Tom Latham
-
పాక్తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! అబ్బాస్కు చోటు
స్వదేశంలో పాకిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ కోసం 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఐపీఎల్-2025లో పాల్గోనేందుకు వెళ్లడంతో లాథమ్ను సారథిగా కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ జట్టులో భాగమైన ఎనిమిది మంది ఆటగాళ్లు పాక్తో సిరీస్కు ఎంపికయ్యారు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ వంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో బీజీబీజీగా ఉండడంతో ఈ సిరీస్కు ఎంపిక కాలేకపోయారు. మరోవైపు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. అదేవిధంగా కైల్ జామిసన్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక బ్యాటర్లు నిక్ కెల్లీ, ముహమ్మద్ అబ్బాస్లకు తొలిసారి కివీస్ జట్టులో చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతుండడంతో వీరిద్దరికి సెలక్టర్లు అవకాశమిచ్చారు. నిక్ కెల్లీ ప్లంకెట్ షీల్డ్లో నాలుగు సెంచరీలతో సహా 749 పరుగులు చేయగా.. ముహమ్మద్ అబ్బాస్, వన్డే టోర్నమెంట్ ఫోర్డ్ ట్రోఫీలో 340 పరుగులు చేశాడు. పాకిస్తాన్ మూలాలు ఉన్న అబ్బాస్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాడు. అవసరమైతే బంతితో కూడా అతడు రాణించగలడు. అదేవిధంగా స్పిన్నర్ అదితి ఆశోక్ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత కివీస్ జట్టులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లలో జరగనుండడంతో, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని కివీస్ క్రికెట్ సెలక్టర్ ఒకరు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్-పాక్ మధ్య వన్డే సిరీస్ మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కివీస్ మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.పాకిస్తాన్ సిరీస్ కోసం న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆది అశోక్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విల్ యంగ్ -
ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వ్యవహరించిన తీరును కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. వికెట్ కోసం అప్పీలు చేసే క్రమంలో జడ్డూ ప్రవర్తించిన విధానం సరికాదని.. అంపైర్ అతడికి హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి మ్యాచ్లో భాగంగా భారత్- న్యూజిలాండ్తో తలపడిన విషయం తెలిసిందే.శ్రేయస్ అద్భుత అర్ధ శతకందుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(India vs New Zealand) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుబ్మన్ గిల్(2), విరాట్ కోహ్లి(11) విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించింది.నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధ శతకం(98 బంతుల్లో 79) సాధించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) రాణించారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిగతా వారిలో కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు.విలియమ్సన్ హాఫ్ సెంచరీఇక 250 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి కివీస్ జట్టు ఆలౌట్ అయింది. రచిన్ విఫలం(6) కాగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ(81) చేయగా.. ఓపెనర్ విల్ యంగ్(22), మిచెల్ సాంట్నర్(28) మాత్రమే ఇరవై పరుగుల మార్కు అందుకోగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. పేసర్లలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ను అవుట్ చేసే క్రమంలో జడేజా వ్యవహరించిన తీరును కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు.కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన జడ్డూ రెండో బంతిని అద్భుతంగా సంధించాడు. అతడి స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న లాథమ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. బంతి అతడి తొడకు తాకింది. లేదంటే బంతి నేరుగా ఆఫ్ స్టంప్ను ఎగురగొట్టేదే. ఈ నేపథ్యంలో అంపైర్ లాథమ్ను లెగ్ బిఫోర్ వికెట్గా ప్రకటించగా అతడు పెవిలియన్ చేరాడు.ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?అయితే, లాథమ్ విషయంలో జడేజా పిచ్ మధ్య వరకు వచ్చి అప్పీలు చేయడం సరికాదంటూ సైమన్ డౌల్ కామెంట్రీలో పేర్కొన్నాడు. ‘‘అతడు ఏం చేశాడో చూడండి. ఆటగాళ్లు ఇలా చేయవచ్చా? అతడిని అంపైర్ హెచ్చరించి ఉండాల్సింది’’ అని డౌల్ అభిప్రాయపడ్డాడు. అసలు ఆటగాడు పిచ్ మధ్యలోకి రావడం ఏమిటంటూ అసహనం వెళ్లగక్కాడు. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గ్రూప్-‘ఎ’ టాపర్గా నిలిచింది. ఇక అంతకుముందు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో... దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్లోనూ గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లాలని పట్టుదలగా ఉంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
అందుకే ఓడిపోయాం.. ఆ ఇద్దరు మాత్రం అద్బుతం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఆరంభ మ్యాచ్లోనే పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పాక్.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) జట్టు పరాజయంపై స్పందించాడు. కివీస్ జట్టు భారీ స్కోరు సాధిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.తాము అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశామని.. అయితే, న్యూజిలాండ్ తమ కంటే గొప్పగా ఆడిందని రిజ్వాన్ ఓటమిని అంగీకరించాడు. ఏదేమైనా తొలి మ్యాచ్లోనే ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన విల్ యంగ్, లాథమ్ఈ క్రమంలో కరాచీ వేదికగా ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో పాక్ న్యూజిలాండ్తో తలపడింది. నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో టాస్ గెలిచిన రిజ్వాన్ బృందం తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే(10)తో పాటు వన్డౌన్ స్టార్ కేన్ విలియమ్సన్(1), డారిల్ మిచెల్(10) త్వరగా పెవిలియన్కు పంపి శుభారంభం అందుకుంది.కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ విల్ యంగ్(Will Young- 107), వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) పాక్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ ఇద్దరు అద్భుత శతకాలతో రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్(39 బంతుల్లో 61) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు స్కోరు చేసింది.A quality knock! 💯#TomLatham brings up a stunning century, putting New Zealand firmly in command against the defending champions! 💪🏻FACT: Fifth time two batters have scored centuries in an innings in Champions Trophy!📺📱 Start watching FREE on JioHotstar:… pic.twitter.com/vAKzM0pW1Y— Star Sports (@StarSportsIndia) February 19, 2025 పాక్ బ్యాటర్ల వైఫల్యంఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 47.2 ఓవర్లకు కుప్పకూలింది. బాబర్ ఆజం(64), కుష్దిల్ షా(69) అర్ధ శతకాలు సాధించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 260 పరుగులకే ఆలౌట్ అయి.. అరవై పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు ఈ మేరు భారీ స్కోరు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు. 260 పరుగుల వరకే కివీస్ను కట్టడి చేయగలమని భావించాం. మా పరిధి మేర అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాం. అయితే, వాళ్లు మాకంటే గొప్పగా ఆడి భారీ టార్గెట్ ఇచ్చారు.ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో!నిజానికి ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు పెద్దగా సహకరించలేదు. కానీ విల్ యంగ్, లాథమ్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి.. సులువుగా పరుగులు రాబట్టేశారు. అయితే, ఆఖరి ఓవర్లలో మేము మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేశాం. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం.ఇక బ్యాట్తోనూ మేము శుభారంభం అందుకోలేకపోయాము. ఫఖర్ జమాన్ గాయంపై కూడా పూర్తి సమాచారం ఇంకా లభించలేదు. ఈ మ్యాచ్లో పవర్ప్లే, డెత్ ఓవర్లలో మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితం ఏదైనా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మిగతా మ్యాచ్లలో మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో రిజ్వాన్ 14 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి విలియం రూర్కీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్ న్యూజిలాండ్తో నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లూ కివీస్ జట్టే విజయం సాధించడం విశేషం. ఇక బుధవారం నాటి మ్యాచ్లో సెంచరీ వీరుడు టామ్ లాథమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
లాథమ్, యంగ్ సెంచరీలు.. పాక్ ముందు భారీ టార్గెట్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కరాచీ వేదికగా పాకిస్తాన్(Pakistan)తో జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు.73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన ఈ కివీ ద్వయం.. క్రీజులో సెటిల్ అయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు డెవాన్ కాన్వే(10), డార్లీ మిచెల్(10), విలియమ్సన్(1) విఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.అఫ్రిదిని ఉతికారేశారు..తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులిచ్చి వికెట్ ఏమీ సాధించలేకపోయాడు. గాయం నుంచి తిరిగి వచ్చాక అఫ్రిది తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్లో పేస్ కూడా తగ్గింది. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయడంలో కూడా అఫ్రిది విఫలమవుతున్నాడు. మరోవైపు హ్యారీస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.తుది జట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: PAK vs NZ: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే సూపర్ సెంచరీ -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 16 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.కాగా న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 259 పరుగులకు ఆలౌటైంది.న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. అంతకుముందు ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(106) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్ డకెట్(92), జాకెబ్ బెతల్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.మ్యాచ్ స్కోర్లు..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 280/10న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 125/10ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 424/6 డిక్లేర్కివీస్ రెండో ఇన్నింగ్స్: 259/10ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయంప్లేయర్ ఆఫ్ది మ్యాచ్: హ్యారీ బ్రూక్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్
పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.ఇన్నింగ్స్ 24వ ఓవర్లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈసారి యాష్ విల్ యంగ్ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యంగ్ పెవిలియన్ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 76/2గా ఉంది. డెవాన్ కాన్వే (38), రచిన్ రవీంద్ర క్రీజ్లో ఉన్నారు.ASHWIN STRIKES IN HIS FIRST OVER 👌- What a champion, India on charge at Pune. pic.twitter.com/oJOCsGZPAZ— Johns. (@CricCrazyJohns) October 24, 2024కాగా, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి టీమిండియాను బౌలింగ్కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ను డిఫెన్స్లోకి నెట్టేసింది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106 -
IND Vs NZ: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం!
న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్పై కివీస్ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్గా రెండో రోజు కివీస్దే పైచేయి అయింది.భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దుకాగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్ను పూర్తిగా కవర్స్తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు ‘హాక్–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్ బ్రేక్ ప్రకటించి ‘హాక్–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో రోజు కరుణించిన వరణుడుఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(13), కెప్టెన్ రోహిత్ శర్మ (2) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు.వికెట్ల పతనంఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మ్యాచ్ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.కాన్వే హీరో ఇన్నింగ్స్ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు డెవాన్ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో కివీస్ భారత్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
IND vs NZ 1st Test: బెంగళూరులో భారీ వర్షం.. అభిమానులకు చేదువార్త
Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడేందుకు కివీస్ జట్టు భారత్కు వచ్చింది.షెడ్యూల్ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్- కివీస్ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్తో కప్పినా.. సమయానికి మ్యాచ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.ఫైనల్ దారిలో టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2024 జట్లుటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024 -
Ind vs NZ: కివీస్ పేసర్ అవుట్! అన్క్యాప్డ్ ప్లేయర్ ఎంట్రీ
టీమిండియాతో టెస్టులకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ బెన్ సియర్స్(Ben Sears) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. సియర్స్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ జాకోబ్ డఫీ(Jacob Duffy)ని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో భాగంగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్లు ఆడనుంది. బెంగళూరు వేదికగా అక్టోబరు 16(బుధవారం) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి.మోకాలి గాయంఅయితే, తొలి టెస్టు ఆరంభానికి ముందే న్యూజిలాండ్ యువ పేసర్ బెన్ సియర్స్ మోకాలి గాయం తీవ్రమైంది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా 26 ఏళ్ల సియర్స్ ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.అనంతరం.. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. అయితే, రెండో టెస్టు సమయంలో మోకాలి నొప్పితో అతడు ఇబ్బందిపడ్డాడు. వైద్య పరీక్షల ఫలితాలు తాజాగా వెలువడగా.. ఆటకు కొంతకాలం దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో భారత్తో సిరీస్కు దూరమయ్యాడు.పేస్ విభాగం పటిష్టంగానేఇక సియర్స్ టీమిండియాతో సిరీస్కు సియర్స్ లేకపోయినా.. న్యూజిలాండ్ పేస్ విభాగం పటిష్టంగానే ఉంది. వెటరన్ బౌలర్ టిమ్ సౌతీతో పాటు ఎమర్జింగ్ పేసర్ విలియం ఒ రూర్కీ జట్టుతో ఉన్నారు. అంతేకాదు.. మీడియం పేసర్గా డారిల్ మిచెల్ కూడా సేవలు అందించగలడు. ఈ క్రమంలో సియర్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాకోబ్ డఫీకి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కే అవకాశం లేదు.టీమిండియాతో టెస్టు సిరీస్-2024కు న్యూజిలాండ్ జట్టు(అప్డేటెడ్)డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.న్యూజిలాండ్తో టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. తదుపరి న్యూజిలాండ్తో పోరులోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్లో తలమునకలైంది.ఇక స్వదేశంలో ఈ టెస్టు సిరీస్ జరుగనుండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు.. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 0-2తో వైట్వాష్ అయిన కివీస్ జట్టు.. భారత్లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ ఆరో స్థానంలో ఉంది.మరి ఇరుజట్లకు కీలకమైన ఈ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందామా?!టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ 2024 టెస్టు సిరీస్👉తొలి టెస్టు: అక్టోబరు 16(బుధవారం)- అక్టోబరు 20(ఆదివారం), ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉రెండో టెస్టు: అక్టోబరు 24(గురువారం)- అక్టోబరు 28(సోమవారం), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె👉మూడో టెస్టు: నవంబరు 1(శుక్రవారం)- నవంబరు 5(మంగళవారం), వాంఖడే స్టేడియం, ముంబై.మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం.. మూడు టెస్టులు ఉదయం 9.30 - సాయంత్రం 5 గంటల వరకు.ఎక్కడ చూడవచ్చు?👉టీవీ: స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్👉డిజిటల్ మీడియా: జియో సినిమా, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం.న్యూజిలాండ్తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్తో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh— BCCI (@BCCI) October 15, 2024 -
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ కెప్టెన్గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్.. ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్లను ఓటమితో ముగించింది.న్యూజిలాండ్ కెప్టెన్గా లాథమ్..ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్తో కివీస్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్ ఆక్టోబర్ 10న భారత్కు వచ్చే ఛాన్స్ ఉంది. -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం! -
అత్యుత్తమ ప్రదర్శన కాదు.. ఒత్తిడిలో ఉన్నాం.. రాత్రికిరాత్రి చెత్త టీమ్ అయిపోదు..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జరిగే రెండు లీగ్ మ్యాచ్ల్లో ఏ మ్యాచ్లో ఓడినా కివీస్ సెమీస్ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పందిస్తూ.. ఈ మ్యాచ్లో మేం స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. డికాక్, డస్సెన్ల భాగస్వామ్యం తర్వాత ఒత్తిడిలో పడ్డాం. వారు మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. మా బౌలర్లు ప్రత్యర్ధిని 330 పరుగుల్లోపు పరిమితం చేయాల్సి ఉండింది. అలా చేయడంలో మేం విఫలమయ్యాం. గ్రౌండ్ చాలా చిన్నగా, బ్యాటింగ్కు అనుకువగా ఉండింది. అయితే మేము పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మొదటి 10 ఓవర్లలో (పవర్ప్లే) పెద్దగా ఏమీ చేయలేకపోయాం. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి తమను తాము గొప్ప స్థితిలో ఉంచుకుంది. ఏ సందర్భంలోనూ వారు మ్యాచ్పై పట్టు కోల్పోలేదు. గాయాలు మా జట్టుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఈ ఓటమిని ఇక్కడితో వదిలేసి, తదుపరి పాక్తో జరుగబోయే మ్యాచ్పై దృష్టి సారిస్తాం. రాత్రికిరాత్రి మేం చెడ్డ జట్టుగా మారిపోమని అనుకుంటున్నానని అన్నాడు. కాగా, న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
Aus vs NZ: గ్రీన్ అవుట్.. ట్రవిస్ హెడ్ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ధర్మశాల వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగినట్లు కివీస్ సారథి టామ్ లాథమ్ తెలిపాడు. మార్క్ చాప్మన్ పిక్కల్లో నొప్పితో దూరంకాగా.. అతడి స్థానంలో జిమ్మీ నీషం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. మేము టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఈ మ్యాచ్లో కామెరాన్ గ్రీన్ స్థానంలో ట్రవిస్ హెడ్ తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు. ఇక కివీస్తో పోరు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుందన్న కమిన్స్.. ‘‘వాళ్లేంటో మాకు తెలుసు.. మేమేంటో వాళ్లకు కూడా బాగానే తెలుసు. భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో న్యూజిలాండ్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. మూడు గెలుపొందిన ఆసీస్ నాలుగో స్థానంలో ఉంది. తుదిజట్లు: న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం: న్యూజిలాండ్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. 274 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో న్యూజిలాండ్ బౌలర్లు సఫలం కాలేదు. ఈ మెగా టోర్నీలో తమ తొలి ఓటమిపై మ్యాచ్ అనంతర కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ స్పందించాడు. తమ బ్యాటింగ్లో ఆఖరి 10 ఓవర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని లాథమ్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ బ్యాటింగ్లో కాస్త తడబడ్డాం. మేము చివరి 10 ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మా స్కోర్ బోర్డ్లో మరో 30 నుంచి 40 పరుగులు తక్కువ అయ్యాయి. కానీ ఆఖరిలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాబట్టి క్రెడిట్ మొత్తం వారికే. రాచిన్ రవీంద్ర, మిచెల్ మాకు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. కానీ దాన్ని మేము వినియోగించుకోలేకపోయాం. మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా పోరాడారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. మా జట్టు ప్రస్తుతం సమతుల్యంగా ఉంది. మా తదుపరి మ్యాచ్ల్లో మేము మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో లాథమ్ పేర్కొన్నాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
ఓడినా వారు తోపులే.. ఆఫ్ఘన్ బౌలర్లపై ప్రశంసలు కురిపించిన కివీస్ కెప్టెన్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (అక్టోబర్ 18) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 149 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించారు. గత మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ను ఓడించి, సంచలనం సృష్టించిన ఆఫ్ఘన్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. అయితే ఓ దశలో ఆఫ్ఘన్ బౌలర్లు కివీస్ను వణికించారు. కేవలం పరుగు వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, కెప్టెన్ టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో ఆదుకోవడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లాథమ్, ఫిలిప్స్తో పాటు విల్ యంగ్ (54) కూడా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు.. ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్.. లోకీ ఫెర్గూసన్ (7-1-19-3), మిచెల్ సాంట్నర్ (7.4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (7-1-18-2), మ్యాట్ హెన్రీ (5-2-16-1), రచిన్ రవీంద్ర (5-0-34-1) ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మాత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (27) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. మెగా టోర్నీలో మరో మంచి ఆరంభం లభించింది. మా ఆటగాళ్లు మరో అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్లో మేము ఓ దశలో ఒత్తిడికి లోనయ్యాం. అయితే ఓ కీలక భాగస్వామ్యం (లాథమ్-ఫిలిప్స్) తిరిగి మమ్మల్ని మ్యాచ్లోకి తెచ్చింది. ఒత్తిడిలో ఫిలిప్స్ అద్బుతంగా ఆడాడు. ఇక్కడ ఆఫ్ఘన్ బౌలర్ల నైపుణ్యాన్ని పొగడకుండా ఉండలేము. వారు ప్రపంచంలోని ఎంతటి బ్యాటింగ్ లైనప్నైనా ఒత్తిడిలోకి నెట్టగలరు. ముఖ్యంగా ఆఫ్ఘన్ స్పిన్నర్లు ప్రత్యర్ధి నుంచి ఒక్కసారిగా మ్యాచ్ను లాగేసుకోగలరు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వారేం చేశారో చూశాం. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్లు ఓడినా, వారి బౌలర్లు తోపులే. మా బౌలర్ల విషయానికొస్తే.. అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవసరమైన సమయంలో వికెట్లు తీయగలిగారు. మిచ్ సాంట్నర్ మరోసారి తన పని తాను చేసుకుపోయాడు. మొత్తానికి హర్షించదగ్గ ప్రదర్శన. తుదుపరి భారత్, ఆస్ట్రేలియాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నామని అన్నాడు. -
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్లో సాన్ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్తో మ్యాచ్తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్లో పెద్దది. క్రీజ్లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: రచిన్ రవీంద్ర.. మొన్న సెంచరీ.. ఇప్పుడేమో!
ICC Cricket World Cup 2023 - New Zealand vs Netherlands: వన్డే వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ అర్ధ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కాగా ఉప్పల్లో సోమవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మూడు హాఫ్ సెంచరీలు ఈ క్రమంలో స్కాట్ ఎడ్వర్డ్ బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు. గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు. సాంట్నర్ మెరపులు అయితే, ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక.. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్ చేసిన మ్యాట్ హెన్రీ 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్కు కష్టమే! నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మెకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ ఛేదించడం కష్టంగానే కనిపిస్తోంది! ఇదిలా ఉంటే.. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్.. ఉప్పల్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరి ఇదే వేదికపై మరోసారి పటిష్ట కివీస్తో తలపడుతున్న డచ్ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో!? చదవండి: CWC 2023: ఓవరాక్షన్కు తప్పదు భారీ మూల్యం.. షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023 Eng Vs NZ: టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లండ్కు షాక్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే వరల్డ్కప్-2023కు తెరలేచింది. భారత్ వేదికగా పుష్కరకాలం తర్వాత మెగా టోర్నీ ఆరంభమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్కు షాక్.. స్టోక్స్ లేకుండానే టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక 2019 వరల్డ్కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్.. కివీస్తో బరిలోకి దిగనుంది. గాయం వేధిస్తున్న క్రమంలో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. వాళ్లు ముగ్గురూ మిస్ కాగా కొన్నాళ్ల క్రితం 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఇంగ్లండ్ బోర్డు విజ్ఞప్తి మేరకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ న్యూజిలాండ్కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా.. లాథమ్ మాట్లాడుతూ.. ‘‘టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. పిచ్ బాగుంది. పాతబడే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలిస్తుందనుకుంటున్నాం. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. దురదృష్టవశాత్తూ కేన్ ఇంకా మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. ఫెర్గూసన్ని గాయం వేధిస్తోంది. ఇష్ సోధి, కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ ఈరోజు మిస్సయ్యారు’’ అని పేర్కొన్నాడు. తుది జట్లు: న్యూజిలాండ్ డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్ జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. -
ప్రపంచకప్కు విలియమ్సన్ దూరం! న్యూజిలాండ్ కెప్టెన్గా లాథమ్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొకాలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2023లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్వదేశానికి వెళ్లిన కేన్మామ మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకోన్నాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక వేళ ప్రపంచకప్ సమయానికి విలియమ్సన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. కివీస్ జట్టను టిమ్ సౌథీ లేదా టామ్ లాథమ్ నడిపించే అవకాశం ఉన్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. "కేన్ గాయం తీవ్రత గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తెలుస్తోంది. అతడు దాదాపుగా వరల్డ్కప్కు దూరమమ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేన్ అందుబాటులో లేకపోతే ఎవరని సారధిగా నియమించాలని అన్న ఆలోచనలో ఉన్నాం. సౌధీ ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్గా ఉన్నాడు. కానీ టామ్ లాథమ్కు వైట్బాల్ క్రికెట్లో కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఎక్కువగా ఉంది. టామ్ పాకిస్తాన్ పర్యటనలో కూడా జట్టును అద్బుతంగా నడిపించాడు. అయితే జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో వన్డే సిరీస్ను కోల్పోయాం. కానీ పరిమత ఓవర్ల కెప్టెన్గా లాథమ్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ టామ్ వైపే మొగ్గు చూపవచ్చు అని విలేకురల సమావేశంలో గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
Pak Vs NZ: 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్ సమర్పయామి.. ఇప్పుడేమో ఏకంగా..
Pakistan vs New Zealand- Babar Azam: పాకిస్తాన్ గడ్డపై టీ20 సిరీస్లో రాణించిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటికే మూడింట ఓటమిపాలై సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న కివీస్.. నాలుగో వన్డేలోనూ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 5 టీ20లు, 5 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడటానికి న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్లో కివీస్ వైఫల్యం కొనసాగిస్తోంది. కరాచీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెంచరీతో చెలరేగిన బాబర్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య పాకిస్తాన్కు ఓపెనర్ మసూద్(44) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ సెంచరీ(107)తో చెలరేగాడు. అతడికి తోడు.. ఐదో స్థానంలో వచ్చిన ఆగా సల్మాన్ అర్థ శతకం(58)తో రాణించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఒక్కడే ఈ మాత్రం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ను ఉసామా మీర్ దెబ్బకొట్టాడు. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి కివీస్ పతనాన్ని శాసించాడు. హారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్ మూడు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ టామ్ లాథమ్ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతావాళ్లలో మార్క్ చాప్మన్ 46 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 43.4 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసి కివీస్ ఆలౌట్ అయింది. 102 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి సెంచరీ హీరో బాబర్ ఆజం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్కు వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆఖరి మ్యాచ్లో గనుక ఓడితే క్లీన్స్వీప్తో అపఖ్యాతిని మూటగట్టుకోకతప్పదు. చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ .@iShaheenAfridi gets the New Zealand skipper! \0/#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/dE5C7ZmOOq — Pakistan Cricket (@TheRealPCB) May 5, 2023 -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్కు పరాభవం
న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్మన్కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్మన్కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
బదులు తీర్చుకున్న న్యూజిలాండ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్పై విజయం
లాహొర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తొలి గెలుపు నమోదు చేసింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బంతిని నీషమ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని ఇఫ్తికర్ ఆహ్మద్ సిక్సర్గా మలచగా.. రెండో బంతికి ఎటువంటి రన్స్ రాలేదు. మూడో బంతికి ఇఫ్తికర్ ఫోర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ నాలుగో బంతికి ఇఫ్తికర్ ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఓటమి ఖారారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే,రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(64) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్, అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. పదండి ఉప్పల్కి అంటూ! వీడియో వైరల్ -
న్యూజిలాండ్కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 88 పరుగులకే ఆలౌట్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహొర్ వేదికగా కివీస్తో జరిగిన తొలి టీ20లో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. పాక్ పేసర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ నాలుగు వికెట్లతో కివీస్ వెన్ను విరచగా.. ఇమాడ్ వసీం రెండు, అఫ్రిది, షాదాబ్ ఖాన్, జమాన్ ఖాన్, ఆష్రాఫ్ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మాన్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 182 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో అయాబ్(47), ఫఖర్ జమాన్(47) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిల్నే, లిస్టర్ తలా రెండు వికెట్లు, సోధి, లిస్టర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఇది 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ రెండు జట్ల రెండో టీ20 లాహొర్ వేదికగానే శనివారం జరగనుంది. చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్ను కూడా ఆతిథ్య కివీస్కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్ను గెలుపుబాట పట్టించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
న్యూజిలాండ్ కెప్టెన్గా టామ్ లాథమ్.. ఇద్దరు క్రికెటర్ల ఎంట్రీ!
శ్రీలంక, పాకిస్తాన్తో టీ20 సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లకు రెండు వెర్వేరు జట్లను న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఈ రెండు సిరీస్లకు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టిమ్ సౌథీ దూరమయ్యారు. ఐపీఎల్లో పాల్గొనేందుకు వీరిద్దరూ భారత్కు రానుండడంతో ఈ సిరీస్లకు దూరమయ్యారు. ఇక ఈ రెండు సిరీస్లకు కివీస్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. అదే విధంగా చాడ్ బోవ్స్, షిప్లీ తొలి సారి న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా న్యూజిలాండ్ స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఏప్రిల్ 2న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం కివీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో కివీస్ ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు జరగనుంది. శ్రీలంక సిరీస్కు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. పాకిస్తాన్ సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. డేన్ క్లీవర్, కోల్ మెక్కాన్చీ, బ్లెయిర్ టిక్నర్. చదవండి: BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
NZ Vs SL: పాపం రచిన్ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక..
New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. ఆక్లాండ్ వేదికగా శనివారం నాటి మ్యాచ్లో 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అర్ధ శతకంతో రాణించగా.. అరంగేట్ర ఆటగాడు రచిన్ రవీంద్ర తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కాగా సొంతగడ్డపై లంకతో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. ఈ క్రమంలో ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో ఇరు జట్ల మధ్య మొదటి వన్డేలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే అరంగేట్ర ఓపెనర్ చాడ్ బౌస్(14 పరుగులు) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్(26)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. పాపం రచిన్ రవీంద్ర ఇక నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 47 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ టామ్ లాథమ్(5)విఫలమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు సాధించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 49 పరుగులు చేసిన అతడు.. ఒక్క పరుగు తేడాతో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కసున్ రజిత బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షిప్లే విశ్వరూపం ఈ క్రమంలో 49.3 ఓవర్లలో కివీస్ 274 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో చమిక కరుణరత్నె అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. కసున్ రజిత రెండు, లాహిరు కుమార రెండు, కెప్టెన్ దసున్ షనక ఒకటి, దిల్షాన్ మధుషంక ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన లంకను కివీస్ పేసర్ షిప్లే అల్లాడిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి షిప్లే నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్ నవనీడు ఫెర్నాండో రనౌట్ రూపంలో వెనుదిరగడంతో లంక మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. చదవండి: Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్తో విధ్వంసం IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! A big finish to the over from Rachin Ravindra! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/AgC0GDAUoO — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 -
NZ VS ENG 2nd Test: న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ అరుదైన రికార్డు
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆట మూడో రోజు 45 పరుగుల వద్ద సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్న లాథమ్.. ఆండర్సన్ బౌలింగ్లో సింగిల్ తీయడం ద్వారా టెస్ట్ల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. గతంలో కివీస్ తరఫున కేవలం ఆరుగురు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. కెరీర్లో 72వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 30 ఏళ్ల లాథమ్.. ఈ మ్యాచ్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్ (7683) అగ్రస్థానంలో ఉండగా.. కేన్ విలియమ్సన్ (7680), స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172), బ్రెండన్ మెక్కల్లమ్ (6453), మార్టిన్ క్రో (5444), జాన్ రైట్ (5334) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ను లాథమ్తో పాటు డెవాన్ కాన్వే (61) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే 6 పరుగుల వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కష్టాలు మొదలయ్యాయి. 12 పరుగుల తేడాతో మరో వికెట్ (విల్ యంగ్ (8)) కూడా పడటంతో కివీస్ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజ్లో కేన్ విలియమ్సన్ (25), హెన్రీ నికోల్స్ (18) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 24 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్లో ఉన్న హ్యారీ బ్రూక్ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్ (153 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. కెప్టెన్ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే న్యూజిలాండ్ ఈ మాత్రం కూడా స్కోర్ చేయలేకపోయేది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 24 పరుగులు వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కాన్వే సుడిగాలి శతకం వృధా.. కివీస్ను ఊడ్చేసిన టీమిండియా
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇండోర్ వేదికగా ఇవాళ (జనవరి 24) జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, పర్యాటక జట్టును ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసింది. ఈ విజయంతో భారత్.. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. Another comprehensive performance from #TeamIndia as they outclass New Zealand by 90 runs in Indore to complete a 3-0 whitewash. 🙌🏽 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/7IQZ3J2xfI — BCCI (@BCCI) January 24, 2023 ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. .@imShard scalped 3️⃣ crucial wickets with the ball when the going got tough and bagged the Player of the Match award as #TeamIndia registered a 90-run victory in the final #INDvNZ ODI 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/cpKbBMOTll — BCCI (@BCCI) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 3⃣6⃣0⃣ runs in three matches 🙌@ShubmanGill becomes the Player of the Series for his sensational performance with the bat, including a double-hundred in the #INDvNZ ODI series👏👏 Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/77HJHLgJoL— BCCI (@BCCI) January 24, 2023 Captain @ImRo45 collects the trophy as #TeamIndia clinch the #INDvNZ ODI series 3⃣-0️⃣ 👏🏻👏🏻Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…@mastercardindia pic.twitter.com/5D5lO6AryG— BCCI (@BCCI) January 24, 2023 -
ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు.. కెప్టెన్గా బాబర్.. టీమిండియా నుంచి ఇద్దరే
ICC ODI Team of The Year: అంతర్జాతీయ క్రికెట్ మండలి 2022 సంవత్సరానికి గానూ పురుషుల ఉత్తమ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే టీమ్లో స్థానం దక్కించుకున్నారు. ఇక ఈ జట్టుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సారథిగా ఎంపికయ్యాడు. అయితే, గతేడాది వన్డేల్లో పెద్దగా రాణించని టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లికి ఈ జట్టులో చోటు దక్కలేదు. కాగా క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. సారథిగా బాబర్ గతేడాది.. బాబర్ ఆజం 11 వన్డేల్లో.. ఎనిమిదింట ఫిఫ్టీకి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో మూడింటిని సెంచరీలుగా మలిచాడు. మొత్తంగా 679 పరుగులు సాధించాడు ఈ 28 ఏళ్ల బ్యాటర్. అదరగొట్టిన అయ్యర్ 50 ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2022లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అయ్యర్.. ఆడిన 17 మ్యాచ్లలో 724 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. సూపర్ సిరాజ్ పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. 2022లో ఉత్తమంగా రాణించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేని లోటు తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఆడిన 15 మ్యాచ్లలో మొత్తంగా 4.62 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 3/29. 11 మంది వీళ్లే ఓపెనర్లుగా బాబర్ ఆజం, ట్రవిస్ హెడ్.. వన్డౌన్లో షాయీ హోప్, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో టామ్ లాథమ్.. ఆ తర్వాతి స్థానాల్లో ఆల్రౌండర్ల జాబితాలో సికిందర్ రజా(ఆఫ్ బ్రేక్ స్పిన్), మెహిదీ హసన్ మిరాజ్(రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్).. పేసర్ల విభాగంలో అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్.. స్పిన్ విభాగంలో ఆడం జాంపాలను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ 2022 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 1.బాబర్ ఆజం(కెప్టెన్)- పాకిస్తాన్ 2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా 3. షాయీ హోప్- వెస్టిండీస్ 4. శ్రేయస్ అయ్యర్- ఇండియా 5. టామ్ లాథమ్(వికెట్ కీపర్)- న్యూజిలాండ్ 6. సికిందర్ రజా- జింబాబ్వే 7. మెహిదీ హసన్ మిరాజ్- బంగ్లాదేశ్ 8. అల్జారీ జోసెఫ్- వెస్టిండీస్ 9. మహ్మద్ సిరాజ్- ఇండియా 10. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్ 11. ఆడం జంపా- ఆస్ట్రేలియా చదవండి: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు.. భారత్ నుంచి ముగ్గురికి అవకాశం Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు -
పరుగుల వరద గ్యారంటీ! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కోహ్లి?
India vs New Zealand, 3rd ODI-ఇండోర్: ఇప్పటికే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ వశమైంది. నంబర్వన్ స్థానం దక్కింది. ఇప్పుడు టీమిండియా క్లీన్స్వీప్తో టాప్ ర్యాంక్ను పదిలప రుచుకునే పనిలో పడింది. మొదటి మ్యాచ్లో బ్యాట్తో, రెండో మ్యాచ్లో బౌలింగ్తో పర్యాటక జట్టును దెబ్బమీద దెబ్బ వేసిన భారత్ మంగళవారం నాటి చివరిదైన మూడో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని పట్టుదలతో ఉంది. పరువు నిలబెట్టుకోవాలంటే మరోవైపు కివీస్ను ఫలితాలే కాదు... బ్యాటింగ్ ఆర్డర్ కూడా పరేషాన్ చేస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో టాప్–5 బ్యాటర్స్లో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ అయినా చేయలేకపోయారు. ఇది జట్టు మేనేజ్మెంట్ను కల వరపెడుతోంది. పరువు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిందే. లేదంటే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ ఆఖరి పోరు లోనూ ఓడితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ వేదికపై ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోహ్లి స్కోరే బాకీ! ఈ ఏడాది వరుసగా ఐదు వన్డేలు (లంకపై 3) గెలిచిన టీమిండియా వరల్డ్కప్ సన్నాహానికి ఘనమైన ఆరంభమే ఇచ్చింది. కాబట్టి భారత జట్టు ఏ బెంగా, ఒత్తిడి లేకుండా యథేచ్చగా చెలరేగడం ఖాయం. ఇక ఈ సిరీస్లో ఏమైనా మిగిలింది... చూడాల్సింది ఉందంటే అది కోహ్లి క్లాసిక్సే! శ్రీలంకపై తన శైలి శతకాలతో పాత కోహ్లిని తలపించిన అతను ఈ సిరీస్లో 8, 11 పరుగులే చేశాడు. అతని ఫామ్పై జట్టు మేనేజ్మెంట్లో ఏ ఒక్కరికీ అనుమానమే లేదు. కానీ తన మార్క్ బ్యాటింగ్ జోరు చూడాలని జట్టే కాదు... యావత్ భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. పిచ్, వాతావరణం ఫ్లాట్ పిచ్ ఇది. పైగా గ్రౌండ్ చిన్నది కావడంతో ప్రేక్షకులకు పరుగుల విందు గ్యారంటీ. టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటుంది. వాన లేదు. మంచు ప్రభావం బౌలర్లపై పడుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, షమీ/ఉమ్రాన్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), అలెన్, కాన్వే, నికోల్స్/చాప్మన్, మిచెల్, ఫిలిప్స్, బ్రేస్వెల్, సాన్ట్నర్, షిప్లే/డఫీ, టిక్నెర్, ఫెర్గూసన్. ఇండోర్లో ఇలా.. అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు? ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు భారత్ ఐదు వన్డేలు ఆడగా... ఐదింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్తో ఇక్కడే జరిగిన వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ (219) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కాగా ఇటీవల ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ వంటి యువ బ్యాటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో చెలరేగిన వేళ.. ఇండోర్లో ఈసారి సెహ్వాగ్ మాదిరి కోహ్లి బ్యాట్ ఝులిపించి ఈ మైదానంలో ద్విశతకం బాదాలని అభిమానులు ఆశపడుతున్నారు. 11వసారి ఇక ఈ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలిసారి వన్డే జరగనుంది. నేడు జరిగే వన్డేలో న్యూజిలాండ్పై భారత్ గెలిస్తే స్వదేశంలో 11వసారి ద్వైపాక్షిక సిరీస్ క్లీన్స్వీప్ అవుతుంది. మహాకాళేశ్వరుడి సేవలో... ఇండోర్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఉజ్జయినిలోని శ్రీ మహాకాళే శ్వరుడిని భారత క్రికెటర్లు, అంపైర్లు, మ్యాచ్ అధికారులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం భస్మా హారతి సేవలో ఆటగాళ్లంతా తరించారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్లు జలాభిషేకం చేశారు. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై జట్టుకు దూరమైన సహచ రుడు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు ఆటగాళ్లు తెలిపారు. స్వామి వారి దర్శనానంతరం ఉజ్జయిని లోక్సభ ఎంపీ అనిల్ ఫిరోజియా క్రికెటర్లను సత్కరించారు. చదవండి: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం BBL 2022-23: స్టీవ్ స్మిత్కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం -
'కివీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'
ఈ ఏడాది వన్డే వరల్డ్కప్కు టీమిండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్- నవంబర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి ముందు టీమిండియా వరుసగా వన్డే సిరీస్లు ఆడుతూ విజయాలు దక్కించుకుంటూ వస్తుంది. ఇప్పటికే లంకతో వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలోనూ కివీస్ను టీమిండియా ఓడించి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలచే సువర్ణావకాశం లభించనుంది. ఈ విషయం ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ''మూడో వన్డేలో న్యూజిలాండ్ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నెంబర్వన్ ర్యాంకు సొంతం చేసుకోనుంది'' అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాలు 113 రేటింగ్ పాయింట్లతో ఉన్నప్పటికి మ్యాచ్లు, పాయింట్ల ఆధారంగా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్ను మూడో వన్డేల్లో ఓడిస్తే రెండు రేటింగ్ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రానున్న వన్డే వరల్డ్కప్కు ముందు టీమిండియాకు ఇది మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీమిండియా కివీస్తో మూడో వన్డేలో ఓడినా రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. మరి మంగళవారం ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా గెలిచి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ICC confirms if India beat New Zealand in the 3rd ODI, India will be number 1 in ranking. — Johns. (@CricCrazyJohns) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే 'టీమిండియా రైట్ ట్రాక్లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
IND VS NZ 3rd ODI: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. జనవరి 24న నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో షాబాజ్ అహ్మద్, చహల్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచే ప్రారంభంకానున్న టీ20 సిరీస్ (న్యూజిలాండ్తో) నేపథ్యంలో చహల్, ఉమ్రాన్ మాలిక్లకు ఓ అవకాశం ఇవ్వాలన్నది మేనేజ్మెంట్ అభిప్రాయమని సమాచారం. చహల్, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ టీ20 జట్టులో కూడా ఉండటంతో ఈ మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైన పేర్కొన్న మూడు మార్పులు మినహాయించి, రెండో వన్డే ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, గిల్, వన్డౌన్లో విరాట్ కోహ్లి, ఆతర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్ధిక్, షాబాజ్ అహ్మద్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, చహల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్లో భారత్ తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
IND vs NZ 2nd ODI : కివీస్పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
Ind Vs NZ: మన బౌలింగ్ భళా... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే
ఎలాంటి సంచలన ప్రదర్శనలు, ఎలాంటి ప్రతిఘటన, పోరాటాలు లేవు... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే.. తొలి వన్డేలో మన జట్టును వణికించిన న్యూజిలాండ్ రెండో పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్ను ఎదుర్కోలేక 108 పరుగులకే ఆట కట్టేసి ముందే ఓటమికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఛేదన పూర్తి చేసిన భారత్ మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. రాయ్పూర్: తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రాయ్పూర్ అభిమానులకు తగిన ఆనందం దక్కలేదు. మొత్తం మ్యాచ్ 54.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (3/18) కివీస్ను దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్లో జరుగుతుంది. సమష్టి వైఫల్యం... ఇన్నింగ్స్ ఐదో బంతికి అలెన్ (0)ను షమీ బౌల్డ్ చేయడంతో కివీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత పరుగు తేడాతో నికోల్స్ (2), మిచెల్ (1) వెనుదిరగ్గా... ఆరు బంతుల వ్యవధిలో కాన్వే (7), లాథమ్ (1) అవుటయ్యారు. దాంతో కేవలం 15 పరుగుల స్కోరు వద్దే కివీస్ సగం బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో ఫిలిప్స్తో కలిసి గత మ్యాచ్ హీరోలు బ్రేస్వెల్, సాన్ట్నర్ పోరాడారు. ఫిలిప్స్... ఆరో వికెట్కు బ్రేస్వెల్తో 41 పరుగులు, ఏడో వికెట్కు సాన్ట్నర్తో 47 పరుగులు జోడించాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన బ్రేస్వెల్ తర్వాతి బంతికి అవుట్ కాగా, కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాన్ట్నర్ను పాండ్యా వెనక్కి పంపించాడు. స్కోరు 100 దాటాక తర్వాతి రెండు వికెట్లు సుందర్ ఖాతాలో చేరగా, కుల్దీప్ చివరి వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, గిల్ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 52/0కు చేరింది. 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక టిక్నర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లి (11) విఫలంకాగా... అప్పటికే కుదురుకున్న గిల్... ఇషాన్ కిషన్ (8 నాటౌట్)తో కలిసి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) షమీ 0; కాన్వే (సి అండ్ బి) పాండ్యా 7; నికోల్స్ (సి) గిల్ (బి) సిరాజ్ 2; మిచెల్ (సి అండ్ బి) షమీ 1; ఫిలిప్స్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 36; బ్రేస్వెల్ (సి) ఇషాన్ (బి) షమీ 22; సాన్ట్నర్ (బి) పాండ్యా 27; షిప్లీ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 1; టిక్నర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–9, 4–15, 5–15, 6–56, 7–103, 8–103, 9–105, 10–108. బౌలింగ్: షమీ 6–1–18–3, సిరాజ్ 6–1–10–1, శార్దుల్ 6–1–26–1, హార్దిక్ పాండ్యా 6–3–16–2, కుల్దీప్ 7.3–0–29–1, వాషింగ్టన్ సుందర్ 3–1–7–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) షిప్లీ 51; గిల్ (నాటౌట్) 40; కోహ్లి (స్టంప్డ్) లాథమ్ (బి) సాన్ట్నర్ 11; ఇషాన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–72, 2–98. బౌలింగ్: ఫెర్గూసన్ 5–0– 21–0, షిప్లీ 5–0–29–1, టిక్నర్ 4–0–19–0, సాన్ట్నర్ 4.1–0–28–1, బ్రేస్వెల్ 2–0–13–0. రోహిత్ మతిమరుపు... టాస్ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. టాస్ గెలిచిన రోహిత్ ఏం ఎంచుకోవాలో చెప్పకుండా కొన్ని క్షణాల పాటు తటపటాయించాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలో తాను మరచిపోయానని అంటూ కొంత ఆలోచించి, ఆలోచించి చివరకు ఫీల్డింగ్ అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. -
టాస్ గెలిచిన టీమిండియా.. ఉమ్రాన్ మాలిక్కు మొండిచేయి
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. రెండో వన్డేలో కచ్చితంగా ఆడతాడనుకున్న ఉమ్రాన్ మాలిక్కు మరోసారి నిరాశే ఎదురైంది. అటు న్యూజిలాండ్ జట్టు కూడా ఏం మార్పులేకుండానే బరిలోకి దిగుతుంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డెవన్ కాన్వే,హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, సాన్ట్నర్, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, హెన్రీ షిప్లే ఇక ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్పై కన్నేసింది. మరోవైపు తొలి వన్డేలో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్ రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్లో పెద్దగా లోపాలు లేకపోయినప్పటికి బౌలింగ్ అంశం టీమిండియాను కలవరపెడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కోహ్లి, సూర్యకుమార్, గిల్లు రాణిస్తే టీమిండియాకు డోకా లేదని చెప్పొచ్చు. ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్మన్ గిల్పై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బౌలింగ్లో సిరాజ్ సూపర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. షమీ ఆరంభ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పటికి డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు. స్పిన్నర్లుగా సుందర్, కుల్దీప్ యాదవ్లు తన ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. అటు న్యూజిలాండ్ మాత్రం సీనియర్ల గైర్హాజరీలోనూ మంచి ప్రదర్శన ఇస్తుంది. అయితే తొలి వన్డేలో మైకెల్ బ్రాస్వెల్ విధ్వంసం కివీస్లో జోష్ నింపింది. ఆల్రౌండర్లు ఉండడం జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్ ఇబ్బంది లేకున్నా.. బౌలింగ్ కాస్త గాడిన పడాల్సిన అవసరం ఉంది. 🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI. Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv — BCCI (@BCCI) January 21, 2023 -
స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ
భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు బిగ్షాక్ తగిలింది. టీమిండియాకు స్లో ఓవర్ రేట్ దెబ్బ పడింది. నిర్ణీత సమయం ముగిసేలోగా రోహిత్ సేన మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ తెలిపారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలడంతో స్లో ఓవర్ రేట్గా పరిగణించినట్లు తెలిపారు. మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్కు 20 శాతం కింద మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఇక మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో మెరవడంతో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మైకెల్ బ్రాస్వెల్ మెరుపు శతకంతో రాణించి టీమిండియాను వణికించాడు. అయితే లోకల్ బాయ్ సిరాజ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్పూర్ వేదికగా శనివారం(జనవరి 21న) జరగనుంది. చదవండి: రెండో వన్డేలోనూ ఉమ్రాన్కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా.. -
Ind Vs NZ: రోహిత్ సేనకు రాయ్పూర్లో ఘన స్వాగతం.. వీడియో వైరల్
India Vs New Zealand 2nd ODI: హైదరాబాద్ వన్డేలో విజయంతో సిరీస్ ఆరంభించిన టీమిండియా తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో అడుగుపెట్టింది. రోహిత్ సేనతో పాటు న్యూజిలాండ్ జట్టు సైతం రాయ్పూర్కు చేరుకుంది. ఘన స్వాగతం ఈ క్రమంలో ఆతిథ్య, పర్యాటక జట్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్య వేడుక నడుమ టీమిండియాను హోటల్ సిబ్బంది ఆహ్వానించింది. కివీస్ జట్టుకు సైతం అదే స్థాయిలో అతిథి మర్యాదలు చేసింది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. Warm welcome for #TeamIndia here in Raipur ahead of the 2⃣nd #INDvNZ ODI 👏 👏 pic.twitter.com/wwZBNjrn0W — BCCI (@BCCI) January 19, 2023 ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ, బ్లాక్కాప్స్ తమ సోషల్ మీడియాల ఖాతాల్లో షేర్ చేయగా వైరల్గా మారాయి. కాగా మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా- కివీస్ మధ్య బుధవారం హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరిగింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఎట్టకేలకు 12 పరుగుల తేడాతో గెలుపొంది భారత జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. View this post on Instagram A post shared by BLACKCAPS (@blackcapsnz) ఇక ఇరు జట్ల మధ్య రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకే రోహిత్ సేన ప్రాక్టీసు ఆరంభించనుంది. చదవండి: Sunrisers: దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్ తండ్రి అసంతృప్తి -
'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!'
భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టి20లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల జడివానలో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దయింది. మొదట టీమిండియా నుంచి ఓపెనర్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్ మైకెల్ బ్రాస్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో టీమిండియాకు వణుకు పుట్టించాడు. ఒక దశలో కివీస్ను గెలిపించినంత పని చేశాడు. అయితే లోకల్ బాయ్ సిరాజ్ ఆఖర్లో అద్బుత బౌలింగ్తో అదరగొట్టి కీలక సమయంలో వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్పూర్ వేదికగా శనివారం జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో హార్దిక్ పాండ్యా ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి తగలకుండానే బెయిల్స్ కింద పడడం కనిపించింది. అయితే కీపర్ టామ్ లాథమ్ తన గ్లోవ్స్తో బెయిల్స్ను ఎగురగొట్టడం స్పష్టంగా కనిపించినప్పటికి థర్డ్ అంపైర్ పాండ్యాను ఔట్గా ప్రకటించడం దుమారం రేపింది. థర్డ్ అంపైర్ నిర్ణయం న్యూజిలాండ్ ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణమైన కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ మాత్రం క్రీడాస్పూర్తికి విరుద్ధంగా తన తప్పును ఒప్పుకోకుండా అంపైర్ నిర్ణయాన్ని సమర్థించడంపై విమర్శలు వచ్చాయి. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ అభిమానులు కామెంట్స్ కూడా చేశారు. థర్డ్ అంపైర్ది చెత్త నిర్ణయం అని.. పాండ్యా నాటౌట్ అని కళ్ల ముందు అంత క్లియర్గా కనిపిస్తున్నా ఔట్ ఇవ్వడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీమిండియా మ్యాచ్ గెలవడంతో ఈ వివాదం అంత పెద్దగా మారలేదు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తప్పును ఎత్తిచూపిస్తూ టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అతని చర్యనే రిపీట్ చేశాడు. అదీ కెప్టెన్ లాథమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే. 16వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన నాలుగో బంతిని టామ్ లాథమ్ ఢిపెన్స్ ఆడాడు. ఇదే సమయంలో అతని వెనుక బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో ఇషాన్ కిషన్ అంపైర్కు అప్పీల్ చేశాడు. ఇదేంటని లాథమ్ ఆశ్చర్యపోయాడు. హిట్ వికెట్ అనే సందేహంతో లెగ్ అంపైర్ రివ్యూకు వెళ్లగా రిప్లేలో అసలు విషయం బయటపడింది. లాథమ్ హిట్ వికెట్ కాలేదు.. కీపర్ ఇషాన్ కిషన్ కావాలనే బెయిల్స్ను తన గ్లోవ్స్తో తాకించి కిందపడేలా చేశాడు. మొదటిసారి చేస్తే పడలేదని రెండోసారి కాస్త గట్టిగా బెయిల్స్ను కదిలించడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో లాథమ్ నాటౌట్ అని అంపైర్ ప్రకటించగానే ఇషాన్ కిషన్ మొహం నవ్వుతో నిండిపోయింది. అయితే ఇషాన్ కిషన్ చర్యపై టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానులు పెదవి విరిచారు. ''మనకి, వాళ్లకు(టీమిండియా, న్యూజిలాండ్) తేడా ఉండాలి.. ఇలా క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏంటి.. చిన్నపిల్లాడి మనస్తత్వం వదిలెయ్'' ఇషాన్ కిషన్ అంటూ చివాట్లు పెట్టారు. మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇషాన్ కిషన్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ''ఇషాన్ చర్య క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఇది క్రికెట్ కాదు'' అంటూ కామెంట్ చేశాడు. pic.twitter.com/EeCgxc63kF — MINI BUS 2022 (@minibus2022) January 18, 2023 Out or Not Out?#IndvNz#HardikPandya𓃵 #notout pic.twitter.com/Hbzzwan4bs — Rahul Sisodia (@Sisodia19Rahul) January 18, 2023 చదవండి: అసలు హార్దిక్ పాండ్యాది ఔటేనా! రాటుదేలుతున్న సిరాజ్.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..! -
కివీస్తో తొలి వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్డేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ప్రారంభమయింది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. లంకతో మూడో వన్డే ఆడిన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోగా, శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో మొత్తం సిరీస్కే దూరమయ్యాడు. దీంతో వీరి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్లు తుది జట్టులోకి వచ్చారు. టీమిండియా టాపార్డర్ దుర్భేద్యంగా ఉండటంతో కివీస్కు కష్టాలు తప్పవు. కోహ్లి అద్భుతమైన ఫామ్, గిల్ జోరుకు తోడు రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే టీమ్కు ఎదురుండదు. న్యూజిలాండ్ జట్టులో ఒక్కో ఆటగాడిని చూస్తే పెద్ద ఘనతలు కనిపించవు. కానీ జట్టుగా మాత్రం సమష్టితత్వంతో ఎంతటి కఠిన ప్రత్యర్థిపైనైనా పైచేయి సాధించగలదు. పాకిస్తాన్లో వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న జట్టు భారత్కు చేరుకుంది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు విలియమ్సన్, సౌతీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో టీమ్లో అనుభవం తక్కువగా కనిపిస్తోంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డెవన్ కాన్వే,హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, సాన్ట్నర్, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, హెన్రీ షిప్లే -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్కు బిగ్ షాక్
బుధవారం హైదరాబాద్ వేదికగా భారత్తో తొలి వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్కు ముందు కివీస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. సోధి ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్తో ఆఖరి వన్డేలో గాయపడిన సోధి ఇంకా పూర్తిగా కోలకోలేదని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ సృష్టం చేశాడు. " దురదృష్టవశాత్తూ సోధి తొలి వన్డే జట్టు ఎంపికకు అందుబాటులో ఉండడు. తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అయితే చివరి రెండు మ్యాచ్లకు జట్టు సెలక్షన్కు సోధి అందుబాటులో ఆశిస్తున్నాను" అని మ్యాచ్కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాథమ్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వెటరన్ ఆటగాడు టిమ్ సౌథీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆ జట్టు పేసర్లు మాట్ హెన్రీ, జామిసన్ గాయం కారణంగా భారత పర్యటన మొత్తానికి దూరమయ్యారు. న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): లాథమ్ (కెప్టెన్), అలెన్, హెన్రీ నికోల్స్, కాన్వే, చాప్మన్, మిచెల్, ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, సాన్ట్నర్, ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్వెల్. చదవండి: Rohit Sharma: 'సిరాజ్కు ఆల్ది బెస్ట్.. వరల్డ్కప్కు బలమైన జట్టే లక్ష్యంగా' -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
India Vs New Zealand 2023- ODI And T20 Series: శ్రీలంకతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లు గెలిచిన టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమవుతోంది. పర్యాటక కివీస్తో తొలుత వన్డే సిరీస్.. తర్వాత టీ20 సిరీస్ ఆడనుంది. లంకను 2-1 తేడాతో ఓడించి సిరీస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మరోసారి భారత జట్టు టీ20 కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. భారత్లో న్యూజిలాండ్ పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ►మూడు మ్యాచ్లు ►మొదటి వన్డే: జనవరి 18, బుధవారం- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం- హైదరాబాద్ ►రెండో వన్డే: జనవరి 21, శనివారం- షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్పూర్ ►మూడో వన్డే: జనవరి 24, మంగళవారం- హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ మూడు మ్యాచ్ల సిరీస్ ►తొలి టీ20: జనవరి 27, శుక్రవారం- జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచి ►రెండో టీ20: జనవరి 29, ఆదివారం- భారత రత్ర వ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం, లక్నో ►మూడో టీ20: ఫిబ్రవరి 1, బుధవారం- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం. రోహిత్ శర్మ వన్డే సిరీస్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి టి20 సిరీస్ భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వై చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్ న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షీప్లే, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్. ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వన్డే, టీ20 సిరీస్లు లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ+హాట్స్టార్లో డిజిటల్ ప్రసారాలు చదవండి: Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి.. వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్కు ఊహించని భారీ ధర -
Pak Vs Nz: పాక్ గడ్డపై సెంచరీ.. విలియమ్సన్ అరుదైన రికార్డు
Pak Vs Nz 1st Test Day 3 Highlights- కరాచీ: పాకిస్తాన్తో మొదటి టెస్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ శతకం సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి.. మొత్తంగా 222 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కెరీర్లో 25వ సెంచరీ చేసిన విలియమ్సన్... 722 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తొలి బ్యాటర్గా అదే విధంగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈలలో శతకం సాధించిన తొలి ఆసియాయేతర బ్యాటర్గా ఘనత సాధించాడు. ఇక కేన్ మామతో పాటు.. టామ్ లాథమ్ (191 బంతుల్లో 113; 10 ఫోర్లు) కూడా సెంచరీ నమోదు చేయడంతో పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 440 పరుగులు చేసింది. ఫలితంగా 2 పరుగుల ఆధిక్యం అందుకుంది. డెవాన్ కాన్వే (176 బంతుల్లో 92; 14 ఫోర్లు) శతకం చేజార్చుకోగా... బ్లన్డెల్ (47), మిచెల్ (42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్కు 3 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్తో పాటు ఇష్ సోధి (1 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. చదవండి: Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్గా.. కానీ అదొక్కటే మిస్! IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు! Kane Williamson brings up his 25th Test hundred 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/wwRMYLvt7u — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 -
Pak Vs NZ: పాకిస్తాన్కు దీటైన జవాబు.. చెలరేగిన కివీస్ ఓపెనర్లు
Pakistan vs New Zealand, 1st Test Day 2 Highlights- కరాచీ: పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటైన జవాబిచ్చింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (82 బ్యాటింగ్; 12 ఫోర్లు), టామ్ లాథమ్ (78 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో రెండో రోజు ఆట నిలిచే సమ యానికి కివీస్ తొలి ఇన్నింగ్స్లో 47 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 165 పరుగులు చేసింది. దాదాపు రెండు సెషన్ల పాటు క్రీజు వీడకుండా న్యూజిలాండ్ ఓపెనర్లు పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అంతకుముందు ఉదయం 317/5 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 438 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్స్లో కెప్టెన్ బాబర్ ఆజమ్ (161) అదే స్కోరుపై అవుటవగా, ఆగా సల్మాన్ (103; 17 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టగా, ఎజాజ్, బ్రేస్వెల్, ఇష్ సోధి తలా 2 వికెట్లు తీశారు. రెండు రోజు ఆట ముగిసే సరికి కివీస్ 273 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ చేతిలో పది వికెట్లున్నాయి. చదవండి: Shikhar Dhawan: ధావన్పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్కప్ ఆశలు ఆవిరి! మిస్ యూ గబ్బర్ అంటూ.. David Warner: 11 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల అనుభవంతో అరంగేట్రం.. అత్యుత్తమ ప్రదర్శనలు ఇవే Ind_W Vs SA_W: అదరగొట్టిన షబ్నమ్.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్లా అలా! -
ఇండియా టూర్కు కేన్ మామ డుమ్మా.. కారణం ఏంటంటే..?
New Zealand Tour Of India 2023: వచ్చే ఏడాది (2023) జనవరిలో జరుగనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జరుగనున్న వన్డే సిరీస్ కోసం జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిన్న (డిసెంబర్ 18) ప్రకటించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ, హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ లేకుండానే న్యూజిలాండ్ వన్డే జట్టు భారత్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ ముగ్గురూ భారత్ కంటే ముందు పాకిస్తాన్తో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో (జనవరి 10, 12, 14) పాల్గొని అట్నుంచి అటే న్యూజిలాండ్కు తిరిగి వెళ్లిపోతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (సీఎన్జెడ్) వెల్లడించింది. ఫిబ్రవరిలో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ టీమ్ స్వదేశంలో పర్యటించనున్న నేపథ్యంలో వర్క్ లోడ్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎన్జెడ్ ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో భారత్తో వన్డే సిరీస్కు టామ్ లాథమ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొన్న సీఎన్జెడ్.. ఈ సిరీస్కు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ లూక్ రాంచీ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలిపింది. విలియమ్సన్, సౌథీ స్థానాలను మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ భర్తీ చేస్తారని పేర్కొంది. కాగా, భారత పర్యటనలో న్యూజిలాండ్ తొలుత వన్డే సిరీస్ ఆడనుంది. జనవరి 18, 21, 24 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అనంతరం జనవరి 27, 29 ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్కు జట్టును సీఎన్జెడ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. భారత్తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి -
కేన్ విలియమ్సన్ రాజీనామా..న్యూజిలాండ్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
Tim Southee Appointed As New Zealand Test Captain: న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్బై చెప్పడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీబీ) కొత్త సారధిని నియమించింది. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ టెస్ట్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఎన్జెడ్సీబీ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే 2 టెస్ట్ల సిరీస్కు సౌథీ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొంది. సౌథీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వికెట్ కీపర్ టామ్ లాథమ్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఓ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్గా ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో డియాన్ నాష్ కివీస్ టెస్ట్ సారధిగా వ్యవహరించాడు. మరోవైపు టెస్ట్ జట్టుకు సారధిగా ఎంపికైన సౌథీ.. 22 టీ20ల్లో కివీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే అతను టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. కాగా, వర్క్ లోడ్ కారణంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విలియమ్సన్.. వన్డే, టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే టెస్ట్ జట్టులో సభ్యుడిగానూ కొనసాగుతానని పేర్కొన్నాడు. పాకిస్తాన్ పర్యటనకు అతను జట్టుతో పాటే వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్లు ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 10, 12, 14 తేదీల్లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఇదిలా ఉంటే, 6 ఏళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్.. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు మరెన్నో అద్భుత విజయాలు సాధించింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ మామ న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ 38 టెస్టు మ్యాచ్లు ఆడి 22 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. -
అదరగొట్టిన కేన్ మామ..లాథమ్! దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్లు
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అదరగొట్టారు. భారత్తో తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన లాథమ్.. పది స్థానాలు ఎగబాకి 18 ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో 98 పరుగులతో ఆజేయంగా నిలిచిన విలియమ్సన్ 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇక భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగం కానుందున చెరో ఒక్క స్థానం దిగజారి వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్లలో నిలిచారు. మరోవైపు న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో రాణించిన గిల్, శ్రేయస్ అయ్యర్ వరుసగా 27, 34 స్థానాల్లో నిలిచారు. ఇక వీరితో పాటు శ్రీలంకతో వన్డే సిరీస్లో అదరగొడుతున్న ఆఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్భాజ్ 21 స్థానాలు ఎగబాకి 48 ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 890 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో పాక్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నారు. చదవండి: FIFA WC 2022: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు -
Ind vs NZ: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.. ఆ ఓవర్లో: ధావన్
New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan Comments On Loss: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో మెరుగైన స్కోరు చేసినప్పటికీ పరాజయం తప్పలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ విచారం వ్యక్తం చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు. కాగా ఆక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి వన్డేలో భారత జట్టు కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో మెరిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ముగ్గురూ అద్బుతంగా రాణించడంతో 306 పరుగులు స్కోరు చేసిన టీమిండియా.. బౌలర్ల వైఫల్యం కారణంగా ఆతిథ్య జట్టు ముందు తలవంచకతప్పలేదు. స్పష్టంగా కనిపించిన వైఫల్యం బ్యాట్తో మెరిసిన వాషింగ్టన్ సుందర్(42 పరుగులు- ఎకానమీ 4.20) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రపంచకప్-2022లో రాణించిన అర్ష్దీప్ సింగ్ 8.1 ఓవర్లలో 68, ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లలో 66, యజువేంద్ర చహల్ 10 ఓవర్లలో 67 పరుగులు ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ మ్యాచ్ను కివీస్కు అనుకూలంగా మార్చివేసింది. ఆ ఓవర్లోనే అంతా తలకిందులు ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ధావన్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘మొదటి 10- 15 ఓవర్లు కాస్త కష్టంగా తోచింది. అయితే, పిచ్ను అంచనా వేసి మా వ్యూహాలు అమలు చేసి మెరుగైన స్కోరు నమోదు చేశాం. కానీ, ఈ రోజు మేము సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. ముఖ్యంగా గుడ్ లెంత్తో బౌలింగ్ చేయడంలో మా వాళ్లు విఫలమయ్యారు. ఆ బలహీనతను లాథమ్ సరిగ్గా వాడుకున్నాడు. నిజానికి 40 ఓవర్లోనే మ్యాచ్ మా చేజారి... కివీస్కు అనుకూలంగా మారింది. ఒకవేళ గెలిచి ఉంటే మేము సంతోషించేవాళ్లం. కానీ ఆటలో ఇవన్నీ సహజమే. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఇదొక పాఠం లాంటిది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆట తీరు మెరుగుపరచుకుని.. తదుపరి మ్యాచ్లో మా వ్యూహాలు మరింత పక్కాగా అమలు చేస్తాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. అద్భుత, అజేయ శతకం కివీస్ ఇన్నింగ్స్లో 40వ ఓవర్ వేసిన శార్దూల్ బౌలింగ్లో.. న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్.. భారీగా పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్స్గా మలిచిన అతడు.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇక ఓవర్లో వైడ్ల రూపంలో రెండు పరుగులు రాగా.. ఆఖరి బంతికి ఒక పరుగు తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తంగా కివీస్కు 25 పరుగులు వచ్చాయి. ఇక మొత్తంగా ఈ మ్యాచ్లో 145 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరోవైపు శార్దూల్.. 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..! FIFA WC: బ్రెజిల్ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్క్రీంలు అమ్మి -
Ind Vs NZ: న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి.. భారీ స్కోరు చేసినా
India tour of New Zealand, 2022- New Zealand vs India, 1st ODI: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఇక ఈ విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. మూడు అర్ధ శతకాలు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్ వరుసగా 72, 50 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ సాధించాడు. వీరికి తోడు సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. టామ్ లాథమ్ అజేయ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ 22, డెవాన్ కాన్వే 24 పరుగులకే అవుటయ్యారు. అయితే, ఫస్ట్డైన్లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేయగా.. టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్కు ఒకటి, ఉమ్రాన్ మాలిక్కు రెండు వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మొదటి వన్డే- మ్యాచ్ స్కోర్లు: ఇండియా- 306/7 (50) న్యూజిలాండ్- 309/3 (47.1) చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్ Tagenarine Chanderpaul: తండ్రికి తగ్గ తనయుడు -
IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో విజయం దిశగా సాగుతున్న టీమిండియాను శార్దూల్ ఠాకూర్ భ్రష్టు పట్టించాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు (4 ఫోర్లు, సిక్స్, 2 వైడ్లు) సమర్పించుకుని టీమిండియా కొంపముంచాడు. అప్పటి దాకా న్యూజిలాండ్ గెలుపుకు 66 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దూల్ దెబ్బకు సమీకరణలు (60 బంతుల్లో 66) ఒక్కసారిగా మారిపోయాయి. మ్యాచ్ కివీస్పైపు తిరిగింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన శార్దూల్ను టామ్ లాథమ్ ఆటాడుకున్నాడు. ఆ ఓవర్కు ముందు 70 బంతుల్లో 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న టామ్.. 40వ ఓవర్ ఆఖరి బంతికి సింగల్ తీసి కెరీర్లో 7వ సెంచరీ (76 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఒకే ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. ఒక్క ఓవర్తో మ్యాచ్ మొత్తాన్ని చెడగొట్టిన శార్దూల్ను టీమిండియా అభిమానులు ఆడుకుంటున్నారు. ఈ మాత్రం సంబరానికి ఈయనని ఆడించడం ఎందుకని మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. బ్యాటింగ్లో కూడా చేసిందేమీ లేదు.. ఇలాంటి వాళ్లను ఆల్రౌండర్గా ఎలా పరిగణిస్తారని సెలక్టర్లపై ధ్వజమెత్తుతున్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. -
మొన్న టీమిండియా.. ఇప్పుడు కివీస్ను వణికించారు! అట్లుంటది మాతోటి!
Ireland Vs New Zealand ODI Series 2022: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో టీమిండియాకే చెమటలు పట్టించింది ఐర్లాండ్. ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి నాలుగు పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేతిలో ఓడింది. అయినా.. ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకుంది. అదే తరహాలో శుక్రవారం నాటి మూడో వన్డేలోనూ చివరి వరకు ఐర్లాండ్ జట్టు పోరాడిన తీరు అద్భుతం. అట్లుంటది మాతోని ఇప్పటికే కివీస్కు సిరీస్ సమర్పించుకున్న ఐర్లాండ్.. డబ్లిన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 361 పరుగుల భారీ స్కోరు ఛేదించే దిశగా పయనించి న్యూజిలాండ్ ఆటగాళ్లను వణికించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 120 పరుగులతో అదరగొడితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన హ్యారీ టెక్టార్ 108 పరుగులు సాధించాడు.కానీ ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. బై రూపంలో ఒక పరుగు మాత్రమే లభించడంతో ఆండ్రూ బృందం పర్యాటక కివీస్ ముందు తలవంచక తప్పలేదు. పసికూన కాదు! ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ఓడినా అసాధారణ ఆట తీరుతో మనసులు మాత్రం గెలుచుకుందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా, కివీస్ వంటి మేటి జట్లకే వణుకు పుట్టించింది ఇకపై ఐర్లాండ్ పసికూన కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ సైతం ఐర్లాండ్ పోరాట పటిమను కొనియాడాడు. A special moment for Paul Stirling. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Tyg4ykcTcW — Cricket Ireland (@cricketireland) July 15, 2022 మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్ రూపొందించినందుకు గ్రౌండ్స్మెన్కు క్రెడిట్ ఇవ్వాలి. మేము బ్యాటింగ్ చేసే సమయంలో హార్డ్గా ఉంది. ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అయితే, వారు ఆడిన విధానం అమోఘం. మేము ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు పోరాడిన తీరు అద్భుతం. ఐర్లాండ్ జట్టు రోజురోజుకీ తమ ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటోంది’’ అని కొనియాడాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేము చాలా బాగా ఆడాము. కానీ ఓటమి పాలయ్యాం. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఐరిష్ జెర్సీలోని ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడం సూపర్. టెక్టర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. ఈ ఏడాది మాకు ఇదే ఆఖరి వన్డే అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అయితే, మరిన్ని టీ20 మ్యాచ్లు ఆడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్తో మూడు వన్డేల సిరీస్లో ఐర్లాండ్ వరుసగా ఒక వికెట్, మూడు వికెట్లు, ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings. What a talent. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే వేదిక: ది విలేజ్, డబ్లిన్ టాస్: న్యూజిలాండ్- బ్యాటింగ్ న్యూజిలాండ్ స్కోరు: 360/6 (50) ఐర్లాండ్ స్కోరు: 359/9 (50) విజేత: ఒక పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్(126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు) -
ఇంగ్లండ్తో మూడో టెస్టు..న్యూజిలాండ్ స్కోర్: 168/5
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 51.5 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు సాధించింది. టామ్ లాథమ్ (76; 12 ఫోర్లు), విలియమ్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. డరైల్ మిచెల్ (4 బ్యాటింగ్), బ్లన్డెల్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 67 ఓవర్లలో 360 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టు ఆడుతున్న జేమ్స్ ఓవర్టన్ (97; 13 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. బెయిర్స్టో (157 బంతుల్లో 162; 24 ఫోర్లు), స్టువర్ట్ బ్రాడ్ (36 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు, టిమ్ సౌతీ మూడు, నీల్ వాగ్నర్ రెండు వికెట్లు తీశారు. చదవండి: IND vs LEI: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9 -
అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్
నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ మైకెల్ రిప్పన్ అరుదైన ఘనత అందుకోనున్నాడు. క్రికెట్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఆ జాబితాలోకి మైకెల్ రిప్పన్ అడుగుపెట్టనున్నాడు. ఇంతకాలం నెదర్లాండ్స్కు ప్రాతినిధ్యం వహించిన రిప్పన్ ఇకపై న్యూజిలాండ్ తరపున ఆడనున్నాడు. యూరోపియన్ టూర్లో భాగంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి అసోసియేట్ దేశాలతో కివీస్ జట్టు సిరీస్లు ఆడనుంది. దీనిలో భాగంగా ఆ టూర్లో పాల్గొనే ఆటగాళ్లను కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో ఈ టూర్ జరగనుంది. మొదట ఐర్లాండ్తో మూడు వన్డేలు.. మూడు టి20లు ఆడనున్న న్యూజిలాండ్ ఆ తర్వాత ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో రెండు టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లు ముగిసిన తర్వాత అమ్స్టర్డామ్ వేదికగా నెదర్లాండ్స్తో రెండు టి20 మ్యాచ్లు ఆడనుంది. కాగా ఐర్లాండ్తో వన్డేలకు టామ్ లాథమ్ కివీస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. ఐర్లాండ్తో టి20లు, స్కాట్లాండ్తో వన్డే, టి20లు, నెదర్లాండ్స్తో టి20లకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఐర్లాండ్తో వన్డే జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది నెదర్లాండ్స్, స్కాట్లాండ్తో సిరీస్లో పాల్గొననున్నారు. కాగా సౌతాఫ్రికాకు చెందిన మైకెల్ రిప్పన్ కుటుంబసభ్యులు 2013లో న్యూజిలాండ్కు వలస వచ్చారు. అయితే న్యూజిలాండ్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న రిప్పన్.. డచ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్ తరపున 9 వన్డేలు, 21 టి20 మ్యాచ్లు ఆడిన రిప్పన్.. తాజాగా బ్లాక్ క్యాప్స్కు ఆడనున్నాడు. అయితే మైకెల్ రిప్పన్ ఐర్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక కాలేదు. కేవలం స్కాట్లాండ్, నెదర్లాండ్స్తో సిరీస్ల్లో ఆడనున్నాడు. ఇక ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఏదైనా సభ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఒక ఐసీసీలో పూర్తి స్థాయి జట్టుకు ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైతే మాత్రం మూడేళ్ల పాటు అసోసియేట్ దేశాలకు ఆడే వీలు మాత్రం ఉండదు. కాగా గతంలోనే ఇలా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో ప్రస్తుత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( ఐర్లాండ్, ఇంగ్లండ్), లూక్ రోంచి( న్యూజిలాండ్, ఆస్ట్రేలియా), మార్క్ చాప్మన్(హాంకాంగ్, న్యూజిలాండ్), గ్జేవియర్ మార్షల్(అమెరికా, వెస్టిండీస్),హెడెన్ వాల్ష్(అమెరికా, వెస్టిండీస్), డేవిడ్ వీస్(సౌతాఫ్రికా, నమీబియా)లు ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనలో వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ ఐర్లాండ్ టి20, స్కాట్లాండ్ & నెదర్లాండ్స్తో కివీస్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ మైఖేల్ రిప్పన్, బెన్ సియర్స్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్ చదవండి: బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్కు హక్కు ఉంటుందా? ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్! -
ODI, T20 Series: విలియమ్సన్ లేకుండానే వరుస సిరీస్లు.. జట్లు ఇవే!
New Zealand White-ball Tours to Ireland, Scotland and the Netherlands: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రానున్న రెండు నెలలు బిజీబిజీగా గడుపనుంది. జూలైలో ఐర్లాండ్, స్కాట్లాండ్లలో పర్యటించనున్న కివీస్ ఆటగాళ్లు.. ఆగష్టులో నెదర్లాండ్స్ టూర్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మూడు దేశాలతో సిరీస్కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. కాగా జూలై 10న ఐర్లాండ్తో మ్యాచ్తో వన్డే సిరీస్ ఆరంభించనున్న కివీస్.. మొత్తంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి స్కాట్లాండ్తో వరుసగా రెండు టీ20లు, ఒక వన్డే ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అదే విధంగా.. ఆగష్టు 4, 6 తేదీల్లో నెదర్లాండ్స్తో రెండు టీ20 మ్యాచ్ల సిరీస్కు న్యూజిలాండ్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆయా సిరీస్లకు ప్రకటించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఐర్లాండ్తో వన్డే సిరీస్కు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్వెల్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), జాకోబ్ డాఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్, విల్ యంగ్. ఐర్లాండ్ టీ20 సిరీస్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్తో సిరీస్లకు కివీస్ జట్టు: మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్పన్, బెన్ సీర్స్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇతర సీనియర్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు లేకుండానే కివీస్ ఈ పర్యటనలు చేయనుంది. వీరికి విశ్రాంతినిచ్చేందుకు బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో జట్టుకు దూరమయ్యారు. ఇక విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్, మిచెల్ సాంట్నర్ ఆయా సిరీస్లకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. అదే విధంగా హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ బ్రేక్ తీసుకోగా.. షేన్ జర్గన్సన్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్! Shane Jurgensen looks forward to the tour of Ireland starting on 10 July in Malahide. Jurgensen will head up the coaching team for the tour, allowing regular head coach Gary Stead a short break 🏏 More details at https://t.co/3YsfR1Y3Sm or the NZC App. #IREvNZ pic.twitter.com/waWaYExCuj — BLACKCAPS (@BLACKCAPS) June 20, 2022 -
చరిత్ర సృష్టించిన కివీస్ కెప్టెన్.. 24 ఏళ్ల కిందటి సచిన్ రికార్డు బద్దలు
Tom Latham Breaks Sachin Tendulkar Record: న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. పుట్టినరోజు నాడు వన్డేల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో (1998లో 134 పరుగులు) ఈ రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. లాథమ్ తాజాగా 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డుతో పాటు లాథమ్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. పుట్టినరోజు నాడు సెంచరీ సాధించిన తొలి కెప్టెన్గా లాథమ్ రికార్డు నెలకొల్పాడు. శనివారం (ఏప్రిల్ 2) నెదర్లాండ్స్తో జరిగిన రెండో వన్డేలో 123 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 140 పరుగులు చేసిన లాథమ్ వన్డేల్లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ లాథమ్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 146 పరుగులకే చాపచుట్టేయడంతో కివీస్ 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో నెదర్లాండ్స్తో జరుగుతున్న వన్డే సిరీస్కు టామ్ లాథమ్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: సీఎస్కేకు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ బౌలర్ ఆసుపత్రి పాలు, మరొకరిది అదే పరిస్థితి -
NZ Vs SA 1st Test: దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం.. కివీస్ అద్భుత విజయం
South Africa Tour Of New Zealand 2022- క్రైస్ట్చర్చ్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. శుక్రవారం మొదట కివీస్ తొలి ఇన్నింగ్స్లో 117.5 ఓవర్లలో 482 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్ (105; 11 ఫోర్లు) శతక్కొట్టాడు. ఇక 387 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా 111 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకు ముందు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ చెలరేగడంతో 95 పరుగులకే ప్రొటిస్ జట్టు తొలి ఇన్నింగ్స్కు తెరపడిన విషయం విదితమే. ఈ మ్యాచ్లో మొత్తంగా హెన్రీ9 వికెట్లు(7,2) పడగొట్టాడు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించి తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ కేవలం ఒకే ఒక్క పరుగు చేయగా.. కివీస్ సారథిగా వ్యవహరించిన టామ్ లాథమ్ 15 పరుగులు సాధించాడు. బ్యాటర్గా ఆకట్టుకోకపోయినా కెప్టెన్గా ఘన విజయం అందుకున్నాడు. కాగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. స్కోర్లు: న్యూజిలాండ్- 482 దక్షిణాఫ్రికా- 95 & 111 చదవండి: Mohammed Siraj- Virat Kohli: కోహ్లి టోలీచౌకీకి వచ్చాడోచ్..! నా జీవితంలోనే బెస్ట్ సర్ప్రైజ్.. భయ్యాను చూడగానే గట్టిగా హగ్ చేసుకున్నా! Delivering the perfect start to Day 3! @Matthenry014 with our @ANZ_NZ Play of the Day at Hagley Oval. #NZvSA pic.twitter.com/n4ojSRjX7t — BLACKCAPS (@BLACKCAPS) February 19, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్లా.. వీడియో వైరల్!
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్తో అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్లో.. మొహమ్మద్ నయీమ్ కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. దీంతో థర్డ్ స్లిప్లో ఉన్న లాథమ్ డైవ్ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోను బ్లాక్ క్యాప్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో ఇన్నింగ్స్, 117పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. కాగా ఈ మ్యాచ్లో లాథమ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు
కింగ్స్టన్ వేదికగా బంగ్లాదేశ్తో రెండో టెస్ట్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. 373 బంతులు ఎదర్కొన్న లాథమ్ 34 ఫోర్లు, 2 సిక్స్లతో 252 పరుగులు సాధించాడు. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 521-6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లాథమ్తో పాటు కాన్వే కూడా సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగల్గింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, షారిఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించాడు. ఇక తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. చదవండి: IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఒక బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్!
న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26 ఓవర్లో కేవలం ఒక బంతికే 7పరుగులును బంగ్లాదేశ్ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్లో అఖరి బంతిను విల్ యంగ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుంది. కాగా స్లిప్లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు. అయితే ఫీల్డర్ బౌలర్ ఎండ్ వైపు త్రో చేయగా, బౌలర్ ఆ బంతిని ఆపలేకపోవడంతో ఫోర్ బౌండరీకు వెళ్లింది. దీంతో ఓవర్త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ అద్భుతంగా ఆడుతంది. తొలి వికెట్కు ఓపెనర్లు లాథమ్, యంగ్ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 349 పరుగులు సాధించింది. లాథమ్ 186 పరుగులు సాధించి డబుల్ సెంచరీకు చెరువలో ఉండగా, కాన్వే 99 పరుగులు చేసి సెంచరీకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. చదవండి: WI vs IRE: 4 ఫోర్లు, 4 సిక్స్లు.. పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ .. Meanwhile, across the Tasman Sea... ⛴️ Chaos in the field for Bangladesh as Will Young scores a seven (yes, you read that correctly!) 😅#NZvBAN | BT Sport 3 HD pic.twitter.com/fvrD1xmNDd — Cricket on BT Sport (@btsportcricket) January 9, 2022 -
IND vs NZ 2nd Test: తొలి రోజు ముగిసిన ఆట.. మయాంక్ అగర్వాల్ సెంచరీ..
IND Vs NZ 2nd Test Live Updates: సమయం: 17:34.. న్యూజిలాండ్, టీమిండియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 70 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. తన కేరిర్లో మయాంక్ నాలుగో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు. సమయం: 17:04.. ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా 69 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మయాంక్ 112, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుత స్కోర్: 57 ఓవర్లు ముగిసేసరికి 182/4. మయాంక్ 95, వృద్ధిమాన్ సాహా 11 పరుగులుతో క్రీజులో ఉన్నారు సమయం: 16:04.. 160 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి టెస్ట్లో సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. 18 పరుగులు చేసిన అయ్యర్. అజాజ్ పటేల్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. సమయం: 15:18PM.. టీమిండియా ప్రస్తుత స్కోర్: 43 ఓవర్లు ముగిసేసరికి 123/3. మయాంక్ 59, శ్రేయస్ అయ్యర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. సమయం: 14:18.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బీ అయిన కోహ్లి డకౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. మయాంక్ 32, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. సమయం: 14:08.. టెస్టు స్పెషలిస్ట్ పుజారా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఎజాజ్ పటేల్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయిన పుజారా డకౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. గిల్(44) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సమయం: 14:04.. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టును నిలకడగా ఆరంభించిన టీమిండియా శుబ్మన్ గిల్(44) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. గిల్ ఎజాజ్ పటేల్ బౌలింగ్లో రాస్ టేలర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. మయాంక్ 32, పుజారా క్రీజులో ఉన్నారు. సమయం: 12:50.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ను నిలకడగా ఆరంభించింది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 15, శుబ్మన్ గిల్ 15పరుగులతో ఆడుతున్నారు. సమయం: 11:45.. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండురోజులుగా కురిసిన వర్షాలకు ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఉదయం సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపయింది. లంచ్ విరామం తర్వాత టాస్ వేశారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టు కాస్త ఆలస్యంగా మొదలుకానుంది. గత రెండు రోజులుగా ముంబైలో వర్షం కురుస్తుండడంతో ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానంలో తేమ ఎక్కువగా ఉన్న కారణంగా టాస్ను కాస్త ఆలస్యంగా వేయనున్నారు. కాగా గ్రౌండ్మెన్స్ 10:30 గంటలకు మరోసారి పరీక్షించనున్నారు. అయితే రెండో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు గట్టిషాక్ తగిలింది. గాయాలతో ఇబ్బందిపడుతున్న అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు మ్యాచ్కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ -
రెండో బ్యాట్స్మన్గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత..
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టామ్ లాథమ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఔటైన సంగతి తెలిసిందే. కాగా ఒక న్యూజిలాండ్ బ్యాట్స్మన్ 90ల్లో స్టంప్ అవుట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1991-92లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జాన్ రైట్ 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. కాగా జాన్ రైట్ టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల తర్వాత టామ్ లాథమ్ టీమిండియాతో తొలి టెస్టులో అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. 282 బంతులెదుర్కొన్న లాథమ్ 10 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ విరామ సమయానికి 122 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ 10, కైల్ జేమీసన్ 8 పరుగులతో ఆడుతున్నారు. -
మూడుసార్లు రివ్యూలో సక్సెస్.. టెస్టు చరిత్రలో రెండో బ్యాటర్గా
Tom Latham Was 2nd Batsman Thrice Overturning OUT Decision In Innings.. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో నానాకష్టాలు పడ్డారు. రెండోరోజు ఆటను కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ముగించింది. అంతకముందు 345 పరుగుల వద్ద టీమిండియాను ఆలౌట్ చేసిన కివీస్ ఓవరాల్గా రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రివ్య్వూలు కూడా టీమిండియాకు అనుకూలంగా రాలేదు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా బౌలర్లు టామ్ లాథమ్ను మూడుసార్లు ఔట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూడుసార్లు రివ్య్వూకు వెళ్లిన లాథమ్కే అనుకూలంగా వచ్చింది. అలా టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో మూడుసార్లు రివ్యూలో సక్సెస్ సాధించిన రెండో బ్యాటర్గా లాథమ్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఇంగ్లండ్కు చెందిన మొయిన్ అలీ.. 2016-17లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఔట్పై మూడుసార్లు రివ్యూ కోరి సక్సెస్ అయిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు. కాగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 3, 15, 56వ ఓవర్లో టీమిండియా బౌలర్లు ఎల్బీ విషయంలో అప్పీల్కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ మూడుసార్లు ఔట్ ఇచ్చాడు. అయితే ప్రతీసారి రివ్యూకు వెళ్లగా మూడుసార్లు లాథమ్ నాటౌట్ అని తేలింది. చదవండి: Ravindra Jadeja: క్లీన్బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు -
న్యూజిలాండ్ క్రికెటర్ల ప్రాక్టీస్ షురూ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోనూ క్రికెట్ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. కివీస్ టాప్ క్రికెటర్లు టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, మ్యాట్ హెన్రీ, డరైల్ మిచెల్ సోమవారం ప్రాక్టీస్ను ప్రారంభించారు. క్రికెటర్ల కోసం సెప్టెంబర్ వరకు ఆరు జాతీయ క్యాంప్లను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్జడ్సీ) ప్రకటించింది. ‘లింకన్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఈ వారం జరిగే తొలి జాతీయ శిబిరంలో కివీస్ అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెటర్లు పాల్గొంటారు. రెండో శిబిరం మౌంట్ మాంగనీలోని బే ఓవల్లో ఈనెల 19–24 జరుగుతుంది. మూడోది ఆగస్టు 10–13 వరకు, నాలుగో శిబిరం ఆగస్టు 16–21 వరకు, మిగతా రెండు సెప్టెంబర్లో నిర్వహిస్తాం’ అని ఎన్జడ్సీ పేర్కొంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మౌంట్మాంగనీలో జరిగే రెండో శిబిరంలో పాల్గొననున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించడం పట్ల కివీస్ మహిళల వైస్ కెప్టెన్ ఆమీ సాటర్వైట్ ఆనందం వ్యక్తం చేసింది. -
వాటే డైవ్.. పిచ్చెక్కించావ్ కదా!
క్రిస్ట్చర్చ్: టీమిండియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆటలోనే టీమిండియా ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. ఆపై ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. 63 ఓవర్లలో భారత్ తొలి ఇన్నింగ్స్ను చుట్టేసిన కివీస్.. ఆపై 23 ఓవర్లు ఆడి వికెట్ను కూడా ఇవ్వలేదు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో పృథ్వీ షా(54), చతేశ్వర పుజారా(54), హనుమ విహారి(55)లు మినహా ఎవరూ రాణించలేదు. కాగా, భారత్ ఇన్నింగ్స్లో పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న టామ్ లాథమ్ అందుకున్న తీరు మ్యాచ్కే హైలైట్ అయ్యింది.(కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా?) భారత్ ఇన్నింగ్స్లో భాగంగా జెమీసన్ వేసిన 20 ఓవర్ తొలి బంతిని వేశాడు. దాన్ని థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడేందుకు పృథ్వీ షా యత్నించాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకోవడంతో స్లిప్ పైనుంచి దారి తీసుకుంది. కాగా, సెకండ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ గాల్లో అత్యద్భుతమైన డైవ్తో క్యాచ్ను పట్టేశాడు. దాంతో పృథ్వీ షా మ్యాజిక్ ఇన్నింగ్స్ ముగిసింది. కాకపోతే లాథమ్ క్యాచ్ను అందుకున్న తీరు మాత్రం నిజంగా అమోఘం. ఆ బలమైన షాట్ను అంతా ఫోర్ అనుకున్న తరుణంలో లాథమ్ సూపర్ మ్యాన్ తరహాలో ఎగిరి మరీ పృథ్వీ షాను షాక్కు గురి చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (టీమిండియాను ఆడేసుకుంటున్నారు..) How about this grab from Latham! pic.twitter.com/3XGwk0vuU8 — Canterbury Cricket (@CanterburyCrick) February 29, 2020 -
అదే మాకు చాన్స్ ఇచ్చింది: టేలర్
హామిల్టన్: తమతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన లక్ష్యం తక్కువైందని అంటున్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్. ఈ తరహా ఛేజింగ్ చేసినప్పుడు అది తమకు పెద్ద లక్ష్యం కనిపించలేదన్నాడు. ‘ చాలాకాలం తర్వాత మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన వచ్చింది. దీన్ని ఇలానే సిరీస్ ఆద్యంతం కొనసాగిస్తాం. మేము భారీ భాగస్వామ్యాలను నమోదు చేశాం. దాంతో చేజింగ్ చిన్నదైపోయింది. ప్రధానంగా మంచి ఆరంభం లభించడంతో మేము స్వేచ్ఛగా ఆడే వీలు దొరికింది. కుడి-ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. లెఫ్ట్-రైట్ హ్యాండ్ కాంబినేషన్లో లక్ష్యాలని కాపాడుకోవడం చాలా సందర్భాల్లో చూశాం. ఇది విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మేము కూడా కుడి-ఎడమ ప్రణాళికతలో టీమిండియాపై పైచేయి సాధించాం. నిజంగా రాస్ టేలర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ అసాధారణం. కానీ మా బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. మేము బౌలింగ్లో ఇంకా గాడిలో పడాలి. తదుపరి మ్యాచ్కు పూర్తిస్థాయిలో దిగుతామనే ఆశిస్తున్నా’ అని లాథమ్ తెలిపాడు. (ఇక్కడ చదవండి: గెలుపు ‘రాస్’ పెట్టాడు) అదే మాకు చాన్స్ ఇచ్చింది.. టీమిండియాను 350 పరుగుల లోపు కట్టడి చేయడమే తమ గెలుపు ఒక కారణమని రాస్ టేలర్ పేర్కొన్నాడు. భారత్ దూకుడును చూసి ఇంకా భారీ టార్గెట్ చేస్దుందని ఆశించామని, కానీ తమ బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతో తాము అనుకున్నదాని కంటే తక్కువ స్కోరే వచ్చిందన్నాడు. ఇక తమ బ్యాటింగ్లో లెఫ్ట్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ను కొనసాగించడంతో తమకు బౌండరీలను టార్గెట్ చేయడం ఈజీ అయ్యిందన్నాడు. టామ్ ఇన్నింగ్స్తో ఒత్తిడి తగ్గించాడన్నాడు. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలనే మ్యాచ్కు ముందు తమ ఆటగాళ్లతో చెప్పానన్నాడు. -
గెలుపు రాస్ పెట్టాడు
ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. సొంతగడ్డపై వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్లలో ఓటమి తర్వాత ఆ జట్టుకు ఊరట లభించింది. అది కూడా అసాధారణ విజయంతో దక్కింది. తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించి కివీస్ సగర్వంగా నిలిచింది. టి20ల్లో 0–5తో క్లీన్స్వీప్కు గురైన వేదనను మరచిపోయేలా భారత్పై తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు ఆకట్టుకుంది. సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ సెంచరీతో ముందుండి నడిపించగా... కెప్టెన్ లాథమ్, నికోల్స్ కీలక పాత్ర పోషించారు. టీమిండియా తరఫున శ్రేయస్ అయ్యర్ తొలి వన్డే సెంచరీ, రాహుల్ మెరుపు బ్యాటింగ్ చివరకు వృథా కాగా, పేలవ బౌలింగ్తో జట్టు భంగపడాల్సి వచ్చింది. మొత్తంగా భారీ స్కోర్లతో పరుగుల వరద పారిన సెడన్ పార్క్లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. హామిల్టన్: భారత్తో వన్డే సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో కివీస్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 88 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. లాథమ్ అనంతరం న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాస్ టేలర్ (84 బంతుల్లో 109 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి కెప్టెన్ టామ్ లాథమ్ (48 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (82 బంతుల్లో 78; 11 ఫోర్లు) అండగా నిలిచారు. టేలర్, లాథమ్ నాలుగో వికెట్కు 13.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 1–0తో ముందంజ వేయగా... ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఆక్లాండ్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఇద్దరు కొత్త ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (31 బంతుల్లో 32; 6 ఫోర్లు), పృథ్వీ షా (20)లతో భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్ను మెయిడిన్గా ఆడిన షా తొమ్మిదో బంతికి వన్డేల్లో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత వీరిద్దరు చకచకా పరుగులు రాబట్టారు. ఒక దశలో 17 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు వచ్చాయి. అయితే ఈ భాగస్వామ్యం 50 పరుగులకు చేరాక గ్రాండ్హోమ్ బౌలింగ్లో షా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే మయాంక్ కూడా అవుటయ్యాడు. ఇలాంటి స్థితిలో కోహ్లి, అయ్యర్ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లి వేగంగా ఆడగా అయ్యర్ మాత్రం నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. 9 పరుగుల వద్ద కష్టసాధ్యమైన క్యాచ్ను టేలర్ వదిలేయడంతో అయ్యర్ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడారు. కోహ్లి తనదైన శైలిలో కొన్ని చూడచక్కటి షాట్లతో అలరించాడు. మూడో వికెట్కు వీరిద్దరు 20.1 ఓవర్లలో 102 పరుగులు జోడించారు. అయితే ఓవర్కు 5.07 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు రాబట్టగలిగారు. ఈ దశలో లెగ్ స్పిన్నర్ సోధిని బౌలింగ్కు దించి కివీస్ మంచి ఫలితం సాధించింది. అప్పుడే హాఫ్ సెంచరీ మార్క్ను దాటిన కోహ్లిని సోధి తన తొలి ఓవర్లోనే ‘గుగ్లీ’తో క్లీన్బౌల్డ్ చేశాడు. ఇక భారత్ను నిలువరించవచ్చని ప్రత్యర్థి భావిస్తున్న తరుణంలో రాహుల్ సవాల్ విసిరాడు. మరోవైపు 66 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరు దూకుడుగా ఆడి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. సోధి ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రాహుల్ ఆ తర్వాత సౌతీ ఓవర్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. సౌతీ తర్వాతి ఓవర్లో అయ్యర్ 3 ఫోర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. 83 పరుగుల వద్ద గ్రాండ్హోమ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్... సాన్ట్నర్ ఓవర్లో సింగిల్ తీసి కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఆ మూడు ఓవర్లు... భారత్ తమ చివరి 6 ఓవర్లలో 62 పరుగులు చేయగలిగింది. ఇందులో సౌతీ వేసిన 48వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. కేదార్ జాదవ్ (15 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వరుస బంతుల్లో 4, 6, 4 బాదగా రాహుల్ మరో ఫోర్ కొట్టాడు. అయితే మిగిలిన ఐదు ఓవర్లలో 3 ఓవర్లు వేసిన బెన్నెట్ 6, 8, 7 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడంతో టీమిండియా మరింత భారీ స్కోరుకు దూరమైంది. వీరబాదుడు... తొలి పది ఓవర్ల పవర్ప్లేలో 54 పరుగులు... ఇలాంటి సాధారణ ఆరంభం తర్వాత కూడా కివీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఓపెనర్లు గప్టిల్ (41 బంతుల్లో 32; 1 ఫోర్), నికోల్స్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు తొలి వికెట్కు 85 పరుగులు జోడించారు. అయితే తాను ఎదుర్కొన్న 35వ బంతికి బౌండరీ కొట్టగలిగిన గప్టిల్ ఆ వెంటనే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన బ్లన్డెల్ (9) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సగం ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 147 పరుగులకు చేరింది. అర్ధ సెంచరీ అనంతరం కోహ్లి అద్భుత ఫీల్డింగ్కు నికోల్స్ రనౌటయ్యాడు. ఈ దశలో భారత్కు మ్యాచ్పై పట్టు చిక్కినట్లు అనిపించింది. అయితే టేలర్, లాథమ్ భాగస్వామ్యం ఆ ఆనందాన్ని దూరం చేసింది. 21.3 ఓవర్లలో 177 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తూ వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కుల్దీప్, శార్దుల్పై బ్యాట్స్మెన్ విరుచుకు పడ్డారు. ఫలితంగా 4 ఓవర్లలో 44 పరుగులు వచ్చాయి. 45 బంతుల్లో టేలర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ సహా మొత్తం 15 పరుగులు వచ్చాయి. 38 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు కుల్దీప్ బౌలింగ్లో లాథమ్ అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే నీషమ్ (9), గ్రాండ్హోమ్ (1) ఒకే ఓవర్లో వెనుదిరగడంతో న్యూజిలాండ్ శిబిరంలో కొంత ఆందోళన పెరిగింది. అయితే శార్దుల్ ఓవర్లో సాన్ట్నర్ (12 నాటౌట్) ఫోర్, సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు. చివరకు మరో 11 బంతులు మిగిలి ఉండగానే టేలర్ తమ జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) గ్రాండ్హోమ్ 20; మయాంక్ (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 32; కోహ్లి (బి) సోధి 51; అయ్యర్ (సి) సాన్ట్నర్ (బి) సౌతీ 103; రాహుల్ (నాటౌట్) 88; కేదార్ జాదవ్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 27; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 347. వికెట్ల పతనం: 1–50; 2–54; 3–156; 4–292. బౌలింగ్: సౌతీ 10–1–85–2; బెన్నెట్ 10–0–77–0; గ్రాండ్హోమ్ 8–0–41–1; నీషమ్ 8–0–52–0; సాన్ట్నర్ 10–0–58–0; సోధి 4–0–27–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) జాదవ్ (బి) శార్దుల్ 32; నికోల్స్ (రనౌట్) 78; బ్లన్డెల్ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్దీప్ 9; టేలర్ (నాటౌట్) 109; లాథమ్ (సి) షమీ (బి) కుల్దీప్ 69; నీషమ్ (సి) జాదవ్ (బి) షమీ 9; గ్రాండ్హోమ్ (రనౌట్) 1; సాన్ట్నర్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 29; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 348. వికెట్ల పతనం: 1–85; 2–109; 3–171; 4–309; 5–328; 6–331. బౌలింగ్: బుమ్రా 10–1–53–0; షమీ 9.1–0–63–1; శార్దుల్ 9–0–80–1; జడేజా 10–0–64–0; కుల్దీప్ 10–0–84–2. 22 పరుగుల ఓవర్... శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్లో కివీస్ పండగ చేసుకుంది. లాథమ్ ఒక సిక్స్ బాదగా...టేలర్ చివరి మూడు బంతుల్లో 6, 4, 4 కొట్టాడు. దాంతో మొత్తం 22 పరుగులు లభించాయి. 42 బంతుల్లోనే... టేలర్, లాథమ్ చెలరేగిన వేళ కివీస్ దూకుడుకు ఎదురు లేకుండా పోయింది. వీరిద్దరు క్రీజ్లో ఉన్న సమయంలో స్కోరు 200 నుంచి 300 పరుగులకు చేరేందుకు ఆ జట్టుకు కేవలం 42 బంతులే సరిపోవడం విశేషం. 56 ఎక్స్ట్రాలు! మ్యాచ్లో ఎక్స్ట్రాల రూపంలో ఏకంగా 56 పరుగులు నమోదయ్యాయి. న్యూజిలాండ్ 27 అదనపు పరుగులు ఇవ్వగా, భారత్ 29 పరుగులు సమర్పించుకుంది. కివీస్ 19 వైడ్లు వేయగా...టీమిండియా బౌలర్లు ఏకంగా 24 వైడ్లు వేశారు. అత్యధికంగా బుమ్రానే 9 వైడ్లు ఇచ్చాడు! రాహుల్, అయ్యర్ -
లాథమ్ భారీ సెంచరీ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ భారీ సెంచరీ సాధించాడు. 251 బంతులు ఎదుర్కొన్న లాథమ్ 15 ఫోర్ల సాయంతో 154 పరుగులు చేశాడు. దాంతో న్యూజిలాండ్ తేరుకోవడమే కాకుండా లంకపై పైచేయి సాధించింది. ఆదివారం 196/4 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన కివీస్కు లాథమ్, వాట్లమ్లు కీలకమైన భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ జోడి ఐదో వికెట్కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే కివీస్ స్కోరు 269 పరుగుల వద్ద ఉండగా లాథమ్ పెవిలియన్ చేరాడు. అదే సమయంలో వాట్లమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. జీత్ రావల్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో లాథమ్ మాత్రం సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్(20), రాస్ టేలర్(23)లు పెవిలియన్ చేరినా లాథమ్ మాత్రం నిలకడగా ఆడాడు. వాట్లమ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో లాథమ్ భారీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది లాథమ్కు 10వ టెస్టు సెంచరీ. -
టామ్ లాథమ్ నయా రికార్డు
లండన్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్కప్లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్గా నిలిచాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మెగా ఫైట్లో లాథమ్ మూడు క్యాచ్లను అందుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్కప్లో అత్యధిక మందిని పెవిలియన్కు పంపిన కీపర్గా ఆడమ్ గిల్ క్రిస్ట్(ఆస్ట్రేలియా) సరసన చేరిపోయాడు. ఈ వరల్డ్కప్లో లాథమ్ 21 ఔట్లలో భాగస్వామ్యమైతే, అంతకుముందు 2003 వరల్డ్కప్లో గిల్ క్రిస్ట్ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ జాబితాలో గిల్ క్రిస్ట్, లాథమ్ల తర్వాత స్థానాల్లో అలెక్స్ క్యారీ(20, 2019 వరల్డ్కప్), కుమార సంగక్కరా(17, 2003 వరల్డ్కప్)లు ఉన్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో జేసన్ రాయ్, జో రూట్, క్రిస్ వోక్స్ క్యాచ్లను లాథమ్ అందుకున్నాడు.ఇరు జట్ల మధ్య జరిగిన తుది పోరులో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్తో పాటు, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఓవరాల్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. -
జీత్ రావల్, లాథమ్ సెంచరీలు
హామిల్టన్: ఓపెనర్లు జీత్ రావల్ (220 బంతుల్లో 132; 19 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లాథమ్ (248 బంతుల్లో 161; 17 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో బంగ్లాదేశ్తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 86/0తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టుకు తొలి వికెట్కు రావల్, లాథమ్ 254 పరుగులు జోడించి పటిష్ఠ పునాది వేశారు. అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (132 బంతుల్లో 93 బ్యాటింగ్; 9 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాట్స్మన్ నికోల్స్ (81 బంతుల్లో 53; 7 ఫోర్లు) రాణించడంతో ఆట ముగిసే సమయానికి కివీస్ 4 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది. మరో మూడు రోజుల ఆట మిగిలిన ఉన్న ఈ టెస్టులో న్యూజిలాండ్ ఇప్పటికే 217 పరుగుల ఆధిక్యంలో ఉంది. విలియమ్సన్కు తోడుగా వాగ్నర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు
మౌంట్ మాంగనీ : భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయింది. టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, సాంత్నార్లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో కివీస్ ఆరో వికెట్ను నష్టపోయింది.. 62 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్ నాల్గో వికెట్గా పెవిలియన్కు చేరాడు. భారత స్పిన్నర్ చహల్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన లాథమ్.. అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్(6)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆపై హార్దిక్ వేసిన మరో ఓవర్లో సాంత్నార్ పెవిలియన్ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్ మూడు వికెట్లను చేజార్చుకుంది. అంతకుముందు రాస్ టేలర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్ బాట పట్టాడు. అటు తర్వాత టేలర్-లాథమ్లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా అర్థ శతకంతో మెరిశాడు. హాఫ్ సెంచరీ సాధించిన లాథమ్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్, సాంత్నార్లు ఔటయ్యారు. -
గెలుపు దిశగా కివీస్
వెల్లింగ్టన్: ఓపెనర్ టామ్ లాథమ్ (489 బంతుల్లో 264 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్నైట్ స్కోరు 311/2తో మూడో రోజు సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ను లాథమ్ ముందుకు నడిపించాడు. రాస్ టేలర్ (50; 5 ఫోర్లు) వెంటనే ఔటైనా... నికోల్స్ (50; 6 ఫోర్లు), గ్రాండ్హోమ్ (53 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్లు) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆతిథ్య జట్టు 578 పరుగులకు ఆలౌటైంది. 296 పరుగుల భారీ లోటుతో అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకను టిమ్ సౌతీ (2/7), బౌల్ట్ (1/12) దెబ్బకొట్టారు. వారి ధాటికి ఆ జట్టు 20 పరుగులకే ఓపెనర్లు గుణతిలక (3), కరుణరత్నే (10), వన్డౌన్ బ్యాట్స్మన్ ధనంజయ డిసిల్వా (0) వికెట్లు కోల్పోయింది. కుశాల్ మెండిస్ (5 బ్యాటింగ్), మాథ్యూస్ (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో లంక పరాజయాన్ని తప్పించుకోవడం కష్టమే. ఓపెనర్గా వచ్చి అత్యధిక స్కోరుతో నాటౌట్గా నిలిచిన బ్యాట్స్మన్గా టామ్ లాథమ్ రికార్డు నెలకొల్పాడు. అలిస్టర్ కుక్ (244 నాటౌట్; ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో 2017) పేరిట ఉన్న ఈ రికార్డును లాథమ్ సవరించాడు. -
న్యూజిలాండ్ 311/2
వెల్లింగ్టన్: ఓపెనర్ టామ్ లాథమ్ (256 బంతుల్లో 121 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు కెప్టెన్ విలియమ్సన్ (91; 10 ఫోర్లు), రాస్ టేలర్ (50 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో అదరగొట్టడంతో శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 2 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 275/9తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 282 వద్ద ఆలౌటైంది. -
'టీమిండియాపై మా వ్యూహం అదే'
ముంబై: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో గురువారం జరిగిన రెండో ప్రాక్టీస్ వన్డేలో టామ్ లాథమ్ (108: 97 బంతుల్లో 7x4, 2x6) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న లాథమ్ వందకు పైగా స్ట్రైక్ రేట్ తో శతకం బాది కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఆదివారం వాంఖేడ్ స్టేడియం వేదికగా భారత్ తో జరుగనున్న తొలి వన్డేను ఉద్దేశించి లాథమ్ మాట్లాడాడు. 'భారత్ పై పైచేయి సాధించాలంటే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక్కడ భారత సీమ్ బౌలర్ల కంటే స్పిన్నర్లే కీలకం. మా వ్యూహం కూడా స్సిన్నర్లపై ఎదురుదాడి చేయడమే. విరాట్ సేనపై ఆధిక్యాన్ని దక్కించుకోవాలంటే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ మ్యాచ్ లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఎడమ చేతి స్పిన్నర్లతో పాటు కరణ్ శర్మ లాంటి లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. వారితో ఆడిన అనుభవం భారత్ తో మ్యాచ్ లో మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. ప్రస్తుత భారత జట్టులో కుల్దీప్ యాదవ్, చాహల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. శ్రీలంక, ఆసీస్ జట్లపై ఇప్పటికే వారు సత్తాచాటుకున్నారు. భారత్ స్పిన్నర్లతోనే మా పోరు ఉంటుందని అనుకుంటున్నా. భారత జట్టులో ఉన్న స్పిన్నర్ల వీడియో ఫుటేజ్ లను పరిశీలిస్తున్నాం'అని లాథమ్ పేర్కొన్నాడు. -
తొలి వన్డే న్యూజిలాండ్దే
టామ్ లాథమ్ సెంచరీ బంగ్లాదేశ్పై 77 పరుగులతో విజయం క్రైస్ట్చర్చ్: ఓపెనర్ టామ్ లాథమ్ (137; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడంతో... బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 77 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1–0తో ఆధిక్యం సాధించింది. గురువారం నెల్సన్లో రెండో వన్డే జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 341 పరుగులు చేసింది. బంగ్లాతో ఆడిన 26 వన్డేల్లో కివీస్కు ఇదే అత్యధిక స్కోరు. కొలిన్ మున్రో (61 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి లాథమ్ ఐదో వికెట్కు రికార్డు స్థాయిలో 158 పరుగులు జోడించాడు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన బంగ్లా 44.5 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షకీబ్ (59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హుస్సేన్ (50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫెర్గూసన్, నీషమ్లకు మూడేసి వికెట్లు, సౌతీకి రెండు వికెట్లు దక్కాయి. లాథమ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
'తప్పిదాలను సరిచేసుకోవాలి'
ధర్మశాల:భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో తిరిగి సత్తాచాటుకుంటామని న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాధమ్ స్పష్టం చేశాడు. తాము కొన్నింటిలో మెరుగుపడితే తప్పకుండా గట్టిపోటీ ఉంటుందన్నాడు. తొలి వన్డేతోనే సిరీస్ ముగిసి పోలేదని, ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నందున ఏమైనా జరగొచ్చన్నాడు. గత కొన్ని వారాల నుంచి భారత్లోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసినట్లు లాధమ్ తెలిపాడు. కాగా, దురదృష్టవశాత్తూ తొలి వన్డేలో పోరాడే స్కోరు చేయలేకపోవడంతోనే ఓటమి చెందామన్నాడు. 'మేము కొన్ని అనవసర తప్పిదాలు చేశాం. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చేసిన తప్పుల నుంచి బయట పడతామని అనుకుంటున్నా'అని లాధమ్ తెలిపాడు.తన సహచర ఆటగాడు టిమ్ సౌతీపై లాధమ్ ప్రశంసలు కురిపించాడు. తనకు సాయంగా నిలిచిన సౌతీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం నిజంగా మంచి పరిణామన్నాడు. జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సౌతీ అండగా నిలవడంతో 190 పరుగుల స్కోరును బోర్డుపై ఉంచకల్గిమన్నాడు. -
లాథమ్ సెంచరీ
దుబాయ్: పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శిస్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ టామ్ లాథమ్ (258 బంతుల్లో 137 బ్యాటింగ్; 11 ఫోర్లు; 1 సిక్స్) అజేయ సెంచరీతో సోమవారం తొలి రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లకు 243 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెకల్లమ్ (69 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (86 బంతుల్లో 32; 1 ఫోర్) రాణించారు. 22 ఏళ్ల లాథమ్కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా ఆసియాలో వరుసగా ఈ ఫీట్ సాధించిన యువ ఆసియేతర ఆటగాడుగా నిలిచాడు. పదేళ్ల అనంతరం కివీస్ నుంచి తొలి ముగ్గురు బ్యాట్స్మెన్ 30కి పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి.