samajwadi party
-
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
‘అయోధ్య దీపోత్సవ్కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
అఖిలేశ్ యాదవ్ను యూపీ సర్కారు ఎందుకు అడ్డుకుంది?
UP Politics: ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)కు వెళ్లకుండా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్కు అధికారులు అనుమతి నిరాకరించారు.అఖిలేశ్ను అడ్డుకునేందుకు జేపీఎన్ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?అఖిలేశ్కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్మెంట్ అథారిటీ(ఎల్డీఏ) గురువారం అఖిలేశ్కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.సమాజ్వాదీ పార్టీ శ్రేణుల ఆందోళనఎల్డీఏ లేఖపై సమాజ్వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్ఐసీ వద్ద సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.చదవండి: సమాజ్వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తతఅఖిలేశ్పై బీజేపీ ఎదురుదాడిజేపీఎన్ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్లోని పార్టీలు పొలిటికల్ స్టంట్కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు. -
‘ఎస్పీ’ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
లక్నో:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.శుక్రవారం(అక్టోబర్11) జయప్రకాష్నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్ యాదవ్ జేపీఎన్ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్గేట్ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్ మండిపడ్డారు.ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జేపీఎన్ఐసీకి వెళ్లేదారిలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సెంటర్ మెయిన్గేట్ వద్ద బారికేడ్లు ఉంచారు.సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేష్ -
‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై అఖిలేశ్కు సీఎం యోగి కౌంటర్
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్కు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్గా తెలుస్తోంది.#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్పూర్కు పంపిస్తామని అన్నారు. -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్ఖడ్కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్గా ధన్ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
‘రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చండి’
ఢిల్లీ: 18వ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం రాష్ట్రపతిని ‘రాజ దండం’తో ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధని మోదీ పార్లమెంట్లోకి స్వాగతం పలికారు. అయితే లోక్సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.‘దేశంలో ప్రజాస్వామ్యంలో కోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నం.బీజేపీ గత ప్రభుత్వంలో రాజదండాన్ని స్పీకర్ చైర్కు పక్కన గోడకు అమర్చారు. సెంగోల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెంగోల్ అర్థం దండం. రాజదండం అంటే రాజు చేతి కర్ర. మనం రాజరిక పాలన నుంచి ఎప్పుడో విముక్తులం అయ్యాము. ప్రస్తుతం ఓటు అర్హత కలిగి ఉన్న స్త్రీ,పరుషులు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా? లేదా రాజదండంతో నడవాలా?. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి.. రాజ్యాంగాన్ని రక్షించండి’ అని ఆయన స్పీకర్కు రాసిన లేఖలో ప్రస్తావించారు.సెంగోల్పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘సమాజ్వాదీ పార్టీ గతంలో రామచరిత్మానస్పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్పై విమర్శలు చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ సెంగోల్ను అవమానించడాన్ని డీఎంకే పార్టీ సమర్థిస్తుందో? లేదో? స్పష్టం చేయాలి’ అని విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. -
బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్వాదీ ఎంపీ
యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ఉత్తర ప్రదేశ్లో ఆశ్చర్యకర ఫలితాలు.. ముందంజలో ఇండియా కూటమి
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నెలకొంది. లోక్సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 4) వెలువడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి చూపు రిజల్ట్స్ పైనే ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఇక్కడి స్థానాల నుంచే బరిలో ఉండటం ఇందుకు కారణం. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఉత్తర ప్రదేశ్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా మారిన యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి (సమాజ్వాదీ పార్టీ-34, కాంగ్రెస్-7) 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్దల్ పార్టీ రెండు స్థానాల్లో, ఏఎస్పీకేఆర్ ఒక చోట ఆధి క్యంలోఉంది.గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 62 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయగా, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి బీఎస్పీ ఒంటరీగా పోరాడుతోంది.ఈసారి అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగింది.అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ ఈసారి వెనుకంజలో పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ కేంద్రమంత్రిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.రాయబరేలీలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. దాదాపు 60 ఓట్ల ఆధిక్యంలో ఆయన దూసుకుపోతున్నారు.వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 20 వేల ఓట్లు ఆధిక్యంలో మోదీ కొనసాగుతున్నారు.కన్నౌజ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. లక్నోలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ఆయన.. ఎస్పీ నేత సర్వర్ మాలిక్పై ఆధిక్యంలో కొనాసగుతున్నారు.మథురలో పొలిటీషియన్గా మారిన నటిహేమమలాలిని మథురలో ముందంజలో ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్ధి ముకేష్ ధన్గర్ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్పూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్లల్లా మళ్లీ టెంట్లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
‘75 ఏళ్లకు రిటైర్ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్ విమర్శలు
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయస్సు, రిటైర్మెంట్పై విమర్శలు సంధించారు. ఇప్పటి వరకు పీఎం మోదీ.. తాను 75 ఏళ్ల వయస్సు దాటాక రిటైర్ కానని, ఎక్కడా స్పష్టం చేయలేని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఆప్, సమాజ్వాదీ పార్టీ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్తో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు.‘ప్రధాని మోదీ తనకు 75 ఏళ్లు దాటాక, తాను పదవీ విరమణ చేయనని.. ఎప్పుడూ స్పష్టం చేయలేదు. 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలనే నిబంధనను మోదీ ఉల్లంఘించరని దేశం మొత్తం నమ్మకంతో ఎదురుచూస్తోంది’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.‘బీజేపీ అమిత్ షాను ప్రధాని చేయటం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం.. సీనియర్ నేతలైన శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పక్కకు పెట్టింది. దీనికి అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ను కూడా మరో 2-3 నెలల్లో బీజేపీ పక్కకు పెడుతుంది’ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.ఇక.. ఇటీవల తిహార్ జైల్ నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఓర్యాలీలో పాల్గొని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.‘ ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షాను ప్రధానిగా చేయాలని బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఎందుకుంటే 2025 వరకు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం మోదీ.. ఏ పదవీ చేపట్టకుండా రిటైర్ అయిపోతారు. తర్వాత అమిత్ షా పీఎం అవుతారు’అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘నరేంద్ర మోదీ 2029 వరకు అంటే.. పూర్తి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మోదీ వయస్సుపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని అమిత్ షా స్పష్టం చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
లక్నో: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) రెండు రామ ద్రోహులని, వారి డీఎన్ఏలోనే రామ ద్రోహముందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేత రాధికా కేరాను కాంగ్రెస్ అవమానించిందన్నారు.అవమానం భరించలేకే ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేసిందన్నారు. ‘కాంగ్రెస్ నిజస్వరూపం దేశ ప్రజలందిరికీ తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్లు చేసేదేది నిజం కాదు. కేవలం ప్రజలను మోసం చేయడానికి వాళ్లు ఏదైనా చేస్తారు.ప్రజలు వాళ్ల నాటకాల పట్ల జాగ్రత్తగా ఉంటారు’అని యోగి వార్తా సంస్థతో అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రామునికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అయోధ్య వెళ్లినందుకే పార్టీ తనను అవమానించిందని ప్రకటించి రాజీనామా చేశారు. -
ఇలా టిక్కెట్ ఇచ్చి... అలా రద్దు చేసి..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్కు టిక్కెట్ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్కు కేటాయించింది. మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్కు 17 సీట్లు మిగిలాయి. -
ఆరు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులు.. ప్రకటించిన అఖిలేష్
లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లోని ఆరు స్థానాలకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సంభాల్ నుంచి ఎస్పీ టికెట్పై జియావుర్ రెహమాన్ బుర్క్ పోటీ చేయనుండగా, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ అవానా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తారని ఎస్పీ విడుదల చేసిన జాబితా పేర్కొంది. అలాగే భగవత్ శరణ్ గంగ్వార్ పిలిభిత్ నుంచి, రాజీవ్ రాయ్ ఘోసీ నుంచి పోటీ చేయనున్నారు. రాజేంద్ర ఎస్ బింద్ మీర్జాపూర్ నుంచి ఎస్పీ టికెట్పై పోటీ చేస్తారని తెలిపింది. మొత్తం ఏడు దశలలో లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఇప్పటివరకూ ఐదు జాబితాలు ప్రకటించగా ఇది ఆరోది. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 47కి చేరింది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఇచ్చింది. ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 17 లోక్సభ స్థానాలను కాంగ్రెస్కు వదిలివేసింది. కాంగ్రెస్ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్బరేలీ, అమేథీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఉన్నాయి. -
యూపీలో బీజేపీని ఢీకొట్టే ఎస్పీ అభ్యర్థులు వీళ్లే..
ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) 2024 లోక్సభ ఎన్నికలకు ప్రస్తుతానికి 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్తోపాటు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుత మైన్పురి ఎంపీగా ఉన్న డింపుల్ యాదవ్ మరోసారి అదే నియోజకవర్గం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లక్నో, అంబేద్కర్ నగర్ స్థానాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు రవిదాస్ మెహ్రోత్రా, లాల్జీ వర్మలను పార్టీ పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి బలమైన పక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో గట్టి పొత్తులో ఉంది. అనేక విడతల సమావేశాల తర్వాత, రెండు పార్టీలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని కీలక రాష్ట్రాల్లో 2024 లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒక అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం యూపీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా మిగిలిన 63 స్థానాలు ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. 2019లో 80 సీట్లలో 62 సీట్లను బీజేపీ గెలుచుకుంది. జనరల్ వీకే సింగ్ తన సమీప ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీకి చెందిన సురేష్ బన్సాల్పై 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో జనరల్ వీకే సింగ్ కాంగ్రెస్కు చెందిన రాజ్ బబ్బర్పై 5,67,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది 2008లో నమోదైన సంచలన రికార్డు. ఇప్పటివరకు ఎస్పీ ప్రకటించిన అభ్యర్థులు వీళ్లే.. అభ్యర్థి: లోక్సభ స్థానం డింపుల్ యాదవ్: మెయిన్పురి కాజల్ నిషాద్: గోరఖ్పూర్ రామ్ ప్రసాద్ చౌదరి: బస్తీ లాల్జీ వర్మ: అంబేద్కర్ నగర్ అవధేష్ ప్రసాద్: ఫైజాబాద్ శివశంకర్ సింగ్ పటేల్: బండా రాజా రామ్ పాల్: అక్బర్పూర్ నావల్ కిషోర్ శాక్య: ఫరూఖాబాద్ అన్నూ టాండన్: ఉన్నావ్ ఆనంద్ భదౌరియా: ధౌరహర ఉత్కర్ష్ వర్మ: ఖిరి ధర్మేంద్ర యాదవ్: బదౌన్ దేవేష్ శక్య: ఏటా అక్షయ్ యాదవ్: ఫిరోజాబాద్ రవిదాస్ మెహ్రోత్రా: లక్నో అఫ్జల్ అన్సారీ: ఘాజీపూర్ రాజేష్ కశ్యప్: షాజహాన్పూర్ ఉషా వర్మ: హర్దోయ్ ఆర్కే చౌదరి: మోహన్లాల్గంజ్ ఎస్పీ సింగ్ పటేల్: ప్రతాప్గఢ్ రమేష్ గౌతమ్: బహ్రైచ్ శ్రేయ వర్మ: గోండా వీరేంద్ర సింగ్: చందౌలీ రాంపాల్ రాజవంశీ: మిస్రిఖ్ -
Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు 17 సీట్లు
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్ నేత వినాశ్ పాండే చెప్పారు. ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో ఫోన్లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్బరేలీ, కాన్పూర్ నగర్, వారణాసి, షహరాన్పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్గంజ్, బన్స్గావ్, బులంద్òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. -
అఖిలేష్పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్వాదీ పార్టీలో చేరారు. 'ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. #WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt — ANI (@ANI) December 26, 2023 స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్మానస్లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
నాయకునిపై 'షూ' విసిరిన యువకుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు. లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE — Press Trust of India (@PTI_News) August 21, 2023 సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు భారీ ఊరట
లక్నో: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో ఆజం ఖాన్ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు. అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది. కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్పై రాంపూర్లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది. చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం -
సీఎం యోగి Vs అఖిలేష్: యోగి మాస్ వార్నింగ్..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడంపై సభలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగా సీఎం యోగి.. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే, రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్.. తన నివాసంలో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడిచేసి, కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. అయితే, యూపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ దారుణ ఘటనపై యోగి సర్కార్పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సభలో ఫైర్ అయ్యారు. ఉమేశ్ హత్యలో గ్యాంగ్ వార్ వంటి పరిస్థితి కనిపించదన్నారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్కు సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బాధితుల కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్ సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి, మాజీ ఎంపీ అని అన్నారు. మీరు (సమాజ్వాదీ పార్టీ) నేరస్తులకు మద్దతిస్తున్నారు. వారికి పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాఫియాలో అతిక్ అహ్మాద్ కూడా భాగమే. ఇలాంటి చర్యలను మేము అసలు సహించమని అన్నారు. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమయంలోనే సీఎం యోగి సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ మాఫియాకు గాడ్పాధర్ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో అఖిలేష్ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. 2015లో రాజు పాల్ హత్య జరిగింది. అయితే, రాజు పాల్.. అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. ఇక, ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను రాజు పాల్ ఓడించారు. మరోవైపు.. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులుగా ఉండటం గమనార్హం. Akhilesh yadav chup maarke baith gaya 🤣😹 pic.twitter.com/8Lx4SOuRwb — BALA (@erbmjha) February 25, 2023 -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్ను 'ప్రో కార్పొరేట్గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
రాజకీయ ప్రత్యర్థి కూతురితో బీజేపీ నేత ప్రేమాయణం..
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత.. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురుతో లవ్ ట్రాక్ నడిపాడు. అంతేకాకుండా ఆమెకు ఇటీవలే పెళ్లి ఖాయం కావడంతో ఇద్దరూ పారిపోయాడు. దీంతో, ఈ ఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అశిశ్ శుక్లా(47), సమాజ్వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే, శుక్లాకు అప్పటికే వివాహమై.. 21 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. దీంతో, ఆమె లవ్ ట్రాక్ వివాదాస్పందగా మారింది. మరోవైపు.. పారిపోయిన సదరు యువతికి ఇటీవలే మరో వ్యక్తికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె.. శుక్లాతో పారిపోవడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు కూడా వాగ్వాదాలకు దిగారు. దీంతో, వీరి లవ్ ట్రాక్ యూపీలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగరానికి బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం.. శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్టు హర్దోయ్ జిల్లా మీడియా ఇన్చార్జ్ గంగేశ్ పాఠక్ వెల్లడించారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే’.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు
లఖ్నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు. ‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి -
యూపీ పాలిటిక్స్లో ట్విస్ట్.. సీఎం యోగి సీటుకు ఎసరు పెట్టిన అఖిలేష్?
ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీటుకే ఎసరు పెట్టారు. దీంతో, యూపీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి అఖిలేష్ యాదవ్ బంపరాఫర్ ఇచ్చారు. వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి అని కామెంట్స్ చేశారు. దీంతో, యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, అఖిలేష ఆఫర్పై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆఫర్ను నేను తిరస్కరిస్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఎప్పటికీ సీఎం కాలేదు. అఖిలేష్ ముందుగా.. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాజ్వాదీ పార్టీలో గూండాలు ఉన్నందున వారిని మా పార్టీలోకి తీసుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, రాంపూర్ ఉప ఎన్నికలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. "SP chief Akhilesh Yadav, you will not be able to become the chief minister, nor will you be able to make anyone (Chief Minister)," Uttar Pradesh Dy CM Keshav Prasad Maurya said. https://t.co/nYKynmoDPM — The New Indian Express (@NewIndianXpress) December 2, 2022 -
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
ఆజంఖాన్ ఖాన్కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
లక్నో: సమాజ్వాదీ పార్టీ నేత, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా రాంపూర్ సదర్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్! -
సైకిల్ పార్టీ కీలక నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్ప్రదేశ్ రామ్పుర్ కోర్టు ఆజాం ఖాన్కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు! -
తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయిన మరునాడే ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు అఖిలేశ్ యావద్. ఆయన లేని తొలి రోజు సూర్యుడు ఉదయించకుండానే తెల్లవారినట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశారు. आज पहली बार लगा… बिन सूरज के उगा सवेरा. pic.twitter.com/XlboMo8G2V — Akhilesh Yadav (@yadavakhilesh) October 12, 2022 ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యావద్(82) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయ్లో మంగళవారం నిర్వహించారు. భారీ జనసందోహం, అశ్రునయానాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ములాయం అంత్యక్రియలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్కు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలిపారు. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్ -
అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది. అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3 — ANI (@ANI) October 11, 2022 గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మూడుసార్లు సీఎంగా, రక్షణమంత్రిగా పనిచేసిన మూలయంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగాను ఆయన ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు. సొంత కుమారుడు, సీఎం హోదాలో ఉన్న అఖిలేశ్ యాదవ్నే ఓ సారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ములాయం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం. 2012లో మొదలు 2012లో అఖిలేశ్ యాదవ్ ఉత్తర్ప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే అఖిలేశ్ సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీలో కొందరు స్వాగతించగా.. ములాయం, ఆయన సోదరుడు శివ్పాల్ యాదవ్ మాత్రం వ్యతిరేకించారు. తన తమ్ముడు శివ్పాల్ యాదవ్ను సీఎం చేయాలని ములాయం భావించడమే ఇందుకు కారణం. అంతేకాదు ఆ సమయంలో తన బాబాబ్ అయిన శివ్పాల్ను అఖిలేశ్ రెండు సార్లు కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో కుటుంబ కలహాలు మరింత ముదిరాయి. అఖిలేశ్తో ములాయంకు, శివపాల్ యాదవ్కు దూరం పెరిగింది. సంచలన నిర్ణయం సమాజ్వాదీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో 2016లో సంచలన నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్. తన కుమారుడు, సీఎం అఖిలేశ్ యాదవ్, తన బంధువు రామ్ గోపాల్ యాదవ్ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ రెండుగా చీలిపోకుండా కాపాడేందుకు, తన తమ్ముడు శివ్పాల్ యాదవ్కు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఆ మరునాడే సీఎం అఖిలేశ్ యాదవ్ తన బలమేంటో నిరూపించుకున్నారు. వెంటనే తన నేతృత్వంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ భేటికి మొత్తం 229 ఎస్పీ ఎమ్మెల్యేల్లో 200మంది హాజరయ్యారు. అలాగే కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అఖిలేశ్ యాదవ్ సస్పెన్షన్ను నిరసిస్తూ వేలాది మంది సీఎం కార్యాలయం ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు అప్పుడు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్పాల్ యాదవ్తో అఖిలేశ్, రామ్ గోపాల్ యాదవ్ వర్గం బాహాబాహీకి దిగింది. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెనక్కితగ్గి.. అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ములాయం సింగ్ వెంటనే అప్రమత్తయ్యారు. తన కుమారుడు అఖిలేశ్, సోదరుడు రామ్ గోపాల్పై సస్పెన్షన్ను 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివ్పాల్ యాదవ్ ప్రకటించారు. ములాయంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2017 కొత్త ఏడాదికి ముందు ఇదంతా జరిగింది. కానీ పార్టీలో అంతర్గత విభేదాలు అక్కడితో ఆగిపోలేదు. 2017 జనవరి 1న జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అఖేలిశ్ యాదవ్ను సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు రామ్ గోపాల్ యాదవ్. అప్పటికే ఆ పదవిలో ములాయంను పార్టీ సంరక్షుడి పదవికి పరిమితం చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ్పాల్ యాదవ్ను తొలగించారు. మరో షాక్.. ములాయం సింగ్ యాదవ్ మాత్రం వీటికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడైన తాను లేకుండా ఈ సమావేశం నిర్వహించడం అక్రమం అన్నారు. తానే సమాజ్ పార్టీ అధినేత అని, అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అని, శివ్పాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని స్ఫష్టం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాత్రం అఖిలేశ్ యాదవ్నే సమర్థించింది. ఆయన వర్గానికే ఎస్పీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఇదంతా జరిగింది. ఈసీ నిర్ణయం అనంతరం తాను కొత్తగా సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని స్థాపిస్తానని, ములాయం సింగ్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తారని శివ్పాల్ యాదవ్ ప్రకటించారు. కానీ.. కొన్ని నెలల తర్వాత తాను కొత్త పార్టీ స్థాపించడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం. చివరకు శివ్పాల్ యాదవ్ మాత్రం ఎస్పీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018 ఆగస్టులో ప్రగతిషీల్ సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేష్ యాదవ్ కూటమిలోనే చేరారు. ఎస్పీ గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. చదవండి: అర్బన్ నక్సల్స్ గుజరాత్లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త! -
ములాయం హెల్త్ కండీషన్ సీరియస్.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్!
Mulayam Singh.. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ములాయంను గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే, కొద్దిరోజులుగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా, మూలయంకు డాక్టర్ సుశీల కటారియా ఆధ్వర్యంలో వైద్య చికిత్స జరుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక, ములాయం సింగ్ హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. #SamajwadiParty founder Mulayam Singh Yadav shifted to ICU at Gurugram's Medanta hospitalhttps://t.co/dVN0bXMzca — TIMES NOW (@TimesNow) October 2, 2022 -
నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్
Akhilesh Yadav.. బీహార్లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్కు ప్లాన్ చేస్తన్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఇంట తేజస్వీ యాదవ్తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. బీహార్లో రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చ నడుస్తోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. "ఇది మంచి ప్రారంభం. నాడు 'అంగ్రేజో భారత్ చోడో'(ఆంగ్లేయులకు భారత్ నుంచి తరిమి కొట్టండి) నినాదం ఇవ్వబడింది. నేడు బీహార్ నుండి 'బీజేపీ భగావ్'(బీజేపీని వెళ్లగొట్టండి) అనే నినాదం వస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని నేను భావిస్తున్నాను." అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. నితీష్ కుమార్ రాజీనామాపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. ఇది నితీష్ జీ తీసుకున్న నిర్ణయం. మేము(బీజేపీ) ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని అనుసరిస్తాము. కూటమి గౌరవాన్ని కాపాడుతున్నాము" అని అన్నారు. It's a good start. On this day the slogan of 'Angrezo Bharat Chhodo' was given and today the slogan of 'BJP Bhagaon' is coming from Bihar. I think soon political parties and people in different states will stand against BJP: SP chief Akhilesh Yadav on political situation in Bihar pic.twitter.com/UXhlfWAhDx — ANI (@ANI) August 9, 2022 ఇది కూడా చదవండి: హీటెక్కిన బీహార్ పాలిటిక్స్.. తేజస్వీ యాదవ్కు కీలక పదవి! -
ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై స్పందించిన ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. యులాయం సింగ్, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్వీటర్లో.. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం భార్య సాధన మరణించిన చేదు వార్త తెలిసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు’ ట్వీట్ చేశారు. అలాగే సమాజ్వాదీ పార్టీ అధికారిక ట్విటర్లో కూడా పార్టీ వ్యవస్థాపకుడి భార్య మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. చదవండి: ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్కు కరోనా ఎవరీ సాధన 2003లో ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాల్తీ యాదవ్ మరణించే వరకు సాధన గుప్తా గురించి చాలా మందికి తెలియదు. అప్పటికే సాధనా గుప్తాతో సంబంధం కలిగి ఉన్న ములాయం అదే సంవత్సరం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వయసులో అతని కంటే సాధన 20 ఏళ్లు చిన్నది. ఆమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రతీక్ యాదవ్ ఆమె కుమారుడు కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు. -
బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్ యాదవ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అఖిలేష్ యాదవ్ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు ఒవైసీ. UP by-poll results show Samajwadi Party is inacapable of defeating BJP, they don't have intellectual honesty. Minority community shouldn't vote for such incompetent parties. Who is responsible for BJP's win, now, whom will they name as B-team, C-team:AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/OSdkdkDWOT — ANI (@ANI) June 26, 2022 -
మోదీ పవర్ఫుల్ లీడర్ అంటూ ప్రశంసించిన శశిథరూర్.. టెన్షన్లో కాంగ్రెస్..!
జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ శక్తివంతమైనా నాయకుడు అంటూ ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. శశిథరూర్ సోమవారం జైపూర్లో లిచరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై శశిథరూర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ క్రమంలోనే మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రియాశీల నేత అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపరంగా ఆయన చేసిన పనులు అభివర్ణించదగ్గవని అన్నారు. బీజేపీ విజయాన్ని మేము ఊహించలేదన్నారు. అంతలోనే తనదైన స్టైల్లో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ శక్తివంతమైన నాయకుడే కానీ.. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు దేశ ప్రజలను మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని సంచలన ఆరోపణలు గుప్పించారు. అది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించింది కానీ.. రానున్న రోజుల్లో మళ్లీ యూపీ ప్రజలే బీజేపీకి షాకిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిందని కితాబిచ్చారు. అలాగే, యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రియాంక గాంధీ తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు. కానీ, చివరకు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. -
యూపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టెన్షన్లో రాజకీయ పార్టీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్సైట్లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్జేపీ(ఆర్వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్బీ, ఐయూఎంఎల్, ఎల్జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్దళ్కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. -
యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు చుక్కానిగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ నాయకత్వానికి మరింత దన్నుగా ఈ ఫలితాలు నిలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మరింత పెరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు తాజా ఫలితాలను జీర్ణించుకోవడం కష్టమే. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి. బీజేపీకి దీటుగా ఆప్ అయితే బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండటం ఆసక్తికర పరిణామం. పంజాబ్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన ఆప్.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి. భవిష్యత్తులో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి అవుతారని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇంచార్జి రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకుని సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) -
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
ప్రధానికి టెన్షన్.. మోదీ కోటలో అఖిలేష్ పాగా వేస్తారా..?
యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్ సోమవారం జరగనుంది. పూర్వాంచల్లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్లో భాగమే. దాంతో ఆయన మూడు రోజులు వారణాసిలోనే ఉండి శనివారం ప్రచారం ముగించారు. ప్రధాన పోటీదారులైన సమాజ్వాదీ, బీజేపీలు ఎవరికి వారే.. తామిప్పటికే యూపీ అసెంబ్లీ రేసులో గెలిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ, అఖిలేశ్–మమతా బెనర్జీలు, రాహుల్– ప్రియాంక గాంధీల్లాంటి అగ్రనేతలు సీరియస్గా ప్రచారంలో మునిగిపోవడాన్ని బట్టి.. ఎవరికైనా విజయం అంత తేలిక కాదనే సంకేతాలను ఇస్తోంది. యాదవేతర బీసీల ఓట్లలో చీలిక! ప్రతీ ఓటూ ముఖ్యమేనని ముందే లెక్కలేసుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కులా ఆధారిత చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సుహల్దేవ్ రాజ్భర్కు చెందిన ఎస్బీఎస్బీ, మహాన్దళ్, జేపీ (ఎస్) లాంటి చిన్నాచితక పార్టీలతో మాల అల్లిన అఖిలేశ్.. బీజేపీకి అండగా నిలబడ్డ యాదవేతర కులాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపారు. అల్పసంఖ్యాల కులాల్లో 2017లో బీజేపీ 61 శాతం ఓట్లను సాధించింది.అయితే ఈ యాదవేతర ఓబీసీలు బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కాదు. ఈ ఓబీసీల్లో 76 ఉపకులాలున్నాయి. ప్రతి కూలానికి వేర్వేరు అవసరాలు– ఆంకాక్షలు, డిమాండ్లు ఉన్నాయి. అందువల్ల యాదవేతర బీసీలను ఏకం చేయడం కష్టం.అప్నాదళ్ (ఎస్) ఇంటిపోరు, స్వామి ప్రసాద్ మౌర్య నిష్క్రమణలు పూర్వాంచల్లో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తెస్తున్నాయి. పైన చెప్పిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్తగా నిషాద్ పార్టీతో జతకట్టింది. మల్లాల్లో ఈ పార్టీకి మంచి మద్దతుంది. ఏడోదశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్సీలతో పాటు కుర్మీలు, పటేళ్లు, బనియాలు, రాజ్భర్లు, నిషాద్లు, మౌర్యాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ జిల్లాల్లో మైనార్టీ జనాభా 12 శాతముండగా, ఎస్సీ జనాభా 24 శాతం, బ్రాహ్మణ మరియు ఠాకూర్ల జనాభా 20 శాతం మేర ఉంది. జాతీయవాదం + హిందుత్వ.. 2017లో పూర్వాంచల్లో బీజేపీ ప్రదర్శన మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని 50 సీట్లలో బీజేపీ 2017లో 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎస్పీ(11), బీఎస్పీ(6) నిలిచాయి. ఇతరప్రాంతాలతో పోలిస్తే బీఎస్పీ అత్యధిక ఓట్ల శాతం సాధించిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈదఫా ఒక సమ్మిళిత సూత్రాన్ని అవలంబిస్తోంది. జాతీయవాదం (ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు), హిందుత్వ (కాశీ విశ్వనాధ కారిడార్ పనులు), మోడీ, యోగి కాంబినేషన్ విజయాలు.. అనే మూడు అంశాలను సమ్మిళితం చేసి చూపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ఓబీసీకి చెందిన మోదీని చూపి వెనుకబడ్డవర్గాలకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ ఓబీసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలని అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. కులాలవారీ జనగణనను బీజేపీ పక్కనపెట్టిందని, తద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీఎస్పీ మాత్రం గతంలో మాదిరే తమకు ఈ ప్రాంతంలో మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తోంది. కాంగ్రెస్కు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానికి కీలకంగా మారిన ఈ ప్రాంతంపై పట్టు తమకే దక్కుతుందని ఎస్పీ, బీజేపీ ఆశిస్తున్నాయి. -
యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?
ఉత్తరప్రదేశ్లో ఆరు దశల ఓటింగ్ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్లో తగ్గిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్. ‘తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్లో 2017 కంటే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (జేఎన్యూ) హెచ్ఓడీ ఆర్.నరేంద్రకుమార్ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు. 2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్ జర్నల్ అఫ్ పొలిటికల్ సైన్స్ (వారణాసి) డైరెక్టర్ వి.కె.బాజ్పేయి విశ్లేషించారు. 139 సీట్లలో తగ్గింది! తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలోనేమో పోలింగ్ ఈసారి 7 శాతం పెరిగింది. తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్ ఓటింగ్ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్లో పేరు కనిపించకపోవడం, పోలింగ్ బూత్ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్ అధికారి కౌశల్ రాజ్ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. -వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి. -
అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి బిగ్ షాక్
బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. గురువారం ఆయన ఎన్డీ టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్పూర్ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ అన్న విషయం తెలిసిందే. -
UP Elections: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్
లక్నోః యూపీలో బుధవారం నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగానే యూపీ ప్రజలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. బీజేపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, యూపీలోని అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి మాట్లాడుతూ.. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు రూ. 1000 సాయంగా అందజేస్తామన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్లో గో హత్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలను శాశ్వతంగా మూసివేస్తామన్నారు. వాటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలను పాడు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దెబ్బతీయకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా యూపీలోని బహ్రెయిచ్లో మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. రైతులకు నష్టం కలిగేలా పంట పొలాలను గోవులు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. Uttar Pradesh | We have completely stopped illegal slaughterhouses. I promise that we will not let 'Gaumata' be slaughtered while we'll also protect fields of farmers from stray cattle: UP CM Yogi Adityanath at a rally in Amethi#UttarPradeshElection2022 pic.twitter.com/Vr3vEJqXJ1 — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022 -
యూపీ సీఎం వార్నింగ్.. వారి కోసం మార్చి 10 తర్వాత బుల్డోజర్లు వస్తాయి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని రిపేర్ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. #WATCH | I have come here to assure you that I have send the bulldozer for repair. 10 March ke baad jab ye fir se chalna prarambh hoga to jin logo me abhi jyada garmi nikal rahi hai, ye garmi 10 March ke baad apne aap shant ho jayegi: UP CM Yogi Adityanath in Karhal, Mainpuri pic.twitter.com/hvjcQsKbeE — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022 -
యూపీలో సంచలనం.. ఆయన ఫామ్ హౌస్ వద్ద యువతి మృతదేహం..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో గురువారం నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాన్పూర్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బును అధికారులు సీజ్ చేసిన ఘటన మరువక ముందే మరో వార్త దుమారం రేపుతోంది. యూపీ మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం దగ్గరలో గురువారం కుళ్లిపోయిన స్థితిలో మెడ కోసి ఉన్న ఓ యువతి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఉన్నావ్ ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్లో యువతి(22) కనిపించడంలేదంటూ డిసెంబర్ 8వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిసెంబర్ 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఓ వ్యక్తి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ను జనవరి 24న అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు అయితే తాజాగా యువతి మృతదేహాన్ని రాజోల్ సింగ్ ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం యువతి మెడ భాగంగా కట్ చేసి ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలి తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి పాతిపెట్టాడని ఆరోపించారు. వారిపై అనుమానంతోనే తాను ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంత స్థలం తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో తనకు పోలీసులు సహకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తన కుమార్తె బతికుండేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు -
యోగికే నల్లజెండా చూపించాక..
లక్నో: పూజా శుక్లా. ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్నే అడ్డుకొని నల్ల జెండా చూపించిన ధీశాలి. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ లక్నో (నార్త్) నియోజకవర్గం నుంచి ఆమెను ఎన్నికల బరిలోకి దింపింది. 25 ఏళ్ల పూజ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. యోగి ఆదిత్యనాథ్ గద్దెనెక్కిన దగ్గర్నుంచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ పోరాటాలే ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చాయి. 2017లో లక్నో యూనివర్సిటీలో హిందీ దివస్ ఉత్సవానికి యోగి వస్తుండగా పూజా శుక్లా మరికొంతమంది విద్యార్థులతో కలిసి కాన్వాయ్కి అడ్డం పడి నల్లజెండా చూపించి మరీ నిరసనలు చేపట్టారు. లక్నో యూనివర్సిటీలో యోగి పాదం మోపకూడదంటూ అడ్డుకున్నారు. ఫలితంగా 20 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాక పీజీ చదవాలన్నా ఆమె ఆశలకి గండి పడింది. కేసులో బుక్కయినందుకు లక్నో యూనివర్సిటీ ఆమెకు పీజీలో అడ్మిషన్ నిరాకరించింది. పూజతో పాటు నిరసనలో పాల్గొన్న వారికీ ఉన్నతాభ్యాసానికి అవకాశం లేకపోవడంతో అందరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అధ్యాపకులపై దాడులకు దిగారు. అప్పట్లో లక్నో యూనివర్సిటీ ఆందోళనలతో భగ్గుమంది. దీంతో మరోసారి పూజ కటకటాల వెనక్కి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆమె ఏ మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. యోగికి ఎదురొడ్డి నిలవడమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. పౌరసత్వ చట్ట సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని మూడోసారి కూడా జైలు పాలయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ను కలుసుకున్నారు. అప్పట్నుంచి ఎస్పీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చివరికి లక్నో (నార్త్) సీటు దక్కించుకున్నారు. సీటు ఖరారు కాకముందు నుంచే ఆమె లక్నోలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యోగినే ఎదిరించిన పూజా శుక్లా ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేస్తానంటూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రతినబూనారు. బీజేపీ నేత నీరజ్ బోరాను ఆమె ఎదుర్కోవాల్సి ఉంది. యూపీ అభ్యర్థుల్లో అతి తక్కువ వయసు కూడా ఆమెదే. లక్నోలో పోలింగ్ నాలుగో దశలో ఫిబ్రవరి 23న జరగనుంది. -
Ground Report: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి ఏమిటి?
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: గౌతమబుద్ధనగర్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు ఓటు బ్యాంక్లో తేడాలు వస్తే లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఉత్తరప్రదేశ్లో కీలకమైన పశ్చిమ ప్రాంతంపైనే ఈసారి అన్ని పార్టీల గురి... మతకల్లోలాలు, ఉద్రిక్తతలే ఆసరాగా ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెంచుకున్న కమలనాథులు హిందువులతో పాటు ఓబీసీలు, దళితులు కూడా బీజేపీ వైపు మళ్లించుకొని 2017లో అధికారపీఠాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం.. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యూహాలు ఫలించడం లేదనే అభిప్రాయం హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య వాతావరణం... దారి చూపిన రైతు పోరుబాట ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి గణనీయంగా ఓట్ల బదిలీ జరుగుతుందంటున్న విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్లు ఇక్కడ నామమాత్రమే.. ఈ నేపథ్యంలో యూపీకి దిక్సూచిగా నిలిచే పశ్చిమాన ఎవరికి మెజారిటీ వస్తే... వారికే లక్నో పీఠం దక్కేది! ఉత్తరప్రదేశ్లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే జాట్లు, ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గడచిన శాననసభ ఎన్నికల్లో మెజారిటీ జాట్ కులస్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. ముస్లింల ఓట్లను సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పంచుకున్నాయి. మొదటి రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో జాట్లు, ముస్లింలదే నిర్ణయాత్మక పాత్ర. గడచిన ఎన్నికల్లో 50 శాతంకు పైగా జాట్లు బీజేపీకి మద్దతు పలికితే, మిగిలిన 50 శాతం ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఇక ముస్లిం ఓటర్లలో 60 శాతం మంది ఎస్పీకి, 30 శాతం మంది బీఎస్పీకి ఓటేయగా మిగిలిన 10 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు. జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి తారుమారవుతుందని ప్రముఖ సర్వే సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఓట్లేసిన జాట్లలో 25 శాతం మంది ఈసారి ఓటేయకపోతే బీజేపీకి మొత్తం ఐదు శాతం మేర ఓట్లు తగ్గుతాయి. గతంలో బీఎప్పీకి ఓట్లేసిన ముస్లింలలో 15 శాతం మంది ఈసారి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మేరకు ఆ ఓట్లు ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి బదిలీ అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు విశ్లేషణలను పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బీజేపీ సాంప్రదాయ ఓటుకు ఈ ఎన్నికలలో గండి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల మతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులు ఆ పార్టీకి దూరమైన కారణంగా ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ యూపీలో ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువ. 1991 నుంచి గణాంకాలను పరిశీలిస్తే బీజేపీకి సగటున 34, ఎస్పీకి 29, బీఎస్పీకి 21 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 42.6 శాతం ఓట్లతో ఏకంగా 71 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ దీనికి గణనీయంగా దోహదపడింది. ఆగ్రా, అలీఘర్, మీరట్, ముజఫర్నగర్, ఫిరోజాబాద్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాల్లోని 20 లోక్సభ స్థానాలు కమలదళం గెలుచుకుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ప్రాంతంలో 83 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి ఏమిటి? మొదటి రెండు దశల్లోనే పశ్చిమ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఇక్కడ మొత్తం ఉన్నవి 78 సీట్లే. అయితే తొలి రెండు విడతల్లో కలిపితే... 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న బిజ్నౌర్ ప్రాంతంతో కలుపుకుంటే మొత్తం 113 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 91 చోట్ల బీజేపీ, 17 స్థానాల్లో ఎస్పీ విజయం సాధింంచగా, బీఎస్పీ, కాంగ్రెస్లు రెండు స్థానాల చొప్పున, ఆర్ఎల్డీ ఒక చోట గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి 5, బీఎస్పీ నుంచి 10 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే పశ్చిమ యుపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 60 నుంచి 70 శాతం సీట్లు సాధించే అవకాశం ఉన్నదని సీఎస్డీఎస్ సర్వే నిపుణుడు ప్రభాత్ కుమార్ అంచనా వేశారు. (క్లిక్: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం) గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన 50 శాతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. మిగిలిన 50 శాతం మంది జాట్లు అన్ని పార్టీలకు మద్దతిచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగా 25 శాతం మంది జాట్లు బీజేపీకి దూరమైనా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయి. అదే జరిగితే కనీసం 25 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అక్కడ కోల్పోనుంది. అదే సమయంలో ఎస్పీ కూటమికి 29 సీట్లు పెరగనున్నాయి. ఇక, బీఎస్పీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే 21 శాతం ఓట్లలో బీజేపీ, ఎస్పీ కూటమికి ఎంత బదిలీ అవుతుందన్నది కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. బీఎస్పీ ఓటు బ్యాంకు 5–10 శాతం ఎస్పీ కూటమికి బదిలీ అవుతుందనే అంచనా మేరకు ఎస్పీ కూటమి భారీగా లాభపడనుందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఇక, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి కూడా యోగి నేతృత్వంలోని బీజేపీ, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ కూటముల మధ్య పెద్ద అంతరం లేదని, ఈసారి తీవ్ర పోటీ తప్పదని అంచనా వేస్తున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి కీలక ఓబీసీ నేతల రాక కూడా సమాజ్వాదీ శిబిరానికి అదనపు బలం కానుంది. రైతాంగ పోరాటంతో ఏకతాటిపైకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం బీజేపీ రాజకీయ వ్యూహాలను కుదిపేస్తోంది. కుల, మతాలలో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులను ఈ ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ‘హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమం తీసుకు రాగలిగింది’ అని మీరట్ కు చెందిన హిందూ–ముస్లిం సమభావన సమితి కార్యదర్శి మహమ్మద్ అలియా భట్ అన్నారు. దీనికి తోడు పశ్చిమ యూపీలో శాంతియుత వాతావరణం కోసం ఆర్ ఎల్డీ నిర్వహించే ‘భాయ్ చరా’ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత దివంగత అజిత్ సింగ్ ఇలాంటి సమావేశాలు ఎన్నో నిర్వహించారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణానంతరం సమాజ్ వాదీ నాయకురాలు తబస్సుమ్ బేగంను ఆర్ఎల్డీ అభ్యర్థిగా కైరానా లోక్ సభ నుంచి బరిలో దింపి విజయ తీరాన్ని చేర్చింది కూడా ఈ సమావేశాలతోనే. అజిత్ సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు జయంత్ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) హిందూ ఓటు బ్యాంక్ తమదేనన్న ధీమా! కానీ, కమలదళం మాత్రం హిందువుల ఓటు బ్యాంకు తమదేనన్న ధీమాతో ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూనే ఆ చట్టాలు రద్దు చేసినందున వ్యతిరేకత తగ్గిపోయిందని ప్రచారం చేస్తోంది. యుపీలో రైతాంగానికి 50 శాతం విద్యుత్ బిల్లుల తగ్గింపు తమకు మేలు చేస్తుందని, ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని కేంద్ర మంత్రి సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్లో ప్రచారం చేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని నీటి బుడగగా అభివర్ణించారు. అంతే కాదు బీజేపీ ఈసారి కూడా హిందూ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే వ్యూహానికే పదును పెడుతోంది. అందులో భాగంగానే కైరానా నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా ’పలాయన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ముజఫర్ నగర్ ఘర్షణల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిసి పరామర్శించారు. అంతే కాదు యోగి పాలనలో శాంతి భద్రతలు మెరుగు పడినందునే ఈ ప్రాంత ప్రజలు శాంతి యుతంగా జీవించగలుగుతున్నారని కితాబునిచ్చారు కూడా. అయితే, ఈ కితాబులు, కమల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి..? గత రెండు, మూడు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తున్న పశ్చిమ యూపీ గ్రామీణ, సెమీ అర్బన్ ఓటరు ఈసారి ఏం చేస్తాడు? కమల వికాసానికి తోడ్పడుతాడా? ఏనుగు దిగి, హ్యాండిచ్చి మరీ సైకిల్ ఎక్కుతాడా? ముజఫర్నగర్ నుంచి మీరట్ వరకు ఓటరన్న ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాడన్నది ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) క్షేత్రస్థాయిలో పని చేయని బీజేపీ వ్యూహాలు ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. విభజన రాజకీయాలను తాము గ్రహించగలిగామని, మళ్లీ ఆ ఉచ్చులో పడబోమనే నినాదం ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంలో తమ పాచికలు పారడం లేదని గ్రహించిన కేంద్ర మంత్రి, కైరానా ఎంపీ సంజీవ్ బలియాన్ ఇప్పుడు ముస్లిం సానుభూతిపరుడిగా మారిపోయారు. ముజఫర్ నగర్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎస్పీ, ఆర్ఎల్డీలు ముస్లిం అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు స్థానిక ముస్లింలు సహన పరీక్ష ఎదుర్కొనవలసి వస్తోందని ఇమామ్ల సంఘం నేతలంటున్నారంటే పశ్చిమ యూపీలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైతు ఉద్యమకారుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఏర్పాటు చేసిన బీకేయూ కూడా మత సామరస్యం కోసం పని చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చింది. ‘ఈసారి గతంలో మాదిరి తప్పులు చేయం. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలిసివచ్చింది’ అని మహేంద్ర సింగ్ కుమారులు రాకేశ్, నరేశ్ తికాయత్లు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. (క్లిక్: యోగీకి కలిసొచ్చే, సవాల్ విసిరే అంశాలివే!) -
యూపీలో బాలికపై ఐదేళ్ల పాటు అత్యాచారం..
లలిత్పూర్: ఉత్తరప్రదేశ్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్పూర్ జిల్లా సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) దీపక్ అహిర్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్లో తిలక్ యాదవ్, దీపక్ అహిర్వార్తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్వాదీ పార్టీ లలిత్పూర్ జిల్లా పార్టీ యూనిట్ను రద్దు చేసింది. -
ఉగ్రవాద కుట్ర నిజమైతే.. రాజకీయాలు చేయొద్దు: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. -
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కీలక ప్రకటన
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళీ పండగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అమలు చేయబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కూటమిగా ఏర్పాటు కాబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం దీపావళి పండగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖలతో పలు భేటీలు జరిపాము. అన్ని ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది’ అన్నారు. రానున్న ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపారు. చదవండి: (అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి) ఈ విషయాన్ని పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. మరో వైపు జస్వంత్నగర్ విషయంలో ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్వాది పార్టీగా అభ్యర్థిగా జస్వంత్నగర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ నీ స్థాపించారు. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్నాయి. -
అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి
లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నాయకులును ఓడించడానికి కృషి చేస్తామని.. అందుకు అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేస్తామంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన ప్రకటన చేశారు. గతేడాది సార్వత్రి ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వీరు తర్వత బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్ 2 కేసును విత్డ్రా చేసుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా వర్ణించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం’ అంటూ మాయావతి సంచలన ప్రకటన చేశారు. (చదవండి: ప్రియాంకపై మాయావతి ఫైర్) 1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామని, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. (చదవండి: బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్బై! ) ఇక యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మాయావతి ఈ సచంలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్జీ గౌతమ్ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిటర్నింగ్ అధికారిని కలిసిన కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాయావతి పై ప్రకటన చేశారు. -
యూపీ మాజీ మంత్రికి బెయిల్..
లక్నో: యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి ఊరట లభించింది. ఓ మహిళపై రెండేళ్ల పాటు అత్యాచారం చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై మూడేళ్ల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు( 3సంవత్సరాల 5నెలలు) పాటు లక్నో జైలులో శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్ట్ శుక్రవారం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తె సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా చిత్రకూట్కు చెందిన ఒ మహిళ మంత్రి ప్రజాపతితో పాటు ఆరుగురు తనను సాముహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రజాపతి 41నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బెయిల్ కావాలని ప్రజాపతికి చెందిన న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసును విచారించిన న్యాయస్థానం 5లక్షల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ష్యూరిటీ 2.5 లక్షల(వ్యక్తిగత పూచిగత్తు)తో రెండు నెలల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కాగా వేద్ ప్రకాష్ వైష్య నేతృత్వంలోని విచారించిన ధర్మాసనం ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసింది. ప్రజాపతి అనేక వ్యాధుల (మూత్రసంబంధ, మధుమేహం)తో ఇబ్బంది పడుతున్నారని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. కాగా విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది -
యోగి వ్యాఖ్యలపై దుమారం
లక్నో : అయోధ్యలో నిర్మించే మసీదు ప్రారంభానికి ఆహ్వానిస్తే తాను హాజరు కాబోనని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు యోగి ఆదిత్యానాథ్ తాను చేసిన ప్రమాణానికి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించారని ఎస్పీ ప్రతినిధి పవన్ పాండే విమర్శించారు. రాష్ట్రమంతటికీ ఆయన ముఖ్యమంత్రని, హిందువులకు మాత్రమే కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న హిందూ, ముస్లింలందరికీ ఆయనే ముఖ్యమంత్రని..ఆయన అలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని పాండే అన్నారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అనంతరం యోగి ఆదిత్యానాధ్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఓ యోగి, హిందువుగా తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు..ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను..హిందువుగా నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం నా కర్తవ్యం..అందుకు అనుగుణంగా నడుచుకుంటా’నని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు..ప్రతివాదినీ కాదని అంటూ తనను పిలిచినా పిలవకపోయినా తాను హాజరుకానని..అసులు తనకు అలాంటి ఆహ్వానం అందబోదని ఆయన వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై ఎస్పీ మండిపడింది. ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చదవండి : మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా? -
రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ కన్నుమూత
లక్నో : సమాజ్వాదీ పార్టీ మాజీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ (64) మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందుతూ కన్నుమూశారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని నెలల పాటు సింగపూర్లో వైద్య చికిత్స సైతం తీసుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘర్లో జన్మించిన అమర్సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్సింగ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్కు అత్యంత సన్నిహితుడు. -
మాయ, అఖిలేష్ల ఫెయిల్యూర్ స్టోరీ
సాక్షి, న్యూఢిల్లీ : మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఘట్బంధన్ విఫలమై విడిపోవడానికి కూడా అనన్ని కారణాలు ఉన్నాయి. 1. మాయావతి, అఖిలేష్ యాదవ్లు తమను తాము అధిక అంచనా వేసుకున్నారు. తమ పిలుపుమేరకు ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమకే ఓటే వేస్తారని భావించారు. ఆ అంచనాలు తప్పాయి. పైగా కేంద్రంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ అభ్యర్థినవుతానని మాయావతి కలలుకనగా, అఖేలేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చక్రం తిప్పొచ్చని భ్రమపడ్డారు. 2. యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ కార్యకర్తల ఓట్లు మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకీ పడ్డాయి. అందుకే ఆమె పార్టీకి 10 సీట్లు వచ్చాయి. బీఎస్పీ సీట్లు ఎస్సీకి పడలేదు. అందుకే ఐదు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 42.85 శాతం ఓట్లు వచ్చాయి. అవే ఓట్లు ఈసారి వచ్చినట్లయితే ఈ కూటమికి 41 నుంచి 43 సీట్లు రావాలి. ఈసారి ఓట్లు 38.92 శాతం ఓట్లు మాత్రమే రావడంతో కూటమి 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 3. బీఎస్పీ, ఎస్పీ కార్యకర్తలు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించినా క్షేత్రస్థాయిలో వారు నిజంగా కలిసిపోలేదు. అందుకు యాదవులు, దళితుల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైషమ్యాలే కారణం. భూమి కోసం వీరి మధ్య వైరుధ్యాలు కొనసాగడమే కాకుండా సాంస్కతికంగా కూడా వీరు పడదు. 4. దళితులు బీజేపీకే ఓటు వేశారు. ఎస్పీ అభ్యర్థి పోటీ చేసిన చోటల్లా ఎక్కువ మంది దళితులు బీజేపీకి ఓటు వేశారు. 5. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా కూటమి ఓటమికి కారణమయ్యారు. ఆయన బీజేపీ మద్దతుతో ఈ ఎన్నికల్లో ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేశారు. 6. ఫలితాల అనంతరం మాయావతి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫలితాలపై సమీక్ష జరిపారు. ఒంటరిగా వెళ్లి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నాయకులు సూచించారు. అందుకు ముందు ప్రయోగాత్మకంగా రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి చూడాలని నిర్ణయానికి వచ్చారు. ఘట్బంధన్తో తాత్కాలికంగా తెగతెంపులు చేసుకుంటున్నామని ఆమె మీడియా ముఖంగా ప్రకటించారు. -
యూపీలో పార్టీల బలాబలాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లే కాకుండా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది కూడా ముఖ్యమైనదే. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లుండగా, బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్కు రెండు సీట్లను వదిలేసి మొత్తం 78 సీట్లకు పోటీ చేసింది. అలాగే ఎస్పీ, బీఎస్పీ కూటమి రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు వదిలేసి 78 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన 78 సీట్లకుగాను బీజేపీ 62 సీట్లను గెలుచుకోగా, దాని మిత్ర పక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీకి 71 సీట్లు, అప్పాదళ్కు రెండు సీట్లు వచ్చాయి. ఈసారి అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ను కలుపుకొని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు మహా కూటమిగా పోటీ చేసినా పెద్దగా లాభం ఏమీ లేకపోయింది. ముజఫర్నగర్ నుంచి పోటీ చేసిన అజిత్ సింగ్ ఓడిపోగా, మిగతా సీట్లలో బీఎస్పీకి పది సీట్లు, ఎస్పీకి ఐదు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క సోనియా గాంధీయే రాయ్బరేలి నుంచి విజయం సాధించారు. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథి నియోజకవర్గంలో ఆయనపై కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యూపీలో బీజేపీకి మొత్త 49.6 శాతం ఓట్లు రాగా, బీఎస్పీకీ 19.3 శాతం ఓట్లు, ఎస్పీకి 18 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 6.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ కూడా కూటమితో చేతులు కలిపి ఉన్నట్లయితే కాంగ్రెస్కు రెండు సీట్లు, కూటమికి మరో రెండు సీట్లు వచ్చేవి. హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీకి అనూహ్య విజయం సిద్ధించింది. యూపీతోపాటు బీహార్, చత్తీస్గÉŠ , మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మొత్తం 273 సీట్లు ఉండగా బీజీపీ, దాని మిత్రపక్షాలకు 243 సీట్లు వచ్చాయి. -
వారణాసిలో సమాజ్వాదీ పార్టీకి చుక్కెదురు
-
ఆ అభ్యర్థికి 204 కోట్ల ఆస్తి
సాక్షి, న్యూఢిల్లీ : మూడవ విడత లోక్సభ ఎన్నికల్లో మొత్తం 1,612 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 21 శాతం అంటే, 340 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 230 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వారిలో తమకు శిక్ష పడిన కారణంగా ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకుండా దూరంగా ఉన్నామని 14 మంది తెలిపారు. మొత్తం అభ్యర్థుల్లో అందుబాటులోకి వచ్చిన 1,594 మంది అఫిడవిట్లను ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ అధ్యయనం చేయగా కోటి, అంతకన్నా ఎక్కువ ఆస్తులు కలిగిన వారు 392 మంది ఉన్నారు. సమాజ్ వాది పార్టీ నుంచి 90 శాతం మంది, బీజేపీ నుంచి 84 శాతం, కాంగ్రెస్ పార్టీ నుంచి 82 శాతం కోటీశ్వరులు ఉన్నారు. వారిలో డిగ్రీ, అంతకన్నా ఎక్కువ చదివిన వారు 43 శాతం ఉండగా, ఏదో అక్షరాస్యులమని చెప్పుకున్నవారు 3.6 శాతం, నిరక్షరాస్యులమని చెప్పుకున్న వారు 1.4 శాతం మంది ఉన్నారు. ముడవ విడత ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో కోటీ రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని ప్రకటించిన ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి 81మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 74 మంది, ఎస్పీ నుంచి పది, సీపీఎం నుంచి పది, ఎన్సీపీ నుంచి పది, బీఎస్పీ నుంచి తొమ్మిది, శివసేన నుంచి ఏడుగురు ఉన్నారు. కోటీశ్వరుల్లో గుజరాత్ నుంచి 75 మంది, మహారాష్ట్ర నుంచి 71 మంది, కర్ణాటక నుంచి కోటి మంది ఉన్నారు. ఎస్పీ నుంచి అత్యధిక ధనికుడు పోటీ చేస్తున్న కోటీశ్వరుల్లో 150 కోట్ల నుంచి రెండువందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నావారు ముగ్గురు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఇటా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సమాజ్వాది పార్టీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ యాదవ్కు 204 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతార నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా ఎన్సీపీ అభ్యర్థి ఉదయన్ రాజే భోసాలేకు 199 కోట్లు, ఉత్తరప్రదేశ్లోని బైరెల్లి నుంచి పోటీ చేస్తున్న ప్రవీణ్ సింగ్ అరాన్కు 150 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యువత కూడా ఎక్కువగానే ఉంది. మొత్తం అభ్యర్థుల్లో 25 నుంచి 40 ఏళ్య మధ్యనున్న యువత 35 శాతం అంటే 562 మంది ఉన్నారు. అలాగే మహిళా అభ్యర్థులు 9 శాతం అంటే, 143 మంది ఉన్నారు. -
ఆజంఖాన్కు గట్టి షాక్ ఇచ్చిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై వేటు వేసింది. 72గంటలు (మూడు రోజులు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఈసీ నిషేధం విధించింది. అదేవిధంగా ముస్లింల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మేనకా గాంధీపైన ఈసీ చర్యలు తీసుకొంది. 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా ఆమెపై నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా మూడు రోజులు (72 గంటల పాటు), రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది -
ముస్లింలకు మాయావతి ఓపెన్ అప్పీల్!
సాక్షి, దియోబంద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఉత్తరప్రదేశ్లోని ముస్లింలకు బహిరంగంగా అప్పీల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. ముస్లిం ఓట్ల చీలికకు కారణం కావొద్దని, బీజేపీని ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమి మాత్రమే ఓడించగలదని, కాబట్టి మహాకూటమికే ముస్లింలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దియోబంద్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఉమ్మడిగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి ఈ మేరకు ముస్లింలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో మాయావతితోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆరెల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ‘ముస్లింలకు నేను బహిరంగంగా పిలుపునిస్తున్నాను. బీజేపీని కాంగ్రెస్ కాదు మహాకూటమి మాత్రమే ఓడించగలదు. మహాకూటమి గెలువకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహకరించేందుకు ప్రయత్నిస్తోంది’ అని మాయావతి మండిపడ్డారు. సహరాన్పూర్లో కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘మొదట సహరాన్పూర్లో మేం ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. మా కూటమికే వచ్చే ఓట్లను తగ్గించడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోంది’ అని ఆమె మండిపడ్డారు. -
యూపీలో గఠ్బంధన్ హవా
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నాయకత్వంలోని గఠ్బంధన్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బిహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని ఏబీపీ–నీల్సన్ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో సమాజ్వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్లతో కూడిన గఠ్బంధన్ (కూటమి) 42 స్థానాలు గెలుచుకోవచ్చనీ, బీజేపీ, అప్నాదళ్ కూటమికి 36 సీట్లు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్కు ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 5, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. బిహార్లో మొత్తం 40 సీట్లలో ఎన్డీయేకు 34, గఠ్ బంధన్కు 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. యూపీలో సీట్లు తగ్గినా బీజేపీ కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, గఠ్బంధన్ కంటే ఎక్కువగా (43శాతం) ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 7.8(2014) నుంచి 9 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. మార్చి16–24వ తేదీల మధ్య 20వేల మందికిపైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని సర్వేలో మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు మోదీ తీరు ఏవరేజ్గా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుకు ఓటర్లు 3.73 మార్కులు ఇచ్చారు. అవినీతి, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశాలని మెజారిటీ ఓటర్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే వారికే ఓటేస్తామని అత్యధికులు స్పష్టం చేశారు. మత సామరస్యం, ధరల నియంత్రణ, వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని సర్వే నివేదిక పేర్కొంది. బిహార్లో 34 సీట్లు.. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీయే 52 శాతం ఓట్లతో 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని నీల్సన్ సర్వే పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయలోక్ సమతా పార్టీ, సీపీఐ (ఎంఎల్)తో కూడిన గఠ్బంధన్కు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మార్చి 17–26 మధ్య పది వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు నీల్సన్ సంస్థ పేర్కొంది. ఇక్కడ కూడా మోదీ పనితీరు బాగుందని, నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే పనితీరుకు 3.92 మార్కులు ఇచ్చారు. ఇక్కడ కూడా అవినీతి, నిరుద్యోగం ప్రజల ప్రధాన సమస్యలని సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీని వదిలి కాంగ్రెస్లో చేరడం మంచిదేనని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, తప్పు నిర్ణయమని 39 శాతం వ్యాఖ్యానించారు. -
సమాజమా? కుటుంబమా?
యూపీలో సమాజ్వాదీ పార్టీ ప్రస్థానం, ఉత్తర్ప్రదేశ్లోని రెండు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పక్షాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒకటి. జేడీయూ, ఆర్జేడీ, జేడీఎస్, ఎల్జేపీ మాదిరిగానే ఎస్పీని కూడా జనతా పరివార్ పార్టీగానే పరిగణిస్తారు. ప్రసిద్ధ సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా స్థాపించిన సోషలిస్ట్ పార్టీ (ఎస్పీ), ఏఏస్పీ మూలాలు, సిద్ధాంతాల వారసత్వం తమదని ఈ పార్టీ ప్రకటించింది. 1992 అక్టోబర్లో స్థాపించినప్పటి నుంచీ ములాయంసింగ్ యాదవ్, ఆ తర్వాత 2017 జనవరి ఒకటి నుంచీ ఆయన కొడుకు అఖిలేశ్ యాదవ్ ఎస్పీ అధ్యక్షులుగా ఉన్న కారణంగా ఇది ములాయం కుటుంబ పార్టీగా ముద్రపడింది. అనేక రాష్ట్రాల్లో శాఖలు, రెండు మూడు రాష్ట్రా ల్లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలున్నా ప్రధానంగా యూపీకి చెందిన పార్టీగానే ఎస్పీకి గుర్తింపు వచ్చింది. పార్టీ స్థాపక అధ్యక్షుడు ములాయం 1989 డిసెంబర్లో మొదటిసారి జనతాదళ్ తరఫున యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర తర్వాత పదవి నుంచి వైదొలగే నాటికి మాజీ ప్రధాని చంద్రశేఖర్ నేతృత్వంలోని సమాజ్వాదీ జనతా పార్టీ (ఎస్జేపీ)లో ములాయం ఉన్నారు. తర్వాత జనతా పరివార్ పార్టీలకు చెందిన పూర్వపు సోషలిస్టులు, ఇతర నేతలతో కలిసి ములాయం సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. లోహియాతో ప్రత్యక్ష పరిచయం ఉన్న ములాయం 1967 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్పై తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత చరణ్సింగ్ నేతృత్వంలోని బీఎల్డీ, అనంతరం జనతాపార్టీ, లోక్దళ్, జనతాదళ్లో కొనసాగారు. 1977 యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వా త జనతా పార్టీ తరఫున సీఎం పదవికి ములాయం పేరు కూడా పరిశీలించారని చెబుతారు. బీఎస్పీ పొత్తుతో దశ మారింది 1993 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాన్షీరామ్ నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ఎస్పీకి కీలక మలుపు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ కూటమి గట్టి ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా (177 సీట్లు) అవతరించినా మెజారిటీ దక్కలేదు. ములాయం నేతృత్వంలో ఏర్పడిన ఎస్పీ (109), బీఎస్పీ (67) సంకీర్ణ సర్కారుకు జనతాదళ్, కాంగ్రెస్ తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలు మద్దతు ఇచ్చాయి. రెండు భాగస్వామ్యపక్షాల మధ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో విభేదాలు రావడంతో ములాయం ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు బీఎస్పీ ప్రకటించడంతో చివరికి ములాయం 1995 జూన్లో రాజీనామా చేశారు. దీనికి ముందు లక్నో గెస్ట్హౌస్లో ఉన్న మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడిచేయడంతో రెండు పార్టీల మధ్య బద్ధవైరం ఏర్పడింది. ఇది కిందటేడాది యూపీలో జరిగిన మూడు లోక్సభ ఉప ఎన్నికల్లో చేతులు కలిపే వరకూ కొనసాగింది. యునైటెడ్ ఫ్రంట్ సర్కారులో ఎస్పీ 1996 లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు సాధించిన ఎస్పీ జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేరింది. ములాయం ఈ రెండు ప్రభుత్వాల్లో రక్షణమంత్రిగా పనిచేశారు. బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏఐఏడీఎంకే వైదొలిగాక 1999 ఏప్రిల్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఒక ఓటు తేడాతో వీగిపోయింది. వాజ్పేయి రాజీనామా తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతిస్తానని మొదట సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్సింగ్ సుర్జీత్కు హామీ ఇచ్చిన ములాయం తర్వాత మాట మార్చారు. అప్పుడు ఎస్పీకి లోక్సభలో 20 మంది సభ్యులున్నారు. ఈలోగా సోనియా రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ను కలిసి తనకు 273 మంది లోక్సభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించారు. దీంతో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని సోనియా ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య వైరం కొనసాగింది. యూపీలో బీజేపీ బలమైన పార్టీ కావడం, కాంగ్రెస్ను ఇక్కడ బలపడేలా చేస్తే తన ఉనికికే ప్రమాదమనే భావనతో ఎస్పీ ఇప్పటికీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో 1999 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన ఎస్పీ 26 సీట్లు సాధించింది. యూపీఏలోకి నో ఎంట్రీ వాజ్పేయి పాలన కాలంలో బీజేపీతో ఎస్పీ లోపాయికారీ సంబంధాలు కొనసాగించింది. 2003 ఆగస్టులో మాయావతి సర్కారు కూలిపోయాక బీఎస్పీని చీల్చిన ములాయం ముఖ్యమంత్రి కావడానికి కేంద్ర సర్కారు పరోక్షంగా సాయపడింది. ఇలా ఫిరాయింపుదారులతో ములాయం దాదాపు మూడేళ్లు సీఎంగా కొనసాగారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ 36 సీట్లు సాధించినా పాత వైరం వల్ల, అప్పటికే మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టడం వల్ల మ న్మోహన్సింగ్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ సర్కారులో ఎస్పీకి ప్రవేశం లభించలేదు. అయితే, బయటి నుంచి మద్దతు ఇస్తున్న వామపక్షాలు 2008 జూలైలో యూపీఏతో తెగతెంపులు చేసుకున్నాయి. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి ఎస్పీ మద్దతు ఇవ్వడం ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. కాంగ్రెస్తో ఈ స్నేహం 2009 లోక్సభ ఎన్నికల వరకూ కొనసాగలేదు. ఈ ఎన్నికల్లో ఎస్పీ 23 సీట్లు గెలుచుకుంది. ఈసారీ యూపీఏలో చేరే అవకాశం ఎస్పీకి దక్కలేదు. యూపీఏ–2 హయాంలో 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విపరీతంగా ప్రచారం చేశారు. కాం గ్రెస్, ఎస్పీ మధ్య మాటల యుద్ధం సాగింది. చివరికి ఎస్పీ మొదటిసారి సొంతంగా పూర్తి మెజారిటీ సాధించింది. ములాయం కొడుకు అఖిలేశ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యా రు. అనంతరం 2014 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీకి ఐదు సీట్లే వచ్చాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీలో కుటుంబ తగాదా ముదిరింది. అఖిలేశ్ మంత్రివర్గంలో పీడబ్ల్యూడీ మంత్రి, ఆయన చిన్నాన్న శివపాల్సింగ్ యాదవ్ తన అన్న ములాయం పక్షాననిలబడ్డారు. పార్లమెంటులో ఎస్పీ నేత, సమీప బంధువు రాంగోపాల్ యాదవ్ అఖిలేశ్తో జత కలిశారు. పరస్పర బహిష్కరణల తర్వాత యాదవ్ పరివారంలో ముసలం ముగిసింది. రాజీ కుదిరింది. జనవరి ఒకటిన అఖిలేశ్ ఎస్పీ జాతీయ అధ్యక్షుడయ్యారు. అయితే, 2017 మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా ఎస్పీ బలం ఎన్న డూ లేనంతగా 54 సీట్లకు తగ్గిపోయింది. బీజేపీ దూకుడును తట్టుకుని యూపీలో తన ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీ.. బీఎస్పీతో చేతులు కలిపింది. కిందటేడాది ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. కాంగ్రెస్తో పొత్తు వల్ల ప్రయోజనం లేదని గ్రహించి బీఎస్పీతో వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఈ రెండు పార్టీల పొత్తు ఎంత కాలం సాగేదీ వచ్చే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి. లోక్సభలో ఎస్పీ గ్రాఫ్ -
లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ
లక్నో : లోక్సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై వేగం పెంచింది. తొలివిడతగా శుక్రవారం ఎస్పీ ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో యూపీ మాజీ సీఎం, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, మేనల్లుడు ధర్మేంద్ర యాదవ్, రామ్గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ పేర్లు ఉన్నాయి. మెయిన్పూరి నుంచి ములాయం సింగ్ యాదవ్, బదౌన్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, ఎతవా నుంచి కమలేశ్ కతిరియా, బహ్రెచ్ నుంచి షబ్బీర్ వాల్మికీ, రాబర్ట్స్గంజ్ నుంచి భాయ్ లాల్ బరిలో దిగనున్నారు. ఎస్పీ రెండో జాబితా కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా అఖిలేష్ బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ ఎస్పీ నాయకత్వనికి వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. కానీ ఇవాళ ఎస్పీ ప్రకటించిన జాబితాలో ఆయన కుమారుడు అక్షయ్ పేరు కూడా ఉండటం గమనార్హం. -
ములాయంకు మతి చలించిందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘అందరిని కలుపుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన ప్రధానమంత్రికి నా అభినందనలు. సభలోని సభ్యులందరూ విజయం సాధించి మళ్లీ సభకు వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు (మోదీ) మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాను’ అని సమాజ్వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ బుధవారం 16వ లోక్సభ ఆఖరి సెషన్లో వ్యాఖ్యానించడం ఇంటా బయట సంచలనం సష్టించింది. లక్నో విమానాశ్రయంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఆందోళన నిర్వహిస్తున్న సమాజ్వాది పార్టీ కార్యకర్తలను ములాయం వ్యాఖ్యలు ఇబ్బందికి గురిచేశాయి. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నాలను ముమ్మరం చేసిన వివిధ పార్టీల నాయకులకు కూడా ములాయం వ్యాఖ్యలు చికాకును కలిగించాయి. ములాయం ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సమాజ్వాది పార్టీ నాయకులు అంటున్నారు. ‘ములాయం సింగ్ యాదవ్ తన చుట్టూ ఉన్న ప్రజలనే కాదు. కుటుంబ సభ్యులను కూడా గుర్తించని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన జ్ఞాపక శక్తి పూర్తిగా మందగించింది. ఆయన మాటల మధ్య పొందిక ఉండడం లేదు. మోదీ గురించి ఆయన అలా మాట్లాడడానికి అదే కారణమై ఉంటుంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘గత ఏడాది లక్నోలో ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్కు చెందిన ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయన ఇలాగే పొరపాటు వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అనుకొని శివపాల్ యాదవ్ పార్టీకి మద్దతివ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇది సమాజ్వాది పార్టీ సమావేశం కాదంటూ ప్రేక్షకుల నుంచి అనేక మంది అరిచారు. దాంతో సర్దుకున్న ములాయం సింగ్ యాదవ్ ఆ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించినందుకు తన సోదరుడిని అభినందిస్తున్నాను అని చెప్పారు’ అని ఎస్పీ సీనియర్ నాయకుడు వివరించారు. బుధవారం నాడు పార్లమెంట్ భవనం నుంచి బయటకు వస్తున్న ములాయం సింగ్ యాదవ్ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కలుసుకొని ‘మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎందుకు కోరుకున్నారు ?’ అని ప్రశ్నించగా, ‘నేను అలాంటిదేమీ అనలేదే! మీరే ఏదో ఊహించుకుంటున్నారు!’ అని ములాయం వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
శివ్పాల్ యాదవ్కు జడ్ క్యాటగిరి భద్రతా
లక్నో : సమాజ్వాది సెక్యులర్ మోర్చా స్థాపకుడు శివ్పాల్ యాదవ్కు జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శివ్పాల్ యాదవ్కు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిన నేపథ్యంలో యోగి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఖాళీ చేసిన బంగ్లాతో పాటు.. హై లెవల్ భద్రత కల్పించారు. ఇప్పటివరకూ యూపీలో ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి ప్రతిపక్ష నేతలకు మాత్రమే జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతా కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి శివ్పాల్ యాదవ్ చేరారు. ప్రతిపక్ష నేతకు అధికార బంగ్లాతో పాటు, జడ్ ప్లస్ కేటగిరి భద్రతాను కల్పించడంతో ప్రతిపక్షాలు సీఎం యోగిపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో శివ్పాల్ని బీజేపీలో చేర్చుకోవడం కోసమే యోగి ప్రభుత్వం ఇలాంటి గిమిక్కులు ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నాయి. ఈ విషయం గురించి శివ్పాల్ ‘నేను ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మాజీ మంత్రిని కూడా. ఇంటిలిజెన్స్ బ్యూరో నాకు ముప్పు ఉందని ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ప్రభుత్వం నాకు ఈ బంగళాను కేటాయించింది’ అని తెలిపారు. ప్రస్తుతం శివ్పాల్కు లాల్ బహదూర్ శాస్త్రీ మార్గ్లో ఉన్న బంగాళను కేటాయించారు. గతంలో ఈ బంగళాను మాయావతికి కేటాయించారు. -
ఒకే వేదికపై ములాయం, అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చాన్నాళ్ల తరువాత ఒకే వేదికను పంచుకున్నారు. పార్టీలో చీలిక వచ్చిన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ సైకిలు ర్యాలీ ముగింపు కార్యక్రమంలో అఖిలేశ్తో కలసి ములాయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో పాటు, ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా పనిచేయాలని ఎస్పీ కార్యకర్తలకు సూచించారు. -
సమాజ్వాది చీలిక వెనక అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహా కూటమి ఆవిర్భవించక ముందే సమాజ్వాది పార్టీలో చీలిక రావడం విచారకర పరిణామమే. పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, తన అన్న కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ‘సమాజ్వాది సెక్యులర్ ఫ్రంట్’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. చీలికవైపు శివపాల్ యాదవ్ను ప్రోత్సహించిందీ తెరముందు నుంచి అమర్ సింగ్ అయితే, తెరవెనక నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అని నిస్సందేహంగా చెప్పవచ్చు! ఎందుకంటే శివపాల్ యాదవ్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 24 గంటల ముందే అమర్ సింగ్ లక్నోలో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతో బీజీపీ పార్టీలో శివపాల్ యాదవ్కు సముచిత స్థానం కల్పించడం కోసం ఆ పార్టీ అధినాయకులతో మాట్లాడానని, అయితే చివరి నిమిషంలో శివపాల్ తన మనసు మార్చుకున్నారని చెప్పారు. శివపాల్ యాదవ్కు, అమర్ సింగ్కు మధ్యన మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. శివపాల్ కారణంగానే అమర్ సింగ్ రెండోసారి సమాజ్వాది పార్టీలోకి వచ్చారు. శివపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి బదులు సమాజ్వాది పార్టీని ఏర్పాటు చేశారంటే ఇందులో ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. శివపాల్ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్ పార్టీని దెబ్బతీయవచ్చని, తద్వారా ఎస్పీ–బీఎస్పీ కూటమి విజయావకాశాలను అడ్డుకోవచ్చని అమిత్ షా ఆలోచించి ఉంటారు. యూపీలోని రెండు లోక్సభ, ఒక అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్పూర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయోత్సాహంతో 2019లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఐక్యంగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నిర్ణయించుకోవడంతోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఈలోగా శివపాల్ యాదవ్ రూపంలో పార్టీలో చీలిక రానుంది. పార్టీలో ఎంతో కాలం సీనియర్ నాయకుడిగా చెలామణి అయిన శివపాల్ యాదవ్కు పార్టీలో పలుకుబడి బాగానే ఉంది. అందుకనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్కే అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మద్దతు ఇచ్చారు. పార్టీలో భిన్న శిబిరాలు ఏర్పడిన కారణంగా నాటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని గ్రహించిన పార్టీలోని శిబిరాలు ఎన్నికల అనంతరం కనీసం బయటకు ఐక్యంగానే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శివపాల్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘గత ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్లో మార్పు వస్తుందని ఎదురు చూశాను. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. నాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు అలాగే ఫీలవుతున్నారు. నేను ఇక లాభం లేదనుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. మిగతా వారు కూడా వస్తారు’ అని శివపాల్ యాదవ్ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్ యాదవ్ దీవెనలు ఉన్నాయని అయన చెప్పారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్ షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్ యాదవ్కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు. -
‘ఆ వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిది’
రాంపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆవులకు దూరంగా ఉండాల్సిందేనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన మూక హత్యను ఉటంకిస్తూ.. ఎప్పుడైతే గోవధను పూర్తి స్థాయిలో నిషేధిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండదంటూ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్.. భవిష్యత్ తరాల బాగుకోసమైనా మనం(ముస్లింలు) ఆవులు, పాల వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ‘గోమాతగా పిలుచుకునే ఆవులను తాకితే చాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవులతో వ్యాపారం చేసిన వాళ్లని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది కదా. భవిష్యత్ తరాలకు ఈ విషయం గురించి సవివరంగా చెప్పాల్సి ఉంటుందంటూ’ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. కాగా ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్లో అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాంల పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. -
2019లో అఖిలేశ్, ములాయం పోటీచేసే స్థానాలు
లక్నో : వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలపై సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ స్పష్టతనిచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం తన భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్న కనౌజ్ లోక్సభ స్థానం నుంచి తను పోటీ చేయనున్నట్టు తెలిపారు. అలాగే నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) మణిపురి నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఇదివరకే తన భార్య స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పిన అఖిలేశ్ దానిపై మరింత స్పష్టతనిచ్చారు. ప్రతిపక్ష నాయకులు సమాజ్వాది పార్టీని కుటుంబ పార్టీగా ఆరోపిస్తున్నారని.. అందుకనే తన భార్య 2019 ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అలాగే పొత్తులు, సీట్ల పంపకాలపై మాట్లాడుతూ.. మిత్ర పక్ష అభ్యర్థులు బరిలో నిలిచిన చోట కార్యకర్తలందరు వారి విజయానికి, బీజేపీ ఓటమికి కృషి చేయాలని కోరారు. ఈ సారి బీజేపీకి ప్రజల మద్దతు ఉండదన్నారు. బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతుందని.. క్షేత్ర స్థాయిలో అంత శూన్యమని అఖిలేశ్ విమర్శించారు. -
స్క్రిప్ట్ను పక్కాగా అమలు చేశారు : మాజీ సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన బంగ్లాలోని విలువైన వస్తువులు మాయమయ్యాయని ప్రభుత్వ అధికారులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఆయన స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తన పరువు తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మీడియాను తీసుకురావడానికి ముందే ముఖ్యమంత్రి ప్రత్యేక పరిరక్షణ విధుల అధికారి అభిషేక్ ఫోన్తో సహా తన బంగ్లాకు వెళ్లారన్నారు. మీడియా వచ్చిన తర్వాత ఇంటిలోని వస్తువులు మాయమయ్యాయంటూ ఫొటోలు తీయించడం ఆయన స్క్రిప్ట్లో భాగమేనన్నారు. మీడియా కూడా ఈ కుట్రలో ప్రభుత్వానికి సహకరించిందని ఆరోపించారు. తన సొంత డబ్బుతో కొన్న, తనకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఇంటి నుంచి తీసుకెళ్లానని అఖిలేశ్ తెలిపారు. కాగా అఖిలేశ్ యాదవ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ రామ్ నాయక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన అఖిలేశ్.. రామ్నాయక్ స్వతహాగా మంచి వ్యక్తి అని.. కాకపోతే అప్పుడప్పుడూ ఆరెస్సెస్ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఆయన వైఖరిని మారుస్తుందని వ్యాఖ్యానించారు. -
2019లోనే అసెంబ్లీ ఎన్నికలు పెడ్తారా?
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనల్లో ఒకటైన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు తాము సిద్ధంగానే ఉన్నామని ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్లో కూడా శాసనసభ, లోక్సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మీరు సిద్ధమేనా అని బీజేపీకి ఆయన సవాలు విసిరారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆధార్ నంబరుతో ఓటర్లను అనుసంధానించడంలోగానీ, ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనపై గానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2019లో ఒకేసారి ఎన్నికల్లో భాగంగా యూపీ శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించమని బీజేపీని అడుగుతున్నాను’’అని అన్నారు. -
సీట్ల పంపకమే అసలు పేచీ
లక్నో: 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువుగా కనిపించడం లేదు. శనివారం పార్టీ కార్యకర్తల భేటీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలతో ఆ విషయం స్పష్టమైంది. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే కూటమిలో చేరతామని, లేదంటే ఒంటరిగానే పోటీకి వెళ్లడం ఉత్తమమని మనసులో మాటను ఆమె బయటపెట్టారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పక్షంలో సీట్ల పంపకంపై ఎస్పీ, కాంగ్రెస్లపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే మాయావతి ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలుండగా.. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు(అప్నాదళ్ 2 సీట్లతో కలిపి), సమాజ్వాదీ 5, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఒక్కచోటా విజయం సాధించలేదు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్లు కూటమిగా పోటీ చేశాయి. పొత్తు పెట్టుకున్నా.. ఆ రెండు పార్టీలు దాదాపు 12కు పైగా స్థానాల్లో ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. సీట్ల ఒప్పందం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు. ఆ ఒప్పందం ప్రకారం సమాజ్వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా.. పలు చోట్ల రెండు పార్టీలు పోటీపడడంతో నష్టపోయాయి. ‘కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు పార్టీల మధ్య సీట్ల పంపకం అత్యంత కీలకం. తమకే ఎక్కువ సీట్లు కావాలని ప్రతీ పార్టీ ఆశిస్తుంది. అలాంటి సమయంలో సీట్ల పంపకంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాజకీయ విశ్లేషకుడు జేపీ శుక్లా పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి కూటమి తప్పనిసరి: ఎస్పీ యూపీ సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ లోక్సభ నియోజకవర్గాలైన గోరఖ్పూర్, పూల్పూర్లో ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి బీఎస్పీ మద్దతిచ్చింది. ఆ రెండు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అఖిలేశ్ స్వయంగా మాయావతి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి సమాజ్వాదీ మద్దతిచ్చింది. ‘బీజేపీని ఓడించాలంటే కూటమి ఏర్పాటు తప్పనిసరి. సమ ప్రాధాన్యం దక్కేలా సీట్ల పంపకాన్ని మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది’ అని ఎస్పీ నేత రాజ్పాల్ కశ్యప్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజీపడినా.. మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు.. సీట్ల పంపకంపై రాజీ ధోరణిలో వెళ్తాయా? లేదా? అన్నది తెలియాలంటే కొద్ది కాలం వేచిచూడాల్సిందే. -
అత్యంత సంపన్న పార్టీ ఏదంటే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అత్యంత సంపన్న పార్టీగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎస్పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది. వీటిలో 14 పార్టీలు తమ ఆదాయం తగ్గిపోయిందని ప్రకటించగా 13 పార్టీలు రాబడి పెరిగిందని పేర్కొన్నాయి. ఐదు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు తమ ఆదాయ పన్ను రిటన్స్ను సమర్పించలేదు. ఇండియన్ నేషనల్ లోక్దళ్, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, కేరళ కాంగ్రెస్-మణి పార్టీలు ఆదాయ పన్ను రిటన్స్ను దాఖలు చేయలేదు. ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం, జేడీఎస్లు పేర్కొనగా, తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు డీఎంకే వెల్లడించింది. ఎస్పీ, ఏఐఏడీఎంకేలు వరుసగా రూ 64 కోట్లు, రూ 37 కోట్లు వెచ్చించాయి. -
ఎస్పీ విందుకు ములాయం హాజరయ్యేనా?
లక్నో : రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమాజ్వాదీ పార్టీ ఏర్పాటు చేసిన విందు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు ఎస్పీ నేతలు ఈ విందు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఒకవైపు నిలవడంతో విజయాన్ని సాధించాయి. అందుకే పార్టీలోని విభేదాలను పక్కన బెట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ విందులో ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్తో పాటు 200 మంది నాయకులు పాల్గొంటరాని పార్టీ నేతలు ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, ములాయం వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విందు ద్వారా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందని సమాజ్వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విందుకు ములాయం, శివపాల్ హాజరయ్యేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ ఎన్నికలపై చర్చించడానికి అఖిలేశ్ కాల్ చేసి ఆహ్వానించినా శివపాల్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. శివపాల్ ప్రస్తుతం తన సొంత గ్రామానికి వెళ్లడంతో ఆయన సాయంత్రం విందుకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం విందుకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు సీఎం యోగి అదిత్యనాథ్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో అనుసారించాల్సిన వ్యుహంపై బీజేపీ మిత్ర పక్షాలతో చర్చలు జరుపనున్నారు. -
24గంటల్లో చక్రం తిప్పిన అమిత్ షా!
సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో బీజేపీపై పై చేయి సాధించామన్న సంతోషం పూర్తిగా అనుభవించకముందే సమాజ్వాది పార్టీకి, బహుజన్ సమాజ్ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడింది. తమను ఓటమిపాలు చేసిన ఎస్పీ, బీఎస్పీని వెంటనే దెబ్బకొట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అప్పుడే తెర వెనుకకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు వేదికగా చేసుకొని వారిద్దరిని దెబ్బకు దెబ్బ కొట్టేందుకు అమిత్షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్వాది పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఏడుగురు ఎస్పీ నేతలు డుమ్మా కొట్టారు. వీరి గైర్హాజరు వెనుక అమిత్షా హస్తం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. నిజంగానే వారు బీజేపీకి అనుకూలంగా మారితే మాత్రం బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండిపడటం ఖాయం. దాదాపు 25 ఏళ్లపాటు కత్తులు దూసుకున్న ఎస్పీ, బీఎస్పీలు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా చేతులు కలిపి బీజేపీకి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ రెండు స్థానాలను కూడా బీఎస్పీ సాయంతో ఎస్పీ తన ఖాతాలో వేసుకొని సంబరాల్లో మునిగింది. గత నాలుగేళ్లలో బీజేపీకి అతి పెద్ద ఓటమి కూడా ఇదే. కర్ణాటక ఎన్నికల ముందు తమను దెబ్బ కొట్టిన ఎస్పీ, బీఎస్పీపై అమిత్షా గుర్రుగా ఉన్నారట. త్వరలో ఉత్తరప్రదేశ్లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి కనీసం 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తమకు 311 సీట్లు ఉన్న నేపథ్యంలో కనీసం 8 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఇక ఎస్పీకి 47 సీట్లు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఒక ఎంపీ సీటు ఖాయం. అయితే, తమ వద్ద అదనంగా ఉన్న 10మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉప ఎన్నికల్లో సాయం చేసిన బీఎస్పీకి ఇవ్వాలని ఎస్పీ నిర్ణయించుకుంది. బీఎస్పీకి ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు ఉండగా సమాజ్వాది పార్టీ నుంచి 10మంది ఎమ్మెల్యేల మద్దతు, మిగితా మద్దతు అజిత్సింగ్ పార్టీ నుంచి బీఎస్పీ తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే, అనూహ్యంగా ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి రాలేదు. వీరిలో అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే, వీరంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందట. కానీ, సమాజ్ వాది పార్టీ నేతలు మాత్రం ఎన్నికల సమయానికి అంతా సర్దుకుంటుందని, తమ వాళ్లు తమతోనే ఉంటారనే విషయం అప్పుడు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్, ఎస్పీల వినూత్న వైఖరి
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని లోక్సభ స్థానాలకు 2014లో ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్, సమాజ్వాజ్ పార్టీలు ఎలాగైనా అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంతో ఆ తర్వాత 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయినా ఫలితం లేదు. మరోసారి పరాభవం తప్పలేదు. అందుకని ఈనెల 11వ తేదీన రాష్ట్రంలోని రెండు లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో విడి విడిగా పోటీ చేస్తూ వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. యాదవుల పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం సమాజ్వాది పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ రెండు లోక్సభ స్థానాలకు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన నిషాద్, పటేల్ సామాజికి వర్గాలకు చెందిన అభ్యర్థులను పోటీకి దించారు. నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ను గోరఖ్పూర్ నుంచి, నాగేంద్ర పటేల్ ఫూల్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో రెండు సీట్లను కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించింది. గోరఖ్పూర్ నుంచి డాక్టర్ సుర్హిత ఛటర్జీ కరీం, ఫూల్పూర్ నుంచి మానిష్ మిశ్రా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరఫున గోరఖ్పూర్ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉపేంద్ర శుక్లా, ఫూల్పూర్ నుంచి కౌశాలేంద్ర సింగ్ పటేల్ పోటీ చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో దాదాపు 50 శాతం ఉన్న బ్రాహ్మణ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల వారంతా కాంగ్రెస్కు దూరమై బీజేపీకి ఓట్లు వేశారన్నది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ. ఈసారి పొత్తు లేనందున, అందులోనూ బ్రాహ్మణులకే టిక్కెట్లు ఇచ్చారన్న కారణంగా ఓటు వేస్తారని పూర్తి విశ్వాసం. గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెంగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గోరఖ్పూర్ అర్బన్ సెంగ్మెంట్లో 56 శాతం ఓట్లు, గోరఖ్పూర్ రూరల్లో 35 శాతం, సహజాన్వాలో 34 శాతం, పిప్రియాక్లో 33 శాతం, కాంపియర్గంజ్లో 42 శాతం ఓట్లు వచ్చాయి. ఈ అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొంది. గోరఖ్పూర్ రూరల్, సహజాన్వా, పిప్రియాక్, కాంపియర్గంజ్ అసెంబ్లీ సెంగ్మెంట్లలో నిషాద్, ముస్లింలు, యాదవ్లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నరన్నది సమాజ్వాది పార్టీ అంచనా. అందుకే ఇక్కడ ఓబీసీ అభ్యర్థులను రంగంలోకి దించింది. కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఈ ఉప ఎన్నికలకు ప్రత్యక్ష పొత్తు లేకపోయినా, రెండు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నదన్న విషయం తెలుస్తోంది. అగ్రవర్ణాల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ లేదా సమాజ్వాది పార్టీల అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందన్నది అవగాహన. ఏదేమైనా బీజేపీ అభ్యర్థులను ఓడించడమే ఇరు పార్టీల లక్ష్యం. ఈ లక్ష్యం సాధించేందుకు రెండు పార్టీల మధ్యనున్న అవగాహన ఎంతవరకు తోడ్పడుతుందో చూడాలి! -
జయ వైపే మొగ్గుచూపుతున్న మమత
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థి విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నటి, ఎంపీ జయా బచ్చన్ను తమ పార్టీ తరపున పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. టీఎంసీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘జయ ఓ సమర్థవంతమైన నాయకురాలు. పైగా ఆమెకు బెంగాలీ మూలాలు ఉన్నాయి. అందుకే ఆమెను మా పార్టీ తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించాం’ అని ఆయన వెల్లడించారు. టీఎంసీ తరపున నలుగురు ఎంపీల పదవీకాలం ముగుస్తుండగా.. ఈసారి రెండే సీట్లే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, సమాజ్వాదీ పార్టీ(యూపీ నుంచి) తరపున రాజ్యసభకు జయ బచ్చన్ ఇప్పటికే మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏప్రిల్ 3న ఎంపీగా ఆమె కాలపరిమితి ముగియనుంది. మార్చి 18న మమత స్వయంగా అభ్యర్థిగా జయా బచ్చన్ పేరును ప్రకటించే అవకాశం ఉందని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏప్రిల్లో రాజ్యసభలో 58 మంది ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. వీటిలో ఉత్తర ప్రదేశ్ నుంచే 10 సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్ఠంగా 312 సీట్లు కైవసం చేసుకోవటంతో ఈ దఫా వారికే రాజ్యసభలో ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఒకే సీటు దక్కే అవకాశం ఉండటంతో మమతను సంప్రదించినట్లు తెలుస్తోంది. మమతకు మద్ధతుగా అప్పట్లో... కొన్నాళ్ల క్రితం బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆంక్షలు విధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేవైఎం నేత యోగేష్ వర్ష్నే మమతపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఆమెను ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'నా భార్య ప్లేస్లో బరిలో దిగుతా'
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 2019 సాధారణ ఎన్నికల్లో తన భార్య స్థానంలో నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కనివ్వబోనని అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ తీవ్ర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అఖిలేశ్ తన పార్టీని సంస్థాగతంగా మరోసారి బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల ఏ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోనని, అలా చేయడం సమయం వృధా అని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనను కలిసిన కొందరు మీడియా మిత్రులు 2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా 'నేను ఈసారి కనౌజ్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పారు. కనౌజ్లో ప్రస్తుతం అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిపై 20వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, 2017లో కనౌజ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సమాజ్వాది ఓటమిని చవిచూసింది. -
అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్
ఖ్నవూ(ఉత్తరప్రదేశ్): అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ మిగతా వారికంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ గుల్షన్ బిందు పేరును సమాజ్ వాదీ పార్టీ ఖరారు చేసింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో తమ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా గుల్షన్ పేర్కొన్నారు. హామీలు అమలు చేయలేని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె తెలిపారు. వచ్చే నెల 21, 22, 29 తేదీల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలను డిసెంబర్ ఒకటో తేదీన ప్రకటిస్తారు. కాగా మీరట్- దీప్ మనేతియా వల్మీకిని, బరైలీ- ఐఎస్ తోమర్ను, అలీగఢ్- ముజాహిద్ కిద్వాయి, ఝాన్సీ- రాహుల్ సక్సేనాను, గోరఖ్పూర్- రాహుల్ గుప్తాను, మొరాదాబాద్- యూసఫ్ అన్సారీని అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది. -
హమ్ సాత్ సాత్ హై...
సాక్షి, లక్నో : ఈ దీపావళి పండగ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో.. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీలో కొత్త వెలుగులు నింపింది. ఏడాదిన్నర కాలంగా అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్ ఒక్క తాటిపైకి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం మొత్తం కలుసుకుని వేడుకలో పాల్గొనటంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్తో కలిసి గురువారం అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి సైఫై నిలయంలో సందడి చేశారు. తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. కాసేపటికే శివపాల్ అక్కడికి చేరుకోగా.. అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో శివ్పాల్ అబ్బాయిని ఆశీర్వదించగా.. ఈ దృశ్యంతో అక్కడున్న మిగతా పార్టీ నేతల ముఖంలో ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి. ములాయం ఇంట ముసలం, ఆపై యూపీ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత తండ్రి.. బాబాయ్, అబ్బాయ్లు కలుసుకోవడం ఇదే తొలిసారి. బుధవారమే సైఫై నిలయానికి చేరుకున్న అఖిలేశ్ కుటుంబం అంతకు ముందు అక్కడికి చేరుకున్న మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్తో సరదాగా గడిపారు. అయితే ఆ కాసేపటికే ములాయం కూడా అక్కడికి చేరుకుని రాంగోపాల్ యాదవ్తో ఏకాంతంగా రాజకీయాలపై చర్చించారంట. ఇక ఈ దీపావళితో తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని ములాయం ప్రకటించారు. పార్టీ-కుటుంబం ఇప్పుడు అంతా ఒక్కట్టే. అంతా కలిసి పార్టీని బలోపేతం చేసి.. ఉన్నతస్థాయికి చేర్చేందుకు యత్నిస్తాం అని ములాయం చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసే దిశగా ములాయం కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది.