success stories
-
ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!
దృఢ సంకల్పం, మనం కనే కలలపై అచంచల విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త బినోద్ చౌదరి నిరూపించారు. ఆయన పూర్వీకులు రాజస్థాన్ నుంచి నేపాల్లోని ఖాట్మండుకు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడి టెక్స్టైల్ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేపాల్లో తొలి బిలియనీర్గా మారారు. బిజినెస్ గురించి ఆయన అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాపారాలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.బినోద్ చౌదరి నేపాల్లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఇండియాలోని రాజస్థాన్ నుంచి చాలా ఏళ్ల కిందటే వలస వెళ్లారు. 1934లో నేపాల్-బిహార్ భూకంపం తరువాత బినోద్ తాత బురమల్దాస్ చౌదరి తన 20వ ఏటా టెక్స్టైల్ వ్యాపారం ప్రారంభించారు. నేపాల్లో అధికారికంగా నమోదు చేయబడిన దుస్తుల కంపెనీని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బినోద్ తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి తాత స్థాపించిన వస్త్ర వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ వర్తక సంస్థలను ప్రారంభించారు. 1968లో లుంకరణ్ దాస్ చౌదరి అరుణ్ ఎంపోరియం అనే రిటైల్ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఇది అత్యంత విజయవంతమైన సంస్థగా నిలిచింది.పద్దెనిమిదో ఏటా బాధ్యతలుపద్దెనిమిదేళ్ల వయసులో బినోద్ చౌదరి చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి ఇండియా రావాలని నిర్ణయించుకున్నారు. కాని అతని తండ్రి గుండె జబ్బుతో బాధపడుతుండడంతో కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించలేరని డాక్టర్ చెప్పారు. దాంతో కుటుంబ బాధ్యతతోపాటు వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. తాత స్థాపించి, తండ్రి అభివృద్ధి చేసిన వ్యాపారం పగ్గాలు బినోద్ అందుకున్నారు. ఈ సంఘటనపై బినోద్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..‘రాత్రికి రాత్రే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు వేరే ఆప్షన్ లేదు. కానీ అది నన్ను మరింత కఠినమైన వ్యక్తిగా మార్చింది’ అని అన్నారు.తొలుత నేపాల్కు జపాన్ సుజుకీ కార్లను దిగుమతి చేసుకొని ఆ సంస్థ కార్లకు డీలర్షిప్ దక్కించుకొని ఆటోమొబైల్ విభాగంలోకి అడుగుపెట్టాలని బినోద్ భావించారు. కానీ తాను వస్త్ర వ్యాపారి కాబట్టి సుజుకీ సంస్థ తనను నమ్మలేదు. అయినా వారిని ఒప్పించి నేపాల్లో సుజుకీ ఉత్పత్తులు విక్రయించడానికి ట్రయల్ డీలర్ షిప్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో ఎక్కువ కార్లు అమ్మితే పూర్తి డీలర్షిప్ లభిస్తుంది. దాంతో అనుకున్న విధంగానే అత్యధిక కార్లు సేల్ చేసి డీలర్షిప్ పొందారు. తర్వాత కాపర్ ఫ్లోర్ అని పిలువబడే డిస్కోటెక్ కంపెనీను స్థాపించారు. ఈ క్లబ్ను సందర్శించిన అనేక మంది సంపన్నుల కారణంగా కంపెనీ భారీ విజయం సాధించింది. 1979లో జపనీస్ ఎలక్ట్రానిక్ సంస్థ నేషనల్ పానాసోనిక్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.వై వై నూడుల్స్ తయారీబినోద్ చౌదరి తన 23వ ఏటా ఒకసారి థాయ్లాండ్కు వెళ్లారు. అక్కడ చాలామంది నూడుల్స్ తినడం, వాటిని కొనుగోలు చేయడం గమనించాడు. వెంటనే నూడుల్స్ అమ్మాలనే ఆలోచన చౌదరికి వచ్చింది. నేపాల్లోనూ థాయ్ నూడుల్స్పై మక్కువ ఉందని గ్రహించారు. థాయ్లాండ్లోని నూడుల్స్ను ఉత్పత్తి చేసే థాయ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ కంపెనీ లిమిటెడ్ను సందర్శించారు. ఆ కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని నేపాల్లో ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ వై వైను ప్రారంభించారు. ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే భారీగా విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. క్లబ్ను నిర్వహించడం, తన తండ్రి స్థాపించిన అరుణ్ ఎంపోరియం నడపడం తనకు ఎన్నో వ్యాపార విషయాలు నేర్పించాయని బినోద్ తెలిపారు.పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక1979లో అతని నూడుల్స్ కంపెనీకి నేపాల్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అవసరం అయింది. ఆ సమయంలో సూర్య బహదూర్ థాపా అధికారంలో ఉన్నారు. అతను చౌదరిని తన పరిపాలనకు, ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరగా వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌదరి దేశానికి గణనీయమైన కృషి చేశారని పార్టీ పేర్కొంది. డిసెంబర్ 2022లో పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఇతర వ్యాపారాలు1995లో నబిల్ బ్యాంకులో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను చౌదరి కొనుగోలు చేశారు. 1990లో సింగపూర్లో సినోవేషన్ గ్రూప్ను ప్రారంభించారు. హోటళ్లు, రిసార్టులు, వన్యప్రాణులు, పర్యాటకం, ఎఫ్ఎంసీజీ (ఫుడ్ అండ్ బేవరేజెస్), రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఈ కంపెనీ సర్వీసు అందిస్తోంది. తాజ్ హోటల్స్ గ్రూప్తో జాయింట్ వెంచర్స్ కోసం చౌదరి చర్చలు జరిపారు. బినోద్ చౌదరి నాయకత్వంలో చౌదరి గ్రూప్ టూరిజం, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, విద్యతో సహా వివిధ విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది. దాదాపు 30కి పైగా దేశాల్లో విస్తరించింది. నేపాల్లో ఇతర పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు సురక్షితమైన ప్రదేశంగా భావించేలా చేస్తుండడంతో బినోద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలని, సంపద సృష్టి, ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాలని తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలుటాటా, బచ్చన్లే ఆదర్శంబాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దివంగత పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా ఇద్దరు ప్రముఖులను బినోద్ ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తీవ్ర సంక్షోభంలో కూడా తననుతాను ఎలా మోటివేట్ చేసుకున్నారో నిత్యం గుర్తు చేసుకుంటానని తెలిపారు. మరోవైపు భారత్ ఎన్నో వ్యాపారాలు ప్రారంభించిన జేఆర్డీ టాటా దార్శనిక నాయకత్వం, నైతిక వ్యాపార విధానాలను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నారు. -
తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?
వ్యాపార రంగంలో కేవలం తండ్రులు మాత్రమే కాదు, తండ్రులకు తగ్గ కుమార్తెలు కూడా ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు హైదరాబాద్లో అత్యంత ధనవంతుడైన డాక్టర్ మురళీ కె. దివి కుమార్తె.. 'నీలిమా ప్రసాద్ దివి'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల తయారీదారులలో ఒకటైన 'దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్' విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి నీలిమా. ఈమె 2012లో తండ్రి స్థాపించిన కంపెనీలో చేరి.. దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు.దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీలు చేరడానికి ముందే.. నీలిమాకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం కంపెనీలో మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి కీలక రంగాలను పర్యవేక్షిస్తోంది.'దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్'ను నీలిమా తండ్రి డాక్టర్ మురళీ కె. దివి స్థాపించారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.63 లక్షల కోట్ల కంటే ఎక్కువ. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. కంపెనీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ దివి, భారతదేశంలోని అత్యంత సంపన్న ఫార్మా బిలియనీర్లలో ఒకరు. వీరి నికర విలువ 10.1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని అంచనా.ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!నీలిమా ప్రసాద్ దివి.. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూకేలోని గ్లాస్గో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో మరొక మాస్టర్స్ డిగ్రీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె కంపెనీలో కీలక బాధ్యతలను చూస్తూనే.. 'దివి ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్'కు మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. మొత్తం మీద తండ్రికి తగ్గ తనయగా వ్యాపారరంగంలో నీలిమా ముందుకు సాగుతోంది. -
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్కు వచ్చిన క్రెయిగ్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్ఇయర్లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ!
ఎల్నాజ్ నౌరోజీ.. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్న నటి. ఇరాన్లో పుట్టింది. జర్మనీలో పెరిగింది. కెరీర్ వెదుక్కుంటూ భారత్కు చేరింది. సినిమా, సిరీస్లతో తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది! జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఎల్నాజ్కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. అందుకే తన పద్నాలుగో ఏటనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ట్వల్త్ క్లాస్ పాస్ అయ్యాక, ఓ ఏడాది పాటు థియేటర్లో ట్రెయినింగ్ తీసుకుంది. పర్షియన్ డాన్స్, హిప్ హాప్, కథక్లోనూ శిక్షణ పొందింది.మోడలింగ్లో కొనసాగుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్లో భాగంగా ఆసియా, యూరప్ దేశాలు చుట్టొచ్చింది. ఇండియాలో జరిగిన ఎన్నో యాక్టింగ్ వర్క్షాప్స్కి హాజరైంది. తనకు ఈ దేశం నచ్చడంతో ఇక్కడే స్థిరపడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ లాంటి బాలీవుడ్ ఉద్దండులతో కలసి ఎన్నో టీవీ కమర్షియల్స్లో నటించింది.‘మాన్ జావో నా’ అనే పాకిస్తానీ మూవీలో, ‘ఖిదో ఖుండీ’ అనే పంజాబీ చిత్రంలో, పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. కానీ ఎల్నాజ్ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే! తర్వాత జీ5లో స్ట్రీమ్ అయిన ‘అభయ్’సిరీస్లోనూ నటించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సిరీస్ ‘రణ్నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.‘జన గణ మన’ అనే చిత్రంతో కోలీవుడ్లోకీ అడుగుపెట్టింది ఎల్నాజ్. ఇరానియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడున్న ఆంక్షల వల్ల వాటిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు కొత్తకొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దొరుకుతూనే ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో!" – ఎల్నాజ్ నౌరోజీఇవి చదవండి: పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’ -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఎస్.ఐ యామ్ ఆన్ డ్యూటీ
ఎంతోమంది కలలను తమ భుజాలపై మోశారు.. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. సమాజ భద్రతకు తామున్నామంటూ ప్రతినబూనారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు. జీవిత భాగస్వాములు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేశారు. సొంతవారి కళ్లల్లో ఆనందబాష్పాలయ్యారు. చిట్టి పాపాయిల సంతోషానికి అవధుల్లేకుండా చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకుని ఎస్సైలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. వారిలో కొందరిని ’సాక్షి’ పలకరించింది..32 ఏళ్ల వయసులో...ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్గా నిలిచి పాసింగ్ ఔట్ పరేడ్ కమాండెంట్గా నిలిచారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సార΄ాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.ఇద్దరు పిల్లల తల్లిగా..ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్ సర్వీసెస్ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్పేటలోని సీపీఎల్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.27 సార్లు ప్రయత్నించి..! నవీ¯Œ కుమార్ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర. తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్ హోదాలో గౌరవం పోందాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు. కమాండెంట్ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. బుధవారం జరిగిన ΄ాసింగ్ పరేడ్లో పాల్గొన్నాడు. పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. – వివేకానంద తంగెళ్లపల్లి, సాక్షి, హైదరాబాద్ -
కోరికలు – ఆత్మ సాధన! కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే..
మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి ‘నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?’రెండు ‘ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా?’ అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేర కపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీస్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది. కోరి కలు నెరవేరినా లేక నెరవేర కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటు వంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
Anvesha Vij: 'OMG'.. ఫీచర్ ఫిల్మ్తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి..
అన్వేషా విజ్.. ఓటీటీ వీక్షకులను ఆకట్టుకుంటున్న నటి. గ్లామర్ ఫీల్డ్లోకి రాకముందే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్. అందుకే ఆమెను డాన్సర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్ అని పరిచయం చేయాలి!అన్వేషా పుట్టిపెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అమిత్ విజ్, ఆర్కిటెక్చరల్ డిజైనర్. తల్లి.. మధు విజ్, గృహిణి. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన అన్వేషాకు డాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పుడే డాన్స్లో ట్రైనింగ్ మొదలుపెట్టింది.2014లోనే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది తన పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి. కాని పెద్దగా యాక్టివ్గా లేకుండింది. 2020లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసింది. అందులో చాలా యాక్టివ్గా ఉంది తన డాన్స్ వీడియోలు, ఫొటోస్తో! ఆ పోస్ట్లకు అనతికాలంలో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగి అన్వేషాను ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేర్చారు. స్ట్రాంగ్ ఫ్యాన్బేస్గా ఏర్పడ్డారు.ఆ పాపులారిటినే ఆమెకు లాక్మే, బీ రియల్ లాంటి బ్రాండ్స్కి మోడలింగ్ చేసిపెట్టే చాన్స్నిచ్చింది. మోడలింగేమో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టే అవకాశాన్నిచ్చింది.ఓటీటీలో ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’. అందులో నిక్కీ కపూర్ పాత్రతో ఓటీటీ వీక్షకులను మెప్పించింది. ఆ మరుసటి ఏడు అంటే 2013లో OMG 2 (ఓహ్ మై గాడ్ 2) ఫీచర్ ఫిల్మ్తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి సినీ అభిమానులను మురిపించింది. పరేశ్ రావల్ నటించిన OMG (ఓహ్ మై గాడ్)కి సీక్వెల్ అయిన ఈ సినిమాలో ఆమె పంకజ్ త్రిపాఠీకి కూతురు ‘దమయంతి’గా నటించింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ప్రముఖ స్టాండప్ కమేడియన్ మునవ్వర్ ఫారూకీతో కలసి ‘కాజల్’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. తాజాగా అన్వేషా ‘సిస్టర్హుడ్’ అనే సిరీస్తో అలరిస్తోంది. ఇది మినీ టీవీలో స్ట్రీమ్ అవుతోంది."ఓటీటీ అండ్ సినిమా రెండూ దేనికవే డిఫరెంట్. ఈ రెండిటితో చాలా నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా 'OMG2’ సినిమాలో నా సీనియర్ కోస్టార్స్ పంకజ్ సర్, యామీ గౌతమ్ మామ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్లు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు". – అన్వేషా విజ్ఇవి చదవండి: రాగాలాపనలో... -
ఆనాడు 4 వేలతో ప్రారంభించి.. ప్రస్తుతం లక్షల్లో...
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వాటిని ఎలా అధిగమించాల్లో కూడా నేర్పింది. ఆ సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఆ ఆలోచనే ఓ వ్యాపారి జీవతంలో ఇప్పుడింతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.బీహార్లోని దర్భాంగ జిల్లాకు చెందిన రాహుల్ భగత్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం వైపుగా ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న మార్కెట్ వైపు దృష్టి సారించగా, తనకెదురైన ఓ వ్యాపారమే ప్రస్తుతం ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అదే చీపుర్ల తయారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని.. చిన్న తరహా పరిశ్రమల సూచన దిశగా, తక్కువ పెట్టుబడితో.. రాహుల్ కేవలం రూ.4 వేలకే చీపుర్ల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అది లక్షల్లో ఆదాయంగా మారింది.ఆరోజు తీసుకున్న నిర్ణయమే.."కరోనా సమయంలో వచ్చిన ఆలోచనే ఆఖరి నిర్ణయంగా మార్చుకుని ఇటువైపుగా అడుగేశాను. ఈ చూట్టూరా కొన్ని ప్రాంతాలలో చీపుర్ల తయారీదారునిగా ఎదిగాను. ప్రతీ ఇంట్లో చీపురు ఉండటం, ఇంటిని శుభ్రంగా మార్చడంలో ఈ వ్యాపారం కీలకంగా ముడిపడి ఉంది గనుకే మంచి ఆదాయం వస్తోంది.ఇక్కడ మూడు రకాల చీపుర్లను తయారు చేస్తాను. ఒక్కోరకమైన చీపురుకి ఒక్కో ధర ఉంటుంది. నెలలో 300 నుంచి 400ల చీపుర్లను విక్రయిస్తాను. ఖర్జూరం, కొబ్బరి చీపురు, పూల చీపురు వంటి మూడు రకాలను తయారుచేయడమే నా వ్యాపారానికి మెట్టు. వీటన్నింటికీ ముడిసరుకుని దర్భాంగ సమితి మార్కెట్ నుంచి తీసుకురావాలి. ఖర్జూరం ఒక్కో చీపురు రూ.20, కొబ్బరి చీపురు రూ. 50 కాగా, పూల చీపురు 60. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 45వేలు వస్తుందని" రాహుల్ భగత్ చెప్పుకొచ్చాడు.ఇవి చదవండి: అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా? -
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్స్టాగ్రావ్ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్లోని ఫ్రోత్ ఆన్ టాప్లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు కేరాఫ్లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్కు థీటుగా బ్రాండ్స్కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
Umamani: సముద్రం ఘోషిస్తోంది..
సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది. బొమ్మలేయని బాల్యం..‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.డైవింగ్కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.సముద్రగర్భాన్ని చిత్రించాను.. సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఓషన్ రీసెర్చర్లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి. కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతున్నాయి.ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది -
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్లోని మోడరన్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.దుబాయ్లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్లో కూడా విస్తరించింది.కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్మార్క్ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
Aditya Srivastava: యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. 'ఆదిత్య శ్రీవాస్తవ'?
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.. ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్లోకి అడుగు పెట్టేవాడు కాదేమో. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్స్పైరింగ్గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది. పదిహేను నెలల తరువాత.. ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు. 2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్కుప్రాధాన్యత ఇచ్చాడు. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ. పక్కా ప్రణాళిక.. ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్సీ ప్రిపేరేషన్కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్ను రూపొందించుకున్నాడు. ‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’ ఇవి చదవండి: యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్! -
Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది..
‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు కవి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని దిప్రజ్ జాదవ్ ఎప్పుడూ అనుకోలేదు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటో కూడా తెలియదు. సరదాగా చేసిన ఒక వీడియో అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... ఒక వైరల్ వీడియోతో మహారాష్ట్రలోని షిర్పూర్ అనే చిన్న పట్టణానికి చెందిన దిప్రజ్ జాదవ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మరాఠీ సినిమా ‘లై బారి’లోని ఒక డైలాగ్ మీమ్ మాషప్ చేశాడు జాదవ్. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ దృష్టిని కూడా ఆ వీడియో ఆకట్టుకుంది. వైరల్ అయింది. ‘ఫేస్బుక్లో నేను పేజీ స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది పెద్ద విషయం కాదు. దానికి అంత ్ర΄ాముఖ్యత కూడా లేదు. అలాంటి సమయంలోనే కొత్త కొత్త వీడియోలు చేసేవాడిని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దిప్రజ్ జాదవ్. జాదవ్కు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులోని ΄ాపులర్ సీన్లకు తనదైన స్టైల్ జోడించి అనుకరించే వాడు. పుణెలో యానిమేషన్ కోర్సు చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్పై ఇష్టం పెరిగింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను పర్ఫెక్ట్గా మిక్స్ చేయడంలో గట్టి పట్టు సం΄ాదించాడు. ఆ విద్య అతడికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ఎంతోమంది ఫాలోవర్స్ను తెచ్చి పెట్టింది. సెకండ్ టర్నింగ్ ΄ాయింట్ విషయానికి వస్తే,.,.. రామానంద్సాగర్ ‘రామాయణం’లోని రాముడు, రావణుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోకు ర్యాపర్ డివైన్ ΄ాడిన ‘సీన్ క్యా హై’ ΄ాటను జోడించాడు. ఇది చూసి మ్యూజిక్ ్ర΄÷డ్యూసర్ న్యూక్లియ(ఉద్యాన్ సాగర్) జాదవ్ను సంప్రదించి సబ్ సినిమా సిరీస్లో భాగంగా ఇలాంటి ఫిల్మీ మాషప్స్ మరిన్ని కావాలని, వాటిని మ్యూజిక్ ్ర΄ోగ్రాంలలో ఉపయోగించుకుంటానని చె΄్పాడు. జాదవ్ క్రియేటివిటీకి న్యూక్లియ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ‘ఊహకు అందనిది ఆలోచించే సామర్థ్యమే అరుదైన సృజనాత్మకత. ఇలాంటి అరుదైన సృజనకారులలో జాదవ్ ఒకరు. రెండు పరస్పర విరుద్ధ అంశాలను మిళితం చేసి అందరినీ ఆకట్టుకుంటాడు’ అంటాడు న్యూక్లియ. చిత్రపరిశ్రమలో పనిచేయాలనేది జాదవ్ కోరిక. బాలీవుడ్లోని కొన్ని సినిమాలు, బాట్లా హౌజ్, రాకెట్ బాయ్స్లాంటి వెబ్సిరీస్లకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ‘నేను చేస్తున్న పని గురించి నా తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఏదైన స్థిరమైన ఉద్యోగం చేయాలని కోరుకునేవారు. అయితే నాకు వచ్చిన గుర్తింపు చూసిన తరువాత వారి ఆలోచన మారింది. నాపై నమ్మకం పెరిగింది’ అంటాడు దిప్రజ్ జాదవ్. 28 సంవత్సరాల జాదవ్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–2024’ జాబితాలో చోటు సాధించాడు. కొత్త ద్వారాలు ‘పదిమందిలో ఒకరు’ అని కాకుండా పదిమందికి భిన్నంగా ఆలోచించినప్పుడే మంచి ఫలితం సాధించగలం. ఒక టాపిక్ గురించి మనకు ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ టాపిక్పై పట్టు వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. – దిప్రజ్ యాదవ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దిప్రజ్ జాదవ్ -
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..!
"బస్తర్.. కొండకోనల్లో.. వాగువంకల్లో ఒదిగిన ఈ ప్రాంతానికి లోకం పోకడలతో పెద్దగా పరిచయం లేదు! కాని దానికి సంబంధించిన ఏదో ఒక వార్తను ఈ ప్రపంచం నిత్యం వింటూనే ఉంటుంది! బస్తర్ను కమ్యూన్స్కి నమూనాగా మలచాలని మావోయిస్ట్లు.. మోడర్న్ వరల్డ్కి అనుసంధించాలని ప్రభుత్వాలు.. ఏ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తోందో.. ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అక్కడి జనమే చెప్పాలి! కానీ రెండు పరస్పర విరుద్ధమైన తీరులు.. తరీఖాల మధ్యనున్న బస్తర్ వాసులు గుంభనంగానే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే భయంగా ఉంటారు! ఆ భయాన్ని పోగొట్టి.. వారి మంచిచెడులను అడిగే దళం ఒకటి అక్కడి గూడేల తలుపులు తడుతుంది! ఆ దళంలో ఉన్నవాళ్లంతా ఆదీవాసీల కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లే! వాళ్లకు శిక్షణనిచ్చి సాయుధులుగా పంపిస్తోంది ప్రభుత్వమే! అయినా ఆ బిడ్డలను చూస్తే ఆ గిరిజనులకు ఒక భరోసా.. భద్రత! ఆ విశ్వాసం పొందడానికి ఈ బిడ్డలు సర్కారు నమూనాను అనుసరించట్లేదు.. ఆత్మీయతను పంచుతున్నారు! అనునయిస్తున్నారు. తమ జనానికి ఏం కావాలో.. ఏం అవసరమో తెలుసు కాబట్టి ఆ దిశలో నడుస్తున్నారు.. నడిపిస్తున్నారు! ఇది జనతన సర్కార్కి.. సర్కార్కి మధ్య పోరును వివరించే వ్యాసం కాదు! ఆ రెండిటి నడుమ ఘర్షణకు గురై.. తలుపులు మూసేసుకున్న జనాలను అక్కున చేర్చుకుని సర్కారు అభివృద్ధిలో తమ వాటాను వారు అందుకునేలా చేస్తున్న ఆ కూతుళ్లు.. అక్కాచెల్లెళ్ల గురించి! మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఈ విమెన్ పవర్ గురించి! వివరాల్లోకి వెళ్లేముందు బస్తర్ చరిత్రనూ తెలుసుకుందాం క్లుప్తంగా.." రామాయణంలో దండకారణ్యంగా చెప్పుకునే దట్టమైన అటవీ ప్రాంతం తెలంగాణకు ఆవల ఛత్తీస్గఢ్లో గోదావరి, ఇంద్రావతి, శబరి నదుల నడుమ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనే అంశాలపై రెండు దశాబ్దాల కిందటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. అక్బర్ కాలంలో తొలిసారి, ఆ తర్వాత బ్రిటిష్ హయాంలో మరోసారి ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకునేందుకు కొంత ప్రయత్నం జరిగింది. అయితే దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రయత్నాలు తుదివరకు సాగలేదు. ఇక్కడి ఆదివాసీ తెగ ప్రజలకు అడవే లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. వీళ్లకు దేవుడైనా, దయ్యమైనా ప్రకృతే! ఆ తర్వాత బ్రిటిష్ వారి రాక, వారు రూపొందించిన కఠినమైన చట్టాల ఆసరాతో అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి అడుగు పెట్టారు. దీంతో ఆదివాసీలపై అటవీశాఖ ఆగడాలు శ్రుతి మించాయి. అటవీశాఖ సిబ్బంది అంటే అడవుల్లో ఆదివాసీల జీవనానికి అడ్డుతగిలే వారుగా ముద్ర పడిపోయారు. జనతన సర్కార్.. తెలంగాణలో 1980వ దశకంలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెలు అన్నలకు అడ్డాలుగా మారాయి. ఇదే క్రమంలో 1982లో కొందరు మావోయిస్ట్లు ఏటూరునాగారం వద్ద గోదావరి తీరం దాటి బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయారు. అటవీశాఖ సిబ్బంది అణచివేతతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచారు. వారు మాట్లాడే భాష నేర్చుకున్నారు. వారి తిండికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆదివాసీలను ఐక్యం చేసి, అటవీశాఖ సిబ్బంది ఆగడాలను నిలదీయడం నేర్పారు. ఫలితంగా ఈ శతాబ్దం ఆరంభానికి వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో దాదాపు 92 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించిన బస్తర్ ఏరియా అన్నల నీడలోకి వెళ్లింది. గ్రామాల వారీగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన విద్య, వైద్య, రక్షణ కమిటీలు పరిపాలనలో చురుగ్గా వ్యవహరించసాగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యేటప్పటికి బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అనధికారిక పాలకులుగా మారారు. బస్తర్తో బంధం.. 'ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయులు తమ రాజధాని ఏకశిలా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గోదావరి తీరం దాటి ఇంద్రావతి ఒడ్డున విస్తరించిన అడవుల్లోకి వెళ్లి, బస్తర్ కేంద్రంగా మరో రాజ్యాన్ని స్థాపించారు. రాచరిక పాలన అంతమైనా నేటికీ అక్కడ మన కాకతీయుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడే భావజాల వ్యాప్తిలో భాగంగా ఆనాటి అన్నలు గోదావరి తీరం దాటి బస్తర్లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సహకారంతో జనతన సర్కార్ను నడిపించడం ప్రారంభించారు. కాలాలు మారినా అలా బస్తర్తో తెలుగువారికి బంధం కొనసాగుతూనే ఉంది.' సల్వాజుడుం.. ఆరంభంలో బాగున్నా, బస్తర్ అడవులు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. అడవుల్లోని గ్రామాలకు సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆధునాతన విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ్స అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అడవుల్లోకి అభివృద్ధిని తెస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అడవుల్లోని సహాజ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు అడవుల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయంటూ మావోయిస్ట్లు ఎదురుతిరిగారు. దీంతో మావోయిస్ట్ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిదశలో 2005లో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అయితే అది వికటించి, అడవుల్లో అన్నలకు మరింత పట్టు పెరిగింది. దాంతో అటవీశాఖ సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీన్హంట్.. 2012లో బస్తర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ గిరిజనులు మావోయిస్ట్లనే తమ పాలకులుగా భావిస్తున్నారని తేలింది. ఈ ఫలితం సంచలనం రేపింది. దాంతో మావోయిస్ట్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆపరేషన్ గ్రీన్ హంట్ను ప్రారంభించింది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. కేవలం మావోయిస్ట్ల కోసమే కోబ్రా దళాలను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)ని ఏర్పాటు చేసింది. బస్తర్ పరిధిలో ఉన్న సుక్మా, బీజాపూర్, నారాయణ్పూర్, కాంకేర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు ఎలాగైనా అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంగా ఉక్కుపాదాలతో ముందుకు సాగింది ప్రభుత్వ యంత్రాంగం. ఫలితంగా గత పదిహేనేళ్లుగా గోదావరి, ఇంద్రావతి, శబరి నదులు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని పచ్చని అడవులు మరింతగా రక్తసిక్తమయ్యాయి. ఇబ్బంది లేదు.. 'చిన్నప్పుడే మావోయిస్టుల్లో కలసిపోయాను. ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవితం గడచింది. అక్కడ అనారోగ్యం పాలయ్యాను. నేనక్కడ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇక్కడ నా కుటుంబానికి అండగా ఎవరూ లేరు. దాంతో అడవుల్లోంచి బయటకు వచ్చాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్లో మహిళా కమెండోగా పని చేస్తున్నాను. నా కుటుంబానికి అండగా ఉంటున్నాను. అలవాటైన పని కావడంతో ఆయు«ధంతో అడవుల్లో పని చేయడం ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు.' – సబిత (పేరు మార్చాం) మహిళా కమెండో భయం నీడన.. మైదానప్రాంత గిరిజనులు సైతం ఇతరులతో అంత సులువుగా కలసిపోరు. ఇక కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలైతే తమ గ్రామాల దగ్గరికి ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే ముడుచుకుపోతారు. అలాంటిది ఆలివ్గ్రీన్ యూనిఫామ్ ధరించి ఆయుధాలతో వచ్చిన భద్రతా దళాలను చూసేసరికి మరింతగా కుంచించుకుపోయారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు గిరిజనుల నుంచి కనీస సమాచారం అందడం కూడా దుర్లభమైంది. అడవుల్లో తమను చూసి బెదిరిపోయే ఆదివాసీలు.. మావోయిస్ట్లకు అండగా ఉంటున్నారనే అపోహ భద్రతా దళాల్లో పెరిగిపోయింది. బలవంతంగా తమ నోరు విప్పించేందుకు భద్రతా దళాలు చేసే ప్రయత్నాలు ఆదివాసీలను మరింతగా బెదరగొట్టాయి. దాంతో ఇటు భద్రతా దళాలు, అటు ఆదీవాసీలు ఒకనొకరు విశ్వసించుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎదురు కాల్పులు, కోవర్టుల ఘాతుకాలు, ఇన్ ఫార్మర్ల హత్యలతో హింసాకాండ పెరిగింది. హక్కుల ఉల్లంఘన దట్టమైన అడవుల్లోకి వెళ్లినప్పుడు సెర్చింగ్ పేరుతో ఆదివాసీ గూడేలపై అకృత్యాలకు, అమానవీయ చర్యలకు పాల్పాడుతున్నారనే ఆరోపణలు భద్రతా దళాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా కమెండోల (మగవాళ్లు) చర్యలు ఉంటున్నాయనే విమర్శలు పెల్లుబికాయి. భద్రతా దళాలను చూస్తేనే ఆదివాసీ గూడేలు గడగడలాడిపోతున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అప్పటికే చెలరేగుతున్న హింసకు మానవ హక్కుల హననం అనే ఆరోపణలు తోడవడంతో ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. మానవీయ కోణం.. భద్రతా దళాల సంఖ్యను పెంచినా, అధునాతన ఆయుధాలు అందించినా.. సరికొత్త వ్యూహాలను అమలు చేసినా అడవుల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యపడలేదు ప్రభుత్వాలకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఆయుధాలతో ఆదివాసీల మనసులను గెలుచుకోవడం కష్టమని భావించారు అధికారులు. దాంతో తమ పట్ల, తాము వినిపిస్తున్న అభివృద్ధి నినాదం పట్ల గిరిజనానికి విశ్వాసం కలగాలంటే వారిపట్ల సహానుభూతి అవసరమని గ్రహించారు. మానవీయకోణం లేని ప్రయత్నాలు వ్యర్థమని అర్థం చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనే నినాదానికి మానవీయ కోణం జత చేయాలనే వ్యూహానికి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చారు. దంతేవాడలో తొలి అడుగు! పారా మిలటరీ దళాల్లో మహిళలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నంత ఈజీగా అమలు సాగలేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కష్ట సాధ్యమైంది. అప్పటికే మావోయిస్ట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో వందల మంది చనిపోయారు. దాంతో ఆలివ్గ్రీన్ దుస్తులు ధరించి, భుజాన తుపాకి మోసేందుకు ముందుకొచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంతే మిగిలారు. ఆ వచ్చిన కొద్దిమంది కూడా అప్పటికే అక్కడ చెలరేగుతున్న హింసలో పెద్దదిక్కును కోల్పోయిన వారు, లొంగిపోయిన మావోయిస్టులే! అలా 2019లో దంతెవాడ జిల్లాలో తొలి విమెన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళం ఏర్పడింది. మూడు నెలల శిక్షణ ఫ్రంట్ లైన్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్లో భాగంగా ప్రారంభమైన తొలి దళంలో పదిమంది లొంగిపోయిన మహిళా మావోయిస్టులు, పదిమంది సల్వాజుడుం పూర్వసభ్యులు ఉండగా మిగిలిన పదిమంది రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నియమితులయ్యారు. అలా మొత్తం ముపై ్ప మందిని తీసుకున్నారు. మావోయిస్ట్లకు వ్యతిరేకంగా చేపట్టే జంగిల్ వార్ఫేర్లో వారికి మూడు నెలల కఠిన శిక్షణ ఇచ్చారు. దాంతోపాటుగా దట్టమైన అడవుల్లో సురక్షితంగా వాహనాలు నడపడం, మ్యాప్ రీడింగ్, కౌంటర్ ఆంబుష్ స్ట్రాటజీ, ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ నేతల ప్రొఫైల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారువేషాల్లో మెరుపుదాడులు చేయడంలోనూ మెలకువలు నేర్పించి, కార్యక్షేత్రంలోకి దింపారు. అర్థం చేసుకోవడం తేలిక.. 'నేను ఛత్తీస్గఢ్ ఆదివాసీ మహిళను. గతంలో మా గ్రామంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వస్తే గ్రామమంతా వణికిపోయేది. ఆ భయం నుంచే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అడవిబాట పట్టాం. ఇప్పుడు భద్రతాదళంలో మహిళా కమెండోగా పని చేస్తున్నా. భద్రతా దళాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజల మానసిక స్థితి ముఖ్యంగా మహిళలు ఎలా భయపడతారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టి భరోసా కల్పించడం ఎలాగో మాకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అందువల్లే మహిళా కమెండోలు వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు, భద్రతా దళాలకు మధ్య సంబంధాలు∙మెరుగవుతున్నాయి గతంతో పోలిస్తే!' – జయంతి (పేరు మార్చాం) మహిళా కమెండో మహిళా కమెండోలు.. ఈ మహిళా దళ సభ్యులను బృందాలుగా వేరు చేస్తారు. వీరు మెన్ స్క్వాడ్ కూంబింగ్కు వెళ్లినప్పుడు వారి వెంట అడవుల్లోకి వెళ్తారు. ఉదాహరణకు పాతిక మంది కమెండోల బృందం అడవుల్లోకి వెళితే అందులో నలుగురైదురుగు మహిళా కమెండోలు ఉండేలా కూర్పు చేశారు. వీరు అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు, దారిలో ఏదైనా గూడెం వస్తే మహిళా కమెండోలు గూడెం లోపలికి వెళ్తారు. అక్కడున్న వారితో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తీర్చగలిగే సమస్య అయితే అక్కడిక్కడే తమ సామర్థ్యం మేరకు పరిష్కారం చూపుతారు. అక్కడికి రావడం వెనుక తమ ఉద్దేశం ఏంటో చెబుతారు, సహకరించాలని కోరుతారు. స్త్రీల సమస్యలు.. మహిళా కమెండోలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లిళ్లు, పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడే ఛత్తీస్గఢ్ మహిళలు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత, గైనిక్ సమస్యలపై తమకున్న అవగాహన మేరకు వారికి తోడ్పాటును అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి తమ కిట్లలో ఉండే మాత్రలు, టానిక్స్ను వారికి అందిస్తుంటారు. దీంతో బస్తర్ ప్రాంతంలోని ప్రజలకు భద్రతా దళాలపై ఉండే అపారమైన భయం స్థానంలో క్రమంగా నమ్మకం చిగురించసాగింది. మార్పు మొదలైంది.. మహిళా కమెండోలు వచ్చాక మార్పు మొదలైందంటున్నారు ఛత్తీస్గఢ్ గ్రామీణులు. ‘ఇంతకుముందు భద్రతా దళాలు మా ఊళ్లవైపు వస్తున్నాయని తెలిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం అడవుల్లోకి పరుగెట్టేవాళ్లం. ఆరోగ్యం బాగాలేని వారు, ముసలి వాళ్లు మాత్రమే ఊళ్లల్లో ఉండేవారు. భద్రతా దళాలు మా ఊళ్లను విడిచిపెట్టాయని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. అయితే వాళ్లు వస్తున్నారని తెలిసి ఉన్నపళంగా ఊరంతా ఖాళీ అయ్యేసరికి ఏదో జరగబోతోందనే అనుమానంతో జవాన్లు ఊళ్లల్లోనే తిష్టవేసే వాళ్లు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారంటూ ఊళ్లల్లో ఉన్న వారిని గదమాయించే వారు. దాంతో మా పల్లెల్లో ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ మహిళా కమెండోలు వచ్చిన తర్వాత భద్రతా దళాల మాటతీరులో మార్పు వచ్చింది. మా మీద భద్రతా దళాలకు చెందిన మగ కమెండోలు దాష్టీకాలు చేయకుండా అడ్డుకునే మహిళా కమెండోలు ఉన్నారనే నమ్మకం కలిగింది. మా బాధలు చెబితే అర్థం చేసుకునే మనుషులకు భద్రతా దళాల్లో స్థానం ఉందనే భరోసా వచ్చింది. రోజులు గడిచే కొద్దీ, నెలలు ముగిసే కొద్దీ భద్రతా దళాలను చూసి అడవుల్లోకి పారిపోయే పరిస్థితి తగ్గిపోయింది. సర్కారుకు, మాకు మధ్య వారధిగా నిలుస్తున్నారు మహిళా జవాన్లు’ అని చెప్పుకొచ్చారు స్థానిక జనం. పట్టాలపైకి అభివృద్ధి! చత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజలతో భద్రతా దళాలు మమేకం అవడం మొదలైన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ముందుగా మహిళా జవాన్లతో కూడిన భద్రతా దళాలు అడవుల్లోకి వెళ్లి, వాళ్లు అక్కడి ప్రజలతో కలసిపోతారు. ఆ తర్వాత అక్కడ భద్రతా దళాల క్యాంప్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఆ గ్రామానికి కరెంటు వస్తుంది. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు మొదలవుతాయి. వీటికి సమాంతరంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ కొంతమంది సభ్యులను ఉంచేసి మిగిలిన దళ సభ్యులు ముందుకు సాగుతారు. రోడ్డు, కరెంటు సౌకర్యాలు వచ్చిన గ్రామాల్లోకి దశల వారీగా స్కూళ్లు, ఆస్పత్రులు తదితర వసతులూ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. మానవ హక్కుల సంఘాల ఆరోపణలూ అంతగా వినిపించడంలేదని పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల విధుల్లో.. బస్తర్ ప్రాంతంగా చెప్పుకునే ఏడు జిల్లాల పరిధిలో మహిళా కమెండోలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహిళా దళాల్లో చేరే వారికి పద్దెనిమిది నెలల శిక్షణ కాలాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 450 మందికి పైగా మహిళా కమెండోలు ఛత్తీస్గఢ్లో పని చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. దట్టమైన అడవుల్లో ఉన్న 35 పోలింగ్ బూత్ల రక్షణ బాధ్యతను మహిళా కమెండోలకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఆ 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి. ఆదివాసీలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘనత మహిళా కమెండోలదే! మహారాష్ట్రలో.. ఛత్తీస్గఢ్లో మహిళా కమెండోలు తెచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలనూ ఆలోచింపచేసింది. దండకారణ్యంలో భాగంగా ఉండే మçహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ మహిళా కమెండో దళాన్ని నెలకొల్పారు. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ దళం గడ్చిరోలి జిల్లా వంగేటూరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, దేశ సైనికదళంలోనూ మహిళా కమెండోలు తమ సత్తా చూపిస్తున్నారు. మొత్తానికి.. కరకుదనం ఖాకీ సొత్తు. కరడుగట్టిన కాఠిన్యానికి సైన్యం చిరునామా! ఈ రెండిటితో పరిచయమేలేనిది మహిళ! తోటి వాళ్లను వినగలిగే ఓర్పు, అవతలి వాళ్ల కోణంలోంచి ఆలోచించగలిగే నేర్పు, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోగలిగే దయ, వీటన్నిటినీ మించి ఏటికి ఎదురీదగల ధైర్యంతోనే ఆయుధాలకు సాధ్యం కాని మార్పును తీసుకురాగలిగింది. తూటాలతో దద్దరిల్లిన ప్రాంతంలో సంతోషాల సవ్వళ్లు వినిపించేలా చేస్తోంది. ల్యాండ్ మైన్స్ నాటుకున్న ప్రదేశాల్లో శాంతిని పండించగలుగుతోంది. – కృష్ణగోవింద్ ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
కోట్లు సంపాదిస్తున్న 'అనమ్ మీర్జా'.. ఆస్తి ఎంతంటే?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఈమె సోదరి 'అనమ్ మీర్జా' గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత!.. ఆనం మీర్జా గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. సానియా మీర్జా మాదిరిగా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న అనమ్ మీర్జా మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్లలో ఇంటర్న్గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం 'ఇంక్ టు చేంజ్' అనే వెబ్సైట్ ప్రారంభించింది. 2014లో అక్బర్ రషీద్తో వివాహం జరిగిన తరువాత ఆమె తన ఫ్యాషన్ లేబుల్ 'ది లేబుల్ బజార్'ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్పో, దావత్-ఎ-రంజాన్ను స్థాపించింది. అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్తో విడిపోయిన తరువాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు 'మహ్మద్ అసదుద్దీన్'ను వివాహం చేసుకుంది. వీరికి 'దువా' అనే పాప కూడా ఉంది. ఈ పాప పేరు మీద అనమ్ మీర్జా 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించింది. మహ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలోనే నడిచి బ్యాటర్గా మారారు, కానీ అయన క్రికెట్ కెరీర్ సజావుగా ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ వదిలిపెట్టారు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్లోనే అన్నీ.. అనమ్ మీర్జా వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దీని ద్వారా కూడా బాటుగా సంపాదిస్తోంది. వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న అనమ్ మీర్జా నికర విలువ 40 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈమె ఆస్తుల విలువ రూ.331 కోట్లకంటే ఎక్కువ. -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..
Bhavesh Bhatia Success Story: బలమైన సంకల్పం నీకుంటే సమస్తం నీకు దాసోహమంటుంది.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా నీ గమ్యం చేరుకునే దిశలో అడుగులు వేస్తే.. తప్పకుండా సక్సెస్ నీకు సలాం చేస్తుంది. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువమందిలో ఒకరు 'భవేష్ భాటియా'. చూపు లేకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన 'భవేష్ భాటియా'కు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ, సృజనాత్మకత వంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ అతనికి రెంటీనా కండరాల సంబంధిత వ్యాధి వల్ల, దానిని నయం చేసుకోవడానికి డబ్బు లేకపోవడం వల్ల చూపును కోల్పోయాడు. ఉద్యోగం లభించలేదు డిగ్రీ పూర్తి చేసినప్పటికీ.. చూపులేకపోవడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న భాటియా తల్లి కూడా క్యాన్సర్ వ్యాధిలో మరణించింది. భాటియా తండ్రి పొదుపు చేసుకున్న మొత్తం డబ్బుని భార్య వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేసేసాడు. రూ. 50 అప్పుగా కంటికి రెప్పలా చూసుకునే తల్లి కోల్పోయిన తరువాత ఎదో ఒకటి చేయాలని నిరాంయించుకుని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ స్కూల్లో చేరి క్యాండిల్స్ (కొవ్వొత్తులు) తాయారు చేయడం నేర్చుకున్నాడు. క్యాండిల్స్ తయారు చేయడంలో కొంత నైపుణ్యం వచ్చిన తరువాత స్నేహితుడి నుంచి రూ.50 అప్పుగా తీసుకుని బండిని అద్దెకు తీసుకుని, మహాబలేశ్వర్లోని స్థానిక మార్కెట్లో కొవ్వొత్తులను అమ్మడం ప్రారంభించారు. వ్యాపారం కొంత పెరగడం మొదలు పెట్టింది. ఆ తరువాత 'నీతా' అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత భాటియా జీవితంలో కొత్త వెలుగు రావడం మొదలైంది. కొవ్వొత్తులను మార్కెటింగ్ చేయడంలో నీతా చాలా సహాయపడింది. భాటియా బలమైన సంకల్పంతో ముందడుగులు వేస్తున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. 'సన్రైజ్ క్యాండిల్స్'కు పునాది వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక బ్యాంక్ నుంచి రూ.15000 లోన్ తీసుకుని కొత్త పద్దతులతో క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనలాంటి అంధులకు కొంత మద్దతుగా నిలిచి వారికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే 'సన్రైజ్ క్యాండిల్స్'కు పునాది వేసాడు. ఈ సంస్థ నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ఉంది. ప్రస్తుతం సన్రైజ్ క్యాండిల్స్ సంస్థ ఏకంగా సంవత్సరానికి రూ.350 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ఈ కంపెనీ క్యాండిల్స్ ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణ క్యాండిల్స్ మాత్రమే కాకుండా.. సువాసనలు వెదజల్లేవి, మంచి డిజైన్ కలిగిన క్యాండిల్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. 9000 మందికి ఉపాధి కేవలం రూ. 50తో మొదలై రూ. 350 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి, ఏకంగా 9000మంది అంధులకు అందమైన జీవితాన్ని భాటియా ప్రసాదించారు. సుమారు 52 ఏళ్ల భాటియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలకు 12,000 రకాల డిజైన్ చేసిన క్యాండిల్స్ విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా భవేష్ భాటియా అకుంఠిత దీక్షను ప్రశంసించారు, అతని జీవితం ఎంతోమందికి ఆదర్శమని వెల్లడించారు. ఒకప్పుడు చూపు లేకపోవడం వల్ల ఉద్యోగం ఇవ్వని వారు సైత శభాష్ భాటియా అని పొగుడుతున్నారు. 'నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మాట ఖచ్చితంగా భాటియాకు సరిపోతుంది. -
చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ
క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు. పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్హామ్లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు. బర్మింగ్హామ్లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది. మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు. బ్లూస్మార్ట్ ఆలోచన.. రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్ను లాస్ వెగాస్లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు. 2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది. -
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. కొందరికి వ్యాపారాలు వారసత్వంగా వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభమవుతారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు 'దేవిత సరఫ్' (Devita Saraf). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది. దేవిత సరఫ్ తండ్రి రాజ్కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది. -
చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!
ఓ వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందంటే.. దాని వెనుక అంత పెద్ద సాహసం చేసి ఉంటాడని అర్థం. జీవితంలో ఎన్నెన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని నిలబడగలిగితే విజయం వాడి సొంతమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'చందూభాయ్ విరానీ' (Chandubhai Virani). క్యాంటిన్లో పనిచేసే స్థాయి నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు? దాని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గుజరాత్లోని జామ్నగర్ రైతు కుటుంబంలో జన్మించిన 'చందూభాయ్' కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఆ తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో తన సోదరులతో కలిసి తండ్రి వద్ద రూ. 20000 తీసుకుని ఉన్న ఊరు వదిలి రాజ్కోట్కు వెళ్లారు. అక్కడ వ్యవసాయ సామాగ్రిని విక్రయించే వ్యాపారం మొదలుపెట్టి, సక్సెస్ కాలేకపోయారు. వ్యాపారం దివాళాతీసింది. దీంతో ఆ వ్యాపారం వదిలేయాల్సి వచ్చింది. క్యాంటీన్లో ఉద్యోగం.. వ్యాపారంలో నష్టపోయామని దిగులు చెందక ఇంకా ఏదో చేయాలనే తపనతో ఒక సినిమా క్యాంటీన్లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ అతని జీతం రూ. 90 మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఎదగాలన్న ఆశను మాత్రం కోల్పోలేదు. దీంతో క్యాంటీన్లో ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవాడు. ఆ సమయంలో చందూభాయ్, అతని కుటుంబ సభ్యులు తమ అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు. తాను ఉంటున్న రూమ్ రెంట్ రూ.50 చెల్లించలేక గది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది అతని జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. బాలాజీ వేఫర్స్.. క్యాంటీన్లో పనిచేసుకుంటున్న సమయంలో చందూభాయ్, అతని సోదరులకు నెలకు రూ. 1000 విలువ చేసే కాంట్రాక్ట్ ఒకటి లభించింది. దీంతో వారు ఒక చిన్న షెడ్ నిర్మించి, అక్కడ నుంచే చిప్స్ తయారు చేయడం ప్రారంభించి 'బాలాజీ వేఫర్స్' అనే పేరుతో విక్రయించడం స్టార్ట్ చేశారు. సినిమా థియేటర్, చుట్టుపక్కల వేఫర్లను విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభంలో అనుకున్నంత ఆదరణ పొందలేకపోయినా.. క్రమంగా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ బాలాజీ వేఫర్స్ విస్తరణ ప్రారంభమైంది. 1995లో ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి! ఓ చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం గుజరాత్ , రాజస్థాన్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్లలో అతి పెద్ద స్నాక్స్ మ్యానుఫ్యాక్చరర్గా అవతరించి భారతదేశంలో అతిపెద్ద వేఫర్ బ్రాండ్గా నిలిచింది. 2021 ఆర్ధిక సంవత్సరం కంపెనీ విలువ ఏకంగా రూ. 4000 కోట్లు అని సమాచారం. -
ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'రాధికా గుప్తా' షార్క్ ట్యాంక్ ఇండియా 3 (Shark Tank India 3) ప్యానెల్లో నమితా థాపర్, వినీతా సింగ్, పీయూష్ బన్సాల్, అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్లతో కలిసి కనిపించనున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 3 లో కనిపిస్తున్న రాధికా గుప్తా ఎవరు? ఆమె బ్రాగ్రౌండ్ ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్తగా ఎలా ఎదిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అతి తక్కువ వయసులోనే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎదిగిన రాధికా.. ఒకానొక సమయంలో ఉద్యోగం రాక చనిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.స్నేహితురాలు కాపాడటంతో బ్రతికి ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. పాకిస్తాన్లో జన్మించిన రాధికా ఆమె కుటుంబంతో కలిసి ఖండాంతరాలు దాటింది. పుట్టుకతోనే సమస్యలున్న ఆమె మెడ విరిగిపోవడంతో తలా కొంత వంగిపోయింది. చదువుకునే రోజుల్లో చాలామంది ఎగతాళి చేసేవారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 2005లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ - ది వార్టన్ స్కూల్ నుంచి ఎకనామిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో ఏడు ఉద్యోగాలకు అప్లై చేసింది, కానీ ఒక్క ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, స్నేహితురాలు కాపాడింది. ఆ తరువాత చాలా రోజులు నాలుగు చక్రాల కుర్చీకే పరిమితమైంది. 25 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చిన రాధికా తన భర్త, ఫ్రెండ్తో సొంతంగా అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్! ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్కి కొత్త సీఈవో ఎంపిక సమయంలో కొంత భయపడినప్పటికీ భర్త ప్రోత్సాహంతో 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈవోలలో ఒకరిగా బాధ్యతలు చేపట్టింది. ఒకప్పుడు లోపాన్ని చూసి ఎగతాళి చేసిన వారు ఎందరో ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెట్టారు. #SharkReveal ⚡🥁Drumrolls & Trumpets 🎺⚡ Presenting the new Shark Radhika Gupta, MD & CEO, Edelweiss Mutual Fund. ✨ Stay tuned for more exciting updates!#SharkTankIndia Season 3 streaming this January on Sony LIV#SharkTankIndiaOnSonyLIV pic.twitter.com/kAcM7Rt6cx — Shark Tank India (@sharktankindia) November 4, 2023 -
రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్లు ఈ రోజు అంతరిక్షానికి కూడా వెళ్లి వచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మహిళలు ఎంతగా ఎదిగారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంతోమంది స్త్రీలు తమ ఆలోచనలతో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు మామా ఎర్త్ కో ఫౌండర్ 'గజల్ అలఘ్' (Ghazal Alagh). ఈ కథనంలో గజల్ ఎవరు? ఆమె సాధించిన సక్సెస్ ఏంటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హర్యానాలో జన్మించిన ఈమె 2010లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ, 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్లో ఫిగరేటివ్ ఆర్ట్లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది. మామా ఎర్త్ ప్రారంభం నిజానికి 2008 నుంచి 2010 వరకు ఎన్ఐఐటీ లిమిటెడ్లో కార్పొరేట్ ట్రైనర్గా పనిచేస్తూ.. కొందరికి సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ అందించింది. చదువు పూర్తయ్యి పెళ్లయిన తరువాత 2016లో తన భర్త 'వరుణ్ అలఘ్'తో కలిసి 'మామా ఎర్త్' ప్రారంభించింది. మామా ఎర్త్ ద్వారా గజల్ అలఘ్ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ క్రీమ్లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్లు, బాడీ వాష్లు, డైపర్లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ఉత్పత్తులు ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందగలిగాయి. రూ. 9800 కోట్లు గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద రూ. 9,800 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్ వీకెండ్ కార్పోరేట్ ట్రైనర్గా మొదట సంపాదించిన డబ్బు కేవలం 1,200 రూపాయలు మాత్రమే, దాంతో మా అమ్మను షాపింగ్కి తీసుకెళ్ళడం ఎప్పటికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఎక్స్లో ఇటీవలి పోస్ట్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన గజల్ అలఘ్ 'షార్క్ ట్యాంక్ ఇండియా' రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె మొత్తం ఆస్థి విలువ వంద కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది. My first income was modest, earning Rs 1200/day as a weekend corporate trainer. I recall the joy of taking my mom shopping and sharing a memorable dinner. What about you? How did you use your first earnings? — Ghazal Alagh (@GhazalAlagh) October 16, 2023 -
మెకానిక్ నుంచి వేలకోట్లు.. బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్స్..!!
మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంతోమంది నిరూపించారు. ఇప్పటికి కూడా చాలామంది సాధారణ పౌరుల నుంచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు కేరళలో జన్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన 'జార్జ్ వి నేరేపరంబిల్' (George V Nereamparambil). ఇంతకీ ఈయనెవరు, సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ తన 11 ఏళ్ల వయసు నుంచి తన తండ్రికి వాణిజ్య పంటల వ్యాపారంలో సహాయం చేశాడు. అంతే కాకుండా మార్కెట్కు వస్తువులను రవాణా చేయడం.. బేరం చేయడం వంటివి చేసేవాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈయన కొంత కాలం మెకానిక్గా కూడా పనిచేశాడు. ఆ తరువాత 1976లో షార్జాకు రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో ఎడారి వేడికి తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ రంగం పురోగతి సాధిస్తుందని గ్రహించాడు. ఈ ఆలోచనే నేడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పిలిచే ఒక భారీ సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ రోజు గల్ఫ్ ప్రాంతంలో ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో 'జార్జ్ వి నేరేపరంబిల్' ఒకరుగా పాపులర్ అయ్యాడు. ఈ రోజు బుర్జ్ ఖలీఫాలో ఏకంగా 22 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా జార్జ్ అపార్ట్మెంట్ల గోడలు, సీలింగ్లు, అంతస్తులు బంగారంతో చేసిన డెకర్తో కప్పబడి ఉన్నట్లు నివేదించారు. మొత్తం సంపద నిజానికి ఒకప్పుడు తన బంధువుల్లో ఒకరు నువ్వు బుర్జ్ ఖలీఫాలో ప్రవేశించలేవని ఆటపట్టించాడు, కానీ 2010లో జార్జ్ ఆ భవనంలో ఒక అపార్ట్మెంట్ని అద్దెకు తీసుకోగలిగాడు. ప్రస్తుతం ఏకంగా 22 అపార్ట్మెంట్లను కొన్నట్లు చెబుతారు. భవిష్యత్తులో మరిన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నట్లు, ఈయన మొత్తం ఆస్తి రూ. 4800 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా అందించే 900 అపార్ట్మెంట్లలో దాదాపు 150 అపార్ట్మెంట్లలో భారతీయులే ఉన్నారని చెబుతారు. అందులో కూడా ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగిన వ్యక్తి నేరేపరంబిల్ కావడం విశేషం. ఒకప్పుడు మెకానిక్గా పనిచేసి నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యాడంటే దీని వెనుక అతని కృషి ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. -
నేటి తరానికి ఆదర్శం.. బిల్ కమ్మింగ్స్ సక్సెస్ స్టోరీ!
Bill Cummings Success Story: మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కలలు కంటారు. ఆ కలలు నిజం కావాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి పైకొచ్చినవారిలో ఒకరు 'బిల్ కమ్మింగ్స్' (Bill Cummings). ఈ కథనంలో ఈయన ఎలా సక్సెస్ సాధించాడు, ప్రారంభంలో ఏమి చేసేవాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో నివసిస్తున్న బిల్ కమ్మింగ్స్ ప్రస్తుతం బిలినీయర్స్ జాబితాలో ఒకరు. ఈయన 50 సంవత్సరాల క్రితమే బిలియన్ డాలర్స్ కంపెనీ ప్రారంభించి బోస్టన్ రియల్ ఎస్టేట్ రాజుగా నిలిచాడు. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన సక్సెస్ కాదు. చిన్న ఇంట్లో.. బిల్ కమ్మింగ్స్ పుట్టుకతోనే కుబేరుడు కాదు, ఒకప్పుడు తల్లిదండ్రులు, సోదరితో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. ఆ తరువాత వ్యాపార రంగంలో అడుగు పెట్టి దినదినాభివృద్ధి చెందిన బిలినీయర్స్ జాబితాలోకి చేరిపోయాడు. బిల్ కమ్మింగ్స్ జీవితం నేటికీ ఎంతోమందికి ఆదర్శం. నేడు కుబేరుడైనప్పటికీ డబ్బును ఊరికే వృధాకానివ్వడు, అతని భార్య కూడా పెద్దగా విలాసవంతమైన జీవితం ఆశించదు. ఇప్పటికి కూడా వారు తమ ఖర్చును తగ్గించుకోవడానే చూస్తారు. దీనికి ప్రధాన కారణం చిన్నప్పుడు తల్లిదండ్రులు తక్కువ ఖర్చుపెట్టాలని అతని నేర్పిన పాఠమే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు ఇప్పటికి కూడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి, కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదని విశ్వసిస్తాడు. అంతే కాకుండా హార్డ్ వర్క్, సాధించాలనే కోరిక, అంకిత భావం చాలా ముఖ్యమని చెబుతాడు. ఒక రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించాలి, వాటిని పరిష్కరించుకోవాలి. ఇది సక్సెస్ సాధించడానికి చాలా ముఖ్యమైన అంశం. ఇదీ చదవండి: వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో వెనుక పడిన భారత్ ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా ఇప్పటికీ బిల్ కమ్మింగ్స్ తన సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడడు. తన రంగంలో విజయాన్ని కొనసాగిస్తూ ఒక బుక్ కూడా రాసారు. ఇది నేటి తరం యువతకు తప్పకుండా ఉపయోగపడుతుంది. -
కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ అదుర్స్!
అందాల ప్రపంచంలో జుట్టుకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. చాలా మంది భారతీయ మహిళలకు జుట్టు రాలడం, పొట్టి కేశాలు అనేవి తీవ్రవైన సమస్యలు. ఈ నేపథ్యంలో ఇటీవల హెయిర్ ఎక్స్టెన్షన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రహస్యాన్ని గ్రహించిన హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. రిచా గ్రోవర్ భద్రుకా (Richa Grover Badruka), రైనా గ్రోవర్ (Raina Grover).. హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు. భారత్లో హెయిర్ ఎక్స్టెన్షన్లకు పెరుగుతున్న డిమాండ్ను అర్థం చేసుకున్నారు. 2019లో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీగా తమ బ్రాండ్ ‘1 హెయిర్ స్టాప్’ (1 Hair Stop)ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 2-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డర్ల సంఖ్య 130-150కి పెరిగింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వీరి బిజినెస్ ఈ ఏడాది రూ. 31 కోట్లు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది. అదే ప్రేరణ మహిళల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారాలు మార్కెట్లో లేవని తాము గ్రహించామని, 1 హెయిర్ స్టాప్తో నిజమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిచా గ్రోవర్ భద్రుకా చెబుతున్నారు. భారత్ గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో అంతరాన్ని గుర్తించడంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకంగా అధిక-నాణ్యత జుట్టు ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అని ఆమె పేర్కొంటున్నారు. కలిసొచ్చిన తండ్రి వ్యాపారం ఈ సిస్టర్స్ బిజినెస్ ప్రయాణంలో తమ వ్యక్తిగత నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో పెరిగిన రిచాకు చిన్నప్పటి నుంచి అందం, ఫ్యాషన్పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఒకటిన్నర దశాబ్దం పాటు జుట్టు వ్యాపారంలో ఉండటం కూడా ఆమె సంకల్పానికి కలిసొచ్చింది. చదువును పూర్తి చేసిన తర్వాత రిచా కుటుంబ వ్యాపారంలో చేరారు. భారతీయ మార్కెట్కు నేరుగా సేవలందించే లక్ష్యంతో 2019లో ‘1 హెయిర్ స్టాప్’ను ప్రారంభించే ముందు ఆమె మొదట్లో హోల్సేల్ ఎగుమతులపై దృష్టి సారించారు. స్టార్టప్గా ప్రారంభమై.. స్టార్టప్గా ప్రారంభమైన ‘1 హెయిర్ స్టాప్’ మంచి వృద్ధిని సాధించింది. నేడు ఆధిపత్య పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. ప్రారంభంలో రోజుకు కేవలం 1-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-160 ఆర్డర్లు వస్తున్నాయి. ప్రారంభ రోజులలో కేవలం రూ. 10,000 మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ కోసం నెలకు రూ. 10-16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారి బిజినెస్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఉత్పత్తులను బయటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 1 హెయిర్ స్టాప్ ఆదాయంలో 75 శాతం భారత్ నుంచి వస్తుంటే మిగిలినది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి వస్తోంది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు 1 హెయిర్ స్టాప్ ఇప్పటివరకూ 1.2 లక్షలకు పైగా ఆర్డర్లను అందుకుంది. 2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించింది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు దాటాయి. 2022 ఆ సంస్థకు అత్యంత లాభదాయకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో కంపెనీకి 47,000 ఆర్డర్లు రాగా 90,000 ఉత్పత్తులను విక్రయించింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ట్రెండ్కు అనుగుణంగా ఉత్పత్తులు కొత్త తరం అమ్మాయిలు హెయిర్స్టైల్తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్ ట్రెండ్, బార్బీ కోర్ ఈస్తెటిక్ హెయిర్ స్టైల్స్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ హెయిర్ ఎక్స్టెన్షన్లు అవసరం. దీనికి అగుణంగా 1 హెయిర్ స్టాప్ పోర్ట్ఫోలియోలో కలర్ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ని ప్రారంభించడం ద్వారా ఆఫ్లైన్ స్పేస్లోకి ప్రవేశించాలని 1 హెయిర్ స్టాప్ యోచిస్తోంది. అదనంగా బ్రాండ్ తన హెయిర్కేర్ శ్రేణిని విస్తరించడం, సెలూన్ నెట్వర్క్లతో సహకారాన్ని అన్వేషించడం, సెమీ-పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేయడంపై దృష్టి సారించింది. -
12 ఏళ్లకే పెళ్లి, అత్తింటి వేధింపులు.. నేడు వందల కోట్ల సంపదకు..
Success Story Of Kalpana Saroj: చిన్నతనం నుంచే ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు 'కల్పనా సరోజ్' (Kalpana Saroj). 12 సంవత్సరాల వయసుకే పెళ్లి చేసుకుని అత్తింటి వేధింపులు పడలేక చనిపోవాలనుకున్న మహిళ ఈ రోజు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1961లో మహారాష్ట్రలోని అకోలాలోని రోపర్ఖేడా గ్రామంలో జన్మించిన 'కల్పనా సరోజ్' తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఈమెకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. వివాహం తరువాత ఆమె భర్త కుటుంబంతో ముంబైలోని ఒక మురికివాడలో నివసించింది. అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ తరువాత భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళింది. కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. అది కూడా విఫమైంది. ఆ తరువాత వారి బంధువుల ఇంట్లో ఉంటూ నెలకు రూ. 60 జీతానికి ఒక సంస్థలో చేరింది. ఆ తరువాత అదనంగా రూ. 100 సంపాదించడం ప్రారంభించింది. ఆ తరువాత పట్టు వదలకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ప్రభుత్వ సాయంతో రూ.50,000 పొంది సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆ తరువాత KS ఫిల్మ్ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. పరిచయాలను ఏర్పరచుకోవడం ద్వారా, ఆమె రియల్ ఎస్టేట్ సంస్థను పెంచుకుంటూ 'కమానీ ట్యూబ్స్'ప్రారంభించింది. ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి! కమనీ ట్యూబ్స్.. ప్రారంభంలో కమనీ ట్యూబ్స్ గణనీయమైన నష్టాలను చవిచూసినప్పటికీ, కల్పనా సరోజ్ తెలివితేటలతో లాభాల బాట పట్టించింది. ప్రస్తుతం ఈ సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతోంది. అంతే కాకుండా ఈమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో సభ్యురాలు కూడా. కల్పనా సరోజ్ ఆస్తులు విలువ 112 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 930 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. ఎన్నో కష్టనష్టాలు చవిచూసి మిలినియర్ స్థాయికి చేరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినా ఈమెను 'నిజమైన స్లమ్డాగ్ మిలియనీర్' అని పిలుస్తారు. కల్పనా సరోజ్ 2013లో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పొందింది. అంతే కాకుండా ఈమె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో ఒకరుగా ఉన్నారు. కేవలం రోజుకు రూ. 2 సంపాదించే స్థాయి నుంచి వందలమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఈమె ప్రతి మహిళకు ఆదర్శనీయమనే చెప్పాలి. -
తల్లి పనిమనిషి, కూలీపనులు చేసిన కొడుకు.. ఇప్పుడు ముఖేష్ అంబానీకంటే..
'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. చిన్నప్పుడే తండ్రి మరణం.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు. తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్షాప్ను స్టైలిష్ హెయిర్ సెలూన్గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు. ట్రావెల్ కంపెనీ.. 1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్! రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భువన్ బామ్ యూట్యూబ్లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియన్గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు. స్పూప్ వీడియోలు.. బీబీ కి వైన్స్ సిరీస్లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం. వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించాడు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది. -
రూ.20 వేలతో మొదలు.. 3వేల మందికి ఉపాధి.. వారెవ్వా వందన
ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. తప్పకుండా కృషి, పట్టుదల చాలా అవసరం.. అప్పుడే అనుకున్నది సాధించడం సాధ్యమవుతుంది, ఇదే విజయ రహస్యమంటే! ఆధునిక కాలంలో వ్యాపార రంగాల్లో పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో 'వందన లూత్ర' (Vandana Luthra) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1959 జులై 12న ఢిల్లీలో మంచి పలుకుబడి కలిగిన కుటుంబంలో వందన జన్మించింది. తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి మెకానికల్ ఇంజినీర్. ఈమె ఢిల్లీలో పాలిటెక్నిక్ పూర్తి చేసి.. ఆ తరువాత జర్మనీలో కాస్మెటిక్ అండ్ న్యూట్రిషన్ వంటి వాటి గురించి తెలుసుకుంది. ఆ సమయంలో సౌందర్య పరిశ్రమల గురించి తెలుసుకుని బ్యూటీ పరిశ్రమలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. రూ. 20వేలతో ప్రారంభం.. అనుకున్న విధంగానే తన భర్త ముఖేష్ లూత్రా సహకారంతో రూ. 20000తో ఢిల్లీలో 'లూత్ర కర్ల్స్ అండ్ కర్వ్స్' (VLCC) ప్రారంభించింది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ నేడు కంపెనీ విలువ రూ. 2225 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే వందన లూత్ర ఎంతగా అభివృద్ధి చెందిందని విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని సుమారు 139 నగరాలలో ప్రాచుర్యం పొందాయి. ప్రపంచం మొత్తం మీద దదాపు 12 దేశాలకు వీరి సంస్థ విస్తరించింది. కాగా బ్యూటీ & వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? ఒక చిన్న సంస్థగా అవతరించిన 'వీఎల్సీసీ' నేడు ఒక పాపులర్ కంపెనీగా ఎంతోమందికి ఉపాధి అందిస్తూ.. ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 3000 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 75 శాతం కంటే ఎక్కువ మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. -
ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలామంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్'. మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో ఆటోమొబైల్ ఇంజనీర్గా పని చేసేవాడు. హార్టికల్చర్.. ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్హౌస్లో పండ్లు, కూరగాయలను పండించాడు. ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. ఇక ప్రమోద్ గౌతమ్ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు. (Disclaimer: వ్యవసాయం అనేది అందరికి లాభాలను తెచ్చిపెట్టకపోవచ్చు, కావున ఉద్యోగాలు వదిలి ఇలాంటివి చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి సాహసాలు చేయాలనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.) -
ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే?
ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే కసి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరం. అయితే ఉన్నతమైన చదువులు, డాక్టరేట్లు మాత్రమే సక్సెస్ తీసుకువస్తాయనేది అపోహ మాత్రమే అంటున్నారు కొంతమంది నిపుణులు. మనం ఈ కథనంలో కాలేజ్ డ్రాపౌట్ అయిన ఒక వ్యక్తి దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 'RG చంద్రమోగన్' ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ భారతదేశంలోని బిలినీయర్ల జాబితాలో ఈయన ఒకరు. చంద్రమోగన్ బాల్యం మొత్తం తమిళనాడులోని చెన్నైలో గడిచిపోయింది. చిన్నప్పటి నుంచే లెక్కల మీద మంచి పట్టు ఉండటంతో అందరూ ఇతన్ని 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలిచేవారు. గణితంలో ఎంత పట్టు ఉన్నా.. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల 21 సంవత్సరాల వయసులోనే చదువుకు దూరమయ్యాడు. తన తండ్రి చిన్న ప్రొవిజనల్ స్టోర్ నడిపేవాడు, కానీ చంద్రమోగన్ అదికాదని ఒక టింబర్ డిపోలో కేవలం రూ. 65 జీతానికి ఉద్యోగం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తరువాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాడు. కేవలం రూ. 13,000తో ప్రారంభమైన ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభంలో కొంత నష్టాలను చవిచూసింది. అప్పట్లో 15 తోపుడు బండ్ల మీద వ్యాపారం ప్రారంభించి మొదటి ఏడాదిలో రూ. 1.5 లక్షలు రావడంతో చంద్రమోగన్కు వ్యాపారం మీద కొంత నమ్మకం కలిగింది. 1981లో చిన్న పట్టణాలలో వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. ఇదే ఆయన పురోగతికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇదీ చదవండి: నెహ్రూ ఐడియా & జెఆర్డీ టాటా విజన్తో పుట్టిన కంపెనీ ఇదే! ఐస్ క్రీమ్ బిజినెస్ రోజురోజుకి వృద్ధి చెందుతూ 'అరుణ్' ఐస్ క్రీమ్ పేరుతో తమిళనాడులో మంచి ప్రజాదరణ పొందాడు. 1986లో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ పేరుతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా ప్రతిరోజూ 10,000 గ్రామాలలో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు! ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం RG చంద్రమోగన్ నేడు రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. అతని కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రమోగన్ ఛైర్మన్గా ఉండగా, ఆయన కుమారుడు సి సత్యన్ ఇప్పుడు హ్యాట్సన్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. -
రూ. 600 జీతం.. ఐఏఎస్ కొడుకు - ఎవరీ అజయ్ చౌదరి!
HCL Co Founder Ajai Chowdary Success Story: ఈ రోజు మనకు 'ఫాదర్ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ ఇండియా' అని చెప్పగానే 'అజయ్ చౌదరి' గుర్తుకు వస్తారు. అయితే ఈయన ఎవరు? ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి ఎదగటానికి చేసిన కృషి ఏమిటి? ఆయన సంపాదన వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 600 జీతానికి.. నిజానికి 'అజయ్ చౌదరి' ఒక ఐఏఎస్ అధికారి కొడుకు, ఇతడు ఒకప్పుడు రూ. 600 జీతానికి ఉద్యోగం చేసాడు. అయితే ఈ రోజు భారతదేశ ఐటి రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి శరణార్థి శిబిరంలో నివసించిన కుటుంబానికి చెందిన అజయ్ చౌదరి ఈ రోజు కోటీశ్వరుల జాబితాలో ఒకరుగా నిలిచారు. జబల్పూర్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చౌదరి తన కెరీర్ను ప్రారంభించాడు. మైక్రో కాంప్ ప్రారంభం.. భారతీయ సాంకేతిక విప్లవంలో అతిపెద్ద వాటాదారులలో ఒకరుగా ఎదిగిన చౌదరి DCM డేటా ఉత్పత్తుల విక్రయాలలో వృత్తిని ప్రారంభించిన తరువాత నాడార్ & మల్హోత్రాతో ఏర్పడ్డ పరిచయం ఈయన జీవితాన్ని మార్చివేసింది. వీరు మొదటి స్టార్ట్ చేసిన కంపెనీకి 'మైక్రో కాంప్' అని పేరుపెట్టారు. ఆ తరువాత వీరు 1970లో హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్కి మరింత చిన్నగా 'HCL' అని నామకరణం చేశారు. ఇదీ చదవండి: ఆలోచన ఏదైనా ఇట్టే పట్టేస్తుంది.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో ఏఐ ముందడుగు! అంతర్జాతీయ విస్తరణ.. కేవలం రూ. 1.8 లక్షలతో ప్రారంభమైన హెచ్సీఎల్ నేడు ఏకంగా రూ. 3,20,000 కోట్ల మార్కెట్ క్యాప్తో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో విక్రయాలకు సంబంధించి చౌదరి నాయకత్వం వహించారు. ఆ తరువాత అనతి కాలంలోనే అంతర్జాతీయంగా విస్తరించారు. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన పద్మభూషణ్.. 1999 - 2012 మధ్య హెచ్సిఎల్ ఛైర్మన్గా కూడా అజయ్ చౌదరి పనిచేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ పాట్నా వంటి సంస్థల బోర్డుల్లో పనిచేశారు. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ఛైర్మన్గా.. ఐటీ మంత్రిత్వ శాఖ కోసం సెమీకండక్టర్ల సలహా బోర్డులో సభ్యుడుగా కూడా పనిచేశాడు. 2011లో భారత ప్రభుత్వం ఈయన సేవలకుగాను పద్మభూషణ్ అవార్డుని అందించింది. -
ఈయన జీతం రోజుకు రూ. 72 లక్షలు కంటే ఎక్కువ!
ఇప్పటివరకు మనం గతంలో చాలా మంది సక్సెస్ పీపుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో విశిష్టమైన పేరు, తన అద్భుతమైన విజయాల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'అనిరుధ్ దేవగన్' (Anirudh Devgan) గురించి తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, అనిరుధ్ దేవగన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ పూర్వ విద్యార్ధి. ఈయన ప్రస్తుతం ప్రముఖ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రెసిడెంట్, సీఈఓ అండ్ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన అనిరుధ్ అసాధారణ విజయాలు అతని దూరదృష్టి గల నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రఖ్యాత సంస్థను నడిపిస్తూ.. తన రంగంలో అసమానమైన విజయాలతో చెరగని ముద్ర వేసి, అతని అనుభవం, గొప్ప నైపుణ్యంతో పాటు కంపెనీ పథాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఇదే అతని వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించింది. చివరికి అతని డొమైన్లో అతనిని ప్రముఖ వ్యక్తిగా మార్చింది. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు! నిజానికి 2012లో అనిరుధ్ దేవగన్ కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్లో చేరి అనేక స్థానాల్లో పనిచేశాడు. కాగా 2017లో చివరకు కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు. 2021లో అతనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో స్థానం లభించింది. ఆ తరువాత సీఈఓ అయ్యాడు. అనిరుధ్ ఢిల్లీలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో MS & PhD పూర్తి చేశాడు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! కొన్ని నివేదికల ప్రకారం, 2022లో కాడెన్స్ సీఈఓ అయిన అనిరుధ్ దేవగన్ వార్షిక వేతనం రూ. 2,201 కోట్లు (సుమారు $264 మిలియన్లు) అని తెలుస్తోంది. ఈయన జీతం రోజుకి రూ.72 లక్షల కంటే ఎక్కువ అని చెబుతారు. దీంతో ఎక్కువ వేతనం తీసుకుంటున్న అమెరికన్ సీఈఓల జాబితాలో ఈయన కూడా ఒకరుగా ఉండటం గమనార్హం. -
ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
Sonalika Tractors Founder Success Story: జ్ఞానం పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేనట్లుగానే.. ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి కూడా వయసుతో పని లేదు. పిల్లాడి దగ్గరి నుంచి వయసుడిగిన వృద్దులు వరకు తమదైన ఆలోచనలతో ఎవరైనా విజయం సాధించవచ్చు. అలాంటి కోవకు చెందిన 'లచ్మన్ దాస్ మిట్టల్' (Lachhman Das Mittal) గురించి ఈ కథనంలో తెలుసుసుకుందాం. 60ఏళ్ల వయసులో కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి బయటకు వచ్చిన తరువాత ఓ కొత్త రంగానికి పునాది వేసాడు. అదే సోనాలిక (Sonalika) ట్రాక్టర్స్. 60ఏళ్ల వయసులో కంపెనీ ప్రారంభించి ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీదారులలో ఒకరుగా నిలబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఆయన కృషి, పట్టుదల మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సోనాలికా ట్రాక్టర్.. నివేదికల ప్రకారం, 1990లో తన వ్యాపార వృత్తిని ప్రారంభించిన మిట్టల్ 1995లో పంజాబ్లో సోనాలికా ట్రాక్టర్లను మొదలెట్టాడు. ఇదే ప్రస్తుతం భారతదేశపు మూడవ అతిపెద్ద ట్రాక్టర్ ఉత్పత్తిదారుగా.. ఏడాది 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతిదారుల జాబితాలో అగ్రగామిగా నిలిచింది. దీని వాటా ఏకంగా 11.7శాతం కావడం గమనార్హం. పెద్ద ఎదురు దెబ్బ.. ఎల్ఐసీతో కలిసి పని చేయడం ద్వారా లక్మన్ దాస్ మిట్టల్ పొదుపు, పెట్టుబడి గురించి అవగాహన పొందాడు. దీంతో తన డబ్బును బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసుకోకుండా అనేక స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత సైడ్ వెంచర్గా వ్యవసాయ పరికరాల కంపెనీ స్టపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పెట్టుబడులు అన్నీ పోయాయి. ఇదీ చదవండి: పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా? 74 దేశాలకు ఎగుమతి.. భారీ నష్టాలను చవి చూసినప్పటికీ మిట్టల్ పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా ఒకసారి గోధుమ, ఎండుగడ్డిని వేరు చేసే యంత్రం గమనించాడు. దీంతో అతనికి కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగా నూర్పిడి యంత్రాలు నిర్మించడం ప్రారంభించాడు. ఇవి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఊహకందని విజయం పొందింది. ఆ తరువాత ట్రాక్టర్లను నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సోనాలిక ట్రాక్టర్లు 74 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు! నికర విలువ.. సోనాలికా ట్రాక్టర్స్ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ బాధ్యతలు మిట్టల్ కుమారులు అమృత్ సాగర్, దీపక్, మనవళ్లు రామన్, సుశాంత్ అండ్ రాహుల్లకు అప్పగించారు. ఫోర్బ్స్ ప్రకారం లచ్మన్ దాస్ మిట్టల్ నికర విలువ రూ. 23,000 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న కేషుబ్ మహీంద్రా మరణించిన తర్వాత, మిట్టల్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్గా ఖ్యాతి పొందాడు. -
ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!
Rameshwaram Cafe Founder Success Story: ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించాలంటే దాని వెనుక కంటికి కనిపించని యుద్ధమే చేసి ఉండాలి. అప్పుడే ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలరు.. నిలదొక్కుకోగలరు. ఇలాంటి కోవకు చెందిన వారిలో బెంగళూరుకు చెందిన 'దివ్య' ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, అప్పుడే అనుకున్నది చేయవచ్చని తల్లితండ్రులు చెప్పిన మాటలు తు.చ తప్పకుండా పాటిస్తూ సీఏ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను, లెక్కకు మించిన సవాళ్ళను ఎదుర్కొంది. ఖర్చుల కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సిన రోజులు, రోజుకి రెండు మూడు బస్సులు మారాల్సిన పరిస్థితులు అనుభవించింది. అనుకున్న విధంగానే సీఏ పూర్తి చేసింది. సీఏ పూర్తి చేసి.. తన కుటుంబంలో సీఏ పూర్తి చేసిన మొదటి వ్యక్తి 'దివ్య' కావడం గమనార్హం. అంతే కాకుండా ఈమె IIM అహ్మదాబాద్లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో సభ్యురాలిగా కొనసాగుతోంది. కాగా ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనే కోరికతో ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని యోచించింది. రామేశ్వరం కెఫే.. చదువుకునే రోజుల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆహార సంస్థలు మంచి లాభాలను తీసుకొస్తాయని గ్రహించి, దక్షిణ భారతదేశ రుచులను అందరికి అందేలా చేయడానికి కంకణం కట్టుకుంది. ఈ ఆలోచనను తన అమ్మతో చెప్పింది. ఇది విన్న దివ్య తల్లి మేము కస్టపడి సీఏ చదివిస్తే.. ఇడ్లీ, దోశలు అమ్ముతావా అని చీవాట్లు పెట్టింది. తన నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ పట్టు వదలకుండా తన భర్త రాఘవేంద్ర రావుకి పెళ్లికి ముందు నుంచే ఈ వ్యాపారం మీద కొంత అనుభవం ఉండటం వల్ల 2021లో 'రామేశ్వరం కెఫే' ప్రారంభించింది. ప్రారంభంలో రెండు బ్రాంచీలతో మొదలైన వీరి వ్యాపారం, క్రమంగా వృద్ధి చెందింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) ప్రస్తుతం 'రామేశ్వరం కెఫే' ద్వారా ఇడ్లీ, దోశ, వడలు, పొందాలి, రోటీ వంటివి విక్రయిస్తూ బెంగళూరులో తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బెంగళూరులోని ఇతర కెఫేలు మాదిరిగా కాకుండా వీరు ఫ్రిజ్ వంటివి కూడా వాడరు, అందువల్ల పదార్థాలు ఎప్పుడు చాలా రుచికరంగా ఉంటాయని వినియోగదారులు చెబుతుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటున్నారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?) నెలకు రూ. 4.5 కోట్లు.. ప్రస్తుతం బెంగళూరులో నాలుగు కెఫేలు నడుపుతున్నారు, కాగా రానున్న రోజులో దేశం మొత్తం మీదనే కాకుండా విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు దివ్య చెబుతోంది. ఈమె అటు సీఏ కెరీర్ ఇటు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కొన్ని నివేదికల ప్రకారం నెలకు సుమారు రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ జరుగుతున్నట్లు సమాచారం. -
ఐఐటీ వదిలి కమెడియన్గా.. సంపాదన తెలిస్తే అవాక్కవాల్సిందే!
Biswa Kalyan Rath Success Story: ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తరువాత ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి సంపాదించడం ఆనవాయితీ. అలా కాకుండా ఆధునిక కాలంలో కొంతమంది ఐఐటీయన్లు తమకు నచ్చిన ప్రపంచంలో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'బిశ్వ కళ్యాణ్ రాత్' (Biswa Kalyan Rath). ఇంతకీ ఈయనెవరు? ఈయన సంపాదన ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిశ్వ కళ్యాణ్ రాత్ ఇండియన్ స్టాండ్-అప్ కమెడియన్, రచయిత అండ్ యూట్యూబర్. ఈయన తన తోటి హాస్యనటుడు కనన్ గిల్తో కలిసి యూట్యూబ్ కామెడీ సిరీస్, ప్రిటెన్షియస్ మూవీ రివ్యూస్ ద్వారా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా 2016 బ్రహ్మన్ నమన్ అనే నెట్ఫ్లిక్స్ కామెడీ చిత్రంలో ఒక పాత్ర కూడా పోషించాడు. ఆ తరువాత 2017లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ లాఖోన్ మే ఏక్ని సృష్టించాడు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) నిజానికి బిశ్వ కళ్యాణ్ రాత్ 2012లో ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేట్, ఆ తరువాత బయోటెక్నాలజీ పూర్తి చేసాడు. చదువు పూర్తయిన తరువాత గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ వంటి వాటిలో పనిచేసాడు. ఈ సమయంలోనే అతను 2013లో బెంగుళూరులో ఒక ఓపెన్ మైక్ ఈవెంట్లో కనన్ గిల్ను కలిసి 2014లో తన ఉద్యోగాన్ని వదిలి కమెడియన్గా మారాడు. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) బిశ్వ కళ్యాణ్ రాత్ కమెడియన్గా మారిన తరువాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ అండ్ కోల్కతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బిస్వా మస్త్ ఆద్మీ అనే పేరుతో కామెడీ షో కూడా ప్రారంభించాడు. మొత్తానికి ఐఐటీ వదిలి కమెడియన్గా స్థిరపడిన బిశ్వ నికర ఆస్తి విలువ రూ. 11 లక్షల నుంచి రూ. 67 లక్షల వరకు అని సమాచారం. కాగా పాణిగ్రాహి అంబర్ ధార, దో సహేలియాన్ వంటి షోలలో పాపులర్ అయిన 'సులంగ్నా'ను 2020లో వివాహం చేసుకున్నాడు. -
ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!
Headspace Founder Story: వాస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఒకటి గొప్ప వాణ్ణి చేస్తుంది.. లేదా పనికిరాకుండా పోయేలా కూడా చేస్తుంది. కన్నీటి సంద్రం నుంచి బయటపడి కోట్లు సంపాదనకు తెర లేపిన ఒక సన్యాసి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆత్మీయుల మరణం.. ఆండీ పూడికోంబే (Andy Puddicombe) అనే వ్యక్తి తాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలో స్నేహితులను, సైక్లింగ్ ప్రమాదంలో అతని సోదరిని కోల్పోయి జీవితం మీద విరక్తి పొందాడు. దుఃఖంతో నిండిన యితడు కాలేజీకి స్వస్తి పలికి నేపాల్ చేరుకున్నాడు. బౌద్ధ సన్యాసం స్వీకరించి ఆసియా అంతటా ఒక దశాబ్దం పాటు సంపూర్ణత, ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హెడ్స్పేస్ మెడిటేషన్ యాప్.. ధ్యానంతో జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చనే సత్యాన్ని గ్రహించి అందరికి పంచాలనే ఉద్దేశ్యంతో 2005లో యూకే నుంచి తిరిగి వచ్చిన తరువాత లండన్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఎప్పుడూ బిజీ లైఫ్ గడిపే ఎంతోమందికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఆ తర్వాత రిచర్డ్ పియర్సన్తో కలిసి 2010లో 'హెడ్స్పేస్' (Headspace) అనే మెడిటేషన్ యాప్ స్థాపించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది ఎంతో మంది ప్రజలకు ధ్యానం ప్రయోజనాలను గురించి వెల్లడిస్తుంది. మానసిక ఆరోగ్యం పట్ల వైఖరిని మార్చడంలో హెడ్స్పేస్ విస్తృత ఆదరణ పొందింది. జీవితంలోని గందరగోళాల మధ్య ప్రశాంతమైన అభయారణ్యంగా మారింది, మానసిక క్షేమం కోరుకునే వినియోగదారులను ఎంతోమందిని ఈ యాప్ ఆకర్షిస్తుంది. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) వేల కోట్ల సామ్రాజ్యం.. ఆధునిక కాలంలో నేడు ఈ యాప్ 4,00,000 మంది సబ్స్క్రైబర్లను 50 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. కేవలం బౌద్ధ సన్యాసి అయినప్పటికీ 250 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 2040 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కష్టతరమైన సమయాల్లో కూడా ఎలా విజయాలు అసాధించాలో తెలుసుకోవడానికి ఇదొక మంచి ఉదాహరణ. మొత్తం మీద వ్యక్తిగత విషాదం అతన్ని వేల కోట్లకు అధిపతిని చేసింది. -
11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!
సాధారణంగా ఫుడ్ కంపెనీ అనగానే చాలా మందికి డామినోస్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ అలాంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ బ్రాండ్ 'హల్దీరామ్' (Haldiram) గురించి బహుశా తెలియకపోవచ్చు. ప్రపంచంలో దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ గురించి.. దీనికి మూల కారకుడైన వ్యక్తి గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 'గంగ బిషన్ అగర్వాల్' (Ganga Bishan Agarwal) 1937లో బికనీర్లో చిన్న స్నాక్స్ వ్యాపారంగా మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని స్నాక్స్ ఫుడ్స్ వ్యాపారంలో రెండవ స్థానానికి చేరుకునేలా చేసాడు, అంటే దీని వెనుక ఉన్న అతని కృషి పట్టుదల స్పష్టంగా తెలుస్తాయి. నిజానికి ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, కుటుంబ కలహాలు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచమే గుర్తించే స్థాయికి ఎదిగింది. గంగ బిషన్ ఉరఫ్ అగర్వాల్ని తన తల్లి ముద్దుగా 'హల్దీరామ్' అని పిలుచుకునేది. ఆ పేరే తరువాత కంపెనీ బ్రాండ్గా మారింది. వీరి కుటుంబానికి చెందిన ఒక మహిళ తరచుగా బికనీరీ భుజియా తయారు చేసేదని, దాన్ని తన తల్లి ద్వారా బిషాన్ నేర్చుకున్నట్లు సమాచారం. భుజియాతో విజయం.. గంగా బిషన్ అగర్వాల్ 1919లో కేవలం 11 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించాలని కలలు కనేవాడు. చిన్న తనం నుంచి భుజియా తయారు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఎందుకంటే ఆ సమయంలో భుజియా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే వ్యాపారులు డబ్బు మీద పెట్టే ద్రుష్టి.. రుచి మీద పెట్టేవారు కాదు. కావున బిషన్ మార్కెట్లో మంచి రుచిని అందించే చిరుతిండి వ్యాపారాలను సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో అనేక ప్రయత్నాలు చేసి బికనీర్ ప్రజలు మునుపెన్నడూ రుచి చూడని కొత్త రకం భుజియాను రూపొందించడంలో అతను విజయం సాధించాడు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) కలకత్తాలో దుకాణం.. మార్కెట్లో మంచి పేరు సంపాదించిన తరువాత అమ్మకాల పరంగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అతడు ఏడు పదుల వయసులోనూ ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట, అంతే కాకుండా ఆయన ఒకసారి కోల్కతాలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక దుకాణం ఏర్పాటు చేయాలనుకుని, అక్కడ షాప్ ప్రారంభించారు. బికనీర్లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఈ విధంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆయన మనవళ్లు కూడా దీని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) 80 దేశాల్లో విక్రయాలు.. భారతదేశంలో నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లో వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వీరి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. హల్దీరామ్ బ్రాండ్లో వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్లను తయారు చేసేవారు. ఆ తరువాత రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ వంటివి కూడా ప్రారంభించారు. హల్దీరామ్ ప్రస్తుత చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్. ప్రస్తుతం వీరు రూ. వేల కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. -
ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఎలా అంటే?
మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు. కంప్యూటర్ పట్ల ఆకర్షణ.. చదువుకునే రోజుల్లోనే విజయ్ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చదువు పూర్తయిన తరువాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన.. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్కి మరింత గిరాకీ పెంచింది. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?) కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది. -
బ్యాంక్ ఉద్యోగం వదిలి కోట్లు సంపాదిస్తున్నాడిలా!
Amith Kishan Success Story: ఆధునిక పోటీ ప్రపంచంలో ఒకరి కంటే ఒకరు ముందుగా డెవలప్ అవ్వాలనే ఆలోచనల్లో పడి సంపాదన బాటలో పడి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలను వదిలి పెట్టి కేవలం డబ్బు వెంట పరుగెడుతూ తక్కువ వయసులోనే తనువు చాలిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా అందులోనే పడి బతికేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి బాగా సంపాదిస్తూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ అతడెవరు? అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. బ్యాంక్ ఉద్యోగం.. నివేదికల ప్రకారం, కర్ణాటక చిక్కబళ్ళాపూర్ ప్రాంతానికి చెందిన 'అమిత్ కిషన్' (Amith Kishan) చదువు పూర్తయిన తరువాత చాలా సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసాడు. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ, బజాజ్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి వాటిలో పనిచేశాడు. నిజానికి అమిత్ తాత గారు వ్యవసాయంలో దిట్ట, చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పలుకుబడి ఉండేది. ఈ కారణంగానే అమిత్ కిషన్కి కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతనికి వ్యవసాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. ''డబ్బు సంపాదిస్తున్నాము, కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నామనేది'' అతని మనసులో ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న. అదే సమయంలో అతని మిత్రుడు అనారోగ్యంతో చనిపోవడం అతన్ని మరింత కృంగదీసింది. ఉద్యోగానికి రాజీనామా.. సుమారు ఎనిమిది సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసిన అమిత్ వ్యవసాయం చేయడానికి ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఆ తరువాత తాతగారి ఊరిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. దీనికి అతని తమ్ముడు అశ్రిత్ చాలా సహకరించాడు. వీరిరువురు మిర్చి, వేరుశెనగ వంటి పంటలు చేయడం మొదలు పెట్టారు. అయితే సీజన్ల విషయంలో అవగాహన లేకపోవడంతో మొదట వైఫల్యమే ఎదురైంది. ఆ తరువాత వ్యవసాయం గురించి మరింత తెలుసుకోవడం ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం.. సేంద్రియ వ్యవసాయం చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు, కానీ దీని కోసం భూమిని నాలుగు అడుగులు తవ్వి అందులో రసాయనాలకు బదులు ఆవు పేడ, మూత్రం వంటి వాటితో పాటు అరటిపండు తొక్కలు కూడా వేసాడు. ఈ ఆలోచన చాలా బాగా సక్సెస్ అయింది. భూమిని సారవంతం చేయడంలో ఇది చాలా ఉపయోగపడింది. (ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!) సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించిన భూమిలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో రూ. 1.5 కోట్లతో సుమారు 15 ఎకరాల భూమితో ప్రారంభమైన వీరి వ్యవసాయం ఇప్పుడు ఏకంగా 600 ఎకరాలకు విస్తరించింది. వీరి పొలాల్లో ఉపయోగించడానికి సేంద్రియ ఎరువుల కోసం ఆవులు, గేదెలను కూడా వారే పెంచుతున్నారు. సుమారు ఇవన్నీ 700 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - మెటా థ్రెడ్స్లో యూట్యూబర్ హవా!) హెబ్పేవు ఫామ్స్ & సూపర్ మార్కెట్.. ఒక పక్క సేంద్రియ వ్యవసాయం, మరో వైపు పాల వ్యాపారం కూడా బాగా సాగింది. వీరి వ్యాపారానికి హెబ్పేవు ఫామ్స్, హెబ్పేవు సూపర్ మార్కెట్ అని పేరు పెట్టారు. వ్యవసాయం బాగా విస్తరించిన తరువాత వార్షిక ఆదాయం రూ. 21 కోట్లకు చేరింది. ప్రస్తుతం వీరి వద్ద 120 మంది వ్యక్తులతో ఒక టీమ్ ఉంది. అంతే కాకుండా వీరి వ్యవసాయ క్షేత్రంలో 3000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. హెబ్పేవు ఉత్పత్తులు బెంగళూరు వంటి నగరాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి. -
మందు మీద మోజు.. వైన్ బిజినెస్తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ
'ఆకాశంలో సగం' అంటూ పోవూరి లలిత కుమారి (ఓల్గా) రాసిన కవిత ఒకప్పుడు సంచలనం రేపింది. ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించాలని, పురుషాధిక్యం తగదని తన రచనల ద్వారా సమాజం మీద విరుచుకుపడిన విషయం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు. ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' (Zoya Vora Shah) మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) ఒక బ్రాంచ్తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే. (ఇదీ చదవండి: కుటుంబంలో 12 మంది డాక్టర్లు.. 16 సంవత్సరాలకే రికార్డు.. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..) ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. -
డాక్టర్ కాబోయి అసిస్టెంట్ కలెక్టర్.. అదీ తొలి ప్రయత్నంలోనే!
కష్టపడి చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలన్నది చాలామంది కల. ఐఏఎస్ చదవాలనుకున్న వారు దాన్ని సాధించి అక్కడితో ఆగిపోతారు. ఒక డాక్టర్ కావాలనుకున్న వారు డాక్టర్ అయితే చాలని అనుకుంటారు. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోయే వ్యక్తి ఐఏఎస్తోనో.. డాక్టర్తోనో ఆగిపోలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏమి సాధించాడు. ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తొలి ప్రయత్నంలోనే.. మనం చెప్పుకోబోయే వ్యక్తి జైపూర్ ప్రాంతానికి చెందిన 'రోమన్ సైనీ' (Roman Saini). నిజానికి ఇతని కుటుంబంలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నప్పటి నుంచే తానూ డాక్టర్ అవ్వాలని భారతదేశంలో అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మొదటి ప్రయత్నంలోనే అర్హత సాధించించాడు. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనార్హం. దీంతో భారతదేశంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. ఐఏఎస్.. అయితే సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఐఏఎస్ చదవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా ఇందులోనూ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించేశాడు. యుపిఎస్సిలో శిక్షణ పూర్తయిన తరువాత మధ్యప్రదేశ్ క్యాడర్లో జబల్పూర్ అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగానే ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ.. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసాడు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడి వారికి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన తక్కువ, అంతే కాకుండా వారికి సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా భావించాడు. కోచింగ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా మందిని చూసి చలించి పోయాడు. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా.. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని యువతను చూసి చలించిపోయిన రోమన్ సైనీ మెరుగైన విద్య అందించాలని, ఉద్యోగావకాశాల కోసం సరైన మార్గ నిర్దేశం చేయాలనీ భావించి తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. యువతను సరైన మార్గంలో పయనించేలా చేయడానికి ఆన్లైన్ కోచింగ్ సరైన మార్గం అని భావించి.. తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్తో కలిసి 'అన్అకాడమీ' (Unacademy) పేరుతో ఆన్లైన్ ట్యుటోరియల్ ప్రారంభించాడు. అన్అకాడమీ ప్రారంభం.. సైనీ ప్రారంభించిన ఈ అన్అకాడమీ ప్రచారానికి యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించుకున్నాడు. ఇందులో సివిల్స్, స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC), ఐబీపీఎస్ (IBPS) ఉద్యోగ నియామకాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్, టీచింగ్ వంటివి మొత్తం అందించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా సుమారు మూడు లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్అకాడమీ అనేది 20 వేల మందికి పైగా బోధనా సిబ్బందిని కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో అనుకున్నది సాధించాలనుకునే వారికి ఈ అకాడమీ ఒక వరం అనే చెప్పాలి. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యువతకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్న రోమన్ సైనికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫిదా అయిపోయారు. ఈ అకాడమీ ద్వారా గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా స్వచ్చందంగా సేవలందిస్తున్నారు. రోమన్ సైనీ ఒక గిటార్ ప్లేయర్ కూడా. ఇతడు పాటలు కూడా పాడతాడు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) నిజానికి రోమన్ సైనీ అనుకుని ఉండే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుని ఉండేవాడు. కానీ సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోదు.. తన చుట్టూ ఉన్నవారు కూడా తప్పకుండా ఎదగాలి అనే ఆలోచనతో ఐఏఎస్ సైతం వదులుకున్నాడంటే అతని సేవాదృక్పధం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ రోజు అన్అకాడమీ అనేది రూ. 2,600 కోట్ల సంస్థగా అవతరించింది. ఈ ఘనత మొత్తం మాజీ ఐఏఎస్ అధికారి రోమన్ సైనీకే చెందుతుంది. -
అత్త ఆలోచనలతో కోడలి వ్యాపారం.. దెబ్బకు దశ తిరిగింది, విదేశాల్లో కూడా డిమాండ్!
Sonam Success Story: అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. కానీ ఒక కోడలు లక్షాధికారి కావడానికి అత్త కారకురాలయింది. చాలా మంది అత్తా కోడళ్ళకు అసలు పడదు, ఇది నిజ జీవితంలో చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. కానీ మనం ఈ కథనంలో చెప్పుకోబోయే అత్తా కోడళ్ళు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అత్త చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో అందరికి పంచుతున్న ఈ కోడలు ఎవరు? ఆమె ఎలా ధనవంతురాలయింది? ఆమె చేసే వ్యాపారం ఏది అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. చెన్నైకి చెందిన సోనమ్ (Sonam) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంది. చాలా మంది అత్తలు మాదిరిగా కాకుండా సోనమ్ అత్త 'ప్రేమలత' తనను సొంత కూతురిలాగా చూసుకునేది. అయితే కొన్ని రోజులకే అత్త మరణించడంతో చాలా బాధపడి కృంగిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోలుకున్న సోనమ్ ఒక రోజు తన అత్తా గదిని శుభ్రపరిచే సమయంలో ఆమెకు ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఆమెను గొప్ప పారిశ్రామికవేత్తగా మార్చేసింది. అత్త డైరీ.. సోనమ్ చేతికి దొరికిన దొరికిన ఆ డైరీలో ఎన్నెన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉండటం గమనించింది. వీటన్నినీ అలాగే ఎందుకు నిరుపయోగంగా వదిలేయాలి, పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో కలిసి నిర్ణయించుకుంది. డైరీలో తనకిష్టమైన గోంగూర చట్నీ దగ్గర్నుంచి మాల్గోపొడి వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఆ తరువాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారు చేసి భర్త అజయ్తో దగ్గరి బంధువులకు అందించడం మొదలుపెట్టింది. ఆ వంటకాలు తిన్న చాలా మంది ఫోన్ చేసి చాలా రుచిగా ఉయన్నాయని మెచ్చుకున్నారు. ఇది ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. వ్యాపారం ప్రారంభం.. ఒకప్పుడు వంట మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అయితే అత్తయ్య డైరీ చూడగానే నాలో మార్పు వచ్చిందని చెబుతూనే 'ప్రేమ్ ఇటాసి' (Prem Eatacy) పేరుతో వ్యాపారం ప్రారభించించినట్లు చెప్పింది. ప్రారంభంలో సుమారు రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టింది. వీరి వ్యాపారం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే న్లైన్ రిటైల్ ప్లాట్ఫారమ్ల నుంచి కూడా ఆర్డర్లను పొందగలిగే స్థాయికి ఎదిగింది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, అమెరికా నుంచి కూడా కస్టమర్లు సంప్రదించి తమ ఉత్పత్తులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సోనమ్ భర్త అజయ్ తెలిపాడు. ఇప్పటి వరకు వీరు 21 రకాల ఊరగాయ, పొడి, చట్నీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది చట్నీ, మొలగపొడి, పుదీనా కొత్తిమీర చట్నీ వంటివి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న సోనమ్ ఈ క్రెడిట్ మొత్తం మా అత్తగారికి చెందుతుందని.. ఆమె డైరీ లేకుండా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే దానిని కాదని వినయంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు మొత్తం ఆర్గానిక్ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. వీరు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!
Youtuber Shfa Success Story: ఆధునిక ప్రపంచాన్ని ఈ రోజు ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ ఏలేస్తున్నాయి. ఏ చిన్న సంఘనటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు 11 సంవత్సరాల 'ష్ఫా' (Shfa). ఇంతకీ ఈమె యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోంది. ఎలాంటి వీడియోలు చేస్తుంది అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 2011 డిసెంబర్ 19న జన్మించిన 'ష్పా' (Shfa) పిల్లలకు ఉపయోగకరమైన ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసి అతి తక్కువ కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి వీడియోలు అరబిక్ భాషలో ఉండటం గమనార్హం. ష్ఫా యూట్యూబ్ ఛానల్ పాలొవర్స్.. సుమారు 40 మిలియన్స్ పాలొవర్స్ ఉన్న 'ష్ఫా' యూట్యూబ్ ఛానల్ 2015 మార్చి 29 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అంతే కాకుండా ఇది మొదట్లో తన తల్లి నిర్వహించేది, అయితే ష్ఫా యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన తరువాత ఎంతో మంది పిల్లల హృదయాలను దోచుకుంది, తద్వారా ఈ ఛానల్ బాగా డెవలప్ అయింది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నెల సంపాదన ఎంతంటే.. ష్ఫా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 22 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, ఫలితంగా రాబడి భారీగా పెరిగింది. 2023 మే నాటికి వీరి ఛానల్ ఆదాయం 2,00,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆమె నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా దాటింది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే 984 వీడియోలను అప్లోడ్ చేసి సంపాదనలో బిలియన్ డాలర్ మార్క్కు చేరుకుంది. ష్పా నికర సంపాదన విలువ 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే సుమారు 410 కోట్లు. కేవలం 11 సంవత్సరాల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శం కావడం చాలా గొప్ప విషయం. -
భార్యాభర్తలిద్దరికీ అదే సమస్య.. పరిష్కారం ఆలోచించి.. కంపెనీ పెట్టి..!
Traya Founders Success Story: ఉన్నత చదువులు చదివి సంపన్నులైన వ్యక్తుల గురించి, విదేశాలను వదిలి ఇండియా వచ్చి బాగా సంపాదించిన వ్యక్తులను గురించి మనం గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నిజ జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొని.. అలాంటి సమస్యలతో బాధపడేవారికి పరిష్కారం అందించడానికి మొదలెట్టిన వ్యాపారం వారిని కుబేరులను చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. త్రయ (Traya) సంస్థ ద్వారా సక్సెస్ సాధించిన 'సలోని ఆనంద్' & ఆమె భర్త 'అల్తాఫ్ సయ్యద్' ఇద్దరూ జుట్టు రాలడం సమస్యతో బాధపడ్డారు. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా సంపూర్ణ జుట్టు సంరక్షణ చేయాలని ఆలోచించి బిజినెస్ ప్రారంభించారు. త్రయ సంస్థ నిజానికి జుట్టు రాలడానికి ప్రధాన కారణం నీటి సమస్య, వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. శరీరంలో జరిగే కొన్ని అంతర్లీన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని గ్రహించి 2019లో త్రయను ప్రారంభించి, ఆయుర్వేద విధానంలో కారణాలను అన్వేషించి, మూలాలలో ఉండే సమస్యలను రూపుమాపడానికి ఉత్పత్తులు ప్రవేశపెట్టారు. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) నిజానికి సలోని ఆనంద్ మొదటిసారిగా అల్తాఫ్ను హైదరాబాద్లో కలుసుకుంది. ఆ తరువాత 2017లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సొంతంగా కంపెనీ ప్రారంభించడానికి ముందు హెల్త్కేర్ సంస్థ కాస్ట్లైట్లో మూడేళ్లపాటు పనిచేసింది సలోని. అప్పటికే మార్కెటింగ్లో ఎంబీఏ పట్టా కూడా పొందింది. (ఇదీ చదవండి: రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!) ఇక అల్తాఫ్ విషయానికి వస్తే.. కంపెనీ ప్రారంభించడానికి ముందు ఫుడ్ డెలివరీ స్టార్ట్-అప్ బిల్ట్2కూక్ నడిపాడు. అంతేకంటే ముందు ఇతడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ, గ్లాస్గో యూనివర్శిటీలో మెడికల్ బయోకెమిస్ట్రీలో సైన్స్ చదివాడు. సలోని ఆనంద్ పెళ్లి చేసుకున్న తరువాత త్రయ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారు. -
సెలబ్రిటీలతో కలిసి బిజినెస్.. ఆ నయా ట్రెండ్ మొదలుపెట్టిందే ఇతడు!
అతిపెద్ద స్వదేశీ ఫిట్నెస్ బ్రాండ్లలో ఒకటైన హెచ్ఆర్ఎక్స్ (HRX) గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ బ్రాండ్ పేరు వినగానే మొదట అందరికి 'హృతిక్ రోషన్' (Hrithik Roshan) గుర్తొస్తాడు. ఈ కంపెనీ వెనుక ఈతడు మాత్రమే కాదు.. అఫ్సర్ జైదీ (Afsar Zaidi) అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతకీ అఫ్సర్ ఎవరు? సెలబ్రిటీలతో కలిసి పని చేసేంతలా ఎలా ఎదిగాడు? అతని నెట్వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అఫ్సర్ జైదీ ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ అండ్ కో-ఫౌండర్. ఈ కంపెనీని 2013లో హృతిక్ రోహన్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కంపెనీ బూట్లు, వ్యాయామం చేసేటప్పుడు వినియోగించే దుస్తులను విక్రయిస్తూ.. నైక్, పుమా, డెకాథ్లాన్ వంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడుతోంది. ఎక్సీడ్ ఎంటర్టైన్మెంట్ అనేది హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, అజయ్ దేవగన్, కాజోల్, షాహిద్ కపూర్, అర్జున్ రాంపాల్, ఇమ్రాన్ హష్మీ, మలైకా అరోరా, బిపాషా బసు, శిల్పా శెట్టి, చిత్రాంగద సింగ్, మిథిలా పాల్కర్, దియా మీర్జా వంటి సెలబ్రిటీల మేనేజ్మెంట్ కంపెనీ. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) అఫ్సర్ జైదీ.. సైఫ్ అలీ ఖాన్ దుస్తుల బ్రాండ్ హౌస్ ఆఫ్ పటౌడీకి కో ఫౌండర్ కూడా. నిజానికి ఇతడు 2005 వరకు సాధారణ జీతం పొందే వ్యక్తి. అప్పట్లో మహేష్ భూపతికి చెందిన గ్లోబోస్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసేవారు. అయితే ఆ తరువాత కార్వింగ్ డ్రీమ్స్ అనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించాడు. ఆ సంస్థ ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటైన ఎక్సీడ్గా అవతరించింది. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) పెళ్లిళ్లలో సెలబ్రిటీలు డ్యాన్స్ చేసేలా ఒప్పందాలు చేసుకునే ట్రెండ్ని జైదీ ప్రారంభించారు. అంతే కాకుండా హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరికీ మేనేజర్గా ఉండేవాడు. ఆ తరువాత వారి సహకారంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇతడు వ్యాపార రంగంలో అడుగుపెట్టినప్పుడు ఈ-కామర్స్ రంగం అప్పుడే ప్రారంభ దశలో ఉండేది. ఆ తరువాత మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. భాగస్వామ్యం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.350 కోట్లు. కాగా గతేడాది చివరి త్రైమాసికం నాటికి కంపెనీ ఆదాయం రూ.920 కోట్లు. -
చూపు లేకున్నా రూ. 47 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్.. ఎవరీ యష్?
సాధించాలనే సంకల్పం నీకుంటే విజయం తప్పకుండా దాసోహం అంటుంది. ఈ మాటకు రూపం పోస్తే అతడే 'యష్ సోనాకియా' (Yash Sonakia). ప్రతిభకు ఏ శారీరక లోపం అడ్డు కాదు అని నిరూపించాడు. తన ఎనిమిదవ ఏటనే చూపో కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా మైక్రోసాఫ్ట్ కంపెనీలు జాబ్ కొట్టాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్కి చెందిన యష్ సోనాకియా పుట్టినప్పుడే అతనికి గ్లాకోమా ఉందని డాక్టర్లు నిర్దారించారు. అయితే అతనికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి చూపు కోల్పోయాడు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ కావాలని కళలు కన్న యష్ చూపు కోల్పోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తన వైకల్యాన్ని అధిగమించి 2021లో శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (SGSITS) నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత యష్ సోనాకియాకు ఒక మంచి బంపర్ ఆఫర్ లభించింది. అతనికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ 47 లక్షల వార్షిక వేతనం అందిస్తూ జాబ్ ఇచ్చింది. కళ్ళు లేని వ్యక్తి ఇంత గొప్ప ప్యాకేజీతో జాబ్ సంపాదించడం అనేది సాధారణ విషయం కాదు. యష్ తండ్రి యశ్పాల్ ఇండోర్లో క్యాంటీన్ నడుపుతున్నాడు. తన కొడుకు ఇంత మంచి జాబ్ తెచుకున్నందుకు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. -
ఎంట్రన్స్ ఎగ్జామ్లో రెండుసార్లు ఫెయిల్.. నేడు చైనాలో కుబేరుడు!
Richest Man in China Jack Ma Success Story: విశాలమైన విశ్వంలోనే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి ఈ రోజు చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేతగా అందరికి తెలుసు. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ ఒక దిగువ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతడు అతిథులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్కు సైకిల్ మీద వెళ్లేవాడు. ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్గా కూడా పనిచేశాడు. ఇది తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికి భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు. విద్య & ఉద్యోగ జీవితం ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాశాడు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించాడు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడుగులు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్ కాకపోవడం గమనార్హం. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభం ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో మొదటి సంస్థ 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించి ఆంగ్ల అనువాదం, వివరణను అందించడం ప్రారంభించాడు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని పొందాడు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. అక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. అంతర్జాలం అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. అప్పుడు అతడు యాహూలో సెర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం ఏమి దొరకలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రూ. 1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. ఇంటర్నెట్తో ప్రత్యర్థులకు పోటీ జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్కు చెప్పాడు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్సైట్ను ప్రారంభించాలనుకున్నాడు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) ఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ 1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాడు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం ఆధునిక కాలంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!
Sanjeev Juneja Success Story: జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట & నష్టాలు లెక్కకు మించి ఎదుర్కోవాలి ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న విజయవంతమైన వ్యక్తులలో చాలా మంది ఇలా ఎదిగినవారే. ఈ కోవకు చెందిన వారిలో 'సంజీవ్ జునేజా' (Sanjeev Juneja) ఒకరు. తన తల్లి దగ్గర నుంచి రూ. 2000 తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యానికి మహారాజుగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. ఇంతకీ సంజీవ్ ఎవరు? ఎలా సక్సెస్ సాధించాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ జునేజా.. అంబాలలో ఒక ప్రముఖ వైద్యుడుగా ప్రసిద్ధిచెందిన డాక్టర్ IK జునేజా కొడుకు. ఈయన ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. జునేజా తన తండ్రిని 1999లో కోల్పోయాడు. అప్పటికే సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్న ఇతడు తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి చనిపోక ముందే ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇవన్నీ అతనికి ఉపయోగపడ్డాయి. 2003లో సంజీవ్ జునేజా రాయల్ క్యాప్సూల్స్తో తన కంపెనీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి 2008లో హెయిర్ కేర్ ఫార్ములా స్టార్ట్ చేసాడు. ఇది అతి తక్కువ కాలంలోనే పాపులర్ బ్రాండ్గా ఎదిగింది. ఆ బ్రాండ్ పేరే 'కేశ్ కింగ్'. ఈ ఉత్పత్తులను ప్రారంభంలో ఇంటింటికి తిరిగి విక్రయించడం ప్రారంభించారు. ఆ తరువాత వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టాడు. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) కేశ్ కింగ్ ప్రారంభమైన ఆనతి కాలంలోనే సుమారు రూ. 300 కోట్లు బ్రాండ్గా అవతరించింది. ఇమామి కేశ్ కింగ్ సంస్థను రూ. 1651 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత పెట్ సఫా అనే మరో ఉత్పత్తిని తయారు చేశాడు. దీనికి రాజు శ్రీవాస్తవ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈయన డాక్టర్ ఆర్థోకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. (ఇదీ చదవండి: నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..) సంజీవ్ జునేజా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ప్రారంభంలో ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకుని కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ విక్రయాలతో నేడు రూప్ మంత్ర, పెట్ సఫా, డాక్టర్. ఆర్థో, సచి సహేలి, అక్యుమాస్, దంతమణి, మధుమణి, మోర్ పవర్, రాజ్సీ, తులసి మంత్రం అనే అనేక ఉత్పత్తులు ప్రారభించాడు. నేడు భారతదేశంలో గొప్ప వ్యాపార వేత్తగా మాత్రమే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడు ఆయన సంపాదన వేళా కోట్లకు చేరింది. -
నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..
Kamaljit Kaur Success Story: జీవితంలో ఎదగాలంటే తెలివి మాత్రమే కాదు చేయాలనే సంకల్పం, చేయగలననే పట్టుదల ఉంటే నిన్ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.. విజయ శిఖరాలను అధిరోహించి సక్సెస్ సాధించిన మహానుభావులు చెప్పే మాటలివి. విజయం సాధించాలంటే మాటల్లో అనుకున్నంత సులభమైతే కాదు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఐదు పదులు దాటిన 'కమల్జిత్ కౌర్' (Kamaljit Kaur) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె జీవితంలో సాధించిన సక్సెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో పంజాబ్ లుథియానాలోని చిన్న గ్రామంలో పుట్టిన కమల్జిత్ చిన్నప్పటి నుంచి స్వచ్ఛమైన పాలు, నెయ్యి, వెన్న తింటూ పెరిగింది. ఎలాంటి కల్తీ లేని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈమెకు చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని గతంలో వెల్లడిందింది. కిమ్ముస్ కిచెన్ బాల్యంలో తాను ఆస్వాదించిన స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజంగా అందించాలనే సంకల్పంతో 50 సంవత్సరాల వయసులో కమల్జిత్ కౌర్ కిమ్ముస్ కిచెన్ పేరుతో నెయ్యి విక్రయించడానికి సంకల్పించింది. అనుకున్న విధంగానే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈమె నెయ్యి వాసనలు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా పాకాయి. దెబ్బతో కిమ్ముస్ కిచెన్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) ఎలాంటి కల్తీ లేకుండా నెయ్యిని తయారు చేయడానికి ఈమె బిలోనా అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగించింది. ఈ పద్ధతిలో మొదట ఆవు పాలను మరిగించి చల్లబరుస్తుంది, తర్వాత ఒక టీస్పూన్ పెరుగు కలిపి, మరుసటి రోజు అందులో నుంచి వెన్నను తీసి నెయ్యిని తయారు చేస్తుంది. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) సంపాదన క్రమంగా కమల్జీత్ కౌర్ నెయ్యికి బాగా డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచ దేశాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పుడు ఇతర దేశాల నుండి కూడా ఆర్డర్ చేస్తున్నారు. రిటైల్ నెయ్యి సీసాలు 220 ml, 500 ml, 1 లీటర్ పరిమాణాల్లో లభిస్తాయి. పరిమాణాన్ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ముస్ కిచెన్ సంపాదన నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ. వీరి సంపాదనలో 1 శాతం గురుద్వార్కు, ఆకలితో ఉన్న వారికి అందిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి
Ola Cabs Co-Founder Ankit Bhati: ఓలా క్యాబ్ సర్వీస్ అనగానే భవిష్ అగర్వాల్ గుర్తుకు వస్తారు. అయితే దీని స్థాపించడంలో మరొక వ్యక్తి హస్తం కూడా ఉంది. అతడే ఓలా క్యాబ్ సర్వీస్ కో ఫౌండర్ 'అంకిత్ భాటి' (Ankit Bhati). అతి తక్కువ వయసులోనే బిలీనియర్ అయిన ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఐఐటీ చేసిన గ్రాడ్యుయేట్లు దేశంలో అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ సాధించారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు అంకిత్ భాటి. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కంపెనీ స్థాపనలో పాలుపంచుకుని విజయం సాధించిన అంకిత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇతడు మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ కోడింగ్లో నిపుణుడు. ఓలా క్యాబ్ సర్వీస్ ప్రారంభించడానికి ముందు మైక్రోసాఫ్ట్, మేక్ సెన్స్, విల్కామ్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. 2010లో ఓలా క్యాబ్స్ ప్రారంభమైంది. ఇది కేవలం ఐదు సంవత్సరాల నాటికి వేలకోట్లు టర్నోవర్ తీసుకువచ్చింది. ఈ కారణంగానే భవిష్ అండ్ అంకిత్ ఇద్దరూ కూడా అతి తక్కువ కాలంలో బిలీనియర్స్ అయిన యువకుల జాబితాలో స్థానం పొందారు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) ఎనిమిది సంవత్సరాల ముందు అంకిత్ నికర విలువ సుమారు రూ. 3000 కోట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. కాగా ఇప్పుడది రూ. 938 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. ప్రస్తుతం ఉబర్ సంస్థకు గట్టి పోటీ ఇస్తున్న ఓలా క్యాబ్ సర్వీస్ మంచి లాభాల బాటలో పయనిస్తోంది. సంస్థ సీఈఓగా భవిష్, సిటీఓగా (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) అంకిత్ ఉన్నారు. -
వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?
Success Story of PC Musthafa: జీవితంలో సక్సెస్ సాధించాలంటే నిరంతర శ్రమ తప్పనిసరి. నువ్వు చేయాలనుకున్న ఈపైననా కొత్తగా ఆలోచించి ఆచరణలో పెడితే తప్పకుండా విజయం నీ పాదాక్రాంతమవుతుందన్నది.. అక్షర సత్యం. గతంలో మనం ఎన్నో సక్సెస్ స్టోరీలు గురించి చదువుకున్నాము. ఉన్నత చదువులు వదిలి కుబేరులైన వారి గురించి, అమెరికా వదిలి ఇండియాలో బిజినెస్ చేసి కోట్లు సంపాదించిన వ్యక్తుల గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కాఫీ తోటలో పని చేసే ఒక కూలీ కొడుకు ఏడాదికి వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఇంతకీ ఇంత గొప్ప విజయం సాధించిన ఆ వ్యక్తి ఎవరు? అయన చేసే బిజినెస్ ఏది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేరళలో నిరుపేద కుటుంబంలో జన్మించిన 'ముస్తఫా' (Mustafa) తండ్రితో పాటు కూలి పనులకు కూడా వెళ్ళేవాడు. చిన్న చిన్న పనులు చేస్తూనే స్కూలుకు వెళ్ళేవాడు. అతని తల్లి నిరక్షరాస్యురాలు. పనులకు వెల్తూ చదువుకోవడం కొంత కష్టంగా ఉండటంలో చిన్నప్పుడు చదువులో ఆరవ తరగతి వరకు పెద్దగా రాణించలేకపోయాడు, కానీ పట్టు వదలకుండా చదివి పదవ తరగతిలో క్లాస్ టాపర్ అయ్యాడు. సాధారణంగా కష్టపడే గుణమున్న ముస్తఫా ఎన్ఐటిలో ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు. ఆ తరువాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాడు. ఆ తరువాత యూరప్, అమెరికా వంటి దేశాలలో కూడా పనిచేసి అక్కడ సంతృప్తి చెందలేక మళ్ళీ ఇండియా వచ్చేసాడు. ఐడి ఫ్రెష్ పుట్టిందిలా.. 2005లో బెంగళూరు నగరంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ టిఫిన్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని భావించేవాడు. అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఇడ్లీ, దోశ పిండి విక్రయించి తప్పకుండా లాభాలు పొందవచ్చని అనుకున్నాడు. అనుకున్న విధంగానే ఐడి ఫ్రెష్ (ID) పేరిట దోశ, ఇడ్లీ పిండి విక్రయించడం మొదలెట్టాడు. ఐడి ఫ్రెష్ ప్రారంభించిన మొదట్లో ఒక చిన్న ప్రదేశంలో 100 ప్యాకెట్లు విక్రయించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ టార్గెట్ అతి తక్కువ కాలంలోనే వెయ్యి ప్యాకెట్లకు చేరింది. ఇది క్రమంగా వ్యాపిస్తూ మెట్రో నగరాలకు సైతం పాకింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ముస్తఫా తన వ్యాపారాన్ని విస్తరించాడు. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) ప్రారంభంలో ఐడి ఫ్రెష్ ఫుడ్ 5000 కేజీల బియ్యంతో 15,000 కేజీల ఇడ్లీ, దోశ పిండి మిశ్రమం తయారు చేశారు. ప్రస్తుతం అనేక నగరాల్లో వందలాది స్టోర్లను ప్రారభించాడు. మొత్తానికి ముస్తఫా బ్రేక్ఫాస్ట్ కింగ్గా ప్రసిద్ధి చెందాడు. 2015 - 16లో కంపెనీ టర్నోవర్ రూ. 100 కోట్లు. కాగా ఇప్పుడు ఇది రూ. 300 కోట్లకు చేరినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!) నిజానికి ఉన్నత చదువులు చదివి ఇడ్లీ, దోశ పిండి అమ్ముకోవడం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. ప్రారంభంలో ముస్తఫా కూడా ఇలా ఆలోచించి ఉంటే వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించేవాడు కాదు. కావున చేసే పని ఏదైనా కానీ నిజాయితీగా, నిబద్దతో చేస్తే తప్పకుండా విజయ శిఖరాలను అధిరోహించవచ్చు అనటానికి ముస్తఫా నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
చదువుకునే వయసులో స్టార్టప్.. 19 ఏళ్లకే కోటీశ్వరుడు
Kaivalya Vohra Success Story: చదువుకునే వయసులోనే ఏదో సాధించాలనే తపనతో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఒక కంపెనీ స్థాపించి సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న యువకుడు 'కైవల్య వోహ్రా' (Kaivalya Vohra). ఇంతకీ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. చదువుకునే విద్యార్థులలో చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. కానీ కైవల్య స్టాన్ఫర్డ్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. 2001లో జన్మించిన కైవల్య వోహ్రా ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసి అమెరికాలో ఇంజినీరింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ సొంతంగా కంపెనీ ప్రారంభించాలని ఆశపడుతున్న కైవల్య అక్కడ చాలా రోజులు ఉండలేకపోయాడు. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) కైవల్య వోహ్రా తన 17వ ఏటనే మొదటి స్టార్టప్ని నిర్మించిన తన స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తన స్టార్టప్ని ప్రారంభించాడు. వారి మొదటి స్టార్టప్ పేరు గోపూల్. అయితే వారిద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే 'జెప్టో' (Zepto) గురించి ఆలోచించారు. ఆ సమయంలో ఏదైనా ఆర్డర్ చేస్తే అవి డెలివరీ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారు 2021లో జెప్టో (గ్రోసరీ డెలివరీ యాప్) ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కేవలం కొన్ని నెలల్లో 1000 మంది ఉద్యోగులు, ఏజంట్లు ఇందులో చేరారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) జెప్టో ప్రారంభమైన ఒక నెలలోనే వారు 200 మిలియన్ డాలర్లు సంపాదించగలిగారు. ఒక సంవత్సర కాలంలోనే దీని విలువ రూ. 7,300 కోట్లకు చేరింది. ఇప్పటికి కైవల్య నికర విలువ రూ. 1200 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ 10 పెద్ద నగరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ వయసులో కోటీశ్వరుడుగా పేరు తెచ్చుకున్నాడు. -
అమ్మమ్మ చేతి బిర్యాని.. కోట్లు సంపాదించేలా..
RNR Co-Founder Ramya Ravi Success Story: కొంతమంది చదువులో రానించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, మరి కొందరు బిజినెస్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఒక యువతి బిర్యాని విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తోంది. బిర్యానీ ఏంటి? కోట్లు సంపాదించడం ఏంటి అని మీకు సందేహం రావొచ్చు.. ఇది అక్షరాలా నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మనకు బిర్యాని అనగానే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. అయితే దొన్నె బిర్యాని అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరు. ఈ దొన్నె బిర్యాని అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బెంగళూరుకు చెందిన 'రమ్య రవి' (Ramya Ravi). అమ్మమ్మ చేసే దొన్నె బిర్యాని తింటూ పెరిగిన ఈమె ఇప్పుడు ఆ బిర్యానితో బిజినెస్ చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రమ్య (2020లో) రూ. 5 లక్షల పెట్టుబడితో బిర్యాని వ్యాపారం ప్రారంభించాలని ముందడుగు వేసింది. అందరూ భయపడుతున్న సమయంలో ప్రారంభించిన ఈ బిజినెస్ ఊహకందని రీతిలో విజయ పథంలో పయనించడం మొదలు పెట్టింది. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) వ్యాపారం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే లాభాలు రావడం మొదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఈమె బిజినెస్ టర్నోవర్ ఏకంగా రూ. 10 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరు RNR దొన్నె బిర్యానీకి మారుపేరుగా నిలిచింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె ది వ్యాలీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్ కాలేజీ బీకామ్ పూర్తి చేసింది. ఆ తరువాత వ్యాపారంలో కొన్ని మెళుకువలను నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో కోర్స్ కూడా పూర్తి చేసింది. ఈమెకు శ్వేత, రవీనా అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ) ప్రారంభంలో బెంగళూరు నాగరబావి ప్రాంతంలో కేవలం 200 అడుగుల స్థలంలో హోటల్ ప్రారంభించింది. ఆ సమయంలో వారికి కేవలం ఒక వంటవాడు మాత్రమే ఉండేవాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. వారు వ్యాపారం ప్రారంభించిన మొదటి నెలలోనే 10000 డెలివరీలు చేశారు. క్రమంగా డిమాండ్ భారీగా పెరగడంతో వ్యాపారం విస్తరించడంపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే 2021లో బెంగళూరులోని జయనగర్లో రెస్టారెంట్ ప్రారంభించారు. వీరు ఇతర రెస్టారెంట్స్ మాదిరిగా కాకూండా టిన్ బాక్స్లలో బిర్యాని అందిస్తారు. ఈ విధానం చాలామందిని ఆకర్శించింది. ప్రస్తుతం భారీ లాభాల్లో పరుగులు పెడుతోంది -
28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని
భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్గా మాత్రమే కాకుండా సుమారు 14.2 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడై భారతీయ సంపన్నుల జాబితాలో 9వ స్థానం పొందిన బిర్లా ఈ స్థాయికి రావడానికి ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఆయన సక్సెస్ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 1967 జూన్ 14న జన్మించిన కుమార్ మంగళం బిర్లా ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి తరువాత లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు. 1992లో లండన్లో CA పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత 1995లో ఆయన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. తండ్రి మరణించిన తరువాత 28 సంవత్సరాల వయసులో ఆదిత్య బిర్లా గ్రూప్కు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ల నుంచి 45 బిలియన్లకు చేరింది. (ఇదీ చదవండి: Volkswagen Discounts: ఈ ఆఫర్స్ చాలదా ఫోక్స్వ్యాగన్ కారు కొనడానికి - పూర్తి వివరాలు) కుమార్ మంగళం బిర్లా టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, మైనింగ్ వంటి వాటితో పాటు సుమారు 16 కంటే ఎక్కువ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా వీరు అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, పాంటలూన్స్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నారు. కార్బన్ బ్లాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ పేరుతో ఐదు ఖండాల్లోని 12 దేశాలకు కార్బన్ ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో రైల్వే అవసరాలకు అవసరమైన కార్బన్ పంపించడంలో బిర్లా కాపర్ వాటా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం విజయపథంలో నిర్విరామంగా ముందుకు సాగుతోంది. బాక్సైట్ తవ్వకాలు, అల్యూమినా ప్రాసెసింగ్, అల్యూమినియంతో కూడిన ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన హిండాల్కోకు కూడా బిర్లా యజమాని. ఇందులో సుమారు 40వేలకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 2004లో గ్రాసిమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా ఎదిగింది. దీని ఆదాయం ప్రస్తుతం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ సుమారు పది లక్ష కోట్లకంటే ఎక్కువ. -
అద్దె భూమిలో వ్యవసాయం - కోట్లు సంపాదించేలా..
MBA Graduate Rajeev Bhaskar: నిజానికి సక్సెస్ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఆలాంటి సక్సెస్ రావడానికి నిరంతరం కష్టపడాలి. ఆ కష్టమే మనిషిని విజయపథంలో ముందుకు తీసుకెళుతుంది. వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న గ్రాడ్యుయేట్స్లో ఒకరు రాజీవ్ భాస్కర్. ఇంతకీ ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి? దీని కోసం ఎంతలా కష్టపడ్డానే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. విఎన్ఆర్ సీడ్స్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ మెంబర్గా పనిచేసిన రాజీవ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. సీడ్స్ కంపెనీలో అతనికి ఏర్పడిన అనుభవమే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది, అంతే కాకుండా వ్యవసాయం మీద అతనికి ఆసక్తిని ఏర్పరచింది. వ్యవసాయంలో కొత్త పోకడలను తెలుసుకుని కొత్తగా వ్యవసాయం చేయడం మొదలెట్టిన రాజీవ్ థాయ్ జామ రకం పంటలు పండిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 2017లో తన ఉద్యోగాన్ని వదిలి హర్యానాలోని పంచకులలో ఐదు ఎకరాల భూమిని అద్దెకు తీసుకుని జామ పండించడం ప్రారంభించాడు. రాజీవ్ భాస్కర్ పంటల పెరుగుదలను ప్రోత్సహించడానికి సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన బయోసైడ్లు, బయోఫెర్టిలైజర్లను ఉపయోగించాడు. పంటను పురుగులు, కీటకాల బారి నుంచి రక్షించడానికి మూడు పొరల బ్యాగింగ్ టెక్నిక్ ఉపయోగించాడు. ఇది వ్యవసాయాభివృద్ధికి బాగా దోహదపడింది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) తన మొదటి పంట 2017 అక్టోబరు & నవంబర్ మధ్య కాలంలో చేతికొచ్చింది. అప్పుడు అతడు రూ. 20 లక్షల వరకు సంపాదించాడు. ఆ తరువాత కూరగాయల పంటలను కూడా అదే పద్దతిలో పండించడం మొదలుపెట్టాడు. అయితే కూరగాయలను విక్రయించడంలో కొంత వెనుకపడ్డాడు, కానీ జామ పంటను అలాగే ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతడు 2019లో ముగ్గురు పెట్టుబడిదారులతో పంజాబ్లోని రూప్నగర్లో సుమారు 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. (ఇదీ చదవండి: Toyota FJ Cruiser: ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?) 2019 తరువాత రాజీవ్, అతని బృందం పంజాబ్లో 25 ఎకరాల భూమిలో జామ చెట్లను నాటారు. అదే సమయంలో పంచకుల తోటలోని ఐదు ఎకరాలలో కూడా థాయ్ జామపండ్లను పండించడం కొనసాగించారు. రెండు విధాలుగా వర్షాకాలం, చలికాలంలో పంటలు పండిస్తూ భారీగా ఆర్జించడం మొదలుపెట్టారు. రాజీవ్ తన జామ మొక్కల సగటు గరిష్ట దిగుబడిని మొక్కకు 25 కిలోల నుంచి 40 కిలోలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రసాయనాలు ఉపయోగించే కాలంలో సేంద్రియ వ్యవసాయం కొంత కఠినంగా ఉండనియూచెబుతున్నారు . అయినప్పటికీ అదే పద్దతిని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఉన్న ఉద్యోగం వదిలి వ్యవసాయంలోనే కోట్లు గడిస్తున్న రాజీవ్ ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. -
ప్యూన్ ఉద్యోగం రాలేదు: ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడిలా!
పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలు. జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే 'దిల్ఖుష్ సింగ్' సక్సెస్ స్టోరీ. సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 'దిల్ఖుష్ సింగ్' ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ. 20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ఖుష్ సింగ్ రాడ్బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్లో క్యాబ్లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. (ఇదీ చదవండి: వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!) రాడ్బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ. 1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్ఫామ్లో పార్ట్టైమ్గా పనిచేస్తున్నారని దిల్ఖుష్ చెప్పుకొచ్చారు. -
నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి!
చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుని గురించి చదువుతుంటే కొంత ఆశ్చర్యం కలిగేది, ఎందుకంటే బేతాళున్ని తీసుకురావడానికి విక్రమార్కుడు మళ్ళీ మళ్ళీ చెట్టు దగ్గరికి వెల్తూనే ఉంటాడు. అయితే చివరికి అనుకున్నది సాధిస్తాడు. సరిగ్గా ఈ కథను పోలిన జీవితాన్ని హర్ష్ జైన్ అనుభవించాడు. 1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ ప్రాథమిక విద్యను గ్రీన్లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్బాల్ వంటి వాటిలో పాల్గొన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది. (ఇదీ చదవండి: రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..) నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు. 2013లో హర్ష్ జైన్ డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు, వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్లో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించారు. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) 2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్ఫామ్లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు. -
పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... ఎలాగో మీరూ ఓ లుక్కేయండి
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి జీవితం మరీ చిన్నదైపోయింది. దినదినగండం నూరెళ్ల ఆయుష్షులా తయారైంది. ఉన్న కొద్ది రోజులు హ్యాపీగా గడిపేద్దాం అనుకునేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. దేశ, విదేశాలు చుట్టేస్తున్నారు. ట్రావెలాగ్ చానెల్స్ స్టార్ట్ చేసి తమ జర్నీని నలుగురితో పంచుకుంటున్నారు. ట్రావెలర్స్లోనూ పురుషులే అధికంగా కనిపిస్తున్నారు. కానీ, కొంతమంది మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోము అంటూ లగేజీ సర్దుకుని విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. అలాంటి ఓ మహిళే ముంబైకి చెందిన అనిందితా చటర్జీ. ఉద్యోగం వదిలేసి... అనిందితా ఛటర్జీకి ఇప్పుడు 41 ఏళ్లు. భర్త, ఓ చిన్నారి కూడా ఉంది. ఆమెకు విదేశాల్లో పర్యటించడమంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టాలను కుటుంబ సభ్యులు కాదనేవారు కాదు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి విదేశీ పర్యటనలు కొనసాగించింది. అలా 2017లో ‘‘ట్రావెల్.చాట్టర్’’ పేరుతో ఇన్స్ట్రాగమ్ పేజీని ప్రారంభించి తన పర్యటన విశేషాలను అందులో పంచుకోవడం ప్రారంభించింది. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్కే కేటాయించింది. గర్భిణిగా ఉంటూ 4 దేశాల్లో... ఆమె మెక్సికోలో ఉన్నప్పుడు గర్భవతి అని తెలుసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు వెనక్కి వచ్చేయమని చెప్పారు. అయినా ఆమె వినలేదు. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే ముంబయికి వచ్చారు. గర్భిణిగా ఉన్న సమయంలో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ విహారయాత్రలు మొదలు పెట్టింది. అలా గర్భవతిగా ఉన్నప్పుడే నాలుగు దేశాల్లో పర్యటించింది. 45 రోజులకే మళ్లీ స్టార్ట్... తిరిగేకాళ్లు ఓ చోట నిలవవు అన్న మాట ఆమెకు సరిగ్గా సరిపోతుంది. డెలివరీ అయిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంది. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించేది. ట్రావెలింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనందిత 87 దేశాల్లో పర్యటించింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు... చిన్న చిన్న కారణాలతో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అనిందిత చెబుతుంది. మన కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించినప్పుడే.. మన పిల్లలు కూడా వాటిని చూస్తూ పెరిగి.. వాళ్ల కలలను సాకారం చేసుకుంటారని ఆమె చెప్తుంది. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ముందుగా దాని గురించి పరిశోధన చేసి, అక్కడ చూడదగ్గ విశేషాలను తెలుసుకున్న తర్వాతనే ట్రిప్ ప్లాన్ చేసుకుంటోంది అనందిత. చిన్నారి కూడా తమ ట్రావెలింగ్కు సహకరిస్తోందని, పాప కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తుండటంతో ఆనందంగా ట్రావెలింగ్ను పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అనందిత చటర్జీ. -
సివిల్స్ ర్యాంకు కొట్టిన టీం ఇండియా క్రికెటర్ ఎవరో తెలుసా.?
యూపీఎస్సీ(UPSC).. షార్ట్కట్లో సివిల్స్ ఎగ్జామ్. దేశంలో అత్యంత కఠిన పరీక్షగా సివిల్స్ ఎగ్జామ్కు పేరు ఉంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్నా సివిల్స్ ఇచ్చే కిక్కు వేరు. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్ రూపంలో వస్తుండడంతో యువత అడుగులు సివిల్స్ వైపు ఉంటాయి. ప్రతీ ఏటా లక్షల మంది సివిల్స్ రాస్తున్నప్పటికి క్లియర్ చేసే వారి సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్ను ఒక టీమిండియా క్రికెటర్ క్లియర్ చేశాడన్న సంగతి మీకు తెలుసా. ఆటల్లో ఎక్కువగా ఆసక్తి కనబరిస్తే చదువులో వెనుకబడిపోతారనేది సహజంగా అందరూ అంటుంటారు. క్రికెట్ కంటే ముందే.... ఆటతో సమానంగా చదువులోనూ రాణించగలనని ఒక టీమిండియా క్రికెటర్ నిరూపించాడు. అతనెవరో కాదు.. మాజీ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్లో జన్మించిన ఖురేషియా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే సివిల్స్ క్లియర్ చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అమే ఖురేషియా. 17 ఏళ్ల వయసులోనే.... 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అమే ఖురేషియా చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. క్రికెటర్గా మారకపోయుంటే కచ్చితంగా ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నించేవాడినని ఖురేషియా పలు సందర్భాల్లో పేర్కొనేవాడు. అయితే చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయని ఖురేషియా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడుతూనే మధ్యప్రదేశ్ నుంచి సివిల్స్ ఎగ్జామ్ను క్లియర్ చేశాడు. అయితే అతను సివిల్స్ క్లియర్ చేసిన కొన్ని రోజులకే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. డెబ్యూ మ్యాచ్ శ్రీలంకతో... దేశం కోసం ఆడాలన్న కల నిజం కావడంతో ఖురేషియా ఎగిరిగంతేశాడు. అలా 1999లో పెప్సీ కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో(45 బంతుల్లో 57 పరుగులు) రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత అదే ఫామ్ను కంటిన్యూ చేయడంలో విఫలమైన ఖురేషియా మెల్లగా కనుమరుగయ్యాడు. అయితే అప్పటికే సివిల్స్ క్లియర్ చేయడంతో ఆటకు దూరమైనా తన రెండో కల(సివిల్స్)తో దేశానికి సేవ చేస్తున్నాడు. చివరి మ్యాచ్ శ్రీలంకతోనే... ఓవరాల్గా టీమిండియా తరఫున 12 వన్డేలాడిన ఖురేషియా 149 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ను శ్రీలంకపైనే ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున 119 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన ఖురేషియా 7 వేలకు పైగా పరుగులు చేశాడు. 22 ఏప్రిల్ 2007న ఫస్ల్క్లాస్ క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
లక్షల జీతం కాదనీ.. ఈ లక్ష్యం కోసమే ఐఏఎస్ కొట్టానిలా.. కానీ..
విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగం ఉన్న.. అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్లో సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు.. ఎందుకంటే.. దానికున్న గౌరవం.. విలువ చాలా గొప్పది. ఆయన నానో టెక్నాలజీ మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలకు గాను.. ఆయనకు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. అయితే.. ఆ లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. యూపీఎస్సీ సివిల్స్కు ప్రిపేరయ్యాడు. ఈ సివిల్స్ సాధించడం కోసం ఎంతోకష్టపడ్డాడు. ఆయన కష్టాన్నికి యూపీఎస్సీ సివిల్స్ 2020 ఫలితాల్లో జాతీయ స్థాయిలో.. ఏకంగా 29వ ర్యాంక్ సాధించాడు. చివరికి ఐఏఎస్ కావలనే కలను నిరవేర్చుకున్నాడు. ఈయనే.. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన ప్రఖర్ సింగ్. ఈ నేపథ్యంలో ప్రఖర్ సింగ్ సక్సెస్ స్టోరీ మీకోసం.. కుటుంబ నేపథ్యం : ప్రఖర్ సింగ్.. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన వారు. తండ్రి కేదార్ సింగ్. ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ చేశారు. ప్రఖార్ చిన్నతనంలోనే.. అతని తండ్రి పని కారణంగా బయట ఉండవలసి వచ్చింది. అలాంటి పరిస్థితిలో, అతని తల్లి సవితా సింగ్ కుటుంబాన్ని చూసుకునేది. ఆమె జూనియర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రఖర్ తన తల్లి నుంచి ప్రేరణ పొందేవాడు. తండ్రి దగ్గరే క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఒక ఐపిఎస్ అధికారి పాత్రబాధ్యత ఏమిటో కూడా అతను చెప్పేవారు. ఎడ్యుకేషన్ : ప్రఖర్ సింగ్ .. తొలినాళ్ల నుంచి చదువుతో ప్రతిభ కనబరిచే వారు. రాంపూర్లోని దయావతి మోదీ అకాడమీలో 12వ తరగతి వరకు చదివాడు. 12వ తరగతిలో 98 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో ప్రవేశం పొందాడు. 2015 నుండి 2019 వరకు, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ క్రమంలో యూఎస్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. 2018 సంవత్సరంలో, మూడవ సంవత్సరం ముగింపులో, అతను ఇంటర్న్షిప్పై US వెళ్ళాడు. అక్కడ నానోటెక్నాలజీలో పరిశోధన చేసి తిరిగి వచ్చాడు. స్కాలర్షిప్ ద్వారా యుఎస్ వెళ్లాడు. ఆ స్కాలర్షిప్ ద్వారా దేశం నలుమూలల నుంచి 19 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాంటిది అవన్నీ వదలుకోని యూపీఎస్సీ కోసం కసరత్తులు చేశాడు. సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావడంలో స్థిరత్వం క్రమశిక్షణ పాటించాలని ప్రఖర్ చెప్పారు. అలాగే పరధ్యానాన్ని విస్మరించండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తల్లిదండ్రులు, స్నేహితులతో సంతోషంగా మాట్లాడండి. అలాగే వీరితో సన్నిహితంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షను ఆధారిత పద్ధతిలో చదవండి. మీపై మీరు విశ్వాసాన్ని ఉంచుకోండి. యూపీఎస్సీ ప్రయాణం మారథాన్ లాంటిదని ప్రఖర్ సింగ్ అన్నారు. ఇది ఒక సంవత్సరం లేదా ఆరు నెలల తయారీ కాదు. మీ వ్యక్తిత్వం.. మీ ఆలోచన ప్రక్రియ దీర్ఘకాలం మీద ప్రభావం చూపుతుంది. నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు చదివేవాడిన. దీని వల్ల జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ వైపు మొగ్గు చూపాను. ప్రతి వ్యక్తి జీవితంలో పోరాటం ఉంటుంది. ఎవరో జాబ్ చేస్తున్నారో లేదో.. మీకు అవసరం లేదు. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ కాకపోయినా, కాస్త సమయం కేటాయించి మంచి పుస్తకాలు చదవాలి. అతను ఎల్లప్పుడూ తన ఆలోచన విధానాన్ని రిఫ్రెష్ చేసేవాడు. మీలో కొత్త ఆలోచనలు రావాలి. నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ. ఇది ఎల్లప్పుడూ ఆన్లో ఉండాలి. ఎప్పుడూ కొత్త పుస్తకాలు చదవండి. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త ఆలోచనలను వినండి. ఆశావహులు ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. మీరు ప్రిపరేషన్లో స్థిరత్వం.., క్రమశిక్షణను పాటిస్తే.. మీరు బెస్ట్గా నిలుస్తారు. స్నేహితుల నుంచి మారల్ మద్దతు లభిస్తుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి అనే చర్చ జరుగుతోంది. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది చూపిస్తుందన్నారు ప్రస్తుతం సోషల్ మీడియా మంచి పాత్ర పోషిస్తోందని చెప్పారు. చాలా వెబ్సైట్లలో మంచి కంటెంట్ను చూడవచ్చు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బదులుగా, మీరు దాన్ని ఉపయోగించండి. మీరు వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలో నేను తన సోషల్ మీడియా ఖాతాను కూడా డీయాక్టివేట్ చేయలేదు. -
ఆమ్రపాలి సక్సెస్ జర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేపథ్యం ఇదే..
ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ కేడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కలెక్టర్గా పనిచేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. చిన్న వయసులో.. ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటీవల నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఫ్యామిలీ గురించి.. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్లో ఇన్కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆమ్రపాలి మనసులో మాట.. స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహరాలపై ఆమ్రపాలి ఓ సందర్భంలో స్పందిస్తూ... పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు. అందరితో మంచి అనిపించుకోవాలనే ఆత్రుతతో తమని తాము కోల్పోతున్నారు..’ అంటారు. ఒక్క రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని, వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు, తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చనేది ఆమె అభిప్రాయం. ఓ కలెక్టర్గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళలో చాలా మందిని గమనించా.. పెళ్లైన తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు. ఇబ్బంది పెడుతున్నాడు, భర్త, అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయటి నుంచి చూపించడం కష్టం. తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోతుంది, నా భర్తే అంతా చూసుకుంటారు అనే ఆలోచణ ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్ర సాధించే దిశగా పదో తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు. తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు, నైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగం లేదంటే కుట్లు,అల్లికలు.. ఇలా క్రియేటివ్ వర్క్ ఏదైనాచేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో.. సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్ అనలేదు. పని ప్రదేశాల్లో... ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులకు ఒకే రకమైన సదుపాయాలు ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు కార్యాలయంలో పని చేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ పెద్ద సమస్య. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది. ఇక్కడ చాలా బెటరే...కానీ అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. ప్రభుత్వ ఉద్యోగమే.. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్ ట్రాక్లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్లో చదువు ఆపేసిన వారు, అన్ స్కిల్ల్డ్ గల్స్ కోసం వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.. గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్. హౌజ్ వైఫ్గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్ గో అవుట్ అండ్ వర్క్... దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలక్ట్ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది అందరం బాధపడే విషయం...ఎందుకంటే..? మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి. -
‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ
వీరు ఆకాశానికి నిచ్చెనలు వేయలేదు గానీ... ఆకాశమంత కల కన్నారు. తమ ప్రతిభతో బంగారంలాంటి అవకాశాలను సృష్టించుకున్నారు. ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్తో తిరుగులేని విజయం సాధించారు.... చెత్త సమస్య భూలోకంలోనే కాదు అంతరిక్షంలోనూ ఉంది. దాన్ని స్పేస్ జంక్ అని పిలుస్తారు. వేలాది సంఖ్యలో ఉండే ఈ వ్యర్థాలు భూగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటి సంఖ్య పెరిగిపోవడం అనేది ఉపగ్రహాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటి భద్రతకు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యర్థాల తొలగింపుపై ఇస్రో దృష్టిపెట్టింది. మరోవైపు సెల్ఫ్ ఈటింగ్ రాకెట్లు, వానిషింగ్ శాటిలైట్ల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతరిక్ష చెత్త గురించి సీరియస్గా చర్చ మొదలైన పరిస్థితులలో బెంగళూరు కేంద్రంగా మొదలైన ‘దిగంతర’ అనే అంకురసంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘స్టార్టప్’ స్టార్ట్ చేయడం ఎంత సవాలో, ‘యస్. మేము చేయగలం’ అని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించడం అంతకంటే పెద్ద సవాలు. అలాంటి సవాలే ఈ ముగ్గురు కుర్రాళ్లకి ఎదురైంది. అనిరుద్ శర్మ, రాహుల్ రావత్, తన్వీర్ అహ్మద్లు ‘దిగంతర’ పేరుతో స్పేస్ టెక్ స్టార్టప్కు శ్రీకారం చుట్టినప్పుడు పెద్దగా ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ‘అప్పుడే ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని వచ్చిన యువకులు స్పేస్ స్టార్టప్ గురించి చెబితే నమ్మడం కష్టమే. అందుకే ఇన్వెస్టర్ కమ్యూనిటీలో నమ్మకం కలిగించడమే మా తొలి లక్ష్యం అయింది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు అనిరుథ్. ‘దిగంతర’ అనేది అంతరిక్ష వ్యర్థాల సమస్యకు పరిష్కారం కనుక్కునే స్టార్టప్. ‘అంతరిక్షంలో ఉన్న చెత్తతో వ్యాపారమా? ఇది ఎలా సాధ్యం’ అనే ఆశ్చర్యాలు బారులు తీరాయి. ఎందుకంటే ఇలాంటి అంకుర సంస్థ గురించి వినడం వారికి ఇదే మొదటిసారి. ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... అనిరుథ్ శర్మ పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ(ఎల్పీయూ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అయితే ఇతడికి ఏరోస్పేస్, ఏరోనాటిక్స్ అంటే చాలా ఇష్టం. శర్మ మిత్రుడు తన్వీర్ అహ్మద్ బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఇస్రో మార్గదర్శకాలతో తమ కాలేజీలో ‘స్టూడెంట్ శాటిలైట్ టీమ్’ ప్రారంభించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న శర్మ తమ యూనివర్శిటీలో కూడా అలాంటి టీమ్ను ప్రారంభించాడు. ఇస్రో ఆధ్వర్యంలో చండీగఢ్లో జరిగిన ఒక సదస్సులో ఈ టీమ్ ఒక పేపర్ సమర్పించి అవార్డ్ సొంతం చేసుకుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జర్మనీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన తరువాత ‘స్పేస్ సస్టెయినబిలిటీ’ అనేది ఎంత పెద్ద సవాలో లోతుగా తెలుసుకోగలిగారు. ఒక లాటిన్ అమెరికా స్పేస్ కంపెనీ కోసం శాటిలైట్ విడిభాగాలను తయారుచేసి శబ్భాష్ అనిపించుకున్నారు. అలా ‘దిగంతర’కు అంకురార్పణ జరిగింది. ఈ కంపెనీకి అనిరుథ్ శర్మ సీయివో, తన్వీర్ అహ్మద్ సీటివో(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), రాహుల్ రావత్ సీవోవో (చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నుంచి 15 లక్షల గ్రాంట్ పొందడం దిగంతర సాధించిన తొలివిజయం. స్పేస్ క్లైమెట్ అండ్ ఆబ్జెక్ట్ ట్రాకర్ (ఎస్సీవోటి), ఆర్బిటల్ ఇంజన్, స్పేస్–ఎడాప్ట్...అనే మూడు విభాగాల్లో ‘దిగంతర’ పనిచేస్తుంది. హార్డ్వేర్,సాఫ్ట్వేర్లతో మిళితమైన ‘ఇన్–ఆర్బిట్ స్పేస్ డెబ్రీస్ మానిటర్’ 1 సెం.మీ నుంచి 20 సెం.మీ పరిమాణంలో ఉన్న అంతరిక్ష వ్యర్థాలను ట్రాక్ చేస్తుంది. ఆ తరువాత విజువలైజేషన్ మోడల్ రూపొందించి కేటలాగ్ తయారుచేస్తారు. ‘మేము ఇచ్చే డాటా ద్వారా కస్టమర్ల మిషన్ ఆపరేషన్ ఖర్చు చాలా తగ్గుతుంది’ అంటుంది దిగంతర. మన ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో ప్రైవెట్ కంపెనీలకు పచ్చజెండా ఊపిన తరువాత ‘దిగంతర’లాంటి కంపెనీలకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఇటలీకి చెందిన ప్రసిద్ధ స్పేస్ ఫ్లైట్ సర్వీసెస్ కంపెనీ ‘టెలిస్పాజియో’ కెనడియన్ స్పేస్స్టార్టప్ ‘నార్త్స్టార్ ఎర్త్ అండ్ స్పేస్’లో వాటా తీసుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ ‘దిగంతర’పై కూడా ఆసక్తి చూపుతుంది. ‘వీరి గురించి గొప్పగా చెప్పుకోవడానికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి... స్టూడెంట్స్గానే ఎన్నో సాధించారు. రెండు... వృత్తినిబద్ధత. టెక్నాలజి విషయాలు మాత్రమే కాకుండా మార్కెట్ సంబంధిత అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది’ అని ప్రశంసిస్తున్నారు ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ చైర్మన్(సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్..బెంగళూరు) సీవి మురళీ. భవిష్యత్లో ‘దిగంతర’ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. చదవండి: Health Tips: ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఆరోగ్యం లేకుంటే.. ఈ చిట్కాలు పాటిస్తే -
Meesho: ‘మీ షో యాప్’ ఫౌండర్ విదిత్ ఆత్రే సక్సెస్ స్టోరీ!
Meesho is the freshest Organization to join the Unicorn Club: కిందపడ్డప్పుడు ‘అయ్యో!’ అనుకుంటారు అందరు. ‘ఎందుకు పడ్డాం?’ అని ఆలోచిస్తారు కొందరు. రెండో కోవకు చెందిన వారు కాస్త లేటయినా ఘాటైన విజయం సాధిస్తారు.... ఇందుకు ఈ ఇద్దరే ఉదాహరణ... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న విదిత్ ఆత్రే ‘ఫోర్ట్స్’ జాబితాలోని యువ సంపన్నుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవాడు. అలాంటి విదిత్ పవర్ఫుల్ ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ ఏషియా జాబితాలోకి రాడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక కాస్త వెనక్కి వెళితే... చదువు పూర్తయిన తరువాత మంచి ఉద్యోగాలే చేశాడు విదిత్. ఆ సమయంలోనే అతడికొక మంచి ఆలోచన వచ్చింది. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం యాప్ మొదలుపెడితే ఎలా ఉంటుంది? అని. అయితే తన ఆలోచనకు పెద్దగా మద్దతు లభించలేదు. ‘చాలా కష్టం’ అన్నవాళ్లే ఎక్కువ. దిల్లీ కాలేజీలో తన బ్యాచ్మేట్ సంజీవ్ బర్నావాల్ కూడా తనతో పాటే ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు. కాస్త వెనక్కి వెళితే...తన చదువు పూర్తి అయిన తరువాత జపాన్లోని సోనీ కంపెనీలో మంచి ఉద్యోగం చేశాడు సంజీవ్. ఇండియాలో ఉన్న విదిత్, జపాన్లో ఉన్న సంజీవ్ తమ ఆలోచనలను కలిసి పంచుకునేవారు. వారి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత బెంగళూరులో హైపర్ లోకల్ ఫ్యాషన్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ‘ఫ్యాష్నియర్’తో రంగంలోకి దిగారు. తామే స్వయంగా కరపత్రాలు పంచినా, కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు కష్టపడి షాప్కు రావాల్సిన అవసరం లేదు. మా యాప్ విజిట్ చేస్తే చాలు’ అని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి ప్రయత్నం విజయవంతంగా ఫ్లాప్ అయింది. అలా అని ‘చలో బ్యాక్’ అనుకోలేదు. తమ పని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకున్నారు. అప్పుడు వారికి అర్ధమైందేమిటంటే ఫ్యాషన్ మార్కెట్కు ఉండే ‘వైడ్రేంజ్ ఆప్షన్స్’ వల్ల తమ ప్రయత్నం విజయవంతం కాలేదని. ఆ సమయంలోనే వారి ఆలోచనలు చిన్నవాపారుల చుట్టూ తిరిగాయి. సాధారణంగా చిన్న వ్యాపారులకు సొంత వెబ్సైట్లు ఉండవు. అలా అని అమెజాన్, ఫ్లిప్కార్ట్...లాంటి పెద్ద వేదికల దగ్గరికి వెళ్లరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాష్నియర్’కు శుభం కార్డు వేసి ‘మీ షో’(మేరీ షాప్–మై షాప్) యాప్ను డిజైన్ చేశారు. చిన్నవ్యాపారులకు ఇదొక అద్భుతమై మార్కెట్ ప్లేస్గా పేరు సంపాదించుకుంది. తమ ప్రాడక్స్ను యాడ్ చేయడానికి, వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సులభంగా షేర్ చేయడానికి, సులభంగా యూజ్ చేయడానికి ‘బెస్ట్’ అనిపించుకుంది మీ షో. డెలివరీ, మానిటైజ్ల ద్వారా సెల్లర్స్ నుంచి కమీషన్ తీసుకుంటుంది మీ షో. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి నెల సెల్లర్స్ సంఖ్య పెరుగుతుంది. చిన్న వ్యాపారుల కోసం ఏర్పాటయిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెద్ద విజయం సాధించింది. మన దేశంలోని లార్జెస్ట్ సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒకటిగా నిలిచింది. విదిత్, సంజీవ్లను రైజింగ్స్టార్లుగా మార్చింది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్నెస్.. -
ప్యాన్కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ
ఎగిసిపడే అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా జ్వాల పైకే లేస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపన ఉన్న వ్యక్తుల చుట్టూ వ్యతిరేక పరిస్థితులు ఎక్కువగా కాలం అడ్డుగా నిలవలేవు. సమయస్ఫూర్తి, పట్టుదల, ఓపిక ఉంటే చదువు, డబ్బుతో పని లేకుండా బిజినెస్లు చేయవచ్చు అనేందుకు వికేశ్ షా జీవితం ఓ ఉదాహారణ. పేరుతో ఆయన్ని గుర్తు పట్టడం కష్టం, కానీ 99 ప్యాన్కేక్ అంటే గుర్తు పట్టడం తేలిక. డిగ్రీ కూడా చేయని అతను దేశంలోనే ఓ ఫుడ్ ఫ్రాంచైజీకి యాజమాని స్థాయికి ఎలా ఎదిగాడు ? 99 Pancakes Founder Vikesh Shah Success Story: ముంబైకి చెందిన వికేశ్ షాది చిన్నప్పుడు కలిగిన కుటుంబమే. తండ్రి వజ్రాల వ్యాపారిగా బాగానే సంపాదించాడు, అయితే వికేశ్ పదో తరగతిలో ఉన్నప్పుడు తండ్రికి వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. ఉన్న ఆస్తులన్నీ పోయాయి. రెండు గదుల ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ దిగులుతో తండ్రి మంచం పట్టగా కుటుంబం గడవడం కోసం తల్లి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఆ సంపాదన సరిపోక, ఇంటర్లోనే చదువుకి పులిస్టాప్ పెట్టి.. దగ్గరల్లో ఉన్న ఓ బేకరిలో బాయ్గా 1995లో వికేశ్షా చేరాడు. నెల జీతం రూ. 700 ఆ సమయంలో ఆ సంపాదన ఆ కుటుంబానికి ఎంతో అవసరం. బాయ్ టూ మేనేజర్ ఇంటర్తోనే చదువు ఆపేసినా చుట్టూ పరిస్థితులను అంచనా వేయడంలో వికేశ్ దిట్ట. బేకరీకి ఎలాంటి కస్టమర్లు వస్తున్నారు... ఏ ఐటమ్స్ ఎక్కువగా తింటున్నారు. అందులో వాళ్లకి ఏం నచ్చుతుందో పసిగట్టాడు. ఓనర్కి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండటంతో రెండేళ్లలోనే ఆ బేకరీలో బాయ్ నుంచి మేనేజర్గా ఎదిగాడు. కేటరింగ్ జీవితంలో పైకి ఎదగాలన్న తపన్న ఉన్న వాళ్లు చిన్న చిన్న విజయాలకే సంతృప్తి పడిపోరు. వికేశ్లో పైకి ఎదగాలన్న పట్టుదల ఎక్కువ. అందుకే మేనేజర్గా పని చేస్తుండగా ఉన్న పరిచయాలు ఆధారంగా చేసుకుని క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించాడు. బర్త్డేలు, కిట్టీ పార్టీలకు క్యాటరింగ్ ప్రారంభించారు. అలా పదేళ్లలో నాలుగు లక్షల రూపాయలు పోగేశాడు మరోమెట్టు కష్టపడే తత్వం, తన కాళ్లపై తాను నిలబడాలనే కోరిక బలంగా ఉన్న వికేశ్ స్వంతంగా బేకరీ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. తన దగ్గరున్న డబ్బులు బేకరీ స్టార్ట్ చేసేందుకు సరిపోకపోవడంతో స్నేహితులు, పరిచయస్తులను పార్టనర్లుగా చేర్చుకుని బిజినెస్ ప్రారంభిద్దామన్నాడు. నీకు బిజినెస్ ఎందుకురా? ‘నువ్వు కనీసం డిగ్రీ కూడా చేయలేదు. ఏదో కలుపుగోలుగా ఉన్నాం కదా అని బిజినెస్ అదీ అంటూ మాట్లాడకు. కేటగింగ్ ఏదో నడుస్తుంది కదా చూసుకో చాలు.. పెద్ద పెద్ద కలలు కనకు’ అంటూ వికేశ్ని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో ఆత్మ విశ్వాసం తప్ప వికేశ్కి తోడుగా ఎవ్వరూ నిలవలేదు. తీవ్ర సందిగ్ధం మధ్య తన డ్రీమ్ను నెరవేర్చుకోవాలనే డిసైడ్ అయ్యాడు. అలా బంధువులు, స్నేహితుల దగ్గర చేసిన అప్పుతో 2007లో హ్యాపినెస్ డెలీ పేరుతో బేకరీ ప్రారంభించాడు. నల్లేరు మీద నడక బేకరీ బాయ్గా ఉన్నప్పుడే కస్టమర్ల పల్స్ తెలుసుకున్న వికేశ్కి హ్యపినెస్ డెలీ బేకరీ నిర్వాహణ నల్లేరు మీద నడకే అయ్యింది. చూస్తుండగానే బేకరీ బిజినెస్ ఊపందుకుంది. జీవితంలో సకల సౌకర్యాలు ఒక్కొక్కటిగా సమకూరాయి. ఒకప్పటి ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవు. దీంతో వెకేషన్కి కుటుంబంతో కలిసి 2014లో యూరప్ టూర్కి వెళ్లాడు. తొలిసారి అక్కడే యూరప్ పర్యటనలో ఉండగా అక్కడ ప్యాన్కేక్ కాన్సెప్టు వికేశ్ని విపరీతంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ కంట్రీస్లో స్ట్రీట్ ఫుడ్ నుంచి మెయిన్ రెస్టారెంట్ల వరకు ప్యాన్కేక్లు విపరీతంగా అమ్ముడైపోవడం చూశాడు. ఇరవై ఏళ్లుగా బేకరీ ఫీల్డ్లో ఉన్న తనకీ వాటి రుచి నచ్చింది. ఆచరణలో ముంబైకి వచ్చిన వెంటనే బేకరీ ఫీల్డులో ఉన్న చెఫ్లను పిలిపించి పాన్ కేక్ కాన్సెప్టు చెప్పాడు. చాలా మంది ఇదిక్కడ సక్సెస్ కాదంటూ పెదవి విరిచారు. వాళ్ల మాటలు లెక్క చేయకుండా బేకరీలోనే పాన్ కేక్ను తయారు చేసి కస్టమర్లు అందించాడు. అందులో ఓ వెస్ట్రన్ లేడీ ‘ పాన్ కేక్ బాగుందని.. ఎక్స్క్లూజివ్గా ఓ స్టోర్ ఓపెన్ చేయమని’ సలహా ఇచ్చింది. నమ్మకంతో ఇండియాలో ప్యాన్కేక్ కాన్సెప్టు కొత్త .. ఎక్స్క్లూజివ్ స్టోర్ ఓపెన్ చేస్తే జనాల ఆదరణ లభిస్తుందా లేదా అనే సందేహం. ఎందుకంటే ఒకప్పుడు వజ్రాల వ్యాపారిగా లక్షలు గడించిన తండ్రి ఒక్క దెబ్బతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కుటుంబం రోడ్డు మీదికొచ్చిన పరిస్థితి కళ్ల ముందు కదలాడుతోంది. జీవితంలో అంతా బాగుంది అనుకునే సమయంలో రిస్క్ ఎందుకు అనే భయం మధ్య ఊగిలసాట ఏడాది పాటు కొనసాగింది, చివరకు కలను నిజం చేసుకునేందుకు రిస్క్ చేసినా పర్వాలేదనే నమ్మకంతో 99 ప్యాన్కేక్ పేరుతో ఎక్స్క్లూజివ్ స్టోర్ని 2017లో కాలాగోడా సెంటర్లో ఓపెన్ చేశాడు వికేశ్. ఒక్క కేక్ ధర రూ.99 కావడంతో 99 పాక్కేక్స్గా పేరు పెట్టారు. భయపడ్డట్టే పాన్ కేక్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో తొలి వారం అమ్ముడైన కేకులు కేవలం రూ. 500లవే. ఆ తర్వాత రెండు వారాలు ఒక్క కేకు అమ్ముడు పోలేదు. ఇదే సమయంలో ఆ షాప్ ముందు ముంబై మున్సిపాలిటీ వాళ్లు మరమ్మత్తుల పేరుతో రోడ్డు తవ్వేయడంతో నెల రోజుల పాటు బిజెనెస్ డల్గా మారింది పట్టు వదల్లేదు ప్యాన్కేక్ అనే పేరు కొత్త, పైగా ఖాళీ కుర్చీలు కనిపిస్తుండటంతో కష్టమర్లు రావట్లేదని గమనించాడు. వెంటనే కష్టమర్లతో నిండిపోయినట్టుగా కనిపించేలా రోజు ప్యాన్కేక్ స్టోర్కి వచ్చి కూర్చోవాలంటూ తన స్నేహితులు, కుటుంబ సభ్యులను కోరాడు. వారికే ఆర్డర్లు సర్వ్ చేసేవాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. వారం తిరిగే సరికి స్నేహితులు రావాల్సిన అవసరం తప్పింది. నెల రోజుల్లో టేబుల్స్ ఖాళీగా లేని స్థితికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 2017లో వికేశ్ ఇండియాకు తీసుకువచ్చిన ప్యాన్కేక్లు మూడేళ్లు తిరిగే సరికి దేశవ్యాప్తంగా ఫేమస్ ఫుడ్ ఐటమ్గా మారిపోయాయి. ముంబైతో పాటు పద్నాలుగు సిటీల్లో 65 స్టోర్లు ఓపెన్ చేసే స్థితికి చేరుకుంది. హైదరాబాద్లో కూడా 99 ప్యాన్కేక్ స్టోర్ ఉంది. కేవలం రెండేళ్లలోనే రూ. 16 కోట్ల టర్నోవర్ సాధించే స్థితికి 99 ప్యాన్కేక్ చేరుకుంది. ఇరవై ఐదేళ్ల కిందట ఇంటర్ పూర్తి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో బేకరీ బాయ్గా చేరిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి కావడమే కాకుండా ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నాడు. సాక్షి, వెబ్డెస్క్ ప్రత్యేకం చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి -
ఫీనిక్స్
-
అప్పు చేసి షేర్లా! అమ్మో!!
కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభపడిన ఇన్వెస్టర్ల సక్సెస్ స్టోరీలను తెలుసుకున్నాం. కాకపోతే స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వారూ ఎక్కువే ఉంటారు. అలా నష్టపోవటానికి బలమైన స్వయంకృతాపరాధాలు తప్పకుండా ఉంటాయి. ఈ వారం అలాంటి స్వయంకృతంతో తీవ్రంగా నష్టపోయిన వణుకూరు దుర్గా ఆనందరావు ‘ఫెయిల్యూర్ స్టోరీ’ని తెలుసుకుందాం... నా పేరు దుర్గా ఆనందరావు. మాది కృష్ణా జిల్లా వణుకూరు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని మొదటి నుంచీ ఉండేది. 1990లో మ్యూచువల్ ఫండ్స్తో నా ఇన్వెస్ట్మెంట్స్ను ప్రారంభించా. 1990 డిసెంబర్లో యూటీఐ మాస్టర్ ప్లస్ ఆఫర్ రావడంతో అందులో రూ.20,000 ఇన్వెస్ట్ చేశా. అది కొత్త ఫండ్ కావడంతో యూనిట్ రూ.10 చొప్పున చేతికి రెండు వేల యూనిట్లు వచ్చాయి. ఇన్వెస్ట్ చేసిన ఆరు నెలలకే ఇన్వెస్ట్మెంట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా పెరిగినపుడు అమ్మేస్తే బాగుండేదేమో!! కానీ అమ్మకుండా ఇంకా పెరుగుతుందని ఎదురు చూశా. అంతలోనే ఒక్కసారిగా మార్కెట్లు పతనమవుతూ ఇన్వెస్ట్మెంట్ విలువ తగ్గటం మొదలైంది. నాకు కాస్త భయమేసి తొలుత ఒక వెయ్యి యూనిట్లను రూ.42,000 వద్ద, మిగిలిన యూనిట్లను రూ.21,000 వద్ద విక్రయించా. ఇలా తక్కువ సమయంలోనే రెండు రెట్లు లాభం రావడంతో నాలో అత్యాశ మొదలయింది. మ్యూచువల్ ఫండ్స్లోనే ఇంత లాభం ఉంటే నేరుగా షేర్లను కొని అమ్మితే ఇంకెంత లాభం వస్తుందోనన్న ఉద్దేశంతో సెకండరీ మార్కెట్లోకి ప్రవేశించా. నా అదృష్టం కొద్దీ కొన్న షేర్లన్నీ మంచి లాభాలిచ్చాయి. ఆరు నెలల్లోనే నా ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగింది. ఇలా రెండు చోట్లా లాభాలు రావడంతో నా ఆత్మ విశ్వాసం అతి విశ్వాసంగా మారిపోయింది. నా ఆశకు అంతు లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా నెలకు రూ.5 చొప్పున వడ్డీకి అప్పు తీసుకుని మరీ షేర్లలో పెట్టుబడి పెట్టా. నేను కొన్న షేర్లన్నీ ఆ సమయంలో బాగా పెరుగుతున్న కంపెనీలవే. కానీ నేను ఇలా అప్పు చేసి కొన్న కొద్ది కాలానికే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి వేశారన్న వార్తలు రావడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఆ సమయంలో నేను కొన్న షేర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అవి ఘోరంగా పతనం కావడంతో పరిస్థితి అంతా తల్లకిందులయింది. ఒక్కసారిగా పిచ్చెక్కినట్లయ్యింది. అప్పుచేసి పెట్టుబడి పెట్టడంతో రిస్కును భరించలేకపోయాను. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. అదే సమయంలో పెళ్ళి కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టినట్టయింది. దీనికితోడు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలకు అవధుల్లేకుండా పోయాయి. ఇక తప్పని పరిస్థితుల్లో ఉన్న షేర్లన్నీ నష్టాలకు అమ్మేసి స్టాక్ మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలిగాను. అప్పులిచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని... బ్యాంకు వడ్డీ చెల్లిస్తానని వారిని ఒప్పించాను. మొత్తానికి అప్పుల నుంచి బయపడ్డాను. ఇక అప్పటి నుంచి నేను ఇక స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళలేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నా విజ్ఞప్తి ఒక్కటే. అత్యాశకు పోవద్దు. అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు.