West Godavari Crime News
-
ఘరానా మోసగాడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో వాహనాలు తీసుకుని వాటిని విక్రయించినట్లు చెప్పారు. ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే 13 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిందితుడు 13 కార్లను అద్దెకు తీసుకుని వాటిని అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మొరళీని ఇవాళ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈజీ మని జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తాళే.. యమపాశంగా!
పశ్చిమగోదావరి ,గణపవరం: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక చంటిబిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి, తాను కట్టిన తాళినే ఉరితాడుగా మార్చి కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నెల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనుమానంతో ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ బుధవారం గణపవరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి మద్యానికి బానిసై, మొదటి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె అతనిని నుంచి విడిపోయింది. గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్లక్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. భార్యను తరచూ వేధించడం, మద్యానికి బానిసై రోజూ కొట్టడంతో నంగాలమ్మ రెండు నెలలక్రితం పుట్టింటికి గణపవరం వెళ్లి, కొద్దిరోజుల తర్వాత ఐ.పంగిడిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది. అబ్బులు ఇటీవల పిప్పరలో ఒక చేపల చెరువుపై పనికి చేరాడు. అప్పటినుంచి భార్యను రమ్మని కబురు చేస్తూ పలుమార్లు బంధువులతో రాయబారం పంపాడు. తాను ఇకమీదట వేధించనని, చేయి చేసుకోనని, బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి ఈ నెల 17న అబ్బులు తనతోపాటు భార్యను పిప్పర తీసుకువచ్చాడు. 18వ తేదీ రాత్రి అబ్బులు బాగా తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. నాలుగో నెల గర్భిణిగా ఉన్న ఆమెపై అనుమానంతో అదే రోజు రాత్రి భార్య మెడలో ఉన్న పసుపుతాడునే పీకకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్య పడుకుని కదలడంలేదంటూ కొంతసేపు హడావుడి చేశాడు. అనంతరం బీరు సీసాతో తన గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిని బుధవారం గణపవరం ఎస్సై ఎం.వీరబాబు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో గణపవరం సీఐ డేగల భగవాన్ప్రసాద్, ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
3వేల కోసమే అనూష హత్య
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఈనెల 7న పెదవేగి మండలం మొండూరు గ్రామం పోలవరం కుడికాలువ గట్టు వద్ద కనుగొన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు గుజ్జుల సందీప్కు మృతురాలు అనూషకు మధ్య రూ.3 వేల విషయమై ఏర్పడిన వివాదం కాస్తా హత్యకు దారితీసినట్లు పోలీసు విచారణ వెల్లడైంది. నిందితుడు సందీప్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ దిలీప్కిరణ్ విలేకరులకు వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ అనసూరి శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై చావా సురేష్, పెదవేగి ఎస్సై నాగ వెంకటరాజు, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఉన్నారు. దెందులూరు మండలం నాగులదేవుపాడు గ్రామానికి చెందిన గుజ్జుల సందీప్ ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మృతురాలు జానపూడి అనూష(30)తో శారీరక సంబంధం ఉంది. (అనూష భర్త గతంలో చనిపోయాడు). కొద్దిరోజుల క్రితం అనూషకు డబ్బులు అవసరం కావటంతో వారం రోజుల్లో తిరిగి ఇస్తానంటూ రూ.3 వేలు అప్పుగా అడిగింది. తాను ఆటో వాయిదా కట్టేందుకు దాచిన సొమ్ము రూ.3 వేలు అనూషకు ఇచ్చాడు. అనంతరం సందీప్ డబ్బులు అడుగుతూ ఉండగా ఆమె ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటోంది. లాక్డౌన్ కారణంగా ఆటో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న సందీప్ కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనూష ఫోన్ చేసి సందీప్ను 7వ మైలు దగ్గరకు రమ్మని చెప్పటంతో అతను ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆటోలో మొండూరు వద్ద పోలవరం కుడికాలువ గ్రావెల్ రోడ్డులోకి వెళ్ళి ఆటోను పక్కగా పెట్టి మట్టిదిబ్బల వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిశారు. అనంతరం సందీప్ ఆమెను డబ్బులు గురించి అడగటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సందీప్ కోపంతో అనూషను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె ముక్కు, నోటిని తన రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. అనూష మెడలోని చున్నీతో బలంగా లాడి ముడివేశాడు. ఆమె చనిపోవటంతో అనూష మొబైల్ ఫోను, ఆధార్కార్డు, రేషన్కార్డు, ఓటర్ కార్డు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ హత్య కేసును ఛేదించటంలో ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది హెచ్సీ వై.ఏసేబు, కానిస్టేబుల్స్ కిషోర్, ఎస్కే నాగూర్, సురేష్, డీ.సురేంద్ర, టీ.జయకుమార్లను డీఎస్పీ దిలీప్కిరణ్ అభినందించారు. -
పోలీసుల అదుపులో డ్రగుల్బాజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. నాలుగురోజుల క్రితం నెదర్లాండ్స్ నుంచి చెన్నై వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా భీమవరానికి చెందిన పి.భానుచంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న చెన్నైలో అరెస్టు చూపించారు. దీంతో అసలు భానుచంద్రకు డ్రగ్స్ మాఫియాకు ఉన్న లింక్లు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. బీటెక్ను మధ్యలోనే వదిలివేసినభానుచంద్ర చాలా కాలంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభ్యం అవుతున్నాయి. ఎలా పట్టుబడ్డాడు... నెదర్లాండ్స్ నుంచి ఈ నెల 16న విమానంలో చెన్నైకి ఒక పార్శిల్ వచ్చింది. అందులో బొమ్మలు (టాయ్స్) ఉన్నట్లుగా ప్యాకింగ్పై ఉంది. నెదర్లాండ్స్ నుంచి భారతదేశానికి బొమ్మలు తెప్పించాల్సిన అవసరం ఏంటని అనుమానించిన కస్టమ్స్ అధికారులు దీన్ని తెరిచి పరిశీలించగా బొమ్మలలో 400కి పైగా పిల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎండీఎంఏ (మెథిలియా డ్యాక్సీ మెతంపెటామైన్) అనే డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని మత్తుతో పాటు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారని సమాచారం. గతంలో కూడా భానుచంద్ర పదిసార్లు ఈ డ్రగ్స్ను ఇండియాకి తెప్పించినట్లుగా గుర్తించారు. డార్క్ నెట్ ద్వారా... భానుచంద్ర డార్క్నెట్ ద్వారా ఈ డ్రగ్స్ను బుక్చేసి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఐదు వందల డాలర్లను ఆన్లైన్ ద్వారా చెల్లించి దీన్ని తెప్పించాడు. వీటి ధర ఇండియన్ మార్కెట్లో రూ.12 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. టెర్రరిస్ట్లు, డ్రగ్మాఫియా మాత్రమే ఉపయోగించే డార్క్నెట్తో భానుచంద్రకు సంబంధాలు ఎలా ఉన్నాయి? అతని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. రంగంలోకి పోలీసులు జిల్లా పోలీసు యంత్రాంగం దీనిపై రంగంలోకి దిగింది. భీమవరంతోపాటు పరిసర ప్రాంతాలు నరసాపురం ప్రాంతాలలో డ్రగ్స్ను రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. భీమవరం పరిసర ప్రాంతాలలో సంపన్న వర్గాలకు ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా విషయంలో రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? ఇంకా డ్రగ్స్ ముఠాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలపై దృష్టి పెట్టారు. భీమవరం ప్రాంతాల్లో డ్రగ్స్తో పాటు గంజాయి అమ్మకాలు జరిపే వారి పాత్ర ఈ వ్యవహారంలో ఎంత ఉందనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపితే జిల్లాలో బిగ్షాట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. -
కాళ్ల పారాణి ఆరక ముందే..
భీమడోలు సమీపంలోని పూళ్ల గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనవ జంట దుర్మరణం పాలైంది. కారు డ్రైవరూ అసువులు బాశాడు. ఇటీవలే వివాహమైన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన మానస నవ్య భర్త వెంకటేష్తో కలిసి అత్తవారింటికి విశాఖ జిల్లా సబ్బవరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనెల 14న జరిగిన నవ్య పెళ్లినాటి ఫొటో ఇది.. ఏలూరు టౌన్/భీమడోలు: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధూవరులు ఘోర రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొత్త ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంటూ... నాలుగు రోజుల క్రితం ఎంతో వైభవంగా వివాహ వేడుకలు చేసుకున్న నవ జంటను చూసి కాలానికి కన్నుకుట్టిందో ఏమో గానీ... గురువారం మధ్యాహ్నం మృత్యుపాశం విసిరింది. సంతోషంగా అత్తారింటికి బయలుదేరిన నవ్యను, ఆమె భర్త వెంకటేష్ను విగత జీవులను చేసింది. నవ జంట కాళ్ళకు వేసిన పారాణి ఇంకా ఆరలేదు... కానీ ఇద్దరినీ మృత్యువు కబళించింది. ఈహఠాత్తు సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చింది. వధువు ఇంటి వద్ద వివాహ వేడుకలు పూర్తి చేసుకుని, వరుడి స్వస్థలం విశాఖపట్నం జిల్లా సబ్బవరంలోని ఇంటికి కారులో వెళుతుండగా గురువారం మధ్యాహ్నం భీమడోలు సమీపంలోని పూళ్ళ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవజంటతోపాటు డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కంటతడి పెట్టిస్తున్న వైనం సాఫ్ట్వేర్ ఇంజినీర్ యడ్లపల్లి వెంకటేష్, ఆలపాటి మానస నవ్య ఇద్దరూ.. ఈనెల 14న ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నారు. తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో నవ్య ఇంటివద్దనే మూడు రోజులు ఆనందంగా గడిపారు. తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకున్నారు. భర్త వెంకటేష్ ఇంటికి విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరారు. కారు డివైడర్ను ఢీకొట్టి ఆవలి వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. నవ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తెలిసి ఇరు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా తిరిగిరాని లోకాలకు చేరటం తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్కిరణ్ ప్రమాదం ఎలా జరిగింది ? కారు ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కారు డ్రైవర్ కునుకుతీయడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందా, లేక మరేదైనా కారణమా అనేది నిర్ధారణ కావలసి ఉంది. పెళ్ళి కుమార్తె నవ్య సోదరుడు భరత్ చెప్పే విషయాలను బట్టి.. ఏదో లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్ దాటి అటువైపు దూసుకుపోయిందని చెబుతున్నాడు. కారు టైర్ పంక్చర్ కావటంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఆవలి వైపుకు వెళ్లి లారీని ఢీకొట్టి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించిన డీఎస్పీ పూళ్ళ గ్రామం వద్ద జరిగిన ఈ కారు ప్రమాదాన్ని అటుగా వెళుతున్న ఏలూరు డీఎస్పీ దిలీప్కిరణ్ చూడడంతో వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే సరికే ముగ్గురు మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ పరి శీలించి, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. -
ఆడపడుచు భర్త లైంగిక దాడి.. ఫొటోలు తీసి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : వరుసకు సోదరుడయ్యే వ్యక్తి (ఆడపడుచు భర్త) ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి తెగబడ్డాడు. జనవరి 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి శుక్రవారంఆరికిరేవుల వస్తుంటాడు. ఆ గ్రామానికి చెందిన తన బావమరిది ఇంటికి ప్రతివారం వస్తుండేవాడు. జనవరి 31న ఉదయం వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బావమరిది భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి బయట ఎవరికైనా చెబితే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మౌనంగా ఉంటే రూ.ఐదువేలు ఇస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన వివాహిత అప్పటి నుంచి బాధను దిగమింగుకుని మౌనంగానే రోధిస్తోంది. ఎట్టకేలకు విషయం భర్త, అత్తమామలకు చెప్పి వారి సహకారంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. -
కూతురు చనిపోయిందని తండ్రి ఆత్మహత్య
పశ్చిమగోదావరి,పెరవలి: కూతురు పుట్టిందని ఎంతో ఆనందించిన తండ్రికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన రెండు రోజులకే కూతురు మృతి చెందటంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çఘటన పెరవలి మండలం ఖండవల్లిలో జరిగింది. పెరవలి ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. ఖండవల్లి గ్రామానికి చెందిన బండి నరేష్(35)కు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. గత నెల 30వ తేదీన భార్యకు ఆడపిల్ల పుట్టడంతో ఆనందించాడు. ఈనెల 2వ తేదీన పుట్టిన బిడ్డ మృతి చెందటంతో తీవ్ర మనస్తాపం చెంది అదేరోజు పురుగుమందు తాగాడు. అతనిని ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
ఏలూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలో భార్యభర్త తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు రూరల్ ప్రాంతంలోని ఎస్ఎంఆర్ నగర్లో నివాసం ఉంటున్న పామర్తి రాంబాబు, భార్య లక్ష్మీరాటాలు కూలిపనులు, అదేవిధంగా ఒక ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి అనుష్క, చందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ యజమాని చెల్లెలి ఇంట్లో పనివారు లేకపోవటంతో లక్ష్మీరాటాలు రెండు ఇళ్లలోనూ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న యజమాని సోదరి ఇంట్లో 12 కాసుల బంగారు ఆభరణం పోయిందని గుర్తించారు. బంగారు ఆభరణాన్ని రాటాలు తీసిందనే అనుమానంతో ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా యజమాని భార్యతోపాటు, ఆమె చెల్లెలు కలిసి రాంబాబు ఇంట్లో సోదాలు చేశారు. కాగా రాటాలు కుమార్తె తన తల్లే బంగారు ఆభరణం తీసిందని యజమాని భార్యకు చెప్పినట్లు వారు చెబుతుండగా, బెదిరించి అలా చెప్పించారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా యజమాని భార్య, ఆమె సోదరి కలిసి రాటాలు, ఆమె కుమార్తెలను తీవ్రంగా కొట్టి, దూషించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాంబాబు, భార్య రాటాలు, ఇద్దరు కుమార్తెలు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. -
ఏలూరులో మహిళ హత్య!
ఏలూరు టౌన్: అదృశ్యమైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ చిన్న బోదెలో శవమై తేలింది. ఈ ఘటన ఏలూరులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణికి కొంతకాలం క్రితం వివాహమైంది. నాగమణి (34) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త శివాజీ మానసిక వికలాంగుడు. దీంతో అతను ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుసకు మేనల్లుడైన సంతోష్ అనే వ్యక్తితో నాగమణి సన్నిహితంగా ఉంటోంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా బలపడింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ కొద్దిరోజులుగా నాగమణిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పనుల కోసం ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి నాగమణి అతనికి దూరంగా ఉంటోంది. నాగమణికి కంటి సమస్య రావటంతో ఈనెల 20న ఏలూరు ఆర్ఆర్పేటలో శంకర్ నేత్రాలయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆమె సోదరుడు తీసుకువెళ్లాడు. ఈ సమయంలోనూ సంతోష్ వారిని వెంబడించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్ళి పోయింది. ఈనెల 21న యథావిధిగా ఆటోలో సత్రంపాడులోని ఒక ఇంటికి పని చేసేందుకు వెళ్ళింది. అప్పుడు కూడా సంతోష్ ఆమెను వెంబడించాడు. అప్పటి నుంచి నాగమణి అదృశ్యమైంది. బంధువులు ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక బోదెలో నాగమణి శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరికీ తాళికట్టి.. గొంతునులిమి హత్య
జంగారెడ్డిగూడెం: ఈ నెల 18న స్థానిక బస్టాండ్ వద్ద ఒక మహిళను హత్యచేసిన నేరంపై ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. బేతపూడి హేమలత(29) అనే మహిళను కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్కుమార్ పీక నులిమి హత్యచేసినట్లు తెలిపారు. మండలంలోని నిమ్మలగూడేనికి చెందిన హేమలతకు 2012లో చాగల్లులో పనిచేస్తుండగా ప్రవీణ్కుమార్తో పరిచయమైనట్లు చెప్పారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారన్నారు. అయితే 2014లో హేమలతకు తెలియకుండా ప్రవీణ్కుమార్ కొవ్వూరుకు చెందిన వేరొక మహిళను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హేమలతకు కూడా ఏడాది క్రితం గౌరీపట్నం మేరీ మాత గుడిలో తాళికట్టినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నారు. తరువాత కొన్ని రోజులకు ప్రవీణ్కుమార్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు హేమలతకు తెలిసిందన్నారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని హేమలత నివాసం ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేస్తోందన్నారు. అయితే ప్రవీణ్కుమార్ అప్పుడప్పుడూ హేమలత వద్దకు వచ్చి వెళుతుండేవాడని, ఏ పనీ లేక, ఆదాయం లేక హేమలతను డబ్బులు అడుగుతుండేవాడన్నారు. దీంతో హేమలత ఎంతో కొంత డబ్బులు ఇస్తుండేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఘటనకు ముందు వారం రోజులుగా ప్రవీణ్కుమార్ జంగారెడ్డిగూడెం వచ్చి ఆమె వద్ద ఉంటున్నాడని, ఆమెను డబ్బులు అడగ్గా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. ఈనేపథ్యంలో హేమలతను ప్రవీణ్కుమార్ కొట్టి గొంతునులిమి హత్యచేసినట్లు వెల్లడించారు. అయితే ఆమె బాత్రూమ్కు వెళ్లి పడిపోయి మృతిచెందినట్లు అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడన్నారు. నిందితుడిపై హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన బీఎన్ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, హెచ్సీ ఎన్.రాజేంద్ర, పీసీలు కె.కిరణ్, బి.హరిప్రసాద్లను డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ వివాహిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూమ్లో పడి మృతి చెందినట్లు భర్త చెబుతుండగా, హతురాలి సోదరి, సోదరుడు మాత్రం భర్త ప్రవీణ్కుమారే హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతురాలు హేమలత (29) స్థానికంగా ఉన్న ఒక ఫొటో కలర్ల్యాబ్లో పనిచేస్తోంది. ఈమెకు ఆరేళ్ల క్రితం కొవ్వూరు మండలం పి.సావరం గ్రామానికి చెందిన గంటా ప్రవీణ్కుమార్తో పరిచయం కాగా, వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం కొంతకాలం నిమ్మలగూడెంలో కాపురం ఉన్నారు. నాలుగు నెలల క్రితం జంగారెడ్డిగూడెంలో బస్టాండ్ ఎదురుగా ఒక ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, హేమలత బాత్రూమ్లో పడిపోయిందని, మాట రావడం లేదని, ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతున్నానని భర్త ప్రవీణ్కుమార్ బుధవారం ఉదయం మృతురాలి సోదరుడు రాంపండుకు ఫోన్లో చెప్పాడు. దీంతో రాంపండు, సోదరి లీల, వరుసకు మేనమామ అయిన భానుశివకుమార్ వెంటనే ప్రభుత్వాసుపత్రికి చేరుకోగా, అప్పటికే హేమలత మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్కుమార్ తమ సోదరిని హత్యచేసి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల భర్త ప్రవీణ్కుమార్ తన ఖర్చుల కోసం డబ్బులు ఇమ్మని తమ సోదరిని వేధించేవాడని వాపోయారు. కాగా ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్ నాయక్, ఎస్సై ఎ.దుర్గారావు పరిశీలించారు. అలాగే ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు పరిశీలించారు. అంతేగాక సోదరి లీల జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు ప్రవీణ్కుమార్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. హేమలత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలోనే ప్రవీణ్కుమార్కు వేరే మహిళతో వివాహమైనట్లు తెలిసింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయక్ తెలిపారు. -
కీచక ఉపాధ్యాయుడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలం తాడమళ్ల హైస్కూల్ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్పై 2012 పోక్స్ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. -
పురుగు మందు తాగి.. కొడుక్కి పట్టించి..
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ఏలూరు వన్టౌన్లో ఓ తండ్రి కూల్డ్రింక్లో పురుగుమందు కలుపుకుని తాగి, దానిని తన ఐదేళ్ల కొడుకుకు తాగించి ఆత్మహత్యాయత్నం చేయటం నగరంలో కలకలం రేపింది. గమనించిన స్నేహితులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే తండ్రి మృతిచెందినట్లు నిర్ధారించారు. చిన్నారి ఆరోగ్యస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్టౌన్ ప్రాంతంలో పడమరవీధి జోగిమేడ వద్ద నివాసం ఉంటోన్న ఉప్పలపాటి శివప్రసాద్ (35) ఏలూరుకు చెందిన ముస్లిం యువతి హరిణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శివప్రసాద్ ముసునూరు మండలం గోపవరానికి చెందిన వ్యక్తికాగా, కొంతకాలంగా ఏలూరులోనే నివాసం ఉంటున్నాడు. వారికి ఐదేళ్ల కుమారుడు రాణాకార్తికేయ ఉన్నాడు. కుమారుడు ఏలూరు సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నట్లు చెబుతున్నారు. శివప్రసాద్ ఏలూరులో వల్లభ మిల్క్డైరీ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు. భార్య హరిణి విజయవాడ వెళ్లగా ఆకస్మికంగా మంగళవారం సాయంత్రం పురుగుల మందును కూల్డ్రింకులో కలిపి తాను తాగి, ఐదేళ్ల కొడుకు కార్తికేయతో కూడా తాగించాడు. రాత్రి 7.30 గంటల సమయంలో స్నేహితులు విషయం తెలుసుకుని ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శివప్రసాద్ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ తగాదాలా.. లేక వ్యాపార పరమైన అంశాలేవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్యయత్నంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీ సుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. -
‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’
సాక్షి, పశ్చిమ గోదావరి: భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నరసాపురం ఘటన తనను కలచివేసిందని, తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం అన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చేవరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి అదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, పిల్లలిద్దరిని తణుకు బాలసదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు.(చదవండి: గల్ఫ్లో ఉన్న భార్యపై కోపంతో దారుణం) -
‘దేవుడి ప్రసాదం’ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు
సాక్షి, పశ్చిమగోదావరి : సులువుగా డబ్బులు సంపాందించాలనే దురుద్దేశంతో ఓ వ్యక్తి దేవుడి ప్రసాదం పేరుతో ఘోరాలకు పాల్పడ్డాడు. విషం కలిపిన ‘దేవుని ప్రసాదం’ ఇచ్చి అమాయక భక్తుల ప్రాణాలు తీసేవాడు. వారు చనిపోయిన తర్వాత నగదు, బంగారం దోచుకుపోయేవాడు. ఇలా 8 హత్యలకు పాల్పడిన కిరాతక సీరియల్ కిల్లర్ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు చంపిన వ్యక్తుల్లో ఎక్కువమంది అతని బంధువులే ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అక్టోబరు 16న ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) అనుమానస్పద మృతితో.. ఈ సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం బయటపడింది. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దోచుకున్న డబ్బుతో నిందితుడు ఇల్లు కట్టుకున్నాడని సమాచారం. -
మహిళా వీఆర్ఏకు లైంగిక వేధింపులు
సాక్షి, తాడేపల్లిగూడెం/పశ్చిమ గోదావరి : తాడేపల్లిగూడెం తహసిల్దార్ కార్యాలయంలోని ఓ మహిళా వీఆర్ఏతో మండలానికి చెందిన అప్పారావుపేట వీఆర్వో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఏపీ స్టేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ నాయకుడు జి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోమవారం వివరాలు వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహిళా వీఆర్ఏ పట్ల కొంత కాలంగా అప్పారావుపేట వీఆర్వో ఆర్వీ పోతురాజు అసభ్యంగా ప్రవరిస్తున్నాడని, బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. తహసిల్దార్ ఆదేశానుసారం ఆదివారం పనిచేసేందుకు వచ్చిన ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వో చేయి పట్టుకున్నాడని ఆరోపించారు. వేధింపులపై సదరు మహిళా వీఆర్ఏ తమ యూనియన్కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అప్పారావుపేట వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. లేదంటే ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళతామని వెల్లడించారు. దీనిపై తహసిల్దార్ ప్రసాద్ వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య!
ఏలూరు టౌన్: ఏలూరు అశోక్నగర్లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడానికి చెందిన కాటి నాగరాజు (48) ఏలూరు అశోక్నగర్లోని కేపీడీటీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం కొంతకాలంగా సత్రంపాడులో నివాసముంటున్నారు. ఇటీవల సొంతూరిలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని మోటారు సైకిల్పై బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్ఐసీ వాళ్లు స్కాన్ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య చెబుతోంది. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మృతి వ్యాయామోపాధ్యాయుడు నాగరాజు మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుని శరీరంæపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఏవిధంగా ఆయన చనిపోయాడు? అనారోగ్యంతోనా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా ? ఆయన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎలా మాయమయ్యాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో రోడ్డు పక్కన పడి ఉన్న అతని వద్ద నుంచి ఎవరైనా నగదు, నగలు మాయం చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక హత్య చేసి దుండగులు దోచుకుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కుటుంబసభ్యులు మాత్రం నాగరాజును చంపి ఎవరో నగదు, నగలు ఎత్తుకుపోయారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు గురువారం తన సిబ్బందితో లింగారావుగూడెం వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించటంతో స్వగ్రామానికి తరలించారు. మృతుడి అన్న పెదపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తమ్ముడు విజయవాడలో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. -
సినిమా చూస్తూ వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్లోని సత్యనారాయణ థియేటర్లో మ్యాట్నీ సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందాడు. సినిమా ముగిసిన అనంతరం గమనించిన థియేటర్లోని సిబ్బంది యాజమాన్యానికి విషయాన్ని తెలియచేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు దెందులూరు మండలం వీరభద్రపురానికి చెందిన ఉప్పే మురళీకృష్ణ (45)గా గుర్తిం చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా స్పత్రి మార్చురీకి తరలించారు. -
కళ్లెదుటే గల్లంతు
పోడూరు: తల్లి కాలువలో దుస్తులు ఉతుకుతుండగా ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన కుమార్తె కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఇది. ఆమెను పట్టుకునేందుకు తల్లి, మరో కుమార్తె కాలువలో దిగడంతో వారు సైతం కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఈ ప్రమాదం గురువారం మార్టేరు శివారు కంకరపుంతరేవు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మార్టేరుకు చెందిన పడాల యమునాదేవి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని నరసాపురం ప్రధానకాలువ వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు భార్గవి(18), ప్రియ(17) కాలువ వద్దకు వెళ్లారు. తల్లి కాలువ రేవులో దుస్తులు ఉతుకుతుండగా బార్గవి, ప్రియ కాలువలోకి దిగారు. కాలువలో నీటిప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో భార్గవి ప్రమాదవశాత్తూ కాలువలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె తల్లి యమునాదేవి, సోదరి ప్రియ ఆమెను పట్టుకునేందుకు మరింత లోపలికి దిగారు. వారు కూడా కాలువలో కొట్టుకుపోతూ దాదాపు 50 మీటర్ల దూరం వెళ్లేసరికి కాలువకు అవతలివైపు నరసాపురం–మార్టేరు స్టేట్హైవే పక్కన ఉన్న స్థానికులు చూసి యమునాదేవిని, ప్రియను రక్షించారు. అప్పటికే ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలువలో మునిగిపోయిన భార్గవి జాడ తెలియలేదు. స్థానికులు, బంధువులు, పోలీసులు కాలువ వెంబడి భార్గవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ వాహనాన్ని పంపిన మంత్రి శ్రీరంగనాథరాజు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తూర్పుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఉండగా మార్టేరులో కాలువలో బాలిక గల్లంతైన సమాచారం ఆయనకు తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించి తన వెంట ఉన్న ఆచంట ఎస్సైను కాన్వాయ్ వాహనంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆచంట ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో ఘటనా ప్రదేశానికి వెళ్లారు. అప్పటికి ప్రమాదం నుంచి బయటపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రియను కాన్వాయ్ వాహనంలో ఎస్సై రాజశేఖర్ హుటాహుటిన తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గ్రామంలో విషాదఛాయలు పడాల భార్గవి కాలువలో గల్లంతవడంతో మార్టేరు శివారు కంకరపుంత రేవులో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్గవి పెనుగొండలోని ఎస్కేవీపీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ తరువాత దుస్తులు ఉతికేందుకు తల్లికి సాయంగా వెళ్లింది. అంతలోనే ఆమె కాలువలో గల్లంతయిందన్న వార్త స్థానికులను త్రీవంగా కలచివేసింది. భార్గవి తల్లి యమునాదేవి సాధారణ గృహిణి కాగా తండ్రి బులి రామకృష్ణ ఉపాధి నిమిత్తం కొద్దినెలల కొందటే దుబాయ్ వెళ్లాడు. వీరికి భార్గవి, ప్రియ ఇద్దరు కుమార్తెలు సంతానం. ప్రియ మార్టేరు ఎస్వీజీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లి షాక్లో ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతోంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కర్రి వేణుబాబు, గ్రామానికి చెందిన పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. -
వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు గొడవ
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్: క్రికెట్ బెట్టింగ్ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. -
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో పాటు, ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : మద్యం మత్తు ఆ కుటుంబంలో చిచ్చురేపింది. తాగిన మైకంలో ఓ తమ్ముడు క్రికెట్ బాట్తో అన్న తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన పాలకొల్లు మండలం చందపర్రులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మద్యానికి బానిసలైన దేవాబత్తుల ప్రభాకరరావు (48) అతని సోదరుడు సుభాకర్ మంగళవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించారు. వీరు ఇద్దరూ కలిసి తాగడం అలవాటుగా చేసుకున్నారు. వారి మధ్య కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో ఉక్రోషంతో తమ్ముడు సుభాకర్ అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ప్రభాకరరావుపై దాడి చేశాడు. తలపై క్రికెట్ బ్యాట్తో బ లంగా మోదడంతో ప్రభాకరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉద యం ప్రభాకరరావు మరణించాడు. తల్లి సమక్షంలోనే కొట్లాట : ప్రభాకరరావు, సుభాకర్ ఇద్దరూ కొట్లాడుకునే సమయంలో తల్లి నెలసనమ్మ అక్కడే ఉంది. అన్నయ్యను కొ ట్టవద్దని వారిస్తున్నా మద్యం మత్తులో ఉన్న సుభాకర్ ఆమె మాట పట్టించుకోలేదు. మృ తుడు ప్రభాకరరావు భార్య కృష్ణవేణి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అతని కుమారుడు సుకుమార్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో తొ మ్మిదో తరగతి చదువుతున్నాడు. పరారీలో నిందితుడు వీఆర్వో మీసాల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై పి.అప్పారావు ఘటనాస్థలానికి వచ్చి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభాకరరావును హత్య చేయడానికి ఉపయోగించిన క్రికెట్ బ్యా ట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త మ్ముడు సుభాకర్ పరారీలో ఉన్నాడు. రూరల్ సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
సాక్షి, పశ్చిమ గోదావరి : పాఠశాల నుండి అదృశ్యమైన మైనర్ బాలికలను పోలీసులు పట్టుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. చింతలపూడి మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బుధవారం అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆచూకీ కోసం పోలీసులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, పిల్లలను తీసుకొచ్చి జంగారెడ్డి గూడెం డీఎస్పీ స్నేహిత సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పరీక్ష రాస్తూ యువకుడి మృతి
సాక్షి , పాలకొల్లు(పశ్చిమగోదావరి) : గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ పరీక్ష హాలులో గుండెపోటుకు గురై మృతిచెందిన ఓ అభ్యర్థి విషాదాంతమిది. వివరాల్లోకి వెళితే పాలకొల్లు పట్టణంలోని సోమేశ్వర అగ్రహారంలో నివాసం ఉంటున్న గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో ఆది వారం పరీక్ష రాస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 10.30 గంటల 11 గంటల మధ్యలో మృతుడు నరేష్కు స్వల్ప నొప్పి రావడంతో స్థానికంగా విధుల్లో ఉన్న ఏఎ న్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అక్కడ నుంచి పట్టణంలోని బృందా వన ఆసుపత్రికి తీసుకెళ్లి ఈసీజీ తీయించారు. గుండె పోటు వచ్చే సూచనలు కనిపించడంతో అతడ్ని స్థానికంగా ఉన్న కార్డియాలజిస్టు డాక్టర్ రాజశేఖర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యవరసర వైద్యం కోసం భీమవరం వర్మ హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30గంటల సమయంలో నరేష్ ప్రాణాలు విడిచారు. పరీక్ష కోసం హైదరాబాద్ నుంచి వచ్చి మృతుడు నరేష్ స్వస్థలం పెనుగొండ మండలంలోని చినమల్లం పంచాయతీ పరిధిలోని మధనవారిపాలెం. వైజాగ్ ఆంధ్రాయూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. పాలకొల్లుకి చెందిన లక్ష్మీప్రసన్నతో అతనికి సుమారు ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి శర్వాణి అనే నాలుగేళ్ల వయస్సు గల కుమార్తె ఉంది. లక్ష్మీప్రసన్న బీఎస్సీ చదివింది. వివాహం అయిన తరువాత నరేష్ పాలకొల్లులో స్థిరపడ్డారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వెళ్లి చదువుకుంటున్నారు. నరేష్ బావ మరిది హర్ష హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గ్రామ సచివాలయ పరీక్షల కోసం సన్నద్ధమతున్నాడు. హర్ష, నరేష్ పరీక్షల రాయడం కోసం హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చారు. పూలపల్లి శ్రీ గౌతమి స్కూల్లో పరీక్షా కేంద్రంలో వీరిద్దరూ పరీక్ష రాస్తున్నారు. బావమరిదికి చెప్పవద్దని తనకు గుండె నొప్పి వచ్చిందని బావమరిది హర్షకి చెబితే తను ఎక్కడ పరీక్ష రాయడం మానేసి వస్తారోనని పరీక్ష పూర్తయ్యేవరకు తెలియజేయవద్దని తనకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి నరేష్ చెప్పారు. దీంతో బావమరిది హర్షకి సిబ్బంది సమాచారం ఇవ్వలేదు. పరీక్ష పూర్తయిన అనంతరం వెలుపలికి వచ్చిన హర్ష విషయం తెలుసుకుని బావ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే బావ నరేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్లో బావ నరేష్ను తీసుకుని హర్షం భీమవరం వర్మ హాస్పిటల్స్కి తీసుకువెళ్లారు. అక్కడ గుండెపోటుతో నరేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించడంతో హర్ష కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయం అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. ప్రభుత్వానికి నివేదించి నరేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విషాదంలో చినమల్లం పెనుగొండ: చినమల్లంకు చెందిన గుడాల నరేష్ సచివాలయ పరీక్షలు రాస్తూ గుండెపోటు తో మరణించడంతో చినమల్లంలో విషాదం నెలకొంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన గుడాల సత్యనారాయణ కుమారుడు గుడాల నరేష్. నరేష్ మృతదేహాన్ని రాత్రి చినమల్లంలోని స్వగృహానికి తీసుకు వచ్చారు. ఉన్నత చదువులు అభ్యసించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి అసరాగా ఉంటాడనుకున్న తరుణంలో నరేష్ మృత్యువాత పడడంతో గ్రామస్తులు కన్నీరు పెట్టారు. తండ్రి సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్లో చురుగ్గా పాల్గొనడంతో పార్టీ నాయకులు వచ్చి ఆదివారం రాత్రి నరేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సిద్ధాంతంలోని వశిష్టాగోదావరి తీరంలోని కేదారీఘాట్లో అంత్యక్రియలు నిర్వహించారు. నరేష్ మృతికి వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు దంపనబోయిన బాబూ రావు, మాజీ ఎంపీటీసీ గండ్రేటి అప్పారావు, రామచంద్రరాజు, బీసీ సెల్ మండల కన్వీనరు కేశవరపు గణపతి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
బంగారం దుకాణంలో భారీ చోరీ!
సాక్షి, పశ్చిమగోదావరి(పెదపాడు) : జ్యూయలరీ షాపు గోడకు కన్నం పెట్టి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకుపోయిన సంఘటన పెదపాడు మండల పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని అప్పనవీడులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఆంజనేయ జ్యూయలరీ షాపు యజమాని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి బాపులపాడులోని ఇందిరానగర్లోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న బేకరీ యజమాని ఫోన్ చేసి మీషాపు గోడ రంద్రం పెట్టి ఉన్నట్లు జ్యూయలరీ షాపు యజమానికి తెలియజేశాడు. దీంతో షాపు తెరచి చూడగా షాపులోని చెవి దుద్దులు, జుంకాలు, పాపిడి బిల్లలు, మేటీలు ఇతర బంగారు వస్తువులతో పాటు 250 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పెదపాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పెదపాడు పోలీసులు అక్కడకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరణ చేసారు. షాపు యజమాని బొల్లంకి అప్పారావు ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సైజీ జ్యోతి బసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు..
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ప్రభుత్వ గుర్తింపు లేకుండానే గల్ఫ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరిట పంపుతూ మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అనుమతులు లేకుండా మహిళలను గల్ఫ్ దేశాలకు పంపితే అక్రమ రవాణాగా భావించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ చెప్పారు. ఇటీవల జిల్లాకు చెందిన మహిళ దుబాయ్లో పడుతున్న పాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారటం, వారంతా దుబాయ్లోని ఇండియన్ ఎంబసీకి వెళ్ళగా ఇద్దరు మహిళలను వారి గ్రామాలకు క్షేమంగా చేరేలా చర్యలు చేపట్టారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇరగవరం మండలం ఒగిడి గ్రామానికి చెందిన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు మొగల్తూరు గ్రామానికి చెందిన పులుదిండి నాగలక్ష్మి దుబాయ్లో ఉద్యోగం కోసం ఇరగవరం మండలం ఒగిడికి చెందిన వెంకట సుబ్బారావును సంప్రదించారు. నాగలక్ష్మి నుంచి రూ.లక్ష తీసుకుని జూలై 14న శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్కి పంపాడు. అక్కడ శీలం అనే డ్రైవర్ ఆమెను ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని ఒక ప్రాంతంలో ఉంచాడు. దుబాయ్లో ఉండే జ్యోతి నర్సు ఉద్యోగం చూస్తుందని నమ్మబలికారు. కానీ నర్సు ఉద్యోగం రాకపోగా అక్కడ తీవ్రమైన ఇబ్బందులు పడడంతో మానసికంగా కృంగిపోయింది. నాగలక్ష్మితోపాటు మరో ఐదుగురు తెలుగు మహిళలు ఇదే విధంగా ఏవిధమైన ఉద్యోగం లేకుండా, తీవ్ర ఇబ్బందులు పడుతూ నరకం అనుభవిస్తున్నట్లు వాట్సాప్లో వీడియో చిత్రీకరించి తమ బంధువులకు, సీఎం వైఎస్ జగన్కు సైతం సమాచారం అందించారు. అనంతరం దుబాయ్లోని ఇండియన్ ఎంబసీకి వెళ్ళి పరిస్థితిని అక్కడి అధికారులకు వివరించారు. నాగలక్ష్మితోపాటు టి.నర్సాపురం మండలం కె.జగ్గావురం గ్రామానికి చెందిన నట్టా భూలక్ష్మిని ఇండియన్ ఎంబసీ అధికారులు తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు తీసి ఈనెల 10న పంపారు. పాలకొల్లుకు చెందిన ప్రశాంతి అనే మరో మహిళ ఇండియన్ ఎంబసీ వద్ద ఉండగా, రెండురోజుల్లో ఆమె ఇండియాకు రానుంది. నేపథ్యమిదీ.. ఈ కేసులో నిందితుడైన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబు ఎటువంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండానే గల్ఫ్ దేశాలకు 15 ఏళ్ళుగా మహిళలను పంపుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం దోహలో 5 ఏళ్ళు పనిచేసిన సుబ్బారావు అక్కడి నుంచి వచ్చేశాడు. వచ్చిన అనంతరం కొంత పొలం, ట్రాక్టర్ను కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయంతోపాటు ఖతార్, కువైట్, దుబాయ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరుతో పంపుతూ ఉన్నాడు. పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతి గత 15 ఏళ్ళుగా అక్కడే ఉంటూ ఇక్కడి నుంచి పంపే మహిళలకు అక్కడ ఉద్యోగాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతి ఒక్కో మహిళ నుంచి వీసా పంపినందుకు రూ.లక్ష వరకూ తీసుకుంటూ ఉండగా, ఏజెంట్ సుబ్బారావు అదనంగా మరో రూ.50 వేల వరకు వసూలు చేస్తూ ఉంటాడు. దుబాయ్లో ఉండే జ్యోతికి కారు డ్రైవర్గా శీలం చిన్న వ్యవహరిస్తున్నాడు. జిల్లాలో 421మంది నకిలీ ఏజెంట్లు జిల్లాలో అనధికారికంగా, ప్రభుత్వ లైసెన్సులు లేకుండా గల్ఫ్ దేశాలకు మహిళలను పంపే నకిలీ ఏజెంట్లు 421మంది వరకూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రభుత్వ లైసెన్సులు లేకుండా గల్ఫ్ దేశాలకు మహిళలను పంపుతున్నారు. జిల్లాలోని ఏ ఒక్క ఏజెంట్కూ ప్రభుత్వ అనుమతితో లైసెన్సులు లేవని ఎస్పీ నవదీప్సింగ్ స్పష్టం చేస్తున్నారు. జ్యోతిపై లుక్అవుట్ నోటీసు దుబాయ్లో ఉంటూ మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతిపై లుక్అవుట్ నోటీసు జారీ చేయించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ నవదీప్సింగ్ చెప్పారు. దుబాయ్లోని జుల్ఫా ప్రాంతంలో ఒక గదిలో ఇతర దేశాలకు చెందిన చాలా మంది మహిళలతో పాటు 10మంది తెలుగు మహిళలు అక్కడ ఉంచుతున్నట్లు బాధిత మహిళ నాగలక్ష్మి పోలీసులకు వివరించింది. ఉద్యోగాలు ఇప్పించకుండా వేధింపులకు గురిచేస్తోందనీ, తమపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్కు వాట్సాప్ వీడియోతో బాధితుల ఫిర్యాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దుబాయ్లోని బాధిత మహిళలు వాట్సాప్లో తాము పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి పంపారు. వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చర్యలు చేపట్టాలని చెప్పటంతో జిల్లా ఎస్పీ నవదీప్సింగ్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు నకిలీ ఏజెంట్ వెంకట సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జిల్లాకు చెందిన పులుదిండి నాగలక్ష్మి, నట్టా భూలక్ష్మి, పాలకొల్లుకు చెందిన ప్రశాంతితోపాటు మరికొందరు మహిళలు సైతం మోసపోయినట్లు తెలుసుకున్నారు. నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు మహిళలను ఉద్యోగాల పేరుతో పంపుతున్న నకిలీ ఏజెంట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ నవదీప్సింగ్ హెచ్చరించారు. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ బి.కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మొగల్తూరు ఎస్ఐ షేక్ మదీనా బాషా, సిబ్బందితో కలిసి నిందితుడు సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు మొగల్తూరు పోలీసు స్టేషన్లో ఇరగవరం మండలం ఒగిడి గ్రామానికి చెందిన దొండ వెంకట సుబ్బారావు అలియాస్ చినబాబు, పాలకొల్లు మండలం వెదుళ్ళపాలెం గ్రామానికి చెందిన ఆకుమర్తి జ్యోతి, ఆమె డ్రైవర్ శీలం చిన్నా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. 420, 370 ఐపీసీ రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ 24(1)(బీ) ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983, సెక్షన్3(1)(హెచ్), 3(2)(వీ) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. వెంకట సుబ్బారావును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు. -
కుమారుడికి పునర్జన్మనిచ్చి అంతలోనే..
సాక్షి, తణుకు టౌన్: కిడ్నీ పాడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని రక్షించుకునేందుకు ఒక తండ్రి చేసిన త్యాగం విషాదాంతంగా మారిన సంఘటన తణుకు పట్టణంలో శనివారం జరిగింది. తన కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో కిడ్నీ దానం చేసిన తండ్రి ఆపరేషన్ అనంతరం తలెత్తిన అనారోగ్యం కారణంగా తనువు చాలించాల్సి వచ్చింది. తణుకు పాతూరుకు చెందిన కాకర్ల సంజీవరావు (సాల్మన్రాజు) (58) స్థానిక చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా వారిలో చిన్న కుమారుడు భరత్కుమార్కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులను, ఇతర దాతలను ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి తన కుమారుడికి తానే కిడ్నీ దానం చేసి బతికించుకుందామని సిద్ధపడ్డారు. ఈనెల 11న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో నిర్వహించారు. సంజీవరావు కిడ్నీని అతని కుమారునికి మార్పిడి చేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కిడ్నీ దానం పొందిన కుమారుడు భరత్కుమార్ ప్రస్తుతం కోలుకుంటుండగా దానం చేసిన తండ్రి సంజీవరావు మాత్రం మూడు రోజులకు ఆపరేషన్ అనంతరం ఊపిరితిత్తులకు న్యూమోనియా కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారి శనివారం ఉదయం మృతి చెందారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న సంజీవరావు కుటుంబానికి తన కుమారుడి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ భారంగా మారడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గత నెలలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు ఉత్తర్వులు అందగానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ అనంతరం మూడు రోజుల తర్వాత న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలోనే సంజీవరావు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల తణుకులోని పాస్టర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సంజీవరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. -
బతుకు భారమై కుటుంబంతో సహా...
సాక్షి, పశ్చిమగోదావరి : ఉగ్గుపాలతో లాలిపోసే కన్నతల్లే ఆ పసిబిడ్డలను భారంగా తలపోసింది. భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై బతకడమే వ్యర్థమనుకుంది. తన ఇద్దరు బిడ్డలతో పాటు తల్లితో కలిసి పోలవరం కుడికాల్వలో దిగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో నాలుగు నెలల పసికందు ప్రాణాలు కోల్పోగా మిగిలిన ముగ్గురిని స్థానికులు కాపాడారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని పోలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగర్ సమీపాన గల పోలవరం కుడి కాల్వలో శుక్రవారం ఓ మహిళ, తన తల్లితో పాటు తన ఇద్దరు మగ బిడ్డలతో సహా దిగి ఆత్మహత్యాయానికి పాల్పడింది. కాల్వలో ప్రవాహం పెద్దగా లేని కారణంగా ఆ ఇల్లాలితో పాటు ఆమె తల్లి, పెద్ద కుమారుడు బతికి బయట పడ్టారు. కానీ అభం శుభం తెలియని నాలుగు నెలల పసికందు కన్నుమూశాడు. భర్త మృతితో తీవ్ర మనస్తాపం ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో జూనియర్ లైన్మెన్గా పనిచేసే చెలమాల నాగరాజు గత నెల 14న విధుల్లో ఉండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భర్తను కోల్పోయిన భార్య చెలమాల శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురైంది. నెల రోజులుగా తాను కూడా భర్త వద్దకు వెళ్లిపోతానని, నేను లేకుంటే మా పిల్లలు సైతం అనాథలుగా మిగిలిపోతారని, భర్త చనిపోయిన ఏరియాలో ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఇంట్లో చెబుతోంది. శ్రావణి తల్లిదండ్రులు ఓదార్చుతూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. శ్రావణి మానసికంగా కోలుకునేందుకు వీలుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు భర్త చనిపోయాక ఆర్థిక ఇబ్బందులు కూడా కుటుంబానికి ఎక్కువయ్యాయి. భర్త మృతి తర్వాత సంబంధిత విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇంకా అందలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తూ.. భర్త నాగరాజు చనిపోయాక నాలుగు నెలల మగబిడ్డ, ఏడాదిన్నర వయస్సు గల పవన్తో కలిసి శ్రావణి లింగపాలెం మండలం సింగగూడెంలోని తల్లిదండ్రుల ఇంట్లో నివాసముంటోంది. అయితే పెద్ద కుమారుడు పవన్కు జ్వరం రావడంతో శ్రావణి, తన తల్లితో పాటు ఇద్దరు పిల్లలను వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. తిరిగి వెళుతూ పోలసానిపల్లి పంచాయతీ ఆంజనేయనగరం సమీపంలోని పోలవరం కుడి కాల్వ వద్దకు శ్రావణి తన తల్లిని, పిల్లలను తీసుకుని వచ్చింది. కుడి కాల్వ గట్టు వద్ద రేవులో శ్రావణి తన నాలుగు నెలల బిడ్డను, శ్రావణి తల్లి గంగ తన మనువడు పవన్ను ఎత్తుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలో దిగారు. ఇక్కడే శ్రావణి తన చేతిని కత్తితో కోసుకుంది. అది చూసిన ఆమె తల్లి గంగ ఆపే ప్రయత్నం చేసింది. దీంతో తమ పిల్లలిద్దరిని కాల్వలో వదిలేశారు. నాలుగు నెలల పసికందు నీరు తాగి ఊపిరిరాడక కన్నుమూసాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని బయటకు రావాలని కేకలు వేశారు. అయినప్పటికీ పట్టించుకోలేదు. భీమడోలు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఎస్సై కె.శ్రీహరిరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రావణి చేతి నుంచి అధిక రక్తస్రావం కారడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె తల్లి గంగ, పవన్లు నీటితో మునిగిపోతుండగా పోలీసులు వారిని కాపాడి భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమడోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పగబట్టి.. ప్రాణం తీశాడు
సాక్షి, పశ్చిమగోదావరి : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో సోదరుడు వరుసైన వ్యక్తిని దారికాచి విచక్షణారహితంగా కత్తితో నరికి చంపాడు. ఆ తరువాత హత్యాయుధంతో సహా ద్వారకాతిరుమల పోలీస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ మెట్టపంగిడిగూడెంలో మంగళవారం ఉదయం సంచలనాన్ని రేకెత్తించింది. సమాచారాన్ని అందుకున్న భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని రక్తనమూనాలను సేకరించి దర్యాప్తును ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకట సుబ్బారావు (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తున్నాడు. సుబ్బారావు పెదనాన్న కుమారుడు కొప్పిశెట్టి లక్ష్మణరావు బతుకుతెరువు కోసం ఏడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఇదిలా ఉంటే లక్ష్మణరావు దుబాయ్లో ఉన్న సమయంలో అతని భార్య రమాదేవి మరిది వరసైన సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. భర్త దుబాయ్ నుంచి వచ్చినా వీరి సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రమాదేవి భర్త వద్దకు రాకుండా అదే గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె పిల్లలకు తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి లక్ష్మ ణరావు వద్ద ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. పక్కా పథకంతో.. లక్ష్మణరావు తన భార్యను కాపురానికి రమ్మని పలుమార్లు బతిమలాడినా ఫలితం లేకపోయింది. ఒకే వీధిలో ఉంటూ సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో విసుగుచెందిన లక్ష్మణరావు తన సోదరుడు సుబ్బారావును కడతేర్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో సుబ్బారావు గేదెల పాలు తీసేందుకు మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కత్తితో కాపుకాసుకుని ఉన్న లక్ష్మణరావు మోటారు సైకిల్పై పొలానికి వచ్చిన సుబ్బారావును ఇష్టానుసారంగా తెగ నరికాడు. ముందు రెండు చేతులను నరకడంతో సుబ్బారావు కొంతదూరం పరుగులు తీశా డు. అయితే లక్ష్మణరావు అతడిని వెంబ డించి మరీ రెండు కాళ్లను సైతం నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. దీంతో సుబ్బారావు మృతిచెందినట్లు భావించిన లక్ష్మణరావు, హత్యకు ఉపయోగించిన కత్తితో సహా పోలీస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో కొ ట్టుమిట్టాడుతున్న సుబ్బారావును స్థానిక రైతులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై భీమడోలు సీఐ సు బ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెలలు నిండకుండానే కాన్పు చేయడంతో..
సాక్షి, పశ్చిమగోదావరి(పాలకొల్లు) : పాలకొల్లు సూర్య నర్సింగ్ హోంలో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా గర్భిణి చల్లా ధనలక్ష్మి మృతి చెందిన సంఘటనపై ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదివారం ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమంలో మృతురాలు తండ్రి చల్లా సత్యనారాయణ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై విచారణ చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామ మాజీ సర్పంచ్ చల్లా సత్యనారాయణ ఎకైక కుమార్తె చల్లా ధనలక్ష్మి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం పాలకొల్లులో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు రాగా ఈ ఏడాది మే 31న పట్టణంలోని సూర్య నర్సింగ్ హోమ్లో వైద్యురాలు పీపీఆర్ లక్ష్మీకుమారి సలహా మేరకు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పడంతో అదే రోజు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే కాన్పు చేసే ప్రయత్నం చేయడంతో ధనలక్ష్మి మృతిచెందింది. దీనిపై ఆమె తండ్రి సత్యనారాయణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో గతనెల 23న జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి వైద్యనిపుణురాలు డా.ఎం పద్మ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో విచారణ నిర్వహించారు. ధనలక్ష్మి మృతికి సూర్య నర్సింగ్ హోం డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యం కారణంగా నిర్ధారించి ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం 6 నెలల పాటు ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పేర్కొన్నారు. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు నాకు ఒకే ఒక కుమార్తె. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. చదువులో మెరిట్గా నిలిచేది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తుంది. ఎంతో ఆరోగ్యంతో ఉండేది. కేవలం పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చూపించాను. అయితే డాక్టర్ పీపీఆర్ లక్ష్మీకుమారి నిర్లక్ష్యంగా వైద్యం చేసింది. ప్రాణాలు బలిగొంది. అధికారులు చర్యలు తీసుకోవడంతో న్యాయం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. –చల్లా సత్యనారాయణ, మృతురాలి తండ్రి -
లేడీస్ హాస్టల్కి వెళ్లి ఆ తర్వాత...
సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్ అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు యువకులపై కేసు.. ఏలూరు టౌన్: లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్సీ వీధిలోని మనస్వి లేడీస్ హాస్టల్ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు. ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్కు చెందిన ఏలూరి అనిల్ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో వీఆర్వో మృతి
సాక్షి, పశ్చిమగోదావరి : గణపవరం మండలం పిప్పర వీఆర్వో డీకే శ్రీనివాసరావు (45) గురువారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఉదయం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా కారులోనే గుండెపోటుకు గురై మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు పిప్పర వీఆర్వోగా పనిచేస్తూ సమీపంలోని అత్తిలిలో మకాం ఉంటున్నారు. ఆయన మృతదేహం వద్ద తహసీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు, ఆర్ఐ పోతురాజు, వీఆర్వోలు, మండల రెవె న్యూ సిబ్బంది నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్స్టేషన్లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
భర్త ముందే భార్యతో ఫోన్లో..
తణుకు : తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన ఇది. మద్యం తాగుదామని పిలిచి మద్యం షాపులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తణుకు మండలం దువ్వలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన కామన బాలాజీ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన రోజారమణితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల వయసున్న పాప ఉంది. రోజారమణి ద్వారా దువ్వకు చెందిన బాలాజీ అనే యువకుడు శివరామకృష్ణకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలాజీతో తన భార్య సన్నిహితంగా ఉంటోందని శివరామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో గతంలోనే బాలాజీని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు నెలల క్రితం శివరామకృష్ణ రోజారమణిని ఉపాధి నిమిత్తం విదేశాలకు పంపించాడు. అయినప్పటికీ బాలాజీ ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు శివరామకృష్ణ గమనించాడు. దీనిపై ఇటీవల రెండు పర్యాయాలు గట్టిగా అతడిని హెచ్చరించాడు. నెలరోజుల క్రితం శివరామకృష్ణ బాలాజీ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులకు సైతం విషయాన్ని తెలిపాడు. ఇదిలా ఉంటే బాలాజీ శుక్రవారం రాత్రి శివరామకృష్ణకు ఫోన్ చేసి దువ్వ రావాలని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని చెప్పాడు. దీంతో దువ్వ గ్రామానికి వచ్చిన శివరామకృష్ణ.. మద్యం తాగేందుకు బాలాజీని తీసుకుని గ్రామంలోని సూర్య వైన్స్కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగుతుండగా వారి మధ్య రోజారమణి విషయంపై మరోసారి ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో బాలాజీ శివరామకృష్ణ భార్యకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. దీన్ని అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచాడు. తీవ్ర గాయమైన బాలాజీ తనను కాపాడాలని పరిసర ప్రాంతాల్లో కలియతిరిగాడు. మద్యం షాపులోనే పనిచేస్తున్న బాలాజీ చిన్నాన్న కామన ఆంజనేయులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. శివరామకృష్ణ తన మోటారు సైకిల్ను అక్కడే వదిలి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలాజీ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. సమాచారం తెలుసుకున్న తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ, రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు ముందు ఫొటో.. బాలాజీని హత్య చేయడానికి ముందు శివరామకృష్ణ అతడితో కలిసి ఫొటో తీసుకున్నాడు. మద్యం తాగుతున్న స్థలంలోనే ఫొటో తీయించుకున్న శివరామకృష్ణ హత్య చేసిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడిని వెంబడించి హైవేపై పట్టుకున్నారు. శివరామకృష్ణకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు బాలాజీ తండ్రి కామన రాముడు రెండేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం తల్లి సత్యవతితో కలిసి ఉంటున్నాడు. ఇతనికి సోదరి ఉండగా ఆమెకు వివాహం చేశారు. బాలాజీ స్థానికంగా రాడ్బెండింగ్ పని చేస్తుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు శివరామకృష్ణ కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బం«ధువులకు అప్పగించారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. -
ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చి కాటికి పంపించాడు ఓ కొడుకు. పున్నామ నరకాన్ని ఇంట్లోనే చూపించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కర్కశంగా మెడపై కాలితో నులిమి, రోడ్డు పైకి ఈడ్చుకువచ్చి పారతో తలను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని చినకాపవరం గ్రామంలో నివసిస్తున్న ఎస్.సత్యవతి(70) తన కుమారుడు బంగారయ్య వద్దే ఉంటోంది. సత్యవతికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. ఇటీవల అరెకరం భూమి, ఇల్లు తన పేరున రాయాలని బంగారయ్య సత్యవతిని ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి అందరికీ పంచుతానని సత్యవతి చెప్పడంతో ఆమెను చంపేస్తే మొత్తం ఆస్తి తనకే వస్తుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భీమవరం రూరల్ సీఐ శ్యామ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో పడుకుని ఉన్న సత్యవతిని బయటకు తీసుకువచ్చి పారతో తలపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి పెద్ద కుమార్తె వానపల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): పట్టణంలో నివాసం ఉంటున్న కాగిత త్రినాథ్ అనే వ్యక్తి గడిచిన పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.కేశవరావు తెలిపారు. విజ్జేశ్వరం జీటీపీఎస్ ప్లాంటు ఫైర్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న త్రినాథ్ పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. త్రినాథ్ ఆచూకీ తెలిసిన వాళ్లు పట్టణ పోలీసు స్టేషన్ 08813–231100 నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్సై కోరారు. చాగల్లు గ్రామంలో.. చాగల్లు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. చాగల్లు గ్రామానికి చెందిన సుంకవల్లి గంగాధర్(43) మతి స్తిమితం లేని వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్ల వద్ద వెతికినా సమాచారం తెలియకపోవడంతో తల్లి సుంకవల్లి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. వివాహిత అదృశ్యం చాగల్లు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన బోల్లా కీర్తి అనే 23 సంవత్సరాల వివాహిత ఈ నెల 24వ తేదీన నిడదవోలులో ఆస్పత్రికి వెళ్తానని భర్త నాగసూర్యచంద్రంకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. -
గంజాయి రవాణా ముఠా అరెస్ట్
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లజర్ల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. విచారణ అనంతరం గురువారం రాత్రి ముఠా సభ్యులను తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు, తహసీల్దార్ కనకదుర్గ నిందితుల్ని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపర్చినట్టు ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్నగర్కు చెందిన కాట్రోడ్డు నవీన్, వడిపే సంజీవ్, విశాఖపట్టణానికి చెందిన వెంకటలక్ష్మి బృందంగా ఏర్పడి కమిషన్పై గంజాయి రవాణా చేస్తుంటారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి 80 ప్యాకెట్లలో ఉన్న 160 కిలోల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగ దొరికాడు..
సాక్షి, పశ్చిమ గోదావరి(ఉండ్రాజవరం): దొంగతనాల్లో ఆరితేరిన పాత నేరస్తుడిని తణుకు, ఉండ్రాజవరం ఎస్సైలు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఉండ్రాజవరం ఎస్సై అవినాష్, తణుకు రూరల్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన పులవర్తి లీలాసాయి గుప్త ఇటీవల తణుకు మండలం వెంకట్రాయపురంలో రామేశ్వరపు సురేష్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీనిపై తణుకు సీఐ చైతన్యకృష్ణ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్సైలు కలిసి కేసు విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాలంగిలో ఉన్నాడని సమాచారం తెలియటంతో వీరిద్దరూ కలిసి దాడిచేసి ముద్దాయిని గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు. దీంతో అదుపులోకి తీసుకున్న లీలాగుప్తాని విచారించగా ఇటీవల ఉండ్రాజవరం మండలం సావరం, పాలంగి గ్రామాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని చెప్పారు. ఆ దొంగతనాల్లో 10 కాసులతో పాటు రెండు కాసుల బంగారం, రెండు వెండిగిన్నెలు, వెండి పట్టీలు, ఒక ఫొన్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముద్దాయి గతంలో పలు నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదని అందుకే తరచూ దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉండ్రాజవరం, తణుక రూరల్ ఎస్సైలను, కేసులో సహకరించిన క్రైమ్ పార్టీ శ్రీధర్, పోలయ్యకాపు, సత్యనారాయణ, అక్బర్, మహేష్, వెలగేష్లను తణుకు సీఐ చైతన్య కృష్ణ అభినందించారు. -
దారుణం: భార్య, అత్తపై కత్తితో దాడి
సాక్షి, పశ్చిమ గోదావరి: గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి భార్య, అత్తను అతికిరాతకంగా నరికి చంపాడు. వివరాల ప్రకారం దొండపూడి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మితో గంగోలు పంచాయతీ పరిధిలోని రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మర కాంతారావుకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కాంతారావు వ్యవసాయ కూలి. ఏడాది కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. నాలుగు నెలల క్రితం భర్త కాంతారావు తప్పతాగి ఇంటికి వచ్చి తరచూ కొట్టడం చేస్తుండటంతో విసుగు చెందిన లక్ష్మి భర్త కాంతారావును పిల్లలను వదిలి పుట్టింటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం జామాయిల్ తోటలో కర్రలు నరకడానికి వెళ్లి పనులు ముగించుకుని మద్యం మత్తులో అత్తగారింటికి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యను పిలిచి గొడవ పడతున్నాడు. దీంతో అత్త కప్పల పుష్పవతి (55) అడ్డుతగలడంతో తనతో తీసుకువచ్చిన కత్తితో తల, మెడపైన నరకడంతో అత్త కుప్పకూలిపోయింది. వెంటనే భార్య లక్ష్మి(32)ని కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో వీరిద్దరూ రక్తపు మడుగులోపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీనిని గమనించిన బావమరిది కప్పల మంగారావు కాంతారావును పట్టుకోవడానికి ప్రయత్నించగా అతని చేతిపై కత్తితో నరికాడు. కాంతారావును స్థానికులు పట్టుకుని దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. భార్యపై అనుమానంతోనే కాంతారావు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. -
160 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, పశ్చిమ గోదావరి: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి గుట్టు రట్టయింది. నర్సీపట్నం నుంచి హైదరాబాదు 80ప్యాకెట్లలో దాదాపు 160కిలోల గంజాయిని నీలిరంగు క్రిటా కారులో తరలిస్తుండుగా గురువారం సాయంత్రం పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈగంజాయి అక్రమ రవాణాలో ఒక మహిళ, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న టీఎస్ 07 యూహెచ్ 3658 నీలిరంగు క్రిటా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ కారు నర్సీపట్నం నుంచి బయలుదేరి తణుకు, తాడేపల్లిగూడెం బైపాస్ మీదుగా వెళ్తుండుగా చేబ్రోలు వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నట్టు ఈ ముఠాకు సమాచారం అందడంతో తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుండి తెలికిచెర్ల–అనంతపల్లి–కొయ్యలగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళేందుకు ప్లాను చేసుకున్నారు. అనంతపల్లి సెంటర్లో కారును రోడ్డుపక్కన పెట్టి టీ తాగేందుకు ఆగారు. అటుగా వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు, నల్లజర్ల ఎస్ఐ కె.చంద్రశేఖర్ కేసునమోదు చేసారు. ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉంది. -
భార్యపై అనుమానంతో..
సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన టి.నరసాపురం మండలం మెట్టగూడెంలో జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా మెట్టగూడెం ఉలిక్కిపడింది. వివరాలిలా ఉన్నాయి.. మెట్టగూడానికి చెందిన కోడూరి జీవనజ్యోతి (27)ను ఆమె భర్త మణికంఠ స్వామి టెలిఫోన్ ఛానల్ రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జీవనజ్యోతి తలపై రాడ్డుతో కొట్టి హతమార్చిన మణికంఠస్వామి జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్కు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వెళ్లి లొంగిపోయాడు. జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్ నుంచి రాత్రి 2 గంటల ప్రాంతంలో మృతురాలి సోదరుడు నంద్యాల వరప్రసాద్కు ఫోన్ వచ్చింది. మీ బావ మీ అక్కను తలపై కొట్టాడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పమని పోలీసులు వరప్రసాద్కు సమాచారం ఇచ్చారు. దాంతో వరప్రసాద్ చెల్లెలు నివాసం ఉండే ఇంటికి వెళ్లి చూడగా, జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జ్యోతి మృతిచెందిందని నిర్ధారించారు. మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం గ్రామానికి చెందిన కోడూరి మణికంఠస్వామి టి.నరసాపురం మండలం మెట్టగూడెంకు చెందిన నంద్యాల వెంకటేశ్వరరావు కుమార్తె జీవనజ్యోతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవా రని, తన చెల్లెల్ని బావ మణికంఠ స్వామి కొట్టి చంపాడని మృతురాలి సోదరుడు వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో టి.నరసాపురం హెచ్సీ పి.మహేశ్వరరావు కేసు నమోదుచేశారు. చింతలపూడి సీఐ పి.రాజేష్ ఘటనా స్థలాన్ని పరి శీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామాలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే షకీలున్నీసా పాల్గొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. -
కర్కశత్వానికి చిన్నారుల బలి
సాక్షి, ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గానీ.. కంటికి కనరాడు!’ అంటూ ఓ కవి సమాజంలో అమానుషాలను ఎలుగెత్తిచాటాడు. మానవత్వపు ఛాయలు మరుగునపడిపోతూ.. ఆధునిక పోకడలతో క్రూరత్వాన్ని నింపుకుంటున్న మృగాళ్లు సమాజంలో పెరిగిపోతున్నారు. చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలను దేవతలుగా కొలిచే పవిత్ర భారతంతో మానవమృగాలు అపవిత్ర కార్యాలకు పాల్పడుతున్నాయి. తల్లిగా.. చెల్లిగా.. చెలియగా.. సగభాగంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచాల్సిన వేళ కర్కశత్వంతో నిండు జీవితాలను బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అభం శుభం తెలియని పసితనం.. ముద్దులొలికే మాటలతో మురిపిస్తూ మైమరపించిన చిన్నారుల నుంచి బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తారా? అనే భయం వెంటాడుతోంది. ఆడపిల్లలుగా పుట్టటమే శాపమా అనే బాధ వారి మనసులను కలచివేస్తోంది. పసిపిల్లలపైనా లైంగిక దాడులు పెరిగిపోవటం సమాజంలో నైతిక విలువలు ఎలా మంటకలిసిపోతున్నాయో అద్దంపడుతున్నాయి. వావీవరసలు మరచి మృగాల్లా మారుతూ మానవ సంస్కృతికే మాయని మచ్చలా చెలరేగిపోతున్నారు. చిన్నారులపై అత్యంత పాశవికంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ తల్లిదండ్రుల గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. పేగు బంధాన్ని మరిచి.. పేగు బంధాన్ని మరిచాడు.. సభ్య సమాజం సిగ్గుపడేలా కన్నకూతురినే కాటేశాడు.. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.. కొంతకాలం తన కామవాంచను తీర్చుకుంటూ తనలోని కర్కశత్వాన్ని చూపించాడు. 12 ఏళ్ల చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటన బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. బాలిక నుంచి భయంకరమైన చేదు నిజాన్ని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది.. ఇలాంటి నీచుడిని కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుమరాలి వయసున్న బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఇలాంటి కీచకపర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. పుస్తకాల కోసం తన స్నేహితురాలి ఇంటికి సైకిల్పై వెళుతున్న బాలికను 60 ఏళ్ల వృద్ధుడు అటకాయించాడు. ఆ బాలికపై అఘాయిత్యం చేసేందుకు నిర్జన ప్రదేశంలో షెడ్డులోకి లాక్కెళ్లాడు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వస్తున్నారనే భయంతో శివయ్య అనే వృద్ధుడు ఉడాయించాడు. పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన అతడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 2015 జూన్ 18న ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరాకాలనీలో ఘోరం జరిగింది. ఏడేళ్ల చిన్నారి తన తల్లి గుడ్లు తీసుకురామ్మా అంటే కిరాణా కొట్టుకు వెళ్ళి రాక్షసుడి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారి పసిమొగ్గను చిదిమేసిన మృగాడు ఇంట్లోని ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. తల్లి గుండెలు అవిసేలా రోధిస్తూ ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్టు సురేష్పై అనుమానం ఉన్నా బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. చివరికి సురేష్ తండ్రే వచ్చి మీ పాప మృతదేహం మా ఇంటిలోని ట్రంకు పెట్టెలో ఉంది.. బట్టల కోసం వెతుకుతుంటే కన్పించిందని చిన్నారి తల్లి్లదండ్రులకు చెప్పడంతో ఓ రాక్షసుడి అకృత్యం బయటపడింది. 2015 అక్టోబర్ 23న అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వీరిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం హనుమాన్గూడెం గ్రామంలో 2015 అక్టోబర్ 23న జరిగింది. 2017 మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరకుతోటలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఇంట్లో ఆయువతికి పెళ్లి జరగాల్సి ఉండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి బహిర్భూమికి వెళ్లగా ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా చెరకు తోటలోకి లాక్కుపోయారు. వారిలో ఒక యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువులు గ్రామశివారున ఉన్న పొలాల వెంట యువత కోసం వెతకగా ఓ చెరకు తోటలో యువతి అపస్మారక స్థితిలో పడి కనిపించింది. 2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ ఆవరణలో ఆధ్యాత్మిక సభలకు వచ్చిన బాలికను యువకుడు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో పంచాయతీ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు. 2017 జూలై 30న బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన తాడిచర్ల పోతురాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 ఏప్రిల్ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో 5 ఏళ్ల మైనర్ గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మానసిక, శారీరక అసమతుల్యత మనిషిలో టెస్టోస్టిరాన్, మెదడులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా విపరీతమైన లైంగిక కోరికలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు వావీవరసలు, నైతిక విలువలు, పరిసరాలు ఇవేమీ పట్టించుకోకుండా లైంగిక దాడులకు తెగబడుతూ ఉంటారు. వీటిని మానసిక రుగ్మతగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తి చిన్ననాటి నుంచీ పెరిగిన పరిస్థితులు, వాటి ప్రభావం కూడా మానసిక స్థితిపై ఆధార పడుతుంది. ఎదుటివారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. బాలికలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు, ఎప్పుడూ చిన్నారులను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎప్పుడైనా బాలలు డిప్రెషన్, అనాలోచితంగా, మౌనంగా ఉంటే వెంటనే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సున్నితమైన మనస్తత్వంతో పిల్లలను పెంచటం సరికాదు, సమాజం పట్ల అవగాహన కల్పించేలా తల్లిదండ్రి బాధ్యత వహించాలి. –అక్కిశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చెడు ప్రభావాలకు లోనవుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. వెబ్సైట్లు, సోషల్మీడియా ప్రభావం ప్రస్తుతం అధికంగా ఉంది. విద్యార్థి దశ నుంచే లైంగిక విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువతులకు రక్షణ కల్పించేందుకు శక్తి టీమ్లను ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ ఏర్పాటుచేశారు. ఎక్కడైనా ఆకతాయిలు ఈవ్టీజింగ్, ఇతరత్రా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే శక్తి టీమ్లకు సమాచారం ఇవ్వచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. వారు ఏదైనా దారితప్పితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. –పైడేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ, ఏలూరు జీవనశైలిలో విపరీత మార్పులు సమాజంలో మారుతున్న ఆధునిక పరిస్థితుల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటం మానసిక రుగ్మతగానే చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడలు, యువతను పెడదారి పట్టిస్తున్నాయి. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడంతోనే మార్పు వస్తుంది. అవసరమైతే అటువంటి వారికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. కొందరిలో శారీరకంగా వచ్చే మార్పులు కాగా, కొందరిలో సామాజికంగా వారు పెరిగిన వాతావరణం కూడా కారణం కావచ్చు. కొందరు పెద్ద వయసున్న వ్యక్తులు కూడా ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. –డాక్టర్ హరికృష్ణ, మానసిక వైద్యనిపుణులు -
చాక్లెట్ అనుకుని ఎలుకల మందు తిని..
సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి): బుట్టాయగూడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్టెం గౌతమి కుమారుడు అభిచరణ్తేజ ఆదివారం రాత్రి చాక్లెట్ అనుకుని ఎలుకలమందు తినుకుంటూ వచ్చి గ్రామంలోని మరో ఇద్దరు బాలలు కట్టం సంతోష్, మడకం రాహుల్లకు ఇచ్చాడు. వారు కూడా చాక్లెట్గానే భావించి తిన్నారు. తిన్న కొద్దిసేపటికి వాంతులు కావడంతో ముగ్గురూ అపస్మారక స్థితికి వెళ్లారు. బాలలను గమనించిన వారి కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్యం కోసం బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అభిచరణ్ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ అభిచరణ్తేజ (5) మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు బాలలు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. అభిచరణ్తేజ మృతిపై అనుమానాలు అభిచరణ్తేజ మృతిపై అతని తాత, నాన్నమ్మలు, తండ్రి కుమార్ రాజాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ మృతిపై తల్లిపైనే తమకు అనుమానం ఉందని ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గౌతమి, కుమార్ రాజాలు మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారని వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ కోర్టులో కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు. మృతిపై పోలీసులకు తాత కృష్ణ, నాన్నమ్మ రామలక్ష్మిలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఫిర్యాదు అందుకున్న స్థానిక ఎస్సై కె.నాగరాజు రాయిగూడెం గ్రామానికి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో గౌతమి ఇంట్లో మంచం కింద ఉన్న ఎలుకల మందు ప్యాకెట్ను పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం ఎస్సై ఏలూరు వెళ్లి అభిచరణ్తేజ మృతికి సంబంధించి పోస్టుమార్టం అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలుకల మందు తినడం వల్ల అభిచరణ్తేజ మృతి చెందినట్లు భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...
సాక్షి, పశ్చిమ గోదావరి: చిన్నారి ఎంతగానో ఇష్టపడి తిన్న ఆ చాక్లెట్ అతని ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. అతనితో పాటు ఆ చాక్లెట్స్ తిన్న మరో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి పంచాయతీ కి చెందిన రావిగూడెం అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది ... బాలుడి తల్లి తెలిపిన వివరాలప్రకారం .. కురసం అభయ్ చరణ్ తేజ్ (5) అనే బాలుడు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలోని ఓ కొట్టు వద్ద నుండి తెచ్చిన చాక్లెట్స్ ని తన స్నేహితులతో కలసి తిన్నాడు. అనంతరం ఇంట్లో వండిన చేపల కూరతో భోజనం చేసి ఆడుకోడానికి బయటకు వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు వస్తూ పడిపోయాడు, బాలుడు ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో చేపల కూరలో చేప ముల్లు గొంతులో అడ్డుపడిందేమో నని తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికుల సహాయంతో బుట్టాయగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గ మద్యంలో అభయ్ చరణ్ తేజ్ మృతి చెందినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా అభయ్ చరణ్ తేజ్ చాక్లెట్ తింటూ ఆడుకుంటున్న సమయంలో మాకు పెట్టమని అడిగి తీసుకుని తిన్నామరో ఇద్దరు చిన్నారులు కట్టం సంతోష్(7),మడకం రాహుల్ వర్మ(6) లు కూడా అస్వస్థత కు గురికావడంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించగా వారు అక్కడ చికిత్సపొందుతున్నారు. తల్లి పైనే స్థానికుల అనుమానం... ఆదివారం సాయంత్రం అభయ్ చరణ్ తేజ్ (5) తిన్న చాక్లెట్ లో ఎలుకల మందు కలిసిందని అది తిన్న బాలుడు మృతి చెందాడని తెలిపారు. దీనిపై బాలుడు తల్లిపైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ధి కాలంగా భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారని,కొడుకు అభయ్ చరణ్ తేజ్ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడని ఈ క్రమంలో కొడుకును అడ్డు తొలగించుకోవడం కోసం తల్లి ఇలా ప్లాన్ చేసిందా అనే అనుమానం కలుగుతుందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే అస్వస్థకు గురి కావడంతో బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రాణాపాయం తప్పిందని తిరిగి మళ్ళీ అదే విధంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు తెలుపుతున్నారు. కాలం చెల్లిన చాక్ లెట్స్ అని ప్రచారం జరుగుతుందని ఇందులో నిజం లేదని అదే జరిగితే చాల మంది పిల్లలకు ఇలాగే జరగాలని వారు తెలిపారు. పలు అనుమానాలకు తావిస్తున్న చిన్నారి మరణం అసలు మిస్టరీ వీడాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న బుట్టాయగూడెం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు. -
అనుమానాస్పదంగా యువకుడి హత్య
సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : స్థానిక జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున యువకుడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మండలంలోని పెదకాపవరం గ్రామానికి చెందిన తాటిపర్తి జీవరత్నం (23), తన స్నేహితుడు మద్దా అహోరోన్తో కలిసి శుక్రవారం ఆకివీడు వచ్చారు. శనివారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరి వెళుతుండగా స్థానిక మాదివాడ సెంటర్ సమీపంలో ఈ దారుణం జరిగింది. మృతదేహాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అందరూ రోడ్డు ప్రమాదంగా భావించారు. బంధువులు వచ్చి అక్కడ పరిస్థితిని, జీవరత్నంతో పాటు వచ్చిన అహోరోన్కు ఏ విధమైన దెబ్బలు తగలకపోవడం, ప్రమాదానికి సంబంధించిన సంఘటనలు ఏమీ కన్పించకపోవడంతో ఇది హత్యేనని మృతుడు సోదరుడు తాటపర్తి రాజేష్, బంధువులు, స్నేహితులు, పలువురు పెదకాపవరంకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. జీవరత్నం ప్రేమ వ్యవహారంలో గుమ్ములూరుకు చెందిన అహోరోన్ గతంలో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని భీమవరం రూరల్ ఎస్సై కె.సుధాకరరెడ్డి చెప్పారు. అహోరోన్, ఆ యువతి తండ్రి ఏసురత్నం, మరికొంత మంది కలిసి హత్య చేశారని రాజేష్ ఫిర్యాదు చేశారన్నారు. ఆరు నెలల క్రితం మృతుడు తండ్రి సుగుణరావు స్థానిక మాదివాడ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ కేసును కూడా పోలీసులు నీరు గార్చారని, నేటికీ తేల్చలేదని, జీవరత్నం కేసును కూడా అదే విధంగా నీరుగార్చే ప్రమాదం ఉందని, బంధువులు ఆరు గంటల పాటు ఆందోళన చేశారు. రాస్తారోకో చేసి వాహనాల రాకపోకల్ని నిలుపుదల చేశారు. నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, భీమవరం రూరల్ సీఐ శ్యాంకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. మండలంలోని జి.కొత్తపల్లిలో చోటు చేసుకున్న ఈ కేసును పోలీసులు ఛేదించారు. ద్వారకాతిరుమల ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరానికి చెందిన చప్పా చిన్న చిన్నారావు ఈనెల 16 ఉదయం జి.కొత్తపల్లి నుంచి దూబచర్లకు వెళ్లే రహదారి పక్కన తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి 108 అంబులెన్స్లో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారావు ఈ నెల 19న మృతిచెందాడు. ఈ కేసును హత్యా నేరం కింద నమోదు చేసిన భీమడోలు సీఐ సీహెచ్.కొండలరావు దర్యాప్తును వేగవంతం చేశారు. అమ్మాజీ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాపు చేశారు. అమ్మాజీకి లక్కోజు సత్యనారాయణ అనే వ్యక్తితో అక్రమం సంబంధం ఉందని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే దాడి చేసినట్టు ఒప్పుకున్నారు. చిన్నారావును అతని భార్య అమ్మాజీ అడ్డుతొలగించుకోవాలన్న తలంపుతో ఆమె ప్రియుడు లక్కోజు సత్యనారాయణతో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలో చిన్నారావును ఈనెల 16న భీమవరం నుంచి తీసుకొచ్చి ఘటనాస్థలం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం చిన్నారావు మృతిచెంది ఉంటాడని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి వచ్చిన అమ్మాజీ తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిపడేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐ కొండలరావు అసలు విషయాన్ని రాబట్టి, నిందితులు అమ్మాజీ, ఆమె ప్రియుడు సత్యనారాయణలను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. -
దారుణం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్ : ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఎన్నికల సందర్భంగా పట్టణంలో హడావిడి నెలకొంది. స్థానిక మసీదు సెంటర్ ప్రాంతానికి చెందిన షేక్జాని, మద్దుకూరి సంపత్ గురువారం రాత్రి అదే ప్రాంతంలో తిరుగుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి షేక్జానీని మద్దుకూరి సంపత్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో షేక్జాని సంపత్పై కలబడేందుకు ప్రయత్నించాడు. సంపత్ తన వద్ద ఉంచుకున్న సర్జికల్ చాకుతో జానీపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పిల్లి వెంకటేశ్వరరావు (38) (పిల్లి వెంకన్న) వారిద్దరు గొడవపడుతుండడాన్ని చూసి వారించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సంపత్ వెంకన్నపైనా దాడి చేశాడు. దీంతో వెంకన్న అడ్డుకునేందుకు ప్రయత్నించగా మణికట్టుపై గాయమైంది. చేతిపై గాయాన్ని చూసుకుంటున్న సమయంలో సంపత్ వెంకన్న కంఠంపై బలంగా చీరాడు. దీంతో తీవ్రగాయమైంది. వెంకన్న తన కంఠానికి చేయి అడ్డుపెట్టుకుని రోడ్డుపై పరుగుతీశాడు. అదే సమయంలో వెంకన్న స్నేహితుడు జోసెఫ్ మోటారుసైకిల్పై వస్తున్నాడు. జోసఫ్ సహకారంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి కంఠానికి తీవ్రగాయం కావడంతో అధికంగా రక్తస్రావమైంది.వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో వెంకన్న మృతి చెందాడు. కంఠంపై తీవ్రగాయం అయిన సమయంలో వెంకన్న శరీరం నుంచి అయిన రక్తస్రావం రోడ్డుపై చారికలుగా పడింది.ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంకన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లి, ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. వెంకన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను, స్నేహితులను కంఠతడి పెట్టించాయి. పోలీసుల అదుపులో సంపత్ పిల్లి వెంకన్న, షేక్జానీలపై విచక్షణా రహితంగా చాకుతో దాడిచేసిన మద్దుకూరి సంపత్ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. దాడికి సంభవించిన కారణాలపై విచారిస్తున్నారు. సీఐ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో కోటుకుంటున్న షేక్జానీ సంపత్ సర్జికల్ చాకుతో చేసిన దాడిలో షేక్జానీ తీవ్రంగా గాయపడ్డాడు. కుడిచేతి మణికట్టు వద్ద నుంచి మోచేయి వరకు తీవ్రగాయమైంది. శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వెంటనే షేక్జానిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం షేక్జాని ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఇద్దరు కిడ్నాపర్లు అరెస్ట్
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరిని తణుకు పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆరేళ్ల బాలుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 4న ఉదయం నిత్యం రద్దీగా ఉండే తణుకు పట్ట ణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అయితే కిడ్నాప్ వ్యవహారా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తణుకు పట్టణ పోలీసులు అదేరోజు సాయంత్రం కేవలం నాలు గు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడులోని ఒక ఇంట్లో నిందితులు బాలుడిని వదిలి వెళ్లినట్టు సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్టు పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ తెలిపారు. పట్టిచ్చిన సీసీ కెమెరాలు గణపవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి తోట పెద్దకాపు మధ్యవర్తులతోపాటు గ్రామంలోని రైతుల నుంచి సుమారు రూ.2 కోట్ల వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు అప్పులపాలైన పెద్దకాపునకు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో భార్య దుర్గాభవాని, ఇద్దరు పిల్లలతో 20 రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయవాదిని సంప్రదించడానికి తణుకు వచ్చిన పెద్దకాపు ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని న్యాయవాది ఇంటికి భార్య దుర్గాభవాని, కుమారుడు తోట సోమసూర్యశశివర్దన్ (6)ను తీసుకుని వెళ్లారు. లోపల తల్లిదండ్రులు న్యాయవాదితో మాట్లాడుతున్న క్రమంలో బాలుడు శశివర్దన్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటారుసైకిల్పై వచ్చి బాలుడిని అపహరించుకుపోయారు. నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామానికి చెందిన తన్నీడి విజయకుమార్ అలియాస్ వాసు, అదే గ్రామానికి చెందిన కోడూరి మధు తమ కుమారుడిని ఎత్తుకుపోయినట్లు పెద్దకాపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ దర్యాప్తు ప్రారంభించారు. సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఒక బియ్యం దుకాణంలో బయట ఉన్న సీసీ కెమెరాలో బాలుడిని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్పై ఎక్కించుకుని వెళుతున్న దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా అన్ని చెక్పోస్టులను అప్రమత్తం చేసిన పోలీసు అధికారులు ఒకపక్క నిందితులు వాడుతున్న సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలో బాలుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. పరారీలో ఉన్న నిందితులను ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో విజయకుమార్, మ«ధును బుధవారం అరెçస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తణుకు సీఐ చైతన్యకృష్ణ, తణుకు, రూరల్, పెరవలి ఎస్సైలు డి.ఆదినారాయణ, ఎన్.శ్రీనివాసరావు, వి.జగదీశ్వరరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరావు అభినందించారు. -
అంకమరావు కన్ను పడిందా.. ఇక కాటికే..
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: సంచలనం రేపిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు నిందితులు చెబుతున్న విషయాలు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. ఈ కేసులో నిందితులు నరరూప రాక్షసులని సాక్షాత్తు పోలీసు అధికారులే చెప్పే స్థాయిలో నిందితుల ఘాతుకాలు ఉన్నాయి. దండుపాళ్యం సినిమాను తలపించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో అరాచకాలు చేసిన నలుగరు గ్యాంగ్ను ఎస్పీ ఎం.రవిప్రకాష్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆదివారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డీఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. శ్రీధరణి, నవీన్ ఇద్దరూ బౌద్ధారామాల పర్యాటక కేంద్రానికి ఈ నెల 24 ఉదయం 10.30 గంటలకు వెళ్లారు. వారిద్దరూ కొండ పైభాగం నుంచి సుమారు 500 మీటర్ల మేర లోపలికి ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంలోకి వెళ్లారు. యువ జంటల కోసం వేచి చూస్తున్న నిందితులు కృష్ణాజిల్లా మైలవరం సంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్ రాజు (28), జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య (22), తుపాకుల గంగయ్య (20), మాణికం నాగరాజు (20) ఆ ప్రేమజంట ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ముందుగా నవీన్ను రాజు కర్రతో తలపై బలంగా కొట్టాడు, మరో ఇద్దరు కర్రతో దాడి చేశారు. నవీన్ తలకు తీవ్రగాయం కావటంతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం శ్రీధరణిపై రాజు లైంగిక దాడి చేశారు. అత్యాచారం చేసిన తరువాత తనను వదిలిపెట్టాలని ఆమె కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. వదిలేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో శ్రీధరణిని కర్రతో తలపై బలంగా కొట్టటంతో ఆమె మృతిచెందింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ఈ ఘటన సమయంలో సెక్యూరిటీ వస్తున్నట్టు అలికిడి రావటంతో నిందితులు పారిపోయారు. కేసును ఛేదించింది ఇలా.. ఎస్పీ ఆదేశాల మేరకు తడికలపూడి ఎస్ఐ సతీష్కుమార్, చింతలపూడి సీఐ విల్సన్, భీమడోలు సీఐ కొండలరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న నవీన్ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ఏఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు కొండలరావు, విల్సన్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు ముమ్మరంగా గాలించాయి. బౌద్ధారామం సెక్యూరిటీ గార్డులు, పరిసర గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, మామిడితోటల కాపలాదారులు ఇలా అందరి నుంచి వివరాలు సేకరించారు. వేటగాళ్ళ మాదిరిగా ఉన్నారని వారంతా చెప్పిన ఆనవాళ్ళు ఒకటే కావటంతో ఆదిశగా దర్యాప్తు చేశారు. ఈ ప్రాంతంలో 30 మంది వరకూ పిట్టలు కొట్టేవారు ఉన్నారనీ తెలుసుకున్నారు. వారిలో 12 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరికి అనుమానితుడుగా ఉన్న అంకమరావు అలియాస్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దండుపాళ్యం తరహా గ్యాంగ్ శ్రీధరణి హత్య, లైంగికదాడి కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులను విచారణ చేయగా పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. ప్రధాన నిందితుడు పొట్లూరి అంకమరావు తొలుత 2017 డిసెంబర్ లో ఒక యువ జంటపై లైంగికదాడి చేయటంతోపాటు వారినుంచి డబ్బు లాక్కున్నాడు. మరోసారి ఇదే తరహాలో ప్రేమ జంటపై దాడి చేశాడు. వీరెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో అదే అదనుగా తీసుకున్నారు. తన బావమరుదులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, మాణికం నాగరాజుతో కలిసి దండుపాళ్యం గ్యాంగ్గా మారిపోయారు. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తెలంగాణ ఖమ్మం జిల్లాల్లో ఈ తరహాలో యువ జంటలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడడం, విచక్షణారహితంగా కొట్టి, లైంగికదాడులు చేస్తూ వచ్చారు. కన్ను పడిందో..కాటికి పోవాల్సిందే... నరరూప రాక్షసులుగా మారిన ఈ నలుగురు గ్యాంగ్ ...అందమైన యువతులను టార్గెట్గా చేస్తారు. బౌద్ధారామాల వంటి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తోటలు వంటి ప్రాంతాల్లో రెక్కీ చేస్తుంటారు. అంకమరావు కన్ను పడిందా.. ఇక కాటికి పోవాల్సిందేనని పోలీసులు అన్నారు. మూడు, నాలుగు జంటలు ఉంటే వాటిలో అందమైన యువతులను లక్ష్యంగా చేసుకుని యువకుడిని చావగొడతారు. అనంతరం యువతితో కామవాంఛ తీర్చుకుంటారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, డబ్బును దొంగిలించుకుపోతారు. ఇలా నాలుగు జిల్లాల పరిధిలో 2017 నుంచీ సుమారు 32 మంది యువతులపై లైంగిక దాడులకు తెగబడ్డారు. ఇక నాలుగు హత్యలు కూడా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారు విచక్షణారహితంగా జంతువులను వేటాడినట్లు యువకులపై దాడి చేయటంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇక జిల్లాలో శ్రీధరణి హత్య నాలుగవది. 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్జా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకటి, నూజివీడులో రెండు, ఖమ్మంలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, పశ్చిమలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 2017 డిసెంబర్ నుంచీ మొదలు పెట్టిన ఈ దాడులు ప్రతి 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటున్నారు. నెల, రెండు నెలలు దాడులకు విరామం ఇస్తూ మళ్ళీ వరుసగా లైంగిక దాడులకు తెగబడేవారు. -
అనుమానం పెనుభూతమై..
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరు వన్టౌన్ ప్రాంతంలో వ్యక్తిని కిరాతకంగా హతమార్చి మొండెం నుంచి తలను వేరుచేసి హతుడు ఆధారాలు తెలియకుండా తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ చేసి హత్య చేసిన నిందితులను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు వెల్లడించారు. ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, వైవీవీఎల్ నాయుడుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏలూరు వన్టౌన్ నవాబుపేటకు చెందిన కంచి సతీష్ అలియాస్ జోజి అనే వ్యక్తిని వెంకటాపురం పంచాయితీ సుంకరవారితోట ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారం చేసుకునే కల్లపల్లి వేణు, తన దుకాణంలో పనిచేసే బావిశెట్టివారిపేటకు చెందిన రుప్ప మురళీకృష్ణ సహాయంతో హత్య చేశాడు. కేసును పక్కదారి పట్టించేందుకు ఆధారాలు లభించకుండా సతీష్ తలను మొండెం నుంచి వేరు చేశారు. మొండెం మాత్రమే పోణంగి కాలువలో లభించటంతో తల కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. మొండెం ఎవరనేదానిపై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు కేసును పదిరోజుల్లోనే చేధించారు. అనుమానం పెనుభూతమై హత్య కేసులో ప్రధాన నిందితుడు వేణు వన్టౌన్ ప్రాంతంలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వేణు నవాబుపేటలో ఒక మహిళతో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన హతుడు కంచి సతీష్ మహిళ ఇంటికి తరచూ వస్తోన్న వేణును రాత్రి వేళల్లో అడ్డగిస్తున్నాడు. వేణుకు మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో హత్యకు గురైన సతీష్ ఆ మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని వేణుకు అనుమానం వచ్చింది. ఫిబ్రవరి 14న వేణు తన భార్యతో కలిసి ఆ మహిళ ఇంటికి వెళుతుండగా హతుడు సతీష్ మరోమారు వారిద్దరినీ నిలువరించి అతని భార్యను సైతం దుర్భాషలాడాడు. దీంతో కోపంతో రగిలిపోయిన వేణు ఎలాగైనా సతీష్ను అడ్డుతొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. వేణు కిరాణ దుకాణంలో పనిచేస్తున్న రుప్పా మురళి సహాయంతో సతీష్ను మోటారు సైకిల్ ఎక్కించుకుని పోణంగి, మాదేపల్లి సరిహద్దు తమ్మిలేరు వాగు ప్రాంతానికి తీసుకువెళ్లి ఫూటుగా మద్యం తాగించారు. అనంతరం కత్తితో దాడి చేసి సతీష్ను హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియకుండా ఉండేందుకు హతుడి తలను నరికి అదేరోజు రాత్రి దెందులూరు చెక్పోస్టు సమీపంలోని గోదావరి కాలువలో పడేశారు. ఏలూరు రూరల్ పోలీసులు ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మృతుని వివరాలు గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 27న ఉదయం 11.30 గంటలకు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి సెంటర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు హత్యకు వినియోగించిన కత్తి, మోటారు సైకిల్తోపాటు, హతుడి తలను స్వాధీనం చేసుకున్నారు. తలను పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులపై క్రైం నెంబర్ 54/2019 మేరకు సెక్షన్ 302, 201 ఐపీసీ మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులైన వేణు, మురళిపై నిఘా ఉంచేందుకు రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశా>లు జారీ చేశారు. సమావేశంలో ఏలూరు రూరల్ ఎస్సై పి.వాసు, ట్రైనీ ఎస్సై రాజేష్ ఉన్నారు. -
‘దండుపాళ్యం’ ప్రేరణ.. రాజు కంటబడితే..!!
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద జరిగిన తెర్రి శ్రీధరణి(18) హత్యోదంతంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. దండుపాళ్యం సినిమాతో ప్రభావితమైన కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు సైకోగా మారాడని.. ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్ కిల్లర్గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 14 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని పోలీసులు తెలిపారు. వారిలో నలుగురిని అత్యాచారం అనంతరం రాజు దారుణంగా హత్యచేసినట్టు వెల్లడించారు. కన్ను పడిందంటే కాటికే.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం జి.కొత్తపల్లికి మకాం మార్చాడు. జీడితోటలకు కాపలాదారుడుగా ఉంటూ అక్కడి అటవీ ప్రాంతంలో పక్ష్లులను, జంతువులనూ వేటాడుతుంటాడు. ఈ క్రమంలో తారసపడ్డ ప్రేమజంటల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. యువతిపై కన్నుపడిందంటే డబ్బులిచ్చినా తీసుకోడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగడుతాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాడు. (ప్రేమికులే వాడి టార్గెట్) చనిపోయాడనుకుని.. గత ఆదివారం గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద హత్యకు గురైన శ్రీధరణిని కూడా తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీధరణి, ఆమె ప్రియుడు దౌలూరి నవీన్ బౌద్ధారామాల వద్ద తారసపడడంతో వారిని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. అనంతరం వారిపై దాడికి దిగాడు. తలపై బలంగా మోదడంతో నవీన్, శ్రీధరణి స్పృహతప్పి పడిపోయారు. కాసేపటికి శ్రీధరణి నేలపై పాక్కుంటూ తప్పించుకోవాలని చూడడంతో ఆమె కాళ్లు విరిచేశాడు. అనంతర అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి మరణించింది. నవీన్ కూడా చనిపోయాడు అనుకుని రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నవీన్ ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తలపై 40 కుట్లు వేశారు. దౌలూరి నవీన్, మృతి చెందిన తెర్రి శ్రీధరణి ఒక్క కేసుకూడా లేదు.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్ తీసుకుని వెళ్లిపోయిన రాజు, నేరుగా జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్లోని సిమ్ కార్డును తీసి పడేసి, తన సిమ్ కార్డును వేసి ఫోన్ను వాడటం మొదలు పెట్టాడు. ఆ ఫోన్ను అమ్ముతానంటూ ఒక సెల్ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్ కొనేందుకు నిరాకరించాడు. మొబైల్ డంపింగ్ పరిజ్ఞానంతో రాజును గుర్తించారు. పోలీసుల విచారణలో తొలుత రాజు సహకరించలేదు. అయితే, తమదైన శైలిలో మరోసారి ప్రయత్నించడంతో ఈ సీరియల్ కిల్లర్ తను చేసిన నేరాల చిట్టా విప్పాడని పోలీసులు చెప్పారు. కాగా, ఇంతవరకు రాజుపై ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడంపై పోలీసులు దిగ్భాంతి చెందారు. జీలకర్ర గూడెంలో శ్రీధరణి హత్య నాలుగోది. అంతకు ముందు నూజివీడు, మైలవరం, మచిలీపట్నంలలో మరో ముగ్గురు యువతులను రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి అనే యువతి ఆదివారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. యువతితో పాటు ఉన్న ఆమె స్నేహితుడు దౌలూరి నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో నవీన్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. (ప్రేమికులే వాడి టార్గెట్) శ్రీధరణి హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి హత్య కేసులో ఆమె ప్రియుడు నవీన్ పాత్రపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధరణిని బయటికి తీసుకెళ్లాడు గనుక నవీన్ కూడా నిందితుడేనని అభిప్రాయపడ్డారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రేమికులే వాడి టార్గెట్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ప్రేమికులే వాడి టార్గెట్.. ప్రేమ జంటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దలా వాలిపోతాడు. వాళ్లని బెదిరించి డబ్బులు గుంజుతాడు. అంతటితో ఆగకుండా ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది యువతుల జీవితాలతో ఆ వేటగాడు చెలగాటమాడాడు. కానీ ఆ ఘటనలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. అయితే తాజాగా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద జరిగిన తెర్రి శ్రీధరణి(18) హత్యోదంతంతో ఆ వేటగాడి బండారం బట్టబయలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం అర్జావారిగూడేనికి చెందిన దౌలూరి నవీన్, ఎంఎం పురం గ్రామానికి చెందిన తెర్రి శ్రీధరణి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 24న ఉదయం 11.30 గంటలకు వారిద్దరూ గుంటుపల్లి బౌద్ధారామాలను సందర్శించేందుకు వెళ్లారు. భీముడి పాదాల సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉన్న వారు, అటుగా వచ్చిన కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు కంట పడ్డారు. అంతే మానవ మృగంలా మారిన రాజు నవీన్పై దుడ్డు కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం శ్రీధరణిని హత్య చేశాడు. అయితే ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని ఘటనా స్థలాన్ని చూసి అంతా భావిస్తున్నారు. అసలు విషయాలు పోస్టుమార్టం రిపోర్టులోవెల్లడవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న నవీన్ కూడా మృతి చెంది ఉంటాడని భావించిన రాజు ఘటనా స్థలంలో పడి ఉన్న శ్రీధరణి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. తీవ్ర గాయాలపాలైన నవీన్ ,శ్రీధరణి ప్రేమికులపై నిఘా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తె గంగమ్మను పొట్లూరు రాజు కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు సంతానం. ఇదిలా ఉంటే నెల రోజులుగా రాజు జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రతి రోజు చుట్టు పక్కల ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి పిట్టలు, అడవి పందులను వేటాడుతున్నాడు. ప్రతి ఆదివారం జీలకర్ర గూడెంకు వెళ్లి ప్రేమికులపై నిఘా పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న ఆదివారం రాజు జీలకర్ర గూడెం బౌద్ధారామాల వద్దకు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పట్టించిన సెల్ ఫోన్ శ్రీధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్ తీసుకుని వెళ్లిపోయిన రాజు, నేరుగా జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్లోని సిమ్ కార్డును తీసి పడేసి, తన సిమ్ కార్డును వేసి ఫోన్ను వాడటం మొదలు పెట్టాడు. ఆ ఫోన్ను అమ్ముతానంటూ ఒక సెల్ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్ కొనేందుకు నిరాకరించాడు. ఇదిలా ఉంటే శ్రీధరణి హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సోమవారం రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాంతో విషయాలన్నీ బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాజు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా..? లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే నవీన్ సెల్ ఫోన్ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు శ్రీధరణి, నవీన్ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో నిజమెంత అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నవీన్ నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఏది ఏమైనా శ్రీధరణి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు ఈకేసును 24 గంటల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా?
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం/కామవరపుకోట: శ్రీధరణి హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం పకడ్బందీ పోలీసు బందోబస్తుతో శ్రీధరణి మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలమైన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధ గుహల ప్రాంతంలో పోలీసులు ఆధారాల కోసం జల్లెడపట్టారు. శ్రీధరణి, నవీన్లకు చెందిన సెల్ ఫోన్ల సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు కనుగొన్నట్టు విశ్వసనీయ సమాచారం. బౌద్ధ గుహల సందర్శన కోసం వచ్చిన ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు సేకరించిన క్లూస్టీమ్ బౌద్ధ గుహల ప్రాంతంలో ఏఎస్పీ ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐ చవాన్, టి.నరసాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఎస్సైలు రాంబాబు, రామకృష్ణ, ఎ.దుర్గారావు క్లూస్ కోసం జల్లెడ పట్టారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. వేలిముద్ర నిపుణులు ఘటనా ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలం (డాన్)తో ఆ ప్రాంత మంతా పరిశీలన జరిపారు. భీముని పాదం ప్రాంతం అంతా ముళ్ల పొదలతో నిండిన నిర్జన ప్రదేశం. ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి నలుగురు సభ్యుల బృందం, వీఆర్వోలు జి.నాగరాణి, ఎం.ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్త నమూనాలు, తలవెంట్రుకలు సేకరించారు. ఘటనా స్థలంలో పురుషులకు సంబంధించిన నాలుగు రకాల తల వెంట్రుకలను సేకరించారు. అంటే ఈ వెంట్రుకలు నలుగురివిగా భావిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులు? ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొంత పురోగతి సాధించినట్టు సమాచారం. ఆదివారం ఆ ప్రాం తాల్లో సంచరించిన వ్యక్తుల మొబైల్ నెంబర్ల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మొబైల్ డంప్ టెక్నాలజీ ద్వారా ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎన్ని నెట్వర్క్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎంత మంది సెల్ఫోన్లు ఉపయోగించారు అనేది ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొబైల్ డంప్ టెక్నాలజీలో నిపుణుడైన తడికలపూడి ఎస్సై సతీష్కుమార్ ద్వారా నిందితుల అన్వేషణ కొనసాగిస్తున్నారు. భీమడోలు, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఒంటిమీద గాయాలతో ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ యువకుడు ఒక సెల్ఫోన్ మెకానిక్ అని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కేసును పూర్తిగా ఛేదిస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ పేర్కొన్నారు. శ్రీధరణి హత్య కేసులో ఘటనా ప్రాంతాలు పరిశీలిస్తున్న పోలీసు అధికారులు క్లూస్ టీమ్ సేకరించిన తలవెంట్రుకలు గతంలో కూడా.....? గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పలు ప్రేమ జంటలపై దాడులు జరిగినా వెలుగులోని రాలేదు. తాము అల్లరవుతామనే భయంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక పోవడంతో ఆ ఘటనలు వెలుగులోకి రాలేదు. బౌద్ధ గుహల విస్తీర్ణం ఎక్కువ కావడం, దీనిని ఆనుకుని నిర్జన ప్రదేశం ఉండటంతో ఇటువంటి ఘటనలకు దుండగులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీకి కూడా తలకు మించిన భారంగా మారుతోంది. న్యాయం చేయండి: శ్రీధరణి తల్లిదండ్రులు ఏలూరు (టూటౌన్): శ్రీధరణి మృతదేహానికి సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బం«ధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంతం దద్దరిల్లింది. బాధితులను వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో నిశ్చితార్థం కానున్న తమ కుమార్తెను భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దవులూరి నవీన్ హత్య చేశాడని ధరణి తల్లిదండ్రులు ఆరోపించారు. మరో వైపు మృతురాలి కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే నవీన్పై దాడి చేశారంటూ అతని కుటుంబ సభ్యులు పరస్పర ఆరోపణ చేశారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమల: శ్రీధరణి హత్య కేసులో ప్రధాన నిందితుడ్ని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మైదుకూరు మండలం చంద్రాల గ్రామానికి చెం దిన పొట్లూరి రాజును ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఏం జరిగుంటుంది.. జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తెను కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నెల నుంచి అతను జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. పక్షులు, అడవి పందులు వంటివి వేటాడేందుకు అతడు రోజూ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళుతున్నాడు. అయితే శ్రీధరణి హత్య కేసుకు సంబంధించి అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వేటకని వెళ్లిన అతడికి బౌద్ధారామాల వద్ద శ్రీధరణి, భీమడోలు మండలం అర్జావారిగూడెంకు చెందిన దౌలూరి నవీన్ తారసపడి ఉండవచ్చని, ఆ సమయంలో అతడు శ్రీధరణిపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన నవీన్పై అతడు దాడిచేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాడి తరువాత శ్రీధరణి, నవీన్ మృతిచెంది ఉంటారని భావించి, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడని భావిస్తున్నారు. దాడిచేసిన వ్యక్తి పక్కన మరెవరైనా ఉన్నారా? వారికీ ఈ అఘాయిత్యంలో పాత్ర ఉందా? అన్నదానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాడి జరిగిన రోజున 108లో నవీన్ను పోలీసులు ప్రశ్నించగా, శ్రీధరణి తనతో రాలేదని చెప్పాడు. అందరూ తనపై దాడిచేశారని.. వారు మావాళ్లేనని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మళ్లీ దాడిచేసిన వారెవరో తనకు తెలియదని చెప్పడం పోలీసులను తికమక పెట్టింది. -
కలకలం రేపిన యువతి హత్య
పశ్చిమగోదావరి, కామవరపుకోట: రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్యకేసు మరువక ముందే జిల్లాలోని గుంటుపల్లి వద్ద మరో ఘటన చోటుచేసుకుంది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన యువతీ యువకుల్లో యువతి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాలు చూసేందుకు ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా వచ్చారు. ఈ ప్రాంతంలో ఎక్కువ నిర్జన ప్రాంతాలు ఉండటంతో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో బౌద్ధారామాల దిగువ ప్రాంతంలోని భీముడి పాదాల సమీపంలో రక్తపు మడుగులో ఉన్న యువతీ యువకులను సెక్యూరిటీ గార్డ్ సతీష్ చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి సీఐ విల్సన్ యువతీ యువకులను పరిశీలించగా, యువతి మృతి చెందినట్లు గుర్తించగా, యువకుడు తీవ్రగాయాతో ఉన్నాడు. మొహం, తలపై బలమైన గాయాలతోపాటు శరీరమంతా తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని సీఐ ప్రశ్నించగా పేరు నవీన్ చెప్పాడు. దీంతో అతడిని స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తల వెనుకభాగంలో బలమైన గాయం ఉన్నట్టు గుర్తించారు. అలాగే మృతదేహం పక్కనే రక్తం అంటిన దుడ్డుకర్ర ఉండటంతో దానితో ఆ యువతిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దౌలూరి నవీన్ది భీమడోలు మండలం అర్జావారిగూడెం కాగా తెర్రి శ్రీధరణి(18)ది ఉంగుటూరు మండలం ఎంఎం పురం. వీరిద్దరూ ఉదయం 11.30 గంటల సమయంలో మోటార్ సైకిల్పై బౌద్ధారామానికి వచ్చారు. ఆదివారం కావడంతో 85 మంది పర్యాటకులు వచ్చినట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. యువతి మృతిపై అనుమానాలు ఇంటి వద్ద నుంచి బయలుదేరిని వీరిని బంధువులు ఎవరైనా అనుసరిస్తూ వచ్చి ఈ ప్రాంతంలో హతమార్చడానికి ప్రయత్నించారా? వీరి మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారా? ప్రేమ జంటను వేరే ఎవరైనా బెదిరించి వారిపై దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఘటనా ప్రాంతానికి సమీపంలో నవీన్, శ్రీ అనే పేర్లను ఒక బండరాయిపై సుద్దతో రాశారు. మృతురాలి వద్దగాని, గాయాలైన యువకుడి వద్ద గానీ సెల్ఫోన్ లేకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ మురళీకృష్ణ, చింతలపూడి సీఐ విల్సన్, తడికలపూడి, చింతలపూడి, టి.నరసాపురం ఎస్సైలు కె.సతీష్కుమార్, రామకృష్ణ, రాంబాబు పరిశీలించారు. రాజధాని ఘటనకు దగ్గరగా.. రాజధాని ప్రాంతంలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసుకు , గుంటుపల్లిలో ఆదివారం జరిగిన ఘటనకు కొద్దిగా పోలికలు ఉండటంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని ఘటనలో నిర్జన ప్రదేశంలో జ్యోతి హత్య గావించబడటం, శ్రీనివాసరావు తీవ్ర గాయాల పాలవడం తెలిసిందే. శ్రీనివాస్ని ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానం ఇవ్వడం, ఆ తరువాత లోతుగా విచారిస్తే అతనే జ్యోతిని హత్య చేశాడని బలయపడటం తెలిసిందే. ఇదే రీతిలో గుంటుపల్లిలో శ్రీధరణి మృతి చెందడం, నవీన్కు తీవ్ర గాయాలవటం, అలాగే పోలీసులు ప్రశ్నించినప్పుడు పేరు తప్పితే ఇతర విషయాలు చెప్పకపోవడం, ఘటనా ప్రాంతం అనుమానించదగ్గదిగా ఉండటంతో పోలీసులు అత్యాచార యత్నం, హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన తెర్రి శ్రీధరణి హతాశులైన శ్రీధరణి తల్లిదండ్రులు భీమడోలు: శ్రీధరణిది ఉంగుటూరు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురం. పోలసానిపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీఎస్సీ (ఎంపీసీ గ్రూప్) చదువుతోంది. భీమడోలు మండలం ఆర్జావారిగూడెంకు చెందిన దౌలూరి నవీన్ బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ ఏడాది మానేశాడు. తండ్రి పెయింటర్ కావటంతో అతని వృత్తిలో సహాయపడుతున్నాడు. వీరిద్దరు ఈ కళాశాలలోనే ఇంటర్ నుంచి చదువుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. ధరణి మరణంతో ఆమె తల్లిదండ్రులు తెర్రి అప్పారావు, అలివేలుమంగ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. “ఆదివారం కదమ్మా ఎక్కడికీ వెళ్లవద్దు.. ఇంటి వద్దనే ఉండు’.. అని తల్లిదండ్రులు మొత్తుకున్నారు.. వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఆమె ఇంటి నుంచి వెళ్లింది. కళాశాలకని వెళ్లి మాకు కడుపుకోత మిగిల్చింది అంటూ వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరికి వివాహాలు చేసేశారు. ప్రతి ఆదివారం కళాశాలకు వెళ్లే తమ కుమార్తె సాయంత్రానికి ఇంటికి వస్తుందని భావించిన వారిని ఆమె మరణం వార్త దుఃఖ సాగరంలో ముంచేసింది. చదువులో బాగా రాణిస్తున్న శ్రీధరణిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వారు జీవిస్తున్నారు. బస్పాస్తో ధరణిని గుర్తించిన పోలీసులు శ్రీధరణి ఎంఎం పురం గ్రామం నుంచి పూళ్ల వచ్చింది. అక్కడ బస్ ఎక్కింది. భీమడోలులో దిగి అక్కడ నవీన్ బైక్పై వారిద్దరు వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వద్ద గల బస్పాస్ల ఆధారంగా ఆమెను గుర్తు పట్టారు. -
మిమ్మలను చంపి మరో పెళ్లిచేసుకుంటాననేవాడు..
పశ్చిమగోదావరి, మొగల్తూరు: మొగల్తూరులో సోమవారం తల్లీకూతుర్లు మృతి ఘటనలో మిస్టరీ వీడలేదు. కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మృతిరాలి తల్లితండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన రాత్రే మృతురాలి భర్త నల్లి మిల్లి వెంకట రామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు నరసాపురం తరలించారు. సీఐ కృష్ణమోహన్ ఆధ్వర్యం లో దర్యాప్తు సాగుతోంది. సోమవారం రాత్రి తల్లి, కుమార్తెల మృతదేహాలను బంధువుల సమక్షంలో నరసాపురం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంగళవారం మృతదేహాలకు పో స్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మీప్రసన్న, కుమార్తెలు రోజా శ్రీలక్ష్మి, జాహ్నవి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజా శ్రీలక్ష్మి మెడకు ఎడమ వైపున రక్తపు గాటు ఉండటం, జాహ్నవి మెడవద్ద కూడా రక్తపు చారికలు కనబడటం, ఫ్యాన్కు ఉరివేసుకున్న లక్ష్మీప్రసన్న ముక్కు నుంచి రక్తం కారడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ కలహల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కుమార్తెలను చంపి తల్లి లక్ష్మీప్రసన్న ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామాంజనేయరెడ్డి తల్లి దశదిన కర్మ నిర్వహించిన ఆది వారం రోజున కుటుంబసభ్యులు లక్ష్మీప్రసన్నను వేధించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక దశలో రామాంజనేయరెడ్డి ఆవేశంతో మిమ్మలను చంపి మరో పెళ్లిచేసుకుంటానని అంటుండేవాడని మృతిరాలి తండ్రి కర్రి సత్యనారాయణరెడ్డి పోలీ సుల సమక్షంలో ఆరోపించాడు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పో స్టుమార్టం నివేదిక, పోలీస్ విచారణలో నిజ నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. -
మొగల్తూరులో విషాదం
సాక్షి, మొగల్తూరు: ఏం కష్ట మొచ్చిందో ఆ తల్లికి.. పేగుబంధంపైనా పెనుకసిని చూపింది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కడితేర్చింది. పిల్లల చిరునవ్వులను చూసి నిత్యం మురిసిపోయిన ఆమె అతి కర్కశంగా వారి మెడకు తువ్వాలు బిగించి, బిగించి ఊపిరి తీసింది. చివరకు తనూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. ఏం జరిగిందంటే..! పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్ సమీపంలో నివాసం ఉండే నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న(28) ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. తను చని పోవడానికి ముందు పెద్ద కుమార్తె రోజాశ్రీలక్ష్మి (7), చిన్న కుమార్తె జాహ్నవి (5) లను కూడా దారుణంగా తువ్వాలుతో గొంతుబిగించి చంపేసింది. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులు, కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో మొగల్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. రైస్ మిల్లు జయమాని అయిన లక్ష్మీప్రసన్న భర్త నల్లిమిల్లి వెంకటరామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి 7.15గంటల సమయంలో మిల్లు నుంచి ఇంటికి వచ్చిన రామాంజనేయరెడ్డి ఇంట్లో భార్య ఫ్యాన్కు ఉరివేసుకుని, మంచంపై ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడిఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొగల్తూరు ఎస్సై వచ్చి వెంటనే రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ముందు పిల్లలను చంపి.. ముందు పిల్లల గొంతులను తువ్వాలుతో బిగించి లక్ష్మీప్రసన్న చంపిందని, తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులకు మెడపై గాయాలు ఉండడమే కాకుండా, ముక్కునుంచి రక్తం కారుతున్నట్టు గుర్తించారు. పిల్లలు ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అదే గదిలో ఫ్యాన్కు చీరతో లక్ష్మీప్రసన్న ఉరివేసుకుందని భావిస్తున్నారు. ఆదివారం ఇంట్లో పెద్ద గొడవ? లక్ష్మీప్రసన్న ఇంట్లో ఆదివారం జరిగిన పెద్ద గొడవే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కొన్నినెలలుగా భర్త వేధింపులే ఈ గొడవకు కారణమని సమాచారం. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. వెంటక రామాంజనేయరెడ్డి కుటుంబానిది ఆచంట మండలం పిట్టలవేమవరం. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి 15ఏళ్ల క్రితం మొగల్తూరు వచ్చేశారు. అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక్కడ రైస్మిల్లు వ్యాపారం ప్రారంభించారు. తండ్రీ, కొడుకులు ఇద్దరూ కలసి రైసుమిల్లు నడిపేవారు. అయితే 3 నెలల క్రితం సత్యనారాయణరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. 10 రోజుల కిత్రం రామాంజనేయరెడ్డి తల్లి రామలక్ష్మి కూడా చనిపోయారు. రామలక్ష్మి పెద్దకార్యం ఆదివారం జరిగింది. ఈ సందర్భంలో లక్ష్మీప్రసన్నతో భర్త, ఆడపడుచులు గొడవ పడినట్టు లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ చెబుతోంది. సోమవారం ఉదయం ఇంట్లో శాంతిహోమం నిర్వహించారు. అది ముగిసిన తరువాత సాయంత్రం 6 గంటలకు మిల్లుకు వెళ్లానని, మళ్లీ రాత్రి 7.15 గంటలకు ఇంటికి వచ్చి చూడగా భార్యాపిల్లలు మృతిచెంది పడి ఉన్నారని రామాంజనేయరెడ్డి చెబుతున్నాడు. మంచంపై విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులు ఆత్మహత్యా... హత్యలా..? అల్లుడికి ఉన్న అప్పులు, వేధింపులే తమ కుమార్తె ప్రాణం తీశాయని లక్ష్మీప్రసన్న తల్లి కనకదుర్గ ఆరోపిస్తోంది. అల్లుడు తండ్రి సత్యనారాయణరెడ్డి చనిపోయే నాటికి మిల్లుపై రూ.7 కోట్ల వరకూ అప్పులు చేశారని చెబుతోంది. అప్పటి నుంచి డబ్బులు తేవాలని, లేకుంటే నిన్ను చంపి వేరే పెళ్లి చేసుకుంటానని అతను తన కుమార్తెను బెదిరిస్తున్నాడని కనకదుర్గ చెబుతున్నారు. అప్పటికీ ఇటీవల రూ.70 లక్షలు సర్దామని, అయినా ఆదివారం జరిగిన గొడవలో తమ కుమార్తెపై అల్లుడు, అతని బంధువులు విరుచుకుపడ్డారని వివరించింది. అయితే అసలు ఏం జరిగిందనేది రామాంజనేయరెడ్డి నోరు తెరిస్తేనే గానీ తెలియదు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నరసాపురం సీఐ కృష్ణమోహన్ చెప్పారు. చిన్న గొడవ కూడా బయటకు వచ్చేది కాదు లక్ష్మీప్రసన్న కుటుంబం 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో అద్దెకు ఉంటోంది. గొడవలు జరుగుతున్నట్టుగా గానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా గానీ ఏమీ తెలిసేది కాదని స్థానికులు చెబుతున్నారు. రామాంజనేయరెడ్డికి, ఆలమూరుకు చెందిన లక్ష్మీప్రసన్నతో 2011లో పెళ్లైంది. పెద్దపాప 2వ తరగతి, చిన్న పాప ఎల్కేజీ. పిల్లలతో కలసి చుట్టుపక్కల వారితో లక్ష్మీప్రసన్న చాలా కలివిడిగా ఉండేదని సమాచారం. -
చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగికదాడి
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: నృత్య శిక్షకుడు (డ్యాన్స్ మాస్టర్) రూపంలో ఉన్న కీచకుడిని తలుచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం టూటౌన్ జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ భారతి రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలికపై డ్యాన్స్ మాస్టర్ సైదు చైతన్యవర్మ నృత్యం నేర్పే సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు పోలీస్స్టేషన్లో ఈనెల 12న కేసు నమోదు చేసి నిందితుడిని పో లీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విధితమే. నిందితుడు ఈ పాఠశాలతో పాటు పలు ప్రైవేట్ స్కూళ్లలోనూ నృత్య శిక్షణ ఇస్తున్నట్టుగా తెలి సింది. కొల్లేటికోటకు చెందిన సైదు చైతన్యవర్మ భీమవరంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. డ్యాన్స్ సరిగా చేయడం లేదని ఇంకా బాగా నేర్పుతానని ఓ బాలికను స్కూల్లోని వాష్రూమ్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పెల్లుబికిన ఆగ్రహం బాలిక కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పొరుగు మండలంలోని ఓ గ్రామానికి చెం దిన పలువురు బుధవారం భీమవరంలో శ్రీ భార తి స్కూల్ ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలను మూసివేయాలని, యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున నినాదాలు చేశా రు. భీమవరం టూటౌన్, వన్టౌన్ సీఐలు ఎస్ ఎస్వీ నాగరాజు, పి.చంద్రశేఖరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. కేసులో బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, ఎవరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదని సీఐ ఎస్ఎస్వీ నాగరాజు నచ్చచెప్పారు. 376 ఫోక్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. డీఎస్పీని కలిసిన బాలిక కుటుంబ సభ్యులు నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం భీమవరం వన్టౌన్ పోలీస్స్టేషన్కు వచ్చారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సీఐ ఎస్ఎస్వీ నాగరాజు వారితో మాట్లాడారు. డీఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళతామని వారంతా కోరారు. బాలిక కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. విష యం తెలిసిందని నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. శ్రీభారతి స్కూల్కు షోకాజ్ నోటీసు ఏలూరు (ఆర్ఆర్పేట): చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన అంశంలో భీమవరం శ్రీ భారతి స్కూల్ను ఎందుకు మూసివేయరాదో సంజాయిషీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్కు నోటీసులు జారీ చేశామని, వారిచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
పెళ్లైన మూడు నెలలకే.. భర్తని హత్య ?
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: పెళ్లై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే భర్త హత్యకు గురయ్యాడు. అతని భార్యే ఈ హత్య చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన గెడ్డం రాజు(25)కు అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మితో ఇటీవల వివాహమైంది. సోమవారం రాత్రి రాజు తల్లి లక్ష్మి ఆసుపత్రి çపనిపై వేరే గ్రామం వెళ్లింది. రాజు అతని భార్య సుబ్బలక్ష్మి గదిలో నిద్రించారు. రాజు తండ్రి ఆంజనేయులు గది బయట వరండాలో పడుకున్నాడు. మంగళవారం తెల్లవారు జామున తన భర్త రాజు లేవలేని స్థితిలో ఉన్నాడని రాజు తండ్రి ఆంజనేయులకు సుబ్బలక్ష్మి చెప్పింది. అతను వెళ్లి కుమారుని నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఎంతకీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా చనిపోయాడని నిర్ధారించుకున్నారు. అయితే స్థానికులు హత్యగా భావించడంతో రాజు తండ్రి ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుబ్బలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుగొండ సీఐ విజయకుమార్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు సందర్శించారు. ఎస్సై బి.రవికుమార్, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.. సుబ్బలక్ష్మిని గెడ్డం రాజు తన బంధువుల పెళ్లిలో చూసి ఇష్ట పడినట్టు స్థానికులు చెప్పారు. రాజు ఇష్ట ప్రకారమే పెద్దలు పెళ్లి చేసినట్టు తెలిపారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే రాజుకు మద్యం అలవాటు ఉందని, మద్యం మత్తులో ఉండగా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ హత్య రాజు భార్య ఒక్కతే చేసిందా? లేక మరి కొందరు ఆమెకు సహకరించారా? అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. రాజు నిద్రించే గదికి ఒక వైపు కిటికీకి ఫ్రేమ్ లేదని, అందువల్ల వరండాలో పడుకున్న రాజు తండ్రి ఆంజనేయులు కంట పడకుండా కిటికీ ద్వారా లోనికి ప్రవేశించి ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కొందరు పేర్కొంటున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో గత ఏడాది కాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. బాధితుల ఇచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం – నల్లజర్ల మార్గంలో ప్రత్యేక బృందంతో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద బంగారు నగలు ఉన్నాయి. విచారణలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నుగేష్ మణికంఠ, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసుగా గుర్తించారు. పాత నేరస్తులని తేలడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ధనికుల ఇళ్లను కొల్లగొట్టేవారు. దొంగిలించిన బంగారు ఆభరాలను ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యన్ శాంతమూర్తి ద్వారా బంగారు ఆభర దుకాణాలు నిర్వహించే వ్యాపారులు యోగ మురగన్ జ్యువెలరీ షాపు యజమాని యోగ మురుగన్ సింథిల్, న్యూ అంబిక జ్యువెలరీ షాపు దేసింగురాజ్ మనోజ్ కుమార్, నారాయణన్ జ్యువెలరీ షాపు దేవదాస్ నారాయణదాస్, జగన్ సిల్వర్ షాపు గురుస్వామి జగన్లకు విక్రయించేవారు. పైన తెలిపిన ముగ్గురు నేరస్తులు, వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొంగిలించిన ఆభరణాలను సుబ్రహ్మణ్యన్ శాంతమూర్తికి విజయవాడ రైల్వేస్టేషన్లో అందజేసేవారు. వీరికి అవసరమైన ఖర్చులకు బంగారు వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారు. వీరి వద్ద నుంచి ఇంకా బంగారం, వెండి రికవరీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక మోటారు సైకిల్ను, చోరీకి ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేస్తామని రూరల్ సీఐ పి శ్రీను తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు ఎస్సై బాదం శ్రీనివాసు, భూపతి శ్రీను, దుర్గాప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ పసుపులేటి శ్రీనివాసరావు, రాంబాబులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్నేహం ఏర్పడింది ఇలా.. చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసు ఒక హత్యకేసుకు సంబంధించి శిక్ష పడింది. జైలులో శిక్ష అనుభవిస్తుండగా తణుకు పరిధిలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడిన తమిళనాడుకు చెందిన నుగేష్ మణికంఠ, కార్తీక్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ తమిళనాడుకు చెందిన రామనాథపురం జిల్లాలోని బంగారు, వెండి ఆభరణ వ్యాపారులతో కలిసి చోరీలు ప్రారంభించారు. జిల్లాలో 17 చోరీలు 2017 నుంచి ఉంగుటూరు మండలం రామచంద్రపురంలో ఒకటి, గొల్లగూడెం ఒకటి, ఉంగుటూరులో రెండు, నిడమర్రులో ఒకటి, తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెదతాడేపల్లిలో ఒకటి, వెంకట్రామన్నగూడెంలో రెండు, ఆరుళ్లలో ఒకటి, జగన్నాథపురంలో ఒకటి, పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడులో ఒకటి, రావిపాడులో ఒకటి, ఆకుతీగపాడులో ఒకటి, జట్లపాలెం ఒకటి మొత్తం 17 చోరీలు చేసినట్టు నేరస్తులు అంగీకరించారు. -
మహిళ దారుణ హత్య
పశ్చిమగోదావరి, నల్లజర్ల(ద్వారకాతిరుమల): బంగారు నగల కోసం ఆటో డ్రైవర్ ఒక మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడ ఒక వ్యవసాయ భూమిలోని కంచెలో పడవేశాడు. అయితే దుర్వాసన రావడంతో అనుమానం కలిగిన స్థానిక రైతులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన నల్లజర్ల మండలం పోతవరంలోని ఒక వ్యవసాయ పొలంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని పుల్లలపాడుకు చెందిన నాయుడు దుర్గ(45) అదే గ్రామ శివారులో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తోంది. రోజూ ఆమె నల్లజర్లకు చెందిన ఆటో డ్రైవర్ అల్లే వెంకన్నబాబు ఆటోలో దుకాణానికి వెళ్తుండేది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం ఆమె జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వారి బంధువుల ఇంట్లోని ఒక శుభకార్యానికని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లోను, అలాగే బంధువుల ఇళ్ల వద్ద వెదికారు. ఎంతకీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మృతురాలి భర్త ప్రసాద్ నల్లజర్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోతవరంలోని ఒక వ్యవసాయ భూమిలో దుర్వాసన వస్తుందన్న సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ పి.శ్రీను, నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని వ్యవసాయ భూమి కంచెలో మృతదేహాన్ని గుర్తించారు. అసలేం జరిగిందంటే.. శుభకార్యం నిమిత్తం నాలుగు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంకు వెళ్లిన దుర్గ అదే రోజు సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో కొయ్యలగూడెంకు చేరుకున్న ఆమె బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వెంకన్నబాబును ఆమె గుర్తించి, తెలిసిన వాడే కథ అన్న ధైర్యంతో ఆటో ఎక్కింది. అయితే పోతవరం శివారులోకి వచ్చేసరికి వెంకన్నబాబు ఆటోను పక్కకు ఆపి, దుర్గపై దాడిచేశాడు. ఆమె వద్ద ఉన్న సుమారు కాసున్నర బంగారు వస్తువులు, అలాగే రూ. 10 వేల నగదును లాక్కుని, తన వద్ద ఉన్న టవల్ను ఆమె మెడకు వేసి, ఉరిలాగి కిరాతకంగా హత్యచేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని సమీపంలోని ఒక వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లి పడవేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించారు. ఆటో డ్రైవర్ వెంకన్నబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీను తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మద్యం తాగించి.. మట్టుబెట్టి..
పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పట్టణానికి చెందిన వల్లెపు యర్రయ్య (45)ది హత్యే అని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. స్థానిక పోలీస్స్టేషన్లో యర్రయ్య హత్య కేసు వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. గతనెల 26న యర్రయ్య జంగారెడ్డిగూడెం నుంచి జల్లేరువాగు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 27న యర్రయ్య మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 28న ఉదయం మండలంలోని జల్లేరువాగులో యర్రయ్య శవమై కనిపించాడు. దీంతో ఎస్సై అల్లు దుర్గారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు, యర్రయ్య మృతదేహంపై గాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని యర్రయ్య హత్యకు గురైనట్టు నిర్ధారించి అనుమానాస్పద కేసును ఈనెల 16న హత్య కేసుగా మార్పు చేశారు. పీక నొక్కి.. ఇసుకలోకి తొక్కి.. వల్లెపు యర్రయ్య ఇటుక బట్టీలో పనిచేసే కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తుంటాడు. ఇటుక బట్టీల యజమానుల నుంచి అడ్వాన్సు తీసుకుని ఆ నగదును కూలీలకు బయానాగా ఇచ్చి వారితో పనిచేయిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఇటుక బట్టీల యజమానుల నుంచి యర్రయ్య కొంత నగదును అడ్వాన్సుగా తీసుకున్నాడు. దీనిలో వేగవరంలో ఉంటున్న తెలంగాణలోని దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన మక్కెల శంకర్ అలియాస్ శ్రీను, ఉప్పలమెట్టలో నివసిస్తున్న దమ్మపేటకు చెందిన మొడియం వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ, బండి రాంబాబు, సోయం సురేష్, స్థానిక రాజీవ్నగర్కు చెందిన తమ్మిశెట్టి అర్జున్ అనే ఐదుగురికి సుమారు రూ.4 లక్షలను అడ్వాన్స్గా ఇచ్చాడు. ఈ ఐదుగురు ఇటుక బట్టీ పనిలోకి వెళ్లకుండా తాత్సారం చేయడంతో యర్రయ్య వారిని నిలదీశాడు. అడ్వాన్సు సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో కక్ష గట్టిన ఐదుగురు యర్రయ్యను హతమార్చాలని పథకం పన్నారు. ఈ క్రమంలో గతనెల 26న సాయంత్రం యర్రయ్యను జల్లేరు వాగు సమీపంలోని బ్రాందీ షాపు వద్దకు రమ్మని పిలిచారు. అక్కడ యర్రయ్యతో వీరు అధిక మోతాదులో మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న యర్రయ్యను ఆటోలో కొంతదూరం తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి పీకనొక్కేశారు. దీంతో ఎర్రయ్య స్పృహ కోల్పోయాడు. తర్వాత యర్రయ్యను జల్లేరువాగులో పడవేసి కాళ్లతో తొక్కడంతో మృతిచెందాడు. ఈ సమయంలో వీరు ధరించిన దుస్తులకు రక్తం మరకలు కావడంతో వేగవరం వినాయకుడి గుడి వద్ద వాటిని కాల్చివేసినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరు పరారీ దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితుల్లో మక్కెల శంకర్, మొడియం వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి అర్జున్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటకు వచ్చింది. దీంతో వీరిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్టు డీఎస్పీ చెప్పారు. కేసులో మూడు, నాలుగు నిందితులుగా ఉన్న బండి రాంబాబు, సోయం సురేష్ పరారీలో ఉన్నారని, వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. హత్య కేసును ఛేదించిన జంగారెడ్డిగూడెం ఇన్చార్జి సీఐ పి.రాజేష్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎ.దుర్గారావు, క్రైం పార్టీ హెచ్సీ ఎన్వీ సంపత్కుమార్, పీసీ డి.పోతురాజు, సర్కిల్ రైటర్ టి.ఎర్రయ్య, హెచ్సీ పరశురాం, పీసీలు కె.మధు, కె.సత్యనారాయణ, సీహెచ్ సత్యనారాయణలను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్కు సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. -
యూ ట్యూబ్లో చూసి చోరీయత్నం
వారంతా బీటెక్ చదివిన యువకులు.. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీకి ప్రయత్నించారు. యూ ట్యూబ్లో చోరీ చేసే వీడియోలు చూసి బ్యాంక్ ఏటీఎంలను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ చోరీ ప్రయత్నం ఫలించకపోగా, పోలీసులకు చిక్కారు. నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్లో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి, నిడదవోలు: పట్టణానికి చెందిన చెరుకూరి మునీంద్ర, ఎస్కే అరుణ్ రహిద్, యంగాల ఆదిత్య కొవ్వూరు డివిజన్ పరిధిలో దేవరపల్లి, గౌరీపట్నం, చాగల్లు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఏటీఎం చోరీలకు ప్రయత్నించారు. వీరంతా బీటెక్ డిప్లమో పూర్తి చేశారు. చాగల్లు ఏటీఎం కేంద్రం వద్ద మంగళవారం మరోసారి ఏటీఎం చోరీకి ఉపక్రమిస్తున్న సమయంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. స్నేహితులైన ఈ ముగ్గురు ఏటీఎం కేంద్రాల్లో చోరీ ఎలా చెయ్యాలో యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను రాడ్తో పగలగొట్టిన అనంతరం ఏటీఎం యంత్రాలను రాడ్లతో ధ్వంసం చేస్తారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న బాక్స్లు తెరుచుకోకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసేవారు. బాక్స్లు తెరచుకోకపోవడంతో డబ్బులు వీరికి దొరకలేదని డీఎస్పీ చెప్పారు. యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. నిడదవోలు సీఐ కేవీఎస్వీ ప్రసాద్, చాగల్లు, నిడదవోలు ఎస్సైలు ఐ.రవికుమార్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
పశ్చిమగోదావరి , కొవ్వూరు: పట్టణంలో రెండు చోరీలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను పట్టుకుని వారి నుం చి రూ.7.83 లక్షల విలువైన 33.5 కాసుల బం గారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి సా మాన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూలై 27న పట్టణంలో సత్యవతినగర్లో అనుమకొండ సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుని పోయారు. ఈ కేసులో ప్రస్తుతం ఒడిశాలోని రాయగడ్లో ఉంటున్న పట్టణానికి చెందిన తిరువేదుల గణపతి (చోటూ) ప్రధాన నిందితుడిగా తేలిందన్నారు. అతనితో పాటు ఒడిశాలోని ఖరియారోడ్డు గ్రామానికి షేక్ ఇమ్రాన్ అలీ, రాయ్గడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటున్న గాడి అజయ్ (ఇమ్రాన్), ఉంగుటూరు మండలం బాదంపూడిలో నివాసం ఉంటున్న జార్జాని వీరవెంకట సత్యసాయి రామదుర్గాప్రసాద్ ముఠాగా చోరీలకు పాల్పడున్నట్టు గుర్తించామన్నారు. వీరు ఈనెల 11న కొవ్వూరు మొయిన్రోడ్డు గొల్లి త్రినాథరావు అనే వ్యక్తికి చెందిన బంగారు షాపులో రెండు జతల చెవిదిద్దులు దొంగిలించుకుని పోయారన్నారు. వీరి నుంచి రూ.7.83 లక్షల విలువైన చోరీ సొత్తుని రికవరీ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరుస్తామన్నారు. ప్రధాన నిందితుడు గణపతికి ఇమ్రాన్, ఆజయ్ తల్లితో సాన్నిహిత్యం ఉందన్నారు. ఈ కారణంతోనే గణపతి ఒడిశా వెళ్లాడన్నారు. వీరిపై రాయగడ్, శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో పట్టణ సీఐ కె.విజ య్బాబు, క్రైం కంట్రోల్ పోలీస్స్టేషన్ ఎస్సై ఎం.శ్యామ్సుందరరావు, పి.రవీంద్ర, ఏఎస్సై ఎ.కోట సత్యనారాయణతో పాటు ఇతర సిబ్బంది సహకరించారన్నారు. చోరీ కేసు ఛేదించిన సి బ్బందిని ఆయన అభినందించారు. జిల్లా ఎస్పీకి రివార్డుల నిమిత్తం సిఫార్సు చేస్తామని చెప్పారు. పట్టణ ఎస్సై జీజే విష్ణువర్ధన్, హెచ్సీ బి.బాబూరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిమ్మాపు రం పంచాయితీ లక్ష్మీపురం కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన దుర్గ (29)కు, ద్వారకాతిరుమలకు చెందిన తొంటపాక సత్యనారాయణతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సం తానం లేదు. దుర్గ తీసుకొచ్చిన కట్నం సొమ్ములను భర్త, అతని కుటుంబ సభ్యులు వాడుకుని దుర్గను బయటకు గెంటేశారు. ఈక్రమంలో జరి గిన గొడవల నేపథ్యంలో సత్యనారాయణ భార్య దుర్గతో కలిసి లక్ష్మీపురం కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయినా భర్త, అతని కు టుంబ సభ్యుల నుంచి ఆమెకు వేధింపులు తప్పలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన దుర్గ ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త సత్యనారాయణ సమాచారం మేరకు భీమడోలు సీఐ బీఎన్ నాయక్, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త వేధింపులు తాళలేకపోతున్నానని మృతురాలు దుర్గ రాసుకున్న డైరీని వారు స్వాధీనం చేసుకున్నారు. భర్త, అతని కుటుంబసభ్యులు పది మందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీర్రాజు చెప్పారు. ఈ ఘటనపై జిల్లా రజక సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వచ్చి సీఐ నాగేశ్వర్నాయక్, ఎస్సై వీర్రాజు, మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
త'స్మార్ట్' జాగ్రత్త
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణానికి చెందిన నరేష్ (పేరు మార్చాం) సెకండ్హ్యాండ్ వస్తువులు విక్రయించే యాప్ ద్వారా ఓ స్మార్ట్ఫోన్ విక్రయ ప్రకటన చూశాడు. ఆ మోడల్ ఫోన్ వాస్తవ ధర సుమారు రూ.40 వేలు ఉండగా... సగం ధరకే విక్రయానికి పెట్టడం ఆకర్షించింది. ప్రకటనలో ఉన్న నంబర్కు ఫోన్ చేశాడు. ప్రకటనదారుడు కొద్దిసేపటికే నరేష్ సూచించిన చోటకు ఫోన్ తీసుకొచ్చాడు. ఏ మాత్రంసంకోచించకుండా నరేష్ దానిని కొనేశాడు. బిల్లు అడిగితే ప్రకటనదారుడు ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. కొన్న ఫోన్లో సిమ్ వేసుకుని నరేష్ వాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత రెండురోజులకు పోలీసులు నరేష్కు ఫోన్ చేసి మీరు వాడుతున్న ఫోన్ దొంగిలించినదని చెప్పారు. ఫోన్ను తమకు అప్పగించాలని, లేకపోతే చోరీ సొత్తు కొన్నందుకు కేసు తప్పదని మర్యాదగానే చెప్పారు. దీంతో నరేష్ వెంటనే ప్రకటనదారుడికి ఫోన్ చేశాడు. అయితే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో యాప్లో ప్రకటన కోసం వెతికాడు. అక్కడ ప్రకటన కూడా లేదు. ఇక చేసేది లేక ఫోన్ను పోలీసులకు అప్పగించాడు. ఇది కేవలం ఒక్క నరేష్కు ఎదురైన అనుభవం కాదు. జిల్లావ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొన్న వారిలో అత్యధిక శాతం మందికి ఇదే తరహాలో పరాభవం ఎదురవుతోంది. ఆన్లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. సరికొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్సైట్లు, యాప్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తున్నాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతున్నారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని సైట్లలోని ప్రకటనల ద్వారా కొనే సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా చోరీ చేసినవే. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి పోలీసులు ఆయా ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు. దొంగలు ఒకవేళ కొట్టేసిన ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ విశిష్ట సంఖ్య కావడంతో సెకండ్హ్యాండ్ కొనుగోలుదారులు కొత్త సిమ్ వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్కు చిక్కుతోంది. ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన హ్యాండ్సెట్లో ఏ కొత్త నంబరు వేశారో కనిపెట్టే పరిజ్ఞానం పోలీçసుల వద్ద ఉండటంతో సులభంగానే పసిగట్టగలుగుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్ లభిస్తుందనే ఆశకు పోయిన నరేష్లాంటి వ్యక్తులు బాధితుల జాబితాలో చేరుతున్నారు. కొంటున్నారా...? ఇవి గమనించండి ♦ ప్రతి సెల్ఫోన్కు ఐఎంఈఐ నంబరు తప్పనిసరిగా ఉంటుంది. ఫోన్ను కొనేటప్పుడు బిల్లుపై ఈ నెంబరు నమోదై ఉంటుంది. ఆ ఫోన్కు యజమాని అనేందుకు ఆ బిల్లే ఆధారం. అందుకే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఐఎంఈఐ నంబరు తనిఖీ చేసేందుకు ఫోన్లో #06# టైప్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత నంబరు తెరపై ప్రత్యక్షమవుతుంది. ♦ ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన ఒరిజినల్ బిల్లులో యజమాని, ఫోన్ విక్రయిస్తున్న వ్యక్తి ఒకరేనా అని సరిచూసుకోవాలి. అవసరమైతే ఫోన్ అమ్మే వ్యక్తి ఫొటో, అతనికి సంబం ధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం జిరాక్సు ప్రతిని తీసుకోవాలి. ♦ అత్యవసరం ఉంది కాబట్టి తక్కువ ధరకే విక్రయిస్తున్నామని చెప్పినా... ఒరిజినల్ బిల్లు లేకుంటే మాత్రం ఎట్టిపరిస్థితితుల్లో కొనొద్దు. దొంగల చేతివాటం ఇలా... ♦ దొంగలు అసలు వినియోగదారుల నుంచి స్మార్ట్ఫోన్లను కొట్టేస్తారు. ♦ వాటిపై భాగాలను మార్చి ఆకర్షణీయంగా మార్చేస్తారు. ♦ అనంతరం వాటిని ఫోటోలు తీసి ఆన్లైన్ పోర్టల్స్, యాప్లు, వెబ్సైట్లలో పోస్ట్ చేస్తారు. ♦ వాస్తవ ధరకంటే తక్కువకే విక్రయిస్తామంటూ ఆకర్షిస్తారు. ♦ ఆ ఫోన్ను అమ్మదలిస్తే దొంగ స్వయంగా రంగంలోకి దిగుతాడు. బేరం కుదిరితే దొంగే నేరుగా వచ్చి డబ్బులు తీసుకుని సెల్ఫోన్ ఇచ్చేస్తాడు. ♦ సాధారణంగా దొంగలు ఫోన్ కొట్టేసిన కొద్ది రోజుల పాటు దాన్ని ఆఫ్ చేసేస్తుంటారు. ఆ సమయంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆఫ్ చేసి ఉండటంతో పోలీసుల ట్రాకింగ్కు చిక్కదు. ఒకట్రెండు నెలల అనంతరం ఆన్లైన్లో అమ్మకానికి పెడుతుంటారు. ♦ అప్పటివరకు స్విచ్ఛాఫ్ చేసి ఉన్న ఫోన్ను కొన్న వ్యక్తి ఆన్ చేయగానే పోలీసుల ట్రాకింగ్కు దొరుకుతుంది. ఒకవేళ కొనుగోలుదారుడు గట్టిగా మాట్లాడితే దొంగ ఫోన్ కొన్నందుకు పోలీసు కేసు ఎదుర్కోక తప్పదు. -
నకిలీ నోట్ల చలామణి
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఒరిజినల్ రూ.2 వేల నోట్లను స్కాన్ చేసి .. అదేరీతిలో ఫేక్ రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి మార్కెట్లోకి చలామణి చేస్తోన్న ఒక వ్యక్తిని ఏలూరు పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, సీసీఎల్ డీఎస్పీ టీ.సత్యనారాయణ వివరాలను వెల్లడించగా వన్టౌన్ ఇన్ఛార్జ్ సీఐ జి.మధుబాబు సమావేశంలో ఉన్నారు. ఏలూరు వన్టౌన్ చిరంజీవి బస్టాండ్ దక్షిణపువీధి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మధుబాబు, వన్టౌన్ ఎస్ఐ కిషోర్బాబు, సిబ్బంది అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.2 వేల ఫేక్ నోట్లు 50 స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. జిరాక్స్ తీసి చలామణి మెదక్ జిల్లాకు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు హైదరాబాద్ పటాన్చెరువు ప్రాంతంలోని శ్రీరామ్నగర్, దుర్గగుడి వద్ద నివాసం ఉంటున్నాడు. రాజు గత కొంతకాలంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ మెషిన్పై కలర్ జిరాక్స్ తీసి ఫేక్ రూ.2 వేల నోటును తీస్తున్నాడు. చిన్నచిన్న తేడాలు మినహా ఒరిజినల్ నోటు మాదిరిగానే కలర్ జిరాక్స్ తీస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. గతంలో హైదరాబాద్లోనూ కృష్ణా జిల్లా కైకలూరులోనూ రూ.2 వేల ఫేక్ నోట్లను మార్కెట్లోకి చలామణి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ రాజుపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో అధికంగా ఆక్వా, చేపల రైతులు అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉండడం, ఫేక్ కరెన్సీ సులువుగా మార్చుకునే అవకాశం ఉండడంతో రాజు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కైకలూరులో చేపల రైతుల వద్ద ఫేక్ నోట్లు మార్పు చేసే క్రమంలో దొరికిపోవటంతో ఏలూరు కేంద్రంగా మరోసారి ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నం చేశాడు. రూ.50 వేలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే రూ.2 లక్షల వరకూ ఫేక్ కరెన్సీ ఇచ్చేలా కొందరు వ్యక్తులతో మంతనాలు సైతం చేసినట్టు తెలుస్తోంది. కైకలూరు నుంచి ఏలూరుకు మకాం మార్చటంతో పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 వేల ఫేక్ నోట్లు, జిరాక్స్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 266/18 489 (సీ) (డీ) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాజు ఇప్పటి వరకూ సుమారు రూ.3 లక్షల వరకూ ఫేక్నోట్లు మార్పిడి చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నకిలీ నోట్లతో మోసపోవద్దు ఈ ఫేక్ నోట్లు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. రూ.500, రూ.2,000 నోట్లు విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అధికంగా డబ్బు చలామణి అయ్యే బార్లు, మద్యం దుకాణాలు, హోటల్స్, మాల్స్, చేపల వ్యాపారాల వద్ద ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ఇలాంటి ముఠాలు ప్రయత్నాలు చేస్తుంటాయని తెలిపారు. రూ.2 వేల నోటు వైట్స్పాట్లో గాంధీ బొమ్మ ఉంటుందని, లోపల రూ.2,000 అని అడ్డంగా రాసి ఉంటుందని, ఈ రెండు లేకుంటే ఫేక్నోటుగా భావించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ నోట్లలో రెండు, మూడు నోట్లు ఒకే సీరీస్తో ఉంటున్నాయని, ఇలా ఒకే సీరిస్తో ఏవైనా నోట్లు ఉన్నట్లు గమనిస్తే దొంగనోట్లుగా గుర్తించాలని కోరారు. అధికమొత్తంలో డబ్బులు ఆశచూపించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని, అటువంటి మోసాలకు, ప్రలోభాలకు లొంగిపోవద్దని సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. -
వీడిన హత్యకేసు మిస్టరీ..
పశ్చిమగోదావరి, కుక్కునూరు: మండలంలోని గుంపెనపల్లి–గణపవరం గ్రామాల మధ్య ఈనెల 10న జరిగిన హత్యకేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్టు కుక్కునూరు సీఐ డి.భగవాన్ప్రసాద్ ఆదివారం విలేకరులకు వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుంపెనపల్లి గ్రామానికి చెందిన వల్లె వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మృతి చెందడంతో అదే గ్రామానికి చెందిన వితంతు మహిళ తుర్సం సుశీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పిల్లలు పెద్దవారు అవుతున్నారని ఇకపై వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని వెంకటేశ్వర్లును సుశీల కుటుంబసభ్యులు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో సుశీల అన్న తుర్సం సూరిబాబు, తుర్సం నాగేశ్వరరావు కలిసి వెంకటేశ్వర్లు హత్యకు ప్రణాళిక వేశారు. ఈనెల 10న రాత్రి ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లును బయటకు వెళ్దామని తీసుకెళ్లి హతమార్చారు. శరీరంపై నరికి ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంకటేశ్వర్లు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆదివారం ఉదయం నిందితుడు సూరి బాబును ఇబ్రహీంపేట వద్ద, నాగేశ్వరావును అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు రిమాండ్ చేయనున్నట్టు సీఐ పేర్కొన్నారు. వేలేరుపాడు ఎస్సై బి.మధువెంకటరాజా, ఏఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూలీ పనులకు వెళుతూ కానరాని లోకాలకు..
పశ్చిమగోదావరి, చింతలపూడి: చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలైన నలుగురిని ఏలూరు తరలించారు. గణిజర్ల గ్రామానికి చెందిన కూలీలు పత్తి చేలో పని నిమిత్తం ట్రాలీ ఆటోలో తిమ్మిరెడ్డిపల్లి గ్రామం బయలుదేరారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి ట్రాలీని రాసుకుని వెళ్లడంతో ట్రాలీలో గణిజర్ల గ్రామానికి చెందిన బోయ నాగమణి (26)కు మెడపై బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా ట్రాలీలో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాలీలో 30 మందికి పైగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారిలో రాయల పచోటి, కొమ్ము సునీత, కొమ్ము జ్యోతి, బొర్రా రెబ్బాకకు బలమైన గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన వారు చింతలపూడి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సీఐ పి.రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రి కిక్కిరిసి పోయింది. ఆసుపత్రి కారిడార్, వార్డులు అన్నీ బాధితులు, జనంతో నిండి పోయాయి. ప్రమాదానికి ట్రాక్టర్ ట్రక్కుకు ఉన్న ఆయిల్పామ్ గెలులు తరలించడానికి తయారు చేసిన ఇనుప చట్రం కారణమని బాధితులు చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ ప్రమాద వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలి డిమాండ్ చేశారు. జీవనం ఎలా..? రెక్కాడితేకాని డొక్కాడని ఆ పేద కూలీలకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రోడ్డు ప్రమాదం వల్ల గాయాల పాలవ్వడంతో కుటుంబాలను బతికించుకోవడమెలా అని బాధపడుతున్నారు. తగిలిన దెబ్బలతో కూలి పనులకు వెళ్లే దారిలేక జీవనం ఎలా అని మదన పడుతున్నారు. మరో పది నిమిషాల్లో గమ్య స్థానం చేరుకుంటామనగా రోడ్డు ప్రమాదం జరగడంతో వీరు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాలని కోరుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పోణంగి గ్రామానికి చెందిన జువ్వల ఏసుబాబు, మౌనికకు 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఏసుబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మౌనిక తల్లి తండ్రి కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనిక ఇంటిలో పడకగదిలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే సమయంలో మౌనిక తల్లి కూడా ఆమె ఇంటికి చేరుకుంది. ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతున్న మౌనికను భర్త కిందికి దించాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఒకటో రోడ్డులో గుర్తు తెలియని వృద్ధుడు(65) ఒక అపార్టుమెంట్ వద్ద మృతిచెంది పడి ఉన్నాడు. స్థానికులు సమాచారం అందించటంతో త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ వృద్ధుడు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడని, అతని పేరు తుమ్మల నరేంద్ర చౌదరి అని చెబుతున్నారు. వివరాలు తెలిసిన వారు త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై పైడిబాబు ఫోన్ నెంబర్ 9063334448కు గానీ, 08812 22338కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఆర్థిక బాధలు తాళలేక.. ఏలూరు టౌన్: భర్త అనారోగ్యంతో బాధపడటం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు సతమతం చేయటంతో ఆర్థిక బాధలు తాళలేక వివాహిత అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ వెంకటాపురం పంచాయతీ రామనగర్ కాలనీకి చెందిన కిశోర్కుమార్, పుష్పకు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం కిశోర్కుమార్కు పక్షవాతం రావటంతో అప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఇంటి వద్ద చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్ప అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఏలూరు టౌన్: కడుపునొప్పి తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు అశోక్నగర్ ప్రాంతానికి చెందిన మోహన్ ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మోహన్కు తీవ్రస్థాయిలో కడుపునొప్పి రావటంతో భరించలేక ఇంటివద్దనే మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
వనసమారాధనలో విషాదం
పశ్చిమగోదావరి, పెరవలి: కార్తీక వనసమారాధనలో విషాదం చో టుచేసుకుంది. ఓ యువకుడు గోదావరిలో గల్లంతైన ఘటన పెరవలి మండలం కాకరపర్రు వద్ద చోటుచేసుకుంది. తణుకు ఎస్సై వి.జగదీష్ తెలి పిన వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కాపాక రవిప్రకాష్ (23), మంచాల నరేష్ కు మార్ అయ్యప్ప, గుండెమొగుల సాయి, కుంపట్ల సాగర్ అనే యువకులు ఆదివారంం మధ్యాహ్నం వనసమారాధనకు కాకరపర్రు వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపి తిరిగి గోదావరిలో మరోమార్గంలో వస్తుండగా రవిప్రకాష్ సుడిగుండంలో చిక్కుకున్నాడు. స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్లు, మర్కాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. స్నేహితుల కన్నీరుమున్నీరు నీటిలో మునిగిపోతున్న రవిప్రకాష్ను కాపాడేం దుకు ఎంతగానో ప్రయత్నించామని, సాధ్యం కా లేదని స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కార్తీకమాసం ఆదివారం కావడంతో సరదాగా పిక్నిక్కు వచ్చామని విలపించారు. తామంతా చిన్నప్పటి నుంచి స్నేహితులమని, ఏటా కార్తీకమాసంలో కలుస్తుంటామని బోరుమన్నారు. మిన్నంటని రోదనలు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రవిప్రకాష్ కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. -
ఇంట్లో నిద్రిస్తుండగానే..
పశ్చిమగోదావరి, తణుకు: కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే నిద్రిస్తున్నారు.. హాలుతో పాటు రెండు బెడ్రూముల్లో వారంతా గాఢ నిద్రలో ఉన్నారు.. అయినా ఎలాంటి బెరుకు లేకుండా ఇంట్లోకి చొరబడిన దుండగులు బెడ్రూమ్ కబోర్డులో దాచుకున్న బంగారు ఆభరణాలతోపాటు రూ.90 వేల నగదును దర్జాగా ఎత్తుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీ తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నివాసం ఉంటున్న టీడీపీ నాయకుడు శీని గోపాలం ధాన్యం వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తుంటారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం రాత్రి వ్యవసాయ పనులు ముగించుకుని పొద్దుపోయాక వచ్చిన యజమాని శీని గోపాలం, కుమారుడు జగదీష్లు 11 దాటాక పడుకున్నారు. ఒక బెడ్రూంలో గోపాలంతో పాటు కుమార్తె మంజూష పడుకోగా మరో బెడ్రూమ్లో జగదీష్ పడుకున్నారు. హాలులో గోపాలం భార్య సీతారత్నం ఆమె తల్లి లక్ష్మీకాంతం పడుకున్నారు. గురువారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట వరకు ఫోన్ మాట్లాడిన మంజూష అనంతరం నిద్రలోకి జారుకున్నారు. చాకచక్యంగా తలుపు తీసి.. ప్రధాన గేటు దాటి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన దండుగులు హాలు కిటికీ నుంచి లోపల తలుపు చాకచక్యంగా తెరిచారు. ఇందుకు కర్రకు ప్రత్యేకంగా ఇనుప ఊచను చుట్టి కొక్కెం మాదిరిగా రెండు పరికరాలు తయారు చేసుకున్నారు. వీటి సాయంతో తలుపులు తెరిచిన దుండగులు నేరుగా బెడ్రూంలోకి వెళ్లి కబోర్డులో ఉన్న స్టీలు బాక్సుల్లో దాచుకున్న బంగారు ఆభరణాలు, రూ.90 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో అదే బెడ్రూంలో నిద్రిస్తున్న గోపాలం, కుమార్తె మంజూషకు మెలకువ రాకపోవడం విశేషం. అనంతరం జగదీష్ పడుకున్న బెడ్రూం తలుపు తీసిన దుండగులు అక్కడ ఏమీ దొరక్కపోవడంతో పలాయనం చిత్తగించారు. అయితే ప్రధాన ద్వారం తలుపు గడియ తీసే సమయంలో సైతం చప్పుడుకు కుటుంబ సభ్యులకు మెలకువ రాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరికి మత్తు పదార్థం వంటిది ఏదైనా స్ప్రే చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులను నుంచి ఫిర్యాదు తీసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దళిత యువకుడి ఆత్మహత్య
పశ్చిమగోదావరి , పాలకొల్లు అర్బన్: ‘అన్నయ్యా నాకు ఈ గొడవతో ఏం సంబంధం లేదు.. నన్ను కొట్టొద్దు.. అని కానిస్టేబుల్ చెల్లబోయిన నరేష్ను వేడుకున్నా.. తాను పోలీస్ నంటూ నన్ను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అతనితోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతనూ పోలీసే. గ్రామంలో నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. పరువు పోయింది. జాషువా తప్పు చేయడని నా చావుతో ఊరి ప్రజలు తెలుసుకుంటారు. కానిస్టేబుల్ నరేష్ను ఉద్యోగం నుంచి తొలగించాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. నా శవం కుళ్లినా సరే అతనిని అరెస్ట్ చేశాకే నన్ను ఖననం చేయండి అంటూ దళిత యువకుడు నాగదాసు జాషువా(19) 12 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాలకొల్లు మండలం వెంకటాపురంలోని జాషువా ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. జాషువా పూలపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఏడాదిగా పనిచేస్తున్నాడు. నానమ్మ విజయమ్మ నిర్వహిస్తున్న చౌకడిపోలోనూ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. గ్రామంలో రెవెన్యూ అధికారికి అవసరమైన ప్రభుత్వ సర్వే పనులూ చేస్తుంటాడు. గ్రామస్తులందరికీ చిరపరిచితుడు. అతని స్నేహితుడు రాజేష్కి రాయికుదురులో ప్రేమికురాలు ఉంది. రాజేష్ కోరిక మేరకు అతనితో కలిసి జాషువా ఈ నెల 1న రాయికుదురు వెళ్లాడు. అక్కడ రాజేష్ ప్రేమికురాలికి వరుసకు సోదరుడైన చెల్లబోయిన నరేష్, మరికొందరు కలిసి వీరిద్దరినీ బంధించి విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం వీరవాసరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విషయం తెలుసుకున్న జాషువా తండ్రి శ్యామలరావు, చిన్నాన్న కమలాకర్ అక్కడుకు వెళ్లి కేసు రాజీ చేసుకుని వచ్చారు. అప్పటినుంచే మనస్తాపం ఆ రోజు నుంచి జాషువా మనస్తాపంతో బాధపడుతున్నాడు. రెండు రోజులు పాలకొల్లులోని తన చిన్నాన్న కమలాకర్ ఇంటి వద్ద ఉండి వచ్చాడు. రాయికుదురుకు చెందిన కానిస్టేబుల్ నరేష్ నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. రోజూ రాయికుదురు మీదుగా నరసాపురం వెళతారు. ఆ మార్గంలో వెళుతూ వెంకటాపురంలో జాషువా కనిపించగా మళ్లీ బెదిరించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని జాషువా తండ్రి శ్యామలరావు అనుమానిస్తున్నారు. అనవసర గొడవలకు వెళ్లొద్దు జాషువా సూసైడ్నోట్లో సోదరులు, స్నేహితులను ఉద్దేశిస్తూ.. బాగా చదువుకోవాలని, అనవసర గొడవలకు వెళ్లొద్దని సూచించాడు. తండ్రి,చిన్నాన్నకు సిగరెట్, మందు తాగొద్దని కోరాడు. ‘నా స్నే హితురాలిని తిట్టవద్దు. ఆఅమ్మాయి చాలా మంచిది’ అం టూ పేర్కొన్నాడు. మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ను ఉద్దేశించి ‘రాజేషన్నా.. నా చావుకు కారణమైన నరేష్ను వదలొద్దు. అతనిని అరెస్ట్ చేసిన తరువాతే తనను ఖననం చేయాలి అని పేర్కొన్నాడు. జాషువా మృతదేహాన్ని నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు పరిశీలించారు. కాని స్టేబుల్ నరేష్పై కేసు నమోదు చేశామని చెప్పారు. నరేష్ను వెంటనే అరెస్ట్ చేయాలి చెల్లబోయిన నరేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. వెంకటాపురంలో మృతదేహం వద్ద ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు జాషువా మృతదేహాన్ని ఖననం చేయబోమని ఆయన హెచ్చరించారు. మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి కర్ణి జోగయ్య, జిల్లా అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు, మర్రే సామ్యూల్, తోటే సుందరరావు, కె రవికుమార్, గుండె నగేష్ తదితరులు ఉన్నారు. గుణ్ణం నాగబాబు పరామర్శ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు కేసు వివరాలను రూరల్ సీఐ కె.రజనీకుమార్ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన మృతుడు తండ్రి శ్యామలరావును పరామర్శించారు. -
శ్రీగౌతమి కేసు దర్యాప్తు ఏమైనట్టు!
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దంగేటి శ్రీగౌతమి హత్య కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐడీ సీఐ (రాజమండ్రి) శేఖర్బాబు నేర పరిశోధనల్లో ప్రతిభకు ఇచ్చే ఏబీసీడీ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచారు. విజయవాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఠాగూర్ చేతులమీదుగా శేఖర్బాబు అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీగౌతమి కేసును దర్యాప్తు చేసినందుకే శేఖర్బాబును ఈ అవార్డు వరించింది. అయితే ఈ కేసును మొదట్లో పక్కదోవ పట్టించిన పోలీసు అధికారులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉందని చెప్పిన పోలీసు అధికారులు, ఇంకా కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. మంట కలిసిన పోలీసుల ప్రతిష్ట 2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీఐడీ సీఐ శేఖర్బాబు నేతృత్వంలోని అధికారులు ఇది పక్కా ప్లాన్తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావిడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ1, ఏ2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్తో పాటు ఏ3 గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూలను జూన్ 26న అరెస్ట్ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మణ్ను, పథకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సుఫారి హంతకులు సందీప్, దుర్గాప్రసాద్ను అరెస్ట్చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. శ్రీగౌతమి కేసులో ప్రతిష్ట పోగొట్టుకున్న జిల్లా పోలీసులు దానిని సరిచేసుకునే యత్నం ఏమీచేయకపోవడం విశేషం. ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. ముఖ్యంగా అప్పటిలో నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్ సీఐ ఇతర దర్యాప్తు అధికారులు అంతా కూడా సజ్జా బుజ్జి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కేసు పక్కదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి. హోంశాఖ మంత్రి చినరాజప్ప చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సీఐడీ సీఐ శేఖర్బాబు చార్జ్షీట్ ఇంకా ఎందుకు వేయలేదు? హత్యకేసులో 90 రోజుల్లో చార్జ్షీట్ వేయాలి. అసలు శ్రీగౌతమి ప్రమాద కేసును 2018 జూన్ 26న హత్య కేసుగా మార్చారు. 5 నెలలు అవుతున్నా చార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అంతకుముందు ప్రమాదంగా చెప్పిన అంశంపైనా చార్జిషీట్ ఫైల్ చేయలేదు. సజ్జా బుజ్జిని, ఇతర నిందితులను కాపాడడానికి అదృశ్య శక్తులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులూ ప్రారంభంలో జరిగిన తప్పును ఇప్పటి తూతూమంత్రపు దర్యాప్తుతో దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం సబ్జైలులో రిమాండ్ అనుభవించిన నిందితులకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చివరికి ఈ కేసు ఏం జరుగుతుందనే అంశం ఆసక్తిగా మారింది. దొరకని ప్రశ్న! ‘సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికీ సగమే పూర్తయ్యింది’ అని పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్ శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు గత జూన్నెల 26న చెప్పిన మాట ఇది. సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైయ్యిందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. న్యాయం జరిగే వరకూ పోరాటం: పావని మా అక్కను దారుణంగా చంపేశారు. అప్పట్లో పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. కేసును పక్కదారి పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోలేదు. ఇది దారుణం. అప్పట్లో మా అక్కను చంపేశారు అంటే చాలా హీనంగా మాట్లాడేవారు. ఈ కేసులో పోలీసులు ఏమీ చేయలేదు. సీఐడీ వారే చేశారు. వారికి అవార్డు రావడం సంతోషమే. హత్య వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలి. -
అత్తను హత్య చేసిన కోడలు
పశ్చిమగోదావరి, తణుకు టౌన్: అత్తా కోడళ్ల మద్య జరిగిన ఘర్షణలో క్షణికావేశంలో అత్తను హతమార్చిన ఘటన ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వెలుగు చూసింది. రేలంగి గ్రామానికి చెందిన కూసంపూడి వెంకట్రావు, మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులు, కుమార్తెలకు వివాహాలు చేసి కుమారుల వద్ద మహాలక్ష్మి, వెంకట్రావు ఉంటున్నారు. పెద్ద కోడలు కూసంపూడి వరలక్ష్మి, మహాలక్ష్మికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో శనివారం మద్యాహ్నం ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో అత్త మహాలక్ష్మిని (68) కోడలు కొట్టడంతో చనిపోయింది. దీనిని సహజ మరణంగా చిత్రీకరించి మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి కుమార్తెలకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం కుమార్తెలు వచ్చి ఫ్రీజర్లో వున్న మహాలక్ష్మి మృత దేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో తన అత్తను కొట్టి చంపినట్టు వరలక్ష్మి అంగీకరించినట్టు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమార్తె దుర్గాభవాని ఫిర్యాదు మేరకు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్సీ ప్రభాకరబాబు, సీఐ విజయకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గోదారిలో దూకి..
పశ్చిమగోదావరి, యలమంచిలి: చించినాడ వంతెనపై నుంచి దొడ్డిపట్ల గ్రామానికి చెందిన నామన దివ్యవాణి అనే యువతి శుక్రవారం గోదావరిలోకి దూకి గల్లంతైనట్టు తెలిసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ చూసి 100కు ఫోన్ చేయడంతో వారిచ్చిన సమాచారం మేరకు యలమంచిలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. వంతెనపై వాణి పర్సు, జోళ్లు ఉన్నాయి. పర్సులో దివ్యవాణి బస్పాస్తోపాటు పాలకొల్లు నుంచి రాజోలు వెళ్లే బస్ టికెట్ ఉండడంతో దూకింది వాణియేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాణి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉదయం ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన వాణి పాలకొల్లులో రాజోలు బస్సు ఎక్కి చించినాడ వంతెన అవతలి వైపు దిగింది. అటు వైపు నుంచి నడుచుకుంటూ వంతెన మధ్యకు వచ్చి గోదావరిలో దూకినట్లు స్థానికులు చెప్పారు. వాణి దూకిన సమయంలో గోదావరిలో టూరిజం శాఖ స్పీడ్ బోట్ సమీపంలో ఉందని వారు దూకిన ప్రదేశానికి వెళ్లిన తేలకపోవడంతో ఏమీ చేయలేకపోయారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న వాణి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణి తల్లి కుమారి గృహిణి. అన్నయ్య అశోక్ విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఎస్సై బొంతు సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: తండ్రి మందలించాడని మనస్థాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. మండలంలోని పట్టెన్నపాలెంకు చెందిన పి.నాగదుర్గాప్రసాద్ స్థానికచైతన్య(వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ) జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే దుర్గాప్రసాద్ సక్రమంగా కళాశాలకు వెళ్లడం లేదు. దసరా సెలవుల అనంతరం కూడా కళాశాలకు డుమ్మాకొట్టాడు. అయితే ఈ నెల 26న కళాశాలకు వెళ్లిన దుర్గాప్రసాద్ మధ్యాహ్నం నుంచి కళాశాల మానివేశాడు. అదే సమయంలో కళాశాల అధ్యాపకుడు ఒకరు స్థానిక కళాశాల రోడ్డులో వెళుతుండగా దుర్గాప్రసాద్ అక్కడ తారసపడ్డాడు. దీంతో ఆ అధ్యాపకుడు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో దుర్గాప్రసాద్ తండ్రి సీతారాముడు వచ్చి కొడుకును మందలించాడు. అయితే శనివారం సాయంత్రం వరకు దుర్గాప్రసాద్ స్నేహితులతో గడిపాడు. సాయంత్రం సమయంలో ఇద్దరు స్నేహితులతో స్థానిక ఆర్టీఓ కార్యాలయం వెనుక కొద్దిసేపు గడిపిన అనంతరం అకస్మాత్తుగా పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. దీనినిగుర్తించిన ఇద్దరు స్నేహితులు వెంటనే తండ్రి సీతారాముడికి సమాచారం ఇవ్వగా, దుర్గాప్రసాద్ను స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎ.దుర్గారావు చెప్పారు. కళాశాల బస్సుల ధ్వంసం నాగదుర్గాప్రసాద్ మృతిచెందాడని తెలుసుకున్న కొందరు విద్యార్థులు కళాశాల బస్సులు ఐదింటిని ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఇదే కళాశాలలో కొందరు విద్యార్థులు కళాశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం, సరిగా చదవకపోవడంతో యాజమాన్యం టీసీలు ఇచ్చి పంపించివేసింది. ఈ విధంగా టీసీలు తీసుకున్న విద్యార్థులు మరికొందరితో కలిసి వచ్చి కళాశాల బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం, చుట్టుపక్కల వారు విద్యార్థులను అదుపు చేయడంతో శాంతించారు. -
వీడిన హత్యకేసు మిస్టరీ
పశ్చిమగోదావరి, దెందులూరు: గుర్తుతెలియని మహిళ హత్యకేసును ఎట్టకేలకు ద్వారకాతిరుమల ఎస్సై వీర్రాజు చేధిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం హత్య కేసుగా మార్చారు. వివరాలిలా ఉన్నాయి.. దెందులూరు మండలం పోతునూరుకి చెందిన లింగాల రవీంద్రనాథ్ ఠాగూర్, పద్మిని (30)కి పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పెయింటర్, ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈనెల 22న కూలీ పనికి వెళ్లిన పద్మిని ఇంటికి తిరిగిరాలేదు. 26న గుర్తుతెలియని మహిళ మృతదేహం ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో పోలవరం కా లువ సమీపంలో కనిపించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, కుటుంబసభ్యులు గుర్తు తెలియని మృతదేహాన్ని పరిశీలించి పద్మినిగా గుర్తించారు. పోతునూరు గ్రామానికి చెందిన తలారి రాజ్కుమార్పై అనుమానం వ్యక్తం చేస్తూ ఠాగూర్ ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ సహాయంతో ద్వారకాతిరుమల ఎస్సై వీర్రాజు అనుమానితుడు రాజ్కుమార్ను అదుపులోకి తీ సుకుని విచారిస్తున్నారు. ఆదివారం పద్మిని మృతదేహానికి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం ని ర్వహించారు. -
నిందితులెక్కడ?
తూర్పుగోదావరి, గొల్లప్రోలు: చేబ్రోలులో రోడ్డు ప్రమాద ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు ప్రమాదకారకులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చేబ్రోలు శివారు బైపాస్ రోడ్డులో సోమవారం టాటా మేజిక్ వ్యాన్ను రాంగ్ రూట్లో వచ్చిన మట్టి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా మాకవారిపాలేనికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడచినా నేటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిస్తున్న తీరు అనుమానాస్పదంగా మారింది. పచ్చతమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ విశాల్గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి లారీ డ్రైవరు, యజమాని, రోడ్డు నిర్వహణ సక్రమంగా లేదని జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన దిలీప్ బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ కంపెనీపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా నేటి వరకు ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మట్టిమాఫియా బయటపడుతుందనా? ప్రమాదానికి కారణమైన లారీ మట్టి తరలింపు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. మట్టి ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడికి వెళుతోంది? మట్టి తరలించడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? అనే విషయాలు బయట పడతాయనే కేసును జాప్యం చేస్తున్నారు. మట్టి మాఫియాలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి సోదరుడు మట్టిమాఫియాలో కీలక పాత్రధారి. చెందుర్తి శివారు పోలవరం కాలువ గట్టు మట్టిని ఇష్టారాజ్యం తవ్వుకుని రియల్ఎస్టేట్ భూములకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం కాలువ గట్టు నుంచి చేబ్రోలులోని అడవిపుంత మీదుగా 216 జాతీయరహదారిపై రాంగ్ రూట్లో మట్టి లారీల రవాణా జరిగింది. మట్టి తరలింపు రాంగ్రూట్లో చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై విచారణను పక్కదోవ పట్టించడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు జాప్యం కేసును నీరుగార్చేందుకే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి ఉన్నట్టు అనుమానం బలపడుతోంది. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ నాయకుడు అనుచరులు కావడం వల్లే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా జిల్లాకు చెందిన హోంశాఖ మంత్రి, ఆర్థికశాఖా మంత్రి గానీ నేటి వరకు స్పందించకపోవడం విచారకరం. ఇతర జిల్లాల్లో ప్రమాదాలు జరిగితే క్యూ కట్టే నాయకులు జిల్లాలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా పట్టించుకోకపోవడం దారుణం. సాయం లేదు..పరామర్శ కరువు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన క్షతగాత్రులకు కనీసం ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం నేటి వరకు ప్రకటించలేదు. ప్రమాదంలో చనిపోయిన వారందరూ వ్యవసాయకూలీలే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. కనీసం మృతులు కుటుంబాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించిన సందర్భాలు లేవు. విచారణ జరుగుతోంది రోడ్డు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఒక రోజుల్లో నిందితులను అరెస్ట్ చేస్తాం. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు.– బి.శివకృష్ణ , ఎస్సై , గొల్లప్రోలు -
పొదల్లో మహిళ మృతదేహం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: హత్యకు గురైన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కనుగొన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి శివారులో పోలవరం కాలువ వద్ద పొదల్లో ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. సుమారు 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి, ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె కాళ్లు తాళ్లతో కట్టేసి ఉండటం, అలాగే మెడ చుట్టూ ఉన్న గాయాలను పరిశీలించిన పోలీసులు ఇది కచ్చితంగా హత్యే అయి ఉంటుందని నిర్ధారించారు. ఆమెను వేరే ప్రాంతంలో మూడు నాలుగు రోజుల క్రితం హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉబ్బిపోయి ఉన్న ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భీమడోలు సీఐ బీఎన్.నాయక్ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్త ప్రియురాలి వేధింపులు వివాహిత ఆత్మహత్య
పశ్చిమగోదావరి, తణుకు: ‘‘నా భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితాన్ని వీళ్లంతా సర్వనాశనం చేశారు. నాకు వేరే దిక్కు లేదు. మూడేళ్ల వయసున్న నా కొడుకును ఒంటరిగా వదిలి చనిపోతున్నాను. నా భర్తకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి ఇకపై ఎవరి కాపురాల్ని కూల్చకుండా ఉంటుంది. రెండేళ్లలో ఆమె పరిస్థితి కూడా నాలాగే తయారవుతుంది.’’ ఇలా సూసైడ్ నోట్ రాసి తనువు చాలించిందో వివాహిత. తణుకు పట్టణంలోని పాలంగి రోడ్డులో ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కాళిశెట్టి అనంతలక్ష్మి (29) బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కాళిశెట్టి శివకుమార్ స్థానికంగా ఎస్బీఐలో ఉద్యోగి. వీరికి మూడేళ్ల షన్వీర్ ఉన్నాడు. వీరు 2015 ఏప్రిల్ 22న ద్వారకాతిరుమలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో పెద్దల ఇష్టం లేకపోయినా వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి పాలంగి రోడ్డులోని ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వివాహేతర సంబంధం వల్లే పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో పని చేస్తున్న శివకుమార్ ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన తమ్మిన సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమార్తె అనంతలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే శివకుమార్కు రాజమండ్రికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈమె తండ్రి ఏఎస్సై కావడంతోపాటు ఆమెకు సహకరిస్తుండటంతో ఆమె సోదరుడు సైతం తనను బెదిరిస్తున్నాడని అనంతలక్ష్మి సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ క్రమంలో పెళ్లి అయిన నాటి నుంచి శివకుమార్, అనంతలక్ష్మి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం తిరుపతి వెళుతున్నానని చెప్పి శివకుమార్ ప్రియురాలితో టూర్ వెళ్లాడని తెలుసుకుని అతనితో అనంతలక్ష్మి ఫోన్లో ఘర్షణ పడింది. ఇదిలా ఉంటే తన ఇంటి సమీపంలోని మరో అపార్టుమెంటులో ఉంటున్న శివకుమార్ తల్లి సుబ్బలక్ష్మి వద్దకు వెళ్లిన అనంతలక్ష్మి తన కుమారుడు షన్వీర్ను దించి వెళ్లింది. తాను పనిమీద బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా లోపల బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన అల్లుడు శివకుమార్, ఆయన ప్రియురాలు, తల్లిదండ్రులు తన కుమార్తె మృతికి కారణమంటూ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త శివకుమార్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
తండ్రి, బాబాయ్లపై బ్లేడ్తో దాడి
పశ్చిమగోదావరి ,పాలకొల్లు సెంట్రల్ : పనిలోకి వెళ్లకపోతే ఎలా అని? ప్రశ్నించిన పాపానికి తండ్రితో పాటు బాబాయ్ని బ్లేడ్తో గాయపరిచిన ఓ వ్యక్తి ఉదంతం ఇది. ఈ సంఘటన ఆదివారం పాలకొల్లు రూరల్ పంచాయతీ యాళ్లవానిగరువు డాంపేటలో(ఆమ్లెట్) చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం, డాంపేటకు చెందిన పుచ్చకాయల బ్రహ్మయ్య రిక్షా కార్మికుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రమేష్ మద్యంకు బానిసై ఏ పనిచేయకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. ఇతనకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గల్ఫ్లో ఉంటుంది. ఇతని బాధ భరించలేక ఆమె రావడంలేదని బందువులు తెలిపారు. కుమార్తెను హింసిస్తుండడంతో ఆ పాప తాతగారింటిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తండ్రి బ్రహ్మయ్య రమేష్ను ఖాళీగా తిరిగితే ఎలా అంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న రమేష్ సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ముందుగా తల్లి మరియమ్మపై దాడి చేయబోయాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల జనం వచ్చారు. దీంతో అక్కడి నుంచి పారిపోయి బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఆదిత్య స్కూల్ వద్ద ఉన్న ఓ బడ్డీ కొట్టువద్ద నిలబడి ఉన్నాడు. ఇంతలో రమేష్ తండ్రి బ్రహ్మయ్య ఎక్సెల్ వాహనంపై ఇంటికి వస్తుండగా నాన్న నేను ఇంటికి వస్తానని చెప్పి బండి వెనకాల కూర్చున్నాడు. ఇంటికి సమీపంలోకి వచ్చే సరికి తన చేతిలో ఉన్న బ్లేడ్తో తండ్రి పీక కోసేశాడు. భయభ్రాంతులకు గురైన బ్రహ్మయ్య కేకలు వేస్తూ వాహనం వదిలేసి మెడకు తన వద్ద ఉన్న రుమాలు చుట్టుకుని ఇంటికి పరుగులు తీశాడు. రమేష్ ఆ వాహనం వేసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఇంతలో ఈ విషయం తెలిసిన ఆ పేటలో జనం గుమిగూడి విషయం తెలుసుకున్నారు. తండ్రి వాహనం వేసుకెళ్లిన రమేష్ ఉల్లంపర్రు గ్రామం మీదుగా చుట్టు తిరిగి డాంపేట తన ఇంటికి వస్తున్నాడు. ఇంతలో రమేష్ చిన్నాన్న నారాయణమూర్తి రోడ్డుపై ఎదురయ్యాడు. ‘నాన్న మెడను ఎందుకు కోసావురా?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్ తన చిన్నాన్న నారాయణమూర్తిని కూడా చేతులు, మెడ దగ్గర కోశాడు. నారాయణమూర్తి సంవత్సరం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నాడని అతని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఇద్దరినీ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయగా చేతులు, మెడపైన కుట్టులు వేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్ కోసం గ్రామంలోనే పోలీసులు గాలిస్తున్నారు. -
బస్సు డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు
పశ్చిమగోదావరి, అత్తిలి: మద్యం సేవించి కళాశాల బస్సు నడుపుతున్న బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాత్రి పాలూరు డ్యాం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏపీ 31 టీడబ్ల్యూ 1119 బస్సుడ్రైవర్ మద్యం సేవించి ఉండటాన్ని గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 140 ఎంజీ పర్ 100 ఎంఎల్ ఉందని ఎంవీఐ శ్రీనివాసరావు తెలిపారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేశామన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను అదే కళాశాలకు చెందిన వేరే బస్సులో పంపించారు. ఈసందర్భంగా ఎంవీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో బస్సు డ్రైవర్పై అనుమానం వచ్చి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష జరిపితే మద్యం సేవించి ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. కళాశాల యాజమాన్యాలు కూడా తమ కళాశాల బస్సు డ్రైవర్ల పరిస్థితిపై దృష్టిసారించాలని సూచించారు. -
ప్రేమలేఖ ఎంతపని చేసింది..!
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలోని మాంటిస్సోరి స్కూలులో పదో తరగతి చదువుతూ సోమవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి చనిపోయిన ఘటనకు సంబంధించి మిస్టరీ వీడలేదు. యాజమాన్యం వేధింపుల కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటేశ్వరరావు కుమారుడు అన్నాబత్తుల నాగవెంకట సాయిప్రసాద్ సోమవారం సాయంత్రం మాంటిస్సోరి స్కూలు ఆవరణలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు మృతదేహంతో హాస్టల్ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూలు ఫర్నీచర్తో పాటు స్కూలు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు స్కూలు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు స్కూలు యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలితంగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రిలోని శవాగారానికి తరలించారు. మంగళవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే బంధువుల డిమాండ్ మేరకు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం మొత్తం వీడియో కెమెరా ద్వారా తీయించారు. ప్రేమ వ్యవహారం...? స్కూలు ఆవరణలోని హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సాయిప్రసాద్ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రేమలేఖ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. స్కూలులో చదువుతున్న ఒక బాలికకు సాయిప్రసాద్ రాసిన ప్రేమలేఖ ఇప్పుడు కీలకంగా మారినట్టు సమాచారం. ప్రేమలేఖ ఉపాధ్యాయురాలి ద్వారా సాయిప్రసాద్ తరగతి ఉపాధ్యాయుడు, లెక్కల టీచర్ బాలాజీకి చేరినట్టు తెలిసింది. దీంతో నాలుగు రోజులుగా పనిష్మెంట్ పేరుతో సాయిప్రసాద్ను బయట నిలబెడుతూ తీవ్రంగా కొడుతున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం విద్యార్థి తండ్రికి కబురు పంపిన యాజమాన్యం విషయం తెలియజేశారు. అయితే ఇదే సమయంలో స్కూల్ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు విద్యార్థిని చితకబాదగా కోపంతో తండ్రి కూడా చేయి చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వచ్చి తన కుమారుణ్ని తీసుకెళ్లిపోతానని చెప్పిన తండ్రి సాయంత్రం స్కూలుకు వచ్చే సరికి ఉరి వేసుకున్న సాయిప్రసాద్ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహంతో హాస్టల్కు వచ్చి బైఠాయించారు. అజ్ఞాతంలోకి బాలాజీ...? సాయి ప్రసాద్ను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు కారణమైన క్లాస్ టీచర్ బాలాజీతో పాటు స్కూలు డైరెక్టర్ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతని ఫేస్బుక్ ఖాతాను సైతం క్లోజ్ చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు సీఐ కె.ఎ.స్వామి తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
విషాదం.. విధ్వంసం
పశ్చిమగోదావరి, తణుకు: పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూలులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు డైరెక్టర్ తీవ్రంగా కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఎదుటే కొట్టిన స్కూలు డైరెక్టర్ టీసీ ఇచ్చేస్తానని బెదిరించడంతో పైఅంతస్తులోని హాస్టల్ గదికి వెళ్లి ఉరి వేసుకుని తనువు చాలించాడు. దీంతో ఆగ్రహంతోఊగిపోయిన మృతుడి బంధువులు స్కూలులో విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్, స్కూలు బస్సులను ధ్వంసం చేసిన ఆందోళనకారులు ఒక బస్సుకు నిప్పు పెట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తండ్రి ఎదుటే కొట్టడంతో... తణుకు పట్టణంలోని బ్యాంకు కాలనీలో మాంటిస్సోరి స్కూలులో ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల నాగవెంకటసాయిప్రసాద్ (17) పదో తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి పేరు శ్రీనివాసరావు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుంచి పెదనాన్న వెంకటేశ్వరరావు పెంచుకుంటున్నాడు. ఆయనే సాయిప్రసాద్ను దత్తత తీసుకుని చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం స్కూలు నుంచి యాజమాన్యం ఫోన్ చేసి తండ్రి వెంకటేశ్వరరావును స్కూలుకు రప్పించారు. సాయిప్రసాద్ సరిగ్గా చదవడంలేదని, చెప్పిన మాట వినడంలేదని, చిరుతిళ్లు తెచ్చుకుని తరగతి గదిలో తింటున్నాడని పేర్కొంటూ స్కూలు డైరెక్టర్ ఉమామహేశ్వరరావు విద్యార్థి తండ్రి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఎదురుగానే సాయిప్రసాద్ను చితకబాదిన డైరెక్టర్ టీసీ ఇచ్చేస్తానని బెదిరించారు. దీంతో సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసికెళ్లిపోతానని తండ్రి సమా«ధానం చెప్పి వెళ్లిపోయాడు. తండ్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికి తరగతి గదికి వెళ్లకుండా నేరుగా పైఅంతస్తులోని హాస్టల్ గదికి వెళ్లిన సాయిప్రసాద్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం కారులో స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి మృతదేహాన్ని ఉంచి వెళ్లిపోయారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయిప్రసాద్కు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేర్పించినట్లు తండ్రి వెంకటేశ్వరరావుకు స్కూలు నుంచి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆసుపత్రికి వచ్చిన తండ్రికి విగతజీవిగా మారిన కుమారుణ్ని చూసి కుప్పకూలిపోయారు. అయితే డైరెక్టర్ కొట్టిన దెబ్బలకే చనిపోయాడని పక్కదోవ పట్టించడానికే ఉరి వేసుకున్నాడని యాజమాన్యం చెబుతోందని బంధువులు ఆరోపిస్తున్నారు. స్కూలులో విధ్వంసం... స్కూలు యాజమాన్యం వేధింపులతో విద్యార్థి సాయిప్రసాద్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అంబులెన్స్లో మృతదేహాన్ని స్కూలు ఆవరణలోని హాస్టల్ వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్పందించకపోడంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు సుమారు గంటపాటు విధ్వంసం సృష్టించారు. స్కూలు కార్యాలయం ధ్వంసం చేసి ఆవరణలో నిలిపి ఉంచిన స్కూలు బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఒక బస్సుకు నిప్పు పెట్టడంతో అప్రమత్తమైన కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు మంటలను అదుపు చేశారు. అయితే హాస్టల్ భవనంలోని కింది అంతస్తు మొత్తం ధ్వంసం చేసిన ఆందోళనకారులు పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పై రెండు అంతస్తుల్లో విద్యార్థులు ఉండటంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు నిర్వహించారు. హాస్టల్ గదిలోని విద్యార్థులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. కారుమూరి పరామర్శ విద్యార్థి సాయిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నసంఘటనతో బ్యాంకు కాలనీలోని మాంటిస్సోరి స్కూలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పార్టీ నాయకులు చీర్ల రాధయ్య, జనసేన నాయకులు విడివాడ రామచంద్రరావు, మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరావు, వైస్ ఛైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం తదితరులు వచ్చి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ సంఘటనతో స్కూలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో భారీబందోబస్తు నిర్వహించారు. సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని హాస్టల్ ఆవరణలోనే ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులుమోహరించారు. -
దంపతుల ఆత్మహత్య
పశ్చిమగోదావరి, దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతీనీడుపాలెంలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, భర్తలేకపోతే తాను బతకడం కష్టమని భావించిన భార్య ఇద్దరూ కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గొల్లగూడేనికి చెందిన జ్యోతి(27)ని నల్లజర్ల మండలం పోతినీడుపాలేనికి చెందిన సోము విష్ణుమూర్తి(32)కి ఇచ్చి 2009లో వివాహం చేశారు. వీరిద్దరూ జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. విష్ణుమూర్తి జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు వ్యాపార సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. విష్ణుమూర్తి గుండెజబ్బుతో బాధపడుతున్నారు. ఎంతోకాలం బతకడని వైద్యులు చెప్పడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. అనారోగ్యంతో భర్త చనిపోతే తాను ఒంటరిగా బతకలేనని భావించిన జ్యోతి భర్తతోపాటు తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ జంగారెడ్డిగూడెం నుంచి మోటారు సైకిల్పై పోతినీడుపాలెం వచ్చి అక్కడి నుంచి గ్రామ శివారులోని తమ సొంత పొలంలోని బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలకు బయటకుతీశారు. పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ విలేకర్లకు తెలిపారు. -
ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతని అనుచరులు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు ముగ్గురు గన్మెన్లపైనా కేసు నమోదైంది. పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్ పో లీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతని అనుచ రు లు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు ముగ్గురు గన్మెన్లపైనా కేసు నమోదు చేశారు. ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రి రాచీటి జాన్ను ఎమ్మెల్యే ప్రభాకర్ తన ఇంటికి పిలిపించుకుని కొట్టి, కులంపేరుతో దూషించిన ఘటనపై కార్మిక, దళిత సంఘాలు, వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటంతో చేసేదిలేక పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఐఎంఎల్ డిపోలో ఓ హమాలీ సక్రమంగా పనిచేయక పోవటంతో హమాలీ మేస్త్రి రాచీటి జాన్ అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే చింతమనేని మేస్త్రి జాన్ను ఇంటికి పిలిపించి పంచాయితీ పెట్టారు. తొలగించిన కార్మికుడిని తిరిగి పనిలో పెట్టుకోవాలని హుకుం జారీ చేశారు. తమ కార్మిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అతడిని పనిలో పెట్టుకోవటం కుదరదని జాన్ చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చింతమనేని దాడికి పాల్పడ్డారు. కొట్టటంతోపాటు, కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈనెల 10న సంఘటన జరగగా 11న కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు, బాధితుడు జాన్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ఈనెల 14 వరకూ పోలీసులు కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. కేసు నమోదు చేయకపోవటంపై వామపక్ష పార్టీలు, కార్మిక, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాయి. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ వద్ద రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం త్రీటౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐపీసీ 323 కింద కేసు నమోదు చేశారు. -
నాలుగు నెలల గర్భిణిపై దాడి
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్): నాలుగు నెలల గర్భిణిపై ఆమె బంధువులు దాడి చేసిన ఘటన ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గర్భిణి పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో చేరి వైద్యచికిత్స పొందుతుంది. ఆమె, ఆమె భర్త, బంధువులు తాడేపల్లిగూడెంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పాకపాడుకు చెందిన చదనపల్లి వీరదాసు, పావ ని శ్వేతలు వేర్వేరు కులాలకు చెందిన వారు. ఇరువురు తల్లిదండ్రులది ఉప్పాకపాడే. వీరిద్దరూ ప్రేమించుకుని మే 17న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పావని శ్వేత గర్భం దాల్చింది. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె భర్తలతో కలిసి వినాయక చవితికి ముందు ఉప్పాకపాడు వెళ్లింది. వీరదాసు తండ్రి వారిని పండగ అయ్యే వరకు ఇక్కడే ఉండమనడంతో వారు అక్కడే ఉన్నారు. గురువారం రాత్రి పావని శ్వేత బంధువులు నలుగురు ఆమె భర్త, మామ లేని సమయం చూసి వీరదాసు ఇంటి వద్ద ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్వేత, అత్త రమణను, పిన్ని కుమారిని, మరిది కాళీ కృష్ణలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్వేత గర్భిణి కావడంతో ఉదరంపై కాలితో బలంగా తన్నినట్లు చెప్పారు. దెబ్బలు తిన్న వీరిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు వివరాలను సేకరించారు. -
ప్రాణం తీసిన మద్యం తగాదా
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: ఇరువురు స్నేహితుల మధ్య తలెత్తిన మద్యం తగాదా ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో చేసిన తప్పిదం రెండు కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామానికి చెందిన అంగర వెంకన్న, దాసరి సత్యనారాయణ స్నేహితులు. వ్యవసాయ పనులు చేసుకుని కుటుంబాలను సాకుతున్నారు. బుధవారం రాత్రి సత్యనారాయణ మద్యం తీసుకురమ్మని రూ.500లు వెంకన్న చేతికిచ్చారు. అతను మూడు క్వార్టర్ బాటిళ్లు తీసుకుని వచ్చి చెరొక క్వార్టరు తాగారు. వేరొక క్వార్టర్ బాటిల్ కోసం సత్యనారాయణ వెంకన్నను ఆరా తీశారు. దీంతో క్వార్టర్ బాటిల్ ముందే తాగేశానని చెప్పడంతో నా డబ్బుతో మద్యం తీసుకువచ్చి నాకు ఇవ్వకుండా తాగుతావా అంటూ సత్యనారాయణ వెంకన్నను గద్దించాడు. దీంతో ఇరువురు మధ్య మాటామాటా పెరిగి పోయింది. కోపంతో సత్యనారాయణ దగ్గరలో ఉన్న ఇనుపరాడ్ తీసుకుని వెంకన్న తలపై మోదడంతోఅక్కడికక్కడే మృతిచెందారు. వెంకన్న సోదరుడు అంగర సాయిమాణిక్యం ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శుక్రవారం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడు వెంకన్నకు భార్య, కుమార్తె ఉన్నారు. -
కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో..
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: భార్యభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రపోతున్న భార్య తలపై రాడ్డుతో కొట్టి రక్తం మడుగులో ఉన్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేశాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మరాజుపాలెంకు చెందిన బొబ్బిలి వెంకటరామారావు అదే గ్రామానికి చెందిన ప్రణయత(33) 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రణయత ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లింది. దీంతో వెంకటరామారావు దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తరచు తిమ్మరాజుపాలెం వస్తూండేది. నాలుగు నెలలు క్రితం ప్రణయత గల్ఫ్దేశం నుంచి ఇంటికి రావడంతో భర్తకు వేరే మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్టు తెలిసింది. దీంతో భార్యాభర్తలు తరచు తగాదాలు పడేవారు. వారికి పెద్దలు నచ్చజెప్పారు. అయితే వారి పెద్ద కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తల్లికి తెలియడంతో ఇటీవల కుమార్తెను మందలించింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఆదివారం రాత్రి తగాదా జరగటంతో ప్రణయతను తలపై రాడ్డుతో బలంగా కొట్టగా తీవ్రంగా రక్తస్రావమై ఉన్న ఆమెపై పెట్రోల్ పోసి వెంకటరామారావు నిప్పంటించాడు. మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. కుమార్తె ప్రేమ వ్యవహారమే కారణమా? ప్రణయత పెద్దకుమార్తె (18) నిడదవోలులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కొంతకాలంగా పట్టణ శివారు లింగంపల్లికి చెందిన వివాహితుడైన యువకుడి ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలాచోట్ల కలిసి కనిపిస్తున్నారని బంధువులు తల్లికి చెప్పడంతో కుమార్తెను నిలదీసింది. దీంతో కొన్నిరోజులుగా తల్లీకూతురు మధ్య సరిగా మాటలు లేవు. ప్రణయత గల్ఫ్ దేశానికి రెండుసార్లు వెళ్లి ఐదేళ్లపాటు పనిచేసింది. ఆ సమయంలో ఆమె పంపిన డబ్బులో సుమారు రూ.2 లక్షలు భర్త వృథాగా ఖర్చుపెట్టడంతో పాటు గౌరీపట్నానికి చెందిన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళను కొన్నిసార్లు నేరుగా ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం పెద్దకుమార్తెకు తెలిసినా తల్లికి చెప్పలేదు. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకేమాట మీద ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో భార్యభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం నిద్రిస్తున్న భార్యను కోపంతో రగిలిపోతున్న భర్త రాడ్డుతో కొట్టడంతో పాటు పెట్రోల్ పోసి కిరాతంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేయడంలో పెద్దకూతురు కూడా తండ్రికి సహకరించినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వేసుకున్న దుస్తులను కూడా పోలీసులు స్వా«ధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. అల్లుడు, మనవరాలు కలిసి తన కుమార్తెను హత్యచేశారని మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఆరోపిస్తూ కన్నీటిపర్యంమైంది. -
దర్జాగా దోపిడీ
పశ్చిమగోదావరి, తణుకు: అతను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదివాడు.. సర్జికల్ వస్తువులు హోల్సేల్గా విక్రయిస్తుంటాడు.. అయితే అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని వచ్చిన ఆలోచనను అమల్లో పెట్టాడు.. శాఖా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి ఫోన్ చేసి మీకు సాయం చేస్తాను.. ఇబ్బందులు లేకుండా గట్టెక్కిస్తానంటూ నమ్మబలికి వారి నుంచి డబ్బు లాగుతాడు.. అతనే శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్ల మండలం కుసిలేపురం గ్రామానికి చెందిన వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు. పెట్టుబడి కేవలం నెట్లో దినపత్రికలు చదవడం.. వాటిలో వచ్చిన వార్తల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులకు ఫోన్చేసి బెదిరించడం ఇతని ప్రవృత్తి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనను ఆధారం చేసుకుని ఒక ఎక్సైజ్ ఎస్సై నుంచి రూ.1.50 లక్షలు గుంజాడు. మరో ఎక్సైజ్ సీఐ నుంచి డబ్బు గుంజే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని.. వెలమ నారాయణరావుకు ఇంటర్నెట్లో దినపత్రికలు(ఈ పేపర్) చదవటం అలవాటు. గత నెల 17న దినపత్రికల్లో సత్యవాడ ఘటనకు సంబం ధించిన వార్తలు అతడు చదివాడు. వాటిని ఆధారం చేసుకుని ఎక్సైజ్ అధికారుల నుంచి డబ్బు గుంజాలని పన్నాగం పన్నాడు. ఎక్సైజ్శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి తణుకు సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించాడు. సత్యవాడ ఘటనకు సంబంధించి ఆ ప్రాంత పరిధిలోని మహిళా ఎక్సై జ్ ఎస్సైకు ఫోన్ చేసి మీరు శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ కమిషనరేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు నాయుడని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు జమ చేయాలన్నాడు. ఇబ్బందుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తానని చెప్పడంతో నిజమని నమ్మిన ఆమె రూ.1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో సరే అని చెప్పిన నాయుడు ఒక బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. దీంతో నాలుగు దఫాలుగా ఆమె రూ.1.50 లక్షలు జమ చేసింది. ఇదే అదునుగా మరుసటి రోజు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావుకు ఫోన్ చేసి ఇదే తరహాలో బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన సీఐ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబరు, నాయుడు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా తణుకు సీఐ కేఏ స్వామి, పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అడ్వకేట్ బ్యాంకు ఖాతా నంబరువాడుకున్న మోసగాడు ప్రభుత్వాధికారులను మోసంచేసి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వెలమల నారాయణరావు అలియాస్ నాయుడు బండారం అతని స్నేహితుడు, న్యాయవాది నామా బలరాంశేఖర్ ద్వారా బయటపడింది. నారాయణరావు ప్రభుత్వాధికారులకు బలరాంశేఖర్ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చేవాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేఖర్కు ఓసారి మార్నింగ్ వాక్లో పరిచయమైన నారాయణరావు తనకు కొందరు డబ్బు ఇవ్వాలని, మీ బ్యాంకు ఖాతా నంబర్ చెబితే వినియోగించుకుంటానని చెప్పడంతో నమ్మిన ఆయన బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఇలా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా చిరునామా సేకరించిన పోలీసులు బలరాంశేఖర్ను తణుకు తీసుకువచ్చి విచారించగా మొత్తం మోసం బయటపడింది. అడ్వకేట్ శేఖర్ ద్వారా నారాయణరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించి నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు నారాయణరావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. -
యువతిపై లైంగిక దాడి.. బెదిరింపు
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: యువతిపై అత్యాచారంచేసి చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.దుర్గారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడిలో చానల్ రిపోర్టర్గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో శ్రీ విష్ణు ట్రావెల్స్ నిర్వహిస్తున్న కాగిత సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు. సత్యనారాయణ స్థానిక రాజులకాలనీలో నివసిస్తున్న ఒక యువతితో సన్నిహితంగా ఉండేవాడు. యువతి నిజామాబాద్లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం వరకు చదివి మానేసింది. ఆమె బీటెక్ చదువుతున్న సమయంలో నిజామాబాద్ వెళ్లేందుకు ట్రావెల్స్లో టికెట్ కోసం సత్యనారాయణ వద్దకు వెళ్లేది. అదేసమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది. ఇదే అదునుగా సత్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. వారి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పటికే సత్యనారాయణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండటంతో యువతి నిరాకరించింది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సత్యనారాయణ ఆమెను బెదిరించాడు. యువతిని స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేర్పించారు. తరచూ ఆమెను మోటార్సైకిల్పై, కారుపై తిప్పుతూ ఈ క్రమంలో మత్తుమందు ఇచ్చి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె మత్తులో ఉండగా అసభ్య వీడియోలు, ఫొటోలు తీశాడు. మత్తులో ఉన్న సమయంలో తనతో వ్యభిచారం కూడా చేయించేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో సత్యనారాయణ గతనెల 15న తనను తీసుకువెళ్లి ఉప్పలపాడు వెంకటేశ్వరస్వామి ఆలయంలో బలవంతంగా తాళి కట్టినట్టు ఆమె పేర్కొంది. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం యువతి తల్లితండ్రులు ఆమెకు రాజమండ్రికి చెందిన యువకుడితో వివాహం కుదిర్చారు. దీంతో ఆగ్రహించిన సత్యనారాయణ గతనెల 26న యువతి అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు రాజమండ్రికి చెందిన యువకుడికి వాట్సాప్లో పంపాడు. దీంతో యువకుడు యువతి కుటుంబసభ్యులను ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు యువతి స్థానిక పోలీస్స్టేషన్లో కాగిత సత్యనారాయణపై ఫిర్యాదు చేసినట్టు ఎస్సై చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రాడ్లు, కత్తులతో బీభత్సం
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు తంగెళ్ళమూడి కబాడీగూడెంలో ఒక వ్యక్తిపై ఐదుగురు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దాడికి తెగబడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తలపై తీవ్ర గాయాలు కావటంతో వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సనిమిత్తం గుంటూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు చేరటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కబాడీగూడెంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు తంగెళ్ళమూడి 50వ డివిజన్ కబాడీగూడెంకు చెందిన కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్, అలియాస్ కాశీ (28)పై గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతని ఇంటివద్దనే ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో తీవ్రంగా నరికారు. అక్కడే ఉన్న రాళ్ళతో తలపైనా, చాతీపైనా కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సతీష్ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తలపై కత్తులతో నరకటంతో తీవ్రంగా రక్తస్రావం కావటంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్పై పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు. సతీష్పై కత్తులు, రాడ్లతో దాడి చేసిన వారిలో మున్నుల సీతయ్య, మున్నుల సాయి, మున్నుల శివ, మున్నుల మూర్తి, మున్నుల వెంకన్న అనే వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో రౌడీషీటర్ జొన్నకూటి రాటాలుతో గొడవలు జరగటం, కొంత వివాదం నేపథ్యంలో అదను కోసం వేచిఉన్నట్లు సమాచారం. దీంతో గురువారం ఉదయం నుంచి కొబ్బరి శివ, జొన్నకూటి రాటాలు సతీష్కు బాగా మద్యం తాగించారని తెలుస్తోంది. మద్యం సేవించి ఉన్న సతీష్పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో హత్యాయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏలూరు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.కాశీ సత్యనారాయణపై హత్యాయత్నంతో కబాడీగూడెం ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరు వర్గాలు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ కారే బాబూరావు పోలీసులను కోరారు. -
లండన్వాసి మృతిపై అనుమానం
పశ్చిమగోదావరి ,పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో శంభుని పేటకు చెందిన డాక్టర్ చదలవాడ డేవిడ్జాన్ (75) మృతిపై అనుమానంతో మంగళవారం అతని మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం చేశారు. బంధువుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన డేవిడ్జాన్ 50 సంవత్సరాల క్రితం లండన్ వెళ్లి డాక్టర్ వృత్తిలో అక్కడే స్థిరపడ్డారు. కొన్నాళ్లకు లండన్కు చెందిన జీన్మూడీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. డాక్టర్గా రిటైరైన తరువాత ఆరు మాసాలకు ఒకసారి పాలకొల్లు వస్తుండేవారు. పాలకొల్లులో అతని సొంత నివాసంలో వృద్ధుల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో ఈ వృద్ధాశ్రమాన్ని 18 మాసాలు కొనసాగించారు. అనంతరం దీనిని మూడు సంవత్సరాల క్రితం వైజాగ్లో బాబా ట్రస్ట్గా ఏర్పాటు చేసి అక్కడ బుర్రె ఉమ, భర్త తులసీరావులను నిర్వాహకులుగా నియమించారు. ఇటీవల జూన్ 16న లండన్ నుంచి వైజాగ్ వచ్చిన డేవిడ్ జాన్ జులై 21న మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామం పాలకొల్లు కావడంతో పాలకొల్లు రూరల్ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసినట్లు బంధువులు తెలిపారు. జాన్ డెత్ సర్టిఫికెట్ కోసం ఆయన పిల్లలు వైజాగ్లో బాబా ట్రస్ట్ నిర్వాహకులను అడగగా ఆసుపత్రిలో చనిపోయినట్లు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి సమాచారం అడగగా ఇంటి వద్ధ చనిపోయిన వ్యక్తినే ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పడంతో నిర్వాహకులపై అనుమానం వచ్చిందని బంధువులు తెలిపారు. లండన్ వెళ్లిపోయిన డేవిడ్ జాన్ పిల్లలు వారికి సమీప బంధువైన మాముడూరి జయంత్తో పాలకొల్లు పోలీస్ స్టేషన్లో జాన్ మృతిపై అనుమానం ఉందని కేసు పెట్టించారు. నాలుగు రోజుల క్రితం జయంత్ అనే వ్యక్తి కేసు పెట్టగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పట్టణ సీఐ బి.కృష్ణకుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ దాశి రాజు ఆధ్వర్యంలో డేవిడ్ జాన్ బంధువుల సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ భాస్కరరావు పోస్టుమార్టం చేశారు. పట్టణ వైద్యులు డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తికి డేవిడ్జాన్ చిన్ననాటి స్నేహితుడు కావడంతో పోస్టుమార్టం జరిగే వరకూ ఆయన కూడా శ్మశాన వాటిక వద్దే ఉన్నారు. -
తల్లి రెండో భర్త లైంగిక వేధింపులే కారణమా..?
పశ్చిమగోదావరి , నిడదవోలు : పట్టణంలో పాటిమీద సెంటర్లో పాత ట్రెజరరీ వీధిలో దుర్రు ప్రియ బాంధవి(20)అనే విద్యార్థిని సోమవారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో సంచలనం రేపిన ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మరణానికి తన రెండో భర్త ఈగల అప్పలరాజు కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియ బాంధవి ఉరి వేసుకుని చనిపోయిందని అప్పలరాజు తన భార్య నాగమణికి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంత వరకు అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియ బాంధవి ప్రస్తుతం తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పట్టణంలో పాటిమీద సెంటర్లో నివాసం ఉంటున్న దుర్రు నాగమణి భర్త నాగరాజు మృతి చెందగా ఏడేళ్ల క్రితం విశాఖపట్నం గాజువాకకు చెందిన ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. నాగమణి మొదటి భర్త నాగరాజుకు ప్రియ బాంధవి జన్మించింది. ఏడేళ్లలో వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యభర్తలు తరచూ గొడవలు పడేవారు. కన్నతల్లికి తీరని కడుపుకోత ఇంటిలో ఉన్న చీటీ పాట ద్వారా వచ్చిన 32,000 రూపాయలను తీసుకుని పట్టణంలో రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న అప్పలరాజు అచూకీ తెలుసుకుని తల్లీకూతుళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో అప్పలరాజు నాగమణిని కొట్టడంతో చనిపోతానని అక్కడ నుంచి ఆటోలో వెళ్లిపోయింది. ప్రియ కూడా అక్కడ నుంచి ఇంటికి తానే వెళ్లిపోయిందా ..ఇంటి దగ్గర ఎవరైనా దింపారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగమణి కొంత దూరం వెళ్లే సరికి తన భర్త ఫోన్ చేసి ప్రియ బాంధవి ఇంటిలో తలుపులు వేసుకుందని చెప్పడంతో నాగమణి తిరిగి వెనక్కి వచ్చేసింది. నేను వచ్చే లోపల ఇదంతా జరిగిపోయిందని, కన్న కూతురిలా చూసుకోవాల్సిన తండ్రి కూతురు వరసైనా ప్రియ బాంధవిని లైంగిక వేధింపులకు గురిచేశాడని, తన కూతురు అనేక సార్లు తనతో మొర పెట్టుకుందని నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన కూతురు భవి ష్యత్, పరువు నాసనమవుతాయని బయట పెట్ట లేక కడుపులోనే దాచుకున్నానని నాగమణి కన్నీరు మున్నీరవుతోంది. అప్పలరాజు గతంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన భర్త ప్రస్తుతం ప రారీలో ఉన్నాడని నాగమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నాగమణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. -
తల్లితండ్రుల గొడవ..విద్యార్థిని ఆత్మహత్య !
పశ్చిమగోదావరి, నిడదవోలు: నిడదవోలు పాటిమీద సెంటర్లోని పోస్టాఫీసు వీధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పోస్టాఫీసు వీధిలో దుర్రు నాగమణి అనే మహిళ భర్త నాగరాజు మృతిచెందడంతో ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త నాగరాజు ద్వారా ఆమె ప్రియబాంధవి అనే అమ్మాయికి జన్మనిచ్చింది. నాగమణి అప్పలరాజు, ప్రియబాంధవితో కలిసి పోస్టాఫీసు వీధిలో నివాసముంటోంది. ప్రస్తుతం ప్రియభాందవి (20) తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో ఇటీవల అప్పలరాజు, నాగమణి తరచూ గొడవలు పడుతున్నారు. సోమవారం ప్రియబాంధవికి నీరసంగా ఉండటంతో కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మళ్లీ భార్యభర్తలు గొడవపడటంతో పాటు అప్పలరాజు ప్రియబాంధవిని తిట్టాడు. దీంతో తల్లి నాగమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన ప్రియబాంధవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుంది. అరగంట తర్వాత ప్రియబాంధవి ఆత్మహత్య చేసుకుందని అప్పలరాజు భార్య నాగమణికి సమాచారం ఇచ్చాడు. లబోదిబోమంటూ ఇంటికి చేరుకున్న నాగమణి ఇంట్లోని గదిలోకి వెళ్లి చూడగా ప్రియబాంధవి ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె పిరికి కాదని, భర్త అప్పలరాజు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని నాగమణి రోదించింది. అప్పలరాజు గతంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కు మార్తె చనిపోయినా సంఘటన స్థలానికి రాకపోవడంతో అతనిపై పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భర్తపై హత్యాయత్నం.. ఆపై ఆత్మహత్య
పశ్చిమగోదావరి, పాలకోడేరు: భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకుంది. అర్ధరాత్రి అతడు నిద్రపోతున్న వేళ కత్తితో దాడి చేసి పలుసార్లు పొడిచింది. భర్త మరణించాడని భావించి ఆపై ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి పాలకోడేరు మండలం గొరగనమూడిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గొరగనమూడిపాలెంకు చెందిన బొక్కా తులసి (55), బొక్కా సత్యనారాయణ (60) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో వివిధ చోట్ల స్థిరపడ్డారు. ఆ దంపతులు మాత్రం గొరగనమూడిపాలెంలో కాపురం ఉంటున్నారు. తులసికి ఎప్పటి నుంచో భర్త సత్యనారాయణపై అనుమానం ఉంది. తులసి కొన్నాళ్లుగా అల్సర్తో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను భర్త పట్టించుకోవడం లేదని, ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సత్యనారాయణ నిద్రపోయిన తర్వాత కర్రతో అతడి తలపై మోది కత్తితో శరీరంపై పలుచోట్ల పొడిచేసింది. భర్త చనిపోయాడని భావించిన అనంతరం పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సత్యనారాయణ తీవ్ర గాయాలతో రక్తమోడుతూ బయటకు వచ్చి పొరుగు వ్యక్తి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. హత్యాయత్నం, ఆత్మహత్యపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంత వయసు వచ్చినా దాంపత్య జీవితంపై అవగాహన లేక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సైకాలజిస్ట్ డాక్టర్ బి.చలపతిరావు వ్యాఖ్యానించారు. -
కీచక గురువుపై పోక్సో కేసు నమోదు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఏలూరు నగరానికి చెందిన ఒక మైనర్ బాలికను నమ్మించి లోబరుచుకుని గర్భవతిని చేసిన సంఘటనకు సంబంధించి బాలిక తల్లి ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కె.రామారావు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పని చేస్తున్న కె.రాంబాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన కుమార్తెను బెదిరించడంతో ఈ విషయం బయటకు తెలియకుండా దాచి పెట్టిందని తెలిపారు. రెండు రోజుల క్రితం కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా గర్భవతిగా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు రాంబాబు ను బాలికకు సంబంధించిన బంధువులు, మరి కొందరు మంగళవారం రాత్రి తీవ్ర స్థాయిలో కొట్టి నగ్నంగా నగర వీధుల్లో నడిపించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడు రాంబాబును వారి నుండి విడిపించి స్టేషన్కు తరలించారు. రాంబాబును తీవ్రస్థాయిలో కొట్టడంతో శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్య పరీక్షల్లో తేలింది. రాంబాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. -
‘కీచక’ టీచర్ను నగ్నంగా ఊరేగించి దేహశుద్ధి!
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో ఒక మైనర్ బాలికను మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేసిన కీచక టీచర్ ఉదంతం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. రోడ్డుపై నగ్నం నడిపిస్తూ.. చితకొట్టి ఏలూరు టూటౌన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలిక తల్లీదండ్రీ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదివే సమయంలో అక్కడ ఇంగ్లిష్ టీచర్గా కె.రాంబాబు పనిచేశాడు. అప్పట్లో మార్కులు బాగా వేయిస్తానని నమ్మబలికి బాలికను లోబరుచుకున్నాడు. గత కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెను శారీరంగా వాడుకున్నాడనీ అంటున్నారు. అయితే ప్రస్తుతం బాలిక పాలిటెక్నిక్ చదువుతోంది. బాలిక ఐదు నెలల గర్భిణి కావటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంబాబు స్వస్థలం కర్నూలు జిల్లా కాగా అతనికి పదేళ్ళ క్రితమే వివాహం అయ్యింది. భార్య రాంబాబును వదిలివేయటంతో ఏలూరులోనే గత 7 సంవత్సరాలుగా ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. బాలికను మోసం చేసి లోబరుచుకుని గర్భవతిని చేశాడని బాలిక బంధువులు చెబుతున్నారు. స్థానికులు రాంబాబును బట్టలు ఊడదీసి తీవ్రస్థాయిలో కొట్టటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
పోలవరం రూరల్: ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన కుమారుడు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో మృతదేహంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలవరం మండలం ఇటుకలకోట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంజం శ్రీనివాస్ (18) 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15న బుధవారం సాయంత్రం శ్రీనివాస్ వసతి గృహం నుంచి కొమ్ముగూడెం ఇంటికి వెళ్లాడు. గురువారం శ్రీనివాసరావును తండ్రి కుంజం రాజు ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారని తల్లి దుర్గ తెలిపింది. సెలవుల్లో తమ కుమారుడు ఇంటికి వస్తాడని, శనివారం సాయంత్రం రాకపోవడంతో ఆశ్రమ పాఠశాలకు వెళ్లి వార్డెన్ను, ఉపాధ్యాయులను అడిగినా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లి ఆరోపించింది. దీంతో పోలవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా గోపాలపురం మండలంలోని పోలవరం కుడికాలువలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు చెప్పారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది తమ కుమారుడిదని బోరుమన్నారు. వసతి గృహంలో విద్యార్థి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా రెండు రోజులుగా వార్డెన్, ఉపాధ్యాయులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడిని కోల్పోయామన్నారు. వస తి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడికే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శ్రీనివాస్ కాలువలో పడి ఎలా మృతిచెందాడో తెలియని పరిస్థితి అని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. దుర్గమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ చిన్న కుమారుడు శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం వివరాలు లభ్యం గోపాలపురం: గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో పోలవరం కుడి ప్రధాన కాలువలో శనివారం కొట్టుకొచ్చిన మృతదేహం వివరాల లభ్యమైనట్టు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. మృతుడు పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్ (18)గా గుర్తించినట్టు చెప్పారు. మృతుడు 9వ తరగతి చదువుతున్నాడని ఈనెల 16న పాఠశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో జారిపడి మృతిచెందినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
భర్తకు నిద్రమాత్రలు వేసి నిద్రపోయిన తర్వాత
పశ్చిమగోదావరి ,ఏలూరు టౌన్ : ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధి, డీమార్ట్ సమీపంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో సోమవారం అర్ధరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఏలూరు టూ టౌన్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రే మించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరిది లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం. వారికి నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో, నాగలక్ష్మి ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఏడాది క్రితం టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు కూడా పెట్టుకున్నారు. పెద్దలు రాజీ చేయడంతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులుగా పిల్లలను రాంబాబు తన తల్లి వద్ద ఉంచాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నాగలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన రాంబాబు రోకలి బండతో తలపై మోది నాగలక్ష్మిని హతమార్చాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నాగలక్ష్మిని అక్కడే వదిలేసిన రాంబాబు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు ఇంటి సమీపంలోకి వచ్చి పరిశీలించి వెళ్లాడు. సాయంత్ర సమయంలో టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్టు చెప్పి లొంగిపోయాడు. ఎస్సై కె.రామారావు, ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే కారణమా..? కొంతకాలంగా భర్త రాంబాబుకు నిద్రమాత్రలు వేసి అతడు నిద్రపోయిన తర్వాత నాగలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి నిద్రమాత్రలు వేసుకున్నట్టు నటించి రాంబాబు నిద్రపో యాడు. కొద్దిసేపటికి రాంబాబు నిద్రలోనుంచి లేచిచూడగా మరో వ్యక్తితో నాగలక్ష్మి ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఈలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నట్టు తెలుస్తోంది. పట్టరాని ఆవేశంతో రాంబాబు పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టటంతో నాగలక్ష్మి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఇంటికి తాళం వేసి రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూడో వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు నాగలక్ష్మిని భర్త రాంబాబు హత్య చేశాడనే సంఘటనపై విచారణ చేపడుతున్నామని జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఈ హత్య ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా ?.. అసలు కారణాలు ఏమిటి అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను వెంటనే అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. -
సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలవమని..
పశ్చిమగోదావరి, కుక్కునూరు: పై అధికారి లైంగికంగా వేధించాడని కుక్కునూరు మండలం వెలుగు కార్యాలయం ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎస్పీకి కూడా వాట్సాప్లో ఫిర్యాదు పంపినట్టు సమాచారం. వివరాలు ఆలస్యంగా బయటపడ్డాయి. జంగారెడ్డిగూడెం వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించాడని వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న మండల స్థాయి ఉద్యోగిని కుక్కునూరు పోలీస్ స్టేషన్లో గత నెల 31న ఫిర్యాదు చేసింది. వేధింపులు తాళలేక గతంలో ఆత్మహత్యాయత్నం ఇదే మహిళా ఉద్యోగి గతంలో కామవరపు కోటలో విధులు నిర్వహిస్తుండగా ఈ అధికారే అడిట్ కోసమని వచ్చి ఈ ఉద్యోగినిపైనే లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న అప్పటి డీఆర్డీఏ పీఓ ఈ విషయంలో రాజీ చేసినట్టు తెలిసింది. కోరుకొన్న చోటుకు బదిలీ కాకుండా ఆపి.. ఈ మహిళా ఉద్యోగినిపై కన్నేసిన పై అధికారి చేష్టలు భరించలేక దేవరపల్లికి బదిలీ చేయాలని పీడీని కోరినా.. పీడీతో ఆ పై అధికారికి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆమెను కోరుకున్న చోటుకు కాకుండా ఆ అధికారి పనిచేస్తున్న సర్కిల్కు బదిలీ చేయటంతో ఇంకా వేధింపులు అధికం అయినట్టు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలవమని.. ఉద్యోగినికి కుక్కునూరు బదిలీ కావడంతో ఆ జాయినింగ్ లెటర్ తీసుకొచ్చి ఐటీడీఏ పీఓకు ఇచ్చింది. అయితే తనకు జాయినింగ్ లెటర్ ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడమేంటంటూ సదరు పై అధికారి ఉద్యోగిని సహోద్యోగులకు ఆమెను సాయంత్రం 6 గంటల తరువాత వచ్చి కలవాలని చెప్పమని ఫోన్ చేసినట్టు తెలిసింది. అన్నీ తెలిసినా సహకరించని సహోద్యోగులు ఈ విషయాలన్నీ తెలిసి కూడా తోటి ఉద్యోగులు ఆమెకు అండగా నిలిచేందుకు ఆయనకు భయపడి ముందుకు రావడంలేదు. ఇదే డిపార్ట్మెంట్లో ఓ మహిళను కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేడయంతో సదరు మహిళ ఐటీడీఏ లో పంచాయతీ పెటించినట్టు సమాచారం. దాంతో దిగివచ్చిన ఆ అధికారి తప్పు అయిందంటూ ఆమె కాళ్లు పట్టుకొని రాజీ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇతని ధాటికి ఇద్దరు మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో డిపార్ట్మెంట్ విచారణ ఇప్పటికే ఈ విషయమై అంతర్గత విచారణ జరిగినా ఆ విచారణ బృందంలో సభ్యులు కూడా సదరు అధికారి వైపు మాట్లాడటమే కాక బృందంలోని మహిళా అధికారి బాధిత ఉద్యోగినితో కొండకు అడ్డుపోకు అంటూ బెదిరించినట్టు సమాచారం. పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం గత నెల 31న కుక్కునూరు పోలీస్స్టేషన్లో ఎస్సైకి ఫిర్యాదు చేయడంతోపాటు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని.ఇంతవరకు ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో ఆ ఉద్యోగిని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు సమాచారం. -
కట్టుకున్నవాడే కాలయముడై..
పశ్చిమగోదావరి ,నిడమర్రు: జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే ఉన్మాదిగా మారి భార్యను హతమార్చిన ఘటన నిడమర్రు మండలం గుణపర్రు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురం గ్రామానికి చెందిన గుడిసే పాపయ్య, నాగమణి (30) దంపతులు కుమార్తె రమ్యతో కలిసి ఇటీవల గుణపర్రులో కోటగిరి సత్యనారాయణ రొయ్యల చెరువు వద్దకు కాపలాదారు కుటుంబంగా వచ్చారు. వీరి కుటుంబం చెరువు వద్ద షెడ్డులో ఉంటున్నారు. బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. పాపయ్య విచక్షణ మరిచి నాగమణిని కత్తిపీటతో నరికేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి కుమార్తె రమ్యను ఆదేగ్రామంలోని బంధువుల ఇంటి వద్ద విడిచి పరారయ్యాడు. రొయ్యల చెరువుపై ఉన్న ఏరియేటర్లు తిరుగుతూ ఉండటం గమనించిన యజమాని ఆరా తీయగా పాపయ్య బంధువులు వచ్చి షెడ్డు తాళాలు పగులకొట్టారు. నాగమణి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. కన్నాపురంలో ఉంటున్న మృతురాలు తల్లి నంద్యాల కృష్ణకుమారికి సమాచారం అందించడంతో వచ్చి తన అల్లుడే హత్య చేశాడని నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి నుంచి పాపయ్యకు తన కుమార్తెపై అనుమానం ఉందని, ఇటీవల పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసి పంపామని చెప్పారు. పాపయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా కోరుకొల్లు మండలం కలిదిండి గ్రా మం కాగా నాగమణితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరభద్రం (17), రమ్య (7) బిడ్డలు. కుమారుడు వీరభద్రం కన్నాపురంలో అమ్మ మ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. మహిళా డీఎస్పీ పైడేశ్వరరావు, అదనపు డీఎస్పీ కె.ఈశ్వరరావు, గణపవరం సీఐ జి.శ్రీనివాస్యాదవ్, ఎ స్సై ఎం.వీరబాబు క్లూస్ టీమ్తో వచ్చి ఘటనా స్థలంలో విచారణ చేశారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విషాదం నింపిన నిషా
స్నేహితుల దినోత్సవం రోజు మందు పార్టీ మూడు కుటుంబాల్లోతీరని విషాదం నింపింది. సరదాగా తాగిన మద్యం ముగ్గురు స్నేహితుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రెండ్షిప్డేను సరదాగా గడుపుదామని యత్నించిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పశ్చిమగోదావరి, తణుకు/ఉండ్రాజవరం/నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్కుమార్ (18), అంబటి ప్రసాద్ (19) మృత్యువాత పడగా మడిచర్ల శివవర్మ తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీరు కేవలం మద్యం కారణంగానే మృతి చెందారా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఉండ్రాజవరం పోలీసులు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్నిఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్ అజయ్కుమార్సింగ్, ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారి కె.వీరబాబు, తణుకు, పెనుగొండ ఎక్సైజ్ సీఐలు యు.సుబ్బారావు, టి.సత్యనారాయణ తదితరులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. అసలేం జరిగింది...? వీరంతా ఒకటే వయసు కలిగిన యువకులు. కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయా కుటుంబాలకు వీరే ఆధారం. ఆదివారంస్నేహితుల దినోత్సవం సందర్భంగా అయిదుగురు మిత్రులు కలిసి సరదాగా గడుపుదామనుకుని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మద్యం అంతగా అలవాటులేని వీరు సరదాగా బీర్లు తాగుదామని ప్లాన్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్కుమార్, అంబటి ప్రసాద్, మడిచర్ల శివవర్మలతోపాటు పెద్దిశెట్టి నాని, గుండా కార్తీక్లు ఇంట్లో ఆనుమానం రాకుండా రాత్రి 8 గంటల సమయంలో ఎవరి ఇళ్లల్లో వారు భోజనం చేసి ఊరి చివర రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. మూడు బీర్లు, క్వార్టర్ మద్యం బాటిల్, కోకాకోలా, వాటర్బాటిల్ తీసుకుని ప్రైడ్రైస్, పచ్చిమిర్చి బజ్జీలు కూడా తెచ్చుకున్నారు. అయితే తమకు మద్యం అలవాటు లేదని నాని, కార్తీక్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సరదాగా తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరోచనాలు కావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన అంబటి ప్రసాద్ తండ్రి వీర్రాజుకు ఫోన్ చేసి తాము ముగ్గురం రైల్వే ట్రాక్ వద్ద ఉన్నాం. ఆటో తీసుకుని రమ్మని చెప్పాడు. సుమారు 11.30 గంటల సమయంలో ఆటో తీసుకుని వెళ్లిన వీర్రాజు అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని ఆటోలో ఎక్కించుకుని ఎవరి ఇళ్ల వద్ద వారిని దించాడు. అయితే తాగిన మద్యం ఎక్కువైందని భావించిన కుటుంబ సభ్యులు స్నానం చేయించి పడుకోబెట్టారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సుధీర్కుమార్, ప్రసాద్లు మృతి చెందడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే శివవర్మ మాత్రం అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివవర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మద్యమే ప్రాణాలు తీసిందా...? అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇద్దరు యువకులు... అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడు... వీరు తాగిన మద్యమే ఇద్దరి ప్రాణాలు తీసిందా..? లేక మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం మద్యం తాగినంత మాత్రాన ప్రాణాలు పోతాయా...? వీరు తాగిన మద్యంలో కల్తీ ఉందా...? లేక బీరు, మద్యం, కూల్డ్రింక్ కలిపి తాగడం వల్ల విషపూరితం అయ్యిందా అనేది తేలాల్సి ఉంది. అయితే మద్యం తాగిన ముగ్గురితోపాటు మరో ఇద్దరు మద్యం తాగకుండానే ఎందుకు వెళ్లిపోయారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు బీర్లుతోపాటు, మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు...? గ్రామంలోని ఊరిచివర ఉన్న బెల్టుషాపులో కొనుగోలు చేశారా..? లేక సమీపంలోని వడ్లూరు లేదా సూర్యారావుపాలెం గ్రామాల్లో కొనుగోలు చేశారా..? అనేది తేలాల్సి ఉంది. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన బ్రాందీషాపునకు సంబంధించిన మద్యం సత్యవాడ గ్రామంలోని బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన మద్యం షాపు ద్వారా బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే మద్యం బాటిల్కు ఉండే బార్కోడ్ స్టిక్కర్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా బాటిల్ మూతపై ఉండే స్టిక్కర్ ద్వారా బ్యాచ్ నెంబర్ ద్వారా సంబంధిత మద్యం దుకాణం వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంది. అయితే బాటిల్పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందుగానే అధికారులు ఆనవాళ్లు లేకుండా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బీరులో మద్యం కలుపుకొని తాగడంతోపాటు పచ్చిమిర్చి బజ్జీలు తినడంతో ఉక్కిరిబిక్కిరై వాంతులు, విరేచనాలు అయి ఉంటాయని పోలీసులు, ఎక్సైజ్శాఖ అధికారులు చెబుతున్నారు. మద్యంలో విషపూరిత పదార్థాలు ఏమైనా కలిస్తేనే ఇలా తక్కువ సమయంలో మృత్యువాత పడతారని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబాలే ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడి నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పానుగంటి సుధీర్కుమార్ తండ్రి సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ప్రస్తుతం పోషణ భారం సుధీర్కుమార్పై పడింది. పదో తరగతి వరకు చదివిన సుధీర్కుమార్ కార్పెంటర్గా పని చేసుకుంటూ తల్లి సుజాత, సోదరి స్వేతప్రియనుపోషిస్తున్నాడు. అంబటి ప్రసాద్ పదో తరగతి పాసై ప్రస్తుతం సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నాడు. తల్లి కుమారికి కళ్లు సరిగా కనిపించకపోవడంతోపాటు చెవులు వినిపించవు. తండ్రి వీర్రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దనే ఉంటున్నాడు. ప్రసాద్కు ఇద్దరు అక్కలు ఉండగా వీరిలో ఒకరికి వివాహం అయ్యింది. మరో అక్కకు పెళ్లి కుదిరింది. ఈనెల 15న పెళ్లి జరగాల్సి ఉండగా శుభలేఖలు సైతం బంధువులకు ప్రసాద్ పంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాధఛాయలు అలముకున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ తల్లిదండ్రులు సావిత్రి, వెంకటేశ్వరరావులు ఇటుక తయారీ పనులకు వెళుతుంటారు. శివవర్మ వీరికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్నాడు. శాంపిల్స్ పరీక్షలకు పంపాం మృత్యువాత పడిన యువకులు తాగి వదిలేసిన మద్యం, బీరు శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం పంపాం. సంబంధిత మద్యం బాటిల్, బీరు బాటిళ్ల బ్యాచ్ నెంబర్లు ఆధారంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ముందస్తు జాగ్రత్తల మేరకు మద్యం అమ్మకాలు నిలిపివేశాం. గ్రామం సమీపంలోని సూర్యారావుపాలెం గ్రామంలో ఉన్న మద్యం దుకాణం నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో తాత్కాలికంగా షాపు మూసి వేయించాం.– శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్శాఖ -
అనుమానాస్పద స్థితిలో రేషన్ డీలర్ మృతి
పశ్చిమగోదావరి, దెందులూరు: గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గుణ్ణం లక్ష్మి (21) చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడికాలువలో శుక్రవారం శవమై తేలింది. వివరాల ప్రకారం దెందులూరు గ్రామానికి చెందిన గుణ్ణం రాధాకృష్ణ, కుమారి దంపతుల కుమార్తె లక్ష్మి రేషన్ దుకాణం నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం వీరు నివసిస్తున్న వీధికి చెందిన రెడ్డి అలేఖ్యను ఆశ్రం వైద్యశాలలో చూపించేందుకు లక్ష్మి తీసుకువెళ్లింది. ఆస్పత్రి పరీక్షల అనంతరం ఆలస్యం అవుతుందని అలేఖ్యకు చెప్పి లక్ష్మి సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటకు వచ్చేసింది. అనంతరం అలేఖ్య తన తండ్రికి ఫోన్ చేసి లక్ష్మి వెళ్లిపోతోంది మీరు రండి అని చెప్పింది. కొంత సమయానికి చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడి కాలువలో కొట్టుకువస్తున్న గుర్తుతెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి కాలువలో కొట్టుకువస్తున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం దెందులూరు గ్రామానికి చెందిన రేషన్ షాపు డీలర్ గుణ్ణం లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాన్ని దెందులూరులో కుటుంబ సభ్యులకు చూపించి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్, దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి దెందులూరులో మృతురాలి తల్లి, సోదరుడు, నానమ్మలను కలసి సంఘనట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ వద్ద లక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
నీ భార్య నేనూ పెళ్లి చేసుకుంటాం.. వదిలేయ్
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఒక వివాహితతో ఒక యువకుని ప్రేమ వ్యవహారం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఫేస్బుక్ పరిచయంతో యువతిపై ప్రేమను పెంచుకున్న ఆ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందే ఆ యువతి, ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పోలీస్ క్వార్టర్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కంపా వెంకటరమణ కుమారుడు కంపా వెంకటేష్ (23) క్వార్టర్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపా వెంకటేష్కు ఫేస్బుక్లో తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వాంబే కాలనీకి చెందిన ఓ వివాహితతో పరిచయమైంది. ఆమె రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు వద్ద ఒక బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కంపా వెంకటేష్ ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. వివాహిత అమ్మమ్మది జంగారెడ్డిగూడెం కావడంతో వెంకటేష్కు, వివాహితకు మధ్య స్నేహం పెరిగింది. దీంతో వెంకటేష్ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వివాహిత భర్తకు వెంకటేష్ ఫోన్ చేసి ‘నీ భార్య నేను పెళ్లి చేసుకుంటామని, ఆమెను వదిలివేయాలని’ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త గత నెలలో రాజమహేంద్రవరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వివాహిత వెంకటేష్కు ఫోన్ చేసి తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నువ్వే కారణమని చెప్పి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్కు తెలిపింది. గత నెలలో వివాహిత జంగారెడ్డి గూడెం వచ్చింది. తర్వాత వెంకటేష్ వివాహితను తన స్కూటీపై ఎక్కించుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో వివాహిత కొవ్వూరు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అప్పట్లో కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్ను విచారించారు. అప్పటి నుంచి అన్యమనస్కుడైన వెంకటేష్ చివరికి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అల్లు దుర్గారావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్న కొడుకే కాల యముడై..
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడైన ఘటన పెదవేగి మండలం రామశింగవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామశింగవరం దుర్గమ్మకాలనీకి చెందిన దొండపాటి రాంబాబు (45) 13 ఏళ్ల క్రితం మొదటి భార్య సరోజినిని విడిచి లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. సరోజినికి కుమారుడు కోటేశ్వరరావు ఉన్నాడు. ప్రస్తుతం సరోజిని దూరప్రాంతంలో ఉండగా కోటేశ్వరరావు తాత అంకాలు (రాంబాబు తండ్రి), మేనత్త దుక్కిపాటి సరోజినితో కలిసి గ్రామంలోని దళితవాడలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం అక్క సరోజిని ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి అంకాలుతో గొడవపడి కొట్టాడు. అదేసమయంలో బయట నుంచి ఇంటికి వస్తున్న కోటేశ్వరరావు మద్యం మత్తులో భావోద్వేగానికి గురై చిన్నపాటి పలుగుతో తండ్రి రాంబాబుపై దాడి చేశాడు. తలపై తీవ్రగాయమైన రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు కోటేశ్వరరావును ఇంటిలోని ఓ గుంజకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు రూరల్ సీఐ కె.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇదిలా ఉండగా తన భర్త రాంబాబు నెల రోజుల క్రితం కామవరపుకోట మండలం దొండపాటవారిగూడెంలో ఉన్న 20 సెంట్ల భూమి అమ్మగా రూ.2.30 లక్షల నగదు వచ్చిందన్నారు. దీనిలో తన పెద్ద కుమార్తె పుష్పవతి కార్యక్రమానికి కొంత ఖర్చుచేశామని, మిగిలిన సొమ్ము ఇవ్వలేదని కోటేశ్వరరావు కక్ష పెంచుకుని హత్య చేశాడని ఆరోపించారు. పెదవేగి ఎస్సై వి.క్రాంతిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.