Nana Patekar
-
75 ఏళ్ల వయసులోనూ ఫిట్గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!
మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్నెస్ మంత్ర ఏంటో ఇన్స్టా థియోబ్లిక్స్లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు. ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్లో బెంచ్ ప్రెస్లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్లు చేయడమం మంచిదన్నారు. ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. మలి వయసులో అవి తప్పనిసరి..ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు. శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by Obliques24 (@obliques24_) (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
ఆ దెబ్బతో రోడ్డున పడ్డాం.. నెలకు రూ.35తో కుటుంబమంతా..
ప్రముఖ నటుడు, పద్మ శ్రీ గ్రహీత నానా పటేకర్ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు. ఎక్కువగా హిందీ, మరాఠి భాషల్లో నటించిన ఆయన మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో పాటలు కూడా పాడాడు. డైరెక్టర్గా 'ప్రహార్: ద ఫైనల్ అటాక్' అనే సినిమా కూడా తీశాడు. 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఈయన 28 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత మొదటి కొడుకునూ కోల్పోయాడు. తాజాగా అతడు చిన్నతనంలో పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. దివాలా తీశాం.. 'ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. బయటకు ప్రేమ చూపించుకోకపోయినా అది మా మధ్య అంతర్లీనంగా ఉండేది. మా నాన్న మా కోసం కష్టపడుతున్నాడన్న విషయం మాకు అర్థమయ్యేది. ఓసారి మా నాన్న వ్యాపారాన్ని ఎవరో లాక్కోవడంతో మేము దివాలా తీశాం. అప్పటివరకు ధనవంతుడైన మా నాన్న ఆ దెబ్బతో నడివీధిలో నిలబడాల్సి వచ్చింది. తను దిగాలుగా, ఏదో శిక్ష పడిన ఖైదీలా కూర్చునేవాడు. ఒక్క పూట భోజనం.. ఆకలి.. అది చూసి నేను ఎందుకు నాన్న, అంత దిగులు చెందుతున్నావు? నీకు ఒక ఫ్యాక్టరీనే కదా పోయింది.. వదిలెయ్.. నీకింకా రెండు ఫ్యాక్టరీలున్నాయి. ఒకటి అన్నయ్య, రెండు నేను. ఎక్కువగా ఆలోచించకు, అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పాను. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలుపెట్టాను. నెలంతా పని చేస్తే రూ.35 ఇచ్చేవారు, రోజుకు ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ, నాన్న తిన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేది. కానీ ఆకలికి ఆగలేక నేను తినేసేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఆరోపణలతో నటుడిపై మరక! చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నానా పటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా.. లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు నిజమని రుజువు కాకపోయినప్పటికీ నానా మీద విమర్శలు వెల్లువెత్తాయి దీంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యే వ్యాక్సిన్ వార్లో కనిపించిన అతడు 'లాల్ బత్తి' అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. అలాగే మరాఠీలో 'ఒలె ఆలె' అనే చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అమ్మ గదిలో దొంగతనం.. నా కొడకా.. అని తిట్టేది! -
ఆ అబ్బాయిని నేను కొట్టలేదు.. ఏం జరిగిందంటే: నానా పటేకర్
బాలీవుడ్లో తన నటనతో ఎనలేని ప్రశంసలు దక్కించుకున్నాడు నానా పటేకర్.. కానీ ఆయన నిజ జీవితంలో అప్పుడప్పుడు వివాదంలో చిక్కుకుంటుంటాడు. కొద్దిరోజుల క్రితం ‘ది వ్యాక్సిన్ వార్’తో ప్రేక్షకులను అలరించాడు నానా పటేకర్. సినిమా షూట్లో భాగంగా ఆయన వారణాసిలో తాజాగా పర్యటించాడు. వారణాసి వీధుల్లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో గట్టిగా తల మీద ఒక్కటిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను తప్పుపట్టారు. ఈ వివాదంపై ఆ చిత్ర దర్శకనిర్మాత అనిల్ శర్మ ఇలా స్పందించాడు. 'సినిమాలో నానా పటేకర్ మానసిక స్థితి బాగలేని పాత్రలో కనిపిస్తారు. గుంపులో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీకోసం ఒకరు రావడం. తనను ఆ వ్యక్తి కొట్టడం. ఇదంతా షూటింగ్లో భాగం మాత్రమే' అని అన్నారు. క్షమించమని కోరిన నానా పటేకర్ 'నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేశాము... మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాము. దర్శకుడు స్టార్ట్ అనగానే. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్నాము. అతను ఎవరో నాకు తెలియదు, అతను మా సిబ్బందిలో ఒకడని భావించాను కాబట్టి నేను చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది. (ఇదీ చదవండి: నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్) కాబట్టి, నేను వెంటనే అతనిని తిరిగి పిలిచాను కూడా.. కానీ అతను అప్పటికే వెళ్లిపోయాడు. బహుశా అతని స్నేహితుడు ఈ వీడియో చిత్రీకరించి ఉంటాడు. నేను. ఫోటో కోసం ఎవ్వరితోనూ ఇప్పటి వరకు నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను.' అని ఆయన అన్నాడు. #WATCH | On a viral showing him slapping a boy for taking a selfie with him, actor Nana Patekar says, "A video is going viral where I have hit a boy. Though this sequence is a part of our film, we had one rehearsal...We were scheduled to have a second rehearsal. The director told… pic.twitter.com/CVgCainRg1 — ANI (@ANI) November 16, 2023 वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 -
సెల్ఫీ కోసం వెళ్తే తల మీద ఒక్కటిచ్చిన నటుడు, వీడియో వైరల్
అభిమాన తారలు కనిపిస్తే చాలు ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు జనాలు. కొందరు సెలబ్రిటీలు ఓపికగా చిరునవ్వుతో వారికి సెల్ఫీ ఇవ్వడానికి ముందుకొస్తే మరికొందరు మాత్రం అభిమానులను పట్టించుకోకుండా హడావుడిగా వెళ్లిపోతుంటారు. అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ మాత్రం తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్మని కొట్టాడు. మెడ పట్టి గెంటేశారు ఓ అభిమాని నానా పటేకర్ కనిపించగానే ఫోన్ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు. అక్కడున్న సెక్యూరిటీ కూడా అతడిని మెడ పట్టుకుని అవతలకు తోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నానా పటేకర్ దురుసు ప్రవర్తనను ఎండగడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే కుదరదని సౌమ్యంగా చెప్పొచ్చుగా, ఎందుకలా కొట్టడం అని విమర్శిస్తున్నారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటన వారణాసిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి.. కాగా మీటూ ఉద్యమం సమయంలో నానా పటేకర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ విచారణలో తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తేలింది. ఏదేమైనా మీటూ వివాదం ఆయన కెరీర్కు మచ్చ తెచ్చింది. దీంతో కొంతకాలం మీడియాకు, సినిమాలకు దూరగా ఉన్న ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాడు. वाराणसी - नाना पाटेकर ने अपने फैंस को जड़ा थप्पड़ , फिल्म की शूटिंग के दौरान सेल्फी लेने पहुंचा था फैंस ➡नाना पाटेकर ने थप्पड़ जड़कर फैंस को भगाया ➡सोशल मीडिया पर वायरल हुआ थप्पड़ मारने का वीडियो ➡वाराणसी में नाना पाटेकर कर रहे हैं फिल्म जर्नी की शूटिंग. #Varanasi pic.twitter.com/tlPS1QX9g9 — Dinesh Kumar (@DineshKumarLive) November 15, 2023 చదవండి: చైతూ తొలి వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు? -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్తో వచ్చే సీన్లు అంతగా హైలెట్గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్పై నెగిటివ్ ఇమేజ్ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మంగళవారం హిందీ ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్ చిత్రమిది. కోవిడ్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది. -
వార్లో సప్తమి
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కోవిడ్ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్ డ్రిల్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్ ‘కాంతార’ ఫేమ్ హీరోయిన్ సప్తమి గౌడ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వ్యాక్సిన్ వార్’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. -
నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్
తనుశ్రీ దత్తా.. మీటూ ఉద్యమం జోరుగా నడిచిన సమయంలో బాగా వినిపించిన పేరు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ హీరోయిన్. ఆమె గొంతు విప్పిన తర్వాతే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కానీ మీటూ తర్వాత నుంచి తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని పలుమార్లు వాపోయింది తనుశ్రీ. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో సంచలన పోస్ట్ చేసింది. 'నాకేదైనా అయితే అందుకు నానా పటేకర్, అతడి బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్లందరూ బాలీవుడ్ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వారిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో వారిని వెంబడించండి. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్, బై..మళ్లీ కలుద్దాం' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) చదవండి: నా గురువుకి నేను సాయం చేయడమేంటి? విజయ్, రష్మిక డేటింగ్పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే -
తండ్రీకూతుళ్లుగా నటించిన వాళ్లు ప్రేమలో పడ్డారు!
నానా పాటేకర్ నటనే కాదు జీవితమూ వైవిధ్యమే! నటుడిగా విజయాలే ఎక్కువ. భర్తగా, ప్రేమికుడిగా వైఫ్యలాలు ఎక్కువ! మనీషా కోయిరాలా కూడా వెర్సటైల్ నటే. ఆమెకూ జీవితంలో పోరాటం తప్పలేదు. స్వభావ రీత్యా ఇద్దరూ ఒకటే. కోపం, ఆవేశం విషయంలో ఇద్దరిదీ ఒకే మీటర్. ప్రేమ విషయంలోనూ ఆ మీటర్ తప్పలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఇద్దరూ తప్పారు. వివరాలు.. 1996లో వచ్చిన అగ్నిసాక్షి.. నానా, మనీషా కలసి చేసిన మొదటి సినిమా. ఆ సెట్స్ మీదే వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. తనలాగే ఉండే మనీషా ముక్కుసూటి వ్యవహారం అతనికి నచ్చింది. ఆమె మీద ప్రేమా కలిగింది. అంతకుముందే వివేక్ ముష్రాన్తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న మనీషాకు నానా స్నేహం, చూపిస్తున్న ప్రేమ ఊరటనిచ్చాయి. దాంతో తనూ నానా పట్ల ప్రేమను పెంచుకుంది. అదే యేడు వచ్చిన ఖామోషీ (ఇందులో తండ్రీ, కూతురిగా నటించారు)తో ఆ ఇద్దరి మధ్య అనుబంధం బలపడ్డమే కాదు ఆ రహస్యం చిత్రపరిశ్రమకూ తెలిసిపోయింది. ఆ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు నానా పాటేకర్. మనీషా ‘నో’ చెప్పలేదు కాని అప్పటికే పెళ్లయి ఉన్న నానాతో ‘నీ భార్యకు విడాకులివ్వు’ అంది. మౌనంతో ఆ సందర్భాన్నుంచి బయటపడ్డాడు అతను. నిజానికి నానా పాటేకర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్నేమీ ఆస్వాదించట్లేదు. అతని భార్య నీలకాంతి. మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత. మంచి శిల్పి కూడా. పెళ్లయిన ఏ కొంత కాలమో సంతోషంగా ఉన్నారు ఆ భార్య, భర్త. తర్వాత నుంచి విభేదాల ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది వాళ్ల దాంపత్యం. ఇద్దరు పిల్లలూ పుట్టడంతో వాళ్ల ముందు కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం ఇష్టం లేక విడాకులు తీసుకోకుండానే విడి విడిగా ఉండడం ప్రారంభించారు. ఆయేషా, నీలకాంతి విడాకులు, పెళ్లి గురించిన వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి మనీషా, నానా మధ్య. ఇంకోవైపు ఆమె మీద పొసెసివ్నెస్ ఎంతలా పెరిగిందంటే మనీషా ప్రవర్తనకు హద్దులు పెట్టేంతగా. ఆమె కాస్త ఆధునికంగా అలంకరించుకున్నా నానా అభ్యంతరపెట్టేవాడు. సహ నటులతో కొంచెం చనువుగా మాట్లాడినా ఆమె మీద నోటి దురుసుతనం ప్రదర్శించేవాడు. పెళ్లితో ఆ అభద్రతకు చెక్ పెట్టొచ్చని ఆశపడింది మనీషా. అందుకే నీలకాంతితో విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది. ‘ఇవ్వను. నీతో కలసి ఉండడానికి సిద్ధమే.. కాని నీలకాంతికి విడాకులు ఇచ్చేసి కాదు’ అని స్పష్టం చేశాడు నానా పాటేకర్. నివ్వెరపోయింది మనీషా. అప్పటి నుంచి ఆమెలో అభద్రత మొదలైంది. ఈలోపు.. నానా పాటేకర్.. ఆయేషా జుల్కాతో దగ్గరగా ఉంటున్నాడన్న విషయం పరిశ్రమలో గుప్పుమంది. పత్రికల్లోనూ అచ్చయింది. మనీషా మెదడులోనూ పడింది. ఒకసారి మనీషా నానా పాటేకర్ను కలవడానికి వెళ్లేసరికి ఆయేషా జుల్కా అక్కడే ఉంది. స్నేహం కంటే ఎక్కువ దగ్గరితనం వాళ్ల మధ్య కనపడేసరికి కోపావేశాలకు లోనైన మనీషా ఇంగితం మరచిపోయి ఆయేషా జుల్కాను తిట్టేసింది. నానా పాటేకర్ జోక్యంతో అక్కడికి, అప్పటికి సద్దుమణిగినా ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసింది. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం నెమ్మది నెమ్మదిగా వాళ్ల మధ్య అనుబంధాన్ని, బంధాన్నే తెంచేసింది. నానా పాటేకర్, మనీషాల ప్రేమ కథ బ్రేకప్తో ఎండ్ అయిపోయింది. నానా పాటేకర్, ఆయేషా జుల్కా కలసి ఉండడం ప్రారంభించినా, మనీషా ముందుకు సాగిపోయినా విడిపోవడం ఆ రెండు మనసులనూ వేధించింది. ‘బ్రేకప్ అనేది డిఫికల్ట్ ఫేజ్. అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది ఆ బాధేంటో. మనీషా కస్తూరి మృగం లాంటిది. చాలా సున్నిత మనస్కురాలు. ఆమె నన్ను వదిలి వెళ్తుంటే అతికష్టమ్మీద కన్నీళ్లను దిగమింగా. ఐ మిస్ మనీషా’ అని చెప్పాడు నానా పాటేకర్ ఒక ఇంటర్వ్యూలో. 2010లో మనీషా .. నేపాల్కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను పెళ్లిచేసుకుంది. కాని రెండేళ్లకే ఆ పెళ్లి విఫలమైంది. తర్వాత ఆమె క్యాన్సర్ బారినపడింది. ఆ పోరాటంలో గెలిచి.. మళ్లీ సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. -ఎస్సార్ చదవండి: శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..? -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్గా నా కెరీర్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
కాపాడమని లాయర్ దగ్గరకు వెళ్తే..
బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన తరుఫున వాదించేందుకు నితిన్ సత్పుటే అనే ఓ లాయర్ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’) సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్.. ప్రత్యర్థి మహిళా లాయర్తో కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. తననేదో రక్షిస్తాడని ఓ లాయర్ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు పడింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్స్పిరేషన్ #తనూటూ..!) -
కబ్జా చేస్తా
అండర్ వరల్డ్ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో విలన్గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
డ్యాన్స్ రూమ్
సాక్ష్యాధారాలు మరకల్లాంటివి. ఏళ్లు గడిచే కొద్దీ ఆనవాళ్లు లేకుండాపోతాయి. మనసుకు తగిలిన గాయం మచ్చలాంటిది. ఎన్నేళ్లు గడిచినా బాధను గుర్తు చేస్తూనే ఉంటుంది. తనుశ్రీదత్తా నానా పటేకర్పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసు తేలిపోయింది. పోలీసులే తేల్చేశారు! కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా కోర్టుకు ‘బి సమ్మరీ’ రిపోర్ట్ కూడా ఇచ్చారు. బి సమ్మరీ రిపోర్టును ఇవ్వడం అంటే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దొరకలేదని చేతులు ఎత్తేయడం. ఇక కేసును కొట్టేయడమా, కొనసాగించడమా అన్నది కోర్టు పరిధిలోని విషయం. సాక్ష్యాధారాలను ‘సేకరించలేక పోయిన’ పోలీసులు 51 పేజీల బి సమ్మరీలో కొన్ని అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. మిస్అండర్స్టాండింగ్ కారణంగా, మలేషస్ ఇంటెంట్తోనూ తనుశ్రీ నానా పటేకర్ మీద కేసు పెట్టారట. అపార్థం కారణంగా, హాని తలపెట్టే ఉద్దేశంతో అని. నానా పటేకర్తో పాటు మరో ముగ్గురిపైన కూడా తనుశ్రీ కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ సమీ సిద్ధిక్, నిర్మాత రాకేశ్ సారంగ్. వీళ్లలో ప్రధాన నిందితుడు నానా పటేకర్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్స్ డ్యాన్స్ సీక్వెన్స్లో 2008 మార్చి 23–26 మధ్య.. సీన్ని అడ్డుపెట్టుకుని పటేకర్ తనను వేధించాడని, మిగతావాళ్లు అతడికి సహకరించారని తనుశ్రీ దత్తా ఫిర్యాదు. బి సమ్మరీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ నిందితులంతా నిర్దోషులుగా విడుదల అవొచ్చు. అంతేకాదు, పోలీసులు తలచుకుంటే (పటేకర్ తలచుకుంటే అనాలి) రివర్స్లో తనుశ్రీ మీదే కేసు పెట్టొచ్చు. పటేకర్ గారి ప్రతిష్టకు ఆమె భంగం కలిగించిందని. తనుశ్రీ దత్తా పటేకర్ పై పెట్టిన కేసులోని ఆరోపణల కన్నా, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోలీసులు తనుశ్రీ దత్తా మీద చేసిన ఆరోపణలే ఎక్కువ నమ్మేవిధంగా ఉన్నాయి! తనుశ్రీ కేసు ఫైల్ చేసింది గత ఏడాది అక్టోబర్ 6న. ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయింది అక్టోబర్ 10న అందులో నానా అండ్ టీమ్పై ఆమె చేసిన ఆరోపణలు.. పదేళ్ల క్రితం జరిగిందని ఆమె చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించినవి. అప్పుడు కూడా ఆమె ఫిర్యాదు చేయకుండా ఏమీ లేరు. పోలీసులు కోర్టుకు ఇప్పుడు ఫైల్ చేసిన బి సమ్మరీ ప్రకారం.. తనుశ్రీ మొదటే 2008 మార్చిలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. గుర్గావ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తను లైంగిక వేధింపుల కేసు పెడితే పోలీసులు దానిని వట్టి వేధింపుల కేసుగా నమోదు చేశారని కూడా అప్పట్లోనే ఆమె ఆరోపించారు. తర్వాత పదేళ్లకు.. గత ఏడాది అక్టోబర్లో ఒషివారా పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వివరాలన్నీ బి సమ్మరీలో పొందుపరుస్తూ.. ‘కనీసం పదమూడు మంది సాక్షుల్ని విచారిస్తే వాళ్లలో ఒక్కరు కూడా నానా పటేకర్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పోలీసులు. తనుశ్రీ ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్. ప్రకారం.. నిర్మాత, డైరెక్టర్ ఆమెకు మొదట చెప్పింది.. సోలో ఐటమ్ సాంగ్కు మాత్రమే ఆమె చెయ్యాల్సి ఉంటుందని. చేస్తాను కానీ, స్టెప్పులు అశ్లీలంగా ఉంటే తను చెయ్యనని ఆమె అన్నారు. అశ్లీలం మాత్రమే కాదు, తనకు అసౌకర్యంగా ఉండే మూవ్మెంట్స్ని ఇవ్వలేనని కూడా ముందే స్పష్టంగా చెప్పేశారు. వాళ్లు ఒప్పుకున్నారు. సాంగ్లో పటేకర్కు మాత్రం సింగిల్ లైన్ ఉంటుందనీ, అది కూడా వేరుగా షూట్ చేసుకుంటామని అన్నారు. అయితే పాట షూటింగ్ జరుగుతున్న నాలుగు రోజులూ నానా పటేకర్ సెట్స్ లోపలికి వచ్చి తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించే నెపంతో ఆమె ఒంటిని టచ్ చేస్తూనే ఉన్నాడు. అది బ్యాడ్ టచ్. అదంతా ఓ స్ట్రాటెజీతో జరుగుతోందని, మిగతావాళ్లు అతడికి సహకరిస్తున్నారని గ్రహించిన వెంటనే సెట్స్లోంచి బయటికి వెళ్లిపోయారు తనుశ్రీదత్తా. అయితే పటేకర్ అసలలా ప్రవర్తించనేలేదని జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన విషయానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు! డైసీ షా స్టేట్మెంట్ను కూడా వాళ్లు తీసుకున్నారు. డైసీ డ్యాన్సర్, మోడల్. తనుశ్రీ వయసే. ‘‘నానా పటేకర్కి పెద్దగా డ్యాన్స్ రాదు. స్టెప్పులు ఎలా వేయాలో నేను, నా మేల్ కొరియోగ్రాఫర్స్ ఆయనకు నేర్పిస్తున్నాం. మార్చి 26 ఉదయాన్నే పటేకర్ సెట్స్కి వచ్చేశారు. తనుశ్రీ మధ్యాహ్నం వచ్చారు. అందరు డ్యాన్సర్లు సెట్లో ఉన్నారు. పటేకర్ తనుశ్రీ వెనుక ఉన్నారు. హఠాత్తుగా తనుశ్రీ అగ్నిపర్వతమే అయ్యారు. విసురుగా బయటికి వెళ్లిపోయారు. ఏమైందో మాకెవరికీ తెలియదు. నిర్మాత, దర్శకుడు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. తన కారులో తను వెళ్లిపోయారు’’ అని డైసీ చెప్పారు. పటేకర్కి అనుకూలంగా ఉన్న ప్రతి పాయింట్నీ పోలీసులు శ్రద్ధగా నోట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైతే పటేకర్ బయటపడినట్లే. తనుశ్రీ బయటపడుతుందా అన్నది పటేకర్ దయాదాక్షిణ్యాలపై ఉంటుంది! తనుశ్రీ నానా పటేకర్పై తప్పుడు కేసు పెట్టారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కనుక పటేకర్ ఆమెను వేధించాలనుకుంటే తిరిగి ఆమె మీదే కేసు పడేలా పోలీసుల్ని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. నానా పటేకర్కు క్లీన్ చిట్ వచ్చిందన్న వార్త యు.ఎస్.లో ఉన్న తనుశ్రీకి తెల్లవారుజామున ఐదు గంటలకు ఇండియాలోని ఆమె ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులు కేసు క్లోజ్ చెయ్యవచ్చు. కోర్టు కేస్ కొట్టేయవచ్చు. తను మాత్రం న్యాయపోరాటం చేస్తాననే అంటున్నారు తనుశ్రీ! దేవుడి నుంచి రావలసిన జడ్జ్మెంట్ ఇంకా మిగిలే ఉంది కదా అని ఆమె ఆశ. ఆమె ఆశ పెట్టుకున్న దేవుడు, ఆమె అప్లికేషన్ పెట్టుకున్న న్యాయదేవత.. ఆ ఇద్దరూ ఇచ్చే తీర్పు ఎవరి వైపు ఉండబోతున్నప్పటికీ పటేకర్పై తనుశ్రీ చేసిన ఆరోపణల్లో మాత్రం అబద్ధం లేదని.. డ్యాన్స్ రాని పటేకర్, డ్యాన్స్ నేర్పించడానికి తనుశ్రీ మీద చెయ్యి వెయ్యడాన్ని బట్టే స్పష్టం అవుతోంది. దీన్ని ఇంకో యాంగిల్లో చూసేవాళ్లూ ఉండొచ్చు. డ్యాన్స్ రాని పటేకర్ తనుశ్రీకి డ్యాన్స్ నేర్పించడానికి ఎందుకు ట్రై చేస్తాడు, కేసు ఇక్కడే తేలిపోవడం లేదా అని! పళ్లు లేనివాడు కొరకలేడు నిజమే. పళ్లు లేనంత మాత్రాన కొరికే ఉద్దేశం లేకుండా పోతుందా? పాతికేళ్ల అమ్మాయి.. ఉద్దేశాలను గ్రహించలేకపోతుందా?! నానా పటేకర్, తనుశ్రీ దత్తా : సాక్ష్యాధారాలు లేవని పోలీసులు తనుశ్రీ కేసును క్లోజ్ చేసేశారు. మరకల్లేవని మచ్చ కూడా లేకుండా పోతుందా? పటేకర్కి క్లీన్ చిట్ వచ్చిందని తనుశ్రీ పదేళ్ల ఆవేదన వట్టి అబద్ధమైపోతుందా? - మాధవ్ శింగరాజు -
అందుకే నానాకు క్లీన్ చిట్
‘నటుడు నానా పటేకర్ 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను లైంగికంగా వేధించాడు’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి తనుశ్రీ దత్తా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ‘మీటూ’ ఉద్యమానికి ఇండియాలో శ్రీకారం చుట్టింది కూడా తనుశ్రీయే. ఆమె వ్యాఖ్యలతో నానా పటేకర్పై పోలీసులు లైంగిక వేధింపుల కేసును బుక్ చేసి, విచారణ చేపట్టారు. తనుశ్రీ చేసిన వేధింపులకు ఎటువంటి సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. దీంతో నానా పటేకర్కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తనుశ్రీ దత్తా మండిపడ్డారు. ‘‘పోలీసు, న్యాయ వ్యవస్థలకు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. ఆ సాక్ష్యాలు లభించకుండా ఒక వ్యక్తిని దోషి అంటూ శిక్షించకూడదు అని భారతీయ చట్టం చెబుతోంది. అందుకే నానా పటేకర్కు క్లీన్ చిట్ దక్కింది. పోలీసు, న్యాయ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా ఈ అవినీతిపరుడైన నానాకి క్లీన్ చిట్ ఇచ్చాయి. నాకంటే ముందు ఎంతో మంది నటీమణులు నానాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా అతని తప్పులు బయటపడలేదు. నా కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షులను బెదిరించి వారి నోరు నొక్కేశారు. ఈ తీర్పు నన్ను షాక్కి గురిచేయలేదు. ఇండియాలోని ప్రతి మహిళ ఇలాంటి అనుభవాలకు అలవాటు పడిపోయింది. నాకు న్యాయం జరగనంత మాత్రాన ఇంకెవరికీ న్యాయం జరగదని కాదు. లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలి. ఏదో ఒక రోజు నానా విషయంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇప్పటికీ ఉంది’’ అన్నారు. -
మీ టూ : నానా పటేకర్కు క్లీన్ చిట్
ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణలపై అలోక్ నాధ్, వికాస్ బల్లు క్లీన్ చిట్ అందుకున్న క్రమంలో తాజాగా మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటుడు నానా పటేకర్కూ క్లీన్ చిట్ లభించింది. నానా పటేకర్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. కాగా నానా పటేకర్కు క్లీన్ చిట్ లభించిందని గతంలోనూ వార్తలు వెలువడగా ఆయనపై ఆరోపణలు గుప్పించిన తనుశ్రీ దత్తా వాటిని వదంతులుగా తోసిపుచ్చారు. నానా పటేకర్ పీఆర్ బృందం ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నారని తనుశ్రీ ప్రతినిధి, అడ్వకేట్ నితిన్ సత్పుటే ఆరోపించారు. కాగా నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సావంత్లు తనపై, తనతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులపై దాడిచేశారని తాము ఫిర్యాదు చేయగా పోలీసులు నానా పటేకర్కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ఇటీవల తనుశ్రీ ప్రశ్నించారు. కాగా, 2008లో హార్న్ ఓకే ప్లీస్ సెట్లో నటుడు నానా పటేకర్ తనతో ఇంటిమేట్ సీన్లో నటించాలని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికి తెగబడ్డారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. -
నటుడిపై మండిపడ్డ లాయర్
ముంబై: హీరోయిన్ తనుశ్రీ దత్తాను వేధించిన కేసులో విలక్షణ నటుడు నానాపటేకర్కు పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది నితిన్ సత్పాతే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నానాపటేకర్కు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారన్నది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి బటయపడేందుకు, తప్పుడు పుకార్లు ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు నానాపటేకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటివరకు నమోదు చేయలేదన్నారు. సాక్షులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పోలీస్ స్టేషన్లో మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరామ’ని నితిన్ చెప్పారు. ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నానాపటేకర్ తనను వేధించాడని 2018, సెప్టెంబర్లో తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కేసు దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి ఉత్ప్రేరంగా పనిచేసింది. తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది మహిళలు నిర్భయంగా గళం విప్పారు. -
‘విరాటపర్వం’లో నానా పటేకర్!
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం విరాటపర్వం 1992. భిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న రానా, సాయి పల్లవి జంటగా నటించనున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపించగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘నీది నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో అందర్నీ మెప్పించిన వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
మీటూపై షార్ట్ ఫిల్మ్
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్ ప్లాన్ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్ఫిల్మ్ కథను తయారు చేశారట. ఈ షార్ట్ ఫిల్మ్లో నటించడమే కాకుండా రైటింగ్ సైడ్ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా. -
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్’..!
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్ను తెలుగులో రీమేక్ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్ రాజ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
ఎట్టకేలకు అక్షయ్ సినిమా పూర్తైయింది!
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్ఫుల్4 చిత్రం షూటింగ్ పూర్తైయింది. ఈ విషయాన్ని అక్షయ్కుమార్ సోషల్ మీడియాద్వారా ప్రకటించేశాడు. బాలీవుడ్లో చెలరేగిన మీటూ మంటలతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన నానా పటేకర్, దర్శకుడు సాజిద్ నదియావాలాపై మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. చిత్రయూనిట్ వీరిద్దరిని హౌస్ఫుల్4 నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. బాలీవుడ్లో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ చిత్రాల్లోంచి బహిష్కరించడం మొదలుపెట్టారు మేకర్స్. అయితే నానా పటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు. అయితే సాజిద్ నదియావాలాను బహిష్కరించినట్లు ప్రకటించినా.. మిగిలిన భాగాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రితేష్ దేశ్ముఖ్, కృతి సనన్, కృతి కుర్బంధ, పూజా హెగ్డేలు నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. While we have called it a 'wrap’ for #Housefull4, fun never ends..See you all in 2019!@Riteishd @kritisanon @kriti_official @thedeol @hegdepooja @RanaDaggubati @ChunkyThePanday @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/XVBV0uiio1 — Akshay Kumar (@akshaykumar) November 20, 2018 -
నానా పోయి రానా వచ్చె
బాలీవుడ్ కామెడీ మూవీ సిరీస్ ‘హౌస్ఫుల్’ టీమ్లోకి రానా జాయిన్ అయ్యారు. నానా పటేకర్ స్థానాన్ని ఈ హీరో భర్తీ చేశారు. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వల్ల చిత్రబృందానికి ఇబ్బంది కలగకూడదని నానా ‘హౌస్ఫుల్4 ’ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నానా పటేకర్ స్థానంలోకి రానా వచ్చారు. మొదట ఈ పాత్రను అనిల్కపూర్ చేస్తారని వార్తలు వినిపించినా ఫైనల్గా రానా వచ్చారు. ఈ పాత్ర గురించి రానా మాట్లాడుతూ – ‘‘హౌస్ఫుల్’ లాంటి కామెడీ జానర్ సినిమాలో ఇప్పటి వరకూ నేను నటించలేదు. కొత్త కొత్త జానర్స్లో కనిపించడం నాకెప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. హైదరాబాద్ బయటకు వచ్చి పని చేయడం కొత్తగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తాను. అక్షయ్ కుమార్తో ఆల్రెడీ పని చేశాను. ఇప్పుడు ‘హౌస్ఫుల్ 4’లో అనుభవం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి’’ అని పేర్కొన్నారు. కేవలం నానా పటేకర్ మాత్రమే కాదు దర్శకుడు సాజిద్ ఖాన్ ప్లేస్లో ఫాహద్, సంజీ ద్వయం దర్శకులుగా వచ్చిన సంగతి తెలిసిందే. -
నానా.. కాదు రానా?
‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల నుంచి కొందరు తప్పుకుంటున్నారు. మరికొందరిని చిత్రబృందం తొలగిస్తోంది. ‘హౌస్ఫుల్–4’ సినిమాలో నటిస్తున్న నానా పటేకర్, చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో సినిమా షూటింగ్కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. అయితే నానా పటేకర్, సాజిద్ ఖాన్ల స్థానాలను వేరే వారితో భర్తీ చేసి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట చిత్రబృందం. సాజిద్ ఖాన్ స్థానంలో దర్శకుడిగా ఫర్హాద్ సంజనీని తీసుకున్నారట. నానా పటేకర్ స్థానంలో టాలీవుడ్ హీరో రానాను తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. నానా స్థానంలో జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ల పేర్లు వినిపించాయి. తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. చిత్ర వర్గాలు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి రానా ఫిక్సా? వెయిట్ అండ్ సీ. -
నానా ప్లేస్లో రానా
బాలీవుడ్ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణల కారణంగా కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు తమకు తాముగా ప్రాజెక్ట్స్నుంచి తప్పుకుంటుండగా.. మరికొందరిని యూనిట్ సభ్యులే తొలగిస్తున్నారు. ముఖ్యంగా హౌస్ఫుల్ 4 సినిమా మీద ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నానా పటేకర్, దర్శకుడు సాజిద్ఖాన్లను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించటంతో కొత్తవారిని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దర్శకుడిగా ఫర్హాద్ సంజినీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నానా పటేకర్ స్థానంలో సౌత్ స్టార్ రానా దగ్గుబాటి నటించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కాంబినేషన్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
నానా పటేకర్ అలాంటోడే కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు. -
లై డిటెక్టర్ ఉపయోగించండి
లైంగిక వేధింపుల గురించి అటు బాలీవుడ్లో తనుశ్రీదత్తా, తనతో చెప్పుకున్న వాళ్లకు జరిగిన వేధింపుల విషయమై ఇటు సౌత్లో గాయని చిన్మయి ఇద్దరూ ‘మీటూ’ ఉద్యమంలో తమ పోరాటం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్ చేయమని కోరుతున్నారు. ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు చిన్మయి. మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్కు లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య, నిర్మాత రాకేశ్ సారంగ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. -
హౌజ్ఫుల్ 4 నుంచి నానా ఔట్..!
తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన నానా పటేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హౌజ్ఫుల్ 4’ సినిమా నుంచి నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా దర్శకుడు సాజిద్ఖాన్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. ‘అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషులుగా తేలినవారితో తాను నటించను’ అని ‘హౌజ్ఫుల్ 4’ హీరో అక్షయ్కుమార్ సినిమా నిర్మాతల వద్ద చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు. నిందితులపై విచారణ జరిగేవరకు సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని అక్షయ్ నిర్మాతలను కోరడంతో నానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేలేంతవరకు దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. సహాయ దర్శకురాలు సలోని చోప్రా, నటి రేచల్, మరో నటి సాజిద్పై వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సాజిద్ తెలిపారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్పై తనుశ్రీ దత్తా లేవనెత్తిన లైంగిక వేధింపుల పర్వం భారత్లో #మీటు ఉద్యమానికి దారులు వేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో తమకు ఎదురైన లైంగిక వేధింపులను ఎందరో మహిళలు సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. -
#మీటూ: స్పందించిన వర్మ
ముంబై : ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమైన మీటూ ఉద్యమంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. బాలీవుడ్ నటుడు నానా పటెకర్పై నటి తనుశ్రీ దత్తా చేసి ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. నానా పటేకర్ షార్ట్ టెంపర్ వ్యక్తి అని కానీ ఒకరిని వేధించాడంటే మాత్రం తను నమ్మనని యూట్యూబ్లో ఓ వీడియో ద్వారా స్పష్టం చేశాడు. వీడియోలో ఇంకా ఏమన్నాడంటే.. ‘సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అన్నవి వాస్తవమే. తనుశ్రీ దత్తా సహా పలువురు నటీమణులు ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయం. తనుశ్రీ దత్తా-నానాపటేకర్ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో నాకు తెలియదు. నానా పటేకర్తో చాలాకాలం కలిసి పనిచేశాను. ఆయన షార్ట్ టెంపర్ వ్యక్తి. కానీ నాకు తెలిసి నానా పటేకర్ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే వ్యక్తి కాదు. ముంబైకి వెళ్లిన తొలి రోజుల్లో నేను ఓసారి నానాపటేకర్ కు ఫోన్ చేశాను. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేస్తే మనం వెంటనే హలో అంటాం. కానీ ఆయన మాత్రం చెప్పు (బోల్) అని ప్రారంభించారు. సార్ నా పేరు రామ్ గోపాల్ వర్మ. సినిమా డైరెక్టర్ ను. హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పాను. వెంటనే ఇంటికి వచ్చేయ్ అన్నారు. నేను కథ చెబుతుండగా టీ తాగుతావా?అని ఆయన అడిగారు. తాగుతానని చెగానే కిచెన్ చూపించి ఆయనకు కూడా తీసుకురమ్మన్నారు. నాకు టీ చేయడం రాదని చెప్పగానే, ఇంత వయసు వచ్చింది.. ఇంకా టీ చేయడం రాకపోవడం ఏంటి? అని మీ అమ్మకు ఫోన్ కలుపు అని బెదిరించారు. నా తల్లితోనూ ఫోన్ లో మాట్లాడారు. నానాపటేకర్ను అర్థం చేసుకుంటే ఆయన్ని అందరూ గౌరవిస్తారు. తనకు తెలిసి నానాపటేకర్ జీవితంలో ఎన్నడూ లైంగిక వేధింపులకు పాల్పడరు. ఆయన గురించి పూర్తిగా తెలియని వ్యక్తులే నానా ప్రవర్తనను పొరపాటుగా అర్థం చేసుకుని ఉండవచ్చు.’ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. దీంతో భారత్లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. &rel=0 -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
పోలీసులకు డాక్యుమెంట్లు సమర్పించిన తనుశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల కిందట ఓ సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన నటి తనుశ్రీ దత్తా బుధవారం తన ఫిర్యాదుకు మద్దతుగా 40 పేజీల డాక్యుమెంట్లను ముంబై పోలీసులకు సమర్పించారు. తనుశ్రీ దత్తా న్యాయవాది ఒషివరా పోలీస్ స్టేషన్తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్కూ ఈ పత్రాలను అందచేశారు. 2008లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో తనుశ్రీ తండ్రి తపన్ కుమార్ దత్తా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అప్పటి ఫిర్యాదు వివరాలు సైతం ఈ పత్రాల్లో పొందుపరిచారు. డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ రద్దైన క్రమంలో కొందరు పాత్రికేయులు తమ కార్లపై దాడి చేసి ధ్వంసం చేశారని అప్పట్లో తనుశ్రీ దత్తా తండ్రి ఫిర్యాదు చేసిన ఆధారాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అయితే నానా పటేకర్పై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈ పత్రాల్లో ప్రస్తావన లేదు. కాగా 2008లో హార్న్ ఓకే ప్లీజ్ మూవీలో డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ నేపథ్యంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. -
అందుకే మౌనంగా ఉన్నా
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల గురించి దాదాపు వారం రోజులుగా వాడి వేడి చర్చ జరుగుతోంది. కానీ నానా పటేకర్ మాత్రం ఆ విషయంపై నోరు మెదపలేదు. తన సినిమా షూటింగ్స్తో ఆయన బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తనుశ్రీ విషయంపై స్పందిస్తానంటూ సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బాలీవుడ్ మీడియాకు చెప్పి, చివరి నిమిషంలో ఆ ప్రెస్మీట్ని క్యాన్సిల్ చేశారు నానా. కానీ అక్కడికి వెళ్లిన మీడియాతో తన ఇంటి ముందు కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగ్గా – ‘‘మా లాయర్ నన్ను తనుశ్రీ విషయమై ఏమీ మాట్లాడొద్దన్నారు. అందుకనే ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేదు. నేను పదేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను. ఎందుకంటే పదేళ్లయింది కదా అని నిజం మారిపోదు కదా’’ అని పేర్కొన్నారు. -
తనుశ్రీదత్తా ఆరోపణలపై స్పందించిన నానా
-
వెనక్కి తగ్గిన నానా పటేకర్? ప్రెస్మీట్ రద్దు
సాక్షి,ముంబై: తనూశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి తనూశ్రీ చేసిన లైంగిక ఆరోపణలపై సమాధానం చెపుతానని చెప్పిన నానా పటేకర్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. తనూశ్రీ ఆరోపణలను తోసిన పుచ్చిన నానా పటేకర్ అక్టోబర్ 8న నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. అనూహ్యంగా నేటి ప్రెస్మీట్ రద్దు చేసినట్టుగా నానా పటేకర్ కుమారుడు మల్హర్ మీడియాకు సమాచారం అందించారు. దీనిపై తదుపరి సమాచారాన్ని తెలియచేస్తామని తెలిపారు. విలక్షణ నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు నానా పటేకర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. అయితే తనూశ్రీ దత్తా ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా అవన్నీ అబద్ధాలు.. పదేళ్ల క్రితమే దీనికి సమాధానం చెప్పాను కదా అంటూ దాటవేస్తూ వచ్చారునానా పటేకర్. చాలాసార్లు మీడియా ప్రతినిధుల ప్రశ్నల్ని లెక్కచేయకుండా మైకులను పక్కకి తోసుకుంటూ వెళ్లిపోయారు. అయితే అక్టోబర్ 8న ప్రెస్మీట్ ద్వారా ఈ ఆరోపణలకు సమాధానం చెబుతానని ప్రకటించారు. దీంతో నానా సమాధానంపై పలువర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకింది. అయితే అనూహ్యంగా ఈ మీట్ను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో నానా మీడియాకు ముఖం చాటేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా పదేళ్ల క్రితం 2008లో హార్న్ ఒకే ప్లీజ్ సినిమా సెట్లో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేశాడని తనుశ్రీ దత్తా ఆరోపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మీటూ ఇండియా ఉద్యమం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. -
తనూశ్రీ ఫొటోలు తగులబెట్టిన మహిళలు
తనూశ్రీ- నానా పటేకర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సమయంలో నానా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొంత మంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత్లో కూడా మీటూ ఉద్యమం బలపడుతోంది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మహిళా రైతులు, వితంతువులు తనూశ్రీపై మండిపడుతున్నారు. నానా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తూ ఆమె ఫొటోలను తగులబెడుతున్నారు. ‘ నానా మాకు పితృ సమానులు. అప్పుల బాధ తట్టుకోలేక భర్తలు ప్రాణాలు తీసుకుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మాకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. కరువుతో అల్లాడుతున్న మా లాంటి ఎంతో మంది వ్యక్తులకు ఆయన చేయూత అందించారు’ అంటూ ఓ మహిళ పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని విదర్భ లాంటి కరువు ప్రాంతాల్లోని రైతులకు అండగా ఉండేందుకు నానా పటేకర్ నామ్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. -
నానా పటేకర్పై తనూశ్రీ దత్తా ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు’ అని ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్ తెలిపారు. జోథ్పూర్లో జరుగుతున్న హౌస్ఫుల్–4 సినిమా షూటింగ్ నుంచి ఇక్కడికి చేరుకున్న పటేకర్ ఈ విషయమై స్పందిస్తూ..‘ఆమె ఆరోపణ అబద్ధమని పదేళ్ల క్రితమే చెప్పా’ అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్ నోటీసు పంపారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. -
వెలుగులోకి మరో వేధింపు.. ఇంకా ఎన్నో?
ఫాంథమ్ ఫిల్మ్స్.. బాలీవుడ్లో భారీ ప్రొడక్షన్ హౌస్. బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, వికాస్ బాల్, నిర్మాత మధు మంతెన కలసి స్థాపించిన నిర్మాణ సంస్థ. 2011లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కారణం ఈ ప్రొడక్షన్ హౌస్లో ఒకరైన వికాస్ బాల్పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడమే. నానా పటేకర్పై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసినట్టే బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాల్పై కూడా ఓ మహిళ ఆరోపణలు చేశారు. ఇది కూడా పై కేస్లానే ఎప్పటిదో. మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఫీమేల్ ఓరియంటెడ్ సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ని తెరకెక్కించిన దర్శకుడు వికాస్. ఫాంథమ్ ఫిల్మ్స్ తీసిన ‘బాంబే వెల్వెట్’ సినిమాకు కెమెరా వెనక పని చేసిన ఓ మహిళ వేధింపులకు గురయ్యానని ఆరోపించారు. 2015 మేలో ఈ ఘటన జరిగిందట. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు వికాస్ తనతో తప్పుగా ప్రవర్తించాడని పేర్కొన్నారామె. అప్పట్లో అనురాగ్ కశ్యప్తో ఈ విషయం చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదం చెలరేగడంతో అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘జరిగింది తప్పే. మేం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాం. వికాస్ బాల్ చేసింది చాలా పొరబాటు’’ అని రెండురోజుల క్రితం బాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వెబ్సైట్తో పేర్కొన్నారట. ఆ వెంటనే ‘‘ఫాంథమ్ మా కల. కలలు కూడా కొన్ని సార్లు ముగింపుకు చేరుకుంటాయి. మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. గెలిచాం, ఓడాం. ఇందులోని ఎవరి ప్రయాణం వాళ్లు సొంతంగా సాగిద్దాం అనుకుంటున్నాం. మా అందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ ఫాంథమ్ సంస్థను రద్దు చేస్తున్నాం అని అనురాగ్ పేర్కొన్నారు. ‘క్వీన్’లో నటించిన కంగనా ఆ చిత్రదర్శకుడు వికాస్ బాల్ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం ఉండి ఉండొచ్చన్నారు. ‘‘బాల్కి 2014లోనే పెళ్లయింది. కాని రోజుకో కొత్త పార్ట్నర్ కావాలన్నట్లు మాట్లాడేవాడు. సెట్లో క్యాజువల్గా గట్టిగా హగ్ చేసుకుని, నీ జుట్టు సువాసన బావుంటుంది అనేవాడు. ఆ కౌగిలి నుంచి తప్పించుకోవడానికి చాలా ధైర్యం కూడదీసుకునేదాన్ని. నేనా అమ్మాయి ఆరోపణలు నమ్ముతున్నా. ఆమెను సపోర్ట్ చేశానని నాకోసం తెచ్చిన స్క్రిప్ట్ గురించి మళ్లీ మాట్లాడటం లేదు’’ అని ఘాటుగా స్పందించారు. -
‘అతనో ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు’
తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యింది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ చేసిన ఆరోపణలు మన దేశంలో కూడా ‘మీటూ’ ఉద్యమానికి ఆరంభంగా నిలిచాయంటున్నారు ప్రముఖులు. కానీ ఈ ప్రారంభం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు. కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాల గురించి పెద్ద హీరోలు మాట్లాడకపోవడం. తనుశ్రీ వివాదం గురించి ఇంతవరకూ బాలీవుడ్ స్టార్ హీరోలైనా అమితాబ్ బచ్చన్ కానీ, ఖాన్ హీరోల త్రయం కానీ స్పందించలేదు. అయితే తనుశ్రీ - నానా వివాదంలో స్వరా భాస్కర్, ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, అనుష్క శర్మ, వరుణ్ ధావన్లు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి వరుసలోకి మహేష్ భట్ తనయ పూజా భట్ చేరారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తనుశ్రీ, నానా పటేకర్ తనను లైంగింకంగా వేధించాడని చెప్పినప్పుడు చాలా మంది ‘ఇమె పదేళ్లు నోర్ముసుకుని ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది’ అనడం నేను స్వయంగా విన్నాను. అంతేకాక కొంత మంది ‘నానా చాలా మంచి వ్యక్తి’ అంటూ అతనికి కితాబు ఇస్తున్నారు.. కానీ కొందరు అతన్ని రౌడీ అని పిలవడం కూడా నేను విన్నాను. ఈ విషయంలో తనుశ్రీ ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాను ఈ విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పూజా తన గతాన్ని గుర్త చేసుకుంటూ ‘ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో బంధాన్ని కలిగి ఉండేదాన్ని. అతను చాలా ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు. అతని గురించి నేను మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ‘ఎందుకు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నావ్.. ఇలాంటి చెత్త గురించి బహిరంగాగా చర్చించడం వల్ల లాభం ఏంటి’ అని ప్రశ్నించింది. కానీ హింసను ఎదుర్కొన్నది నేను. మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రాన నాకు తక్కువ బాధ కలగదు కదా’ అంటూ ప్రశ్నించారు. అంతేకాక ‘నన్ను కిందకు లాగిన వారికి.. నా మంచితనాన్ని చెరపేసిన వారికి.. నన్ను నాశనం చేయాలని చూసిన వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే వీటన్నింటి వల్ల నాకు నా బలం ఏంటో తెలిసింది. సమాజం ఎలా ఉంటుందో తెలిసిందో. సమస్యలతో ఎలా పోరాడాలో తెలిసింది. అన్నింటికి మించి నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. నా సమస్యలతో నేనే పోరాటం చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని నేను కూడగట్టుకున్నాను. నేను బాధితురాలిని.. నా సమస్యలతో నేనే పోరాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
తనుశ్రీకి అనుష్క బాసట..
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా- నానా పటేకర్ వివాదంలో తనుశ్రీ దత్తాకు బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్లు బాసటగా నిలిచారు. వారి వాదనను, వారు ఎదుర్కొన్న వేదనను సమాజం ముందుకు తెచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యక్తుల మనోభావాలను మనం అర్థం చేసుకోవాలని అనుష్క శర్మ అన్నారు. సుయిధాగా మూవీ మీడియా మీట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు అనుష్క బదులిస్తూ తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ ధైర్యంగా ముందకొచ్చి మాట్లాడటం నిజంగా సాహసమని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా దీని వెనుక నిజం ఉండి ఉంటుందని చెప్పుకొచ్చారు. తనుశ్రీ వ్యాఖ్యలపై కామెంట్ చేయడం, ఆమె వ్యక్తిత్వంపై భాష్యాలు చెప్పడం కంటే ఆమె చెబుతున్నది వినాలని, అర్ధం చేసుకోవాలని అనుష్క పేర్కొన్నారు. తనుశ్రీకి న్యాయం జరిగే వరకూ తాను ఆమె వెంట ఉంటానని అన్నారు. ఇక వరుణ్ ధావన్ సైతం తనుశ్రీ దత్తాకు మద్దతుగా మాట్లాడారు. తన సినిమా సెట్లో ఇలాంటివి జరిగితే తాను బాధితుల పక్షాన ముందుకొచ్చేవాడినన్నారు. తనుశ్రీ లేవనెత్తిన విషయాలపై విచారణలో వాస్తవాలు నిగ్గుతేలతాయన్నారు. కాగా 2008లో ఓ సినిమా షూటింగ్లో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. -
తనుశ్రీపై కేసు నమోదు
సాక్షి, ముంబై : నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్త సుమంత్ దాస్ ఫిర్యాదుతో బీడ్ జిల్లాలోని కైజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఎంఎన్ఎస్ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రాజ్థాకరే, ఎంఎన్ఎస్ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బిగ్బాస్లో వద్దు.. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. -
నోటీసులు అందాయి
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) సినిమా సెట్లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్’ సినిమా సెట్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి. వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. -
ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి
‘ఏంటి ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను, పోకిరి వేషాలు వేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టించే అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. అసలేం జరిగింది? మనందరికీ ఏమయ్యింది?’ అంటూ నటి స్వరా భాస్కర్ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులను ఉద్దేశించి ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ట్వీట్ చేసి మరోసారి తనుశ్రీ దత్తాకు తన మద్దతు తెలిపారు. కాగా తనుశ్రీ- నానా పటేకర్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించారు. అలాగే ఆ సమయంలో నానాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనుశ్రీ పబ్లిసిటీ కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనూశ్రీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. తనూశ్రీ తన చెల్లెలితో కలిసి బిగ్బాస్లో పాల్గొంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్బాస్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్బాస్ సెట్కు వెళ్లి వారికి లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన స్వరా భాస్కర్ ఎంఎన్ఎస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేసి తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. IS THIS A JOKE?????? Or are we now just okay with institutionalised hooliganism?????? And who takes pictures with the goons that threaten vandalism????? WHAT IS WRONG WITH US GUYS??!???? https://t.co/dL8gZvlYAR — Swara Bhasker (@ReallySwara) October 4, 2018 -
లైంగిక వేధింపులు నిజమే : కాజోల్
మహిళల పట్ల లైంగిక వేధింపులు నిజమేనంటున్నారు నటి కాజోల్. అంతేకాక ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమతం కాలేదని అన్ని చోట్ల జరుగుతున్నాయని తెలిపారు. తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంపై స్పందిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. కానీ దీని గురించి విన్నాను. వేధించిన వారు ఎవరైనా సరే బయటకు వచ్చి ‘హే మేం ఇలాంటి పని చేశాం అని చెప్పుకోరు కదా’’ అన్నారు. అంతేకాక ఇలాంటి సంఘటనలు ‘నా కళ్ల ముందు జరిగితే చూస్తూ ఉండేదాన్ని కాదు. ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ అలాంటి సంఘటనలు నా ముందేం జరగలేదు. లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.. అన్ని చోట్ల ఉన్నాయన్నా’రు. విదేశాల్లో వచ్చిన ‘మీటూ’ లాంటి ఉద్యమం మన దేశంలో కూడా రావాలన్నారు. మన కోసం మనమే నిలబడాలి, మనమే పోరాటం చేయాలని వ్యాఖ్యానించారు. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..
ముంబై : పదేళ్ల కిందట సినిమా సెట్స్లో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి బుధవారం లీగల్ నోటీసులు అందాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా సెట్లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించారని, దీనిపై తాను గొంతెత్తగా తనపై మహారాష్ట్ర నవ్నిర్మాణ సేన కార్యకర్తలను ఉసిగొల్పారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో దర్శకుడు వివేక్ తన దుస్తులు తొలగించాలని కోరారని ఆమె ఆరోపించారు. తనకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని దేశంలో వేధింపులు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. వారి (నానా పటేకర్, వివేక్) మద్దతుదారులు తనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. తన ఇంట్లోకి చొచ్చుకువచ్చేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానాలకు లాగడం ద్వారా వ్యయప్రయాసలకు లోనుచేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు ఎలాంటి ముగింపు లేకుండా దశాబ్ధాల పాటు సాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తనుశ్రీ దత్తాను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నానా పటేకర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చారు. సెట్పై 50 మంది వ్యక్తులున్నారని, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా సహా ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నానా పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోడ్కర్ చెప్పారు. -
క్షమాపణలు సరిపోవు
నటుడు నానా పటేకర్పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు హిందీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘హార్న్ ఓకే ప్లీజ్ ’ సినిమా టైమ్లో నానా పటేకర్ తనను వేధించిన విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు (సీఐఎన్టీఏఏ) ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని తనుశ్రీ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే తనుశ్రీ కారుపై జరిగిన దాడి తాలూకు వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో నిజమా? కాదా? అనే చర్చ జరుగుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సీఐఎన్టీఏఏ స్పందించింది. ‘‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులను మా అసోసియేషన్ తేలికగా తీసుకోదు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తనుశ్రీ వివాదం కొలిక్కి రావాలని అందుకోసం ఓ ఎంక్వైరీ టీమ్ ఉండాలని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీఐఎన్టీఏఏ ప్రతినిధులు ఓ ప్రెస్ నోట్ను విడుదల చేశారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనుశ్రీకి ఎవరో బెదిరింపు కాల్స్ చేయడంతో ఆమెకు ముంబై పోలీసులు రక్షణ కూడా ఇస్తున్నారన్నది తాజా సమాచారం. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నానా పటేకర్ నుంచి తనకు ఇంకా ఏ నోటీసులు రాలేదని తనుశ్రీ అంటున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే నటి డింపుల్ కపాడియా ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నానా ఎంతో ప్రతిభ ఉన్నవాడని ప్రశంసల వర్షం కురిపించిన డింపుల్ అతనిలో ఉన్న ‘డార్క్ సైడ్’ కూడా తెలుసు అనడం విశేషం. -
తనుశ్రీ వివాదం.. బిగ్బాస్కు హెచ్చరిక
ముంబై: తనుశ్రీ దత్త, నానా పటేకర్ల వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు తనుశ్రీకి మద్దుతుగా నిలువగా మరికొందరు ఈ విషయంపై మాట్లాడానికి ఆసక్తి కనబరచడం లేదు. కాగా, పదేళ్ల కిందట ప్లీజ్ హార్న్ ఓకె చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై వేధింపులకు దిగాడని తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తనుశ్రీకి మద్దుతుగా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో తనుశ్రీ మాట్లాడుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. నానా విషయంలో తనపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎంఎన్ఎస్ తీవ్రంగా ఖండించిది. ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు అమేయ కోప్కర్ మాట్లాడుతూ.. తనుశ్రీ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆమెపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు. తనుశ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. కానీ తాము దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదని తెలిపారు. నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసిన తరువాత తనుశ్రీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో వివాదాలు కేంద్రంగా నడిచే బిగ్బాస్ రియాల్టీ షోలోకి తనుశ్రీని తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఎంఎన్ఎస్పై తప్పడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్బాస్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్బాస్ సెట్కు వెళ్లి నిర్వహకులకు ఓ లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా హిందీ బిగ్బాస్ 12వ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
తనుశ్రీ- నానా వివాదం : శక్తికపూర్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందించిన తీరు నవ్వులు పూయిస్తోంది. నానా పటేకర్ 2008లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమె చవకబారు ప్రచారం కోసమే నానాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలపై శక్తికపూర్ స్పందన కోరగా, ఇది పదేళ్ల కిందటి వివాదమని అప్పుడు తాను చిన్న పిల్లవాడినని, దీనిగురించి తనకేమీ తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్లో దిగ్గజాలు సైతం తనుశ్రీకి బాసటగా నిలుస్తున్న నేపథ్యంలో శక్తికపూర్ వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కాగా సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా వంటి పలు నటీనటులు తనూశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి నటులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. -
నానాలో ఉన్న క్రూరత్వాన్ని నేనూ చూశా : సీనియర్ నటి
సీనియర్ నటుడు నానా పటేకర్పై తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీకి మద్దతుగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు గళం విపుతున్నారు. నానా పటేకర్లో ఉన్న క్రూరత్వాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హాలీవుడ్ మీటూ ఉద్యమం లాగా తనుశ్రీ వివాదం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ సీనియర్ నటుడు చాలా మంది మహిళా నటీమణులను వేధించినట్టు వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎనిమిదేళ్ల క్రిందట ఎన్డీటీఈ ఇంటర్వ్యూలో నానా పటేకర్ గురించి సీనియర్ నటి డింపుల్ కపాడియా చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నానా పటేకర్లో ఉన్న క్రూరత్వాన్ని తాను కూడా చూశానని నటి డింపుల్ కపాడియా అప్పట్లో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. 2010లో ‘తుమ్ మిలో తో నహి’ రిలీజ్ సందర్భంగా డింపుల్ కపాడియా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నేళ్లు నానాతో కలిసి నటించారు కదా..! పటేకర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించాదా? లేదా గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్ను సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో కూడా ఓ చీకటి కోణం ఉంది’... మంచి విషయంలోనూ, చెడు విషయంలోనూ రెండింటిలో చెప్పాలంటే.. నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడిలో కూడా చెడు కోణం ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు. డింపుల్ కపాడియా, నానా పటేకర్ పలు ఐకానిక్ సినిమాలు తీశారు. 1991లో ఫైనల్ అటాక్, 1992లో అంగర్ వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఇటీవల నటి రేణుకా షహానే కూడా నానా పటేకర్పై పలు ఆరోపణలు చేశారు. పటేకర్ స్థిరత్వం లేని వ్యక్తని, ఆయన స్వభావం వల్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాధపడ్డారని చెప్పారు. Nana Patekar's "dark side" has always been an open secret in Bollywood. Dimple Kapadia said this 8 years ago. pic.twitter.com/9hbd0WmcZo — Od (@odshek) September 28, 2018 -
బిగ్ బీ మాటలు నన్ను బాధించాయి : తనుశ్రీ
అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చిన తనుశ్రీ దత్తా బాలీవుడ్లో చిన్న సైజ్ బాంబ్లాంటిదే పేల్చారు. ఆ మోత ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసింది. అయితే ఈ వేధింపులు జరిగి ఇప్పటికి దశాబ్దం అవుతోంది. ఈ వివాదం జరిగినప్పుడు ఎక్కువగా స్పందించని బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులు తనుశ్రీకి మద్దతు తెలిపారు. అయితే ఇంత జరుగుతున్న స్టార్ హీరోలు కానీ, ఖాన్ల త్రయంతో సహా బిగ్ బీ అమితాబ్ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు అభిమానులు. మిగితా వారి సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో బిగ్ బీ తీరు మాత్రం ఒకింత నిరాశపర్చేవిధంగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకు కారణం తనుశ్రీ వివాదం పట్ల అమితాబ్ స్పందించిన తీరు. తనుశ్రీ - నానా వివాదం గురించి అమితాబ్ను ప్రశ్నించగా ఆయన ‘నేను తనుశ్రీని కాదు.. నానా పటేకర్ని కాదు.. మరి నేను ఎలా స్పందించాలి’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. అయితే అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ తీవ్రంగా మండిపడుతున్నారు. బిగ్ బీ లాంటి సూపర్ స్టార్ ఇలా మాట్లాడటం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇలాంటి స్టార్లందరూ సినిమాల్లోనే ఆదర్శాలను వల్లిస్తారు తప్ప నిజ జీవితంలో కాదంటూ తనుశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘మీ(బిగ్ బీ) ముందు ఇలాంటి వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు ఎవరో ఒక పక్షాన మాట్లాడటం అవసరం. కానీ మీ సమాధానం నన్ను చాలా బాధపెట్టింది. మహిళలకు జరిగే అన్యాయాల గురించి మాట్లడలేని వారు, ఆడవారికి మద్దతు తెలిపే సినిమాల్లో, ప్రకటనల్లో నటించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నారు. అంతేకాక ఆమె ‘ఈ విషయం గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడను.. టీవీ చానెల్సలో కూడా మాట్లాడను. కానీ జనాల నుంచి కూడా సరైన స్పందన లేదు. ఇది నా ఒక్కర్తి బాధ మాత్రమే కాదు. ఇండస్ట్రీలోని ఎందరిదో. వారంతా ఇలా ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. కానీ నేను అలా కాదు. నా ధర్మాన్ని పూర్తిగా నిర్వహిస్తాను. ఫలితాన్ని భగవంతుడికి వదిలివేస్తాను. ఇక మీదట నేను బాలీవుడ్లో నటించను. అమెరికా వెళ్లి పోతాన’న్నారు. -
నాకెలాంటి నోటీసులు అందలేదు: తనుశ్రీ
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్ల వివాదం బాలీవుడ్ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీ చేసే ఆరోపణలు అసత్యమైనవని, క్షమాపణలు చెప్పాలని ఆమెకు నోటీసులు పంపామని పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ మీడియాకు తెలిపారు. తనుశ్రీ మాత్రం తనకు నానాపటేకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈ నోటీసులు బెదిరింపులు.. తనలాంటి మరింత మంది బాధితులను బయటకు రాకుండా భయపెట్టడానికేనన్నారు. ఎవరికైనా తనలాంటి అనుభవమే ఎదురైతే ధైర్యంగా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటివాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం మొత్తం మద్దతినిస్తుందని తెలిపారు. ఇక తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. చదవండి: తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు -
లైంగిక వేధింపులు : తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం బాలీవుడ్ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఆ అనంతరం తనుశ్రీ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పారు. ప్రస్తుతం తనుశ్రీ చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు అసత్యమైనవని, పూర్తిగా అవి తప్పుడు ఆరోపణలంటూ పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ చెప్పారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు. ఈ నోటీసుల్లో ఆమె చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని ఉన్నట్టు రాజేంద్ర శిరోద్కర్ ధృవీకరించారు. ‘ఇప్పుడు తనుశ్రీ ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. కానీ ఏమో కారణాలు ఉండి ఉంటాయి. నానా ఈ రోజు లేదా రేపు ముంబైకి వస్తారు. వచ్చిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. రేపు కచ్చితంగా నానా ఇక్కడ ఉంటారు’ అని శిరోద్కర్ చెప్పారు. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. మరోవైపు తనుశ్రీపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో సెట్స్లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం తనుశ్రీకే మద్దతు ఇస్తున్నారు. డ్యాన్సర్ నుంచి నటిగా మారిన డైసీ షా కూడా తనుశ్రీకే మద్దతు పలికారు. హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో పాటను షూట్ చేస్తున్న సమయంలో తొలి రెండు రోజులు బాగానే ఉందని, కానీ మూడో రోజు మాత్రం ఏదో జరిగిందని తనకు అర్థమైందని తెలిపారు. ఆ సమయంలో తన జాబ్ తనుశ్రీకి, ఆమె టీమ్కు స్టెపులు నేర్పడమని, కానీ మూడో రోజు సెట్లలో ఏదో జరగడంతో, తనుశ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆమె కారుపై కూడా దాడి జరిగినట్టు పేర్కొన్నారు. -
తనుశ్రీ - నానా వివాదం : వైరల్ వీడియో
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తనుశ్రీ వెల్లడించారు. 2008 ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. కొన్ని షాట్స్ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్లో కూర్చున్నారు. ఆ రోజు సాంగ్ షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ తెలిపారు. అనంతరం నానా పటేకర్కు, తనకు మధ్య గొడవ జరిగిందన్నారు. ఆ వివాదం వల్లే ఆ రోజు తాను షూటింగ్ మధ్య నుంచి వెళ్లి పోయానని తనుశ్రీ పేర్కొన్నారు. తాను కేర్వాన్లో కూర్చున్న కొద్దిసేపటికి కొందరు రౌడీలు వచ్చి తన కేరవాన్ డోర్ కొట్టి గందరగోళం సృష్టించినట్లు తనుశ్రీ తెలిపారు. ఈలోపు తన తల్లిదండ్రులు షూటింగ్ స్పాట్ వద్దకు రావడంతో తాను వారితో కలిసి వెళ్లడానికి కారులో వచ్చి కూర్చున్నాను అన్నారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తాము వెళ్తున్న కారును అడ్డుకున్నారని.. కారు అద్దాలను బద్దలుకొట్టి నానా రభస చేశారని తెలిపారు. అంతేకాక ఒక వ్యక్తి కార్ మీదకు ఎక్కి గంతులేసాడంటూ తనుశ్రీ ఆ రోజు జరిగిన గొడవ గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. కాసేపటి తరువాత పోలీసులు వచ్చి కార్ మీద దాడి చేసిన వారిపై యాక్షన్ తీసుకున్నారని.. ఆ తరువాతే తాను స్టూడియో నుంచి వెళ్లి పోయానని అన్నారు. ఆ నాటి గొడవకు సంబంధించి న్యూస్ ఎమ్వోలో ప్రసారమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఈ వీడియోలో ఉన్నాయి. దాంతో తనుశ్రీ ఆరోపణలు వాస్తవమేనని అంటున్నారు నెటిజన్లు. -
తనుశ్రీ - నానా వివాదం
-
తనుశ్రీ, నానా వివాదంలోకి రాఖీ
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించడంటూ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తాకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలుపుతుండగా.. వివాదాస్ప నటి రాఖీ సావంత్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. కేవలం ప్రచారం కోసమే తనుశ్రీ ఇలా చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో ఆమె నానా పటేకర్కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నానా పటేకర్ లాంటి గొప్ప నటుడ్ని తనుశ్రీ దత్తా తన వ్యాఖ్యలతో అవమానపరుస్తోంది. తనుశ్రీ ఇంగ్లీష్లో మాట్లడటం వల్లే మీడియా ఆమె మాటలకు ఇంత ప్రాముఖ్యతనిస్తుంది. నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి’ అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. తనుశ్రీ చేసిన ఆరోపణలు నిజమైతే తన ముందుకు వచ్చి మాట్లాడలంటూ రాఖీ సావంత్ సవాల్ విసిరారు. 2009లో వచ్చిన ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్లో తనుశ్రీ దత్తాకి బదులు రాఖీ సావంత్ను తీసుకున్నారు. దాంతో రాఖీ సావంత్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. -
తనుశ్రీ దత్తాని నమ్మాలి
ప్రస్తుతం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకు సంబంధించి తనుశ్రీ దత్తా – నానా పటేకర్ల వివాదం హిందీ పరిశ్రమలో ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విషయంపై తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటి వారు గళం విప్పారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ‘36 చైనా టౌన్ (2004), ధోల్ (2007)’ సినిమాల్లో తనుశ్రీతో కలిసి వర్క్ చేసిన పాయల్ రోహత్గీ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఒక మహిళగా తనుశ్రీ చెప్పిన విషయంపై నాకు నమ్మకం ఉంది. ఆమె మాటలను అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనే నాకు 2011లో ఎదురైంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా మంది అతను మంచివాడు అన్నారు. ఏ వ్యక్తి అయినా కేవలం వృత్తిపరంగానే కాదు నిజ జీవితంలోనూ విలువలు పాటించాలి. అనురాగ్ కశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వాళ్లు ఒకప్పుడు నా మానసిక స్థితి బాగోలేదన్నారు. ఇప్పుడు తనుశ్రీకి మద్దతుగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతున్నారు. కాస్త అయోమయంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండియాలో స్త్రీవాదం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదు. దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం నా కెరీర్పై ప్రభావం చూపించింది. కొంతకాలం నేను సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీవీల్లో రియాలిటీ షోలు చేశా. మలయాళం నటుడు దిలీప్కుమార్ వివాదం, శ్రీ రెడ్డి వివాదం వంటివి వచ్చినప్పుడు ‘మీ టూ’ లాంటి ఉద్యమాలు ఇండియాలో ఎందుకు ఊపందుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొందరు చేసే ఆరోపణలకు అండగా నిలవడం, కొందరిని తేలికగా తీసుకోవడం.. ఈ వ్యత్యాసం ఎందుకు? అన్ని సంఘటనలను సమానంగానే చూడాలన్నది నా అభిప్రాయం’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచి.. నానా పటేకర్, తనుశ్రీ వివాదం గురించి చెప్పాలంటే... ప్రస్తుతం ‘హౌస్ఫుల్ 4’ షూటింగ్ కోసం జై సల్మేర్లో ఉన్న నానా పటేకర్ ముంబై వచ్చిన వెంటనే ఈ వివాదం గురించి ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన తరఫు న్యాయవాదాలు చెబుతున్నారు. ఈ వివాదం ఎందాకా సాగుతుంది? అనేది చూడాలి. -
తనూశ్రీ దత్తాలు ఇంకా ఎందరో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గ్లామరస్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా తనూశ్రీ దత్తా తన తోటి బాలివుడ్ నటుడు నానా పటేకర్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితమే అంటే, 2008లోనే ఆమె ఈ విషయాన్ని ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు ఫిర్యాదు చేసినట్లు నాటి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే అప్పుడు అలా వేధింపులకు గురిచేసిందీ నానా పటేకర్ అనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని తనశ్రీయే తనంతట తాను బయట పెట్టారు. నాడు ఆమె ఫిర్యాదుపై ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నేడు తనూశ్రీకి మద్దతుగా నిలుస్తున్న బాలీవుడ్ పరిశ్రమ తీసుకుంటుందన్న నమ్మకాలు లేవు. ‘క్యాస్టింగ్ కౌచ్’గా పిలిచే మహిళా నటిమణుకు లైంగిక వేధింపుల సమస్య ఈ నాటిని కాదు. ఒక్క బాలీవుడ్కే పరిమితమైనదీ కాదు. హాలీవుడ్ నుంచి టాలివుడ్ వరకు విస్తరించి ఉంది. దీనికి వ్యతిరేకంగా తెలుగునాట శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొదట సినీ రేప్ దశ్యాలతో మొదలైన ఈ క్యాస్టింగ్ కౌచ్ ప్రక్రియ నిజ జీవితంలోని పడక గదుల్లోకి పాకింది. ఆమె ఆహాభావాల కోసమే అలా చేశారా! ప్రముఖ కళాత్మక చిత్రాల ఇటలీ దర్శకుడు బెర్నార్డో బెర్తోలూచిపైన హీరోయిన్ మారియా స్నైడర్ చేసిన బహిరంగ ఆరోపణలతో మొదటిసారి ఇలాంటి వేధింపుల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ‘ది లాస్ట్ టాంగో ఇన్ పారిస్’ చిత్రంలో రేప్ సీన్ గురించి దర్శకుడు తనకు పూర్తిగా చెప్పకుండా సినిమా తీశారని, ఆ సినిమాలో అర్ధనగ్న దశ్యాల కారణంగా తన పరువు పోయిందని మారియా ఆరోపించారు. ఓ సినీ నటిగా కాకుండా నిజమైన అమ్మాయిగా ఆమె ఆహాభావాలు ఆ సమయంలో ఎలా ఉంటాయో రాబట్టేందుకే రేప్ సన్నివేశం గురించి ఆమెకు పూర్తిగా వివరించలేదని బెర్తోలూచి అందుకు సమాధానం ఇచ్చుకున్నారు. అదీ నిజమే కావచ్చు. కానీ సినీ పరిశ్రమ రేప్ సీన్ల కుసంస్కతి నుంచి పడక గదుల విష సంస్కతి వరకు విస్తరించేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రముఖ హాలివుడ్ సినీ నిర్మాత హార్వే విన్స్టెయిన్కు వ్యతిరేకంగా తమను లైంగికంగా వేధించారంటూ ‘మీ టూ’ ఉద్యమం పేరిట దాదాపు 70 మంది నటీమణులు బయటకు వచ్చారు. వారిలో ఏంజెలినా జోలి మొదలుకొని దాదాపు 20 మంది హీరోయిన్లు ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్లోనూ ఒక్కొక్కరు బయటకు వస్తూ తమకూ లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయిని చెబుతున్నారు. గతంలో హీరోయిన్ రిచా చద్ధా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దర్శకుడు మధుర్ భండార్కర్, ఫాంటమ్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు వికాస్ బహల్కు వ్యతిరేకంగా కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చాలా వరకు కోర్టుల వరకు వెళ్లక పోవడం వల్లనే తనశ్రీ దత్తాలు ఇంకా పుట్టుకొస్తున్నారు. అమితాబ్ తీరు ఆశ్చర్యకరం.. దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రఫర్లు, హీరోల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న సినీ తారలు ప్రస్తుతం ‘నేమింగ్ అండ్ షేమింగ్’ వరకే పరిమితం అవుతున్నారు. వారు కోర్టు తలుపులు తట్టేవరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకోవడం భ్రమే. బిగ్ బీగా పేరొంది ప్రభుత్వంలోనూ ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అమితాబ్ బచ్చన్ దష్టికి తనశ్రీ అంశాన్ని మీడియా తీసుకెళితే తాను స్పందించేందుకు ‘నేను నానా పటేకర్ను కాను, తనూశ్రీని కాను’ అంటూ తప్పించుకున్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి అంబాసిడర్గా ఉన్న ఆయనే ఆ మాటలనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? 2013 నాటి చట్టం ఓ ఆయుధం పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ‘ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్–2013’ను తీసుకొచ్చింది. పది మంది ఉద్యోగులను మించిన ప్రతి కంపెనీలో, ప్రతి పరిశ్రమలో మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు విధిగా కనీస సభ్యులలో ఓ కమిటీ ఉండాలి. ఆ కమిటీలిచ్చే నివేదికలపై కోర్టులు వేగంగా స్పందిస్తాయి. ఈ చట్టం కింద మూడేళ్ల వరకు జైలు, 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మహిళలు చేసే తప్పుడు ఆరోపణల నుంచి మగవాడికి విముక్తి కలిగించే నిబంధనలు కూడా ఆ చట్టంలో ఉండడం విశేషం. తనూశ్రీలు కోర్టుకెళ్లినప్పుడేగదా వారి మాటల్లోని నిజానిజాలు బయటకొచ్చేవి! దేశంలో ఇప్పటి వరకు 36 శాతం కంపెనీల్లో మాత్రమే ఇలాంటి కమిటీలు ఉన్నాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చొరవ వల్ల బాలీవుడ్కు చెందిన ఏడు చలనచిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు ఏర్పాటయ్యాయి. గతేడాది దర్శకుడు వికాస్ బహల్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చినప్పుడు ‘ఫొంటమ్ ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థలో కమిటీని ఏర్పాటు చేశారు. -
థాంక్యూ ట్వింకిల్.. మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ
పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో మొదలైన నానా పటేకర్ వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తనుశ్రీ దత్తా టీమ్ ఆరోపించింది. తనుశ్రీకి మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తులను, మీడియా హౌజ్ ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు పటేకర్ లాయర్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా లీగల్ నోటీసులు ఇచ్చి, తనుశ్రీని కోర్టు కీడుస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కాగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా తదితరులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. (చదవండి : 'నానా'గొడవ) థ్యాంక్యూ ట్వింకిల్.. కానీ ‘పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం’ అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ట్వింకిల్కు కృతఙ్ఞతలు చెప్పిన తనుశ్రీ... ‘మీరు నా పక్షాన నిలిచినందుకు సంతోషం. కానీ మీ భర్త అక్షయ్ కుమార్ సంగతేంటి. ఆయన ఎన్నో ఏళ్లుగా నానా పటేకర్తో కలిసి నటిస్తున్నారు. అంతెందుకు ప్రస్తుతం హౌజ్ఫుల్ 4 సినిమాలో కూడా నానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏమిటంటూ’ ప్రశ్నించారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీరు కూడా తనని బాధించిందని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక స్త్రీగా తను(ఫరాఖాన్) నా బాధ అర్థం చేసుకుంటుంది అనుకున్నా కానీ.. ఈ సమయంలో నానా పటేకర్తో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ తనుశ్రీ ప్రశ్నించారు. (తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్) Please read this thread before judging or shaming #TanushreeDutta a working environment without harassment and intimidation is a fundamental right and by speaking up this brave woman helps pave the way towards that very goal for all of us! https://t.co/f8Nj9YWRvE — Twinkle Khanna (@mrsfunnybones) September 28, 2018 -
తప్పు చేసినవాళ్లు అనుభవించాల్సిందే
‘హార్న్ ఓకే ప్లీజ్’ (2008) చిత్రానికి చెందిన టైటిల్ సాంగ్ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్ సారంగ్, నిర్మాత సమి సిద్ధిఖీ, నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్యలు లొకేషన్లో ఉన్నప్పటికీ తన ఇబ్బందిని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ వివాదంపై సదరు చిత్రబృందం ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ‘‘తనుశ్రీ బాలీవుడ్లో తిరిగి అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడీ వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘నథానీ ఉతారో’ మొదట్లో సోలో సాంగ్ అని, కావాలనే డ్యూయెట్గా మార్చామంటున్న ఆమె మాటల్లో వాస్తవం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ పాట కోసం ఆమె సాధన చేసినప్పుడు మేల్ వాయిస్ కూడా ఉందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. సందేహం ఉంటే అప్పుడే అడగాలి. కానీ అడగలేదు. ఆ పాటను మొదట్నుంచి డ్యూయెట్గానే అనుకున్నాం. నానా పటేకర్ చాలా కాలం తర్వాత ఓ పాటకు రెడీ అయిన టైమ్ అది. ఆ అత్యుత్సాహం ఆమెకు చెడు ప్రవర్తనగా అనిపించి ఉండొచ్చు. నాలుగు వందలమంది చూస్తున్నప్పుడు ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఆ తర్వాత ఈ విషయమై నానా పటేకర్కు చెందిన వాళ్లు ఆమె కారును ధ్యంసం చేశారని సినీ ఆర్టిస్టు అండ్ టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ (సిఐఎన్టీఏఏ)కు ఫిర్యాదు చేశారు తనుశ్రీ. కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. ఈ సమస్యను సిఐఎన్టీఏఏ అప్పట్లోనే పరిష్కరించింది. మళ్లీ ఇప్పుడు తనుశ్రీ ఇలా చేస్తున్నారు. ఈ విషయంపై నానా పటేకర్ చట్టపరంగా ముందుకు వెళ్తారనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు చిత్రదర్శకుడు సారంగ్. ‘‘రిహార్శల్స్ టైమ్లోనే ఈ సాంగ్లో నానా పటేకర్ కూడా ఉంటారని నేను తనుశ్రీకి చెప్పాను. నానాజీ చాలా మంచి వ్యక్తి. అతను ఎప్పుడు అలా చేయరు’’ అని ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ గణేశ్ పేర్కొన్నారు. ‘‘లొకేషన్లో 50 నుంచి 100 మంది ఉన్న నేపథ్యంలో లైంగికంగా వేధించాననడం విచిత్రంగా ఉంది. మరి.. తనుశ్రీ మాటలకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతానో వేచి చూడండి’’ అన్నారు నానా పటేకర్. రాకేశ్ సారంగ్, గణేశ్ ఆచార్యల కామెంట్స్పై తనుశ్రీ రెస్పాండ్ అయ్యారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘‘గణేశ్ ఆచార్య అబద్ధం చెబుతున్నాడు. అతనికి రెండు ముఖాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం వేధింపులకు సంబంధించిన వారిలో ఇతని పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని అతను ఒప్పుకోడు. ఇలాంటివారిపై నిషేధం విధిస్తే తప్పుచేయాలనుకునేవారికి ఉదాహరణగా ఉంటారు. నా ఫైట్ నానా పటేకర్, గణేశ్ ఆచార్యలపై కాదు. వాళ్లతో నేను వర్క్ చేయాలనుకోవడం లేదు. అయితే వాళ్లు చేసినదానికి అనుభవించాలనుకుంటున్నాను’’ అంటూనే బాలీవుడ్లో మళ్లీ సినిమాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారట తనుశ్రీ. మరి.. ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమా ట్రైలర్ రిలీజ్లో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ల ముందు తనుశ్రీ దత్తా విషయం ఉంచితే.. ‘‘ఈ విషయంపై స్పందించడానికి నేనేం తనుశ్రీని కాదు. నానా పటేకర్ని కాను. నేం చెప్పలేను’’ అని అమితాబ్ పేర్కొన్నారు. ‘‘ఒక విషయంపై కచ్చితమైన అవగాహన లేకుండా నా అభిప్రాయాన్ని చెప్పలేను. అయితే ఇలాంటివి జరగకూడదనే కోరుకుంటాను. నిజంగా ఇలాంటి సంఘటనలు బాధాకరం’’ అని ఆమిర్ చెప్పారు. -
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ ఎట్టకేలకు స్పందించాడు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి? నేను అసభ్యంగా ప్రవర్తించానని ఆమె చెబుతున్న సమయంలో అక్కడ నాతో పాటు 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. ఈ ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటాను. చూడండి ఏం జరుగుతుందో. అసలు మీడియాతో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నా. ఇప్పుడు కూడా మీకు మీరే ఏదో ఊహించేసుకుని నచ్చింది రాసేస్తుంటారు’ అంటూ నానా పటేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనుశ్రీ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నానా పటేకర్ సామాజిక సేవ చేస్తున్నట్టుగా మంచి ముసుగు వేసుకుంటాడన్న తనుశ్రీ ఆరోపణలకు సమాధానంగా... ‘ఎవరికి నచ్చిన తీరుగా వారు మాట్లాడుకోవచ్చు. నా పనేంటో నేను చేసుకుంటూ వెళ్తా. కరువుతో అల్లాడుతున్నమహారాష్ట్ర రైతులకు చేతనైన సాయం చేస్తున్నా. నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం ఇది’ అంటూ పటేకర్ వ్యాఖ్యానించాడు. కాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
తనుశ్రీ ఆరోపణలపై బిగ్ బీ కామెంట్
సినీ పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) కూడా తనకు ఎదురైన సమస్యల గురించి గళం విప్పారు. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె ఆరోపించారు. అయితే ఈ విషయంపై స్పందించాల్సిందిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ను కోరిన ఓ జర్నలిస్టుకు విచిత్రమైన సమాధానం లభించింది. అసలేం జరిగిందంటే.. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కైత్రినా కైఫ్, ఫాతిమా సనా షైక్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సినిమా యూనిట్ చిట్చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా తనుశ్రీ ఆరోపణలు, ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరేం చెబుతారంటూ అంకుర్ పాఠక్ అనే జర్నలిస్టు అమితాబ్ను ప్రశ్నించారు. ‘నేను తనుశ్రీని కాదు, నానా పటేకర్ను అంతకన్నా కాదు. కాబట్టి ఈ విషయంపై నేనెలా కామెంట్ చేయగలను’ అంటూ బిగ్ బీ సమాధానమిచ్చారు. అమితాబ్ నుంచి ఊహించని సమాధానం రావడంతో... ‘ తోటి కళాకారులకు సంఘీభావం తెలిపే విధానం ఇదే. ఈవిధంగా మాట్లాడి భారత సూపర్ స్టార్ మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశారంటూ’ అంకుర్ వ్యంగంగా ట్వీట్ చేశారు. కాగా ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన బిగ్ బీ ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని.. కథువా ఘటన సమయంలోనూ ఆయన ఇలాగే మాట్లాడారని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. At #ThugsOfHindostan presser, when asked about Tanushree Dutta, Amitabh Bachchan said, "Neither am I Tanushree, not am I Nana Patekar, so how can I comment on this?" Wayyy to show solidarity for your colleagues, Bollywood. This country's superstars make us so proud. — Ankur Pathak (@aktalkies) September 27, 2018 -
నానా వేధింపులు
లైంగిక వేధింపులపై ఇటీవల కాలంలో కొందరు నటీమణులు బహిరంగంగా నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా (‘వీరభద్ర’ సినిమా ఫేమ్) ‘‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ టైమ్లో ఓ నటుడు నన్ను లైంగికంగా వేధించాడు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నటుడెవరో కాదు.. నానాపటేకర్ అంటూ పేరు బయటపెట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ‘‘నానా పటేకర్ గొప్ప నటుడే. కానీ, మహిళల పట్ల అతని ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది. నటీమణులను తిడతాడు, కొడతాడు. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయం ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు. అక్షయ్ కుమార్ ఎనిమిదేళ్లుగా నానాతో నటిస్తూనే ఉన్నాడు. సూపర్స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లే నానా లాంటి క్రిమినల్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్ని ‘మీ టూ’ ఉద్యమాలు వచ్చినా ఉపయోగం ఉండదు’’ అన్నారు. -
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన గణేష్ ఆచార్య
ముంబై: బాలీవుడ్ నటుడు నానా పటేకర్పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తనుశ్రీ మాట్లాడుతూ.. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఓ సోలో సాంగ్ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్ను పక్కకుబెట్టి.. నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. అది సోలో సాంగ్ అయినప్పటికీ.. అందులో అతనితో సన్నిహితంగా నటించాలని నానా పటేకర్ తనను లైంగిక వేధించినట్టు ఆమె ఆరోపించారు. తాను దానికి అంగీకరించలేదని తెలిపారు. ఆ సమయంలో నానా పటేకర్ రాజకీయ పార్టీలకు చెందిన కొందరిని పిలిచి సెట్లో గొడవకు కూడా దిగాడని ఆమె పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని అన్నారు. కాగా, ఆ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన గణేష్ ఆచార్య మాట్లాడుతూ.. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అది చాలా పాత విషయమని.. అందువల్ల ఆ సాంగ్ తనకు అంతగా గుర్తుకు లేదని తెలిపారు. తనకు గుర్తున్నంత వరకు అది సోలో కాదని.. డ్యూయేట్ సాంగ్ అని వెల్లడించారు. ఆ రోజు ఏదో జరగడం వల్ల షూటింగ్ మూడు గంటల పాటు నిలిచిపోయిందని తెలిపారు. అక్కడ అపార్థం చేసుకోవడం వల్ల ఏదో జరిగిందని.. కానీ తనుశ్రీ చెప్పినట్టుగా నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకువచ్చి సెట్లో దాడికి దిగడం కానీ జరగలేదని పేర్కొన్నారు. షూటింగ్లో అలా ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘చిత్ర నిర్మాతలు రిహార్సల్ అప్పుడే నానా పటేకర్ కూడా ఆ సాంగ్లో ఉన్నారని నాతో చెప్పారు. ఆ సమయంలో నాకు చిత్ర యూనిట్తో ఎలాంటి ఒప్పందం లేదు.. ఎందుకంటే అప్పట్లో నేను మాట మీదే పనిచేశాను. అయినా ఆ పాటలో ఎలాంటి అసభ్యకరమైన దృశ్యాలు లేవు.. అది పూర్తిగా డ్యాన్స్తో కూడిన పాట’ అని అన్నారు. ఆ సాంగ్ షూటింగ్ నుంచి తనుశ్రీ వెళ్లిపోవడంతోనే రాఖీ సావంత్ తీసుకువచ్చారనే దానిపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిర్మాతల నిర్ణయమేనని తెలిపారు. అంతేకాకుండా నానా పటేకర్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తనుశ్రీ ఆరోపించినట్టు ఆయన ఏనాడూ ప్రవర్తించలేదని అన్నారు. నానా పటేకర్ చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు. -
నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా
ఓ బాలీవుడ్ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా ఫైనల్గా ఆ నటుడి పేరు వెల్లడించారు. హిందీ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, తమిళ చిత్రాల్లో నటించడమే కాక జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం గురించి తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు’ అంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె అక్షయ్ కుమార్, రజనీకాంత్ల పేర్లు ప్రస్తావించారు. ‘అక్షయ్ కుమార్ గత ఎనిమిదేళ్లుగా నానా పటేకర్తో కొన్ని సినిమాల్లో నటించారు. సుపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మధ్యే అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండద’ని బాధపడ్డారు. ఆమె మాట్లాడుతూ ‘జనాలందరూ ఈ విషయాల గురించి గుసగుసలాడతారు. కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చేడుగా మాట్లడతారు. ‘ఆమె స్క్రీన్ మీద ఎంత స్కిన్ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. కానీ ఒక్కరు కూడా మేం కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు. మాలో చాలా మంది తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకు, రైతులకు ఇస్తారనే విషయం మీకు తెలియదు. వీటన్నింటి గురించి వదిలేసి కేవలం స్కిన్ షో గురించి మాత్రమే మాట్లడతారు’ అన్నారు. -
రజనీకాంత్ ‘కాలా’ ట్రైలర్
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ట్రైలర్ వచ్చేసింది. వండర్బార్ ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కబాలి డైరెక్టర్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ముంబై నేపథ్యంలో మరోసారి డాన్గా తలైవా అలరించబోతున్నాడు. ట్రైలర్ విషయానికొస్తే... బస్తీ, దానిని రక్షించే దాదా కాలాగా రజనీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెగటివ్ రోల్లో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ నటించారు. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే... అంటే పటేకర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘ఒక్కచోటూ వదల్లేదు. తన వెనుక పిచ్చోడిలా తిరిగా.. నేనంటే అంత ఇష్టమా?. చెప్పలేనంత... ఐ లవ్ యూ’... అంటూ ముదురు రొమాంటిక్ యాంగిల్ను చూపించారు. రజనీకి జోడీగా ఈశ్వరి, హూమా ఖురేషీలు నటించారు. ‘ఈ తనవే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం.’ ‘నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం’ అంటూ రజనీ డైలాగులు ఓకే అనిపించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్తో ఆకట్టుకున్నాడు. అయితే సూపర్ స్టార్ గత చిత్రాల స్థాయిలో హడావుడి కనిపించకపోవటం గమనించదగ్గ విషయం. జూన్ 7న కాలా అన్ని భాషల్లో విడుదల కానుంది. -
‘రజనీ బతిమాలితేనే ఒప్పుకున్నా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించటంపై స్పందించిన నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తమిళ సినిమా చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదన్న నానా పటేకర్, రజనీ కోరినందువల్లే కాలా సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. -
మేమున్నాం...
‘దేశం కోసం మీరున్నారు. మీ కోసం మేమున్నాము’ అని నటుడు నానా పటేకర్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో తమ విధులలో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) జవాన్లతో అన్నారు. బిఎస్ఎఫ్ ఆహ్వానం మీద జమ్ములోని కతువా ప్రాంతంలోని జవాన్లతో రోజంతా గడిపిన నానా పటేకర్ ‘నేను హీరోనే కాని నిజమైన హీరోలు మీరే’ అని వారిలో ఉత్సాహం నింపారు. ఇటీవల పాక్ దుశ్చర్యలకు బలైన సైనికుల కుటుంబాలను ఆయన కలిశారు. జమ్ములోని స్కూల్ విద్యార్థులను కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. జవాన్లను ఉత్సాహపరచడానికి తారాలోకపు అతిథులను ఆహ్వానించడం ఒక సంప్రదాయం. అందులో భాగంగానే విలక్షణ నటుడు నానా ఇలా సరిహద్దు దళాలను కలిశారు. -
నానా పాటేకర్.. నాలుగు మాటలు
-
నానా పాటేకర్.. నాలుగు మాటలు
బాలీవుడ్లో విలక్షణ నటులు చాలామందే ఉన్నారు. వాళ్లందరిలోకీ కూడా విలక్షణమైన వ్యక్తి నానా పాటేకర్. నూటికి నూరుపాళ్లు తాను చెప్పేది ఆచరించే మనిషి ఆయన. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల మీద కూడా ఆయన చేసే పోరాటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అవే విషయాలను చాలాసార్లు సినిమాల్లో తన పాత్రల ద్వారా కూడా చెబుతారు. అలాంటి నానా.. జమ్ము కశ్మీర్లోని యువతను బుధవారం కలిశారు. వాళ్లతో మాట్లాడారు. ఆర్మీ జవాన్లతో కలిసి యువతీ యువకులను కలిసిన నానా.. వాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పారు. యువత ముందుగా చదువుకోవాలని, ప్రధాన స్రవంతిలోకి రావాలని సూచించారు. చదువుకుంటేనే ఏమైనా సాధ్యమవుతుందని, బాగా పైకొచ్చి దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంతేతప్ప.. ఇలా చేస్తే మాత్రం (రాళ్లు రువ్వడం) జీవితంలో ఏమీ సాధించలేరని చెప్పారు. అసలు ముందు ఈ దేశాన్ని మీది అనుకుంటే, ఆ తర్వాత అన్నీ చాలా సులభం అవుతాయని అన్నారు. సైనికుల స్ఫూర్తి భేష్ తాను ఇక్కడికి సైనికుల మనోధైర్యం పెంచడానికి రాలేదని, వాళ్లే తనకు బోలెడంత స్ఫూర్తినిచ్చారని అన్నారు. వాళ్లను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. హోలీ, దీపావళి.. ఏ పండుగైనా వాళ్లకు మాత్రం లేదని, అయినా చాలా సంతోషంగా ఉన్నారని నానా అన్నారు. వాళ్లకు కనీసం సెలవులు కూడా లేవని చెప్పారు. కతువా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటూ ప్రాణాలు కోల్పోయిన గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. నోట్ల రద్దు మంచిదే.. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని నానా ప్రశంసించారు. ఇన్ని సంవత్సరాల బట్టి మనం చాలా భరిస్తూ వచ్చామని.. ఈ పది, ఇరవై రోజుల కష్టాన్ని భరించలేమా అని ప్రశ్నించారు. -
దేశానికి వాళ్ళే హీరోలు..
ముంబైః దేశంకోసం ప్రాణత్యాగం చేయగలిగే సైనికులే అసలైన హీరోలన్నారు విలక్షణ నటుడు నానా పటేకర్. దేశరక్షణ విషయంలో జవాన్లముందు తామెందుకూ పనికిరామని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి సైనికులే సిసలైన హీరోలన్న పటేకర్.. పాకిస్థాన్ విషయంలో బాలీవుడ్ తారల మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో బాలీవుడ్ లో పాకిస్థాన్ తారల పరిస్థితి సందిగ్ధంగా మారింది. కళాకారులు పాకిస్థాన్ కు తిరిగి వెళ్ళాలా అన్న ప్రశ్నకు స్పందించిన నానా పటేకర్ దేశ భద్రత విషయంలో సైనికులే హీరోలని, యుద్ధ వాతావరణం ఉన్నపుడు కళాకారులు వేరుగా ఉండటం మంచిదేనని అన్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే రాజకీయ నిర్ణయమే కీలకమని తెలిపారు. దేశభద్రతకు సంబంధించిన నిర్ణయాల విషయంలో దేశం, సైనికులదే తుది నిర్ణయమని, కళాకారుల సమస్య బోర్డర్ సమస్యల కు మించింది కాదని చెప్పారు. పాకిస్థానీ యాక్టర్లను బాలీవుడ్ నుంచి నిషేధించాలన్న విషయంపై చర్చలో భాగంగా స్పందించిన పటేకర్.. తాను దేశానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని, ఆ తర్వాతే ఎవరైనా అన్నారు. దేశం ముందు కళాకారులు నల్లులవంటి వారని, దేశ రక్షణ ముందు తమ మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పాటేకర్ మీడియాకు తెలిపారు. ఉడీ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులు ఫవాద్, మహీరా ఖాన్ వంటి వారు దేశం విడిచి వెళ్ళాలని, వారు నటించిన సినిమాల ప్రమోషన్లను అడ్డుకోవాలని మహరాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నుంచి డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, హన్సల్ మెహతా, ఓం పురి, నగేష్ కుకునూర్, రణదీప్ హుడా, సోనాలి బింద్రే వంటి ప్రముఖులు నిషేధాన్ని వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. ఇదే విషయంపై పటేకర్ ను ప్రశ్నించగా దేశానికి సైనికులే పెద్ద హీరోలని, వారి ముందు మిగిలిన ఎవరైనా సాధారణ ప్రజలేనని చెప్పారు. తమ మాటలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ తాము సూచించినా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని అభిప్రాయపడ్డారు. -
మన నిజమైన హీరోలు మన జవాన్లు
-
రజనీపై నానా పటేకర్ కామెంట్స్
అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా.. ఈ సినిమా కలెక్షన్ల రికార్డ్లను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో మీడియా ప్రతినిధి కబాలి గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా 'ఇండియాలో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే కథ బాలేకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది'. అంటూ కామెంట్ చేశాడు. -
పవార్ నా హీరో: నానా పటేకర్
సాక్షి, ముంబై: శరద్ పవార్ నా హీరో అని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ వ్యాఖ్యానించారు. పుణేలోని ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘గురుజన్’ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నామ్’ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నారని, వర్షాలకు ముందుగానే కరువు ప్రాంతాల్లో సుమారు 540 కి.మీ. మేర కాలువలను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నారని తద్వారా నీటి నిలువలు పెరిగాయన్నారు. ఈ పని చేయడానికి ప్రభుత్వానికి రూ.250 కోట్లు ఖర్చు కాగా, ఇదే పనిని నామ్ ఫౌండేషన్ కేవలం రూ.7 కోట్లతో పూర్తి చేసిందన్నారు. కాగా, ‘శరద్ పవార్ నా హీరో’ అని సభా ముఖంగా చెప్పారు. ఆయన సమాజం కోసం పలు ఉపయోగకరమైన పనులు చేపట్టారని కొనియాడారు. పవార్ ఆధ్వర్యంలో పార్టీ ఉన్నందువల్ల నేటికి మనుగడ సాగిస్తుందని తెలిపారు. ‘గురుజన్’ అవార్డులను మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేతుల మీదుగా ప్రముఖ నటుడు నానా పటేకర్, అడ్వకేట్ భాస్కర్ అవ్హాడ, మణిక్చంద్ గ్రూప్ కంపెనీకి చెందిన రసిక్ లాల్ ధారీవాల, డాక్టర్ శరద్ హార్డికర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ప్రశాంత్ జగ్తాప్, నగర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వందనా చౌహాన్, స్థాయి సమితి అధ్యక్షురాలు బాలా సాహెబ్ బోడకే, సభాధ్యక్షుడు శంకర్ కేమసే తదితరులు పాల్గొన్నారు. -
ఫిఫ్టీన్ ఇయర్స్ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
హీరోయిన్లకు ఎంత గుడ్ లక్ ఉంటుందో, అంత బ్యాడ్ లక్ కూడా ఉంటుంది. ఎంత త్వరగా హిట్ అవుతారో... అంతే త్వరగా వాళ్ల ఇన్నింగ్స్ ముగిసిపోతాయి. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్. అక్కా, వదిన పాత్రలు చేసుకోవాల్సిందే. పాత తరం హీరోయిన్లకైతే 15, 20 ఏళ్ల కెరీర్ స్పాన్ ఉండేది. ఇప్పుడలాంటి అవకాశమే ఉండటంలేదు. అలాగని అందర్నీ ఒకే గాటన కట్టేయలేం. శ్రీయ, త్రిష, తమన్నా లాంటివాళ్లు మహా జోరుగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. శ్రీయ అయితే.. స్టిల్ 15 ఇయర్స్ బ్యాటింగ్. పదిహేనేళ్లయినా ఎక్కడా పట్టు తగ్గకుండా ఆమె సినిమాలు చేయగలుగుతున్నారు. 2001లో ‘ఇష్టం’తో ఎంతో ఇష్టంగా కథానాయికగా పరిచయం అయ్యారు శ్రీయ. ఆ సినిమా గొప్పగా ఆడకపోయినా నలుగురి దృష్టీ శ్రీయ మీద పడింది. ఆ తర్వాత చేసిన ‘సంతోషం’ శ్రీయను తిరుగు లేని తారను చేసింది. అప్పట్నుంచీ ఏడాదికి ఐదారు సినిమాలకు తగ్గకుండా, క్షణం తీరిక లేకుండా సినిమాలు చేశారు. అంతెందుకు.. 2005లో ఎనిమిది కథానాయిక పాత్రలూ, రెండు అతిథి పాత్రలతో కలుపుకుని తెలుగు, తమిళ భాషల్లో మొత్తం పది చిత్రాల్లో మెరిశారు. ఇది మామూలు రికార్డ్ కాదు. సరే.. పదిహేనేళ్లయ్యింది కదా.. పైగా నూతన తారలు దూసుకొచ్చేశారు. ఇప్పుడైనా శ్రీయ వెనక్కి తగ్గాల్సిందే. మరి తగ్గారా? లేదు. ఏడాదికి రెండు సినిమాలైనా దక్కించుకోగలుగుతున్నారు. అవీ దాదాపు హిట్ సినిమాలే. అయితే విశేషం ఏంటంటే... ఈ రెండేళ్లల్లో ఆమె చేసినవన్నీ రీమేక్లే. 2015లో వెంకటేశ్ సరసన శ్రీయ నటించిన ‘గోపాల గోపాల’ హిందీ ‘ఓ మైగాడ్’కి రీమేక్. హిందీలో చేసిన ‘దృశ్యం’ మలయాళ ‘దృశ్యం’కి రీమేక్. ఇక, ఈ మధ్య విడుదలై, వీర విహారం చేస్తున్న ‘ఊపిరి’ కూడా ‘ఇన్టచ్బుల్స్’కి రీమేక్ కావడం విశేషం. శ్రీయ లేటెస్ట్గా అంగీకరించినది కూడా ఓ రీమేక్ సినిమానే. ఆ సినిమా ఏంటంటే.. తెలుగులో ‘ఉలవచారు బిర్యాని’, తమిళంలో ‘ఉన్ సమయల్ అరయిల్’ , కన్నడంలో ‘ఒగ్గరణె’ పేరుతో ప్రకాశ్రాజ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం గుర్తుండే ఉంటుంది. మలయాళ ‘సాల్ట్ అండ్ పెప్పర్’కి ఇవి రీమేక్. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రకాశ్రాజ్ సన్నాహాలు మొదలుపెట్టారు. హిందీలో ఆయన దర్శకత్వం వహించనున్న మొదటి సినిమా ఇది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రకాశ్రాజ్ చేసిన పాత్రను హిందీలో నానా పటేకర్ చేయనున్నారు. ఆయన సరసన శ్రీయ నటించనున్నారు. హిందీ చిత్రానికి ‘తడ్కా’ అని టైటిల్ పెట్టారు. ‘‘ఇది చాలా స్వీట్ లవ్స్టోరి. గోవాలో షూటింగ్ మొదలుపెట్టనున్నాం. ఎన్నో అవార్డులు పొందిన ప్రకాశ్రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడం, నానా పటేకర్ వంటి సీనియర్ నటుడితో చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీయ. మొత్తానికి ‘శివాజీ’ సినిమాలో ‘పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..’ పాట అంత హుషారుగా శ్రీయ కెరీర్ ఉందన్నమాట. -
నానా పటేకర్ ఏడ్చిన వేళ..
అహ్మద్ నగర్/మహారాష్ట్ర: తమ చుట్టుపక్కల కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు చూసి కూడా గొంతెత్తి చెప్పకపోవడం నేరం అవుతుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అన్నారు. మహారాష్ట్ర కరువు పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ పటేకర్ కంటతడి పెట్టారు. పేదరికం, కరువు పీడిత రైతులు, వ్యవసాయ సంక్షోభం గురించి కాస్తంత భావోద్వేగంగానే మాట్లాడే పటేకర్ ఈసారి మాత్రం మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితిపై, రైతులు అనుభవిస్తున్న బాధలపై తీవ్ర ఆవేదన చెందుతూ కళ్లు చెమర్చారు. 'మహారాష్ట్రలోని చాలా కుటుంబాలు సిటీలకు వలస క్యూలు కడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఎవరైనా మీ కారు అద్దాలను తట్టి చేతులు జోడిస్తే వారిని భిక్షగాళ్లలాగా చూడకండి. వారంతా రైతులు, నిస్సహాయులు. వారికి ఆహారం, నీళ్లు కావాలి. టాయిలెట్లకు డబ్బు చెల్లించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి' అని ఆయన చెప్పారు. నీటి కరువు నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించకూడదని బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటనిస్తుందని, కరువును పారద్రోలుతుందని అనుకోనని, అయితే అది ఒక మంచి ముందడుగు అని చెప్పారు. 'వచ్చే రెండు నెలలు మరింత భయంకరంగా ఉండనున్నాయి. మనం ముందే తేరుకుని ఉంటే అసలు వాటర్ ట్రైన్ పంపించాల్సిన అవసరం ఉండేదికాదు. ప్రజలుగా మనం విఫలమయ్యాం. నాయకులుగా వారు విఫలమయ్యారు. అంతా ఇక్కడి పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. కానీ ఎవరూ ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. రండి వ్యవస్థను ప్రశ్నించండి. అలా మౌనంగా ఉండటం పెద్ద నేరం' అని పటేకర్ చెప్పారు. -
'నటసామ్రాట్'గా ప్రకాష్ రాజ్
తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రకాష్ రాజ్. ఇప్పటికే పలు విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న ప్రకాష్రాజ్ మరోసారి అదే తరహా పాత్రకు రెడీ అవుతున్నాడు. మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాను సౌత్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రకాష్ రాజ్. మరాఠీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా మరో ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించాడు. సినిమా నటుడిగా రిటైరైన వ్యక్తి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీజీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సతమతమయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన సినిమాను ధోని పేరుతో సౌత్లో రీమేక్ చేసిన ప్రకాష్ రాజ్, మరోసారి తానే దర్శక, నిర్మాతగా ప్రధానపాత్ర పోషిస్తూ నటసామ్రాట్ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మనవూరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్, ఆ సినిమా పూర్తయిన తరువాత నటసామ్రాట్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. -
'ఆ సినిమా తప్పక చూడాలి'
ముంబై: నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'ను ఆమిర్ ఖాన్ ప్రశంసించాడు. నానాపటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని కోరారు. 'మంగళవారం రాత్రి నటసామ్రాట్ చిత్రం చూశాను. సినిమా చాలా బాగుంది. నానాపటేకర్ నటన అద్భుతంగా ఉంది. నిజంగా నానా నటన సూపర్బ్. విక్రమ్ గోఖలే నటన ఆకట్టుకుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీసినందుకు మంజ్రేకర్, నానాపటేకర్, విక్రమ్ జీ, చిత్రయూనిట్ కు థ్యాంక్స్' అని ఆమిర్ ఖాన్ ట్విటర్ లో పేర్కొన్నాడు. స్వర్గీయ వివి శిరవాద్కర్ ప్రముఖ నాటకం కుసుమగ్రాజ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 'నటసామ్రాట్'లో గణపతి రామచంద్ర బెల్ వాకర్ పాత్రలో నానాపటేకర్ నటించాడు. విలియం షేక్స్ స్పియర్ నాటకాలతో నటసామ్రాట్ గా ఎదిగిన సీనియర్ ధియేటర్ ఆర్టిస్టు ఆ తర్వాత ఎలా పతనమైయ్యాడనే కథతో ఈ సినిమా సాగుతుంది. మేధా మంజ్రేకర్, మృణ్మమయి దేశ్ పాండే, అజిత్ పరబ్, సుశీల్ బార్వే తదితరులు ఈ చిత్రంలో నటించారు. I saw Natsamrat last night. What a film! And what an amazing performance by Nana, truly 'ase nat hone nahi'! (1/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 A must watch for all who love performances! And Vikramji has done no less. Outstanding! Both Nana& Vikramji kept me riveted throughout!(2/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 Thank you Mahesh, Nana, Vikramji, and to the entire team. (3/3) — Aamir Khan (@aamir_khan) February 17, 2016 -
శ్రీమంతుడు... నానాపటేకర్
సాక్షి, ముంబై: కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుకు తనవంతుగా కృషి చేస్తున్న బాలీవుడ్ నటుడు నానాపటేకర్.. మరో అడుగు ముందుకేశారు. మరో నటుడు మకరంద్ అనాస్పురేతో కలసి స్థాపించిన ‘నామ్’ సంస్థ తరఫున ఔరంగాబాద్ జిల్లాలోని థోందలాగావ్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహాత్మా గాంధీ జయం తి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్రామసభలో నానా పటేకర్, మకరంద్ ఈ విషయాన్ని ప్రకటించారు. మరాఠ్వాడలో నెలకొన్న కరువు పరిస్థితులపై వీరిద్దరు చొరవ తీసుకుని రైతులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరికొందరు బాలీవుడ్, మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు చెంది న వారు కూడా రైతులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలసి స్థాపించిన నామ్ సంస్థ మరాఠ్వాడలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి మరో అడుగు ముందుకేసింది. రాబోయే రోజు ల్లో కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకు సూచనలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే జల వనరులతోపాటు రైతుల కోసం కొన్ని ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నారు. రైతులతో భేటీ అవుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. నామ్ సంస్థకు మద్దతు తెలిపే వారి సంఖ్య పెరగడంతోపాటు వీరు తోడ్పాటు అందించే రైతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలిపారు. -
బాలీవుడ్ 'శ్రీమంతుడు'
సినీ తారలు ఏదో ఒక రూపంలో తమ పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. టాలీవుడ్లో శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు, శృతిహాసన్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి వారు గ్రామాలను దత్తత తీసుకోగా, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ రైతులకు తనవంతు సాయం అందించగా, తాజాగా యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా లిస్ట్లో చేరిపోయాడు. మరాఠావాడ రీజియన్లో కరువు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 180 రైతు కుటుంబాలను ఆదుకుంనేందుకు ముందుకు వచ్చాడు అక్షయ్. వీరి కోసం ఇప్పటికే 90 లక్షల రూపాయాలను డోనేట్ చేసిన ఈ రియల్ హీరో, ఈ విషయం పై స్పందిచడానికి మాత్రం నిరాకరించాడు. ఈ విషయంలో తనకు ప్రచారం అవసరం లేదన్న అక్షయ్ కుమార్, మీడియా వార్తల ద్వారా మరింత మంది ఇలా స్పందిచేలా ప్రయత్నించాలని కోరాడు. నానా పటేకర్, అక్షయ్ కుమార్లు చూపించిన ఇదే బాటలో నడిచేందుకు మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రెడీ అవుతున్నారు. -
స్ర్కీన్పై విలన్..బయట మంచి మనసు
-
బాలీవుడ్ శ్రీమంతుడు నానా పటేకర్
సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్తో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించి నిర్మించిన శ్రీమంతుడు సినిమా ఎంతో మంది నిజం శ్రీమంతులను కదిలించడం.. తద్వారా ఎన్నో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవడం తెలిసిందే. అయితే తెలుగు శ్రీమంతుడు రాకముందు నుంచే బాలీవుడ్లోనూ ఓ శ్రీమంతుడు ఉన్నాడు. ప్రిన్స్లా వేల కోట్లు లేకున్నా.. కనీస అవసరాలు పోను మిగిలిన సంపాదనంతా సొంత రాష్ట్రాం బాగు కోసం ఖర్చుచేస్తున్నాడు. దేశానికి తనదైన పద్దతిలో చికిత్స చేస్తున్నాడు.. బాలీవుడ్ నటుడు నానా పటేకర్. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు గడిచిన దశాబ్ధికిపైగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న నానా.. తన సంపాదనలో మూడింట రెండో వంతు చనిపోయిన రైతుల కుటుంబాలకు అందిస్తున్నాడు. ఇప్పటివరకు అలా దాదాపు 700 మంది మహిళలకు ఆర్థిక సాయం అందించాడు. నానా కమిట్మెట్కు ముగ్ధులైన ఆయన స్నేహితులు కొందరు మేము సైతం అంటూ విరాళాలు ఇచ్చేందుకూ ముందుకొస్తున్నారట. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురే పిలుపుతో కదిలిన తాను రైతాంగ పరిరక్షణే ధ్యేయంగా జీవిస్తానంటున్నాడాయన. 'రైతే దేశానికి వెన్నెముక అనే నానుడి నిజమనుకుంటే, ఇప్పుడు దేశం వెన్నెముక వంగిపోయింది. ఇంకా చెప్పాలంటే కృషించింది. కొ్ని ప్రాంతాల్లోనైతే పూర్తిగా చచ్చిపోయింది. అలా రైతాంగం పూర్తిగా చచ్చుబడిపోయిన ప్రాంతాల్లో ఒకటి మా మహారాష్ట్రలోని లాతూర్. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్హహత్యలకు పాల్పడుతున్న ప్రాంతమిది. కష్టాల నుంచి విముక్తి పొందొచ్చనుకునే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతడి చావుతో కష్టం పోదు కదా రెట్టింపవుతుంది. చిన్నచిన్న పిల్లలతో వితంతువులైన రైతుల భార్యలను చూస్తే మనసు తరక్కుపోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా విప్లవం వస్తుంది. తనను తాను చంపుకొనే రైతు ఇతరులను చంపలేడని మనం అనుకోవద్దు' అంటాడు నానా పటేకర్. -
నా డాన్సు చూసి నవ్వుకున్నా పర్వాలేదు
క్యారెక్టర్ ఆర్టిస్టు, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల నటుడు నానా పాటేకర్.. తన డాన్సు గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. డాన్సులలో తాను తప్పులు చేస్తానని, తన డాన్సు చూసి జనం నవ్వుకున్నా తనకు ఏమీ ఇబ్బంది లేదని అన్నాడు. తన తప్పుడు డాన్సు చూడాలంటే ప్రజలు ఇష్టపడతారని చెప్పాడు. తప్పులు చేయడానికి కూడా తాను రిహార్సల్స్ చేసుకుంటానని, దానివల్ల ధైర్యంగా తప్పు చేయొచ్చని నానా చెప్పాడు. వెల్కమ్ బ్యాక్ సినిమా గురించి మాట్లాడే సందర్భంగా నానా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నానాతో పాటు ఇంకా జాన్ అబ్రహం, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిరోజ్ ఎ నడియాడ్వాలా నిర్మించారు. ఈ సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు రావడం ఖాయమని నానా పాటేకర్ ధీమా వ్యక్తం చేశాడు.