజాబ్ కింగ్స్ 160 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ అర్జున్ టెండూల్కర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసింది. ఆ ఓవర్లో అర్జున్ వైడ్, నోబ్ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై బౌలర్లలో గ్రీన్, పియూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, అర్జున్, జాసన్ బెహండార్ఫ్లు తలా ఒక వికెట్ తీశారు. 17 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 162/4 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్ప్రీత్ సింగ్ 44, సామ్ కరన్ 33 పరుగులతో ఆడుతున్నారు. 14 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 105/4 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. హర్ప్రీత్ సింగ్ 15, బాటియా 8 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ప్రబ్సిమ్రన్ సింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 58/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 25, అథర్వ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ గ్రీన్ బౌలింగ్లో చావ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం 31వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదు ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం రెండు వరుస ఓటములను ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), హర్ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్ -
IPL 2023: ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం
లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. సికందర్ రజా 41 బంతుల్లో 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మాథ్యూ షార్ట్ 34 పరుగులు చేశాడు. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి షారుక్ ఖాన్ తన స్మార్ట్ ఇన్నింగ్స్తో(10 బంతుల్లో 23 నాటౌట్) పంజాబ్ను గెలిపించాడు. లక్నో బౌలర్లలో మార్క్వుడ్, యుద్వీర్ సింగ్, రవి బిష్ణోయి తలా రెండు వికెట్లు తీశారు. Shahrukh Khan and happy endings 👌🏼@PunjabKingsIPL seal their third victory in #IPL2023 💥#IPLonJioCinema #TATAIPL | @shahrukh_35 pic.twitter.com/9jO8L3hAD9 — JioCinema (@JioCinema) April 15, 2023 కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్తో పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. సికందర్ రజా 50 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ తడబడుతుంది. తాజాగా 82 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. 22 పరుగులు చేసిన హర్ప్రీత్ సింగ్ కృనాల్ బౌలింగ్లో యుద్విర్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సికందర్ రజా 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టార్గెట్ 160..8 ఓవర్లలో పంజాబ్ 53/3 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. హర్ప్రీత్ సింగ్ 9, సికందర్ రజా 4 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website పంజాబ్ కింగ్స్ టార్గెట్ 160 పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 74 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో కైల్ మేయర్స్ 29, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబాడ రెండు, సికందర్ రజా, హర్ప్రీత్ బార్, అర్ష్దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website Photo Credit : IPL Website కేఎల్ రాహుల్(74) ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో కేఎల్ రాహుల్(74) అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో నాథన్ ఎల్లిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. Photo Credit : IPL Website ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో కగిసో రబడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బతీశాడు. తొలుత కృనాల్ పాండ్యాను ఔట్ చేసిన రబాడా.. ఆ తర్వాత నికోలస్ పూరన్ను గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. Photo Credit : IPL Website కేఎల్ రాహుల్ ఫిఫ్టీ.. లక్నో 106/2 ఐపీఎల్ 16వ సీజన్లో కేఎల్ రాహుల్ తొలి ఫిఫ్టీ సాధించాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. Photo Credit : IPL Website రెండో వికెట్ కోల్పోయిన లక్నో దీపక్ హుడా రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్లో హుడా ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 36, కృనాల్ పాండ్యా ఐదు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన లక్నో 29 పరుగులు చేసిన కైల్ మేయర్స్ హర్ప్రీత్ బార్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం లక్నో వికెట నష్టానికి 57 పరుగులు చేసింది. Photo Credit : IPL Website దంచికొడుతున్న లక్నో.. పంజాబ్తో మ్యాచ్ లక్నో ఘనంగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 27, కేఎల్ రాహుల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్ 21వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరంగా ఉండడంతో సామ్ కరన్ స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్కీపర్), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కుర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ .@PunjabKingsIPL wins the toss, and they opt to bowl first 🏏 Watch #LSGvPBKS on #JioCinema - LIVE & FREE for all telecom operators!#IPLonJioCinema #IPL2023 #TATAIPL | @LucknowIPL pic.twitter.com/6T4f2EX5Dq — JioCinema (@JioCinema) April 15, 2023 మూడు విజయాలతో జోరు మీదున్న లక్నో మరో గెలుపుపై కన్నేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ సత్తా చాటాలని భావిస్తోంది. -
Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ (18.5 కోట్లు).. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తూ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కర్రన్ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్ గ్రీన్ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్ రాహుల్ (లక్నో, 17 కోట్లు), బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్ ఓకే అనిపిస్తున్నాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాట్తో (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్లో 16 పరుగులకు డిఫెండ్ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్ ఎడిషన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కర్రన్ ఆఖరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి ఓవర్ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్ ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ టైటిల్ కల సాకారమవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్-రాజస్థాన్ జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన టఫ్ ఫైట్లో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్ను హెట్మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు. -
పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్ వచ్చాయి. గుడ్న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
IPL: 18.5 కోట్ల ప్లేయర్కు చేదు అనుభవం.. షాకయ్యానంటూ ట్వీట్
Sam Curran Tweet Viral: ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్కు చేదు అనుభవం ఎదురైంది. అతడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు సిబ్బంది. అయితే, ఇందుకు గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అసలేం జరిగిందంటే.. బ్రిటిష్ ఎయిర్లైన్స్ వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సామ్ ప్రయాణించేందుకు టికెట్ బుక్ అయింది. అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదట తీరా అక్కడికి వెళ్తే తను కూర్చోవాల్సిన సీటు విరిగిపోయిందనే రీజన్తో సామ్ను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘‘వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధమయ్యాను. కానీ సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. విమానంలో నేను కూర్చోవాల్సి సీటు విరిగిపోయిందట. కాబట్టి నేను అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పారు. క్రేజీగా ఉంది కదా. ఇది నన్ను విస్మయానికి గురిచేసింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది’’ అంటూ సామ్ కరన్ ఎయిర్లైన్స్ తీరుపై మండిపడ్డాడు. ఏదేమైనా థాంక్స్ వర్జిన్ అట్లాంటిక్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇందుకు స్పందించిన సదరు ఎయిర్లైన్స్ యాజమాన్యం.. సామ్ కరన్కు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్నితమ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినట్లయితే.. అప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాళ్లమని చింతిస్తూ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సామ్ ట్వీట్ వైరల్ కాగా.. అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. కనీసం ఫస్ట్క్లాస్లో ప్రయాణానికైనా వీలుగా ఏర్పాట్లు చేయాల్సింది కదా అని పేర్కొంటున్నారు. కాసుల వర్షం ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్గా పేరొందిన సామ్ కరన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 మినీ వేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతడి కోసం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడగా.. ఏకంగా 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. కాగా ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సామ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వేలంలో అతడిపై కాసుల వర్షం కురవడం గమనార్హం. Just turned up for a flight with @VirginAtlantic for them to tell me my seat is broken on the flight, therefore they’ve said I can’t travel on it. Absolutely crazy. Thanks @VirginAtlantic . Shocking and embarrassing 👍🏻 — Sam Curran (@CurranSM) January 4, 2023 -
టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ ఈ ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా టి20ల్లో అతను చెలరేగిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. టి20 వరల్డ్కప్లో టీమిండియా సెమీస్ వరకు రావడంలో సూర్యకుమార్ది కీలకపాత్ర. కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్లు ఆడిన సూర్యకుమార్ విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ఈ విధ్వంసమే అతన్ని తాజాగా ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులతో సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ 2022 టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా నుంచి సూర్యకుమార్తో పాటు ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు. సూర్యకుమార్: ఇక టి20 వరల్డ్ కప్లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టి20ల్లో ఈ ఏడాది సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31 మ్యాచ్ల్లో 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో సూర్య అత్యధికంగా 68 సిక్స్లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు.న్యూజిలాండ్ సిరీస్లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్లో రెండో టి20 సెంచరీ నమోదు చేశాడు. సామ్ కరన్: టి20 వరల్డ్ కప్ను ఇంగ్లండ్ అందుకోవడంలో సామ్ కరన్ది కీలకపాత్ర. డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సామ్ ప్రత్యర్థులను దడ పుట్టించాడు. తన ప్రదర్శనతో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. ఓవరాల్గా ఈ ఏడాది సామ్ కరన్ 19 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్: పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20ల్లో చాలా డేంజరస్ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే అతన్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఈసారి వరల్డ్కప్లో అంతగా మెరవనప్పటికి ఏడాది ప్రదర్శన మాత్రం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు.ఇక రిజ్వాన్ ఈ ఏడాది 25 మ్యాచ్ల్లో 996 పరుగులతో పాటు కీపర్గా తొమ్మిది క్యాచ్లు, మూడు స్టంపింగ్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సికందర్ రజా: ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు జింబాబ్వే సంచలనం.. పాకిస్తాన్ మూలాలున్న ఆల్రౌండర్ సికందర్ రజా. జట్టు ఓటమిపాలైనప్పటికి తన ఇన్నింగ్స్లతో అభిమానులను అలరించాడు. మొత్తంగా 24 మ్యాచ్ల్లో 735 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. మందానతో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దార్, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, ఆస్ట్రేలియా నుంచి తాహిలా మెక్గ్రాత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది -
IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ల జాబితా, పూర్తి జట్లు.. పర్సులో ఎంత? ఇతర వివరాలు
IPL 2023 Mini Auction- 10 Squads- Purse Remaining- Slots: కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ సీనియర్ ఆల్రౌండర్ స్టోక్స్లకు సైతం భారీ మొత్తం దక్కింది. కరన్ను పంజాబ్ దక్కించుకోగా.. గ్రీన్ను ముంబై సొంతం చేసుకుంది. ఇక స్టోక్స్ను తిరిగి తమ కుటుంబంలోకి ఆహ్వానించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ఇక అట్టహాసంగా ముగిసిన శుక్రవారం నాటి వేలంలో 10 ఫ్రాంఛైజీలు కొన్న ఆటగాళ్ల వివరాలు, ఆక్షన్ తర్వాత పూర్తి స్థాయి జట్లు, పర్సులో మిలిగిన మొత్తం, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న అంశాలపై ఓ లుక్కేద్దాం. 1. సన్రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో కొన్న ఆటగాళ్లు(ధర రూపాయల్లో): హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ ( 8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ ( 5.25 కోట్లు), అదిల్ రషీద్ ( 2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రంత్ శర్మ ( 2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్ ( 20 లక్షలు), సన్వీర్ సింగ్ ( 20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ ( 25 లక్షలు), మయాంక్ దాగర్ ( 1.8 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి ( 20 లక్షలు), అకేల్ హోసేన్ (1 కోటి), అన్మోల్ప్రీత్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో ఇంకా మిగిలి ఉన్న మొత్తం: 6.75 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 2. చెన్నై సూపర్కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: అజింక్యా రహానే (50 లక్షలు), బెన్ స్టోక్స్ ( 16.25 కోట్లు), షేక్ రషీద్ ( 20 లక్షలు), నిశాంత్ సింధు ( 60 లక్షలు), కైల్ జేమిసన్ ( 1 కోటి), అజయ్ మండల్ ( 20 లక్షలు), భగత్ వర్మ ( 20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.7 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, సిమ్ పజేతిరి, సిమ్ పజేతిరి చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ 3. ముంబై ఇండియన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: కామెరాన్ గ్రీన్ (17.5 కోట్లు), ఝే రిచర్డ్సన్ (1.5 కోట్లు), పియూష్ చావ్లా (50 లక్షలు), డువాన్ జాన్సెన్ (20 లక్షలు), విష్ణు వినోద్ (20 లక్షలు), షామ్స్ ములానీ (20 లక్షలు), మెహల్ వధేరా ( 20 లక్షలు), రాఘవ్ గోయల్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 0.05 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ ఆటగాళ్ల జాబితా: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్ 4. గుజరాత్ టైటాన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (2 కోట్లు), ఓడియన్ స్మిత్ (50 లక్షలు), KS భరత్ (1.2 కోట్లు), శివమ్ మావి (6 కోట్లు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు), జాషువా లిటిల్ (4.4 కోట్లు), మోహిత్ శర్మ (50 లక్షలు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేలంలో కొన్న ఆటగాళ్లు రీస్ టోప్లే (1.9 కోట్లు), హిమాన్షు శర్మ (20 లక్షలు), విల్ జాక్స్ (3.2 కోట్లు), మనోజ్ భాండాగే (20 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.95 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, జోహ్మద్ సిరాజ్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ 6. కోల్కతా నైట్రైడర్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల లిస్టు నారాయణ్ జగదీశన్ (90 లక్షలు), వైభవ్ అరోరా (60 లక్షలు), సుయాష్ శర్మ (20 లక్షలు), డేవిడ్ వీస్ (1 కోటి), కుల్వంత్ ఖేజ్రోలియా (20 లక్షలు), లిట్టన్ దాస్ (50 లక్షలు), మన్దీప్ సింగ్ (50 లక్షలు), షకీబ్ అల్ హసన్ (1.50 కోట్లు) ►పర్సులో మిగిలింది: 1.65 కోట్లు ►ఖాళీ స్థానాలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటెన్షన్ జాబితా: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్ 7. లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు నికోలస్ పూరన్ (16 కోట్లు), జయదేవ్ ఉనాద్కట్ (50 లక్షలు) యష్ ఠాకూర్ (45 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), డేనియల్ సామ్స్ ( 75 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), నవీన్-ఉల్-హక్ ( 50 లక్షలు), యుధ్వీర్ చరక్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 3.55 కోట్లు ►మొత్తం ఖాళీలు: 0 రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ 8. పంజాబ్ కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: సామ్ కరన్ (18.50 కోట్లు), సికందర్ రజా (50 లక్షలు), హర్ప్రీత్ భాటియా (40 లక్షలు), విద్వాత్ కవేరప్ప (20 లక్షలు), మోహిత్ రాతీ (20 లక్షలు), శివమ్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో మిగిలిన మొత్తం: 12.2 కోట్లు ►ఖాళీలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 1 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్ 9. రాజస్తాన్ రాయల్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల జాబితా జేసన్ హోల్డర్ (5.75 కోట్లు), డోనోవన్ ఫెరీరా (50 లక్షలు), కునాల్ రాథోడ్ (20 లక్షలు), ఆడమ్ జంపా (1.5 కోట్లు), కేఎల్ ఆసిఫ్ (30 లక్షలు), మురుగన్ అశ్విన్ (20 లక్షలు), అబ్దుల్ (20 లక్షలు), ఆకాష్ వశిష్ట్ ( 20 లక్షలు), జో రూట్ ( 2 కోట్లు) ►పర్సులో మిగిలింది: 3.35 కోట్లు ►ఖాళీలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కులదీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, యుజవేంద్ర చహల్ 10. ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగిజ్ ఎన్గిడి, లుంగిజ్ ఎన్గిడి, , అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. - వెబ్ స్పెషల్ చదవండి: Kohli- Pant: పంత్పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా -
IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు
ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ స్యామ్ కరన్ పంట పండింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కరన్కు ఊహించినట్లుగానే ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం పలికింది. పంజాబ్ కింగ్స్ టీమ్ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కాగా... లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా 24 ఏళ్ల కరన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ (2021లో రాజస్తాన్ రాయల్స్ రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్గా కూడా కరన్దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు... కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ. 17 కోట్లు చెల్లించాయి. ఇక అంచనాలకు అనుగుణంగా ఆల్రౌండర్లు కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) కూడా భారీ మొత్తం పలకగా, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై కూడా తొలి ఐపీఎల్లోనే కోట్ల వర్షం కురిసింది. అటు ఐపీఎల్లో, ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ ‘నిలకడగా’ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనూహ్యం. కొచ్చి: ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ యువస్టార్ స్యామ్ కరన్ బాక్స్లు బద్దలు కొడితే ఆశ్చర్యపోవద్దు! వేలానికి ముందు పలువురు క్రికెట్ విశ్లేషకులు, మాజీల మాట ఇది. నిజంగానే ఈ మాట నిజమైంది. వారి అంచనా తప్పలేదు. ఎందుకంటే కరన్ బంతితో, బ్యాట్తో రెండు రకాలుగా ప్రభావం చూపించగల డని అత్యున్నత స్థాయిలో ఇప్పటికే రుజువైంది. ఇటీవల టి20 వరల్డ్కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలి చాడు. అన్నింటితో పాటు అతని వయసు 24 ఏళ్లే! సరిగ్గా ఇదే కోణంలో ఫ్రాంచైజీలు ఆలోచించాయి. అందుకే అతని కోసం పోటీ పడ్డాయి. ముంబైతో మొదలు పెడితే బెంగళూరు, రాజస్తాన్, చెన్నై, పంజాబ్ విలువను పెంచుకుంటూ పోయాయి. చివరకు ముంబై రూ.18 కోట్ల వరకు తీసుకురాగా, పంజాబ్ మరో రూ.50 లక్షలు పెంచి రూ. 18 కోట్ల 50 లక్షలకు కరన్ను సొంతం చేసుకుంది. 2019 ఐపీఎల్లో పంజాబ్ జట్టే కరన్కు రూ. 7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్కు దూరమయ్యాడు. ఓవరాల్గా 32 ఐపీఎల్ మ్యాచ్లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్... 149.77 స్ట్రయిక్రేట్తో 337 పరుగులు చేశాడు. ఆ ముగ్గురూ సూపర్... ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన బెన్ స్టోక్స్కు సరైన విలువ లభించింది. అతని కోసం హైదరాబాద్, లక్నో మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరకు రూ. 16 కోట్ల 25 లక్షలకు అతను చెన్నై జట్టులోకి చేరాడు. వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్ సవరించాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం (రూ. 17.5 కోట్లు) చెల్లించింది. ఓవరాల్గా టి20 రికార్డు గొప్పగా లేకపోయినా... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, ఆకట్టుకునే పేస్ బౌలింగ్తో పాటు ఇటీవల భారత గడ్డపై చేసిన రెండు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు గ్రీన్ విలువను పెంచాయి. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను పెద్ద మొత్తానికి (రూ. 13 కోట్ల 25 లక్షలు) సన్రైజర్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటతో మిడిలార్డర్లో, ఫినిషర్గా సత్తా చాటగల బ్రూక్ ఇటీవల పాకిస్తాన్తో టి20 సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గత ఐపీఎల్లో నికోలస్ పూరన్ సన్రైజర్స్ తరఫున 13 ఇన్నింగ్స్లలో కలిపి 306 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఒక్కటీ జట్టుకు చెప్పుకోదగ్గ విజయం అందించలేకపోయింది. నాడు అతనికి రైజర్స్ రూ. 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. ఇక ఇటీవలి వరల్డ్కప్లోనైతే అతను 5, 7, 13 చొప్పున పరుగులు చేశాడు. అయినా సరే, వేలంలో పోటీ బాగా కనిపించింది! ఎడంచేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కావడం ఒక కారణం కావచ్చు. చివరకు రూ. 16 కోట్లకు లక్నో ఎంచుకోవడం విశేషం. వేలం ఇతర విశేషాలు ► అందరికంటే ముందుగా విలియమ్సన్ పేరు రాగా సన్రైజర్స్ పట్టించుకోలేదు. గుజరాత్ రూ. 2 కోట్లకు విలియమ్సన్ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్ అవసరం ఉన్న సన్రైజర్స్...చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్ అగర్వాల్ను రూ. 8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్ కింగ్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. ► ఆంధ్ర యువ క్రికెటర్ షేక్ రషీద్ను రూ. 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ భరత్ను గుజరాత్ రూ. కోటీ 20 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు భగత్ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై... ఆంధ్ర ప్లేయర్ నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షలకు సన్రైజర్స్ ఎంచుకున్నాయి. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను రూ. 4 కోట్ల 40 లక్షలకు గుజరాత్ తీసుకుంది. ఐపీఎల్ ఆడ నున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్గా లిటిల్ ఘనత వహిస్తాడు. -
IPL 2023: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్కు కళ్లు చెదిరే మొత్తం లభించింది. ఈ ఆల్రౌండర్ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారాఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో సామ్ కరన్ సూపర్ ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలకపాత్ర. డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను చాలా మ్యాచ్ల్లో గెలిపించాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఇవాళ ఐపీఎల్లో రికార్డు ధరకు అమ్ముడయ్యేలా చేసింది. అతని కోసం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికి.. చివరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సామ్ కరన్ బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లు.. సామ్ కరన్- రూ. 18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్ కామెరున్ గ్రీన్- రూ. 17.5 కోట్లు- ముంబై ఇండియన్స్ బెన్ స్టోక్స్- రూ.16.25 కోట్లు- సీఎస్కే క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు- రాజస్తాన్ రాయల్స్ యువరాజ్ సింగ్- రూ. 16 కోట్లు- ఢిల్లీ డేర్డెవిల్స్ పాట్ కమిన్స్- రూ. 15.5 కోట్లు- కేకేఆర్ ఇషాన్ కిషన్- రూ. 15. 5 కోట్లు- ముంబై ఇండియన్స్ కైల్ జేమీసన్- రూ. 15 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బెన్ స్టోక్స్- రూ.14.50 కోట్లు- రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ దీపక్ చహర్- రూ. 14 కోట్లు- సీఎస్కే Record Alert 🚨 Sam Curran 𝙗𝙚𝙘𝙤𝙢𝙚𝙨 𝙩𝙝𝙚 𝙢𝙤𝙨𝙩 𝙚𝙭𝙥𝙚𝙣𝙨𝙞𝙫𝙚 𝙥𝙡𝙖𝙮𝙚𝙧 𝙚𝙫𝙚𝙧 𝙩𝙤 𝙗𝙚 𝙗𝙤𝙪𝙜𝙝𝙩 𝙞𝙣 𝙄𝙋𝙇! He goes BIG 🤯- INR 18.50 Crore & will now play for Punjab Kings 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/VlKRCcwv05 — IndianPremierLeague (@IPL) December 23, 2022 -
ముగిసిన ఐపీఎల్ 2023 మినీ వేలం
IPL 2023 Mini Auction Details: కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో ఇంగ్లండ్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్ కరన్(18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఆల్రౌండర్ బెన్ స్టోక్స్(రూ. 16.25 కోట్లు- సీఎస్కే)తో పాటు బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు- ఎస్ఆర్హెచ్) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు. ఇక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరున్ గ్రీన్ను ఎవరు ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా కామెరున్ గ్రీన్ నిలిచాడు. ఇక చివరగా ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్ట్ జో రూట్ రూ. కోటి కనీస ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో వేలం ముగిసినట్లు ప్రకటించారు. రిలీ రోసౌకు రూ.4.6 కోట్లు ► జో రూట్- రూ. కోటి- రాజస్తాన్ రాయల్స్ ► షకీబ్ అల్ హసన్- రూ. 1.5 కోట్లు- కేకేఆర్ ►రిలీ రోసౌ- రూ.4.6 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►లిట్టన్ దాస్- రూ.50 లక్షలు- కేకేఆర్ ►అకేల్ హోసేన్- రూ.1 కోటి- ఎస్ఆర్హెచ్ ►ఆడమ్ జంపా- రూ. 1.5 కోట్లు- రాజస్తాన్ రాయల్స్ ►అన్మోల్ప్రీత్ సింగ్- రూ.20 లక్షలు- ఎస్ఆర్హెచ్ ►కేఎమ్ ఆసిఫ్- రూ.30 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►ఎం అశ్విన్- రూ.20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►మన్దీప్ సింగ్- రూ. 50 లక్షలు- కేకేఆర్ ►ఆకాష్ వశిష్ట్- రూ. 20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►యుధ్వీర్ చరక్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ►రాఘవ్ గోయల్- రూ. 20 లక్షల- ముంబై ఇండియన్స్ ►అబుల్ పీఏ- రూ. 20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ జోషువా లిటిల్కు రూ. 4.4 కోట్లు ►జోషువా లిటిల్- రూ.4.4 కోట్లు- గుజరాత్ టైటాన్స్ ►అవినాశ్ సింగ్- రూ. 60 లక్షలు- ఆర్సీబీ ►నితీష్ కుమార్ రెడ్డి- రూ.20 లక్షలు- ఎస్ఆర్హెచ్ ►డేవిడ్ వీస్- రూ. కోటి- కేకేఆర్ ►స్వప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ►మోహిత్ శర్మ- రూ. 50 లక్షలు- గుజరాత్ టైటాన్స్ ►షామ్స్ ములానీ- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ►రాజన్ కుమార్- రూ.70 లక్షలు- ఆర్సీబీ ►విద్వాంత్ కవెరప్ప- రూ.20లక్షలు- పంజాబ్ కింగ్స్ ► విష్ణు వినోద్- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ► డోన్వన్ ఫెర్రెరియా- రూ. 20 లక్షలు- కేకేఆర్ ► ఉర్విల్ పటేల్- రూ. 20లక్షలు- గుజరాత్ టైటాన్స్ ► మయాంక్ డాగర్- రూ. 1.8 కోట్లు- ఎస్ఆర్హెచ్ ► డాన్ జాన్సెన్- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ► ప్రేరక్ మన్కడ్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్జెయింట్స్ ► పియూష్ చావ్లా- రూ. 50 లక్షలు- ముంబై ఇండియన్స్ ► అమిత్ మిశ్రా- రూ. 50 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► హర్ప్రీత్ బాటియా- రూ. 40 లక్షలు- పంజాబ్ కింగ్స్ ► మనోజ్ బాండగే- రూ.20 లక్షలు- ఆర్సీబీ ► రొమారియో షెపర్డ్- రూ. 50 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► డేనియల్ సామ్స్- రూ. 75 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► కైల్ జేమీసన్- రూ. 1కోటి- సీఎస్కే ముఖేష్ కుమార్కు కళ్లు చెదిరే మొత్తం.. ►ముఖేష్ కుమార్- రూ. 5.5 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►హిమాన్షు శర్మ- రూ. 20 లక్షలు- ఆర్సీబీ ►మనీష్ పాండే- రూ. 2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►విల్ జాక్స్- రూ. 3.2 కోట్లు- ఆర్సీబీ శివం మావికి ఆరు కోట్లు ►హిమాంశు శర్మ- ఆర్సీబీ- 20 లక్షలు ►శివం మావి- గుజరాత్- 6 కోట్లు ►ముకేశ్కుమార్- ఢిల్లీ- 5.5 కోట్లు ►సన్వీర్ సింగ్- సన్రైజర్స్- 20 లక్షలు శ్రీకర్ భరత్ ఏ జట్టుకంటే! ►నిశాంత్ సింధు- చెన్నై- 60 లక్షలు ►శ్రీకర్ భరత్- గుజరాత్- 1. 20 కోట్లు ►ఉపేంద్ర యాదవ్- సన్రైజర్స్- 25 లక్షలు ►వైభవ్ అరోరా- కేకేఆర్- 60 లక్షలు ►యశ్ ఠాకూర్- లక్నో- 45 లక్షలు వివ్రాంత్ శర్మకు 2.6 కోట్లు ►సౌరభ్ కుమార్- అమ్ముడుపోలేదు ►సమర్థ్ వ్యాస్- 20 లక్షలు- సన్రైజర్స్ ►ప్రియం గార్గ్- అమ్ముడుపోలేదు ►వివ్రాంత్ శర్మ- కనీస ధర 20 లక్షలు.. సన్రైజర్స్- 2.6 కోట్లకు కొనుగోలు చేసింది రోహన్ కన్నుమ్మల్కు చేదు అనుభవం ►హిమ్మత్ సింగ్- అమ్ముడుపోలేదు ►షేక్ రషీద్- చెన్నై- 20 లక్షలు ►రోహన్ కన్నుమ్మల్ అమ్ముడుపోలేదు ►చేతన్ ఎల్ ఆర్, శుభం ఖజూరియా- అమ్ముడుపోలేదు ►అన్మోల్ ప్రీత్ సింగ్- అమ్ముడుపోలేదు ఇషాంత్కు ఎంతంటే ►తబ్రేజ్ షంసీ, ముజీబ్ ఉర్ రహ్మాన్- అమ్ముడుపోలేదు ►ఆడం జంపా- అమ్ముడుపోలేదు ►అకీల్ హొసేన్- అమ్ముడుపోలేదు ►ఇషాంత్ శర్మ- ఢిల్లీ- 50 లక్షలు ►జై రిచర్డ్సన్- ముంబై- 1.5 కోట్లు ►ఆడం మిల్నే- అమ్ముడుపోలేదు ఉనాద్కట్కు 50 లక్షలు ►జయదేవ్ ఉనాద్కట్- లక్నో- 50 లక్షలు ►రీస్ టోప్లే- ఆర్సీబీ- 1.9 కోట్లు ►క్రిస్ జోర్డాన్- అమ్ముడుపోలేదు ►ఫిల్ సాల్ట్- ఢిల్లీ- 2 కోట్లు ►టామ్ బాంటన్- అమ్ముడుపోలేదు పూరన్కు 16 కోట్లు వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. అతడి కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోటీ పడగా.. ఏకంగా 16 కోట్లు వెచ్చించింది. బెన్ స్టోక్స్(కనీస ధర: రూ. 2 కోట్లు) ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం భారీ ధర పలికాడు. అతడి కోసం లక్నో, ఆర్సీబీ, రాజస్తాన్, సన్రైజర్స్ పోటీ పడగా సీఎస్కే దక్కించుకుంది. 16. 25 కోట్లకు స్టోక్స్ను కొనుగోలు చేసింది. కామెరూన్ గ్రీన్: (కనీస ధర రూ. 2 కోట్లు) ►ఐపీఎల్-2023 మినీ వేలంలో హాట్ ఫేవరెట్గా పేరొందిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ 17.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ ఈ భారీ మొత్తం చెల్లించి గ్రీన్ను సొంతం చేసుకుంది. అయితే, ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్.. గ్రీన్ కంటే కోటి రూపాయలు ఎక్కువ ధర పలికి రికార్డు సృష్టించాడు. ► సామ్ కరన్(కనీసం ధర రూ 2 కోట్లు)- రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సామ్ కరన్ బద్దలుకొట్టాడు. ► జో రూట్(కనీస ధర 50 లక్షలు)- అమ్ముడుపోలేదు ► అజింక్యా రహానే(కనీస ధర 50 లక్షలు)- సీఎస్కే(రూ. 50 లక్షలు) ► మయాంక్ అగర్వాల్- ఎస్ఆర్హెచ్( రూ. 8.25 కోట్లు) ►హ్యారీ బ్రూక్- ఎస్ఆర్హెచ్(రూ. 13.25 కోట్లు) ► కేన్ విలియమ్సన్- గుజరాత్ టైటాన్స్(రూ. 2 కోట్లు కనీస ధర) కొచ్చి: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తమ జట్లను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో... ఇవాళ జరగనున్న మినీ వేలంలో 10 ఫ్రాంచైజీ జట్లు పాల్గొననున్నాయి. ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత పలు ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదిలించుకున్నాయి. ఫలితంగా ఏర్పడిన 87 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు మినీ వేలం ఏర్పాటు చేశారు. ఈ వేలంలో మొత్తం 405 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఇందులో 273 మంది భారత క్రికెటర్లు కాగా... 132 మంది విదేశీ క్రికెటర్లు. 87 బెర్త్లలో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాలి. విదేశీ క్రికెటర్లలో ఇంగ్లండ్ ఆల్రౌండర్లు బెన్ స్టోక్స్, స్యామ్ కరన్...బ్యాటర్ హ్యారీ బ్రూక్... ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్లపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ ఏడాది టి20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన స్యామ్ కరన్ గాయం కారణంగా ఈ సంవత్సరం ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉన్నాడు. స్యామ్ కరన్ కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలో నమోదు చేసుకున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్లో విశేషంగా రాణించిన జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించనున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు ఏకంగా పదిమంది ఆటగాళ్లను వదిలించుకుంది. వారివద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఏడుగురు క్రికెటర్లు... ఆంధ్ర నుంచి పది మంది క్రికెటర్లు ఈ వేలంలో ఉన్నారు. -
IPL 2023: ఫ్రాంఛైజీలకు బీసీసీఐ శుభవార్త.. హాట్ ఫేవరెట్ సహా..
IPL 2023 Mini Auction-Players Availability: ఐపీఎల్- 2023 మినీ వేలానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫ్రాంఛైజీలకు గుడ్న్యూస్ అందించింది. కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్ వంటి స్టార్లు సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్కు చెందిన ఇతర ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించినట్లు వెల్లడించింది. ‘‘మా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు మార్చి 30 నుంచి జట్లతో చేరగలరు’’ అని సీఏ పేర్కొనగా.. ఈసీబీ సైతం తమ ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారని తెలిపింది. అయితే, ఐపీఎల్ వేలంలో హాట్ ఫేవరెట్గా భావిస్తున్న కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడంతో అతడి కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రతరం కావడం ఖాయం. అదే విధంగా స్టోక్స్ విషయంలోనూ పోటీ తప్పకపోవచ్చు. కానీ ఆయా జట్ల టెస్టు సిరీస్ల నేపథ్యంలో వీరిద్దరు ప్లే ఆఫ్స్కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, టామ్ బాంటన్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, విల్ స్మీడ్, జాసన్ రాయ్, జార్జ్ గార్టన్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, రిచర్డ్ గ్లీసన్, ల్యూక్ వుడ్, టామ్ కరన్, టైమల్ మిల్స్, డేవిడ్ పేన్, రెహాన్ అహ్మద్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్టోఫర్ బెంజమిన్, థామస్ హెల్మ్, జేమ్స్ ఫుల్లర్, బెన్నీ హోవెల్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్ గ్రీన్, పీటర్ హాట్జోగ్లో, లాన్స్ మోరిస్, జాషువా ఫిలిప్, జై రిచర్డ్సన్, రిలే మెరెడిత్, హేడెన్ కెర్, జాక్ ప్రెస్విడ్జ్, బెన్ మెక్డెర్మోట్, బెన్ డ్వార్షూయిస్, బిల్లీ స్టాన్లేక్, ట్రావిస్ హెడ్, నాథన్ మెక్అంపాస్ , సీన్ అబాట్, క్రిస్ లిన్, డార్సీ షార్ట్, నాథన్ కౌల్టర్-నైల్, ఆండ్రూ టై, మోయిసెస్ హెన్రిక్స్ వాళ్లు ఏప్రిల్ 8 తర్వాతే ఇక సౌతాఫ్రికా క్రికెట్, వెస్టిండీస్ బోర్డులు తమ క్రికెటర్లు మార్చి 29 నుంచి అందుబాటులో ఉంటారని చెప్పగా.. శ్రీలంక బోర్డు మాత్రం ఏప్రిల్ 8 తర్వాతే తమ ఆటగాళ్లు జట్లతో కలవగలరని పేర్కొంది. ఎవరెవరు ఎప్పుడు అందుబాటులోకి.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు- ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైన వాళ్లు ఏప్రిల్ 8- మే 1 నుంచి న్యూజిలాండ్ క్రికెటర్లు- అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికైన వాళ్లు మార్చి 30 తర్వాత ఐర్లాండ్- - మే 5- 15 మధ్య అందుబాటులో ఉండరు జింబాబ్వే- పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉంటారు కాగా మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ ఆరంభంలో ఐపీఎల్- 2023 ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు మినీ వేలం మొదలుకానుంది. చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్!? ద్రవిడ్, నువ్వూ కలిసి.. -
‘15 ఏళ్ల ఆ అఫ్గన్ బౌలర్ సూపర్స్టార్! ఉనాద్కట్కు భారీ ధర! ఇంకా..’
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్లో సత్తా చాటగల అన్క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా 87 బెర్త్ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఉనాద్కట్ ఇంకా.. ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ ఐరిష్ బౌలర్ విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది. సూపర్స్టార్ కాగలడు! అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్లలో 136.76 స్ట్రైక్రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు.. IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..! -
IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్గటీ ఐలాండ్లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలానికి ముందు అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి జియో సినిమాస్ మాక్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఆసీస్ ఆల్రౌండర్ కెమారూన్ గ్రీన్ అత్యధికంగా 20 కోట్లకు అమ్ముడుపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ గ్రీన్ కోసం చివరి దాకా ప్రయత్నించి సొంతం చేసుకుంది. ఈ మాక్ వేలంలో రెండో అత్యధిక ధర ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్, టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్ హీరో సామ్ కర్రన్కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కర్రన్ను 19.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. అనూహ్యంగా గ్రీన్, కర్రన్ల కంటే తక్కువ ధర పలికాడు. స్టోక్స్ను పంజాబ్ కింగ్స్ 19 కోట్లకు కొనుగోలు చేసింది. వీరి తర్వాత విండీస్ ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్కు 8.5 కోట్లు (ముంబై ఇండియన్స్), విండీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నికోలస్ పూరన్కు 8.5 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్) భారీ ధరలు పలికారు. కాగా, ఈ మాక్ వేలం కేవలం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసమేనని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే, రేపు జరుగబోయే వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. -
ఐపీఎల్-2023 మినీ వేలానికి కౌంట్డౌన్ షురూ.. బరిలో 405 మంది ఆటగాళ్లు
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్గటీ ఐలాండ్లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానుంది. ఈ వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. రెండో సెట్లో ఉన్న ఆల్రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ సెట్లో ఉన్న విదేశీ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. తొలి సెట్లో ఉన్న బ్యాటర్లలో రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్ జాక్పాట్ కొట్టే ఛాన్స్ ఉండగా.. నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, దేశీయ సంచలనం, తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ కూడా భారీ ధర పలకవచ్చు. పర్స్ వాల్యూ విషయానికొస్తే.. లీగ్లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లపై రూ.743.5 కోట్లు ఖర్చు చేయగా.. ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల నిధులు ఉన్నాయి. వేలంలో పాల్గొనే ఫ్రాంఛైజీల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా, కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ బ్యాలెన్స్ వివరాలు.. సన్రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు లక్నో సూపర్జెయింట్స్: రూ. 23.35 కోట్లు ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు చెన్నై సూపర్కింగ్స్: రూ. 20.45 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు కోల్కతా నైట్రైడర్స్: రూ. 7.05 కోట్లు బేస్ ప్రైజ్ ఆధారంగా విభజింపబడ్డ ప్రముఖ ప్లేయర్ల వివరాలు.. రూ.2 కోట్ల లిస్ట్లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్ఫర్డ్ రూ.కోటి లిస్ట్లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ ఆయా ప్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్. రన్నరప్ రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: ఆండ్రూ టై, అంకిత్ రాజ్పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. కోల్కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్మర్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. సన్రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్ధర్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. -
ఐపీఎల్ వేలంలోకి వారిద్దరూ ఎంట్రీ.. రికార్డులు బద్దలు కావాల్సిందే!
ఐపీఎల్-2023 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. ఈ మినీవేలంలో మొత్తంగా 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 21 మంది తమ బేస్ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఒక్క ఆటగాడి పేరు కూడా లేకపోవడం గమనార్హం. బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్కు భారీ ధర ఖాయం! ఈ ఏడాది ఐపీఎల్ దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్ కోసం మినీ వేలంలో ప్రాంఛైజీలు పోటీపోడే అవకాశం ఉంది. కాగా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సామ్ కర్రాన్ను మళ్లీ అదే ఫ్రాంచైజీ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కేన్ విలియమ్సన్ విడిచి పెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. స్టోక్స్ను ఈ వేలంలో ఎలాగైనా సొంతం చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదైనా గానీ వీరిద్దరికి మాత్రం వేలంలో భారీ ధర దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక వీరిద్దరూ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను బెన్ స్టోక్స్ విజేతగా నిలపగా.. సామ్ కర్రాన్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టిన కర్రాన్.. ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు. చదవండి: ENG vs PAK 1ST Test: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ -
IPL 2023: సన్రైజర్స్లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..?
ఐపీఎల్-2023 సీజన్ మినీ వేలానికి (డిసెంబర్ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్-2022 స్టార్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, సికందర్ రాజా, కెమరూన్ గ్రీన్ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్ల్లో ఉన్న బ్యాలెన్స్ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ప్రకారం.. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరిలో స్టోక్స్కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్రైజర్స్.. స్టోక్స్పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వదిలించుకోవడంతో స్టోక్స్ను ఎలాగైనా దక్కించుకుని, కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ. సన్రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు.. సన్రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్కతా నైట్రైడర్స్-7.05 కోట్లు -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
IPL 2023: వేలంలో స్టోక్స్, కర్రన్.. ఆ రెండు జట్ల కన్ను వీరిపైనే..!
Ben Stokes, Sam Curran Available For IPL 2023 Auction: టీ20 వరల్డ్కప్-2022 హీరోలు, ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్లు.. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్కప్లో, ముఖ్యంగా పాక్తో జరిగిన ఫైనల్లో సంచలన ప్రదర్శన నేపథ్యంలో ఈ ఇద్దరు మ్యాచ్ విన్నర్లపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడం కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. వివిధ కారణాల చేత గత ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉన్న వీరిని దక్కించేందుకు, ఎంత ధర అయినా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తమ పర్స్ నుంచి ఏకంగా 20 కోట్లు వెచ్చించేందుకైనా రెడీ అన్న సంకేతాలు పంపాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్-2023 సీజన్ పూర్తయిన వెంటనే (జూన్) ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వీరు ఐపీఎల్కు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్గా, కర్రన్ ఆ జట్టులో కీలక ఆల్రౌండర్గా ఉన్న నేపథ్యంలో వీరు ఐపీఎల్-2023పై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. ఐపీఎల్లో స్టోక్స్ ప్రస్తానం.. 2017 సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.. స్టోక్స్ను రికార్డు స్థాయిలో 14.5 కోట్లకు సొంతం చేసుకోగా, ఆతర్వాతి సీజనే (2018) రాజస్తాన్ రాయల్స్ అతన్ని 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వరుసగా రెండు సీజన్ల పాటు (2019, 2020) ఆర్ఆర్ తరఫున సత్తా చాటిన స్టోక్స్.. 2021 సీజన్లో గాయపడటంతో టోర్నీ ఆరంభంలోనే జట్టును వీడాడు. ఆతర్వాత 2022 మెగా వేలంలో ఆర్ఆర్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో అలకబూనిన స్టోక్స్.. మెగా వేలంలో తన పేరును సైతం రిజిస్టర్ చేసుకోలేదు. 🚨 Ben Stokes have been made available for the IPL mini auction.#IPLAuction #IPL2023 #IPL2023Auction #Ipl2023Retention #IPLretention #ipltrade #IPL #iplauction2023 #iplretentions #IPLT20 #BenStokes pic.twitter.com/V9P1Z1rrCZ — Top Edge Cricket (@topedge_cricket) November 15, 2022 ఐపీఎల్లో సామ్ కర్రన్ ప్రస్తానం.. 2019లో టీమిండియాపై సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన సామ్ కర్రన్ను అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.2 కోట్ల భారీ మొత్తం వెచ్చింది కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బంతితో, బ్యాట్తో ఓ మోస్తరుగా రాణించిన కర్రన్ను పంజాబ్ కింగ్స్ 2020 వేలంలో అనూహ్యంగా వదులుకుంది. దీంతో ఆ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున 2020, 2021 సీజన్లలో పర్వాలేదనిపించిన కర్రన్.. 2022 మెగా వేలానికి ముందు గాయం బారిన పడి, ఆ సీజన్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
సామ్ కర్రాన్ అరుదైన ఘనత.. తొలి బౌలర్గా!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్గా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విశ్వవిజేతగా ఇంగ్లండ్ అవతరించడంలో ఆ జట్టు ఆల్రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ను దెబ్బకొట్టాడు. తుదిపోరులో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన కర్రాన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శన గాను ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా కర్రాన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కర్రాన్కే వరిచింది. కాగా ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డు సాధించిన తొలి స్పెషలిస్టు బౌలర్గా సామ్ కర్రాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినది వీరే షాహిద్ అఫ్రిది(2007) తిలకరత్నే దిల్షాన్(2009) కెవిన్ పీటర్సన్(2010) షేన్ వాట్సన్(2012) విరాట్ కోహ్లీ(2014,2016) డేవిడ్ వార్నర్(2021) సామ్ కర్రాన్(2022) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి! -
WC 2022 Final: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మెల్బోర్న్ మ్యాచ్లో ఆది నుంచే తమ ప్రణాళికను అమలు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఐదో ఓవర్ రెండో బంతికి పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ శుభారంభం అందించాడు. తర్వాత ఆదిల్ రషీద్ మహ్మద్ హారీస్(8), బాబర్ ఆజం(32)ను పెవిలియన్కు పంపగా.. స్టోక్స్ ఇఫ్తీకర్ అహ్మద్(0) పని పట్టాడు. ఇక జోరు కనబరిచిన షాన్ మసూద్(28 బంతుల్లో 38 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకోగా..క్రిస్ జోర్డాన్ షాదాబ్ ఖాన్(20)ను ఆరో వికెట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత సామ్ మరోసారి తన మ్యాజిక్తో మహ్మద్ నవాజ్(5) వికెట్ తీయగా.. ఆఖరి ఓవరల్లో మహ్మద్ వసీం జూనియర్(4)ను అవుట్ చేసి జోర్డాన్ పాక్ ఇన్నింగ్స్లో చివరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నారు ఇంగ్లీష్ బౌలర్లు. 16- 20 ఓవర్ల మధ్యలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు కూల్చారు. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. పాక్తో ఫైనల్లో 16-20 ఓవర్లలో 16.2: సామ్ కరన్- షాన్ మసూద్ వికెట్ 17.2: క్రిస్ జోర్డాన్- షాదాబ్ ఖాన్ వికెట్ 18.3: సామ్ కరన్- మహ్మద్ నవాజ్ వికెట్ 19.3: క్రిస్ జోర్డాన్- మహ్మద్ వసీం జూనియర్ వికెట్ ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ డెత్ ఓవర్లలో బౌలింగ్ సాగిందిలా.. 23/6 అఫ్గనిస్తాన్, పెర్త్ 30/7 ఐర్లాండ్, మెల్బోర్న్ 36/3 న్యూజిలాండ్ , బ్రిస్బేన్ 25/5 శ్రీలంక, సిడ్నీ రెండో సెమీ ఫైనల్- 68/3 ఇండియా, అడిలైడ్ ఫైనల్- 31/4 పాకిస్తాన్, మెల్బోర్న్ చదవండి: T20 WC 2022: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్గా -
సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్గా
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్లలో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. తాజాగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్లో మహ్మద్ రిజ్వాన్ను ఔట్ చేయడం ద్వారా సామ్ కరన్ ఈ ప్రపంచకప్లో 11వ వికెట్ సాధించాడు. సామ్ కరన్ తర్వాత వరుసగా రియాన్ సైడ్బాటమ్(10 వికెట్లు, 2010), గ్రేమ్ స్వాన్(10 వికెట్లు, 2010), డేవిడ్ విల్లే(10 వికెట్లు, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ తడబడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బాబర్ ఆజం 32 పరుగులు చేసి ఔట్ కాగా.. షాన్ మసూద్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: Pak Vs Eng: చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం: బాబర్ ఆజం -
ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవం.. డూ ఆర్ డై మ్యాచ్లో కివీస్పై విజయం
T20 WC 2022 ENG VS NZ: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన గ్రూప్-1 మ్యాచ్లో బట్లర్ సేన్ న్యూజిలాండ్పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్లో జోస్ బట్లర్ (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52; 7 ఫోర్లు, సిక్స్).. ఆతర్వాత బౌలింగ్లో సామ్ కర్రన్ (2/26), క్రిస్ వోక్స్ (2/33), మార్క్ వుడ్ (1/25), బెన్ స్టోక్స్ (1/10) చెలరేగడంతో ఇంగ్లండ్ ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని (తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యం) సద్వినియోగం చేసుకోలేకపోయిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. బట్లర్, హేల్స్, లివింగ్స్టోన్ (20) మినహా మిగతావారెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా సాధించలేకపోయారు. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40), గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జోడీ ఓ దశలో గెలుపుపై ఆశలు చిగురించేలా చేసింది. అయితే వీరిద్దరూ ఔట్ కావడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కీలక బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఫిన్ అలెన్ (16), డెవాన్ కాన్వే (3), జేమ్స్ నీషమ్ (6), డారిల్ మిచెల్ (3) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో సాంట్నర్ (16 నాటౌట్), సోధి (6 నాటౌట్) జట్టును గెలిపించేందకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ (4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 0.547).. న్యూజిలాండ్తో (4 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు, 2.233) సమానంగా నిలిచి గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్లో ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో పాటు ఆస్ట్రేలియా (4 మ్యాచ్ల్లో 2 విజయాలు) కూడా 5 పాయింట్లతో సమానంగా ఉంది. అయితే రన్రేట్ పరంగా చూస్తే ఆసీస్ (-0.304).. కివీస్, ఇంగ్లండ్ల తర్వాత స్థానంలో నిలిచింది. -
T20 World Cup 2022 : స్యామ్ కరన్ 5/10
పెర్త్: టి20 వరల్డ్ కప్ను మాజీ చాంపియన్ ఇంగ్లండ్ విజయంతో మొదలు పెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొంత తడబడినా, చివరకు లక్ష్యాన్ని చేరింది. శనివారం అఫ్గానిస్తాన్తో జరిగిన ‘సూపర్ 12’ గ్రూప్–1 లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్ జద్రాన్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఘని (30 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (5/10) అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టి20ల్లో ఇంగ్లండ్ తరఫున ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్టోక్స్, మార్క్ వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. బట్లర్ (18), హేల్స్ (19) ప్రభావం చూపలేకపోగా...ఆ తర్వాత తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే లివింగ్స్టోన్ (21 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి జట్టును ఒడ్డున పడేశాడు. -
సామ్ కర్రాన్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బౌలర్గా
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కర్రాన్.. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను కర్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా సామ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది. 2021లో రషీద్ వెస్టిండీస్పై కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇవే అత్యుత్తమం. కాగా.. తాజా మ్యాచ్తో రషీద్ రికార్డును కర్రాన్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్గానిస్తాన్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో కర్రాన్తో పాటుగా స్టోక్స్, వుడ్ తలా రెండు వికెట్లు, వోక్స్ ఒక్క వికెట్ సాధించాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే' -
ENG VS AFG: పొట్టి క్రికెట్లో ప్రపంచ రికార్డు.. చరిత్రలో రెండోసారి ఇలా..!
పొట్టి క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్కప్-2022 సూపర్-12 మ్యాచ్ల్లో భాగంగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 22) జరుగుతున్న మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రన్ (5/10) ధాటికి 19.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కర్రన్కు జతగా బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23), క్రిస్ వోక్స్ (1/24) రాణించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) ఓ మోస్తరుగా రాణించారు. ప్రపంచ రికార్డు విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ల రూపంలో పెవిలియన్కు చేరారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇలా పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. ఇదే ఏడాది క్రెఫెల్డ్ వేదికగా ఆస్ట్రియా-జర్మనీ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో తొలిసారి పది మంది ప్లేయర్లు క్యాచ్ ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్లో ఈ సీన్ రెండోసారి రిపీట్ అయ్యింది. ఇదిలా ఉంటే, 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఫజల్ హాక్ ఫారూఖీ బౌలింగ్లో బట్లర్ (18) ఔట్ కాగా.. అలెక్స్ హేల్స్ (11), డేవిడ్ మలాన్ క్రీజ్లో ఉన్నారు. -
T20 WC: ఇంగ్లండ్ బ్యాటర్ల వీరవిహారం.. పాక్పై సునాయాస విజయం
టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా (భారత్ విజేత).. ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. పాక్ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు పవర్ హిట్టింగ్ మజాను అందించారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటైనా, ఆతర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లియామ్ లివింగ్స్టోన్ (16 బంతుల్లో 28; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టయిల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని (163/4) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) పాక్కు ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్ తలో వికెట్ సాధించారు. -
సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో వన్డేలో బట్లర్ సేన ఘన విజయం
పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ (3/29), మొయిన్ అలీ (2/22), రీస్ టాప్లే (2/17), డేవిడ్ విల్లే (1/9), సామ్ కర్రన్ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (40 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (12), ప్రిటోరియస్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! -
IPL 2022: వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్లు చూస్తుంటే చిరాగ్గా ఉంది!
IPL 2022: వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్-2021 సీజన్ మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్. గత సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సామ్.. అక్టోబరులో జరిగిన రెండో అంచె సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్-2021తో పాటు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22కు కూడా దూరమయ్యాడు. అయితే, గాయం నుంచి కాస్త ఉపశమనం కలగడంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో తన పేరును నమోదు చేసుకోవాలనుకున్నాడు సామ్ కరన్. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మాత్రం మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్కు సామ్ కరన్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన సామ్ కరన్ ఐపీఎల్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘అక్కడికి(భారత్) వెళ్లలేకపోయిన కారణంగా నిరాశకు లోనయ్యాను. ఇంట్లో కూర్చుని మ్యాచ్లు చూస్తుంటే విసుగు పుడుతోంది. వేలంలో పాల్గొనాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ... చివర్లో మనసు మార్చుకున్నా. నిజానికి అది చాలా మంచి నిర్ణయం’’అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘అవకాశం వస్తే తప్పక అక్కడికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఆడితే మన ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. అక్కడే క్రికెట్నే శ్వాస, ధ్యాస. బ్రేక్ఫాస్ట్కు వెళ్లిన సమయంలో సూపర్స్టార్లతో కూర్చుని ఆట గురించే మాట్లాడతాం. అందుకే అక్కడికి వెళ్లడాన్ని ఇష్టపడతా’’ అని సామ్ కరన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నెట్స్లో ప్రాక్టీసు చేస్తున్నానని, త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022- RCB: ఆర్సీబీకి గుడ్న్యూస్.. స్టార్ ఆల్రౌండర్ వచ్చేస్తున్నాడు! -
IPL 2021: సామ్ కరన్ స్థానంలో కరేబియన్ క్రికెటర్.. ప్రకటించిన సీఎస్కే
Sam Curran Replaced With Dominic Drakes: సామ్ కరన్ స్థానంలో కరేబియన్ క్రికెటర్ డొమినిక్ డ్రేక్స్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్కింగ్స్ ప్రకటించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా రాణించిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్కు స్వాగతం పలికింది. కాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పితో బాధపడిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని డొమినిక్తో భర్తీ చేశారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వెస్బెర్ట్ తనయుడైన డొమినిక్.. ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. అయితే, ఇటీవల ముగిసిన కరేబియన్ లీగ్లో మాత్రం అదరగొట్టాడు. సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు... టోర్నీలో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. ముఖ్యంగా.. ఫైనల్లో ... 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు తొలి టైటిల్ అందించడంలో డొమినిక్ కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’గా నిలిచాడు. ఇక నెట్ బౌలర్గా యూఏఈకి వచ్చి ఐపీఎల్ బబుల్లో ఉన్న 23 ఏళ్ల డొమినిక్.. ఇప్పుడు సీఎస్కేలో సామ్ కరన్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. కాగా చెన్నై సూపర్కింగ్స్ గురువారం పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో డొమినిక్ తుది జట్టులో చోటు దక్కించచుకుంటాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్-2021 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో తొమ్మిదింట గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి! -
T20 World Cup 2021: ఇంగ్లండ్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్ దూరం
Sam Curran Ruled Out T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్రౌండర్ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సామ్ కరన్ ఇంగ్లండ్ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్ను పరీక్షల కోసం స్కానింగ్కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్లో సామ్కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్ -
ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’
Glenn Phillips: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన సామ్ కరన్.. తన రెండో డెలివరీ వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లింది. అయితే స్ట్రైక్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతిని ఎదుర్కోవడానకి క్రీజు వదిలి చాలా దూరం వెళ్లాడు. అయినప్పటికీ బంతిని అందుకోలేక చతికల పడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను నవ్వులు పూయిస్తుంది. ఫిలిప్స్ ‘ఫీట్’పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పరుగుల కోసం ఎంత దూరమైనా సిద్ధమా అని కొందరు.. ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా వదలవా? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫిలిప్స్ ఆత్రం చూసి సామ్ నోరెళ్లబెట్టాడు అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి టార్గెట్ను సాధించింది. యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్లు) శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్ను గెలిపించాయి. దీంతో ప్లేఆఫ్ ఆశలను రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/I4heCusEzr — Jabjabavas (@jabjabavas) October 2, 2021 -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్కు పగ్గాలు..? -
పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు
కార్డిఫ్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్తో మెరిశాడు. ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సామ్ కరన్ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్కు తగిలి పిచ్పైనే ఉండిపోయింది. సింగిల్కు అవకాశం ఉండడంతో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్బాల్ టెక్నిక్ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్కు చేరాడు. సామ్ కరన్ రనౌట్ వీడియో ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇట్స్ కమింగ్ హోమ్.. సామ్ బ్యాక్ ఆన్ ది నెట్ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: ఆల్రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్దే టి20 సిరీస్ Great. Let's win this @englandcricket ....@daniel86cricket bro r u watching ur team s worst performance vs ENG — RahulVaidya_fanclub (@vaidyaFan_rahul) June 24, 2021 -
'సామ్ ఇంటికెళ్లి బాగా చదువుకో'.. రైనా ట్రోల్
చెన్నై: సోషల్ మీడియా అంటేనే ట్రోల్స్, మీమ్స్కు పెట్టింది పేరు. అప్పుడప్పుడు సాధారణ వ్యక్తులు ట్రోల్ చేస్తూ పెట్టే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అలాంటిది సెలబ్రిటీలు పెడితే ఇక చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా సీఎస్కే ఆటగాళ్లు సురేశ్ రైనా, సామ్ కరన్ల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. వాస్తవానికి వారిద్దరు మాట్లాడుకున్న సందర్భం వేరుగా ఉన్నా.. ఫోటోలో సామ్ కరన్ చిన్నపిల్లాడి ఫోజు వైరల్గా మారింది. ''సామ్.. లీగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాగా చదువుకో.. జనరల్ నాలెడ్జ్ ఇంకా పెంచుకో అన్నట్లు'' రైనా ట్రోల్ చేసినట్లుగా చూపించారు. దానికి సామ్ కరన్ సరేనన్నట్లు తల ఊపుతున్నట్లుగా అనిపించింది. దీనిపై రైనా తన ట్విటర్లో స్పందిస్తూ.. సూపర్ అంటూ లాఫింగ్ ఎమోజీతో పాటు లాఫింగ్ సింబల్ను ట్యాగ్ చేశాడు. ఇక సీఎస్కే గతేడాది ఐపీఎల్ సీజన్ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉన్న రైనా ఐపీఎల్ 14వ సీజన్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లాడిన రైనా 6 ఇన్నింగ్స్లు కలిపి 126 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. సామ్ కరన్ ఈ సీజన్లో ఆరు మ్యాచ్లాడి 9 వికెట్లు తీశాడు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఐపీఎల్ ఆపేసి మంచి పని చేశారు: రోహిత్ Sam Bro. 😂😂 pic.twitter.com/ClDKS4DyoK — Wear Mask!😷 🙏🏻 (@RVCJ_FB) May 6, 2021 View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
సామ్ కర్రన్ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు
పూణే: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో సంచలన ప్రదర్శనతో అందరి మనసులను దోచుకున్న ఇంగ్లండ్ నవయువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. వన్డేల్లో 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్కు దిగి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సామ్ కర్రన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి శ్రీలంకపై అజేయమైన 95 పరుగులు చేసినప్పటికీ... సామ్ కర్రన్ తక్కువ బంతుల్లో అదే స్కోర్ చేయడంతో ఈ రికార్డ్ అతని ఖాతాలో చేరింది. విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ 2011లో భారత్పై అజేయమైన 92 పరుగులు(9వ స్థానంలో) చేయగా, వెస్టిండీస్పై ఆసీస్ ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ 92 పరుగులు(8వ స్థానంలో) చేశాడు. కాగా, తాజాగా భారత్తో జరిగిన మ్యాచ్లో సామ్ కర్రన్ 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అజేయమైన 95 పరుగులు సాధించాడు. సామ్ కర్రన్ అద్భుత పోరాటం వృధా కావడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధవన్ (67), పంత్ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్ వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. సామ్ కర్రన్, డేవిడ్ మలాన్ (50) అర్ధశతకాలు సాధించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు. చదవండి: వన్డే ర్యాంకింగ్స్లో దూసుకెళ్లిన టీమిండియా -
ఇంగ్లండ్ ఆటగాడిలో ధోని లక్షణాలు
పుణే: ఆదివారం జరిగిన ఆఖరి మూడో మ్యాచ్లో భారత జట్టు వన్డే సిరీస్ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో స్యామ్ కరన్ వీరోచిత ఇన్నింగ్స్ (95 నాటౌట్) చూస్తే 'గ్రేట్ ఫినిషర్' మహేంద్ర సింగ్ ధోని లక్షణాలు కనిపించాయని బట్లర్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో, ఇంగ్లండ్ జట్టు 200 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కరాన్ 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగి, జట్టుని ముందుండి నడిపించడమే కాకుండా, మ్యాచ్లో చివరి వరకు పోరాడాడు. ఇటువంటి ప్రదర్శనలు మనం భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలో చూస్తుంటామని ఈ సందర్భంగా బట్లర్ గుర్తు చేశాడు. ‘ప్రస్తుతం అందరి కళ్లు ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ పైన ఉంటాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న స్యామ్ కరన్ నిన్న రాత్రి తను ఆడిన ఇన్నింగ్స్ గురించి చర్చిస్తాడని నేను అనుకుంటున్నాను. అంతరాతీయ క్రికెట్ ప్రపంచంలో అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోని అంటే ఏమిటో మాకు తెలుసు. కనుక ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం స్యామ్ కెరీర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణంగా మా ఆటగాళ్లకు కూడా ఎంఎస్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం నాకు ఆనందంగా ఉంది’అని మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ బట్లర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2021లో చెన్నై జట్టు తరఫున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఆడనున్నాడు. భాగస్వామ్యాలు లేకే మ్యాచ్ను కోల్పోయాం ‘రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్కు మూడో వన్డేలో 330 టార్గెట్ అంత కష్టమేమి కాదు, మేము ఆ స్కోరును చేధించగలమని అనుకున్నాం. రన్-రేట్ సమస్య అవుతుందని అనుకోలేదు, కాని మేము క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోవడం వంటి అంశాలు ఇంగ్లండ్కు మ్యాచ్ను దూరం చేసింది. చిన్న, చిన్న పొరపాట్లు కలిసి పెద్దవిగా మారుతాయి. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు,కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నాను. భారత్ బ్యాట్స్మెన్లకు కొన్ని బౌండరీల విషయంలో కష్టపడకపోయినా సునాయాసంగా మేమే పరుగులు సమర్పించుకున్నాం. అవే మ్యాచ్లో 7 పరుగల తేడాతో ఓటమికి కారణమైంది’ అని బట్లర్ అన్నాడు. ( చదవండి: భారత్లో అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనేనంటే నమ్ముతారా! ) -
మ్యాచ్లో ఓడినా.. మనసులు గెలిచావోయ్ కరన్!
పుణే: ఆదివారం రసవత్తరంగా సాగిన ఆఖరి వన్డేలో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ గెలిచినప్పటికీ, స్యామ్ కరన్ తన అసాధారణ బ్యాటింగ్ తో అందరి మనసులను గెలుచుకున్నాడు. మరో రకంగా చెప్పాలంటే మ్యాచ్లో ఓటమి తథ్యమనేలా కోహ్లి సేనని భయపెట్టాడు. స్యామ్ కరన్ ఐపీఎల్ 2020 ద్వారా భారత్ క్రికెట్ అభిమానులకి పరిచయమైన పేరు. గత సీజన్ లో చెన్నై జట్టు తరుపున ఓపెనర్గా, వన్డౌన్ గా బరిలోకి దిగి తన బ్యాట్తో మెరుపులు మెరిపించి భారత్లో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. నిన్న జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ద్వారా భారత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒకింత గుబులు పుట్టించాడు. మరో ఎండ్ లో ధీటైన బ్యాట్స్మెన్ లేకపోయినా ధైర్యం కోల్పోకుండా తన భీకర బ్యాటింగ్తో మ్యాచ్ను చివరి వరకు లాక్కొచ్చి తన కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ను ఆడాడు. భారత జట్టును భయపెట్టిన కరన్ స్యామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్కు ఆదిల్ రషీద్ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్కు మార్క్ వుడ్ (21 బంతుల్లో 14; ఫోర్)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్ విజయం ఖాయమనేలా చేశాడు. భారత్కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్ని చివరి బంతివరకు తీసుకెళ్లాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ నెగ్గినా... స్యామ్ కరన్ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్ నటరాజన్ నేర్పుతో బౌలింగ్ చేసి స్యామ్ కరన్ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్ (3/42), శార్దుల్ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... బెయిర్స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ( చదవండి: భారత్ తీన్మార్ ) -
ఆ నిర్ణయం షాక్కు గురిచేసింది: కోహ్లి
పుణె: తీవ్ర ఉత్కంఠ రేపిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు విజయం ఇంగ్లండ్దా! భారత్దా అని ఊగిసలాడింది. ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ భారత్కు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్కు విజయం అందించడానికి కడవరకు పోరాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు సామ్ కరన్. అతడి పోరాట పటిమగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ నిర్ణయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి షాక్కు గురైయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ..‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేస్తారని అనుకున్నా...! కానీ అందుకు భిన్నంగా సామ్ కరన్ ఎంపిక ఒకింత విస్మయానికి గురిచేసింది. మిడిల్ ఓవర్స్లో బౌలర్లు వికెట్లు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అని పేర్కొన్నాడు. ఇక ప్లేయర్ ‘ఆఫ్ ది సిరీస్’కు భువనేశ్వర్ కుమార్ అర్హుడని కోహ్లి తెలిపాడు. కాగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టోను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ఓడిపోయిన జట్టుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రావడం చాలా అరుదు. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. చదవండి: పాపం కోహ్లి.. ఆ విషయంలో దురదృష్టవంతుడు -
‘టాప్ మోస్ట్ ఆల్రౌండర్గా ఎదుగుతాడు’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రను చూస్తే సీఎస్కే ఎప్పుడూ వేలంలో దూకుడుగా ఉన్న దాఖలాలు లేవని, ఈసారి మాత్రం వారు వేలంలో చాలా యాక్టివ్గా ఉండటం ఖాయమని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఈ సీజన్లో సీఎస్కే లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో వచ్చే ఏడాది వేలానికి ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటుందన్నాడు. వచ్చే ఏడాది కూడా ధోనినే సీఎస్కే కెప్టెన్గా ఉన్నప్పటికీ యువ క్రికెటర్లను ఎక్కువ టార్గెట్ చేస్తూ ఐపీఎల్ వేలానికి వెళతారన్నాడు. వచ్చే ఏడాది సీఎస్కే జట్టులో చాలా మార్పులు జరగడం ఖాయమన్నాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) రిటైన్ కానీ యువ క్రికెటర్లపై సీఎస్కే గురిపెడుతుందని గంభీర్ అన్నాడు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న చాలా మందిని తిరిగి రిటైన్ చేసుకుంటుందన్నాడు. ఆ కోవలో ముందు వరుసలో ఉండేవాడు సామ్ కరాన్ అని గంభీర్ తెలిపాడు. సామ్ కరాన్ అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను రోజు రోజుకు ఎంతో పరిణితి సాధిస్తూ కీలక ఆల్రౌండర్ అవుతాడన్నాడు. టాప్ మోస్ట్ ఆల్రౌండర్గా సామ్ కరాన్ ఎదుగుతాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్ జోస్యం చెప్పాడు. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 53 బంతుల్లో 72 పరుగులు చేసి విజయానికి బాటలు వేయగా, రవీంద్ర జడేజా జడేజా 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 31 పరుగులు చేసి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ సీజన్లో చెన్నై ఐదో విజయం సాధించగా, ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు క్లిషంగా మారాయి. -
100 లోపే అనుకున్నాం, కానీ అతని వల్లే
దుబాయ్: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన సూపర్ కింగ్స్ తాజా సీజన్లో ప్లే ఆప్స్కు దూరమైంది. శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో ఒక్క సామ్ కరన్ మినహా, మిగతా సభ్యులంతా విఫలమయ్యారు. అతని ఒంటరి పోరుతోనే చెన్నై సెంచరీ మార్కును దాటగలిగింది. ప్రత్యర్థిని 100 పరుగుల లోపే కట్టడి చేయాలని భావించినా సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అది సాధ్యం కాలేదని ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కరన్ కొరకరాని కొయ్యలా మారడంతో చెన్నై ఆ మాత్రం పరుగులు చేయగలిగిందని అన్నాడు. తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి టాప్ 5 వికెట్లను కూల్చడం ఆనందాన్నిచ్చిందని పొలార్డ్ తెలిపాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే బౌలింగ్తో చెన్నై ఆటగాళ్లు తేరుకోలేకపోయారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో వ్యాఖ్యానించాడు. సమష్టి ప్రదర్శనతో ముంబై గెలిచిందని తెలిపాడు. కాగా, 5 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోర్ నమోదు దిశగా పయనిస్తున్న సీఎస్కేను సామ్ కరన్ ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఆరో ఓవర్ మూడో బంతికి క్రీజ్లోకి వచ్చిన అతను బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొంటూ చివరి బంతి వరకు పట్టుదలగా నిలిచి పరుగులు రాబట్టాడు. రాహుల్ చహర్, కూల్టర్నైల్ వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టి అతను జోరును ప్రదర్శించాడు. అద్భుత గణాంకాలతో చెన్నై ఆటగాళ్లకు చెమటలు పట్టంచిన బౌల్ట్ బౌలింగ్లోనూ పరుగులు రాబట్టాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో కరన్ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్ గణాంకాలు ఈ ఓవర్తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి అద్భుత యార్కర్తో కరన్ను బౌల్డ్ చేసి బౌల్ట్ సంతృప్తి చెందాడు. ఇక 114 పరుగుల లక్ష్యాన్ని ముంబై 12.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. 11 మ్యాచ్లలో ఎనిమిదింట పరాజయం పాలైన చెన్నై జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. కాగా, ఈ విజయంతో ముంబై ఢిల్లీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని ఆక్రమించింది. గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్కు దూరమవడంతో పొలార్డ్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
'ధోని.. నిజంగా నువ్వు అద్భుతం'
దుబాయ్ : శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ 13వ సీజన్కు బీజం పడింది. ఎలాంటి విధ్వంసాలు.. అద్భుతాలు చోటుచేసుకోకుండానే మ్యాచ్ మొత్తం కూల్గా సాగిపోయింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై .. రాయుడు హిట్టింగ్.. డుప్లెసిస్ క్లాస్ బ్యాటింగ్ కలగలిపి చెన్నై మొదటి మ్యాచ్లో ముంబైపై సూపర్ విక్టరీని సాధించింది. ఈ మ్యాచ్లో ధోని యాంకర్ పాత్ర పోషిస్తూ.. జడేజా, స్యామ్ కరన్లను తన కంటే ముందు పంపించాడు. స్యామ్ కరన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బౌలింగ్లో ఒక వికెట్.. తర్వాత బ్యాటింగ్లో 6 బంతుల్లోనే 18 పరుగులు సాధించి చెన్నై గెలుపుకు మార్గం సుగమం చేశాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత స్యామ్ కరన్ కెప్టెన్ ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. (చదవండి : జడేజా మ్యాజిక్.. డుప్లెసిస్ సూపర్) 'చెన్నై జట్టుతో కలుస్తున్నాననే ఉత్సుకత నాలో కొత్త ఉత్సాహం నింపింది. చెన్నై జట్టుకు ఆడుతున్నా అనే మాటే కానీ.. జట్టులో ఆటగాళ్లతో పెద్దగా కలవలేదు.. ఎందుకంటే నేను ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోనే దుబాయ్కు చేరుకున్నా. రాగానే నేరుగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పాల్గొన్నా. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తా అనేది అప్పటివరకు తెలియదు. మా కెప్టెన్ ధోని వచ్చి.. జడేజా తర్వాత వెళ్లాల్సింది నువ్వే.. రెడీగా ఉండు అని చెప్పాడు. నిజంగా ధోని జీనియస్.. లెఫ్ట్.. రైట్ కాంబినేషన్ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. యాంకర్ పాత్ర పోషిస్తున్న ధోని 18వ ఓవర్కు ముందు నా వద్దకు వచ్చి రిస్క్ తీసుకొని ఆడు.. ఏదైతే అది జరుగుతుంది.. నీ ఆట నువ్వు ఆడు. కృనాల్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్లు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం సంతోషంగా ఉంది. రాయుడు,డుప్లెసిస్లు అద్భుతంగా ఆడారు.'అంటూ తెలిపాడు. (చదవండి : రాయుడు అదరగొట్టాడు..) ఇదే విషయమై మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. 'జడేజా, కరన్లను బ్యాటింగ్ ఆర్డర్లో నాకంటే ముందు పంపించడంలో ఎలాంటి ఆలోచన లేదు. ఇద్దరు ఆల్రౌండర్లే కాబట్టి.. హిట్టింగ్ ఆడే అవకాశం ఉండడం.. కీలక సమయంలో సిక్స్లు బాది జట్టుకు ఒత్తిడి తగ్గిస్తారనే ప్రమోషన్ ఇచ్చా ' అంటూ తెలిపాడు. చెన్నై తన తరువాతి మ్యాచ్ సెప్టెంబర్ 22న రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. -
‘ధోని.. అయామ్ ఈగర్లీ వెయిటింగ్’
హైదరాబాద్: ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) కొత్త బౌలర్ సామ్ కరన్ తెలిపాడు. డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ ఇంగ్లండ్ బౌలర్ను సీఎస్కే ఐదున్నర కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది కింగ్స్ పంజాబ్ తరుపున ప్రాతినిథ్యం వహించిన కరన్ హ్యాట్రిక్తో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్-2020 వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్స్టాలో సీఎస్కేతో లైవ్చాట్లో పాల్గొన్న కరన్.. ధోని, సీఎస్కే జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఐపీఎల్ ఆడటం ప్రతీ ఒక్క క్రికెటర్కు ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది. అందులో దిగ్గజ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న సీఎస్కే ఫ్రాంచైజీ తరుపున ఆడాలని ప్రతీ ఒక్క ఆటగాడికి ఓ కల. అలాంటి అవకాశం నాకు దక్కింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి కోచ్, వరల్డ్ బెస్ట్ కెప్టెన్ ధోని నాయకత్వంలో ఆడటం ఆటగాడిగా నాకు ఎంతో లాభం చేకూరుతుంది. ధోని సారథ్యంలో ఆడేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆయన కెప్టెన్సీలో ఎన్నో మెళకువలు నేర్చుకోవచ్చనే ఓ చిన్న స్వార్థం నాలో ఉంది. ధోని, మా దేశ ఆటగాడు బిల్లింగ్స్తో పాటు దిగ్గజ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అనేది అద్భుత అవకాశంగా భావిస్తున్నాను. ఈ మధ్యనే నన్ను సీఎస్కే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందరూ ఎంతో ప్రేమగా స్వాగతం పలికారు. కొద్ది రోజల క్రితం జరిగిన సీఎస్కే ట్రైనింగ్ సెషన్లో పాల్గొనాల్సింది. కానీ టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో కలవలేకపోయాను. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికీ చైన్నైలో ఉండేవాడిని. కానీ పరిస్థితలు చాలా వేగంగా మారాయి. అయితే ప్రస్తుతం సయమం ఎంతో భయంకరంగా ఉంది. ఓపికతో వ్యవహరించాలి. ఈ పరిస్థితుల నుంచి త్వరగా గట్టెక్కితే ఐపీఎల్ నిర్వహణ సాధ్యపడుతుంది’అని కరన్ పేర్కొన్నాడు. చదవండి: ప్రియాంక, కరీనా ఇష్టం.. స్టెయిన్ కష్టం నాడు రియల్.. నేడు వైరల్ -
‘చెన్నైకి తీసుకొచ్చి తీరుతాం’
హైదరాబాద్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్యామ్ కరన్ ఎగిరిగంతేస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్-2020 వేలంలో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ను చెన్నైసూపర్కింగ్స్(సీఎస్కే) రూ. 5.5కోట్లతో చేజిక్కించుకోవడమే కరన్ ఆనందానికి కారణం. ఇంత భారీ మొత్తంలో దిగ్గజ సారథి ధోని సారథ్యంలోని సీఎస్కే తరుపున ఆడనుండటంపై కరన్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. స్యామ్ కరన్ వీడియోను సీఎస్కే తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. సీఎస్కే తరుపున ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కరన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘నా ఎంపికకు సహకరించిన ధోని, ఫ్లెమింగ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో చెన్నైలో ప్రత్యర్థి జట్టు సభ్యుడిగా బరిలోకి దిగాను. కానీ ఈసారి చెన్నై అభిమానుల సమక్షంలో సీఎస్కే తరుపున ఆడటం ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను. అభిమానుల అంచనాలను అందుకునేలా గొప్ప ప్రదర్శన ఇస్తామనే ధీమా ఉంది. అంతేకాకుండా చెన్నైకి రావడానికి, నా కొత్త టీం సభ్యులను కలుసుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నాను. ధోని సారథ్యంలో.. ఫ్లెమింగ్ కోచింగ్లో ఆడటం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఐపీఎల్-2020 ట్రోఫిని చెన్నైకి తీసుకొస్తామనే విశ్వాసం ఉంది’అంటూ కరన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న సీఎస్కే జట్టు గత సీజన్లో రన్నరప్గా నిలిచింది. గత సీజన్లో అసాధరణ పోరాటపటిమతో ఆకట్టుకున్న ధోని జట్టు చివరి మెట్టుపై బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే గత అనుభవాల దృష్ట్య జట్టులో అనేక మార్పులు చేసింది. దీనిలో భాగంగా బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కరన్, చావ్లా, హేజిల్వుడ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో సీఎస్కే బౌలింగ్ దళం దుర్బేద్యంగా తయారయ్యింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని సారథ్యంలోని సీఎస్కే జట్టు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఎంత ఎదిగిపోయావ్ కరన్..
న్యూఢిల్లీ: స్యామ్ కరన్ ప్రస్తుతం పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పుణ్యమా అని ఈ ఆల్ రౌండర్కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గతేడాది చివరల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో 7.2 కోట్లతో కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేయడంతోనే వార్తల్లోకెక్కాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే విఫలం కావడంతో తర్వాతి రెండు మ్యాచ్లకు కరన్ను పక్కకు పెట్టారు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్కు గేల్ గాయం కావడంతో కరన్ మళ్లీ జట్టులోకి చేరాడు. ఆ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్ సాధించి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ సీజన్లో కరన్ సాధించిన హ్యాట్రికే మొదటిది కావడం విశేషం. అయితే తాజాగా కరన్కు సంబంధించిన ఫోటోను క్రిస్ గేల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కరన్తో చిన్నప్పుడు, ఇప్పుడు దిగిన ఫోటోను గేల్ షేర్ చేశాడు. ‘తొలి ఫోటోలో నేను యంగ్గా ఉన్నా.. ప్రస్తుత ఫోటోలో కరన్ చాలా యంగ్గా ఉన్నాడు’అంటూ గేల్ పేర్కొన్నాడు. ‘ఎంత ఎదిగిపోయావ్ కరన్’అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ప్రస్తుతం గేల్, కరన్లు ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీతో మ్యాచ్లో గేల్ గైర్హాజరీ నేపథ్యంలోనే కరన్ జట్టులోకి రావడం విశేషం. ఇక కింగ్స్ పంజాబ్ తన తరువాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం తలపడనుంది. -
‘ఢిల్లీ డేర్డెవిల్స్ను మళ్లీ చూసినట్టుంది’
హైదరాబాద్: సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో అనూహ్యంగా పరాజయం చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల ఆటతీరుపై మండిపడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఢిల్లీ జట్లుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్ను చూసినట్టుంది’అంటూ సెటైర్ వేశారు. ఇక ముఖ్యంగా యువ సంచలనం రిషభ్ పంత్ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడని.. చివరి వరకు ఉండి జట్టును ఎలా గెలిపించాలో ధోనిని చూసి నేర్చువాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఢిల్లీ మాత్రమే ఫైనల్కు చేరలేదు. అయితే ఈ సీజన్లో కొత్త జెర్సీ. జట్టు పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ జట్టు ఆటతీరు మారలేదంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో భాగంగా సోమవారం కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. ఢిల్లీ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులు కావాలి. అప్పటికి చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. దాంతో ఢిల్లీ విజయం ఖాయమనుకున్నారు. ఆ సమయంలో క్రీజ్లో ఉన్న రిషభ్ పంత్-ఇన్గ్రామ్లు కుదురుగా ఆడుతున్నారు. అయితే జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ఉండగా రిషభ్ పంత్ బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిస 17 ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టి మంచి దూకుడుగా కనిపించిన పంత్..ఆ మరుసటి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పతనం మొదలైంది. ఎనిమిది పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పరాజయం చెందింది. అద్భుత బౌలింగ్తో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసిన సామ్ కరన్ ఢిల్లీ పతనాన్ని శాసించాడు. చదవండి: ‘8 పరుగులకే 7 వికెట్లు అంటే నమ్మశక్యంగా లేదు’ మరిన్ని విజయాలు సాధిస్తాం సామ్ కరన్ హ్యాట్రిక్ -
‘అశ్ చెప్పినట్లే చేశా’
మొహాలి : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న ‘హ్యాట్రిక్’ వీరుడు సామ్ కరన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. హిట్టర్ క్రిస్ గేల్ గాయంతో మ్యాచ్కు దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ బౌలర్.. ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా కరన్పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ మేము గెలిచాం. గొప్ప విజయాన్ని అందుకున్నాం. మా టీమ్ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఒత్తిడిలో కూడా సామ్ కరన్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ‘లయన్ హర్టెడ్’ ఆటగాడితో చిన్న సెలబ్రేషన్’ అంటూ కరన్ కోసం బాంగ్రా స్టెప్పులేసిన వీడియో చేశారు. ఇక మ్యాచ్ అనంతరం కరన్ మాట్లాడుతూ... ‘ హ్యాట్రిక్ సాధిస్తానని అనుకోనేలేదు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య నా మాటలు నేనే వినలేకపోయా. అశ్ చెప్పినట్టుగానే బౌల్ చేశా. స్థానిక బ్యాటర్స్(ఇండియన్ ప్లేయర్స్)కు ఎలా బౌలింగ్ చేయాలనే విషయంపై సహచరులతో చర్చించా. షమీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి నాకు అండగా నిలిచాడు. నిజంగా మాకిది గొప్ప విజయం.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించేందుకు ఎల్లవేళలా కష్టపడతా. స్కూల్ క్రికెట్తో మొదలెట్టిన నేను.. మొదటిసారిగా ఇప్పుడే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడానని అనుకుంటున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని నమోదు చేస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా కింగ్స్ కెప్టెన్ అశ్విన్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ, కరన్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సోమవారం నాటి మ్యాచ్లో ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి హర్షల్ను ఔట్ చేసిన కరన్... 20వ ఓవర్ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్బౌల్డ్ చేసి ఈ సీజన్లో తొలి ‘హ్యాట్రిక్’ (2.2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు)ను నమోదు చేశాడు. ఇక ఐపీఎల్లో ఇది మొత్తంగా 17వ హ్యాట్రిక్. अप्पा जित गए👏What an unbelievable victory by @lionsdenkxip👍So proud of the way R team played & @CurranSM got a #Hattrick under pressure.This #Bhangra is a small celebration with a lion hearted player. Loving every part of #Saddasquad & #Saddapunjab this year. #ting #KXIPvsDC https://t.co/ioEAJTGu0U — Preity G Zinta (@realpreityzinta) April 1, 2019 -
14 పరుగులతో పంజాబ్ విజయం
-
పంజాబ్ భల్లే.. భల్లే..
మొహాలీ: సొంత మైదానంలో కింగ్స్ పంజాబ్ రెచ్చిపోయింది. సామ్ కరన్ హ్యాట్రిక్ షోతోపాటు అన్ని రంగాల్లో ఆకట్టుకున్న అశ్విన్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ను సమష్టిగా ఓడించింది. ఐపీఎల్-12లో భాగంగా స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 152 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. ఛేదనలో పృథ్వీ షా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ధావన్(30), అయ్యర్(28), ఇన్గ్రామ్(38), పంత్(39)లు రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. గెలుపు దగ్గరి వరకు వచ్చిన ఢిల్లీని చివర్లో పంజాబ్ బౌలర్లు అడ్డుకున్నారు. చివర్లో వరుసగా వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో కరన్ నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అశ్విన్, షమీలు తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆదిలోనే కేఎల్ రాహుల్(15) వికెట్ను నష్టపోయింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన రాహుల్.. క్రిస్ మోరిస్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికి సామ్ కరన్(20) కూడా నిష్క్రమించడంతో కింగ్స్ పంజాబ్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో 22 పరుగుల వ్యవధిలో మయాంక్ అగర్వాల్(6) కూడా ఔట్ కావడంతో కింగ్స్ మరింత కష్టాల్లో పడింది. ఆ తరుణంలో సర్ఫరాజ్ ఖాన్(39)-డేవిడ్ మిల్లర్(43)ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం చేయడంతో కింగ్స్ తేరుకుంది. మన్దీప్ సింగ్(29 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు వికెట్లు సాధించగా,లామ్చెన్, రబడాలు తలో రెండు వికెట్లు తీశారు. -
ఇంగ్లండ్ 285 ఆలౌట్
క్యాండీ: ఆల్రౌండర్ స్యామ్ కరన్ (119 బంతుల్లో 64; 1 ఫోర్, 6 సిక్స్లు) చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడటంతో శ్రీలంకతో బుధవారం మొదలైన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బర్న్స్ (43; 5 ఫోర్లు), ఆదిల్ రషీద్ (31; 2 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో తడబడింది. లంక స్పిన్నర్లు దిల్రువాన్ పెరీరా (4/61), పుష్పకుమార (3/89), అఖిల ధనంజయ (2/80) ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు వరుస కట్టారు. జెన్నింగ్స్ (1), స్టోక్స్ (19), కెప్టెన్ రూట్ (14), మొయిన్ అలీ (10), ఫోక్స్ (19) నిరాశ పరిచారు. 225 పరుగులకే 9 వికెట్లు పడిన దశలో కరన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అండర్సన్ (7 నాటౌట్)తో కలిసి చివరి వికెట్కు 60 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. -
సామ్ కరణే దెబ్బకొట్టాడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ : టెస్ట్ సిరీస్లో భారత్ విజయవకాశాలపై ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరణ్ దెబ్బకొట్టాడని టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్ 4-1తో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘మేం మరీ దారుణంగా విఫలమవ్వలేదు. కానీ ప్రయత్నించాం. ఇంగ్లండ్ గెలుపు క్రెడిట్ మాత్రం సామ్ కరణ్దే. అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడని విరాట్, నేను అనుకున్నాం. ఇంగ్లండ్ కన్నా కరణే మమ్మల్ని దెబ్బతీశాడు. తొలి టెస్ట్ ఎడ్జ్బాస్టన్లో క్లిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్ను బ్యాట్తో రాణించి గట్టెంక్కించాడు. ఇక నాలుగో టెస్ట్లో సైతం ఆల్రౌండ్ ప్రదర్శనతో మా విజయాన్ని లాగేశాడు. కీలక సమయాల్లో అటు బ్యాట్తో ఇటు బంతితో మెరిసాడు. ఇదే ఇరు జట్లలో ఉన్న వ్యత్యాసం. భారత జట్టు ఇంకా ప్రపంచ నెం.1నే. మేం ఎలా పోరాడామో ఇంగ్లండ్కు తెలుసు. మీడియాకు తెలుసు. మన అభిమానులకు తెలుసు. మా అంతరాత్మకు కూడా తెలుసు.’ అని వ్యాఖ్యానించాడు. విమర్శలపై స్పందిస్తూ.. తాము జట్టుకు ఏంచేశామో తమకు తెలుసని, ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘ ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మా బాధ్యతలు మాకు తెలుసు. మేం నిజాయితీగానే మా బాధ్యతలు నిర్వర్తించాం. ఈ విమర్శల పట్ల మేం బాధపడటం లేదు. గత మూడేళ్లుగా జట్టు సాధించిన విజయాలేంటో అందరికి తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. -
అతను చాలా తెలివిగా ఆలోచిస్తాడు: సచిన్
సాక్షి, స్పోర్ట్స్: ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ టీమిండియా ఓడిపోవడానికి కారణాలు అనేకం. అయితే ఈ సిరీస్లో ఇరు జట్లకు మరుపురాని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా సారథి విరాట్ కోహ్లి తొలి శతకం సాధంచాడు. టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన రిషభ్ పంత్ కూడా ఒకే ఇన్నింగ్స్లో(ఆరంగేట్రం మ్యాచ్లో) అత్యధిక క్యాచ్లు.. భారత కీపర్ ఇంగ్లండ్ గడ్డపై తొలి సెంచరీ సాధించడం వంటి రికార్డుల సృష్టించాడు. ఒకే సిరీస్లో అత్యధిక క్యాచ్లు(14) పట్టిన ఘనతను ఓపెనర్ కేఎల్ రాహుల్ సాధించాడు. ఇక మరోవైపు ఆతిథ్య జట్టుకు కూడా ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఈ సిరీస్లోనే సీనియర్ ఆటగాడు, ఓపెనర్ అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ ప్రకటించడం, బ్రిటీష్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ మెక్గ్రాత్ రికార్డును సవరించాడు. అయితే ఈ సిరీస్ ఇంగ్లండ్ గెలిచిన అనంతరం గాడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా మాజీ లెజండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ‘ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు టెస్టు సిరీస్ గెలిచినందుకు అభినందనలు. రిటైర్మెంట్ అనంతరం కూడా అలిస్టర్ కుక్ జీవితం బాగుండాలి. ఈ సిరీస్ ఇంగ్లండ్ గెలవడంలో స్యామ్ కుర్రాన్ కీలకపాత్ర పోషించాడు. కుర్రాన్ స్మార్ట్ థింకర్’ అంటూ సచిన్ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ సిరీస్లో అనుభవం లేని కుర్రాన్ వీరిచితంగా ఆడాడు. తొలి టెస్టు కోహ్లి సేన ఓడిపోవడానికి అతడే కారణమనుకోవాలి. ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఐదు వికెట్లు తీయడమే కాకుండా రెండో ఇన్నింగ్స్లో 63 పరుగులు సాధించడంతో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిచవిచూసింది. మిగిలిన టెస్టుల్లోనూ కుర్రాన్ తన మార్క్ చూపించాడు. ఈ సిరీస్లో అతడి ప్రతిభ చూసిన సచిన్ కూడా కుర్రాన్ స్మార్ట్ థింకర్ అంటూ ప్రశంసించాడు కాబోలు. చదవండి: టీమిండియాపై కుర్రాన్ కొత్త రికార్డు Congratulations, @englandcricket on winning the Test series. #AlastairCook, wishing you an even better post-retirement innings. #SamCurran has been the standout player of this series. Smart thinker. #ENGvIND pic.twitter.com/gy4Aqg3onT — Sachin Tendulkar (@sachin_rt) 12 September 2018 -
టీమిండియాపై కరాన్ కొత్త రికార్డు
సౌతాంప్టన్: టీమిండియా-ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్రౌండర్ సామ్ కరాన్ అరుదైన రికార్డును లిఖించాడు. భారత్పై ఒక టెస్టు సిరీస్లో ఎనిమిది, అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కరాన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ సిరీస్లో కరాన్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఇప్పటివరకూ చేసిన పరుగులు 242. దాంతో టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును నెలకొల్పాడు. తద్వారా న్యూజిలాండ్ ఆటగాడు డేనియల్ వెటోరి నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు. 2009లో భారత్తో జరిగిన సిరీస్లో వెటోరి ఎనిమిది, అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్ చేసి 220 పరుగులు చేశాడు. ఇదే ఈ స్థానంలో ఇప్పటివరకూ అత్యధికంగా కాగా, దాన్ని కరాన్ సవరించాడు. భారత్పై టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కరాన్ 24 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 63 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టులో కరాన్ తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేశాడు. నాల్గో టెస్టులో కరాన్ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 37 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ పోరాటం -
సాహోరే కోహ్లి..
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ బౌలర్లకు భారత బ్యాట్స్మెన్ దాసోహమయ్యారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి మినహా ఎవరూ పరుగులు కాదుకదా క్రీజులో నిలువలేకపోయారు. పుజారాను తప్పించి పొరపాటు చేశారనుకోని అభిమాని ఉండడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న పట్టుదలగా ఆడి కోహ్లి (149; 225 బంతుల్లో 22 ఫోర్లు, 1సిక్సర్) సెంచరీ సాధించాడు. కోహ్లి కెరీర్లోనే ఇదో మరుపురాని సెంచరీగా మిగిలిపోవటం ఖాయం. ఎందుకంటే జట్టు కష్ట సమయంలో ఉండగా, బ్రిటీష్ గడ్డపై చెత్త రికార్డుల నేపథ్యలో సరైన సమయంలో సెంచరీ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. అంతకముందు 285/9 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్ను కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలకు తలోవికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు విజయ్, ధావన్లు శుభారంభాన్ని అందించారు. ఈ దశలో టీమిండియాను బ్రిటీష్ యువ పేసర్ స్యామ్ కుర్రాన్ దెబ్బ తీశాడు. తొలి వికెట్కు 50 పరుగుల జోడించిన అనంతరం కుర్రాన్ బౌలింగ్లో మురళీ విజయ్(20) వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ బాది ఊపుమీదున్న రాహుల్(4)ను కుర్రాన్ బోల్తాకొట్టించాడు. ఇక మరో ఎండ్లో పట్టుదలగా బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించిన ధావన్(26) కూడా కుర్రాన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జట్టు కష్టసమయంలో ఉన్న సమయంలో కెప్టెన్తో కలిసి వైస్ కెప్టెన్ రహానే(15) ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకుంటే పేలవషాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(0) ఘోరంగా విఫలమయ్యాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా కోహ్లి ఎంతో సంయమనంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్ పాండ్యా(22), అశ్విన్(10). షమీ(2), ఇషాంత్ శర్మ(5), ఉమేశ్(1 నాటౌట్) ఉడతా భక్తిగా కోహ్లికి సహకారాన్ని అందించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 274 పరుగులకు ఆలౌటై 13 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లండ్కు అందించింది. ఇంగ్లండ్ బౌలర్లలో కుర్రాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అండర్సన్, స్టోక్స్, రషీద్ తలో రెండు వికెట్లు సాధించారు. -
భారత్ టాపార్డర్ను కుర్రాన్ కూల్చేశాడు
బర్మింగ్హామ్ : ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో 100 పరుగులకే భారత్ 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. అయితే తొలుత 9 ఓవర్లలోనే 40 పరుగులు చేసి ఓపెనర్లు విజయ్, ధావన్ దాటిగా ఆడే యత్నం చేశారు. 50/0 గా ఉన్న భారత్.. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ స్యామ్ కుర్రాన్ దాటికి కేవలం 9 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో పరిస్థితి 59/3గా మారింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ 4వ బంతిని విజయ్ డిఫెన్స్ ఆడగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో జో రూట్ రివ్యూకు వెళ్లాడు. బంతి లెగ్ స్టంప్ను గిరాటేస్తున్నట్లుగా కనిపించగా విజయ్ (20) నిరాశగా వెనుదిరిగాడు. ఆపై క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్గా మలిచి, రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ను పడగొట్టింది. దీంతో ఒకే ఓవర్లో 2 ప్రధాన వికెట్లు తీసిన కుర్రాన్.. తన మరుసటి ఓవర్ (16వ) ఆడిన ధావన్ ఇబ్బంది పడ్డాడు. ఇదే క్రమంలో ఆ ఓవర్లో 5వ బంతిని ఆడగా సెకండ్ స్లిప్లో ఉన్న మలాన్ చేతుల్లో పడింది. ధావన్(26) వికెట్ను సైతం కుర్రాన్ తన ఖాతాలో వేసుకుని భారత్ను ఒక్కసారిగా దెబ్బతీశాడు. ఆపై అజింక్య రహానే(15)తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ను నిర్మించే యత్నం చేశాడు. అయితే కెప్టెన్ రూట్ నమ్మకాన్ని బెన్స్టోక్స్ నెలబెట్టాడు. స్టోక్స్ వేసిన 28వ ఓవర్ నాలుగో బంతికి రహానే ఔటయ్యాడు. రహానే ఆడిన బంతిని జెన్నింగ్స్ క్యాచ్ పట్టడంతో నాలుగో వికెట్ కోల్పోయిన కోహ్లీ సేన స్కోరు 100 వద్దే స్టోక్స్ బౌలింగ్లో దినేష్ కార్తీక్ బౌల్డయి డకౌట్ అయ్యాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్ను కోల్పోయింది. -
భారత్ టాపార్డర్ను కుర్రాన్ కూల్చేశాడు