US dollar
-
Indian students: యూరప్ పిలుస్తోంది..
అమెరికా డాలర్ కల కరిగిపోతోంది. బాగా చదువుకొని యూఎస్లో స్థిరపడాలని ఆశించిన యువత ఆశల రెక్కలను ట్రంప్ మహాశయుడు తుంచేశాడు. ఏదో ఒక విధంగా అమెరికాకు వెళితే చాలు నాలుగు డాలర్లు వెనుకేసుకోవచ్చని ఆశించిన లక్షలాది మంది విద్యార్థులు, యువత భంగపాటుకు గురయ్యారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్ముకొని, ఊరూ, పేరూ లేని విశ్వవిద్యాలయాల్లో చేరి ఉన్నత చదువుల నెపంతో రకరకాల ఉద్యోగాలు చేస్తున్న యువత ట్రంప్ దెబ్బకు తిరుగుపయనం అవుతున్నారు.మరోవైపు తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని, అగ్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకొన్న తల్లిదండ్రులు సైతం ట్రంప్ దెబ్బతో తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలని, బాగా సంపాదించాలని కోరుకొనే యువతను ఇప్పుడు యూరప్ దేశాలు ఆకర్షిస్తున్నాయి. కేవలం ఐటీ ఆధారిత కోర్సులు, ఐటీ ఆధారిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా లైఫ్సెన్స్, ఎని్వరాన్మెంటల్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లోనూ అద్భుత అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ అభిరుచికి తగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని పలు కన్సల్టెన్సీలు సూచిస్తున్నాయి. యూఎస్కు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది ప్రామాణికమైన విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతున్నారు. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తరువాత ఆ దేశంలో ఉండే కన్సల్టెన్సీలు సైతం విద్యార్థులను మరోవిధంగా మోసం చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరేందుకు కనీసం రూ.40 లక్షల వరకూ ఖర్చు కావచ్చు. కానీ తాము కేవలం రూ.8 లక్షలతో మరో వర్సిటీలో తమకు నచి్చన కోర్సుల్లో చేరి్పస్తామంటూ నమ్మిస్తున్నారు. మరోవైపు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో అలాంటి యూఎస్ కన్సల్టెన్సీలను నమ్మి నకిలీ వర్సిటీల్లో చేరుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో భాగంగా మొదటి 36 నెలల పాటు పార్ట్టైమ్ ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు లాటరీలో హెచ్–1 వీసా లభిస్తే ఇక భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండబోదనే ఆలోచనతో తక్కువ బడ్జెట్ ఆఫర్లతో ఆకట్టుకొనే వర్సిటీల్లో చేరుతున్నారు. మరి కొందరు రకరకాల విశ్వవిద్యాలయాల పేరిట ఆన్లైన్ కోర్సుల్లో చేరి ఒకే సమయంలో రెండు, మూడు రకాల పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఒక నిర్థిష్ట లక్ష్యం లేకుండా, ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరకుండా ఏదో ఒకవిధంగా స్థిరపడాలని భావించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. యూఎస్లోని వివిధ ప్రాంతాల్లో కనీసం లక్షన్నర మంది విద్యార్థులు ఉన్నట్లు నగరానికి చెందిన ఓ ప్రముఖ కన్సల్టెన్సీ వెల్లడించింది. ట్రంప్ విధానాల ఫలితంగా ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇంటిదారి పట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధి చెబుతున్న మాట.వెల్కం టు యూరప్.. ఈ క్రమంలో యూరప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాల్లో చదువుకొని స్థిరపడాలని కోరుకొనే విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘యూఎస్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ట్రంప్ గెలుపు అనివార్యంగా మారిన తరువాత చాలా మంది విద్యార్థులు యూఎస్ ఆలోచనను విరమించుకొని బ్రిటన్, తదితర దేశాలకు వెళ్తున్నారు.’ అని అమీర్పేట్కు చెందిన కాన్వొకేషన్స్ స్క్వేర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు హిమబింధు కోల్లా తెలిపారు. జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషల్లో కొద్దిపాటి ప్రవేశం ఉన్నా చాలు అక్కడి విద్యాసంస్థల్లో చేరవచ్చు. స్విట్జర్లాండ్లోనూ గొప్ప విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని పర్యటనతో మన విద్యార్థులకు ఫ్రాన్స్ ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం 5 సంవత్సరాల గడువుతో కూడిన వీసాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు. జర్మనీలో స్థిరపడుతున్న తెలుగువాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ స్థిరపడాలనుకొనేవారికి చక్కటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.సృజనాత్మకతకు పెద్దపీట.. చాలా మంది బీటెక్ చదివి ఇంజినీరింగ్ వైపే వెళ్లాలని భావిస్తారు. కానీ ఎన్విరాన్మెంటల్ సస్టెయినబుల్ గవర్నెన్స్ (ఈఎస్జీ), వేస్ట్మేనేజ్మెంట్, ఏఐ ఎథి్నక్స్, సైబర్క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, నర్సింగ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి వివిధ కోర్సుల్లో ప్రతిభను చాటే విద్యార్థులు, యువతకు యూరప్ దేశాల్లో అద్భుత అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.స్పష్టమైన లక్ష్యంతో ఢోకా లేదు.. అమెరికాలో కూడా చదువుకోవచ్చు. అక్కడే మంచి ఉద్యోగాల్లో చేరి స్థిరపడొచ్చు. కానీ ఏ లక్ష్యంతో వెళ్లాలి, ఏ విశ్వవిద్యాలయంలో చదవాలనే విషయంలో స్పష్టత ఉండాలి. యూరప్లో అభిరుచికి తగిన కోర్సుల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. – హిమబింధు కోల్లా, కాన్వొకేషన్స్స్కే్వర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ -
రూపాయి వెలవిల.. వంటనూనె సలసల
సాక్షి, హైదరాబాద్ : అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గుతుండడంతో దేశీయంగా వంటనూనెల ధరలకు రెక్కలొస్తున్నాయి. జనవరి 24వ తేదీ నుంచి రూపాయి విలువ భారీగా పడిపో వటంతో, వంటనూనెల ధరల్లోనూ మార్పులు వచ్చా యి. రాష్ట్రంలో 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. మూడేళ్ల క్రితం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. లీటర్ సన్ఫ్లవర్ నూనె రూ.200 వరకు చేరింది. పామాయిల్ ధరలు కూడా అప్పుడు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటంతో ధరలు దిగివచ్చినప్పటికీ.. లీటర్ నూనె ధర ఆయా కంపెనీల విలువను బట్టి రూ.125 పైనే కొనసాగింది. గత ఏడాది సెప్టెంబర్లో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్ఫ్లవర్, సోయాబీన్ ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచింది. రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. దీంతో మరోసారి దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.135 ఉన్న లీటర్ వంట నూనె ధర.. ప్రస్తుతం రూ.150 దాటింది. 60 శాతం దిగుమతే..మనదేశంలో వినియోగించే వంటనూనెలో 60 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. నవంబర్ నుంచి ఆ తర్వాతి ఏడాది అక్టోబర్ వరకు నూనె సంవత్సరంగా అంతర్జాతీయంగా పేర్కొంటారు. గత నూనె సంవత్సరంలో అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసు కుంది. ఇందుకోసం రూ.1,38,424 కోట్లను వెచ్చించింది. భారత్కు నూనెను ఎగుమతి చేసే దేశాల్లో ఇండోనేషియా, అర్జెంటీనా మొదటి రెండు స్థానాల్లో ఉండగా, పామాయిల్ను మలేషియా అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో చెల్లిస్తుండడంతో ఆ ప్రభావం రిటైల్ నూనెల మార్కెట్పై పడుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ నూనెల ధరలు ఆయా కంపెనీలను బట్టి రూ.150 నుంచి రూ.170 వరకు ఉన్నాయి. కాగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఐదు నెలల కనిష్ట స్థాయి 4.31 శాతానికి తగ్గింది. ఇది 2024 డిసెంబర్లో 5.22 శాతం ఉండగా, ఏడాది క్రితం 5.1 శాతంగా ఉంది. -
మన రూపాయి.. మరో కొత్త కనిష్ట స్థాయి
ముంబై: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధభయాల కారణంగా ఇన్వెస్టర్లు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడకపోతుండటంతో రూపాయి (Rupee) మారకం విలువపై మరింతగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకూ కొత్త కనిష్టాలకు జారిపోతోంది. తాజాగా బుధవారం డాలరుతో (US dollar) పోలిస్తే మరో 36 పైసలు క్షీణించి ఇంకో రికార్డు కనిష్ట స్థాయి 87.43కి పడిపోయింది.ఒక దశలో 87.49 కనిష్ట స్థాయిని కూడా తాకింది. అమెరికా, చైనా టారిఫ్ల ప్రభావాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తుండటంతో రూపాయిపై ప్రభావం పడుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. భారత్లో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, విదేశీ మార్కెట్లలో డాలరు బలపడుతుండటం కూడా మదుపరుల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయని వివరించారు.ద్రవ్యోల్బణం నిర్దిష్ట స్థాయికి పరిమితం కావడంతో ఆర్బీఐ ఈసారి పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు సాగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 7న విధాన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటించనుంది. అమెరికా డాలరు బలోపేతం అవుతుండటంవల్లే దానితో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణీ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ దేశం జపాన్ యువాన్తో కూడా రూపాయిని పోల్చి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయిని నిర్దిష్ట స్థాయికి పరిమితం చేయడం ఆర్బీఐ విధానం కాదని, తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే అవసరమైతే జోక్యం చేసుకుంటుందని వివరించారు. -
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక: ఆ ప్రయత్నం చేస్తే..
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బ్రిక్స్ (BRICS) దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్ విలువను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని, బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు.ఇతర దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించలేవు.. శక్తివంతమైన యూఎస్ డాలర్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితే.. 100 శాతం టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ దేశంపైనైనా వంద శాతం సుంకాలు విధించడానికి వెనుకాడమని అన్నారు.బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో కూడిన ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బ్రిక్స్.. అంతర్జాతీయ వాణిజ్యం కోసం యూఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తోంది. అయితే సుంకాలను ఆహ్వానించాలని అనుకుంటే.. అమెరికాకు వీడ్కోలు చెప్పవచ్చు అని ట్రంప్ అన్నారు.ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. అమెరికా డాలర్ నుండి వైదొలగాలనే ఆలోచన లేదు. బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవీ కూడా లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదంయూఎస్ డాలర్ ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది ప్రపంచంలో 90 శాతం కంటే ఎక్కువ లావాదేవీలను కలిగి ఉంది. యూఎస్ డాలర్ తరువాత జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్ వంటి ఇతర కన్వర్టిబుల్ కరెన్సీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాగా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి.. ఒకే కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది కొన్ని దేశాలు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. -
మరింత క్షీణిస్తున్న రూపాయి!
రూపాయి విలువ రోజురోజుకూ తెగ్గోసుకుపోతోంది. డాలర్ మారకంలో సోమవారం ఏకంగా 66 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్ట స్థాయి 86.70 వద్ద స్థిరపడింది. అమెరికా కరెన్సీ బలపడంతో పాటు చమురు ధరలు భగ్గుమనడంతో దేశీయ కరెన్సీ భారీ కోతకు గురైంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో రోజంతా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది రూపాయి... ఏ దశలోనూ కోలుకోలేక చివరికి ఇంట్రాడే కనిష్టం (86.70) వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్ల తర్వాత (2023 ఫిబ్రవరి 6న 68 పైసలు) దేశీయ కరెన్సీకి ఇదే అతిపెద్ద పతనం.గతేడాది డిసెంబర్ 30 ముగింపు 85.52 నుంచి రూపాయి ఏకంగా 118 పైసలు పడింది. ‘ఫారెక్స్ నిల్వలు 634 బిలియన్ డాలర్లకు దిగిరావడం, వర్ధమాన దేశాల కరెన్సీలూ క్షీణిస్తున్న తరుణంలో రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యాన్ని తగ్గించుకుంది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర 3 నెలల గరిష్టానికి ఎగసింది. డాలర్ ఇండెక్స్ రెండేళ్ల గరిష్టం 109.91 స్థాయికి చేరింది. దీంతో రూపాయి భారీగా క్షీణించింది’ అని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎండీ అనిల్ కుమార్ బన్సాలీ తెలిపారు.బలహీనతకు కారణాలు..బలపడుతున్న డాలర్అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్కు డిమాండ్ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.ఎఫ్పీఐల విక్రయాలురెండు-మూడు నెలల కొందట ఇండియన్ మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.పెరుగుతున్న ముడిచమురు ధరలుభారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.వాణిజ్య లోటుభారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాకు సైబర్ భద్రతదేశీయ ఆర్థిక కారకాలువృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.ఆర్బీఐ జోక్యంఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. -
రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలు
అమెరికా డాలర్(Dollar)తో పోలిస్తే భారత రూపాయి తాజాగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. శుక్రవారం సెషన్లో సుమారు రూ.86.04కు దిగజారింది. రూపాయి విలువ ఇంత భారీగా పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఇలా రూపాయి పడిపోవడానికి గల కారణాల్లో కొన్నింటిని కింద తెలుసుకుందాం.బలపడుతున్న డాలర్అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల కారణంగా అమెరికా డాలర్ బలపడుతోంది. ఈ నిర్ణయం వల్ల డాలర్కు డిమాండ్ అధికమవుతుంది. రూపాయి(Rupee)తో సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇది మరింత ఖరీదైనదిగా మారింది.ఎఫ్పీఐల విక్రయాలురెండు-మూడు నెలల కొందట ఇండియన్ మార్కెట్ జీవితకాల గరిష్టాలను తాకింది. దాంతో దాదాపు అన్ని స్టాక్ల వాల్యుయేషన్ పెరిగింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. దాంతోపాటు సురక్షితమైన అమెరికా ట్రెజరీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల(Equity Market) నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఇది గణనీయమైన మూలధన ప్రవాహానికి దారితీసింది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.పెరుగుతున్న ముడిచమురు ధరలుభారతదేశం ముడి చమురు ప్రధాన దిగుమతిదారు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు దిగుమతుల ఖర్చును పెంచాయి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రూపాయి విలువ మరింత తగ్గుతుంది.వాణిజ్య లోటుభారతదేశ వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ అసమతుల్యత వల్ల దిగుమతులకు చెల్లించడానికి ఎక్కువ డాలర్లు అవసరం అవుతుంది.దేశీయ ఆర్థిక కారకాలువృద్ధి మందగించడం, లిక్విడిటీ లోటు వంటి సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఫారెక్స్(Forex) మార్కెట్లో దూకుడుగా జోక్యం చేసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామర్థ్యానికి ఇవి అడ్డంకిగా మారాయి.ఆర్బీఐ జోక్యంఫారెక్స్ మార్కెట్లో అధిక అస్థిరతను అరికట్టడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. అయితే రూపాయి స్థిరమైన పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ మరింత చాకచక్యంగా వ్యహహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..రూపాయి బలహీనతతో కలిగే ప్రభావాలుఅధిక దిగుమతి ఖర్చులు: దిగుమతులకు పెరిగిన ఖర్చులు, ముఖ్యంగా ముడి చమురు దేశీయ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి.కార్పొరేట్ మార్జిన్లు: డాలర్ డినామినేషన్ అప్పులు చెల్లించే కంపెనీలపై భారం పడుతుంది. ఇది లాభాల మార్జిన్లను తగ్గిస్తుంది.ఇన్వెస్టర్ల సెంటిమెంట్: నిరంతర కరెన్సీ బలహీనత విదేశీ ఇన్వెస్టర్లను పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుంది. మూలధనం రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఆర్థిక ఒత్తిడి: దిగుమతులకు పెరుగుతున్న ఖర్చులు, విదేశీ రుణ సేవలు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. -
రూపాయి భారీ పతనం.. రికార్డు కనిష్టం నమోదు
డాలరుతో రూపాయి మారక విలువ శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల జీవితకాల ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 85.80కి చేరుకుంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ గట్టి ప్రయత్నాలతో కొంత మేర పుంజుకుని రికార్డు స్థాయికి 23 పైసలు దిగువన 85.50 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక ఫార్వర్డ్ కాంట్రాక్ట్లలో డాలర్ చెల్లింపులను కొనసాగించడం డాలరు కొరతను పెంచింది. దీంతో నెలాఖరు చెల్లింపుల కోసం దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన సెంటిమెంట్ ఉన్నప్పటికీ, విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి పతనమైనట్లు దిగుమతిదారులు చెబుతున్నారు.ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ వద్ద రూ.85.31 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి 53 పైసలు పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి రూ.85.80కి పడిపోయింది. చివరకు డాలరుతో పోలిస్తే రూ.85.50 (తాత్కాలిక) వద్ద సెషన్ను ముగించింది. దాని మునుపటి ముగింపు స్థాయి రూ.85.27 నుండి 23 పైసలు నష్టపోయింది.గత రెండు వారాల్లో రూపాయి దాదాపు ప్రతిరోజూ కొత్త కనిష్ట స్థాయిలను తాకుతోంది. గత రెండు సెషన్లలో 13 పైసలు క్షీణించిన తర్వాత గురువారం డాలర్తో పోలిస్తే 12 పైసలు పతనమై 85.27 వద్దకు చేరుకుంది. రూపాయి అంతకుముందు 2023 ఫిబ్రవరి 2న 68 పైసలు పతనమైంది. -
సుంకం విధిస్తే దాన్ని మళ్లీ డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీలోనే చెలిస్తారట సార్!
-
జారుడుబల్లపై రూపాయి
వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పతనమైంది. డాలరుతో మారకంలో తాజాగా 12 పైసలు నీరసించింది. 84.72 వద్ద ముగిసింది. వెరసి రెండో రోజూ సరికొత్త కనిష్టం వద్ద స్థిరపడింది. గత వారాంతాన సైతం 13 పైసలు నష్టపోయి 84.60 వద్ద నిలిచింది. జూలై–సెపె్టంబర్లో దేశ జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించడం, బ్రిక్ దేశాలపై యూఎస్ టారిఫ్ల విధింపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో కొద్ది రోజులుగా డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయి విలువ కోల్పోతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 84.59 వద్ద ప్రారంభమైంది. తదుపరి 84.73వరకూ క్షీణించింది. అంతర్జాతీయంగా డాలరు ఇండెక్స్ 0.5 శాతం పుంజుకొని 106.27 వద్ద కదులుతోంది. -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్బ్యాగ్ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
రూపాయి భారీ పతనానికి కారణాలు
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.కారణాలివే..1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సౌదీ అరేబియా నిర్ణయం.. డాలర్ ఆధిపత్యానికి ఎసరు!
యూనైటెడ్ స్టేట్స్తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల పెట్రో-డాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ 9తో ముగిసింది. ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపుతోంది.1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకార శకానికి నాంది పలికింది. ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్, ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూప్రింట్ గా భావించారు.సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. పెట్రోడాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ప్రత్యామ్నాయ కరెన్సీలకు తలుపులు తెరుస్తుంది. పెట్రోడాలర్ ఒప్పందం ముగింపు ప్రభావాలు ఇవే..యూఎస్ డాలర్ కాకుండా చైనీస్ ఆర్ఎంబీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడోలార్ వ్యవస్థ నుంచి దూరంగా వెళుతోంది. 1972లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది. ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతాయి.పెట్రోడాలర్ వ్యవస్థ చాలాకాలంగా యూఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యూఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యం, నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తుంది. సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గవచ్చు. ఇది దాని మారకం రేటు, ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుందిసౌదీ అరేబియా "పెట్రోయువాన్" వైపు అడుగులు వేస్తే, అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది.సౌదీ అరేబియా బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం చెల్లింపు పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది. ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది. -
కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్లో ఉంది. రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. తగ్గనున్న కరెంటు ఖాతా లోటు.. భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. మాంద్యం ప్రభావం ఇలా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే.. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. -
అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్పై ఒత్తిడి పెంచవచ్చంటున్నారు. ఫ్యూచర్ ఆప్షన్ డెరివేటివ్ల ముగింపు గురువారం కావడంతో ఒడుదుడుకులు కొనసాగొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు మినహా దేశీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలింవచ్చంటున్నారు. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరింత కాలం గరిష్ట స్థాయిలో కొనసాగించే అవకాశం ఉన్నందున ఈక్విటీలపై రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తగ్గింది. మార్కెట్లో బలహీనతలున్నందున, ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు, లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు ఉత్తమం. నిఫ్టీ గతవారం కీలక మద్దతు 19,850–19,900 శ్రేణిని కోల్పోయి, 19,674 స్థాయి వద్ద స్థిరపడింది. తదుపరి మద్దతు 19,500–19,400 పాయింట్ల పరిధిలో ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలు వ్యాఖ్యలు, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లలో దిద్దుబాటు, బలహీన ప్రపంచ సంకేతాల పరిణామాల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు దాదాపు 3% క్షీణించాయి. సెన్సెక్స్ 1830 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు అమెరికా గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఈసీబీ పాలసీ మినిట్స్ బుధవారం, అదే రోజున చైనా పారిశ్రామికోత్పత్తి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశం జరగనుంది. అమెరికా రెండో త్రైమాసిక వృద్ధి గణాంకాలు, ఈసీజీ సర్వసభ్య సమావేశం, చైనా కరెంట్ ఖాతా గురువారం వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం సెపె్టంబర్ సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్ల ముగింపు జరగనుంది. ఒకవేళ నిఫ్టీ ఈ సిరీస్ను నష్టాలతో ముగిస్తే వరుసగా రెండో వారమూ నష్టాల ముగింపు అవుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఐల లాంగ్ ఎక్స్పోజర్ 47% తగ్గింది. పుట్–కాల్ రేషియో 0.93 ఓవర్సోల్డ్ జోన్ వైపు కదలుతోంది. మూడు వారాల్లో రూ.10 వేల కోట్లు వెనక్కి భారత ఈక్విటీలను విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మన మార్కెట్ల నుంచి ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో ఎఫ్ఐఐలు రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అమెరికాలో ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, మాంద్యం భయాలు, దేశీయంగా కంపెనీల షేర్లు ప్రీమియంలో ఉండటం వంటి అంశాలు అమ్మకాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్లపై అధిక దిగుబడులు, డాలర్ ఇండెక్స్ బలపడటంతో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కొనసాగొచ్చంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో మార్చి నుంచి ఆగష్టు మధ్య ఎఫ్పీఐలు వరుసగా కొనుగోళ్లను కొనసాగించారు. ఈ మధ్యకాలంలో మొత్తం రూ. 1.74 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ‘‘భారత ఆర్థిక వృద్ధిలో అవకాశాలు, షేర్లు ఆకర్షణీయంగా ఉండటం, ప్రభుత్వ సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు మద్దతిస్తున్నాయి. ఇటీవల కొంత అమ్మకాల ధోరణి కనిపించినప్పటికీ వచ్చే నెలలో విదేశీ పెట్టుబడులు తిరిగి ఈక్విటీల్లోకి వస్తాయి’’ క్రేవింగ్ ఆల్ఫా మేనేజర్ మయాంక్ మెహ్రా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వారంలో మూడు ఐపీఓలు సెకండరీ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో ప్రాథమిక స్ట్రీట్ జోరు కనబరుస్తుంది. జేఎస్డబ్ల్యూ ఇ్రన్ఫాస్ట్రక్చర్, అప్డేటర్ సరీ్వసెస్ ఐపీఓలు ఈ నెల 25–27 తేదీల మధ్య జరగనున్నాయి. వాలియంట్ ల్యాబొరేటరీస్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 27న మొదలవుతుంది. కాగా గతవారంలో ప్రారంభమైన వైభవ్ జువెలర్స్ సెప్టెంబర్ 26న ముగిస్తుంది. వీటితో పాటు మరో 13 చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.4,000 కోట్లు సమీకరించనున్నాయి. -
ఏం పిల్లలండీ బాబు..! స్కూల్ జైల్ అట! ఏకంగా అమ్మేసేందుకు ప్లాన్
స్కూల్కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. పోనీ టీచర్ చదువులు చెప్పకపోతే కంప్లైంట్ చేస్తారు. అదీ కాకపోతే మౌళిక సదుపాయాలు సరిగా లేకపోతే అమ్మనాన్నలకు చెబుతారు. కానీ అమెరికాలో ఓ స్కూల్ పిల్లలు చేసిన పనికి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పిల్లలు చేసిన పనేంటంటే..! అమెరికాలోని మేరీలాండ్లో మీడే సీనియర్ హై స్కూల్ అనే పేరు గల పాఠశాల ఉంది. ఇందులో పిల్లలకు ఏం అనిపించిందో తెలియదు కానీ స్కూల్నే అమ్మకానికి పెట్టారు. స్థానిక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ 'జిల్లో'లో రూ.34.7లక్షలకు బేరం పెట్టారు. 12,458 గజాల స్కూల్ బిల్డింగ్ 'సగం పని చేసే జైల్' గా పేర్కొని లిస్టింగ్ చేశారు. ఈ జైళ్లో 15 బాత్రూమ్లు, ప్రత్యేకమైన కిచెన్, ప్రైవేట్ బాస్కెట్ బాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాదు అక్కడక్కడ సగం నిర్మాణంలో ఉన్న గోడలు ప్రాణాలను తీస్తాయని తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాతపూర్వకంగా వెబ్సైట్లో తెలిపారు. ఈ వినూత్నమైన లిస్టింగ్ను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. ఇంత మంచి ఆస్తిని ఇంత తక్కువకు అమ్ముతున్నారేంటని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. కొనుగోలుదారులు ఇలాంటి అవకాశాలను వదలుకోబోరని తెలిపారు. పిల్లలు చేసిన కొంటె పనితో స్కూల్ యాజమాన్యానికి చెమటలు పట్టినంత పనైంది. లిస్టింగ్ చేసిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్ నుంచి ఆ లిస్టింగ్ను తొలగించినట్లు తెలిపింది. తమ పిల్లలు క్రియేటివిటీకి ఆశ్చర్యపోయినప్పటికీ.. మరీ ఇంత తక్కువ డబ్బులకు లిస్టింగ్ చేయడం వింత కలిగించిందని ఓ ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తెలిపారు. ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
డాలర్ కోటకు బీటలు! బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి....
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! సైనిక, ఆర్థిక దండోపాయాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇది. తన మాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనుకుంటున్నారా? అదేమీ లేదు కాని, ఇన్నాళ్లూ ఏ డాలర్ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమలదండులా కదం తొక్కుతున్నాయి. దాదాపు 80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీ వార్కు తెరతీశాయి. రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధించి, వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన అమెరికా, అలాగే పశ్చిమ దేశాలు భవిష్యత్తులో తమపైనా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కేంటంటూ మేల్కొంటున్నాయి. డాలర్ కరెన్సీ నిల్వలతో పాటు డాలర్లలో వాణిజ్యానికి నో చెబుతున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పలు దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే సమీప భవిష్యత్తులోనే డాలర్తోపాటు అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అసలు డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే! డాలర్కు లోకం దాసోహం! అన్ని దేశాలకూ తమ సొంత కరెన్సీలు ఉన్నా, లోకమంతా డాలర్ల వెంటే పరిగెడుతోంది. కేవలం అంతర్జాతీయ వాణిజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ లావాదేవీల్లో అత్యధిక శాతం డాలర్లలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఏ మారుమూలకెళ్లినా డాలర్ చెల్లుతుంది. డాలర్కు అత్యధికంగా స్టోర్ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ వెలుగొందుతోంది. (ఎయిర్లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!) అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలుతెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడింది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడి ఎకానమీ పరుగులకు; సూపర్ పవర్గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్ను కంట్రోల్ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్ ప్రింటింగ్ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యూఎస్ అప్పు 31.5 ట్రిలియన్ డాలర్లు (జీడీపీతో పోలిస్తే 120 శాతం పైనే). ఈ డాలర్ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసిన అమెరికాకు చివరికి అప్పులతిప్పలు మిగిలాయి. 25 ఏళ్ల క్రితం ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో 72 శాతంగా ఉన్న డాలర్ వాటా ప్రస్తుతం 59 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు రష్యా, చైనాతో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యానికి గూబ గుయ్యిమంటోంది. యుద్ధభూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ తామేంటో రుచి చూపిస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఏకంగా డాలర్కే ఎసరు పెట్టేలా పావులు కదుపుతూ శ్వేతసౌధానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాను తవ్వుకున్న గోతిలోనే... తమ గుమ్మం ముందుకు నాటో విస్తరణను ఆపాలన్న రష్యా మాటను పెడచెవిన పెట్టిన అమెరికా, దాని మిత్ర దేశాలు... ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంతో ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. డాలర్ పతనానికి ఆజ్యం పోసింది ఇదే! రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా, యూరప్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది. ఇదీ చదవండి: దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే... క్రూడ్తో సహా అనేక కమోడిటీల ధరలు ఆకాశాన్నంటి జనాలు గగ్గోలు పెట్టడంతో సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు కుప్పకూలాయి. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. డాలర్ రూపంలో విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిన ఏ దేశమైనా తనకు ఎదురుతిరిగితే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా డాలర్ను వాడుకుంటుందన్న విషయం రష్యాపై ఏకపక్ష ఆంక్షల ఉదంతంతో తేటతెల్లమైంది. అమెరికా ఆధిపత్య ధోరణితో విసిగి పోయిన దేశాలన్నీ డాలర్ను వదిలించుకునే దిశగా చకచకా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ ఊహించని రీతిలో జోరందుకుంటోంది. ‘కింగ్ డాలర్’ ఎప్పుడు ఆవిర్భవించింది? వాస్తవానికి, 105 ఏళ్ల క్రితం డాలర్లలో ప్రపంచ దేశాల ఫారెక్స్ నిల్వలు సున్నా! 1900–1918 వరకు ప్రపంచంలో మూడు ప్రధాన కరెన్సీలు రాజ్యమేలాయి. అవి బ్రిటన్ పౌండ్, జర్మనీ మార్క్, ఫ్రెంచ్ ఫ్రాంక్. ఈ మూడు యూరోపియన్ దిగ్గజాలు అనేక దేశాలను తమ కాలనీలుగా చేసుకొని కొల్లగొట్టిన అసాధారణ సంపదే దీనికి కారణం. 1918 వరకు అసలు అమెరికా డాలర్ సోదిలోనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ పూర్తిగా చితికిపోవడంతో డాలర్ ప్రాభవం మొదలైంది. యూరోపియన్ల యుద్ధకాంక్ష యూఎస్కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్ దశ తిరిగింది. హిట్లర్ అధీనంలో ఉన్న ఫ్రాన్స్లో అమెరికా మిత్రదేశ బలగాలు విజయవంతంగా సముద్రదాడి చేయడంతో యూరప్పై శ్వేతసౌధం పట్టు బిగించింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న అమెరికా, ‘బ్రెటన్ వుడ్స్’ సంప్రదింపుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ను గుప్పిట్లో పెట్టుకుంది. ఆ సందర్భంగానే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్ ప్రపంచ తటస్థ రిజర్వ్ కరెన్సీగా డాలర్ను ప్రతిపాదించారు. దీనికి ఆమోదం లభించడంతో, డాలర్ ఆధిపత్యానికి పునాది పడింది. అయితే, 1947లో ప్రపంచ రిజర్వ్ కరెన్సీల్లో బ్రిటిష్ పౌండ్ వాటా 70 శాతం పైనే. మన రూపాయి కూడా పౌండ్తోనే ముడిపడి ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలడం, భారత్ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పౌండ్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1954లో తొలిసారి అమెరికా డాలర్ 40 శాతం పైగా వాటాతో పౌండ్ను వెనక్కినెట్టి కింగ్గా అవతరించింది. 1980 నాటికి పౌండ్ వాటా 3 శాతానికి పడిపోవడం విశేషం! రిజర్వ్ కరెన్సీ హోదా అంటే..? ప్రపంచ దేశాల విదేశీ కరెన్సీ రిజర్వ్ల (ఫారెక్స్ నిల్వలు) ఆధారంగా రిజర్వ్ కరెన్సీని పేర్కొంటారు. ఎక్కువ నిల్వలు ఏ కరెన్సీలో ఉంటే అది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కింగ్గా నిలుస్తుంది. ఉదాహరణకు, భారత్కు ఉన్న దాదాపు 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వల్లో అత్యధిక మొత్తం అమెరికా డాలర్లలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా బాండ్లలో పెట్టుబడుల రూపంలో, మరికొంత వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, విదేశీ వాణిజ్య బ్యాంకులు, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో యూరో, జపాన్ యెన్, చైనా యువాన్ వంటి ఇతర కరెన్సీల్లో నిల్వ చేస్తుంది. ఇక బంగారం రూపంలో కూడా కొన్ని ఫారెక్స్ నిల్వలను కొనసాగిస్తుంది. అంటే టాప్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న డాలర్లోనే దాదాపు ప్రపంచ దేశాలన్నీ తమ ఫారెక్స్ నిల్వలను ఉంచుతాయి. దీనికి కారణం విదేశీ ఎగుమతి–దిగుమతులు, విదేశీ రుణాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతరత్రా కరెన్సీ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలో జరగడమే. డాలర్ ఆధిపత్యంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనూ తమ గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా, పశ్చిమ దేశాలు... రుణాల ఎరతో అనే దేశాల ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు డాలర్పై తిరుగుబాటు చేయడానికి ఇదీ కారణమే! మరోపక్క, అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు, చెల్లింపులను నిర్వహించేందుకు ఏర్పాటైన స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)పై అమెరికా, యూరప్ దేశాలు పెత్తనం చలాయిస్తున్నాయి. రష్యాను ఈ పేమెంట్ వ్యవస్థ నుంచి ఏకపక్షంగా వెలివేయడం దీనికి నిదర్శనం. స్విఫ్ట్లో డాలర్, యూరో కరెన్సీ లావాదేవీలే అత్యధికంగా ఉండటంతో పశ్చిమ దేశాలు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. డాలర్ రిజర్వ్ హోదా కోల్పేతే... డీ–డాలరైజేషన్.. అంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు విడిపోవడం అనేది ఏడాదో రెండేళ్లలోనే జరిగే ప్రక్రియ కాదు. రష్యాపై ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే మొదలైన ఈ చర్యలు రాబోయే కొన్నేళ్లలో డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు కచ్చితంగా చరమగీతం పలుకుతాయనేది మెజారిటీ ఆర్థికవేత్తల మాట. వచ్చే ఐదేళ్లలో డీ–డాలరైజేషన్ కారణంగా ఇతర దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతుందంటూ స్వయంగా యూఎస్ సెనేటర్ మార్కో రూబియో అంచనా వేయడం గమనార్హం. రష్యా విషయంలో ఆంక్షలు బ్యాక్ఫైర్ అవ్వడమే దీనికి సంకేంతం. అంతేకాదు వచ్చే కొన్నేళ్లలో ప్రధాన దేశాలన్నీ తమ సొంత కరెన్సీల్లో (ప్రతిపాదిత బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీతో సహా) వాణిజ్య, ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాటా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో డాలర్కు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇతర సెంట్రల్ బ్యాంకుల వద్దనున్న డాలర్ నిల్వలను తగ్గించుకోవడాన్ని చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. దీనివల్ల డాలర్ స్టోర్ విలువ మరింత పడిపోతుంది. వడ్డీరేట్లు భారీగా ఎగబాకే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా ట్రెజరీ బ్రాండ్స్ను కొనే దేశాలు కరువవ్వడంతో ఇప్పటిలాగే డాలర్లను ఇష్టానుసారం ప్రింట్ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. ధరలు అంతకంతకూ కొండెక్కి అతి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతి మంగా దిగుమతులు గుదిబండగా మారడంతో పాటు అమెరికా ప్రభుత్వ రుణ చెల్లింపులు కష్టతరంగా మారతాయి. నిధుల కోసం పన్నులు పెంచాల్సి వస్తుంది. అంతేకాదు, మనీ ప్రింటింగ్కు గండిపడటంతో, సైనిక వ్యయం పడిపోయి మిలిటరీ పరంగా కూడా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు వేగం పుంజుకుంటే డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ హోదాతో పాటు రాజకీయంగా అమెరికా ‘సూపర్ పవర్’ ప్రాభవం కూడా మసకబారుతుందనేది నిపుణుల విశ్లేషణ! చైనా–రష్యా–భారత్ భాయీ భాయీ.. ‘100 ఏళ్లలో జరగని మార్పులను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మనం కలసి ముందుకు సాగితే ఈ మార్పులు సాక్షాత్కరిస్తాయి’ అంటూ పుతిన్తో జిన్పింగ్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం డాలర్ కోటను బద్దలు కొట్టడమే! రష్యా ఇప్పటికే యూరప్తో పాటు పలు దేశాలకు రూబుల్స్లో మాత్రమే చమురు, గ్యాస్ ఇతరత్రా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సౌదీ, ఇరాన్ సైతం తమ సొంత కరెన్సీల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతులకు సై అంటున్నాయి. తద్వారా పెట్రో డాలర్కు షాక్ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు కమోడిటీలదే అత్యధిక వాటా. ఇక ఇప్పుడు ఏకంగా డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు గురిపెట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యాన్ని చైనా కరెన్సీ యువాన్లతో జరుపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మరోపక్క, రష్యాపై అమెరికా ఆంక్షలకు చెక్ చెప్పేందుకు భారత్, చైనా రంగంలోకి దిగాయి. రష్యా నుంచి యథేచ్ఛగా క్రూడ్ ఇతరత్రా కమోడిటీలను కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుండి భారత్ క్రూడ్ దిగుమతులు ఏకంగా 22 రెట్లు ఎగబాకాయి (రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్). రష్యాతో పెనవేసుకున్న భారత్ మైత్రికి ఇది తర్కాణం. చైనా సైతం రష్యాతో వాణిజ్యాన్ని 30 శాతం పెంచుకుంది. గత ఏడాది రష్యా నుంచి చైనాకు 80 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరగగా, రష్యా నుంచి చైనాకు ఏకంగా 110 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులు జరిగాయి. ఈ మొత్తం వాణిజ్యం లో మూడు దేశాలు తమ సొంత కరెన్సీలనే ఉపయోగిస్తుండం డాలర్కు మరో బిగ్ షాక్! అమెరికా పక్కలో ‘బ్రిక్స్’ బల్లెం.. ప్రపంచ భౌగోళిక రాజకీయాలనే కాదు ఆర్థిక వ్యవస్థను సైతం శాసించేలా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి అంతకంతకూ బలోపేతం అవుతోంది. ప్రపంచ పెత్తనం చేస్తున్న జీ7 దేశాల (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్తో సహా) జీడీపీని 5 బ్రిక్స్ దేశాల జీడీపీ (కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా) అధిగమించడం విశేషం. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా ప్రస్తుతం 30 శాతానికి పడిపోగా, బ్రిక్స్ దేశాల జీడీపీ వాటా 31.5 శాతానికి చేరింది. అంతేకాదు, సాధారణ జీడీపీలో సైతం ఇప్పటికే బ్రిక్స్ కూటమి అమెరికా జీడీపీని మించిపోయింది. 2035 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించి చైనా నంబర్ వన్ అవుతుందని బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ అంచానా వేసింది. భారత్ సైతం 2075కల్లా అమెరికాను మించిపోతుందని జోస్యం చెప్పింది. మరోపక్క, బ్రిక్స్ కూటమి విస్తరణతో బ్రిక్స్ ప్లస్గా అవతరించే చర్యలు పుంజుకున్నాయి. కీలకమైన సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, అర్జెంటీనా, నైజీరియా, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, మెక్సికో, వెనెజులా ఇలా మొత్తం 12 దేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలాఉంటే, బ్రిక్స్ కూటమి తమ సొంత కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. స్విఫ్ట్ స్థానంలో సొంత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పనుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను పెంచుకుంటోంది. చైనా పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా.. డాలర్ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్యానికి పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించి.. కరెన్సీ, పేమెంట్ వ్యవస్థ సాకారమైతే డాలర్కు నిజంగా మరణ శాసనమేనని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. గల్ఫ్.. గుడ్బై! చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ మూడోసారి పగ్గాలు చేపట్టాక రష్యాతో మరింత సన్నిహితం కావడంతో పాటు దౌత్యపరంగానూ సత్తా చాటుతున్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్న సౌదీ, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి అమెరికాకు షాకిచ్చారు. టర్కీ–సిరియా మధ్య సంధి కుదిర్చేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. సౌదీ సైతం యెమెన్తో యుద్ధానికి ముగింపు పలికేలా అడుగులేస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇన్నాళ్లూ అడిస్తున్న యుద్ధతంత్రానికి ఈ పరిణామాలు చెల్లు చెప్పే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్, సౌదీ నుంచి ఇకపై చైనా యువాన్లోనే క్రూడ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైతం తమ సొంత కరెన్సీలో ట్రేడింగ్కు సై అంది. సౌదీ, రష్యాలు సైతం తమ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పలు రిఫైనరీలను చైనాలో సౌదీ ఆరామ్కో నిర్మించనుంది. ఇందుకు యువాన్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తొలిసారిగా చైనా బ్యాంకుల నుంచి సౌదీ యువాన్లలో రుణాల కోసం డీల్ కుదుర్చుకుంది కూడా. క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్తో పాటు అరబ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఇప్పుడు అమెరికాకు పూర్తిగా ముఖం చాటేస్తుండటం విశేషం. గ్లోబల్ సౌత్.. డాలర్ టార్గెట్! బ్రిక్స్ దేశాలకు తోడు ఇప్పుడు ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం డాలర్ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. డాలర్ అవసరం లేకుండా ఇకపై నేరుగా తమ సొంత కరెన్సీలోనో లేదంటే చైనా యువాన్లోనో వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలు ఓకే అంటున్నాయి. ముఖ్యంగా భారత్ మలేషియా, టాంజానియాతో రూపాయిల్లో వాణిజ్యానికి డీల్ కుదుర్చుకుంది. మరో 18 దేశాలతో కూడా ఇదేవిధమైన ఒప్పందాలకు రెడీ అవుతోంది. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్ తమ సొంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో స్థానిక కరెన్సీలో సెటిల్మెంట్కు తెరతీశాయి. ఇప్పుడు 10 దేశాల ఆసియాన్ కూటమి తమ మధ్య వాణిజ్యానికి ఇదే వ్యవస్థను వాడుకోవాలని చూస్తోంది. చైనా పర్యటన సందర్భంగా మలేషియా ప్రధాని ఇబ్రహీమ్, ఐఎంఎఫ్ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు ఆసియా మానిటరీ ఫండ్ (ఏఎంఎఫ్)ను ప్రతిపాదించడం గమనార్హం. తొలిసారిగా యూఏఈ నుంచి చైనా యువాన్లలో గ్యాస్ (ఎల్ఎన్జీ)ను కొనుగోలు చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలూ డాలర్ను డంప్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. కెన్యా ఇకపై సౌదీ, యూఏఈ నుంచి తమ సొంత కరెన్సీలో క్రూడ్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీ అయితే వీసా, మాస్టర్కార్డ్ల వినియోగాన్ని దేశంలో ఆపేయాలని పిలుపునివ్వడం విశేషం. ఇక లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ తమ ఎగుమతిదారులకు యువాన్ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొ స్తోంది. బ్రెజిల్, అర్జెంటీనా లాటిన్ అమెరికా ఉమ్మడి కరెన్సీ ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్పై మూకుమ్మడి ఎటాక్ మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు–పాలించు... ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, ఆర్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే.. డాలర్తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం కళ్లకు కడుతోంది. - శివరామకృష్ణ మిర్తిపాటి -
డాలర్ డౌన్ ఫాల్!
దొడ్డ శ్రీనివాసరెడ్డి : గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్సే్ఛంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడింగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇక ముందు ఈ పరిస్థితి మారబోతోంది. డాలర్పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనే కోరికతో అనేక దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్లోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇలా మొదలైంది.. బ్రెట్టన్వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ పెత్తనం మొదలైంది.రెండో ప్రపంచ యుద్ధకాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్షైర్లోని బ్రెట్ట్టన్వుడ్లో జరిగింది. 44 దేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నా యి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదికైంది. ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ (31.1034768 గ్రాములు) బంగారంతో సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అవతరించింది. పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తిసామర్థ్య ంతో రెచ్చి పోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్గానిస్తాన్, ఇరాన్, వెనెజులా వంటి దేశా లపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. తొలుత రష్యాలో.. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్కు పెద్ద సవాల్ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్–యువాన్లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించా యి. అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక నిల్వ ల్లో యువాన్ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో పెద్ద సవాల్ ఏర్పడింది. బ్రెజిల్ రీస్ చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్, యూరో, యెన్, పౌండ్లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. 70 శాతం నుంచి 59 శాతానికి.. గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’అని వెల్లడించారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్–జదాన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం దాదాపుగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దాన్ని పెట్రోడాలర్గా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో ఒపెక్ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. భారత్–రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్ డాలర్లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దినార్ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 70 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఇక భారత్ వంతు.. భారత్ కూడా తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో చర్యలు మొదలుపెట్టింది. అనేక దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న తరుణంలో డాలర్, యూరో, యెన్, పౌండ్లతో దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేసింది. రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ రష్యా, శ్రీలంకతోపాటు మొత్తం 18 దేశాల్లోని 60 బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి ద్వారా నిర్వహించడానికి వీలుగా ఆర్బీఐ ఈ అకౌంట్లను ప్రారంభించిందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ప్రకటించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్స్వానా, ఇజ్రాయెల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా దేశాలున్నాయి. అమెరికా వాల్స్ట్రీట్లో ‘డాక్టర్ డూమ్’గా పేరుపడ్డ ఆర్థికవేత్త నౌరియల్ రుబిని ‘రానున్న రోజుల్లో భారత రూపాయి అంతర్జాతీయ విపణిలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా అవతరించబోతోంది’ అన్నారు. -
50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం: పాతాళానికి పాక్ కరెన్సీ
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్తాయికి చేరి 50 ఏళ్ల గరిష్టం వద్ద కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 31.5 శాతానికి చేరింది. జూలై 1965లో డేటా-కీపింగ్ మొదలైనప్పటినుంచి ఏప్రిల్ 1975లో ఒకసారి ద్రవ్యోల్బణం భారీగా పెరిగినప్పటికీ, 29 శాతంగా ఉండట గమనార్హం. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) తాజాగా గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ 31.5 శాతం వద్ద మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ప్రకారం, అమెరికా డాలర్తో పోలిస్తే పాక్ రూపీ గణనీయంగా పడిపోయింది.ఈ ఏడాది 20 శాతం క్షీణించి డాలర్ మారకంలో 284 వద్ద రికార్డు స్థాయికి క్షీణించింది. దీంతో దక్షిణాసియా దేశం ఇప్పుడు ప్రపంచంలో 17వ అత్యంత ఖరీదైన దేశంగా అవతరించింది.పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీమారకద్రవ్య నిల్వలు మూడు వారాల దిగుమతులకు సరిపడా స్థాయికి పడిపోయాయి. ఇది ఇలా ఉంటే గత నెల ప్రారంభం నుండి చర్చలు జరుపుతున్నప్పటికీ ఐఎంఎఫ్ నిధుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ ఆలస్యం కరెన్సీ మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తోందని కరాచీకి చెందిన బ్రోకరేజ్ హౌస్ టాప్లైన్ సెక్యూరిటీస్కు చెందిన మహ్మద్ సోహైల్ అన్నారు. మరోవైపు వచ్చే వారం నాటికి ఐఎంఎఫ్ ప్రాథమిక డీల్పై ఆర్థిక మంత్రి దార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. -
రూపీ 50 పైసలు డౌన్.. కారణాలు ఇవే!
ముంబై: రూపాయి విలువ సోమవారం 50 పైసలు క్షీణించి 81.28 స్థాయి వద్ద నిలిచింది. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు అండతో ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 80.53 స్థాయి వద్ద మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన రూపాయి ఏ దశలోనూ కోలుకోలేక ఇంట్రాడే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ‘‘దేశీయ కార్పొరేట్, ఆయిల్ కంపెనీల నుంచి డాలర్కు డిమాండ్ పెరిగింది. ఈక్విటీ మార్కెట్ స్తబ్ధుగా ట్రేడైంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగింది. ఈ అంశాలు మన కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి’’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
భారీగా పతనమైన రూపాయి
-
ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి పతనం
-
రూపాయి క్షీణతను నివారించాలంటే..
ఇటీవల కాలంలో రూపాయి విలువ బాగా క్షీణిస్తోంది. ఇందువల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న ఎగుమతిదార్లు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు. అదేసమయంలో పెట్రోల్, వంటనూనెలు వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి జనాలు నానా యాతనా పడుతున్నారు. ద్రవ్యం విలువ పడిపోవడం దేశ కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగి అధిక శాతం జనాభా కనీసావసరాలను తీర్చుకోలేక ఇబ్బందుల పాలవుతారు. ఇంత ఇబ్బందికరమైన రూపాయి విలువలో వచ్చే హెచ్చు తగ్గులకు అనేక అంతర్గత, బాహ్య పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇది 2022 జూలై 20 నాటికి డాలర్తో పోలిస్తే 80.05 రూపాయల కనిష్ఠానికి చేరుకుంది. 2022 ఆగస్టు 2కు 78.72 రూపాయలకు బలపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది? రూపాయి విలువ పడిపోవడాన్ని రెండు రకాలుగా చెప్పు కోవచ్చు. రూపాయి విలువ తగ్గింపు వల్ల... అంటే ఇతర కరెన్సీలతో అధికారిక మారకపు రేటులో ఉద్దేశ పూర్వకంగా మన రూపాయిని తగ్గించడం (మూల్య హీనీకరణ) ఒకటి. ఇది 1949, 1966, 1991 సంవత్సరాలలో జరిగింది. డాలర్తో రూపాయి విలువ తగ్గడాన్ని సూచించే రూపాయి విలువ క్షీణత మరొ కటి. ఇది ఆర్థిక ఒడిదుడుకులవల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనంగా మారిందని సూచిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరుగు ప్రవాహం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి ఆర్బీఐ తీసు కున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కఠినతరం వంటి కారకాలు ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణాలు. బలహీన రూపాయి వల్ల సైద్ధాంతికంగా భారతదేశ ఎగుమతు లకు ప్రోత్సాహం లభిస్తుంది. భారతదేశానికి ప్రయాణం చౌకగా ఉంటుంది. స్థానిక పరిశ్రమ లాభపడవచ్చు, విదేశాలలో పని చేసే వారు తమ స్వదేశానికి డబ్బు పంపడం ద్వారా ఎక్కువ లాభం పొంద వచ్చు. కరెంట్ ఖాతా లోటు తగ్గే అవకాశం ఉంది. ఇక నష్టాల సంగతి కొస్తే... ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగించడాన్ని కష్టతరం చేస్తుంది. భారత్ తన దేశీయ చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బలహీనమైన కరెన్సీ వల్ల దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుంది. రూపాయి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు విస్తరిస్తుంది. విదేశీ ప్రయాణాలకూ, విదేశీ విద్యార్జనకూ ఎక్కువ ఖర్చు అవుతుంది. విదేశీ రుణంపై వడ్డీ భారం పెరుగుతుంది. ఇప్పటి వరకు సంవత్సరానికి అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి దాదాపు 7 శాతం పడిపోయింది. ఓవర్–ది–కౌంటర్, డెరి వేటివ్స్ మార్కెట్లలో రూ. 80 మార్క్ను దాటింది. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో డాలర్తో పోలిస్తే రూ. 82కి తగ్గుతుందని నోమురా సంస్థ అంచనా వేస్తోంది. ముడి చమురు ధరలు పుంజుకోవడం, డాలర్ తక్షణ కాలంలో సాపేక్షంగా బలంగా ఉంటుందనే అంచనాల మధ్య, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూపాయి 81కి బలహీనపడవచ్చని భావిస్తున్నారు. సమీప కాలంలో రూపాయి ఒత్తిడికి లోనవుతుందని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీ సెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) అంచనా వేసింది. అంతే కాకుండా వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెనక్కి పోవడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి కారణాల వల్ల సమీప కాలంలో రూపాయి–డాలర్ మారకం అస్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం రూపాయి విలువ బాగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిణామాలకు దారితీసింది. భారతదేశ ఫార్మసీ రంగం 2022 సంవత్సరంలో 22.5 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఈ కంపెనీలు అమెరికా నుండి అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. నికర ఎగుమతిదారు అయిన వస్త్ర (టెక్స్ టైల్) పరిశ్రమ బలహీనమైన రూపాయి నుండి ప్రయోజనం పొందుతోంది. రత్నాలు, ఆభరణాల రంగం విషయానికొస్తే రూపాయి క్షీణత దాని యూనిట్లకు వ్యయ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఐటీ సేవలు, సాంకేతిక పరిశ్రమ అమెరికా ఆదాయాలలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి కాబట్టి... క్షీణిస్తున్న రూపాయి అతిపెద్ద లాభాల్లో ఒకటిగా ఉంటుంది. రూపాయిలో ప్రతి 1 శాతం పతనానికీ వస్త్ర ఎగుమతులకు 0.25–0.5 శాతం లాభం పెరుగుతుంది. భారతదేశం తేయాకు(టీ) లాభాల ఎగుమతులు 5–10 శాతం పెరుగుతాయని అంచనా. సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలతో, ఎగుమతిదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది వారి లాభాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదిలావుండగా, విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు భారతీయ మార్కెట్ల నుండి 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ఫ్యూచర్స్ ధరలో ఒక డాలర్ పెరుగుదలతో... భారత్ ముడి చమురు దిగుమతులు 1.703 మిలియన్ టన్నులు పెరిగాయని అంచనా. ప్రతి ఒక మిలియన్ టన్ను ముడి చమురు దిగుమతి... డాలర్ను మన రూపాయితో పోలిస్తే 0.266 బలపరుస్తుంది. జూలై 15తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.5 బిలియన్లు తగ్గి 572.71 బిలియన్లకు పడిపోయాయి. ఇది 20 నెలల కనిష్ఠ స్థాయి. భారతదేశ కరెంట్ ఖాతా లోటు 2022లో జీడీపీలో 1.5 శాతం నుండి 3 శాతం వరకు పెరుగు తుందని అంచనా. అమెరికా డాలర్తో పోలిస్తే అనేక కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఫలితంగా, భారతదేశంతో సహా వివిధ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుండి విదేశీ మూలధన ప్రవాహం జరుగుతోంది. వారి దేశీయ కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. అమెరికా డాలర్తో రూపాయి విలువ క్షీణించడం.. ఇతర ప్రధాన ప్రపంచ కరెన్సీలైన యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ ఎన్ల కంటే తక్కువగా ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా అమెరికా యూనిట్ ఈ ఏడాది 11 శాతం ర్యాలీ చేసి రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల స్థిరమైన తరుగుదలకి కారణమైంది. ఫలితంగా, భారత రూపాయి డాలర్తో పోలిస్తే 80 మార్క్ను దాటి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 2022లో రూపాయి దాదాపు 7 శాతం నష్టపోయినప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు మన రూపాయి కన్నా చాలా దారుణంగా క్షీణించాయి. యూరో 13 శాతం, బ్రిటిష్ పౌండ్ 11 శాతం, జపనీస్ ఎన్ 16 శాతం తగ్గాయి. ఫలితంగా ఈ కరెన్సీలతో రూపాయి విలువ పెరిగింది. దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్ పెసో, థాయ్లాండ్ బాట్, తైవాన్ డాలర్లు... అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కంటే ఎక్కువగా పడిపోయాయి. అందువల్ల ఆయా దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు మనకు లాభదాయకంగా ఉంటాయి. ఇప్పుడు భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ ఎలా అదుపు చేయగలదో చూద్దాం. ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. నాన్ రెసిడెంట్ ఇండియన్ బాండ్లను విక్రయించాలి. సావరిన్ బాండ్ల జారీని నిర్వహించాలి. భారతదేశం తన మొత్తం కరెంట్ ఖాతా లోటును తగ్గించుకోవడంపై దృష్టి సారించి, రష్యా వంటి స్నేహ పూర్వక దేశాలతో రూపాయి చెల్లింపు విధానాన్ని లాంఛనప్రాయంగా పరిగణించాలి. ఇది అమెరికా డాలర్పై రూపాయి ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. పారిశ్రామిక వృద్ధికి ప్రాధా న్యత ఇవ్వాలి. తద్వారా వస్తువుల విక్రయానికి రూపాయి మార్పిడి అవసరం అవుతుంది. ఇది చివరికి అంతర్జాతీయ మార్కెట్లలో సంస్థా గతీకరణకు దారి తీస్తుంది. రూపాయిలో నల్లధనం లావాదేవీలను అరికట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం కూడా చాలా అవసరం. రూపాయి బహు పాక్షిక స్వభావాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి వినియోగాన్ని పెంచాలి. ఎలా చూసినా కరెన్సీ విలువ పడి పోకుండా రక్షించేది ఆర్థికాభివృద్ధి మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాలి. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) - డాక్టర్ పీఎస్ చారి మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
డాలర్.. రన్ రాజా రన్!
మంథా రమణమూర్తి ‘డాలర్ మాకు కరెన్సీ. మీకు సమస్య.’ 51 ఏళ్ల కిందట అమెరికా ఆర్థిక మంత్రి జాన్ కొనల్లీ చేసిన ఈ వ్యాఖ్యల్ని... ప్రపంచ మానవాళిపై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ డాలర్ అమెరికాకు కరెన్సీనే. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే. డాలర్ విలువ పెరిగినా... తగ్గినా... ప్రపంచంలోని ప్రతి కుటుంబంపైనా దాని ప్రభావం పడక తప్పదు. అలాంటి డాలర్ ఇçప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా భావించే యూరప్ యూరో, యూకే పౌండ్, జపాన్ యెన్, చైనీస్ యువాన్... ఇవన్నీ డాలర్తో పోలిస్తే దారుణంగా క్షీణిస్తున్నాయి. అన్నిటికన్నా ఘోరంగా జపాన్ యెన్ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 20.57 శాతం మేర క్షీణించింది. ఏడాది కిందట డాలర్కు 110 యెన్లు కాగా... ఇప్పుడు 138.5 యెన్లు పెడితే తప్ప ఒక డాలర్ రావటం లేదు. యూకే పౌండ్ కూడా అంతే. ఏడాది కాలంలో ఏకంగా 15.5 శాతం పతనం కాగా... యూరో అదే స్థాయిలో 14 శాతం క్షీణించింది. ఆసియా దిగ్గజాలు చైనా, భారత్ మరీ అంత క్షీణించకుండా తమ కరెన్సీలను కాపాడుకున్నాయి. యువాన్ 4.5 శాతం, రూపాయి 6.25 శాతం మాత్రమే పతనమయ్యాయి. కరెన్సీలెందుకు పతనమవుతున్నాయి? అందరూ చెప్పే ప్రధాన కారణాలు రెండు. మొదటిది కోవిడ్ సంక్షోభం. దాదాపు రెండున్నరేళ్లు ప్రపంచపటంలో ఒక్కదేశాన్నీ వదలకుండా చుట్టేసిన ఈ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఫలితంగా ప్రపంచం మొత్తం మునుపెన్నడూ చూడని వైపరీత్యాల్ని చూసింది. లాక్డౌన్లతో జీవితం అస్తవ్యస్తమయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లి... ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి... అమెరికా లక్షల కోట్ల కరెన్సీని ముద్రించి బ్యాంకింగ్లోకి ప్రవేశపెట్టింది. వినియోగం పెంచడానికి నేరుగా జనం ఖాతాల్లోకీ నగదు వేసింది. మిగిలిన దేశాలు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాయి. అది జనం చేతుల్లోకి రావటం కోసం వడ్డీ రేట్లు తగ్గించాయి. అలా... ప్రపంచమంతా వినియోగాన్ని పెంచే పనిలో పడింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... నగదు లభ్యత పెరగటంతో అసలే తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండు... ఆ వెనకే ధరలూ పెరిగాయి. దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు మరింత ఇబ్బందికి గురయ్యాయి. ఫలితంగా... ద్రవ్యోల్బణం రయ్యిమంది. కాకపోతే చాలా దేశాలు కొంతవరకూ దీన్ని తట్టుకుని మనగలిగాయి. అందుకే కరెన్సీలు కూడా ఆరేడు నెలల కిందటిదాకా కాస్తంత స్థిరంగానే కనిపించాయి. ఇదిగో... అప్పుడు మొదలయింది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం. ఐదు నెలల కిందట మొదలయిన ఈ యుద్ధానికి ముగింపు దొరక్కపోవటం... ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియకపోవటంతో అసలే దెబ్బతిని ఉన్న సప్లయ్ వ్యవస్థలు మరింత కునారిల్లాయి. ముడిచమురు ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన రష్యాపై ఆంక్షల కారణంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గి... ధర విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం రికార్డులు తిరగ రాస్తోంది. దీన్ని కట్టడి చేయటానికి అమెరికాతో సహా... ప్రభుత్వాలన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి. అమెరికా సైతం వడ్డీ రేట్లు పెంచుతూ అంతకు ముందు వ్యవస్థలోకి వదిలిన నగదును వెనక్కి తీసుకోవటం మొదలెట్టింది. వడ్డీ రేట్లు పెరిగితే... కరెన్సీ విలువ పతనం కావటమన్నది సహజం. డాలర్... ఎప్పుడూ పెరగటమేనా? కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నపుడు కూడా డాలర్తో పోల్చినప్పుడు మన కరెన్సీలు ఎంతో కొంత క్షీణిస్తూనూ వచ్చాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ క్షీణత ఇంకాస్త ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ డాలర్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అన్నిచోట్లా డిమాండ్ పడిపోయింది. దీంతో ఏమవుతుందోనన్న భయం కొద్దీ ప్రపంచమంతా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలవైపు పరుగులెత్తింది. ఫలితంగా డాలర్ పెరిగి... ఇతర కరెన్సీలు క్షీణత నమోదు చేశాయి. ఇప్పుడు కూడా అంతే. అన్నిచోట్లా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ వ్యవస్థలో నగదు తగ్గి... మళ్లీ అది మందగమనానికి దారితీస్తుంది. మాంద్యమూ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డాలర్ ఇన్వెస్ట్మెంట్లే సురక్షితం. కాబట్టి డాలర్కే డిమాండ్. అందుకే అది పెరుగుతోంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే! జాన్ కొనల్లీ 51 ఏళ్ల కిందట జీ10 సదస్సులో చేసిన వ్యాఖ్యలు... అక్షర సత్యాలని!!. ఎవరికి లాభం... ఎవరికి నష్టం లాభనష్టాల విషయానికొస్తే డాలర్ బలోపేతమై స్థానిక కరెన్సీలు బలహీనమవున్నప్పుడు అది దేశ ప్రజలందరికీ నష్టమేనని చెప్పాలి. నేరుగా డాలర్తో అవసరం లేకున్నా... డాలర్ బలపడితే ఏ దేశమైనా దిగుమతులకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. భారత్ విషయానికొస్తే మన మొత్తం జీడీపీలో 21 శాతం వరకూ దిగుమతులే. అదే సమయంలో ఎగుమతులు 18.5 శాతం వరకూ ఉంటాయి. దిగుమతుల్లో అత్యధికం ముడిచమురు వాటాయే. ఈ రెండింటికీ మరీ దారుణమైన తేడా లేదు కనకే మన కరెన్సీ కొంతైనా ఈ పరిస్థితులను తట్టుకోగలుగుతోందన్నది వాస్తవం. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే మాత్రం ఆ ప్రభావం మన రూపాయిపై కాస్త తీవ్రంగానే పడుతుంది. విదేశాల్లో తమ పిల్లల్ని చదివించేవారికి ప్రధానంగా ఇది ఇబ్బందే. అనుకున్న బడ్జెట్లు తారుమారవుతాయి. అయితే తమ వారు విదేశాల్లో పనిచేస్తూ డాలర్లలో సంపాదించేవారికి మాత్రం ఇది చాలావరకూ ఊరటే. ఐటీ కంపెనీల వంటి ఎగుమతి ఆధారిత సంస్థలకు, అత్యధికంగా విదేశీ రెమిటెన్సులు వచ్చే కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ పరిణామం కలిసొచ్చేదే. దేశం మొత్తానికి ఏటా వచ్చే 86 బిలియన్ డాలర్లలో 19 శాతం వరకూ కేరళ వాటాయే. కోవిడ్తో ఇది దెబ్బతిన్నా... మళ్లీ యథా పూర్వ స్థితికి చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి... 32 ఏళ్లలో 15 నుంచి 80కి! 1990కి ముందు డాలర్ విలువ 15 రూపాయలే. కాకపోతే ఆ మాత్రం వెచ్చించాలన్నా సర్కారుకు చుక్కలు కనిపించేవి. దాంతో దిగుమతులపై ఆంక్షలు. కార్లు, స్కూటర్లు, ఫోన్లు, గ్యాస్.. ఏదైనా దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతికి డాలర్ల కొరత కనక డబ్బులు పెట్టి కొనాలనుకున్నా ఏదీ దొరకని పరిస్థితి. అన్నింటికీ రేషనే. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చాక సరళీకరణ విధానాలతో కంపెనీలకు ద్వారాలు తెరిచారు. అలా తెరిచిన రెండేళ్లలోనే డాలర్ విలువ ఏకంగా 30 రూపాయలకు చేరింది. నాటి నుంచి.. డాలర్ల అవసరంతో పాటు విలువ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే ముడిచమురు, వజ్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, భారీ యంత్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, వంటనూనెలు, ఉక్కు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కనక డాలర్ మాదిరే వీటి ధరలూ పెరుగుతున్నాయి. ఆ మేరకు సామాన్యులపైనా ఈ ప్రభావం పడుతోంది. మున్ముందు పరిస్థితేంటి? కోవిడ్ తదనంతర పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నవారు కుదుటపడలేదు. అప్పట్లో డిమాండ్ లేక, అయినా నిర్వహించలేక మూతపడ్డ వ్యాపారాల పరిస్థితి అలానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఉక్రెయిన్ యుద్ధం... ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇవన్నీ చూస్తుంటే సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో కుదుటపడటానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. అప్పటి దాకా అంతా సురక్షితమైన పెట్టుబడులవైపు వెళతారు కనక డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశాలే ఎక్కువన్నది నిపుణుల అంచనా. ఈ లెక్కన చూస్తే రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక దీనితో ముడిపడి ఉన్న స్టాక్ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పవు. కాబట్టి డాలర్తో అవసరాలున్న వారు ఇవన్నీ గమనంలోకి తీసుకున్నాకే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఏ సంక్షోభమూ ఎక్కువకాలం ఉండదు. -
రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్తో పోలిస్తే మరో 18 పైసలు క్షీణించి 79.9975 వద్ద క్లోజయ్యింది. కీలక స్థాయి అయిన 80కి పైసా కన్నా తక్కువ దూరంలో నిల్చింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలల జూన్లోనూ రెండంకెల స్థాయిలోనే కొనసాగడం, కరెంటు అకౌంటు లోటు మరింత దిగజారవచ్చన్న అంచనాలు, విదేశీ మారక నిల్వలు తగ్గనుండటం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం .. దేశీ కరెన్సీ మరింతగా పడిపోకుండా కొంత ఊతమిచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పటిష్టంగా 79.71 వద్ద ప్రారంభమైంది. కానీ యూరప్ మార్కెట్లు ప్రారంభమయ్యాక మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఏకంగా 24 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో రూపాయి పడిపోయింది. క్రితం ముగింపు 79.81తో పోలిస్తే 18 పైసలు పతనమైంది. -
తగ్గుతున్న డాలరు ఆధిపత్యం
రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే వాంఛ అమెరికా మిత్ర దేశాలకు ఎప్పటి నుండో ఉండగా ఉక్రెయిన్ యుద్ధం కలిసొచ్చింది. విదేశీ బ్యాంకుల్లో 80,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న రష్యా నగదు నిల్వలపై ఆంక్షలు విధించి జప్తు చేయనారంభించి, ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించటంతో కంపెనీల జమాఖర్చుల లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూబుల్ విలువ పడిపోతున్న సమ యంలో, పుతిన్ ఎత్తుగడతో, మార్చి 24న రష్యా రూబుల్ తోనే తమ చమురు, గ్యాస్కు చెల్లించాలని ప్రపంచ దేశాలకు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో ముఖ్యంగా యూరప్ దేశా లైన జర్మనీ, ఫ్రాన్స్ ఇరకాటంలో పడ్డాయి. అమెరికా ఏకంగా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయినంత వ్యథ చెందు తున్నది. ప్రపంచంలో 12 శాతం ముడి చమురును ఉత్పత్తి చేస్తూ యూరపు దేశాలకు అవసరమగు 40 శాతం పైగా ఇంధనాన్ని రష్యా ఎగుమతి చేస్తుంది. ఫ్రాన్స్ మాక్రోన్, జర్మన్ షోల్జ్లు రూబుల్ కరెన్సీ మారకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం యూరోలో లేదా డాలరులో చెల్లిస్తామంటున్నారు. చెల్లిం పుల మొత్తం ఎలానూ స్విఫ్ట్ ద్వారా రష్యా ఖాతాల్లోకి జమ కాదు, అలా జరిగినా బ్యాంకుల్లోని నిల్వలను స్తంభింప జేస్తారు. పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్కోవ్ మాత్రం రూబుల్ చెల్లింపులతోనే గ్యాసు, ఆయిల్ పంపిస్తామనీ, చారిటబుల్ సంస్థను నడపటం లేదనీ నిర్మొహమాటంగా స్పందించాడు. యుద్ధం ముందు ఒక డాలరుకు 75 రూబుళ్లు ఉన్న మారకపు విలువ, ఆంక్షలతో 145కు చేరి, ప్రస్తుతానికి 95 రూబుళ్లతో స్థిరత్వం దిశగా పయనిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా, చైనాల మధ్య ముడి చమురు వాణిజ్యం యువాన్లతో జరపటానికి సౌదీ అంగీ కరించింది. చైనా ఇంధన అవసరాలను 25 శాతం వరకూ సౌదీ అరేబియా తీరుస్తుంది. యువాన్లో సౌదీ లావాదేవీలు జరిపితే చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, డాలరు ప్రాధాన్యత తగ్గటం ఒకేసారి జరుగుతుంది. ఇప్పటికే రష్యా, చైనా యువాన్ వాణిజ్యానికి ముందుకొచ్చాయి. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మొహమ్మద్ నహ్వాన్ ఇద్దరూ వైట్హౌస్ నుండి వచ్చిన ఫోన్కాల్స్కు స్పందించలేదంటే మధ్య ప్రాచ్యంలో డాల రుతో పాటుగా అమెరికా ఎంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కో నుందో అర్థమవుతుంది. డాలరు ఆధిపత్య వ్యతిరేక పోరులో నేను సైతం అంటూ భారత్ ముందుకు వస్తోంది. రష్యాతో లోగడ కుది రిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ముడి చమురును భారత్ దిగుమతి చేసుకొంటున్నది. రష్యా భారత్ మధ్య ఇకపై రూబుల్–రూపాయి వాణిజ్యం జరగనుందని వార్తలొస్తున్నాయి. వీరికి తోడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు ఈ బాటనే అనుకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. 1944లో న్యూహాంషైర్ బ్రెట్టన్ ఉడ్స్లో 44 సభ్యదేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను, ప్రపంచ బ్యాంకులను స్థాపించి బంగారు నిల్వల ఆధారంగా అమెరికా డాలరును అంతర్జాతీయ కరెన్సీగా ప్రకటించాయి. 1971లో బంగారు నిల్వలు అమెరికా దగ్గర లేకపోవటంతో అమెరికాకు ముడి చమురును ఎగుమతి చేయబోమని అరబ్ దేశాలు ప్రక టించాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. మరలా నిక్సన్ షాక్ పేరిట ఫ్లోటింగ్ డాలరు రూపాంతరం చెంది, ఇప్పటివరకూ వాల్స్ట్రీట్లోని తన అనుకూల ఫారిన్ ఎక్స్ఛేంజ్ విభాగంతో ప్రపంచ కరెన్సీలతో తనకు అను కూలంగా కరెన్సీ మార్పిడులను చేస్తోంది. కృత్రిమ డాలరు మార్పిడీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ 1970 ప్రాంతంలోనే బ్రెట్టెన్ ఉడ్ సిస్టమ్ నుండి తప్పుకొని బలపడ్డాయి. డాలరు మార్పిడీలతో అనేక దేశాలు బలవు తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటితో (మెక్సికోతో తప్ప) అమెరికా వాణిజ్య లోటుతో, సుమారు 25 లక్షల కోట్ల డాలర్ల రుణంతో ఉన్నా, తన చేతిలోని వాల్స్ట్రీట్ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులతో, ఫోరెక్స్ మారకాన్ని కృత్రిమంగా నడుపుతూ, ఆయుధ అమ్మకాలతో, కృత్రిమ మేధో సంపత్తితో జూదమాడుతోంది. డాలరుకు ప్రత్యమ్నాయంగా వాణిజ్యం చేయగలిగిననాడు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న డాలరు ఆధిపత్యం పతనంగాక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా? చరిత్రను పరిశీలిస్తే... ► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ► చాలా మంది ఎగ్జిక్యూటివ్లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు. ► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు. చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే! త్యాగధనులు అనిపించుకోవడానికి... ► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు. ► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్కు తగ్గించుకున్నారు. వాటాదారులకు సంఘీభావం తెలిపేలా... ►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు. ► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్లు, ఆప్షన్లు, బోనస్లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు. చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే! బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..! ► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది. ► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క. ► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట! ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే... ► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది! చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా? 100 రెట్లకుపైగా... ► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు. అసమానతల దృష్టి మళ్లించేందుకే... ► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది. ►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది. చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు! తిరగబడ్డ తెలివి... ► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. ► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రూపాయి ‘రికార్డు’ పతనం! కారణం ఏంటంటే..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట పతనం దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 44 పైసలు పతనమై, 76.32 వద్ద ముగిసింది. గడచిన 20 నెలల్లో (2020 ఏప్రిల్ తరువాత) రూపాయి ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. అలాగే ఒకేరోజు రూపాయి ఈ స్థాయి పతనం కూడా గడచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. భారత్ కరెన్సీ మంగళవారం ముగింపు 75.88. డిసెంబర్లో గడచిన 11 ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది రోజుల్లో రూపాయి 119 పైసలు (1.58 శాతం) నష్టపోయింది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కారణాలు ఏమిటి? ►అమెరికాసహా పలు దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర రూపంలో ఉంది. అమెరికాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రిటైల్ ద్రవ్యోల్బణం (వరుసగా 6.2 శాతం, 6.8 శాతం) నమోదయ్యింది. ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ సరళతర విధానానికి త్వరలో ముగింపు పలకనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం) పెంచే అవకాశం ఉందని అంచనా ఉంది. ►ఈ పరిస్థితుల్లో సరళతర ఆర్థిక విధానాలతో విదేశీ మార్కెట్లను ముంచెత్తిన డాలర్లు వెనక్కు మళ్లడం ప్రారంభమైంది. ఫలితంగా ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ గడచిన నెల రోజులుగా భారీగా బలపడుతోంది. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు డాలర్ సురక్షిత ఇన్స్ట్రమెంట్గా కూడా కనబడుతోంది. ►దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితికి గురవుతున్నాయి. మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి సెంటిమెంట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ►ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ధర భయాలు, దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి. ►దీనికితోడు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ►ఈ వార్తా రాస్తున్న రాత్రి 8 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 76.31 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 96.50 వద్ద ట్రేడవుతోంది. -
రూపాయి డౌన్.. 16 నెలల తర్వాత కనిష్టానికి!
Indian Rupee Value Falling Reasons: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో పడిపోయింది. ఏకంగా 10 పైసలు బలహీనపడి 75.60కి పడిపోయింది. గడచిన 16 నెలల నెలల్లో (2020 జూలై 1 తర్వాత) రూపాయి ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల బయటకు వెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు గ్లోబల్ ఎకానమీని వెంటాడుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడ్డం కూడా భారత్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రేడింగ్లో రూపాయి 75.45 వద్ద ప్రారంభమైంది. మొదట్లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. గత రాత్రి 11 గంటల సమయంలో.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 75.65వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 ఎగువన ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ పరిణామాలు, దేశంలోకి విదేశీ నిధుల రాక వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చదవండి: మూడో రోజూ ముందుకే! -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్ను బలపరుస్తోంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మార్కెట్కు ‘ఫెడ్’ పోటు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
రూపాయికి ‘విదేశీ’ బలం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 52 పైసలు పెరిగి, 74.32 వద్ద ముగిసింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి (మార్చి 18 తర్వాత). గడచిన ఒకటిన్నర నెలల్లో రూపాయి ఈ స్థాయిలో (52 పైసలు) పెరగడం ఇదే తొలిసారి. దేశంలోకి కొనసాగుతున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ బలహీన ధోరణి కూడా రూపాయి సెంటిమెంట్కు దోహదపడింది. రూపాయి 74.91 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అనంతరం మరింత బలపడింది. రోజంతా 74.31 గరిష్టం–74.91 కనిష్ట స్థాయిల మధ్య తిరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అధికంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలోకి వస్తోంది. ఆగస్టులో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.41,330 కోట్లను భారత్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మూడో రోజూ రూపాయి పరుగు..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమ, మంగళ, బుధవారాల్లో రూపాయి 89 పైసలు లాభపడితే, ఒక్క బుధవారం 33 పైసలు పెరిగింది. 68.41 వద్ద ముగిసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ బలహీనత ఇక్కడ రూపాయికి ప్రధానంగా కలిసివస్తోంది. ఉదయం 68.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.37ను కూడా తాకింది. రూపాయికి నిరోధం 68.50 వద్ద ఉంటే, ఆ స్థాయిపైన రూపాయి ముగియడం గమనార్హం. ఇదే విధమైన ముగింపులు మరో రెండు రోజులు కొనసాగితే, రూపాయి తిరిగి 67ను చూస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నేడు రేటు తగ్గిస్తే, మరింత బలోపేతం! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గిస్తే, రూపాయి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు పెంచలేని పరిస్థితి ఉంటేనే దేశంలోనూ ఆర్బీఐ మరో పావుశాతం రేటు కోతకు నిర్ణయం తీసుకుంటుంది. ఫెడ్ ఫండ్ రేటు పెరగలేదంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నిదర్శనం. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. రూపాయికి మరింత లాభం చేకూర్చే అంశం ఇది. రూపాయి పరుగుకు మరిన్ని కారణాలను విశ్లేషిస్తే... ► ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు. ► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు. ► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేయడం. ► వెరసి ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరును రూపాయి కనబరిచింది. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 18 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రూపాయి రయ్ రయ్
ముంబై: ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, దేశీ ఆర్థిక పరిస్థితుల గణాంకాలు మెరుగ్గా ఉండటం తదితర అంశాలతో రూపాయి మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్తో పోలిస్తే 50 పైసల మేర ర్యాలీ చేసి 73.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మధ్య విభేదాలపై ఆందోళనలు కొంత తగ్గడం సైతం రూపాయి రికవరీకి తోడైనట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజీలో క్రితం ముగింపు 73.95తో పోలిస్తే మెరుగ్గా 73.88 వద్ద గురువారం రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత మరింతగా బలపడి చివరికి 50 పైసల లాభంతో 73.45 వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 12 తర్వాత ఒకే రోజున రూ పాయి ఇంతగా పెరగడం ఇదే ప్రథమం అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ విభాగం హెడ్ వీకే శర్మ చెప్పారు. డాలర్ బలపడటంతో బుధవారం నాడు రూపాయి మారక ం విలువ 27 పైసలు క్షీణించి మూడు వారాల కనిష్టమైన 73.95 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
రూపాయి రికవరీ...
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 61పైసలు రికవరీ అయ్యింది. 72.37 వద్ద ముగిసింది. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలపడ్డం 18 నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు దాదాపు 114 పైసల నష్టంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 72.98 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఒక దశలో 73కు ఒక్కపైసా దిగువనా ట్రేడయ్యింది. తాజా బలోపేతానికి కారణాలను పరిశీలిస్తే... వాణిజ్య యుద్ధ ప్రభావాల నేపథ్యంలో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ కీలక మద్దతు 95 దిగువకు పడిపోయింది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 94.12 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రెండు నెలల కనిష్టం 93.91 స్థాయిని కూడా చూసింది. బుధవారం గరిష్టస్థాయి 94.33. ఆయా అంశాల నేపథ్యంలో.. బ్యాంకులు, దిగుమతిదారుల నుండి డాలర్ అమ్మకాలు భారీగా జరిగాయి. దేశంలో ఒక దశలో 72.34 స్థాయినీ చూసింది. ఇరాన్ నుంచి క్రూడ్ సరఫరాలు నిలిచిపోతే ఆ లోటును ఎలా భర్తీ చేయాలన్న అంశంపై ఈ వారం చివర్లో అల్జీరియాలో సమావేశం అవ్వాలని రష్యాసహా ఇతర క్రూడ్ ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. దీనితో అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ పెరుగుదల అంచనాలకు కొంచెం బ్రేక్పడింది. అనిశ్చితి పరిస్థితులను ‘పోటీపూర్వక కరెన్సీ విలువ తగ్గింపులతో’ ఎదుర్కొనాలని భావించడం లేదని చైనా ప్రకటించింది. దీనితో పలు వర్థమాన దేశాల కరెన్సీల సెంటిమెంట్లు మెరుగుపడ్డాయి. -
రూపాయి రికవరీ.. 72.18 వద్ద ముగింపు..
ముంబై: కొత్త కనిష్ట స్థాయికి పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్తో దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ వారాంతంలో ప్రధాని మోదీ ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేయడం కొంత ఊతమిచ్చింది. పతనాన్ని అడ్డుకుంటాం..: డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ‘అసంబద్ధ స్థాయి’కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకుంటాయని గర్గ్ స్పష్టం చేశారు. రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్ ఆపరేటర్ల ఓవర్రియాక్షన్ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. క్రూడ్ ధరలు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం తదితర అంశాల నడుమ రూపాయి క్షీణత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. -
రూపాయికి దేశీ, అంతర్జాతీయ భయాలు!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఏడవ ట్రేడింగ్ సెషన్లోనూ కిందకు జారింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ 71.99 వద్ద ముగిసింది. బుధవారం ముగింపు విలువతో పోలిస్తే 24 పైసలు పతనమయింది. ట్రేడింగ్లో ఒక దశలో 72ను దాటిపోయి, 72.11ను చేరింది. చివరకు కొంత రికవరీతో 71.99 వద్ద ముగిసింది. అటు ముగింపు, ఇంట్రాడే ట్రేడింగ్ విలువ... రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. రూపాయి తిరోగమనానికి కొన్ని కారణాలు చూస్తే... ►నిజానికి రూపాయి గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో 13 పైసలు లాభంతో 71.62 వద్ద ప్రారంభమైనా, ఆ స్థాయిలో నిలవలేకపోయింది. ►అంతర్జాతీయ, దేశీయ కారణాలు రెండూ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ►అంతర్జాతీయంగా చూస్తే, క్రూడ్ ధరలు తీవ్ర స్థాయిని చేరాయి. ఇవి దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ► దేశీ కంపెనీలు క్రూడ్ను డాలర్లలో కొనుగోలు చేస్తాయి కాబట్టి ఇది దేశీయ విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతుంది. వెరసి దేశంలోకి వచ్చీ– పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరుగుదలకు కారణమవుతుంది. ►క్రూడ్ ధరల పెరుగుదల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు... తద్వారా వడ్డీరేట్ల పెంపుదలకు దారితీసి దేశీయ వృద్ధిని దెబ్బతీస్తుంది. ► ఇక దేశంనుంచి విదేశీ నిధులు వెనక్కు వెళ్లిపోతుండడమూ ప్రతికూలాంశమే. ► వీటన్నింటికీ తోడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం సమస్యలను తెచ్చిపెడుతోంది. ► అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ విలువల పతనం... ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 95 స్థాయిలో పటిష్టంగా ఉండడం దేశీయ కరెన్సీ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ 13% పతనమయ్యింది. ►గురువారం పలు క్రాస్ కరెన్సీలలో కూడా రూపాయి పతనమయింది. పౌండ్ స్టెర్లింగ్పై 91.95 నుంచి 93.08కి జారింది. యూరోపై 83.12 నుంచి 83.70కి పడింది. -
71 దిశగా రూపాయి పయనం?
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారంతో పోల్చితే 15 పైసలు బలహీనపడింది. 70.74 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక దశలో 70.90ని సైతం తాకింది. ఈ రెండూ రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. బుధవారం రూపాయి 70.59 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 70.65ని చూసింది. అయితే గురువారం మరింత కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ►అమెరికా పటిష్ట వృద్ధి ధోరణి ‘డాలర్ బలోపేతం’ అంచనాలను పటిష్టం చేసింది. మున్ముందు డాలర్ మరింత పెరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీనితో చమురు దిగుమతిదారుల నుంచి ‘నెలాంతపు’ డాలర్ల డిమాండ్ తీవ్రమయ్యింది. దీనితో రూపాయి భారీ పతనం అనివార్యమయ్యింది. ►గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 70.64 వద్ద ప్రారంభమయ్యింది. ►వివిధ దేశాలకు సంబంధించి క్రాస్ కరెన్సీలో కూడా రూపాయి బలహీనపడింది. బ్రిటన్ పౌండ్లో రూపాయి విలువ 90.98 నుంచి 92.07కు పడిపోయింది. యూరోలో 82.34 నుంచి 82.69కి దిగింది. జపాన్ యన్లో మాత్రం స్థిరంగా 63.46 వద్ద ఉంది. ఎగుమతిదారుల్లో అనిశ్చితి... రూపాయి విలువలో స్థిరత్వం అవసరం. ఇలా లేకపోతే ప్రత్యేకించి ఎగుమతిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది. గ్లోబల్ మార్కెట్లో వస్తువుల అమ్మకాలకు ఏ స్థాయి ధర నిర్ణయించాలన్న అంశంపై సంక్లిష్టత నెలకొంటుంది – గణేష్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
అమెరికా డాలర్లకు కక్కుర్తి..
అమెరికన్ డాలర్లకు ఆశపడి ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోసపోయిన ఘటన విజయవాడలోని పటమట దర్శిపేటలో వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి కోసం అమెరికన్ డాలర్లు పంపిస్తామని యూఎస్కే చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఆరు నెలల కిందట ఆ ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. దీంతో రూ.28 లక్షలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి మోసపోయాడు. ఆటోనగర్(విజయవాడ): ‘మా వద్ద రెండు లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి.. మీకు పెట్టుబడిగా ఆ డబ్బును సమకూరుస్తాం.. మీరు ఏదైనా వ్యాపారం మొదలెట్టండి.. లాభాల్లో మీకు వాటా ఇస్తాం..’ అంటూ ఓ రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగికి 6 నెలల కిందట అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. ముందు వెనుకా ఆలోచించకుండా ఆ ఉద్యోగి ఆమె చెప్పిన విధంగా రూ. 28 లక్షలు వారు తెలిపిన అకౌంట్లో జమ చేశాడు. ఆ తరువాత అటువైపు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని శుక్రవారం పటమట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు ఫిర్యాదు పేర్కొన్నట్లుగా వివరాలు ఇలా ఉన్నాయి.. పటమట దర్శిపేట చెందిన వెంకట సత్యప్రసాద్ ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన మైఖేల్ ఎస్తేర్ డోనాల్డ్ అనే మహిళ నుంచి ఫేస్బుక్ వీడియో కాల్ వచ్చింది. తన వద్ద 2 లక్షల అమెరికా డాలర్లు ఉన్నాయని.. మీకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించుకోవచ్చని నమ్మబలికింది. దీంతో సత్యప్రసాద్ ఆమెతో పలు దఫాలు డాలర్ల విషయమై ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేయడం.. మాట్లాడం జరిగింది. ఆ తర్వాత అతనితో అమెరికాకు చెందిన మ్యాత్యు టేలర్తోపాటు అజయ్ అనే మరొ వ్యక్తి కూడా ఫోన్ ద్వారా పరిచయమయ్యారు. వారు ముగ్గురు కలిసి మీకు డబ్బులు పంపిస్తాం కానీ పెట్టుబడుల పెట్టే నిమిత్తం కొంత డబ్బు పన్ను రూపేణ చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. అకౌంట్ నెంబరు కూడా ఇచ్చింది. అన్నింటికీ అంగీకరించిన ఆ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 28 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడం.. ఫేస్బుక్ నుంచి కూడా చాటింగ్లు నిలిచిపోవడంతో ఆత్యాశకుపోయి ‘బుక్కయ్యాను’ అనుకున్న సత్యప్రసాద్ శుక్రవారం పటమట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
15నెలల కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి పతనమైంది. డాలరుతో మారకంలో రూపాయి కీలక మద్దతు స్థాయి 67 మార్క్ దిగువకు చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 26 పైసలు(0.3 శాతం) బలహీనపడి 67.13ను తాకింది. దీంతో 15 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అటు చమురు ధరలు, ఇటు కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలు రూపాయి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు 10 సంవత్రాల బాండ్ ఈల్డ్స్ వరుసగా నాలుగోసారి కూడా పతనాన్ని నమోదు చేశాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తదుపరి వారంలో ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను (ఓఎంఓ) ప్రకటించిన తరువాత 10 సంవత్సరాల బాండ్ దిగుబడి(7.637శాతం) 13 బేసిస్ పాయింట్లు తగ్గింది. మే నెలలో రూ .10,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఒక దశలో 92.90 వరకూ ఎగసింది. ఇది రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క దేశీ స్టాక్స్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సైతం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూన్ నెలలో రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాలు, ఇటీవల స్థానిక కరెన్సీల మ్యానిప్యులేషన్ జాబితాలో యూఎస్ ఆర్థిక శాఖ రూపాయిని చేర్చడం వంటి అంశాలు దేశీ కరెన్సీని ప్రభావితం చేస్తున్నట్టు కరెన్సీ మార్కెట్ ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా మార్చి నెలలో వాణిజ్య లోటు 28.5 శాతం (13.7 బిలియన్ డాలర్లు) ఎగసి 87 బిలియన్ డాలర్లను అధిగమించడం కూడా సెంటిమెంటును దెబ్బతీసినట్టు వ్యాఖ్యానించాయి. కాగా శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి 66.86 వద్ద ముగిసింది. -
కనిష్ట స్థాయిలకు పడిపోయిన రూపాయి
ముంబై : రూపాయి విలువ మార్కెట్లో భారీగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ నేడు(సోమవారం) 67 మార్కును అధిగమించి, 67.13 వద్ద ట్రేడువుతోంది. ఇది 2017 ఫిబ్రవరి నాటి అత్యంత కనిష్ట స్థాయి. అమెరికా డాలర్ విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రూపాయి విలువను దెబ్బతీస్తున్నాయని ఫారెక్స్ అడ్వయిజరీ సంస్థ ఐఎఫ్ఏ గ్లోబల్ తెలిపింది. శుక్రవారం రోజు కూడా రూపాయి విలువ 66.86గా నమోదైంది. మరోవైపు డాలర్ విలువ డిసెంబర్ నాటి గరిష్ట స్థాయిలను బద్దలు కొడుతోంది. ఆరు మేజకర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ, డాలర్ ఇండెక్స్లో 92.609కు పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు మూడేళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. గ్లోబల్గా సరఫరా చాలా కఠినతరంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఆందోళనలతో ఆయిల్ ధరలు బ్యారల్కు 75 డాలర్ల పైగా నమోదవుతున్నాయి. దీంతో రూపాయి విలువ పడిపోతోంది. మరోవైపు దేశీయంగా కర్నాటక ఎన్నికల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. శనివారం రోజు ఎన్నికలు జరిగి, వచ్చే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 66.73 నుంచి 67.10 మధ్యలో ట్రేడవనుందని ఫారెక్స్ అడ్వయిజరీ సంస్థ తెలిపింది. ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి విలువ 67.085 వద్ద నమోదైంది. ప్రస్తుతం 67.13 వద్ద ట్రేడవుతోంది. -
ఆరు నెలల కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రారంభ లాభాలనుంచి కిందికి పడి రూపాయి 6పైసలు నష్టపోయింది. ప్రస్తుతం 11పైసలు క్షీణించి 65.60 వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్యలోటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని డీలర్లు చెప్పారు. మరోవైపు దేశీయంగా ఏటీఎంలలో నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్ దెబ్బతిందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో డాలర్కు డిమాండ్ పెరిగింది. సోమవారం రూపాయి 65.44 వద్ద ముగిసింది. అటు దేశంలో నెలకొన్న నగదు కొరత సంక్షోభంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. నగదుకొరత సమస్యను సమీక్షించామనీ, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
భారీగా బలపడిన రూపాయి
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ ప్రకటనకు ముందుకు రూపాయి భారీగా బలపడింది. ఏకంగా రెండేళ్ల గరిష్టంలోకి ఎగిసింది. అమెరికా డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ రెండేళ్ల గరిష్టంలో 63.82 వద్ద ట్రేడైంది. రూపాయి బలపడటానికి ప్రధాన కారణం.. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ)లు భారీగా నగదును దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లలోకి మరలించడమేనని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో డాలర్తో రూపాయి మారకం విలువ 64.12గా నమోదైంది. అనంతరం 2015 ఆగస్టు 10 నాటి స్థాయి 63.82 వద్ద గరిష్ట స్థాయిలను నమోదుచేసింది. ప్రస్తుతం 23 పైసలు బలపడి 63.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 6.12 శాతం మేర లాభపడింది. మరోవైపు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 57.38 పాయింట్ల నష్టంలో 32,517 వద్ద, నిఫ్టీ 25.50 పాయింట్ల నష్టంలో 10,089 వద్ద కొనసాగుతున్నాయి. ఈసారైనా ఆర్బీఐ రేట్ల కోతను చేపడుతుందా? లేదా? అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఇన్ఫీకి ఒక మిలియన్ డాలర్ల జరిమానా
న్యూఢిల్లీ: న్ఫోసిస్ వీసా ఉల్లంఘన వివాదాన్ని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పరిష్కరించుకుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కు 1 మిలియన్ డాలర్లను (సుమారు 6కోట్లు) చెల్లించనుంది. ఈ కేసు పరిష్కారానికి 2013లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ భారీ మొత్తాన్ని న్యూయార్క్కోర్టుకు చెల్లించనుంది. దీంతో రెండు పార్టీలు దీర్ఘకాలిక వ్యాజ్యాన్ని రద్దు చేసుకోనున్నాయని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. మిలియన్ డాలర్ల పరిష్కారంతో ఈ కేసు దర్యాప్తును ముగించడానికి నిర్ణయించామని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ టీ షీనిడెర్మాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా వాసుల ప్రయోజనాలకు భిన్నంగా కంపెనీలు తమ చట్టాలను ఉల్లంఘించడాన్ని తాము అనుమతించమనీ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక సమావేశానికి ముందు రోజు ఈ ప్రకటన రావడం విశేషం. హెచ్1బీ వీసాలకు బదులుగా చౌకగా ఉండే బిజినెస్ విజిట్ వీసాలు(బీ1) తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. తద్వారా అమెరికాలో క్లయింట్లకు సర్వీసులు అందించిందనేది ఇన్ఫీపై ఆరోపణ. వీసాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ తామెలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని ఇన్ఫీ స్పష్టం చేసింది. దీనిపై 2011లో విచారణ 2013లో సెటిల్మెంట్ జరిగింది. సుమారు 3.4 కోట్ల డాలర్లు (రూ.215కోట్లు) చెల్లించాలనే సెటిల్మెంట్ చేసుకోవడం తెలిసిందే. -
సోషల్మీడియా ద్వారా గృహిణుల ఆదాయం తెలిస్తే...
ముంబై: సోషల్ మీడియాలో గృహిణుల దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అభివృద్దిని ఎక్కువగా మహిళలే అందిపుచ్చుకున్నట్టు సర్వేలో తేలింది. ఇ-కామర్స్ బూమను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నభారతీయ మహిళలు భారీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారట. తాజా నివేదిక ప్రకారం 20లక్షలమంది(2 మిలియన్ల) హోం మేకర్స్ సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని లెక్కల్లో తేలింది. దీనికి స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడం కూడా కారణమని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్ ప్లాట్ ఫాం ల ద్వారా దాదాపు 2మిలియన్ మంది హోమ్మేకర్స్ 9 బిలియన్ డాలర్ల ( సుమారు 58వేల కోట్లు) మేర ఆదాయం సమకూర్చుకున్నారని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ ఒక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా గృహిణులు లైఫ్ స్టైల్ వస్తువులు, దుస్తులు విక్రయ, పునఃవిక్రయాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. వివాహ తదితర వివిధ కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయినా కూడా తమ వ్యాపారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని తెలిపింది. దీంతో ప్రాంతాలు మారినా ఈ కామర్స్ విధానం వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండటంలేదని పేర్కొంది. దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం భారీగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్ , అమెజాన్ లాంటి ఇ-కామర్స్ మేజర్ల లావాదేవీలు భారీగా జరుగుతున్నాయని తెలిపింది. ప్రాథమిక ఇంటర్నెట్ ఉపకరణాల ద్వారా సుమారు 8-9 బిలియన్ డాలర్ల గరిష్ట అమ్మకాలతో వీటి వ్యాపారాన్ని విస్తరణకు తోడ్పడ్డాయని పేర్కొంది. అంతేకాదు 20202 నాటికి ఇది 48-60 బిలియన్ చేరుతుందని కూడా నివేదించింది. -
దేశీయ టెక్ దిగ్గజాలకు రూపీ షాక్
దేశీయ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలకు ఇన్ని రోజులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకివ్వగా.. ఇప్పుడు మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చి పడింది. ఆశ్చర్యకరంగా రూపీ విలువ పునరుద్ధరించుకోవడం ప్రారంభించింది. రూపీ విలువ పునరుద్ధరణ ఒకవిధంగా ఎక్స్ పోర్ట్స్ లో అగ్రగామిగా ఉన్న సాప్ట్ వేర్ సర్వీసుల రంగానికి భారీ షాకేనని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 5.6 శాతం జంప్ అయింది. ఇది ద్రవ్యోల్బణం దిగిరావడానికి సహకరిస్తోంది. కానీ ఎక్స్ పోర్టు సర్వీసు కంపెనీల ఆదాయాలకు ఛాలెంజింగ్ గా మారిందన్నారు. ఒక్క టెక్నాలజీ కంపెనీలకే కాక, డ్రగ్ కంపెనీలకు భారీగానే దెబ్బతీస్తుందట. ఇటీవలే టెక్, ఫార్మా దిగ్గజాలు హెచ్-1బీ వీసా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ దాడులతో సతమతమవుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఇది మరో సమస్యలా వాటికి పరిణమిస్తోంది. ఐటీ ఎక్స్ పోర్ట్ దిగ్గజాలు టాటా, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 90 శాతం రెవెన్యూలను విదేశాల నుంచే ఆర్జిస్తున్నాయి. వాటితో పాటు డ్రగ్ మేకర్స్ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుపిన్ లిమిటెడ్ ల ఆదాయాలు 70 శాతానికి పైగా విదేశాలవే. ఒక్కసారిగా రూపాయి విలువ పెరగడం ఈ కంపెనీలకు ఆందోళనకరంగా మారిందని రిలయన్స్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ రాకేష్ థార్వే చెప్పారు. రూపాయి విలువ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ఈ క్వార్టర్ వరకు వెల్లడించిన కంపెనీ ఆదాయాలపై రూపాయి విలువ పెంపు ప్రభావం చూపిందని తాము భావించడం లేదని రాకేశ్ చెప్పారు. కానీ రూపాయి విలువ 1 శాతం పెరుగతున్న ప్రతిసారి, ఐటీ ఎక్స్ పోర్టు కంపెనీల మార్జిన్లు 25-30 బేసిస్ పాయింట్లు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. వచ్చే క్వార్టర్లో ఫార్మా కంపెనీల ఆదాయాలు 4 శాతం నుంచి 6 శాతం, సాప్ట్ వేర్ సంస్థల ఆదాయాలు 2 శాతం నుంచి 3 శాతం పడిపోతాయని ముంబాయికి చెందిన టీసీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రీ లోకప్రియ చెప్పారు. -
గూగుల్ సీఈవో మరో రికార్డు
-
గూగుల్ సీఈవో మరో రికార్డు
హ్యూస్టన్: ప్రముఖ సెర్చి ఇంజీన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (44 ) అందిన పరిహారం ఎంత పెరిగిందో తెలుసా? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్ లో చేరిన పిచాయ్ 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని మరోసారి రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సుందర్కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ యూనిట్లను ఆయనకిచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 12,855కోట్లకు చేరింది. 2015 స్టాక్ అవార్డు సుమారు 99.8 మిలియన్ డాలర్లకు ఇది రెట్టింపు. యూ ట్యూబ్ వ్యాపారంతోపాటు, ప్రధానమైన యాడ్స్ బిజినెస్ద్వారా గూగుల్ ఆదాయానికి మంచి బూస్ట్ఇచ్చినందుకుగాను పిచాయ్ కి ఈ భారీ కాంపన్సేషన్ లభించింది. అలాగే మెషీన లెర్నింగ్, హార్డ్ వేర్ , క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టుబడుల ద్వారా ఈ గ్రోత్ సాధించారని సీఎన్ఎస్ నివేదించింది. అనేక విజయవంతమైన ప్రాజెక్టులను లాంచ్ చేసినందుకు సంస్థ పరిహార కమిటీ ఈ విలాసవంతమైన పరిహారం చెల్లించిందని తెలిపింది. భారత సంతతికి చెందిన పిచాయ్ 2015 నాటి వేతనంతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగింది. అయితే 2015 లో 652,500 డాలర్లను ఆర్జించిన పిచాయ్, గత ఏడాది ఈ వేతనం కొంచెం క్షీణించి 650,000డాలర్లు (రూ.667 కోట్లు) వేతనాన్ని పొందారు అల్ఫాబెట్ స్టాక్ వాల్యూ ఈనెలలో భారీగా పుంజుకుంది. మొదటిసారి దీని మార్కెట్ క్యాప్ 600 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా 2004 సంవత్సరంలో గూగుల్లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా కేరీర్ను ఆరంభించిన పిచాయ్ 2015 ఆగస్టులో సంస్థ పునఃనిర్మాణ సమయంలో సీఈవో పదవిని చేపట్టారు. 2016లో 199 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును అందుకున్నారు. -
అమెజాన్ సీఈవో బెజోస్ కీలక నిర్ణయం
అంతరిక్షంలోకి టూరిస్టులను షికారు కొట్టించేందుకు ఉరకలు పెడుతున్న అమెజాన్ సహ వ్యవస్తాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కలల ప్రాజెక్టు బ్లూ ఆరిజన్ రాకెట్ కంపెనీ కోసం అమెజాన్ భారీ వాటాలను విక్రయించనున్నారు. సంవత్సరానికి సుమారు రూ.65వేలకోట్లు (1 బిలియన్ డాలర్లు) విలువైన అమెజాన్ షేర్లను విక్రయించనున్నట్టు బుధవారం బెజోస్ ప్రకటించారు. ఈ నిధులను బ్లూ ఆరిజన్ కోసం వెచ్చించనున్నట్టు ప్రపంచ కుబేరుల్లో ఒకడు, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అధిపతి కూడా అయిన బెజోస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మనుషుల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లే సర్వీసులను అందుబాటులోకి తేనుంది. భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017 లో 11 నిమిషాల అంతరిక్ష యాత్రను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వచ్చే ఏడాది వరకు ఇది సాధ్యంకాకపోవచ్చని బెజోస్ తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా)లో 33వ స్పేస్ సింపోజియం సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పేస్కి చేరడానికి చాలా సమయం పడుతుందనీ, అయినా బ్లూ ఆరిజన్ లో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. చివరికి బ్లూ ఆరిజిన్ స్వీయ-సమృద్ది తో లాభదాయంగా ఉండాలనేది తమ లక్ష్యమని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు అతితక్కువ ఖర్చుకే అంతరిక్ష విమాన సౌకర్యాన్ని కల్పించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ఉన్నట్టు బెజోస్ చెప్పారు. స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్ క్యాప్సూల్ తో పోలిస్తే న్యూషెపర్డ్ ఇంజనీరింగ్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. శాటిలైట్లను, మానవులను ఆర్బిట్ లోకి తీసుకెళ్లేందుకు బ్లూ ఆరిజన్ స్పేస్ ఎక్స్ఫాల్కన్ 9, డ్రాగన్ క్యాప్సూల్ లాంటి రెండవ అంతరిక్షనౌక ను సిద్ధం చేస్తోంది. న్యూ గ్లెన్ అని చెబుతున్న దీనికయ్యే ఖర్యును 2.5 బిలియన్డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, బెజోస్ నికర సంపద 78 బిలియన్ డాలర్లు. న్యూషెపర్డ్గా పిలిచే అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. మొత్తం ఆరుగుర్ని తీసుకెళ్లకలిగే షెపర్డ్ టికెట్ల అమ్మకాలను బ్లూఆరిజన్ ఇకా మొదలు పెట్టలేదు. -
అభివృద్ధి అసమానం
స్టాక్హోం: గత పాతికేళ్లలో మానవుడు పలు రంగాల్లో ఎంతో పురోగతి సాధించినా శరణార్థులు, వలసదారులు, మహిళలు ఇంకా వెనకబడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. ‘ప్రజలు ఇప్పుడు సుదీర్ఘ కాలం జీవిస్తున్నారు. చాలా మందికి కనీస వసతులన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయినా మానవాభివృద్ధి అసమానంగా ఉంది’ అని స్టాక్హోంలో విడదలైన ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదిక నిగ్గుతేల్చింది. 1990–2015 మధ్య ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగిందని, 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. 210 కోట్ల మందికి మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందని, 260 కోట్ల మంది సురక్షిత నీటిని పొందుతున్నారని తెలిపింది. 1 శాతం జనాభా చేతిలోనే 46 శాతం సంపద ఉందని పేర్కొంది. -
మరింత దూకుడు కొనసాగిస్తున్న రూపాయి
ముంబై : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం రూపాయికి భలే కిక్కిచ్చింది. డాలర్ తో పోలిస్తే తగ్గుతూ వచ్చిన రూపాయి మారకం విలువ నిన్నటి ట్రేడింగ్ లో ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. నేటి ట్రేడింగ్ లోనూ ఈ రూపాయి విలువ మరింత పెరిగింది. విదేశీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ తో రూపాయి మరో 38 పైసలు బలపడి 65.44 వద్ద ట్రేడైంది. ఎంతో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఫైనాన్సియల్ మార్కెట్లలో సెంటిమెంట్ భారీగా బలపడింది. అంతేకాక సుస్థిర ప్రభుత్వం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలర్ పై దూకుడు కొనసాగిస్తూ రూపాయి మంగళవారం ఇంట్రాడేలో గరిష్ట స్థాయి 65.76ని తాకింది. చివరికి 78 పైసలు బలపడి 1.17 శాతం పెరుగుదలతో 65.82 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు మరింత బలపడుతూ మార్నింగ్ ట్రేడ్ లో రూపాయి 65.41, 65.44 స్థాయిలో ట్రేడైంది. ప్రస్తుతం 32 పైసల లాభంతో 65.49 వద్ద ట్రేడవుతోంది.. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.06 శాతం కిందకి దిగజారింది. ఆరు కరెన్సీల బాస్కెట్ లో డాలర్ విలువ మార్నింగ్ ట్రేడ్ లో 101.68 వద్ద కొనసాగింది. మరోవైపు నేడు ఫెడరల్ రిజర్వు మీటింగ్ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు మాత్రం ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. -
ఇంటెల్ భారీ కొనుగోలు
జెరూసలెం: అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చే యోచనలో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ కంప్యూటర్ కంపెనీ..మొబైల్ ఐ కంపెనీని కొనుగోలు చేసింది. డ్రైవర్ లెస్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న మొబైల్ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ఒక ప్రకటన జారీ చేశాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ఒప్పందం పూర్తికానుందని తెలిపాయి. డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తీసుకు రావడానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఈ డీల్ భారీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ వాటాదారులకు,ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది గొప్పముందడుగు అని ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్ తెలిపారు. డ్రైవింగ్ లెస్ కారు ఆవిష్కరణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో ఇంటెల్ కీలకమైన, పునాది సాంకేతికలను అందిస్తోంటే, మొబైల్ ఐ పరిశ్రమకు ఉత్తమ ఆటోమోటివ్ గ్రేడ్ కంప్యూటర్ విజన్ అందిస్తోంది. దీంతో ఇకముందు తమ భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో, మెరుగైన ప్రదర్శనతో క్లౌడ్ టు-కారు సొల్యూషన్ తో భవిష్యత్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. 2030 నాటికి డ్రైవర్ లెస్ కార్ మార్కెట్ వాల్యూ 70 బిలియన్ డాలర్లుగా ఉండనుందని ఇంటెల్ అంచనా వేస్తోంది. ప్రముఖ కార్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్తో తమ సంబంధాలు యధావిథిగా కొనసాగుతాయని మొబైల్ ఐ ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. అటు ఇది అతి భారీ కొనుగోలు అని ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. ఆటోమేటివ్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది కానుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా మొబైల్ ఐ ఇప్పటికే ప్రపంచ కారు దిగ్గజాలు బీండబ్ల్యు, ఫోక్స్వాగన్ లాంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే మేపింగ్ సేవల సంస్థ హియర్ (HERE) సంస్థలో డాటా షేరింగ్ ఒప్పందం కూడా ఉంది. 1999లో స్థాపించిన మొబైల్ ఐ 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయింది. 2007లో గోల్డ్మన్సాచి 130 మిలియన్ల డాలర్ల పెట్టుబడుల అనంతరం వాహన ప్రమాదాలను, మరణాలను అరికట్టేందుకు ఓ మిషన్ను ప్రారంభించింది. ఈ వార్తలతో మొబైల్ ఐ షేరు అమెరికా మార్కెట్ లోదాదాపు 32 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్నినమోదు చేసింది. మరోవైపు గత ఏడాది 2021 నాటికి డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటెల్, మొబైల్ ఐ కంపెనీలతో జత కట్టింది మరో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యు. అమెరికా, యూరప్లో దాదాపు 40 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టనున్నట్టు గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డాలర్ దయపై బంగారం భవిత
♦ ఐదు వారాల కనిష్టానికి పసిడి ♦వారంలో 30 డాలర్లు పతనం ♦ఫెడ్ రేట్ల పెంపు ఖాయమన్న వార్తలే కారణం న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా డాలర్ కదలికలు బంగారంపై బలంగానే పడుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ మార్చి 14–15 తేదీల్లో ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) పెంచటం ఖాయమన్న వార్తలు బంగారాన్ని కిందకు దించుతున్నాయి. ఎందుకంటే ఫెడ్ గనుక రేటు పెంచితే నగదు బాండ్లలోకి వెళుతుందని, పసిడిపై పెట్టుబడులు తగ్గుతాయి కనుక ధర ఇంకా దిగుతుందనేది విశ్లేషకుల మాట. దీంతో భవిష్యత్ పసిడి కదలికలకు ఫెడ్ నిర్ణయం కీలకం కానుందని వారు చెబుతున్నారు. ఫెడ్ రేటు పెంచితే డాలర్ మరింత పెరగటం ఖాయమన్న అంచనాలు పసిడిని నడిపిస్తాయని, అంతర్జాతీయంగా ఇలా... 10వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) ధర 30 డాలర్లు తగ్గి 1,204 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. గత వారం ఒక దశలో పసిడి ఇక్కడ 1,195 డాలర్ల స్థాయికి సైతం వెళ్లింది. రెండు వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 53 డాలర్లు తగ్గడం విశేషం. పసిడికి 1,200 డాలర్ల వద్ద చిన్న మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 15 వరకూ అనిశ్చితి ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు గనుక ఫెడ్ అంచనాలకు అనుగుణంగా ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్ రేటు పెంచే అవకాశాలు ఉంటాయని 10 రోజుల క్రితం యెలెన్ ప్రకటించారు. గతవారం ఇందుకు సానుకూలంగానే గణాంకాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వారంలో రూ.700కుపైగా డౌన్... ఇక అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.654 తగ్గి, రూ.28,366కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర రూ. 1,277 తగ్గడం గమనార్హం. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.745 తగ్గి రూ.28,550కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,400కు పడింది. వెండి కేజీ ధర ముంబై మార్కెట్లో రూ. 1,785 తగ్గి రూ.41,065కి పడింది. ఇక్కడ రెండు వారాల్లో పసిడి 10 గ్రాములకు దాదాపు రూ.1000 తగ్గగా, వెండి దాదాపు రూ.2,000కుపైగా నష్టపోయింది. -
డాలర్ బలం – బంగారం బలహీనం
అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్లు డౌన్ దేశీయంగానూ ఇదే ప్రభావం న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా డాలర్ బలపడటం అంతర్జాతీయంగా బంగారం ధరను పడగొట్టింది. న్యూయార్క్ కమోడిటీ నైమెక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్ ధర శుక్రవారంతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే ఔన్స్కు (31.1గ్రా)– 23 డాలర్లు తగ్గి, 1,234 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ అప్ అండ్ డౌన్స్... అమెరికా డాలర్ ఇండెక్స్ సోమవారం నాడు 101.09 వద్ద ప్రారంభమయినా, గురువారం నాటికి భారీగా 102.16 డాలర్లకు చేరింది.అయితే శుక్రవారం ట్రేడింగ్ చివరికి 101.34 డాలర్లకు తగ్గి ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న కారణంగా రేటు పెంపు ఖాయమన్న ప్రకటన ఫెడ్ చీఫ్ యెలెన్ నుంచి వెలువడుతుందన్న అంచనాలు డాలర్ బలోపేతానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వారం దూకుడు లేకపోవచ్చు... 15 వరకూ అనిశ్చితి ఫెడ్ అంచనాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు వంటి అంశాలు ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్ రేటు పెంపునకు తగిన అవకాశాలు ఉంటాయని శుక్రవారం యెలెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి ధరల దూకుడు కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలున్నాయి. మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంబించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వారంలో రూ. 160 డౌన్.. ‘ఫ్యూచర్స్’లో అంతకు మించి ఇక అంతర్జాతీయంగా ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.623 తగ్గి, రూ.29,020కి చేరింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.160 తగ్గి రూ.29,295కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,145కు పడింది. వెండి కేజీ ధర రూ.405 తగ్గి రూ.42,850కి పడింది. క్రూడ్పైనా డాలర్ ప్రభావం.. మూడు వారాల కనిష్టం... డాలర్ పెరుగుదల ఎఫెక్ట్ గురువారం క్రూడ్ ధరపైనా కనిపించింది. నైమెక్స్ లైట్ స్వీట్ బ్యారల్ ధర గురువారం మూడు వారాల కనిష్ట స్థాయి 52.55 డాలర్లకు పడిపోయింది. శుక్రవారం డాలర్ తిరిగి కొంత బలహీనపడడంతో తిరిగి 53.23 డాలర్ల వద్ద ముగిసింది. -
భారీగా క్షిణించిన రూపాయి
-
కళకళలాడుతున్న పసిడి
ముంబై: డాలర్ దెబ్బతో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో అమెరికన్ డాలరు బలహీనపడటంతో బంగారం ధరలకు ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా యూరో తొలుత 2 శాతం జంప్చేయడంతో డాలర్ విలువ క్షీణించింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పాజిటివ్ గా ఉన్నాయి. అటు విదేశీ మార్కెట్లో బంగారం మెరుస్తుండటంతో దేశీయంగానూ ధరలు పురోగమించాయి. 22 కారెట్ల పది గ్రా. బంగారం ధరలు రూ. 26910 వద్ద, 24 కారెట్స్ పదిగ్రా. బంగారం రూ.28780 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 0.3 శాతం పుంజుకుని 1161 డాలర్లను అధిగమించింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.35 శాతం ఎగసి 16.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుసగా ఏడో వారం పసిడి పతనం కొనసాగడంతో తక్కవ స్తాయిలో అందుబాటులోకి రావడంతో ట్రేడర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు భారీగా ధరలు పడిపోనున్నాయనే ముందస్తు అంచనాలతో మదుపర్లు ఇప్పటికే కొనుగోళ్ళకు పాల్పడ్డారు. ఫలితంగా సుమారు26వేల స్థాయికి దిగిరావడంతో షార్ట్ కవరింగ్ కారణంగా పసిడి ధరలు 1130 డాలర్ల స్థాయి నుంచి పుంజుకున్నాయి. అటు ఎంసీఎక్స్లో గురువారం 10 గ్రాముల పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 262 జంప్చేసి రూ. 27,562 వద్ద స్థిరపడింది. శుక్రవారం కూడా మరో రూ. 66 ఎగిసి రూ. 27,562 వద్ద ఉంది. వెండి కేజీ మార్చి ఫ్యూచర్ రూ. 130 పెరిగి రూ.39751 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా ఈ ఏడాది బులియన్ ధరలో దాదాపు మూడేళ్ల తరువాత 8 శాతం పుంజుకోగా, ఒక్క నవంబరు లోనే 8 శాతం పతనమయ్యాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెరిగితే బంగారంలో పెట్టుబడులకు తక్కువ అవకాశం ఉంటుందని లండన్ ఆధారిత సన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సీఈవో మిహిర్ కపాడియా తెలిపారు. అయితే ప్రస్తుతం బులియన్ మార్కెట్లో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని మరికొంతమంది ఎనలిస్టులు సూచిస్తున్నారు. అటు కాగా డాలర్ పో పోలిస్తే రూపాయి కూడా ఈ రోజు బాగా బలపడింది. 14 పైసలు పుంజుకుని రూ.67.96 వద్ద ఉంది. -
బుడతడి వైద్యం 2 డాలర్స్ ఓన్లీ!
చీరో ఆర్టిజ్.. ఈ చిన్నారి పేరు. వయసు 11. ఉంటున్నది అమెరికాలో. ఈ మధ్య న్యూయార్క్లోని ఓ సబ్వే స్టేషన్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. సబ్వేలు ఉండేది రోడ్డుకు ఇటువైపు, అటు వైపు వెళ్లడానికి. అండర్ గ్రౌండ్లో ఉంటాయి. సొరంగంలాంటి ఆ మార్గంలో సాధారణంగా మనుషులెవ్వరూ నిలుచోరు. హస్క్ కొట్టరు. ఒక ప్రవాహంలా కదిలిపోతూనే ఉంటారు. ఆ ప్రవాహంలో చిన్న బ్రేక్.. ఈ కుర్రాడు. వచ్చేవారికి, వెళ్లేవారికి కనిపిస్తూ ఓ మూల కుర్చీలో కూర్చొని ఉంటాడు. అతడి ముందు ఒక మడత బల్ల ఉంటుంది. ఆ బల్లకు ఓ బోర్డు వేలాడుతూ ఉంటుంది. ‘ఎమోషనల్ అడ్వైస్. 2 డాలర్స్’. అదీ ఆ బోర్డు! ఎమోషనల్గా ఏదైనా బాధలో ఉండి, సలహా కోసం చూస్తూ, థెరపిస్టు దగ్గరికి వెళ్లే సమయం, ఓపిక, డబ్బు లేనివాళ్లకు ఇప్పుడీ సబ్వే థెరపిస్టు ‘భూతవైద్యుడి’లా సాక్షాత్కరిస్తున్నాడు. నిజంగా భూతవైద్యం కాదు. ఇంత చిన్నపిల్లాడేం చెప్తాడు అనే ఆసక్తితో అతడిని చూసినప్పుడు.. విచిత్రంగా, మాయగా, మంత్రంగా అనిపిస్తుంది. అలా ఇది భూతవైద్యం అన్నమాట. వీడి ప్రాక్టీస్ వెనుక చిన్న కథ ఉంది. స్కూల్లో ఎవరో చీరోను హర్ట్ చేశారు. చీరో హర్ట్ అయ్యాడు. హర్ట్ కాకుండా ఎలా ఉండాలి? హర్ట్ చేసేవాళ్లను ఎలా దారిలోకి తేవాలి అని ఆలోచించాడు. అమ్మానాన్నతో మాట్లాడాడు. ‘లైట్గా తీస్కో’ అని నాన్న ఆడమ్, అమ్మ జాస్మిన్ సలహా ఇచ్చారు. ఆ సలహా చీరోకి బాగా నచ్చింది. సమస్య ఎంత పెద్దదైనా, తేలిగ్గా తీసుకోవడం వల్ల అది తగ్గిపోతుంది. అంటే.. ‘మనసుకు పట్టించుకోవడమే మన అసలు సమస్య’ అని కనిపెట్టాడు చీరో. దాంతో అతడికో ఆలోచన వచ్చింది. పైకి చెప్పుకోరు కానీ, ప్రతి మనిషికీ ఏదో ఒక ఎమోషనల్ సమస్య ఉంటుంది. దానికి సలహా ఇవ్వాలని అనుకున్నాడు. ఉచిత సలహాలు ఎవరూ తీసుకోరు కదా. అందుకే 2 డాలర్ల ఫీజు పెట్టాడు. ఇప్పటికైతే చీరో ప్రాక్టీస్ బాగా సాగుతోంది. ఒక్కోరోజు 50 డాలర్లతో ఇంటికి వెళుతున్నాడు. మన రూపాయల్లో సుమారు 3,400. ప్రేమ, పెళ్లి, రిలేషన్స్, జాబ్, ఫ్యూచర్ ఇలా... అన్నిరకాల సలహాల కోసం బెడ్ఫోర్డ్ సబ్వేలోని ఇతడి ‘క్లినిక్’ దగ్గర కొద్ది నిమిషాలు ఆగేవారు ఎక్కువయ్యారు. కొంతమందైతే.. ‘డాక్టరు గారు మీ సలహా అద్భుతంగా పనిచేసిందండీ’ అని మళ్లీ వచ్చి థ్యాంక్స్ కూడా చెబుతున్నారు! ఏ సమస్యకైనా చీరో చెప్పే సమాధానం ఒకటే.. ‘జీవితం విలువైనది. బాధపడడానికి ఏమాత్రం టైమ్ కేటాయించకు’ అని మాత్రమే. అలాగని సేమ్.. ఇవే మాటలతో చెప్పడు. ప్రేమ సమస్య అయితే ప్రేమ మాటల్లో చెబుతాడు. మనీ ప్రాబ్లమ్ అయితే, డబ్బు భాషలో చెప్తాడు. ఇక కొంతమందైతే.. సరదాగా ట్రంప్ గురించి, తమ ఇంట్లో పని చేయని పంప్ గురించీ ఏవో రెండు మాటలు మాట్లాడి, అక్కడికక్కడే రిలాక్సై పోయి చీరో చేతిలో రెండు డాలర్లు పెట్టి పోతున్నారట! సబ్వేలో ఓ రెండు గంటలు మాత్రమే అందుబాటులో ఉండే చీరోకి క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. అతడి కోసం వేచి ఉండే ‘పేషెంట్’ల సంఖ్య కూడా పెరుగుతోంది. -
నాట్కో ఔషధానికి ఎఫ్డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుడెసొనైడ్ ఔషధ జనరిక్ వెర్షన్ అమ్మకాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. పెరిగో ఫార్మా ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని ఎంటోకోర్ట్ పేరిట విక్రరుుస్తోంది. జీర్ణవ్యవస్థ సమస్యల సంబంధిత క్రోన్స వ్యాధి చికిత్సలో ఎంటోకోర్ట్ ఈసీ (3 మి.గ్రా. మోతాదు)ని ఉపయోగిస్తారని నాట్కో వివరించింది. తమ మార్కెటింగ్ భాగస్వామి అల్వోజెన్తో కలిసి దీన్ని తక్షణం అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఎంటోకోర్ట్ ఈసీ క్యాప్సూల్స్, సంబంధిత ఇతర జనరిక్ వెర్షన్స అమ్మకాలు అమెరికాలో వార్షికంగా సుమారు 370 మిలియన్ డాలర్ల మేర ఉన్నట్లు అంచనా. గురువారం బీఎస్ఈలో నాట్కో షేరు స్వల్పంగా పెరిగి రూ. 590 వద్ద ముగిసింది. -
ట్రంప్ ఎంత జీతం తీసుకుంటాడో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన జీతంపై ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాదికి ఒక్క డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని, తనకు నాలుగు లక్షల డాలర్లు వద్దని చెప్పారు. అంతేకాదు, పర్యటనల పేరిట వృధా ఖర్చు చేయకుండా వాటిని నిలువరిస్తానని తెలిపారు. త్వరలో అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో జీతం గురించి ఓ మీడియా ప్రశ్నించగా 'లేదు.. నేను జీతం తీసుకోవాలనుకోవడం లేదు' అని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో తాను సాలరీ తీసుకోనంటూ ఓ వీడియో ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించే ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. దేశంలో చాలా పనిచేయాల్సి ఉందని, ప్రజల కోసం తాను అదంతా చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, పన్నుల అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, ఇలా ఎన్నో పెద్ద పెద్ద పనులు ఉన్నందున తాను వెకేషన్స్ లాంటివి పెద్దగా పెట్టుకోవాలనుకోవడం లేదని ట్రంప్ చెప్పారు. -
'బోలెడంత డబ్బు ఇచ్చా.. ఇంకా ఇస్తా'
వాషింగ్టన్: ప్రాథమిక(ప్రైమరీస్) ఎన్నికల ప్రచారానికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రచారానికి వ్యక్తిగతంగా భారీ మొత్తంలో సొమ్ము వెచ్చించానని వెల్లడించారు. 'ఎన్నికల ప్రచారం కోసం 100 మిలియన్ డాలర్లు(రూ. 669 కోట్లు)పైగా ఇచ్చాను. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాన'ని సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వ్యక్తిగతంగా మరింత డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి సొంత డబ్బులు ఇవ్వకుండా విరాళాలపైనే ఆధారపడుతున్నారని ఆక్షేపించారు. హిల్లరీ అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుస్తారన్న భరోసాతో ఆమెకు విరాళాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రైమరీ ఎన్నికల సమయంలో తాను విరాళాలు తీసుకోలేదని, అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాతే పార్టీ గెలుపు కోసం విరాళాలు తీసుకుంటున్నట్టు ట్రంప్ వివరించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఎంత డబ్బు ఇవ్వగలరని ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. 'బ్రెగ్జిట్'ను తాను ముందే ఊహించానని, కానీ బయటకు చెప్పలేదని... అలాగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఖాయమని తనకు తెలుసునని ట్రంప్ అన్నారు. హిల్లరీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. -
ఆల్టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: దేశంలోని విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 1.22 బిలియన్ డాలర్ల మేర ఎగసి 371.99 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఆల్టైం గరిష్ట స్థాయి. విదేశీ కరెన్సీ అసెట్స్లో పెరుగుదల కారణంగానే ఫారెక్స్ నిల్వలు సరికొత్త శిఖరాగ్రానికి ఎగసినట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.46 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 346.71 బిలియన్ డాలర్లుగా చేరాయి. బంగారం నిల్వలు 236.4 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 21.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 370.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఫారెక్స్ నిల్వల గరిష్ట స్థాయి ఇదివరకు (సెప్టెంబర్ 9తో ముగిసిన వారంలో) 371.27 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సత్య నాదెళ్ల జీతం తగ్గిందట..!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే తగ్గింది. దాదాపు 3.3శాతం తగ్గి 18(17.7) మిలియన్ డాలర్లకు చేరింది. సోమవారం సంస్థ అందించిన ప్రిలిమినరీ ప్రాక్స్ స్టేట్ మెంట్ ఫైలింగ్ ప్రకారం రూ. 120 కోట్ల వేతనం సహా బోనస్ 12 మిలియన్ల డాలర్ స్టాక్ అవార్డు లభించనుంది. ఆయనకు చెల్లించిన ప్యాకేజీలో 5.66 మిలియన్ డాలర్ల వేతనం, బోనస్, 12 మిలియన్ డాలర్ల వాటాలు ఉన్నాయి. రెగ్యులేటరీ ఫైలింగ్లో సంస్థ ఈ విషయాలను పేర్కొంది. ఈ వాటాల్లో సగం 2018 నాటికి సత్య నాదెళ్లకు అందుతాయి. కంపెనీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరితే 2019లో మిగిలిన వాటాలు కూడా ఆయనకు అందుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సత్యనాదెళ్లను సీఈవోగా నియమించుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయనకు 59 మిలియన్ డాలర్ల విలువైన వాటాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో వీటిని మూడు విడతలుగా ఇవ్వనున్నారు. 2019, 2020, 2021లో చెల్లించనున్నారు. ఇవి ఇవ్వాలంటే ఎస్అండ్పీ 500లోని దాదాపు 60శాతం కంపెనీల వాటాదారుల ఆదాయాం కంటే మైక్రోసాఫ్ట్ వాటాదారుల ఆదాయం ఐదేళ్లపాటు ఎక్కువగా ఉండాలి. సత్యనాదెళ్ల పదవి చేపట్టినప్పటి నుంచి కంపెనీ ఆదాయం దాదాపు 70శాతం పెరిగినట్లు సమాచారం. ఈ 12నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 15శాతం పెరుగుదలను నమోదు చేయగా, అదే సమయంలో ఎస్అండ్పీ500 మాత్రం ఒక శాతం మాత్రమే పెరిగడం గమనార్హం. కాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా గత జులైలోరాజీనామా చేసిన కెవిన్ ట్యూనర్ 2016 సం.రానికి గాను 13 బిలియన్ డాలర్ల వేతనంతో సెకండ్ హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పీటీ వూటన్ ఈ ప్యాకేజీపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
పుంజుకున్నచమురు ధరలు
లండన్: ఒపెక్ డీల్ కు పెట్టుబడిదారుల మద్దతు లభించినట్టు కనిపిస్తోంది. అల్జీరియా నాన్ ఒపెక్, ఒపెక్ దేశాల సమావేశం నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 50 డాలర్లను అధిగమించింది. ఆగస్ట్ తరువాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు ర్యాలీ అయ్యాయి. యూరోప్, ఆసియా మార్కెట్లు పెద్ద మార్కెట్లు గా ఉండగా, జర్మనీ, చైనా మార్కెట్లకు సోమవారం సెలవు. గత వారం అల్జీరియాలో జరిగిన రష్యా వంటి నాన్ ఒపెక్ దేశాలతో ఒపెక్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. గతరెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం దిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో 1 శాతం పెరిగి 50.69 డాలర్ల వద్ద ఉండగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది. -
భారీగా పుంజుకున్న రూపాయి
ముంబై: బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడ్ నిర్ణయంతో దేశీయ కరెన్సీ భారీగా పుంజుకుంది. ఆరంభంలో డాలరుతో పోలిస్తే రూపాయి బలపడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 18పైసలు లాభంతో 66.85 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆలోచనను మరోసారి వాయిదా వేయడంతో డాలర్ బలహీనపడిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సానుకూల ప్రభావంతో రూపాయి డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఎగుమతిదారులు బ్యాంకుల డాలర్ అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. మరోవైపు ఫెడ్ జోష్తో బ్యాంకింగ్ సెక్టార్ లో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. పీఎస్యూ బ్యాంక్ సూచీ 2.2 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.6 శాతానికి పైగా లాభపడింది. పీఎన్బీ, బీవోఐ, బీవోబీ, స్టేట్బ్యాంక్, ఐడీబీఐ, ఓబీసీ లతో పాటు ప్రయివేటు బ్యాంకుల హవా సాగుతోంది. ఐసీఐసీఐ, కెనరా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లవైపు అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్ల ఆసక్తి కనపడుతోంది. యథాతథ పాలసీ అమలుకే ఫెడ్ కట్టుబడటంతో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ నేలచూపులు చూస్తోంది. మరోవైపు బుధవారం బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా నెగిటివ్ ఇంట్రెస్ట్ రేటుతో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. -
ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో డీల్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. విత్తనాలు, క్రిమిసంహారకాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్న బహుళజాతి దిగ్గజం మోన్సాంటో విలీనానికి అంగీకరించినట్టు బేయర్ తెలిపింది. 66 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు) ఈ ఒప్పందం జరిగినట్టు తెలిపింది. దీంతో ప్రపంచ ఫర్టిలైజర్స్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ కుదిరినట్టయింది. మాన్ శాంటో షేర్ హోల్డర్స్, యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ ఆమోదంతో ఈ విలీన ప్రక్రియ పూర్తికానుంది. అన్ని నగదు పరిశీలనలో తమ వాటాదారుల అత్యధిక నిర్బంధిత విలువ ప్రాతినిధ్యం ఆధారంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు మోన్ శాంటో కంపెనీ ఛైర్మన్ , సీఈవో హ్యూ గ్రాంట్ ప్రకటించారు. ప్రస్తుత మాన్ శాంటో ఉత్తర అమెరికన్ వ్యాపార ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిస్, మిస్సోరి నుంచే తమ వ్యవసాయ ఆధార విత్తనాలు వ్యాపారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. గతకొంతకాలంగా అమెరికా కేంద్రంగా ఉన్న మోన్సాంటోను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బేయర్ సంస్థ ఒక్కో మాన్ శాంటో ఈక్విటీ షేరుకు 128 డాలర్లను అందించనుంది. గతంలో 122 డాలర్లను ఆఫర్ చేసిన సంస్థ చివరికి128 డాలర్లకు అంగీకారం తెలపడం విశేషం. ఇది మే 9 నాటి మాన్ శాంటో షేరుకు 44 శాతం ప్రీమియమని బేయర్ వర్గాలు వెల్లడించాయి. మాండేటరీ కన్వర్టిబుల్ బాండ్, అండ్ రైట్స్ ఇష్యూ తో సహా రుణ ఈక్విటీ కింద 19 బిలియన్ డాలర్ల నగదును జారీ చేయనున్నట్టు తెలిపింది. -
ఆ వివాదంలో టీసీఎస్కు ఊరట
ముంబై: అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సుమారు 175 కోట్లను చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ జాయింట్ డెవలప్మెంట్ ద్వారా ఆటోమేటెడ్ ఇన్ కమ్ టాక్స్ సిస్టం రిప్లేస్మెంట్ సందర్భంగా ఈ వివాదం తలెత్తింది. దీంతో 2013 లో ఆరెంజ్ కౌంటీ టీసీఎస్ పై దావా వేసింది. మూడు సంవత్సరాలు సాగిన ఈ వివాదంలో 26 మిలియన్ల డాలర్లకు (రూ.1,74, 57, 70, 000) అమెరికా ఆరెంజ్ కౌంటీ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ఇరు పార్టీలు అంగీకరించామని టీసీఎస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు కాంట్రాక్ట్ విలువ రూ.6.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా సెటిల్ మెంట్ విలువ నాలుగు రెట్లు ఎక్కువనీ, నిజానికి తాము ఐదు రెట్లు మొత్తాన్ని టాటాకి చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు. అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఆస్తి పన్ను నిర్వహణ వ్యవస్థ రీప్లేస్ మెంట్ కు కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2010లోనే ముగిసినప్పటికీ జారీ చేయలేదు. దీంతో ఆరెంజ్ కౌంటీ కోర్టుకెక్కింది. చివరికి 26 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు టీసీఎస్ అంగీకరించడంతో ఈ వివాదానికి తెరపడింది . -
సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు
lన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.భారత్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను ఫండింగ్ చేయనున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. పోషణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు మద్దతు అందించే చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి. ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి తో భేటీ అయిన కిమ్ ఫోటోను క ట్వీట్ చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి 30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల (6వేల 750 కోట్లను) నిధులను ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఎ)తో దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఆ తర్వాత అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే. -
భారత్ వైపు చూస్తున్న మెక్ డొనాల్డ్
వాషింగ్టన్ : అమెరికాలో ఇబ్బందులు పడుతున్న ఫుడ్ సప్లయ్ జెయింట్ మెక్ డొనాల్డ్ కంపెనీ భారత ఉద్యోగులవైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్..500 మిలియన్ల డాలర్ల కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇండియానుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఈస్టర్ బూక్ నేతృత్వంలో 500 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించబోతుందని పేర్కొంది. 2015లో అమెరికాలో 400 మంది ఉద్యోగులను తొలగించిన మెక్డొనాల్డ్ అభివృద్ధి స్తంభించిందని తెలిపింది. ఇప్పటికే వివిధ రకాలుగా భారత్ మార్కెట్ లోకి ఎంటరైనా సంస్థ అక్కడి ఉద్యోగులకోసం చూస్తోందని పేర్కొంది. అయితే అకౌంటింగ్ ఫంక్షన్ సహా తమ వ్యాపారాన్ని అనేక కోణాల్లో శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించుకునే క్రమంలోనే ఈ చర్యలని సంస్థ ప్రతినిధి టెర్రీ హికీ చెప్పారు. 2017లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నామన్నారు. అలాగే ఖర్చును తగ్గించుకోనున్నామని సంస్థ వెల్లడించింది. అయితే మెక్ డొనాల్డ్ అమెరికాలో ఉన్న ప్రాంతీయ ఆఫీసులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో 40 గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 25కి చేరడం విశేషం. కాగా కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. తమకు చాలీ చాలని జీతాలు ఇస్తూ.. ఉద్యోగులను సంస్థ వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
జోరుగా పసిడి, హుషారుగా కరెన్సీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ తగ్గుతుండడంతో భారతీయ కరెన్సీ రూపాయి పుంజుకుంటోంది. సోమవారం నాటి మార్కెట్ లో డాలర్ 24 పైసల నష్టంతో ప్రారంభమైంది. దీంతో నష్టాలనుంచి తేరుకున్న రూపాయి మళ్ళీ 67రూ. మార్క్ దగ్గర స్థిరంగా ఉంది. 0.43 శాతం లాభంతో 67.05 దగ్గర కొనసాగుతోంది. దిగుమతిదారులు, బ్యాంకర్లు నుంచి డిమాండ్ తగ్గడంతో అమెరికన్ కరెన్సీ బలహీనంగా ట్రేడవుతోంది. దీనికి తోడు బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో రూపాయి పుంజుకుంది. ఈ నేపథ్యంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ 67రూ. మార్కును తాకింది. శుక్రవారం రోజు 5 పైసల నష్టంతో 66,76 దగ్గర ముగిసిన రూపాయి విలువ క్రమేపి బలపడి స్థిరంగా కొనసాగడం శుభసూచకమని విశ్లేషకుల అంచనా . బ్యాంకులు , దిగుమతిదారులునుంచి డిమాండ్ తగ్గడం, బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రభావంతో డాలర్ నిరంతర జోరుకు బ్రేక్ పడి, రూపాయి పుంజుకుంటోంది. మరోవైపు సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు పతనం దిశగా మళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , నిఫ్టీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 332 పాయింట్ల నష్టంతో 26,229 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 వేల వందకు దిగువన .. నష్టాల్లో కొనసాగుతోంది. మిగిలిన అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనంగాఉండడం కూడా రూపాయి విలువ పెరగడానికికారణమని డీలర్లు చెప్పారు. అటు డాలర్ బలహీనతతో పసిడి కూడా జోరుమీద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో ఇటీవల వెలవెలబోయిన పసిడి తిరిగి బలపడుతోంది. ఒకవైపు డాలర్ క్షీణత, మరోవైపు ఫెడ్ వడ్డన ఉండదన్న అంచనాల నేపథ్యంలో పసిడి ధర తిరిగి పుంజుకుని..10 గ్రా. బంగారం ధర 30 వేల మార్క్ ను దాటగా..వెండి 41 వేల దగ్గర స్థిరంగా ఉంది. -
100 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాడంట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేయనున్నారు. నవంబర్ లో జరిగే అసలైన పోరుకోసం తన సొంత ఖాతా నుంచి విరాళాల సేకరణ ద్వారా దాదాపు 100కోట్ల డాలర్లు వెచ్చించనున్నారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే అత్యంత భారీ వ్యయంగా నిలవనుంది. తన సొంతంగా భారీ మొత్తంలో ఖర్చుచేయడంతోపాటు నిధుల సేకరణ కూడా చేయనున్నానని, తాను ఊహించిన దానికంటే ఎక్కువగానే విరాళాలు రావొచ్చని అవి 100 కోట్ల డాలర్లు ఉండొచ్చని ఆయన చెప్పారు. వర్జీనియా, నెబ్రాస్కాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. -
దివాళా తీసినా 66 లక్షలు విరాళమిచ్చిన సింగర్!
న్యూయార్క్: దివాళా తీసి ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ ర్యాపర్ '50 సెంట్'.. స్వచ్ఛంద సంస్థ 'ఆటిజం స్పీక్స్'కు లక్ష డాలర్లు (రూ. 66 లక్షలు) విరాళంగా ఇచ్చాడు. ఇటీవల ఈ ర్యాపర్ ఓ ఆటిజం బాధితుడిని పరిహాసమాడాడు. సిన్సినాటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 19 ఏళ్ల ఆండ్యూ ఫారెల్ ను చూసి.. అతడు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని భావించి, అతన్ని తూలనాడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఫారెల్ సవతి తండ్రి వెంటనే స్పందించి..తన కొడుకు ఆటిజం బాధితుడని వివరణ ఇచ్చాడు. దీంతో చలించిపోయిన '50 సెంట్' వెంటనే ఫారెల్ కు తన క్షమాపణలు చెప్పాడు. అతడి పట్ల తన దుందుడుకు ప్రవర్తనకు చింతిస్తూ.. ఆటిజంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహనకు కృషిచేస్తున్న 'ఆటిజం స్పీక్స్' సంస్థకు రూ. 66 లక్షలు విరాళంగా ఇచ్చాడు. తన సహచర సంగీత కళాకారులు కూడా ముందుకొచ్చి తమవంతుగా కొంత విరాళం ఇవ్వాలని, ఆటిజంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరాడు. 'డా క్లబ్' సింగర్ అయిన '50 సెంట్' అసలు పేరు కర్టిస్ జాక్సన్. తాను దివాళా తీసి ఆర్థిక కష్టాల్లోఉన్నట్టు అతను గత ఏడాది కనెక్టికట్ కోర్టుకు తెలిపాడు. -
వెయిట్రెస్కు భారీ టిప్ ఇచ్చిన హీరో
న్యూయార్క్: హోటల్లో రుచికరమైన వంటకాలు వడ్డించే వెయిటర్లకు టిప్ ఇవ్వడం సర్వసాధారణమే. కానీ హాలీవుడ్ హీరో జిమ్ క్యారీ ఓ మహిళా వెయిటర్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమెకు ఏకంగా 224 డాలర్లు (రూ. 15వేలు) టిప్గా ఇచ్చాడు. 'లయర్ లయర్', 'ద మాస్క్' వంటి చిత్రాల్లో నటించిన ఈ 53 ఏళ్ల నటుడు న్యూయార్క్ సిటీలో స్నేహితులతో కలిసి జల్సా చేశాడు. మిట్ప్యాకింగ్ జిల్లాలోని ప్రముఖ చెస్టర్ రెస్టారెంట్లో మిత్రులకు పార్టీ ఇచ్చాడు. సంప్రదాయ అమెరికన్ ఆహారం అందించడంలో పేరొందిన ఈ రెస్టారెంట్లో పాయింట్ నాయిర్ వైన్, లెమన్ చికెన్.. తదితర రుచికరమైన వంటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మంచి మూడ్లో ఉన్న ఆయన మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారని, వెయిట్రెస్కు 224 డాలర్ల టిప్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విందులో స్నేహితులతో ఆయన చాలా సంతోషంగా గడిపారని న్యూయార్క్ పోస్టు తెలిపింది. గేన్స్వూర్ట్ హోటల్ లో భాగమైన ఈ రెస్టారెంట్లో వెయిటర్లకు జీతం కన్నా టిప్పే అధికంగా లభిస్తుందని చెప్తున్నారు. గతంలోనూ చాలామంది సెలబ్రిటీలు ఇక్కడ వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చారు. -
నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: నాట్కో ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్లలో అమెరికా ఎఫ్డీఏ ఇటీవల తనిఖీలు జరిపింది. చెన్నై సమీపంలోని మనాలిలో ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్ తయారు చేసే ప్లాంట్లోనూ, హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులోని ఫార్మాస్యూటికల్ ప్లాంట్ల్లో యూఎస్ఎఫ్డీఏ ఈ తనిఖీలు నిర్వహించిందని నాట్కో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిల్లో ఈ తనిఖీలు జరిగాయని పేర్కొంది. ఈ రెండు ప్లాంట్లకు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ 483 అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అయితే అవి స్వల్పమైనవేనని వివరించింది. వీటికి తగిన స్పందనను ఎఫ్డీఐకి నివేదించామని, ఈ రెండు ప్లాంట్ల ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన ప్రభావం ఉండబోదని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేరు 13 శాతం క్షీణించి రూ. 1,409 వద్ద ముగిసింది. -
బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికల నేపథ్యంలో భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేయాలని డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం 25.57% వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు బైబ్యాక్ ద్వారా వాటా పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్పై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2,887 వద్ద కదులుతోంది. -
'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి'
హ్యూస్టన్: తనను అరెస్టు చేసి అవమానించిన వారు దాదాపు రూ.వందకోట్లు (రూ.99,54,81,179.1)-(15 మిలియన్ డాలర్లు)) చెల్లించాలని, లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేశాడు. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు సొంత తెలివి తేటలతో అలారం గడియారాన్ని తయారు చేసి స్కూల్ కి తీసుకురాగా దానిని బాంబు అనుకొని భ్రమపడి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఆ విద్యార్థి ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివి తేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు కూడా. వైట్ హౌస్ ఇప్పటికే అతడిని సత్కరించింది. అయితే, ఖతార్ లోని ఓ ముస్లిం ఫౌండేషన్ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకు రావడంతో అతడు త్వరలో అక్కడికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసిన ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ క్షమాపణలు చెప్పాలని పది మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని, అలాగే, తనను తప్పుగా అర్థం చేసుకొని ఓ ముస్లిం విద్యార్థిపట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించడంతో పాటు తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ విద్యార్థి తరుపు న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించారు. -
'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'
వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే. సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది. -
సూచీ శకం ప్రారంభం!
-
సూచీ శకం ప్రారంభం!
♦ మయన్మార్ ఎన్నికల్లో ఆమె పార్టీకి పూర్తి మెజారిటీ! ♦ అధికార సైనిక కూటమికి చుక్కెదురు యాంగూన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి విడత సీట్లలో యాంగూన్లోని 57 పార్లమెంట్ స్థానాలకు గానూ 56 సీట్లను ఎన్ఎల్డీ గెలుచుకుంది. 44 దిగువ సభ స్థానాలను, 12 ఎగువ సభ స్థానాలను గెలుచుకున్నట్లు ఎన్ఎల్డీ ప్రకటించింది. ఒక పార్లమెంటు సీటును యూఎస్డీపీ గెలుచుకుంది. యాంగూన్ ప్రాంతీయ పార్లమెంటులోని 90 స్థానాలకు గానూ అత్యధికంగా 87 సీట్లలో ఎన్ఎల్డీ విజయం సాధించింది. మయన్మార్లో ప్రధాన ఎన్నికలతో పాటు ప్రాంతీయ పార్లమెంట్లకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. పూర్తిస్థాయి ఓట్ల లెక్కింపుకు 10 రోజుల సమయం పడ్తుందని ఆదివారం పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫలితాల సరళి నేపథ్యంలో ఎన్ఎల్డీ పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎర్ర చొక్కాలతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాల ప్రత్యక్ష, పరోక్ష సైనిక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతోందన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 70% పైగా సీట్లను సాధించనున్నామని ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి విన్ టీన్, 90% పైగా గెలుస్తామని మరో అధికార ప్రతినిధి న్యాన్ విన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టేందుకు అందుబాటులో ఉన్న పార్లమెంటు సీట్లలో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ గెల్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ అధికారం కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో 25% సీట్లను అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ)కి కట్టబెడ్తూ రాజ్యాంగంలో రాసుకున్నారు. అందువల్ల మొత్తం 664 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 67% సీట్లను ఎన్ఎల్డీ సాధించగలిగితేనే.. అధికార యూఎస్డీపీ, దాని సైనిక మిత్రపక్షాలను ఓడించగలుగుతుంది. గెలిచినా సూచీ అధ్యక్షురాలు కాలేరు ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిచినా పార్టీ అధినేత అంగ్సాన్ సూచీ (70) దేశాధ్యక్షురాలు కాలేరు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం జీవిత భాగస్వామి విదేశీయులైనా, విదేశీ పౌరసత్వం గల పిల్లలున్నా.. ఆ వ్యక్తి దేశానికి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు కావడానికి వీల్లేదు. సూచీ దివంగత భర్త బ్రిటన్కు చెందిన వారు. ఆమె పిల్లలిద్దరికీ బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఎన్నికల్లో ఎన్ఎల్డీ గెలిస్తే.. అధ్యక్షురాలిగా కాకున్నా.. దేశ అత్యున్నత నాయకురాలిగా దిశానిర్దేశం చేస్తానని సూచీ స్పష్టం చేశారు. -
10 నెలల గరిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
-
10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
ముంబై: రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోల్చితే పది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈరోజు రూపాయి విలువ 31పైసలు పడిపోయి 62.33 రూపాయలకు తగ్గింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యుఎస్ డాలర్తో రూపాయి విలువను 62.2059గా నిర్ధారించింది. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 1091పాయింట్లు పడిపోయింది. నవంబరు 28న సెన్సెక్స్ 28,694 ఉండగా, ఈరోజు 27,602 కి పడిపోయింది. గత పది సెషన్లలో నిఫ్టీ 296 పాయింట్లు పడిపోయింది. గత నెల 28న నిఫ్టీ 8588 ఉండగా, ఈరోజు 8293కు పడిపోయింది. ** -
పెరిగిన బంగారం ధర
హాంగ్ కాంగ్: బంగారం ధర హాంగ్ కాంగ్ మార్కెట్ లో పెరిగింది. మంగళవారం మార్కెట్ ప్రారంభం కాగానే పసిడి ధర 140 హాంగ్ కాంగ్ డాలర్లు పెరిగింది. దీంతో టయల్ బంగారం ధర 11,190 హాంగ్ కాంగ్ డాలర్లకు చేరుకుందని చైనీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్స్ఛేంజ్ సొసైటీ ప్రకటించింది. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1212.01 అమెరికన్ డాలర్లగా ఉందని తెలిపింది. అమెరికా డాలర్ పోలిస్తే హాంగ్ కాంగ్ డాలర్ మారకం విలువ 7.75గా ఉంది. -
విమానంలో ఓ ముద్దు... జైలు పాలు చేసింది !
న్యూయార్క్: ఆయన వయస్సు 62 ఏళ్లు... విమానంలో ప్రయాణిస్తూ... తన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా... ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి తోటి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన అమెరికాలో హ్యూస్టన్ నుంచి నెవార్క్కు యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో వెళ్తుండగా చోటు చేసుకుంది. నిందితుడి ఎన్నారై దేవేందర్ సింగ్గా గుర్తించామని... అతడి స్వస్థలం ల్యూసియానా అని చెప్పారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దేవేందర్ సింగ్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 250,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. నిందితుడు దేవేందర్ సింగ్ను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఇండియా సిమెంట్స్కు నష్టం రూ. 31 కోట్లు
చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్లో సిమెంట్కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది. -
రూపాయి జూమ్
ముంబై: ఎన్డీయే ఘన విజయంతో రూపాయి దూసుకుపోయింది. డాలర్తో పోలిస్తే 50 పైసలు పెరిగి 58.79 వద్ద ముగిసింది. ఇది 11 నెలల గరిష్టం. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కొనసాగించడంతో రూపాయి వరుసగా మూడో రోజూ బలపడినట్లయింది. గడచిన 3 రోజుల్లో రూపాయి మారకం విలువ మొత్తం 126 పైసలు (2.10 శాతం) పెరిగింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 59.29 కన్నా మెరుగ్గా 59 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 58.62 - 59.11 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 0.84 శాతం లాభంతో 58.79 వద్ద ముగిసింది. 2013 జూన్ 19 తర్వాత రూపాయి మారకం విలువ ఈ స్థాయికి రావడం ఇదే ప్రథమం. అప్పట్లో దేశీ కరెన్సీ 58.70 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 3,635 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేయడం.. రూపాయి విలువ పెరిగేందుకు దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో భారత మార్కెట్లపై ఆశాభావం పెరిగిందని అడ్మిసి ఫారెక్స్ ఇండియా డెరైక్టర్ సురేశ్ నాయర్ చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం తీసుకోబోయే ఆర్థిక, ద్రవ్యపరమైన చర్యలు భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్పై ప్రభావాలు చూపే అవకాశం ఉందని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ తెలిపింది. -
రూపాయి భారీ పతనం
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ భారీ కుదుపునకు గురైంది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 73 పైసలు క్షీణించి 62.66కు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 11(77 పైసలు పతనం) తర్వాత రూపాయి ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పటిష్టమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం కూడా ప్రభావం చూపినట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ నీరసించినా కూడా రూపాయికి మద్దతు లభించలేదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. చైనా జీడీపీ, పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల్లో కోత(ట్యాపరింగ్) అంశాలవల్ల రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్లో కొనుగోలులో 10 బిలియన్ డాలర్లను(ఈ నెల నుంచే) కోత పెడుతూ గత నెలలో ఫెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష జరగనుంది. 28న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే నిర్ణయాలు రూపాయి కదలికలకు కీలకం కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
రూపాయి 58 పైసలు డౌన్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట, ఎగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ప్రభావంతో రూపాయి భారీగా క్షీణించింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 58 పైసలు నష్టపోయి 61.83 వద్ద ముగిసింది. నెలరోజుల వ్యవధిలో ఇంత ఎక్కువగా పతనం కావడం ఇదే తొలిసారి. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్)ను మొదలుపెట్టొచ్చనే భయాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ పుంజుకుంటోందని, ఇది దేశీ కరెన్సీపై ప్రతికూలతకు దారితీస్తున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. చమురు కంపెనీల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ పెరగడం, స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజూ నష్టాల్లోకి జారిపోవడం వంటివి రూపాయి సెంటిమెంట్ను బలహీనపరిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. -
స్వాప్తో 25 బిలియన్ డాలర్లు
ముంబై: స్వాప్ విండో ద్వారా బ్యాంకులు ఇప్పటి వరకూ 25 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ సోమవారం తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీ కరెన్సీ రుణాల ద్వారా ఈ మొత్తాన్ని బ్యాంకులు సమీకరించినట్లు తెలిపారు. రూపాయి బలోపేతానికి ప్రవేశపెట్టిన ఈ పథకం నవంబర్తో ముగియాల్సి ఉంది. అయితే దీనిని ఇటీవలే ఆర్బీఐ డిసెంబర్ వరకూ పొడిగించింది. డిసెంబర్ చివరికల్లా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇండెక్స్డ్ బాండ్లను ఆర్బీఐ ఆవిష్కరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
నియంత్రణ అడ్డంకులు తొలగాలి
న్యూయార్క్: వృద్ధి పథంలో మరింత దూసుకెళ్లే సత్తా భారత్కు ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధి పరుగులు తీయాలంటే ప్రభుత్వం నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే రూపొందించిన ‘రీఇమేజినింగ్ ఇండియా: అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియా నెక్స్ట్ సూపర్పవర్’ అనే పుస్తకంలో ‘మేకింగ్ ద నెక్స్ట్ లీప్’ అనే పేరుతో అంబానీ ఒక వ్యాసాన్ని రాశారు. ‘రానున్న కాలంలో భారత్కు వృద్ధి రేటు ప్రస్థానంలో మరింత దూసుకుపోయే సామర్థ్యం ఉందని నా విశ్వాసం. దీనికి అండగా, భారత్ సమగ్రమైన, విప్లవాత్మకమైన చర్యలను చేపట్టడం చాలా ముఖ్యం. ఏదోనామమాత్రపు చర్యలతో సరిపెడితే కుదరదు. దేశంలో ఇంకా ఆర్థిక సాధికారతకు దూరంగా ఉన్న కోట్లాదిమంది ప్రజలకు ఈ ఫలాలను అందించడం, అదేవిధంగా యువతకు మరిన్ని ఉద్యోగాలను కల్పించాలంటే ప్రజలు, ప్రభుత్వ, వ్యాపార రంగం కలిసికట్టుగా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యువతే మనకు అండ... 2030 కల్లా చైనాను వెనక్కినెట్టి జనాభాలో అగ్రస్థానానికి భారత్ చేరే అవకాశం ఉందని, అయితే యువ భారత్ మనకు అత్యంత కలిసొచ్చే అంశమని చెప్పారు. దాదాపు మూడింట రెండొతుల మంది జనాభా 35 ఏళ్లలోపే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. -
టేపరింగ్ భయాలతో రూపాయి డౌన్
ముంబై: అమెరికాలో సహాయక ప్యాకేజీ ఉపసంహరణ (టేపరింగ్) భయాలతో దేశీ స్టాక్మార్కెట్ల తరహాలోనే రూపాయి మారకం విలువ కూడా గురువారం పతనమైంది. డాలర్తో పోలిస్తే 36 పైసలు క్షీణించి 62.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) స్టాక్స్ కొనుగోళ్లు తక్కువ చేయడం, దిగుమతిదారుల (చమురు రిఫైనింగ్ సంస్థలు) నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగటం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.57 కన్నా బలహీనంగా 62.85 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.58 శాతం క్షీణతతో 62.93 వద్ద ముగిసింది. అమెరికాలో రిటైల్ అమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండటం డాలర్ బలపడేందుకు తోడ్పడిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. -
రూపాయికి నాలుగో రోజున నష్టాలే!
దిగుమతిదారుల డిమాండ్ కారణంగా ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్సెంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి వరుసగా నాలుగో రోజు నష్టపోయింది. ఆరంభంలోనే డాలర్ తో పోల్చితే రూపాయి 63 ఎగువన ట్రేడ్ అయింది. ప్రస్తుతం నిన్నటి ముంగింపు (62.47)తో పోల్చితే.. 79 పైసలు నష్టపోయి 63.29 వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి పతన ప్రభావంతో ఇన్నెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. దాంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్ ఓ దశలో 152 పాయింట్ల కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 20555 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 6099 వద్ద కొనసాగుతున్నాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో కెయిర్న్, టీసీఎస్, మారుతి సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఐటీసీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్, ఎన్ఎమ్ డీసీ, డీఎల్ఎఫ్, హిండాల్కోలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. -
70 బిలియన్ డాలర్లలోపే క్యాడ్: రంగరాజన్
చెన్నై: ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డాలర్ మారకంలో రూపాయి విలువ సైతం స్థిరపడిన సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ (ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని 3.7 శాతానికి (77 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా బంగారం దిగుమతుల కట్టడి ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. -
66% పెరగనున్న భారత్ కుబేరులు
ముంబై: మరో అయిదేళ్లలో భారత్లో కుబేరుల సంఖ్య 66% పెరిగి 3.02 లక్షలకు చేరనుంది. ప్రస్తు తం ఈ సంఖ్య 1.82 లక్షలుగా ఉంది. క్రెడిట్ సూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నాలుగో వార్షిక ప్రపంచ సంపద నివేదిక 2013లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, 2000 నుంచి భారత్లో సంపద సృష్టి గణనీయంగా వేగం పుంజుకుంది. మధ్య మధ్యలో కరెన్సీ పతనం వంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఒక్కొక్కరి సంపద వార్షికంగా సగటున 8% మేర పెరిగింది. మరోవైపు, భారత్లో సంపద ఈ ఏడాది మధ్య నాటికి 7.4% పెరిగి 3.4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరిందని పేర్కొంది. దేశీయంగా కేవలం 0.4% మంది జనాభా వద్ద మాత్రమే 1 లక్ష డాలర్ల (సుమారు రూ. 61 లక్షలు) పైన సంపద ఉన్నట్లు తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే 28 లక్షల మంది జనాభాగా లెక్కగట్టింది. ఒకవైపు సంపద పెరుగుతున్నప్పటికీ ప్రజలందరికీ వృద్ధి ప్రయోజనాలు దక్కడం లేదని వివరిం చింది. ఇంకా చాలా పేదరికం ఉందని పేర్కొంది. 94% మంది వయోజనుల సంపద 10,000 డాలర్ల కన్నా తక్కువ ఉండటమే ఇందుకు నిదర్శనమని వివరించింది. 10 కోట్ల డాలర్ల పైబడిన అత్యంత సంపన్నుల సంఖ్య 770గా ఉండగా, 5 కోట్ల డాలర్ల పైబడిన సంపద కలవారి సంఖ్య 1,760గా ఉందని పేర్కొంది. -
రూపాయి అర శాతం అప్..
ముంబై: వరుసగా క్షీణించిన రూపాయి మారకం విలువ బుధవారం మళ్లీ పెరిగింది. డాలర్తో పోలిస్తే 31 పైసలు బలపడి 62.44 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం దీనికి దోహదపడింది. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.75తో పోలిస్తే కాస్త బలహీనంగా 62.76 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో 62.88 స్థాయికి కూడా తగ్గింది. అయితే, బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో మళ్లీ కోలుకుని 62.31కి ఎగిసి చివరికి 0.49 శాతం లాభంతో 62.44 వద్ద ముగిసింది. కార్పొరేట్లు.. ప్రధానంగా ఐటీ ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయించడం కూడా ఇందుకు దోహదపడి ఉండొచ్చని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు. క్రితం మూడు సెషన్లలో రూపాయి మారకం విలువ 98 పైసల మేర పతనమైంది. రూపాయి ట్రేడింగ్ 62-63 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
రూపాయి 37 పైసలు డౌన్
ముంబై: డాలరుతో మారకంలో రూపాయి విలువ ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 37 పైసలు బల హీనపడి 62.60 వద్ద ముగిసింది. నెలాఖరుకావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిం ది. దీనికితోడు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రెపో రేటు ను పెంచడంతో వరుసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్లో రూపాయి తొలుత 62.55 వద్ద బలహీనంగా మొదలైంది. క్రితం ముగింపు 62.23కాగా, 62.34-62.73 మధ్య ఊగిసలాడింది. -
అమెరికా చదువులపై డాలర్ ఎఫెక్ట్ లేదు: వెల్ప్స్
ఓవైపు డాలర్ కొండెక్కుతున్నా... అమెరికాలో చదువుకు డిమాండ్ తగ్గలేదు. ది యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శనివారం తాజ్ దక్కన్లో జరిగిన ‘యూఎస్ యూనివర్సిటీస్ ఫెయిర్’కు విద్యార్థులు వెల్లువెత్తారు. పెద్దసంఖ్యలో ప్రదర్శనకు హాజరై అమెరికా చదువులు, వీసా దరఖాస్తు విధానాలపై తెలుసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ ప్రజాసంబంధాల అధికారి ఏప్రిల్ వెల్ప్స్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్నత విద్య పై భారతీయ తల్లిదండ్రులకు ఎంతో నమ్మకమని అందువల్లే ఏటా భారత్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ దేశం వస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారిపై ‘డాలర్’ ప్రభావం ఉండదన్నారు. విద్యార్థులకు యూఎస్ వర్సిటీలపై అవగాహన కల్పించేందుకు ఫెయిర్ ఉపయోగపడుతుందన్నారు. సాధారణంగా భారత్ నుంచి పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారని చెప్పారు. గత నాలుగైదేళ్లలో డిగ్రీ స్థాయి కోర్సుల్లో చేరేందుకు సైతం భారతీయులు మొగ్గుచూపుతున్నట్లు వివరించారు. గత ఏడాది లక్షమంది విద్యార్థులు భారత్ నుంచి యూఎస్ వీసా పొందారని తెలిపారు. కాగా, ఫెయిర్లో అమెరికాకు చెందిన 25 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొని తమ వద్ద ఉన్న అవకాశాల గురించి వివరించారు. వీసాపై అవగాహన సదస్సు ప్రదర్శనకు వచ్చిన విద్యార్థుల కోసం ‘వీసా’కి సంబంధించిన సమాచారంపై సదస్సును నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఎడ్యుకేషన్ వీసా పొందడంలో తామెదుర్కొన్న ఇబ్బందులపై అధికారులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఎడ్యుకేషన్ వీసా వివరాల కోసం 1800 103 1231 టోల్ ఫ్రీ నంబర్లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య) తెలుసుకోవచ్చని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజి సైతం ఉందన్నారు. -
మార్కెట్లు... ఎక్కడివక్కడే
నాలుగు రోజుల దూకుడు తరువాత స్టాక్ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ మొదలైన తొలి అర్ధగంటలోనే సెన్సెక్స్ గరిష్టంగా 20,055 పాయింట్లను తాకింది. ఆపై పెరుగుతూ వచ్చిన అమ్మకాలతో మిడ్ సెషన్లో కనిష్టంగా 19,777 పాయింట్లకు చేరింది. గరిష్టస్థాయి నుంచి దాదాపు 280 పాయింట్ల తిరోగమనమిది! అయితే చివరి అర్ధగంటలో కొనుగోళ్లు పుంజుకోవడంతో మరోసారి 20,028 పాయింట్లకు ఎగసింది. ఆపై మళ్లీ అమ్మకాలు పెరగడంతో లాభాలను పోగొట్టుకుంది. వెరసి చివరికి యథాతథంగా 19,997 వద్దే సెన్సెక్స్ నిలిచింది. ఇదేబాటలో ఒడిదొడుకులను చవిచూసిన నిఫ్టీ మాత్రం ముగింపులో 16 పాయింట్లు లాభపడి 5,913 వద్ద స్థిర పడింది. కాగా, మంగళవారం సెన్సెక్స్ గత నాలుగేళ్లలో లేని విధంగా 727 పాయింట్లు జంప్ చేసిన విషయం విదితమే. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, సిరియా ఆందోళనలు ఉపశమించడం వంటి అంశాలు సెంటిమెంట్పై సానుకూల ప్రభావాన్ని చూపాయని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు వరుసగా నాలుగు రోజులు దూసుకెళ్లిన మార్కెట్లలో ఆపరేటర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పాల్పడటంతో ఇండెక్స్లు ఒడిదొడుకులకు లోనయ్యాయని వివరించారు. బ్యాంకింగ్ దూకుడు : ఆర్బీఐ కొత్త గవర్నర్గా రాజన్ ప్రమాణం చేసినప్పటినుంచీ జోరందుకున్న బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ బుధవారం కూడా కొనసాగింది. బీవోఐ, బీవోబీ, యూనియన్, పీఎన్బీ, కెనరా, ఫెడరల్, ఎస్బీఐ, యాక్సిస్, ఇండస్ఇండ్ 10.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో బ్యాంకెక్స్ 2% లాభపడింది. ఇక మెటల్, రియల్టీ రంగాలు 3% స్థాయిలో పురోగమించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా స్టీల్ 5%, హిందాల్కో 4% చొప్పున జంప్చేయగా, టాటా పవర్, సన్ ఫార్మా 2.5% స్థాయిలో బలపడ్డాయి. ఇక రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్ 5% పుంజుకోగా, హెచ్డీఐఎల్ 3.6%, ఇండియాబుల్స్ 2.6% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్యూఎల్, భెల్ 2.5-1.5% మధ్య నష్టపోయాయి. ఎఫ్ఐఐల జోరు: ముందురోజు రూ. 2,564 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 586 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 386 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1%పైగా లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,419 బలపడగా, 940 నష్టపోయాయి. -
చివర్లో పెరిగిన రూపాయి
ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బుధవారం ట్రేడింగ్లో భారీ హెచ్చుతగ్గులకు లోనై రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని తలపించింది. క్రితం ముగింపు 67.63తో పోలిస్తే ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 68.10 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 68.62 వద్ద కనిష్టాన్ని తాకింది. తరవాత నెమ్మదిగా పుంజుకోవడం మొదలైంది. ఈ బాటలో బలపడుతూ వచ్చిన రూపాయి గరిష్టంగా 66.80ను సైతం చేరింది. చివరకు 56 పైసలు బలపడి 67.07 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలరు విలువ క్షీణించడం రూపాయి రికవరీకి దోహదపడింది. మంగళవారం ట్రేడింగ్లో రూపాయి 163 పైసలు కోల్పోవటం తెలిసిందే. ఒక దశలో రిజర్వ్ బ్యాంకు కల్పించుకుని స్పాట్ మార్కెట్లో డాలర్లను భారీగా విక్రయించడం కూడా రూపాయికి బలాన్నిచ్చిందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు విదేశీ వాణిజ్య రుణాలను సాధారణ కార్పొరేట్ వ్యవహారాలకు కంపెనీలు వినియోగించుకోవచ్చునని ఆర్బీఐ చెప్పటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు. -
163 పైసలు (రూ)పాయే!
ముంబై: రూపాయి కష్టాలు తొలగిపోలేదు. వరుసగా రెండు రోజులు లాభపడ్డాక సోమవారం స్వల్పంగా క్షీణించిన రూపాయి విలువ మంగళవారం ఒకేసారి 163 పైసలు(2.47%) పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో మళ్లీ 67.63 కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఒక దశలో ఏకంగా 68.27 వరకూ దిగజారడం గమనార్హం. సిరియాపై సైనిక చర్యల అంచనాలతో ముడిచమురు ధరలు పుంజుకోవడం ప్రధానంగా ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పలు ఇతర కరెన్సీలతో డాలరు బలపడటం కూడా దేశీయంగా సెంటిమెంట్ను బలహీనపరచిందని తెలిపారు. కాగా, జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, నోమురా వంటి సంస్థలు ఇండియా ఆర్థిక వృద్ధి అంచనాలలో కోత విధించిన సంగతి తెలిసిందే. వెరసి డాలరుతో మారకంలో 66.29 వద్ద బలహీనంగా మొదలైన రూపాయి చివరికి 163 పైసలు పతనమై 67.63 వద్ద నిలిచింది. -
రూపాయికి తొలగని ముప్పు!
రూపాయి రికవరీతో మధ్య తరగతి ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. గత కొద్ది రోజులుగా పతనావస్థకు లోనైన రూపాయి గురువారం మార్కెట్ లో 225 పైసలు లాభపడి 66.55 రూపాయల వద్ద ముగియడం కొంత ఊరటనిచ్చింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా రికవరీకి మద్దతునిచ్చింది. దేశీయ చమురు కంపెనీలు మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంకు వెసలుబాటు కలిగించడంతో గురువారం మార్కెట్ లో గత పదిహేనేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా రూపాయి ఒకరోజు ట్రేడింగ్ లో లాభపడటం మార్కెట్ కు ఉత్తేజాన్ని ఇచ్చింది. రూపాయి క్రమంగా క్షీణించడంతో దేశ ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారనే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రభుత్వాన్ని విపక్షాలు పార్లమెంట్ లో నిలదీశాయి. దేశ ఆర్ధిక వ్యవస్థతోపాటు, విదేశీ పరిస్థితులు కూడా రూపాయి పతనాన్ని శాసించాయని ప్రధాని వివరణ ఇచ్చారు. సిరియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల కూడా అమెరికా ద్రవ్య విధానంలో మార్పులు వచ్చాయని.. దాంతో రూపాయి పతనానికి పలు అంశాలు తోడయ్యాయన్నారు. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియాపై పశ్చిమ దేశాలు సైనికదాడి చేయొచ్చనే భయాలతో ముడిచమురు పైకి ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్ల పైకి దూసుకెళ్లింది. మరోపక్క, ఆహార భద్రత బిల్లుకు లోక్సభ ఆమోదంతో సబ్సిడీ భారం ఎగబాకి ద్రవ్యలోటు పెరిగిపోతుందనే భయాలు కొత్తగా వచ్చిచేరాయి. దాంతో అసలే బిక్కుబిక్కుమంటున్న రూపాయి మరింత కుండిపోయింది. రూపాయి పతనంతో విదేశీ నిధులు తిరోగమన బాట పట్టాయి. తాత్కాలికంగా రూపాయి కోలుకున్నా.. అనేక అంశాలు రూపాయి పతనానికి దోహదమయ్యే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. -
చాలా కరెన్సీలతోనూ ‘బ్రేక్’ డ్యాన్సే!
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఒక్క డాలరుతో మాత్రమే పాతాళానికి జారుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోందంటే పొరపాటే. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలన్నింటితో కూడా రూపాయి తుక్కుతుక్కు అవుతోంది. బ్రిటిష్ పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్లతో పోలిస్తే అత్యంత ఘోరంగా కుప్పకూలింది. పౌండ్తో దేశీ కరెన్సీ 100 స్థాయిని ఇప్పటికే అధిగమించగా.. బుధవారం 106 దిగువకు పడిపోయి కొత్త ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. యూరోతో 92, స్విస్ ఫ్రాంక్తో 75, కెనడా డాలర్తో 65, ఆస్ట్రేలియన్ డాలర్తో 60 కిందికి క్షీణించాయి. ఇంకా చాలా దేశాలన్నింటి కరెన్సీలు కూడా రూపాయిని ‘బ్రేక్’ డ్యాన్స్ ఆడిస్తున్నాయి. కువైట్ దినార్తో 240, బహ్రయిన్ దినార్తో 180, ఒమాన్ రియాల్తో 175 దిగువకు రూపాయి విలువ పడిపోయింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనం రూపాయిని దెబ్బకొడుతూవస్తున్నాయి. వీటితో బలపడిందండోయ్... రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో కుప్పకూలుతుంటే.. కొన్ని దేశాలతో పోలిస్తే మాత్రం బలపడింది. అయితే, ఇవన్నీ అనామక దేశాలే! రూపాయి పుంజుకున్న జాబితాలో పనామా, టాంగో, సురినాం, తజికిస్థాన్, సాల్మన్ ఐలాండ్స్, సాల్వడార్, హైతి, కిర్గిస్థాన్, లైబీరియా, సిరియా, కాంగో, సోమాలియా, సియర్రా లియోన్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో 8 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ 100 కిందకి పడిపోయింది. యూరో, జోర్డాన్ దినార్లతో 90 కిందికి జారింది. ఇక 50 దేశాల కరెన్సీలతో రూపాయి విలువ 50 దిగువకు క్షీణించడం గమనార్హం. రూపాయితో పోలిస్తే అధిక మారకం విలువ గల దేశాలు ప్రపంచంలో 100కు పైగానే ఉన్నాయి. -
ఏం చేసినా లాభం లేదు...: డీబీఎస్
ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది. -
రూపాయి పతనానికి తోడు పెరుగుతున్న క్రూడ్ ధర
-
రాష్ట్ర ఫార్మా కంపెనీకి ఎఫ్డీఏ షాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఔషధ కంపెనీ పోష్ కెమికల్స్కు యూఎస్ ఎఫ్డీఏ షాకిచ్చింది. తనిఖీ సందర్భంగా పోష్కు చెందిన తయారీ ప్లాంటులో పలు లోపాలను గుర్తించామని, వీటిని సరిదిద్ది, తిరిగి తమ ఆమోదం పొందేంత వరకు కంపెనీ దాఖలు చేసే కొత్త అప్లికేషన్లు, సప్లిమెంట్లపై అనుమతిని నిలిపివేస్తామని ఎఫ్డీఏ హెచ్చరించింది. ఉత్తమ తయారీ విధానాలను ఉల్లంఘించారని, తద్వారా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ కల్తీ అయ్యేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని అనధికార వ్యక్తులు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోలేదని, ఔషధ పరీక్షల విధానం సాంకేతికంగా పటిష్టంగా లేదన్న విషయం తమ తనిఖీల్లో తేలిందని తెలిపింది. పోష్ కెమికల్స్కు మేడ్చల్, జీడిమెట్లలో ప్లాంట్లున్నాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్కు చెందిన సెంటిస్ ఫార్మాకు ఎఫ్డీఏ ఇదే విధమైన హెచ్చరిక చేసింది. -
పసిడిపై సుంకాలు మరింత పెంపు
న్యూఢిల్లీ: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడానికి, కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) కట్టడికి కేంద్రం సోమవారం మరిన్ని చర్యలు ప్రకటించింది. వీటి కారణంగా బంగారం, వెండి, నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులపై సుంకాలు మరింత పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కస్టమ్స్ నోటిఫికేషన్లను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు ఉభయసభల్లో ఈ మేరకు ప్రకటనలు చేసిన అనంతరం ఆర్థిక మంత్రి పి. చిదంబరం మీడియాకు ఈ విషయాలు చెప్పారు. అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, సుంకాల పెంపు ఎంత మేర ఉంటాయన్నది సభ వెలుపల వెల్లడించలేనని ఆయన తెలిపారు. ఈ చర్యలతో క్యాడ్ 3.7%కి(70 బిలియన్ డాలర్లు) కట్టడి కాగలదని ఆయన తెలిపారు. పసిడి, చమురు దిగుమతుల భారంతో 2012-13లో క్యాడ్ ఆల్టైం గరిష్టమైన 4.8 శాతానికి ఎగిసింది. విదేశీ రుణాల నిబంధనలు సడలించడంతో ఈ ఏడాది అదనంగా 11 బిలియన్ డాలర్ల నిధులు తరలిరావొచ్చని చిదంబరం చెప్పారు. చమురు సంస్థలకు విదేశీ రుణాలు.. పెట్టుబడులను పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు విదేశీ వాణిజ్య రుణ (ఈసీబీ) రూపంలో దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించినట్లు చిదంబరం పేర్కొన్నారు. దీని ప్రకారం ఐవోసీ 1.7 బిలియన్ డాలర్లు, బీపీసీఎల్.. హెచ్పీసీఎల్ చెరి 1 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించుకోవచ్చు. మరోవైపు మౌలిక రంగ రుణ అవసరాల కోసం ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ, ఐఐఎఫ్సీఎల్ కలిసి క్వాసీ-సావరీన్ బాండ్ల ద్వారా 4 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించేందుకు అనుమతించనున్నట్లు చిదంబరం తెలిపారు. ఐఐఎఫ్సీఎల్, పీఎఫ్సీ చెరి 1.5 బిలియన్ డాలర్లు, ఐఆర్ఎఫ్సీ 1 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణాలు సమీకరించవచ్చన్నారు. భారత్లో బహుళజాతి సంస్థల అనుబంధ కంపెనీలు తమ మాతృసంస్థల నుంచి నిధులు పొందేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేస్తుందని చిదంబరం చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు జారీ చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లలోసావరీన్ వెల్త్ ఫండ్స్ సుమారు 30 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈ డిపాజిట్స్ నిబంధనల సడలింపు.. నాన్ రెసిడెంట్ డిపాజిట్ పథకాల (ఎన్ఆర్ఈ/ఎఫ్సీఎన్ఆర్) వడ్డీ రేట్లపై నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు చిదంబరం వివరించారు. ఎఫ్సీఎన్ఆర్ అకౌంట్లకు సంబంధించి మూడేళ్లు, అంతకు పైబడిన కాల వ్యవధికి సంబంధించిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను డీరెగ్యులేట్ చేస్తున్నట్లు చిదంబరం తెలిపారు. -
రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకి జారిన భారత్
రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి.