Aliens
-
మనుషుల మధ్య ఏలియన్స్
-
గ్రహాంతరవాసుల సీక్రెట్స్ రష్యాకు తెలుసా..?
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? అన్న అంశంపై దశాబ్ధాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతర వాసులు కొన్నేళ్ల క్రితం వరకు అయితే కేవలం ఊహాజనితమైన జీవులు. కానీ కొన్ని పరిశోధనల్లోనూ...కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యాలు మాత్రం గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకో దాచి పెడుతున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో అమెరికా, రష్యా రెండూ దొందూ దొందే అంటున్నారు వారు.పదిహేనేళ్ల క్రితం నాటి మాట..రష్యాలో గ్రహాంతర వాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంత వరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ కావడంతో యుఎఫ్వో(అన్ ఐడెంటిఫైడ్ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్)లపై పరిశోధనలు చేస్తున్నవారికి కావల్సినంత మేత దొరికినట్లయ్యింది.అసలేం జరిగిదంటే..2009 జులైలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్ మెరైన్ సాగర గర్భంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్ మెరైన్ పక్కనుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ల వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్ మెరైన్ పైలట్ ఆశ్చర్యపోయాడు.సబ్ మెరైన్ లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎవరివి? శత్రుసేనలవా? అని వారు కంగారు పడ్డారు. ఆ ఆరు డిస్క్ లు విష్ణు చక్రాల్లా గిర గిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా? కొత్త రకం సబ్ మెరైన్ లా? అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. అవి మరోసారి సబ్ మెరైన్ కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్ లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ ఆరు వస్తువులు వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశంవైపు వెళ్లిపోయాయి.ఆ డిస్కులు కచ్చితంగా గ్రహాంతర వాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు.అంతరిక్షంలో ఎగరడమే కాదు నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్మెరైన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలా మంది నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్గా దాచి పెట్టింది.అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్ధం కావడంలేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలుఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లే సరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డైవర్లు ఆశ్చర్యం..భయంతో ఉండిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తోంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు కనిపించాయి. మనుషుల్లాగే కాళ్లూ చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు.ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో అర్ధం కాలేదు.గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవిలు మనుగడ సాగించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం నాలుగు దశాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్ధం కావడం లేదంటున్నారు పరిశోధకులు.ఈ గ్రహాంతర వాసులేంటో..వారి శక్తి సామర్ధ్యాలేంటో.. వారి స్పేస్క్రాఫ్ట్ల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతర వాసులు లేరని ఎలా అనేయగలం? అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్ తోనే వాటిని దాచి పెడుతోందని వారు అభిప్రాయ పడుతున్నారు. -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
ఏలియన్స్ ఉన్నాయా ?..ఎలాన్ మాస్క్ కీ కామెంట్స్..
-
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!
ఏలియన్స్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం! నాసా యూఏపీ ప్యానల్ నివేదిక ముఖ్యాంశాలు ► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్ ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం. ► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. ► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. ► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం. నాసాకు యూఏపీ ప్యానల్ సిఫార్సులు ► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. ► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి. ► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం. ► యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి. ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’ – నాసా యూఏపీ అధ్యయన బృందం ఏలియన్స్ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’ – నాసా – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న విచిత్ర పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మంగళవారం ఏకంగా చట్టసభలోనే ప్రదర్శించారు కొందరు పరిశోధకులు. అలాగే.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను చట్టసభ్యులకు నివేదించారు. అయితే ఈ పరిణామంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది. మెక్సికో పార్లమెంట్ ఏలియన్ల బాడీ వ్యవహారంలో పాదర్శకత అవసరమని నాసా అభిప్రాయపడింది. ‘‘ఇది ట్విటర్లోనే నేను చూశా. వాటి గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. మీదగ్గర అసాధారణమైనవి కనిపించినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలి. అది నిజంగా వింతదే అయితే.. శాంపిల్స్ని శాస్త్రీయ సమాజానికి అందుబాటులో ఉంచండి అంటూ మెక్సికన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డేవిడ్ స్పెర్గెల్. డేవిడ్ స్పెర్గెల్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ విభాగానికి మాజీ అధిపతి. ప్రస్తుతం యూఏపీకి అధ్యక్షత వహిస్తున్నారు.యూఏపీ అంటే unidentified anomalous phenomeno. గాల్లో ఎగిరే వింత వస్తువులు, పల్లెలు, ఆకారాలుగా ఇంతకు ముందు యూఎఫ్వో UFO(Unidentified Flying Objects) పేరుతో ఇది జనాలకు పరిచయం. అయితే యూఎఫ్వోనే ఇప్పుడు యూఏపీగా వ్యవహరిస్తున్నారు. నాసా కూడా.. మానవేతర జీవుల మనగడ వాస్తవమా? కదా? అనేవిషయంపై అధ్యయనం కోసం UAP పేరుతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటికప్పుడు తమ నివేదికలను అమెరికా ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ప్రస్తుతానికి స్పెర్గెల్ యూఏపీకి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఆ బృందానికి పూర్థిస్థాయి డైరెక్టర్ నియామకం ఉంటుందని నాసా తాజాగా ప్రకటించింది. మరోవైపు మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించిన వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెరూలోని నజ్కా ఎడారిలో కుస్కోలో గల డయాటమ్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయని, వెయ్యి సంవత్సరాల కిందటివని, గ్రహాంతరవాసులవేనని సదరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకుల్లో.. మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు అభిప్రాయపడుతుండడం గమనార్హం. మరోవైపు మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ స్పందిస్తూ.. ‘‘ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్ఏ పరీక్షల్లో స్పష్టమైందన్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదు. కాబట్టే.. గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమని నమ్మాల్సి ఉంటుంది. అని పేర్కొన్నారు. మెక్సికో కాంగ్రెస్లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. వాటికి కౌంటర్ మీమ్స్ సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్సైట్ సబ్కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్ఫోర్స్ మిషన్కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
వీడు ఏలియన్ కాదు.. మరెవరు?
ఏలియన్లు ఎలా ఉంటాయి? ఆకుపచ్చ రంగు శరీరం.. పెద్ద తల.. పెద్ద పెద్ద కళ్లు.. ఇలా ఉంటాయి.. లేదా ప్రపంచాన్ని నాశనం చేసేలా భీకర స్థాయిలో ఉంటాయి.. ఇప్పటివరకూ చాలామందికి గ్రహాంతర జీవులు అంటే మదిలో మెదిలేది ఇదే.. సినిమాలు మనకు అలాగే చూపించాయి.. ఒకవేళ నిజంగానే మన సౌర కుటుంబంలోనే ఏలియన్లు ఉంటే.. అవి ఎలా ఉంటాయి? అచ్చంగా మనిషిలాగా ఉంటాయా లేక సినిమాల్లో చూపించినట్లుగానే ఉంటాయా? దీనిపై ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు అన్నింటినీ విశ్లేషించి అంచనా వేశారు. సదరు గ్రహం/ఉపగ్రహంపై ఉండే గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి), వాతావరణం సాంద్రత, ఉష్ణోగ్రతలు వంటి అంశాల ఆధారంగా వాటి రూపురేఖలను రూపొందించారు. యూఎఫ్వోలు కనిపించడంతో.. ఇటీవల అమెరికా గగనతలంలో ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్వో)’లు కనిపించాయంటూ వార్తలు రావడం, వీడియోలు, ఫొటోలు కూడా వెల్లువెత్తడంతో.. మళ్లీ గ్రహాంతరవాసుల (ఏలియన్ల)పై చర్చ మొదలైంది. ఏలియన్లు భూమ్మీదికి రావడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. ఈ క్రమంలో మన సౌరకుటుంబంలో ఏలియన్లు ఉన్నాయా? ఉంటే ఎలా ఉండొచ్చు? అన్నదానిపై డైలీమెయిల్ వెబ్సైట్ పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఏ ఆకారంలోనైనా.. మన సౌర కుటుంబంలోనే కాదు.. విశ్వంలో లక్షల కోట్ల కొద్దీ ఉన్న నక్షత్ర మండలాల్లో ఎక్కడైనా జీవం ఉండేందుకు అవకాశం ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ గ్రహాల్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. మనుషులు, జెల్లీఫిష్లు, నత్తలు, స్క్విడ్ (ఆక్టోపస్ వంటివి)లు, ఎగిరే కీటకాలు, సూక్ష్మజీవులు.. ఇలా ఏ రూపంలో అయినా ఏలియన్లు ఉండవచ్చని అంటున్నారు. ►సౌర కుటుంబంలో అంగారక, శుక్ర గ్రహాలతోపాటు గురుడి ఉపగ్రహాలు యురోపా,గనిమీడ్, కలిస్టో.. శని ఉపగ్రహాలు ఎన్సెలాడస్, టైటాన్.. నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్, మరుగుజ్జు గ్రహం సెరెస్లపై జీవం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ►భూమిని పోలిన పరిస్థితులు, వాతావరణం ఉన్నచోట.. భూమ్మీది తరహాలోనే విడిగా తల, కాళ్లు, చేతుల వంటి అవయవాలు, పెద్ద మెదడుతో కూడిన జీవులు ఉండొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాలియాంటాలజిస్ట్ సిమన్ కోన్వే మోరిస్ తెలిపారు. ఒకవేళ నక్షత్రానికి దూరంగా ఉండి, కాంతి తక్కువగా పడే గ్రహాల్లో అయితే కళ్లు బాగా పెద్దవిగా ఉంటాయన్నారు. అయితే ఆ జీవుల ఆకారం మనుషుల్లా ఉండొచ్చు, లేకపోవచ్చని పేర్కొన్నారు. ►ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఒకవేళ సౌర కుటుంబంలోనే జీవాన్ని కనుగొన్నా అవి ఏక కణ సూక్ష్మజీవులే అయి ఉంటాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ ఆండ్రూ కోట్స్ స్పష్టం చేశారు. కానీ విశ్వంలోని కోట్లాది నక్షత్ర లాల్లో చాలా చోట్ల ఏలియన్లు జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. భూమిలా ఉంటే.. భూమిపై ఉన్నట్టుగానే కాస్త అటూఇటూగా గ్రావిటీ, వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటే.. ఏలియన్లు మనుషుల మాదిరిగానే ఉండే అవకాశాలు ఎక్కువ. గ్రావిటీ ఎక్కువగా ఉంటే.. భూమికన్నా పరిమాణంలోపెద్దగా ఉండే గ్రహాల్లో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పరిస్థితులు భూమిలా ఉన్నా, గ్రావిటీ ఎక్కువుంటే.. ఏలియన్లు ఎత్తు తక్కువగా, దృఢమైన కండరాలతో కూడి ఉంటాయి. గ్రావిటీ తక్కువగా ఉంటే.. చిన్నగా ఉండే గ్రహాలు/ ఉపగ్రహాల్లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చోట తేలికగా, ఎక్కువ ఎత్తుతో, బలహీనమైన కండరాలతో కూడిన జీవులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. వాతావరణం తక్కువగా ఉంటే.. గ్రహం/ఉపగ్రహం సైజుతో సంబంధం లేకుండా, వాతావరణం తక్కువ సాంద్రత (డెన్సిటీ)తో ఉంటే.. తక్కువ బరువుతో, చాలా పెద్ద రెక్కలతో కూడిన ఏలియన్లు ఉండొచ్చు. నిండా మంచుతో కప్పి ఉంటే.. గురుడి ఉపగ్రహం యూరోపా మాదిరిగా మొత్తంగా మంచుతో కప్పబడి, దాని దిగువన నీటి సముద్రాలు ఉంటే.. పీతలు, ఆక్టోపస్ల వంటి ఆకారాల్లో ఏలియన్లు ఉండేందుకు చాన్స్ ఎక్కువ. పొడిగా ఉండే గ్రహాలైతే.. శుక్రుడు, మార్స్ వంటి పొడిగా ఉండే వాతావరణ పరిస్థితులు ఉన్న గ్రహాలు/ఉపగ్రహాల్లో జీవం సూక్ష్మజీవుల తరహాలో ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు. వాతావరణం అనుకూలంగా మారితే పరిణామక్రమంలో ఎదిగి.. పెద్దస్థాయి జీవులుగా మారొచ్చు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఏలియన్స్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన వైట్హౌజ్
వాషింగ్టన్: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. వైట్హౌజ్ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్వోల వాదనను కొట్టిపారేసింది. కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్హౌజ్ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది మాత్రం క్లియర్ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్మీట్లో నవ్వులు పూయించారు కూడా. ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్స్పేస్లో రెండు, కెనడా ఎయిర్స్పేస్లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన. -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
Mars Doorway: అంగారకుడి మీద ‘తలుపు’ మిస్టరీ వీడింది
అంగారక గ్రహం మీద తలుపులాంటి నిర్మాణం(డోర్వే) ఉన్న ఓ ఫోటోను తాజాగా నాసా విడుదల చేసింది. మార్స్ రోవర్ క్యూరియాసిటీ తీసిన ఈ ఫొటోలో ఒక పెద్ద బండరాయికి ఎవరో చెక్కినట్లు ఉన్న ఆ తలుపు నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఇది ఏలియన్లు నిర్మించిందేంటూ ప్రచారం మొదలైంది. మార్స్ మీద ఏలియన్ల ఉనికి ప్రచారం ఈనాటిది కాదు. తరచూ ఏలియన్ల ఉనికిని ప్రస్తావిస్తూ బోలెడన్ని కథనాలు వెలువడేవి. అయితే తాజాగా బయటపడిన తలుపు తరహా నిర్మాణం మాత్రం ఆ వాదనను బలంగా సమర్థించింది. అది ఏలియన్ల పనేనంటూ వాదించడం మొదలుపెట్టారు కొందరు. ఈ తరుణంలో డోర్వే మిస్టరీని చేధించే పనిలోకి దిగారు పరిశోధకులు. చివరికి అదొక రాయి భాగం మాత్రమే అని తేల్చారు. సాధారణంగా.. అంగారకుడి మీద భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం సంభవించినట్లు నాసా గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి రాయి భాగం ఏదైనా ఆ తరహా నిర్మాణంలో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు రోవర్ దానిని ప్రత్యేకమైన యాంగిల్లో ఫొటో తీయడం వల్లే.. అదంతా ప్రత్యేకంగా ఏదో తలుపు నిర్మాణం లాగా కనిపించింది. మార్స్పై ఇలాంటి భాగాలు చాలానే ఉన్నాయని నాసా నిర్ధారించింది. ఇక డోర్ తరహా బండరాయి ఫొటోల ద్వారా చూడడానికి పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అది సెంటీమీటర్లు లేదంటే ఇంచుల్లో మాత్రమే ఉంటుందని, అదేంటో పూర్తిస్థాయిలో అంచనాకి రావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా స్పష్టం చేస్తోంది. చదవండి: చంద్రుడిపై పచ్చదనం.. మొలకెత్తిన విత్తనాలు -
ఒడ్డున ‘వింత’ జీవి కళేబరం వైరల్! వీడిన మిస్టరీ
సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పే బ్లాగర్స్ కొందరు ఈమధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఫాలోవర్స్ను పెంచుకోవాలనే ఉద్దేశంతో అడ్డమైన విషయాలపైనా చర్చలు తీస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ యంగ్ బ్లాగర్ ఆస్ట్రేలియా సముద్ర తీరం ఒడ్డున పడి ఉన్న ఓ కళేబరాన్ని చూపిస్తూ వీడియో తీశాడు. దీంతో అది ఏలియన్ కళేబరం అంటూ పెద్ద దుమారమే చెలరేగింది. క్వీన్స్లాండ్లో సన్షైన్ తీర ప్రాంతం కాటన్ ట్రీ బీచ్ ఒడ్డులో వింత జీవి.. అంటూ అలెక్స్ టాన్ అనే పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకు ముందు తాను ఏనాడూ ఇలాంటీ జీవిని చూడలేదని, కనీసం దాని పేరు కూడా వినలేదని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. పలు సందేహాలు వ్యక్తం చేస్తూనే.. ఆ జీవి ఏంటో మీరైనా చెప్పాలంటూ ఫాలోవర్స్ను కోరగా.. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by ALEX TAN (@tanalex) బహుశా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండొచ్చా? అనే సందేహాన్ని సైతం వ్యక్తం చేశాడు ఆ వీడియోలో అలెక్స్. దీంతో చాలా మంది ఫాలోవర్స్.. అతని వాదనతోనే ఏకీభవించడం మొదలుపెట్టారు. అలా.. బీచ్లో వింత జీవి, ఏలియన్ మృతదేహం అంటూ థంబ్ నెయిల్స్ కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ జాన్స్టన్ ఆ తిక్క కథనాలను కొట్టిపారేశారు. దాన్కొక ‘పోసమ్’ (Possum)గా తేల్చారు. వరదలతో బహుశా అది అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని చెబుతున్నారాయన. పోసమ్లు శాకాహారి జీవులు. పువ్వులు, పండ్లు, ఆకులు తింటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతాలతో పాటు న్యూజిలాండ్లోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా సిడ్నీలో చెట్లపై జీవిస్తూ.. మనుషులతో మమేకం అవుతుంటాయి ఇవి. ఒక్కోసారి సముద్ర తీరాలకు వెళ్తూ.. ప్రమాదం బారిన పడుతుంటాయి కూడా. View this post on Instagram A post shared by Whitecliffs Foreshore Reserve (@whitecliffsforeshorereserve) -
గ్రహాంతరవాసులు ఉన్నారా ?
-
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఏలియన్స్ జాడ కోసం వేదాంత వేత్తలను నియమించుకుంటున్న నాసా..!
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వేదాంత వేత్తల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని నాసా కోరినట్లు సమాచారం. ఈ నెల డిసెంబర్ 26న హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ కంటే అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ను అంతరిక్షంలోకి నాసా, యూరోప్ దేశాలు ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వం పుట్టుకతో పాటు, ఏలియన్స్ జాడ కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తుంది. (చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!) -
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!
కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. పైగా వాళ్లు చేసే విచిత్రమైన పనులతో అందర్నీ ఇబ్బందులకు గురి చేసి కటకటాలపాలవుతుంటారు కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి గ్రహాంతర వాసులును చూసేందుకు అంటూ హాస్యగాడి వలే విచిత్రమైన ముసుగు ధరించి ఎయిర్పోర్టుకు వెళ్లి అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తాడు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే... మాథ్యూ హాన్కాక్ అనే వ్యక్తి గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నానంటూ నెవెడాలో లాస్ వేగాస్లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తాడు. పైగా విమానాశ్రయంలోకి నిబంధనలకు విరుద్ధంగా చొరబడబటమే కాక గ్రహాంతర వాసలు ఉండే ప్రసిద్ధ ప్రాంతం అయిన ఏరియా 51కి వెళ్లేందుకు విమానాన్ని హైజాక్ చేస్తున్నాను అని అక్కడ ఉన్న పోలీసులతో చెబుతాడు. అంతేకాదు అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న భద్రతా విభాగాన్ని నకిలీ బాంబుతో బెదిరిస్తాడు. ఈ మేరకు హాన్కాక్ కారుతో సహా ఎయిర్పోర్ట్లోని విమానాల పార్కింగ్ వద్దకు వచ్చేయడమే కాక తన కారులో షాట్గన్, గ్యాసోలిన్ వంటి ఆయుధాలు ఉన్నాయంటూ అక్కడ ఉన్నవారందర్నీ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేస్తాడు. దీంతో ఎయిర్పోర్ట్లో ఉన్న ఉద్యోగులంతా భయంతో పరుగులు పడుతుంటారు. అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లాస్వేగస్లోని రద్దీ వీధుల్లో ఒక లగ్జరీ కారుని నిర్లక్ష్యంగా నడుపుత్నుట్లు టిక్టాక్లో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని తానెనంటూ అక్కడ ఉన్న పోలీసులకు చెబుతాడు. అంతేకాదు తనను గ్రహాంతర వాసులు ఎంచుకున్న వ్యక్తిగా సంబోధించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తాడు. దీంతో పోలీసులు హాన్కాక్ని అదుపులోకి తీసుకోవడమే కాక నకీలి బాంబుతో బెదిరింపులకు పాల్పడినందుకు ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్మనీ!!) -
మారకుంటే మరుభూమే!
ఇంట్లోంచి బయటికెళ్లాలంటే ఒంటి నిండా సూట్.. అదీ ఎయిర్ కూల్ది. చిన్నవాగుల్లా మారిపోయిన పెద్ద నదులు.. మామూలు పొలాలన్నీ మాయం.. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటల సాగు.. వాటికి డ్రోన్లతో నీటి సరఫరా.. ఇదంతా ఆదిత్య 369 చిత్రంలో ‘సింగీతం’ చూపించిన భవిష్యత్ ఊహాలోకం. ఆ సినిమాలోనే కాదు.. నిజంగానే మన భవిష్యత్ అలా ఉండబోతోందని.. మన భూమి మీద మనమే గ్రహాంతర వాసుల్లా జీవించాల్సి వస్తుందని తాజా పరిశోధన చెబుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా.. –సాక్షి, సెంట్రల్డెస్క్ ‘2100’ అంచనాలు చాలవు! ఓవైపు అడవుల నరికివేత.. మరోవైపు కాలుష్యం.. పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు.. అన్నీ కలగలిసి రోజురోజుకూ వాతావరణం మారిపోతోంది. భూమి వేడెక్కి (గ్లోబల్ వార్మింగ్).. ఓవైపు తీవ్ర కరువు కాటకాలు, మరోవైపు వరదలు, తుపానులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అడవుల నరికివేత ఆపడం, మరింతగా అడవులు పెంచడం, భూమి వేడెక్కేందుకు కారణమయ్యే గ్రీన్హౌజ్ వాయువుల (కర్బన ఉద్గారాల)ను తగ్గించడమే దీనికి పరిష్కారం. ఈ దిశగానే పారిస్లో జరిగిన ‘ఐపీసీసీ (ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్)’ సదస్సు ఇటీవల పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2100వ సంవత్సరం నాటికి భూమి ఉష్ణోగ్రతలో పెరుగుదలను గరిష్టంగా 2 డిగ్రీలకు పరిమితం చేయాలని అన్నిదేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. కానీ ఈ లక్ష్యాలు సరిపోవని.. భూమిపై జీవనం ప్రమాదంలో పడుతుందని ‘యూఎన్ ఎన్డీసీ (యునైటెడ్ నేషన్స్ అసెస్మెంట్ ఆఫ్ నేషనల్ డెటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్)’ నివేదిక స్పష్టం చేస్తోంది. గ్రహాంతర వాసుల్లా బతకాల్సిందే.. 2500 సంవత్సరం నాటికి మన భూమే మనం ఊహించనంతగా మారిపోతుందని.. మనమే గ్రహాంతర వాసుల్లా బతికే పరిస్థితి వస్తుందని పర్యావరణ సామాజిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ లియోన్, ఆయన సహ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం చల్లగా ఉండే శీతల ప్రాంతాలు వేడెక్కి ఉష్ణమండల ప్రాంతాల్లా మారిపోతాయని.. ఇప్పుడున్న ఉష్ణమండల ప్రాంతాలు మనుషులు జీవించలేని దుర్భర వేడి ప్రాంతాలుగా మారుతాయని స్పష్టం చేశారు. భూమ్మీద వివిధ ప్రాంతాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ల కిందటి పరిస్థితులు, ప్రస్తుతమున్న తీరు, 2500 నాటికి పరిస్థితులను చిత్రాలతో సహా వివరించారు. భవిష్యత్తు అత్యంత ప్రమాదకరం వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్పై జరుగుతున్న పరిశోధనలు, లక్ష్యాలన్నీ కూడా 2100 సంవత్సరాన్నే అంచనాలకు ఆధారం (బెంచ్ మార్క్)గా తీసుకుంటున్నాయని యూఎన్ ఎన్డీసీ పేర్కొంది. ప్రపంచ దేశాలు ‘ప్యారిస్ ఐపీసీసీ’ ఒప్పందాన్ని అమలు చేసినా.. ప్రయోజనం తక్కువేనని స్పష్టం చేసింది. భూమి సగటు ఉష్ణోగ్రత 2100 నాటికే 2.2 డిగ్రీల మేర పెరిగితే.. అది 2500వ సంవత్సరం నాటికి 4.6 డిగ్రీలకు చేరుతుందని పేర్కొంది. ఇది భూవాతావరణంలో, వృక్ష, జంతుజాలంలో అత్యంత తీవ్రస్థాయిలో మార్పులకు దారితీస్తుందని వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కమ్ముకుంటాయని హెచ్చరించింది. అందువల్ల మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని.. 2500వ సంవత్సరాన్ని మన లక్ష్యాలు, అంచనాలకు ఆధారంగా తీసుకోవాలని సూచించింది. ఇవి చూసైనా మారుతారని..: ఐదు శతాబ్దాల తర్వాతి పరిస్థితిని ఇలా చూసి అయినా గ్లోబల్ వార్మింగ్, కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంగా ప్రభుత్వాలు, ప్రజల్లో మార్పు వస్తుందేమో అన్నదే ఈ చిత్రాల ముఖ్య ఉద్దేశమట. భారత్లో చండ్ర నిప్పులే.. ►ఇక్కడున్న చిత్రాల్లో మొదటిది ఐదు శతాబ్దాల కిందటి భారతదేశంలో పరిస్థితిని చూపుతోంది. గ్రామాల్లో వ్యవసాయం, వరి పంట, పశువుల వినియోగం, జీవావరణం కలిసి ఉన్న దృశ్యమిది. ►రెండో చిత్రం ప్రస్తుత కాలానిది. అడవులు తగ్గిపోయి.. సాగులో సంప్రదాయ, ఆధునిక మౌలిక సదుపాయాల కలబోతగా ఉన్నది. ►మూడోది భవిష్యత్ (2500 ఏడాది)ను చూపుతోంది. పచ్చదనం తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు, ఎండలు విపరీతంగా పెరిగి.. శరీరాన్ని పూర్తిగా కప్పేస్తున్న సూట్లో బయటికి రావాల్సిన పరిస్థితి. పెరిగిన సాంకేతికతతో రోబోటిక్ వ్యవసాయం చేస్తారని అంచనా. అమెజాన్ నది.. చిన్న వాగులా.. ►ఈ చిత్రం అమెజాన్ నది, దానివెంట ఉన్న భారీ అడవిని చూపుతోంది. ఐదు శతాబ్దాల కింద పూర్తిగా పచ్చదనంతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ►అక్కడ ప్రస్తుతమున్న పరిస్థితి చూపుతున్నది రెండో చిత్రం. అభివృద్ధి పేరిట వేసిన రోడ్లు, ఇతర నిర్మాణాలతో తగ్గిపోయిన పచ్చదనం కనిపిస్తోంది. ►మూడో చిత్రం భవిష్యత్తు భయానక దుస్థితిని చూపుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్ నది చిన్నవాగులా మారిపోవడం, అంత దట్టమైన అడవి నామరూపాల్లేకుండా పోవడం, పంటలు కూడా లేకుండా నిర్జీవంగా మారిన దుస్థితి కనిపిస్తోంది. -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
పెంగ్విన్లు ఏలియన్లా?
ఏలియన్స్ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్ పక్షులట. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దామా? ఉండటమే చిత్రంగా.. భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది. శుక్రగ్రహంలోని రసాయనం యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఫాస్పైన్.. వెరీ డేంజర్ ఫాస్పైన్ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు. కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు. ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా? పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్, అవునా.. నిజమా?!
గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్లు స్పేస్లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.. అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది. చదవండి: వారెవ్వా.. ఖగోళంలో మునుపెన్నడూ చూడని దృశ్యం ఇది -
అమెజాన్ బాస్ మెడకు ‘ఏలియన్’ లింక్!
కొందరు ఎదుటివాళ్ల సక్సెస్ను ఓర్చుకోలేరు. అమెరికాలో అలాంటి బ్యాచ్ ఒకటి ‘కుట్ర సిద్ధాంతకర్తలు’గా కొన్ని సంవత్సరాల నుంచి మనుగడ కొనసాగిస్తోంది. వీళ్లు అమెరికా ప్రభుత్వం, పౌరులు సాధించే ఓ విజయాన్ని భరించలేరు. వాటికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుంటారు. వీళ్లు చెప్పే థియరీలు ఒక్కోసారి తట్టుకోలేని రేంజ్లో ‘అబ్బో’ అనిపిస్తుంటాయి. అలాంటి ఓ థియరీని అమెజాన్ బాస్ మెడకు చుట్టేశారు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చి వారం తిరగలేదు. అప్పుడే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గురించి తిక్క వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కుట్ర సిద్ధాంతకర్తలు చెప్పేది ఏంటంటే.. అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్ను ఏలియన్లు కిడ్నాప్ చేశాయట. ఆయన ప్లేస్లో ఏలియన్ డబుల్ బాడీని తిరిగి భూమ్మీదకు పంపించాయట. కావాలంటే ఆయన మెడ చూడడండి ఎలా సాగిలపడి ఏలియన్లా ఉందో అంటూ ఏవో ఆధారాలు చూపెడుతున్నారు వాళ్లు. ఈ థియరీని అమెజాన్ ‘ఛీ’ కొట్టేసింది. పదకొండు నిమిషాల గ్యాప్లో.. అదీ తోడుగా సభ్యులు ఉండగా జరిగిందన్న ఏలియన్ కిడ్నాప్ వ్యవహారం ఒక పిచ్చి వాదన అని అంతా తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు ఈ కిడ్నాప్ ద్వారా భూమ్మీద పట్టుసాధించాలని ఏలియన్లు ప్రయత్నిస్తున్నాయనే తట్టుకోలేని మరో వాదనను సైతం వీళ్లు లేవనెత్తుతున్నారు. ప్చ్... -
సౌర కుటుంబంలోనే ఎలియన్స్!
కొన్ని వందేళ్ల ఏళ్ల తర్వాత.. సరదాగా అలా అంతరిక్షంలోకి టూర్కు వెళ్లొచ్చే టెక్నాలజీ వచ్చేసింది.. చంద్రుడి మీదకు, అంగారకుడి (మార్స్) మీదకు వెళ్లినవాళ్లు.. ఇంకాస్త లాంగ్ టూర్ వేద్దామని శనిగ్రహం దాకా వెళ్లారు.. దాని ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్సలాడెస్పై దిగారు.. అక్కడ వారిని ఏలియన్స్ బంధించాయి.. మనుషులు ఎలాగోలా తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. ఇదంతా హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా.. భవిష్యత్తులో నిజం కూడా కావొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశాలు ఎక్కువని చెప్తున్నారు. మరి ఈ సంగతులేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మనం ఒంటరి వాళ్లం కాదు కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు.. పెద్ద సంఖ్యలో గ్రహాలు.. ఇంత విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా? భూమి అవతల ఎక్కడైనా జీవం ఉందా? ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్నలివి. అందుకే సౌర కుటుంబంలోగానీ, బయట ఇంకెక్కడైనాగానీ జీవం ఉందేమో అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జీవం ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే నాసా ప్రయోగించిన కాస్సిని వ్యోమనౌక అందించిన సమాచారంతో ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశం ఉందని తాజాగా అంచనా వేశారు. ఎన్సలాడెస్ ఏంటి? భూమికి చంద్రుడు ఉన్నట్టే ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. అలా శనిగ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటి ఎన్సలాడెస్. దీని మీద 32.9 గంటలకు ఒక రోజు గడుస్తుంది. మన చంద్రుడిలో ఏడో వంతు ఉండే ఈ ఉపగ్రహం వ్యాసార్థం (డయామీటర్) సుమారు 500 కిలోమీటర్లు. దీని ఉపరితలం మొత్తం 30 కిలోమీటర్ల మందమైన మంచు పొరతో కప్పబడి ఉందని, మంచుకు, మట్టి ఉపరితలానికి మధ్య మంచి నీళ్లు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు కాస్సిని వ్యోమనౌక సహాయంతో కొన్నేళ్ల కిందే తేల్చారు. ఎన్సలాడెస్ ఉత్తర ధ్రువంలోని వేడినీటి ఊటల నుంచి భారీగా నీటి ఆవిరి అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్నట్టు గుర్తించారు. ఆ నీటి ఆవిరిలో మిథేన్ ఉందని తేల్చారు. దీనిపై అరిజోనా, పారిస్ సైన్సెస్ అండ్ లెట్రెస్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. తాజాగా ఆ వివరాలను వెల్లడించారు. మిథేన్.. జీవం ఉనికికి సాక్ష్యం సౌర కుటుంబంలోగానీ, అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు వేటిలోగానీ సహజంగా మిథేన్ వాయువు ఉండదు. ఇది జీవక్రియల్లో భాగంగానే వెలువడుతుందని, జీవజాలం ఉన్నచోట మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎన్సలాడెస్ నుంచి మిథేన్ గ్యాస్ విడుదలవడానికి అక్కడ మెథనోజెన్స్గా పిలిచే సూక్ష్మజీవులు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు. ‘‘భూమ్మీద సముద్రాల అడుగున ఈ మెథనోజెన్స్ ఉంటాయి. అవి డైహైడ్రోజన్, కార్బన్డయాౖక్సైడ్ను ఉపయోగించుకుని మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఎన్సలాడెస్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిలో డైహైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్తోపాటు మిథేన్ కూడా గణనీయ స్థాయిలో ఉంది. ఎన్సలాడెస్ పై దట్టమైన మంచుపొర, దాని కింద లోతున నీళ్లు ఉన్నాయి. అంటే భూమ్మీద సముద్రాల అడుగున ఉండేలాంటి పరిస్థితే అక్కడా ఉంది. ఈ లెక్కన సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు ఎక్కువే.. ’’ అని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ రెజిస్ ఫెర్రీర్ వెల్లడించారు. కాస్సిని గుర్తించిన వాయువుల ఆధారంగానే కాకుండా.. ఎన్సలాడెస్పై ఉండే వాతావరణం, రసాయనిక పరిస్థితులను గణిత మోడళ్ల ఆధారంగా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. సూక్ష్మజీవులు ఉంటే చాలా? భూమ్మీద కూడా జీవం మొదలైంది సూక్ష్మజీవుల నుంచే.. మొదట్లో భూమి వాతావరణం, నేలపొరల్లో పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన రసాయనిక సమ్మేళనాల నుంచే జీవ పదార్థం పుట్టింది. తొలుత ఏర్పడిన ఏకకణ జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ.. ఇంత విస్తారమైన జీవజాలం రూపొందింది. ఇప్పుడు ఎన్సలాడెస్పై కూడా సూక్ష్మజీవులు ఉండి ఉంటే.. అక్కడ భవిష్యత్తులో జీవం అభివృద్ధికి అవకాశం ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యురోపాపైనా పరిశోధనలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల్లో..భూమి,ఎన్సలాడెస్తోపాటు గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యురోపాపై కూడా మంచు, నీళ్లు ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉండవచ్చన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
గ్రహాంతర తాప్సీ!
కిక్ ఇచ్చే కాన్సెప్ట్ దొరికితే కాదనుకుండా పచ్చజెండా ఊపేస్తారు నటీనటులు. తాప్సీ ఇటీవల అలా కిక్ ఇచ్చే కాన్సెప్ట్ విన్నారట. చెప్పింది తమిళ దర్శకుడు భరత్ నీలకంఠన్. రెండేళ్ల క్రితం ‘కే 13’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు భరత్. తాజాగా ఆయన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కథ రాసుకున్నారట. ఇందులో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో ఏలియన్స్ ప్రస్తావన ఉంటుందట. ఈ గ్రహాంతర వాసుల కథ వినగానే తాప్సీ మరోమారు ఆలోచించకుండా ఒప్పేసుకున్నారని సమాచారం. బహు భాషల్లో ఈ సినిమా చేయడానికి భరత్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. భారీ బడ్జెట్తో రూపొందించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సాంకేతిక నిపుణులనే తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ మూవీగా తీయాలన్నది టీమ్ ఆశయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క విజువల్ ఎఫెక్ట్స్కే దాదాపు రూ. 10 కోట్లు ఖర్చవుతుందట. ఈ ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణను ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది. -
వైరల్ వీడియో: దెయ్యం! ఏలియన్! లేక..
-
బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే..
రాత్రిపూట బ్రిడ్జ్పై వింత ఆకారం తిరుగుతున్నట్లు వీడియో ఒకటి ఇంటర్నెట్లో, మీడియా చానెల్స్లో కథనాలు ప్రసారం అవుతోంది. ఆ టైంలో కొందరు బైకర్స్ వీడియో తీసి వైరల్ చేయడంతో అది అంతటా పాకింది. అది ఏలియన్ అని కొందరు, కాదు బ్రిడ్జ్ దగ్గర్లో శ్మశానం ఉండడంతో దెయ్యం అని మరికొందరు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. రాంచీ: బ్రిడ్జ్ మీద వింత ఆకారం పేరుతో వీడియో ఒకటి విపరీతంగా షేర్ అవుతున్న విషయం తెలిసిందే. హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద ఇది జరిగిందని ప్రచారం నడుస్తోంది. మే 28న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని అక్కడి లోకల్ మీడియా ఛానెల్స్ కథనాల్ని ప్రచురించాయి. దీంతో పంజాబ్ కేసరి ఫేస్బుక్ ఛానెల్ ఆ వీడియోను అప్లోడ్ చేసి.. వింత ఆకారం సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారంటూ పోస్టులు పెట్టడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు విషయం చేరింది. అయితే వైరల్ వీడియో తమ దృష్టిలోకి వచ్చిందని హజారిబాగ్లోని పెలావాల్ స్టేషన్ ఇన్ఛార్జి వికర్ణ కుమార్ తెలిపారు. ‘‘సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఇక ఫ్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిల మీదా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామమని వెల్లడించారు. కాగా, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఆ బ్రిడ్జ్కి వంద మీటర్ల దూరంలో ఓ వ్యక్తి బట్టలు లేకుండా తిరిగే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. బహుశా అతని వీడియోను మార్ఫింగ్ చేసి ఎవరైనా ఉత్త ప్రచారానికి తెరలేపి ఉండొచ్చని కొందరు యువకులు అనుమానిస్తున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి వీడియోను అయినా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేమోనని.. ఈ వీడియోపై త్వరలోనే పూర్తి నిజాలు తేలుస్తాం వికర్ణ తెలిపారు. జోకులు రాత్రి పూట బ్రిడ్జ్పై వెళ్తున్న కొందరు ఆ ఆకారం దగ్గరకు వెళ్లగానే ‘‘దెయ్యం దెయ్యం’’ అంటూ అరుస్తూ వీడియో షూట్ చేశారు. ఇక జార్ఖండ్ వైరల్ వీడియోపై సోషల్ మీడియా సరదా కామెంట్లతో నిండిపోయింది. ఇది ఫ్రాంక్స్టర్ల పని కావొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్ మాయాజాలం అయ్యి కూడా ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయని, అయినా ఏలియన్లు అమెరికాలో తప్ప ఈ భూమ్మీద ఇంకెక్కడ కనిపించవని జోకులు వేస్తే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడండంటూ నాసాకి, ఎలన్ మస్క్కి ట్యాగులు చేస్తున్నారు. చదవండి: మోదీసార్.. మాకెందుకీ కష్టాలు -
‘ఏలియన్స్ నన్ను 50 సార్లు కిడ్నాప్ చేశారు’’
వాషింగ్టన్: ఈ సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని.. అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓలను చూశామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మహిళ ఏకంగా ఏలియన్స్ తనను ఇప్పటి వరకు 52 సార్లు కిడ్నాప్ చేశాయని.. వాటి సాంకేతికతను తనకు చూపించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సదరు మహిళ వ్యాఖ్యలు మరోసారి గ్రహాంతర జీవుల ఉనికిపై ఆసక్తి రేకేత్తించాయి. ఆ వివారలు.. పౌలా అనే మహిళ బాల్యం నుంచి ఇప్పటి వరకు దాదాపు 52 సార్లు ఏలియన్స్ తనను కిడ్నాప్ చేశాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘బాల్యం నుంచి ఇప్పటి వరకు 52 అసాధారణ అనుభవాలను ఎదుర్కొన్నాను. వాటి గురించి ఎలాంటి హెచ్చరిక లేదు.. కనీసం ముందస్తు సూచన కూడా లేదు. అలా జరిగిపోయాయి. సాధరణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అవి కూడా అలానే జరిగాయి’’ అన్నారు పౌలా. 1982లో తొలిసారి కిడ్నాప్... ‘‘నా జీవితంలో మొదటిసారి 1982 తొలిసారి స్పేస్షిప్ను చూశాను. కొన్ని క్షణాల తర్వాత నేను దాని లోపల ఉన్నాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. స్పేస్షిప్ లోపలంతా సైలెంట్గా ఉంది. నా హార్ట్బీట్ నాకే వినిపించేంత నిశ్శబ్దంగా ఉందక్కడ. కళ్లునులుముకుని చూసినా ఏం కనిపించడం లేదక్కడ. ఇంతలో ఓ వింత ఆకారం నా కళ్ల ముందుకు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు పౌలా. ‘‘దానికి మూడు చేతులున్నాయి. ప్రతి చేతి చివర్లో ఓ లైట్ ఉంది. మొత్తం మూడు లైట్లలో ఒకటి ఆకుపచ్చ, మరోకటి నీలం.. ఇంకో రంగు నాకు గుర్తు లేదు. నేను ఉన్న స్పేస్షిప్ విమానం ప్రొపెల్లర్ బ్లేడ్లాగా ఉంది. ఇది సుమారు 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో.. నల్లగా ఉంది. దాని చివర్లలో నీలం, ఆకుపచ్చ రంగులు కనిపిస్తున్నాయి. ఆ స్పేస్షిప్ నిశ్శబ్దంగా.. క్లాక్వైజ్గా తిరుగుంది’’ అంటూ వర్ణించారు పౌలా. ఆ ఫోటోలు మనిషి అత్యాశకు నిదర్శనం.. ‘‘ఆ వింత ఆకారాలను చూసి నేను భయపడ్డాను. పారిపోవాలని ప్రయత్నించాను. కానీ అదేంటో అక్కడ నాకు పట్టు దొరకడం లేదు. ఇసుకలాగా జారిపోతున్నట్లు అనిపించసాగింది. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. ఇక ఆ ఏలియన్స్ నాకు తమ సాంకేతికతను చూపించసాగాయి. స్లైడ్షో ద్వారా తొలుత అందమైన చిత్రాలను చూపించాయి. వాటిలో నిర్మలమైన నది, నీలాకాశం కనిపించాయి. ఆ తర్వాత వచ్చిన ఫోటోల్లో నల్లగా మారిపోయిన నది.. ఎర్రగా మారిన ఆకాశం గోచరించాయి. మనిషి దురాశ వల్ల భూమి ఇలా మారిపోతుందని నేను గ్రహించగలిగాను. ఆ తర్వాత అంతా నల్లగా మారిపోయింది. నాకు మెలకువ వచ్చేది’’ అని తెలిపారు పౌలా. ‘‘నా బాల్యం నుంచి నాకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఏలియన్స్ నా బెడ్రూమ్ కిటికి గుండా నన్ను తమతో పాటు తీసుకెళ్లేవి. ఈ సంఘటన జరిగిన ప్రతిసారి నేను నాలుగు గంటల పాటు కనిపించకుండా పోయేదాన్ని. నా తల్లిదండ్రులు నా కోసం గాలించేవారు. ఆ తర్వాత నేను బెడ్రూంలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయేవారు’’ అంటూ చెప్పుకొచ్చారు పౌలా. తాను చూసిన ఏలియన్స్ ఎలా ఉంటాయో ఊహాచిత్రం గీయించారు పౌలా. ఇక ఏలియన్స్ తనను కిడ్నాప్ చేసిన సమయంలో అయిన గాయాలను కూడా చూపించారు పౌలా. కొందరు ఈమె మాటలను కొటి పారేస్తుండగా చాలా మంది మాత్రం నిజమే కాబోలు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? మార్స్పై ఏలియన్స్? -
ఏలియన్స్ నిజంగానే ఉన్నారా?
ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత అధునాతన టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఇప్పడు ఈ టెక్నాలజీ నుంచి ఏలియన్స్ కూడా తప్పించుకోలేకపోయాయి. ఏలియన్స్ సంబందించి ఒక లీకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి. ఈ వీడియోను గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్న వారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దీనిపై స్పందించింది. లీకైన ఫొటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బందే తీశారని చెప్పింది. ఐతే వాటిలో ఉన్నది యూఎఫ్ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్ఎ టుడే ప్రకారం యుఎస్ ప్రభుత్వం యుఎఫ్ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by JEREMY KENYON LOCKYER CORBELL (@jeremycorbell) ఈ వీడియోలు, ఫొటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి లీక్ అయ్యాయి. గత రెండేళ్లుగా పెంటగాన్ అధికారులు ఏలియన్స్ ఉన్నాయి అనేలా ప్రకటనలు చేస్తున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ సడెన్గా మాయమవుతున్న ఆ విచిత్ర వస్తువులు ఏంటన్నది ఎవరికి తెలియట్లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
మార్స్పై ఏలియన్స్?
ఏలియన్స్, స్పీసిస్ తదితర సినిమాలు చూస్తే గ్రహాంతరవాసులు మనపై దాడికి వస్తారని భావించే ప్రజలున్నారంటే నమ్ముతారా? మనదగ్గర ఉండకపోవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో ఈ నమ్మకాన్ని ఒక మతంలాగా పాటించేవారు కోకొల్లలు. నిజంగా మనం కాకుండా విశ్వంలో జీవం ఉందనేది నిరూపణ కాని ఊహ మాత్రమే! మనిషి ఎంత విజ్ఞానం సాధించానని భావించినా అతని మనసులో ఒక వెలితి తీరట్లేదు. ఈ విశాల విశ్వంలో తాను ఒంటరినా? కనీసం సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై జీవం ఉందా? ఉంటే మన కన్నా ఎక్కువ తెలివైనవా? లేక అల్పజీవులా?.. ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధానాలు ఇంకా దొరకలేదు. దీంతో తనకు చేతనైన రీతిలో గ్రహాంతర జీవుల కోసం ‘విశ్వ’ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడితో మొదలెట్టి ఇతర గ్రహాలకు శాటిలైట్లు పంపి శోధిస్తున్నాడు. ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన సమాధానాలు దొరక్కపోయినా, కొన్ని గ్రహాల్లో మాత్రం గతంలో జీవం ఉండేదనేందుకు స్వల్ప ఆధారాలు లభించాయి. అయితే ఈ ఆధారాలతో సమస్య తీరకపోగా కొత్తగా మరో ప్రశ్న మొదలైంది. ఒకవేళ ఇతర గ్రహాలపై జీవం ఉండేదనుకుంటే, ఇప్పుడేమైందనేది కొత్త ప్రశ్న! మంగళుడిపై మనుగడ తాజాగా కుజగ్రహంపై కనిపిస్తున్న నల్లటి చారికలు ఆ గ్రహంపై జీవం ఉందనేందుకు నిదర్శనమని తాజాగా సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపితే సదరు జీవజాలం ఎలా మాయమైందన్న విషయం తెలియవచ్చని, తద్వారా భూమిపై ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చని వీరి ఆలోచన. మార్స్(కుజుడు) పై కనిపించే నల్లటి చారికలు ద్రవరూప పదార్ధాలు ప్రవహిస్తే ఏర్పడే కయ్యల్లాగా ఉన్నాయి. ఇవి ఈ గ్రహంపై ఉండే కరిగే మంచుకు, కుజుడి ఉపరితలంపై ఉండే ఉప్పురాతి శిలలకు మధ్య జరిగే రసాయన చర్య వల్ల ఏర్పడ్డాయని సైంటిస్టుల ఆలోచన. కుజుడిపై దాదాపు మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అందువల్ల మంచు ఏర్పడేందుకు ఛాన్సులు ఎక్కువ. మరి మంచు ఉంటే జీవముండాలి కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఆ మంచు జీవం మనుగడ సాధించలేనంత ఉప్పుతో కలిసి ఉన్నందున జీవం లేదని, కానీ 200– 300 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం మార్స్పై జీవం ఉండే ఉండొచ్చని కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే అది ఎందుకు అంతర్ధానమైందో ఇంకా తెలియరాలేదని, మరిన్ని పరిశోధనలతో కానీ ఈ విషయం నిర్ధారించలేమని సైంటిస్టులు చెప్పారు. కాబటి.. మన పొరుగు గ్రహం నుంచి మనపైకి దాడికి వచ్చే ఏలియన్స్ అయితే ఇంకా ఏమీ లేవని భరోసాతో ఉండొచ్చు! -
భారత్లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా?
అహ్మదాబాద్: 2020లో భూమి మీద చాలా వింతలు జరిగాయి. గతంలో ఎప్పుడూ చూడని ఓ కొత్త మహమ్మారి (కరోనా వైరస్) ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలను అడుగు బయటపెట్టనీయకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ (ఏకశిల రాయి) ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నిర్మాణాలను చూస్తూంటే.. గ్రహాంతర వాసులే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద 'మిస్టీరియస్ మోనోలిత్' ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. పార్కులో ఈ మోనోలిత్ ఏకశిలను ఎవరు నిర్మించారో తానెప్పుడూ చూడలేదని పార్కులో పనిచేసేవారు అంటున్నారు. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు. ‘సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాను" అని తోటమాలి తెలిపారు. పార్కుకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మోనోలిత్ ఏకశిల ఫొటోలను షేర్ చేశారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా కనిపిస్తోంది. ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ ఏకశిలా పార్కులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ మోనోలిత్ ముందుగా అమెరికాలోని ఉటా ఎడారిలో గుర్తించబడింది. ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. -
గ్రహాంతర జీవులున్నారు!
టెల్అవీవ్: విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని, ఏలియన్స్ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సైతం తెలుసని ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ హైమ్ యేషెడ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారని, మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు ఇంకా తయారుగా లేనందునే వారు రహస్యంగా ఉంటున్నారని యేషెడ్ చెప్పారు. గ్రహాంతర జీవులు, వారితో అమెరికా ప్రభుత్వ ఒప్పందం, ఏలియన్స్ ఏర్పాటు చేసిన గెలాక్టిక్ ఫౌండేషన్ తదితర అంశాలను 87 ఏళ్ల యేషెడ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కీలక పదవిలో ఉండడంతో యేషెడ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత వస్తోంది. విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్ భావిస్తున్నారని, ఆ మేరకు యూఎస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారని యేషెడ్ చెప్పారు. దీంతో పాటు మార్స్ గ్రహంపై ఒక రహస్య అండర్గ్రౌండ్ బేస్ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్ మధ్య ఒప్పందం ఉందన్నారు. గెలాక్టిక్ ఫౌండేషన్ సూచన మేరకు ఏలియన్స్ ఉన్నారన్న నిజం తెలిసినా ట్రంప్ బయటకు చెప్పట్లేదన్నారు. మానవాళి విశ్వం, విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరికని చెప్పారు. ఐదేళ్ల క్రితం తానీ విషయం చెబితే తనపై పిచ్చోడి ముద్ర వేసి ఆస్పత్రిలో చేర్చేవారని యేషెడ్ అన్నారు. గతంలో ఆయన రచించిన ఒక పుస్తకంలో కూడా యేషెడ్ ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. తాజాగా యేషెడ్ చేసిన కామెంట్లపై ట్రంప్ కానీ, యూఎస్ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
36 గ్రహాలపై మనలాగే మరికొందరు!
భూమ్మీద మన మనుషులం మనుగడ సాగిస్తున్నాం. విశాల విశ్వంలో భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిలాంటి గ్రహాలు ఉన్నప్పుడు, మనుషుల్లాంటి జీవులు మరోచోట ఉండొచ్చు కదా! ఈ విషయమై మనుషుల్లో చిరకాలంగా కుతూహలం దాగి ఉంది. దీని నివృత్తి కోసం కొందరు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ అన్వేషణలో అనేక విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్లు, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలనైతే శాస్త్రవేత్తలు ఇంతవరకు గుర్తించగలిగారు గాని, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. అంతమాత్రాన గ్రహాంతర జీవుల ఉనికిని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతరిక్షంలోని ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి, సౌర కుటుంబానికి వెలుపల ఉన్న మరికొన్ని గ్రహాలపై జీవించే గ్రహాంతర జీవుల ఉనికి గురించి రకరకాల కథనాలూ ఊహాగానాలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిపై బోలెడంత కాల్పనిక సాహిత్యం ఉంది. కొన్ని సినిమాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి భూమిని పోలిన గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల గురించి అడపాదడపా శాస్త్రవేత్తలు చెబుతున్న అంచనాకు సంబంధించిన కథనాలు కూడా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా జనాలకు తెలుస్తూనే ఉన్నాయి. మనం నివసిస్తున్న భూమి మీద తప్ప మరెక్కడా తెలివి గల మనుషుల్లాంటి జీవులు ఉండే అవకాశమే లేదంటూ అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల కిందట కొట్టిపారేసింది. అప్పటి ‘నాసా’ వాదనకు భిన్నమైన కథనాలు ఇటీవల వెలువడుతుండటం విశేషం. భూమిలాంటి గ్రహాలు 600 కోట్లు! అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఏకంగా సుమారు ఆరువందల కోట్ల వరకు ఉన్నాయని శాస్త్రవేత్తల తాజా అంచనా. అంతేకాదు, అలాంటి వాటిలో కనీసం ముప్పయ్యారు గ్రహాలపై మనుషుల్లాగే తెలివితేటలు కలిగిన జీవులు ఏర్పరచుకున్న నాగరికతలు మనుగడలో ఉండవచ్చని కూడా వారి అంచనా. భూమిలాంటి గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల ఉనికి గురించి శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించిన వివరాలను తెలుసుకుందాం... సూర్యుని కేంద్రంగా భూమి సహా తొమ్మిది గ్రహాలు, ఈ గ్రహాలలోని కొన్నింటి ఉపగ్రహాలతో కూడి ఉన్న సౌర కుటుంబం విశాల విశ్వంలోని ఒక గెలాక్సీలో ఉన్న విషయం చాలామందికి తెలిసినదే. మన గెలాక్సీ పేరు ‘మిల్కీవే’. దీనినే తెలుగులో ‘పాలపుంత’ అని పిలుచుకుంటున్నాం. అంతరిక్షంలో ఇలాంటి అనేక గెలాక్సీలు ఉన్నాయి. భూమిలాంటి ఆరువందల కోట్ల గ్రహాలు ఎక్కడెక్కడో వేర్వేరు గెలాక్సీలలో కాదు, మన గెలాక్సీలోనే ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇదే గెలాక్సీలో సూర్యుని పోలిన నక్షత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా ఉన్నాయి. సూర్యుని పోలిన ప్రతి ఐదు నక్షత్రాల్లో ఒక దాని చుట్టూ భూమిలాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని, వాటిలో కొన్నింటి పరిమాణం భూమిలో సగం నుంచి భూమికి రెట్టింపు వరకు ఉన్నాయని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల తమ తాజా అంచనాను వెల్లడించారు. భూమిలాంటి ఆ ఆరువందల కోట్ల గ్రహాలపైనున్న నేల ఆవాసయోగ్యంగా ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు. ‘నాసా’ కెప్లార్ మిషన్ పంపిన సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయమై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ అంచనాకు ఎలా వచ్చారంటే..? మన పాలపుంతలో దాదాపు 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో సూర్యుడిని పోలిన నక్షత్రాలు 7 శాతం ఉన్నాయి. సూర్యుడిని పోలిన నక్షత్రాలను ‘జీ–టైప్’ నక్షత్రాలని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఇలాంటి జీ–టైప్ నక్షత్రాలు దాదాపు 2800 కోట్లు. వాటన్నింటికీ వాటి వాటి గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా ప్రతి ఐదు జీ–టైప్ నక్షత్రాలలో ఒక దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన మన పాలపుంతలో భూమిలాంటి గ్రహాలు కనీసంగా సుమారు 560 కోట్లు ఉంటాయని, కాస్త అటు ఇటుగా చూసుకుంటే ఇవి దాదాపు 600 కోట్ల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేమీ మాథ్యూస్ చెబుతున్నారు. మన పాలపుంతలో భూమిని పోలిన దాదాపు 600 కోట్ల గ్రహాలపైనున్న నేల, వాటిపై వాతావరణం ఆవాస యోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని ఆయన అంటున్నారు. ఇదివరకటి పరిశోధనల్లో పాలపుంతలోని సూర్యుని వంటి ‘జీ–టైప్’ నక్షాత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు 0.02 శాతం వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, తాజా అంచనాల ప్రకారం ఇవి 7 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. జేమీ మాథ్యూస్ నేతృత్వంలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనాన్ని ‘ది అస్ట్రోఫిజికల్ జర్నల్’ గత నెల ప్రచురించింది. గ్రహాంతర వాసుల ఉనికిపై అంచనా మన సౌర కుటుంబం ఏర్పడి దాదాపు 450 కోట్ల ఏళ్లు గడిచాయి. మరో వంద కోట్ల ఏళ్లు గడిచాక– అంటే సుమారు 350 కోట్ల ఏళ్ల కిందట భూమిపై జీవం ఆవిర్భవించింది. దాదాపు 2 లక్షల ఏళ్ల కిందట మనుషుల ఆవిర్భావం జరిగింది. నానా పరిణామాల తర్వాత సుమారు 6 వేల ఏళ్ల కిందట నాగరికతలు ఏర్పడ్డాయి. ఇదే లెక్కన మన పాలపుంతలోని సూర్యుని పోలిన గ్రహాలలో దాదాపు సూర్యుని వయసు గల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమిని పోలిన గ్రహాలలో దాదాపు 36 గ్రహాలపై మానవులను పోలిన తెలివితేటలు గల జీవులు ఉండటానికి ఆస్కారం ఉందని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్కు చెందిన అస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ కాన్సెలైస్ చెబుతున్నారు. గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించి ఈ విధంగా అంచనా కట్టే పద్ధతిని ‘అస్ట్రోబయోలాజికల్ కోపర్నికన్ లిమిట్’ అంటారని ఆయన వివరిస్తున్నారు. ఇదివరకటి కాలంలో గ్రహాంతరవాసుల గురించిన అంచనాలను వెల్లడించడానికి శాస్త్రవేత్తలు గ్రహాంతర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్పై ఆధారపడేవారు. గ్రహాంతర ప్రదేశాల నుంచి భూమిపైకి సిగ్నల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నా, గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. అయితే, నాటింగ్హామ్ శాస్త్రవేత్తలు పాత పద్ధతిలో కాకుండా, మనం ఉంటున్న భూమి మీద అధునాతన మానవ సమూహాలు ఏర్పడటానికి పట్టిన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే లెక్కన సూర్యుని పోలిన మిగిలిన నక్షత్రాల చుట్టూ తిరిగే భూమిలాంటి గ్రహాలపై దాదాపు ఎన్నిచోట్ల మానవులను పోలిన తెలివైన జీవుల సమూహాలు ఉండటానికి వీలుంటుందో ఒక అంచనాను రూపొందించారు. మానవుల్లాంటి తెలివైన గ్రహాంతర జీవులకు ఆవాసానికి ఆస్కారమున్న గ్రహాలు భూమి నుంచి సుమారు 17 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి కోసం జరిపే తమ పరిశోధనలో వారి ఉనికి ఒకవేళ బయటపడినా, దాని ప్రయోజనం అంతవరకే పరిమితం కాదని ప్రొఫెసర్ కాన్సెలైస్ అంటున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి ఎక్కడైనా ఆధారాలతో సహా ధ్రువీకరించుకోగలిగితే, భూమిపై మానవ నాగరికత ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదో అంచనా వేయడానికి వీలవుతుందని ఆయన చెబుతున్నారు. పాలపుంతలో భూమ్మీద తప్ప మరే గ్రహంపైనా నాగరిక సమూహాలు మనుగడలో లేవని ఒకవేళ రుజువైతే, మానవాళికి అది అంత మంచి సమాచారం కాదని కూడా అంటున్నారు. అలా కాకుండా, పాలపుంతలోని మరికొన్ని గ్రహాలపై కూడా నాగరిక సమాజాలు మనుగడలోనే ఉన్నట్లు రుజువైతే, మానవాళికి అంతకు మించిన శుభవార్త ఉండదని, అదే గనుక జరిగితే, ఇప్పటి శాస్త్రవేత్తలు కొందరు అంచనా వేస్తున్నట్లుగా భూమిపై మనుషుల మనుగడ మరికొద్ది వందల ఏళ్లకే పరిమితం కాకుండా, ఇంకా చాలాకాలం కొనసాగగలదని ప్రొఫెసర్ కాన్సెలైస్ అభిప్రాయపడుతున్నారు. విశ్వాసాల నుంచి పరిశోధనల దిశగా... గ్రహాంతరవాసుల ఉనికిపై ఆలోచనలు ఈనాటివి కావు. ప్రాచీన నాగరికతలు పుంజుకున్న కాలంలోనే గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఊహలు, కల్పనలు మనుషుల్లో ఉండేవి. సూర్యుని వంటి నక్షత్రాలు, భూమిలాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఉంటాయనే విశ్వాసం ఉండేది. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉన్నాయని, వాటిపైనా మనుషులను పోలిన జీవులు ఉంటారనే ఊహలు, వాటికి సంబంధించిన వర్ణనలు వివిధ దేశాల పురాణాల్లో కనిపిస్తాయి. గ్రహాంతరాలలో మానవుల వంటి తెలివైన జీవులకు సంబంధించిన విపులమైన వర్ణనలు ప్రాచీన జైన గ్రంథాల్లో ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్న తొలి గ్రంథాలు జైన గ్రంథాలేనని చరిత్రకారుల అంచనా. భూమిపై మాత్రమే కాకుండా, విశాల విశ్వంలోని మరికొన్ని గ్రహాలపై కూడా మానవుల వంటి జీవులు ఉంటారని బలంగా విశ్వసించే వాదం వ్యాప్తిలోకి వచ్చింది. దీనినే ‘కాస్మిక్ ప్లూరలిజం’ అంటారు. మధ్యయుగాలకు చెందిన ముస్లిం రచయితలు ఫక్ర్ అల్ దిన్ అల్ రాజి, మహమ్మద్ అల్ బకీర్ వంటివారు తమ రచనల్లో ‘ఖురాన్’ నుంచి ఆధారాలను చూపుతూ ‘కాస్మిక్ ప్లూరలిజం’ భావనను సమర్థించారు. పదిహేనో శతాబ్దికి చెందిన ఇటాలియన్ ఖగోళవేత్త కోపర్నికస్ విశ్వం నమూనాను రూపొందించిన తర్వాత ‘కాస్మిక్ ప్లూరలిజం’ సిద్ధాంతాన్ని జనాలు మరింత బలంగా నమ్మడం ప్రారంభించారు. కోపర్నికస్ తర్వాతి కాలంలో ఇంగ్లిష్ వైద్యుడు, తత్వవేత్త జాన్ లాకె, ఇటాలియన్ ఖగోళవేత్త, తత్వవేత్త గియార్దానో బ్రూనోలతో పాటు ఆధునిక కాలంలో బ్రిటిష్ సంతతికి చెందిన జర్మన్ ఖగోళవేత్త విలియమ్ హెర్షెల్ వంటివారు సైతం ‘కాస్మిక్ ప్లూరలిజం’ భావనను సమర్థిస్తూ వచ్చారు. టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూమికి చేరువలో ఎక్కడైనా జీవరాశులు ఉండకపోతాయా అనే అన్వేషణ ప్రారంభమైంది. తొలినాటి టెలిస్కోప్ల పరిమితుల మేరకు నాటి శాస్త్రవేత్తలు కొంత దూరం వరకు మాత్రమే చూడగలిగేవారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లలో పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు చెందిన అమెరికన్ ఖగోళవేత్త పెర్సివాల్ లోవెల్ అంగారకునిపై కృత్రిమంగా నిర్మించిన కాలువలు తనకు కనిపించాయని ప్రకటించాడు. అంగారకునిపై నాగరిక ప్రపంచం ఉందనేందుకు ఇదే నిదర్శనమనే వాదన వినిపించాడు. ఈ విషయమై ఏకంగా ‘మార్స్ అండ్ ఇట్స్ కెనాల్స్’ అంటూ పుస్తకమే రాసి పడేశాడు. తర్వాతి కాలంలో మరింత శక్తిమంతమైన టెలిస్కోప్లతో చేసిన పరిశోధనల్లో ఇది తప్పని తేలింది. అంగారకుని ఉపరితలంపై గల ఎత్తుపల్లాల్లోని వెలుగునీడలను చూసి లోవెల్ అపోహపడి ఉంటాడని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకవైపు టెలిస్కోప్ల ద్వారా అన్వేషణ కొనసాగిస్తూనే, మరోవైపు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను కూడా పంపడం మొదలయ్యాక గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ మరింత ముమ్మరమైంది. సౌర కుటుంబంలోనే ఇంకెక్కడైనా మానవుల మనుగడకు ఆస్కారం ఉండే ప్రదేశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గడచిన శతాబ్దకాలంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాగుతున్న పరిశోధనల్లో నానాటికీ కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక అధ్యయనం బుధగ్రహంపై కొన్ని ప్రదేశాలు ఆవాసయోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. భూమికి దగ్గరగా ఉండే శుక్ర, అంగారక గ్రహాలపై కూడా జీవజాలం ఆచూకీ కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అలాగే, సౌర కుటుంబంలోనివే అయిన గురుగ్రహానికి ఉపగ్రహమైన ‘యూరోపా’, శనిగ్రహానికి ఉపగ్రహాలైన ‘ఎన్సెలాడస్’, ‘టైటాన్’వంటి వాటిపై జీవం మనుగడకు అవకాశం ఉండవచ్చని ఇప్పటి వరకు దొరికిన ఆధారాల నేపథ్యంలో అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన పాలపుంతలోనే భూమిని పోలిన మరో ముప్పయ్యారు గ్రహాలపై గ్రహాంతరజీవులు ఉండవచ్చన్న తాజా అంచనా వెలుగులోకి రావడం విశేషం. గ్రహాంతర పరిశోధనల కోసం ‘నాసా’ రోబోలు! గురుని ఉపగ్రహమైన యూరోపా, శని గ్రహానికి ఉపగ్రహాలైన ఎన్సెలాడస్, టైటాన్ల ఉపరితల విశేషాలను తెలుసుకోవడానికి అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రోబోలను పంపాలని భావిస్తోంది. భూమి కంటే భిన్నమైన గురుత్వాకర్షణ, ఎగుడుదిగుడు ఉపరితలాలతో నిండి ఉన్న వీటిపై సునాయాసంగా సంచరించడం ఇప్పటివరకు వినియోగంలో ఉన్న రోవర్లకు సాధ్యం కాదనే అంచనాతో ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఈ రోబోలను ప్రత్యేకంగా ఫుట్బాల్ ఆకారంలో రూపొందించడానికి సమాయత్తమవుతోంది. ఈ రోబోలకు ‘స్పారో’ (స్టీమ్ ప్రొపెల్డ్ అటానమస్ రిట్రీవల్ రోబోస్ ఫర్ ఓషియానిక్ వరల్డ్స్) అని నామకరణం కూడా చేశారు. ఇవి ఎలాంటి ఎగుడుదిగుడు ఉపరితలాలపైన అయినా కప్ప మాదిరిగా దుముకుతూ సంచరించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపా, ఎన్సెలాడస్, టైటాన్ల ఉపరితలాలపై గడ్డకట్టి పేరుకుపోయిన మంచు అడుగున ఉప్పునీటి సముద్రాలు ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గురు, శని గ్రహాలకు చెందిన ఉపగ్రహాలపైకి ‘స్పారో’ను పంపినట్లయితే, మరిన్ని విశేషాలు బయటపడగలవని ఆశిస్తున్నారు. - పన్యాల జగన్నాథదాసు -
ఆకాశంలో బ్లాక్ రింగ్.. ఏలియన్స్ వచ్చేశారు!
లాహోర్ : పాకిస్తాన్లోని లాహోర్ ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. నల్లరంగులో ఉన్న వింత ఆకారం ఒకటి ఆకాశంలో తేలియాడుతూ కనిపించింది. మేఘం మాదిరి గగనతలంలో తేలియాడుతున్న బ్లాక్ రింగ్ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలుష్యం కారణంగా బ్లాక్ రింగ్ ఏర్పడిందని కొందరు పేర్కొనగా.. వినాశనానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మానవుడు చేస్తున్న కాలుష్యం వల్లే ఆకాశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంకొంత మంది నెటిజన్లు పేర్కొన్నారు. లాహోర్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లే పొగ అంతా వలయాకారంలో మారి ఆకాశంలో తేలియాడుతున్నదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తు జోకులు పేలుస్తున్నారు ‘ ఇది కచ్చితంగా ఏలియన్స్ పనే.. వాళ్లు వచ్చేస్తున్నారు’, ఏలియన్స్ పాకిస్తాన్లోని వెళ్లరు. కచ్చితంగా వారు అమెరికాలోనే ల్యాండ్ అవుతారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ప్రియాంక కిడ్నాప్?
గ్రహాంతరవాసులు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాను కిడ్నాప్ చేశారు. మరి.. వారి డిమాండ్స్ ఏంటి? ప్రియాంకా ఎలా బయటపడ్డారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత సమయం ఆగక తప్పదు. అయితే ఇదంతా ప్రియాంక రీల్ లైఫ్ గురించే. ‘అలిటా: బాటిల్ ఏంజిల్’ ఫేమ్ రాబర్ట్ రోడ్రిగెజ్ ‘వుయ్ కెన్ బీ హీరోస్’ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ ఫిల్మ్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మిస్ గ్రాడెన్కో అనే కీలక పాత్రను ప్రియాంకా చోప్రా పోషిస్తున్నారు. భూమిపై ఉన్న సూపర్ హీరోస్ అందరినీ గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేసినప్పుడు, ఆ సూపర్ హీరోస్ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా విడిపించారన్నదే ‘వుయ్ కెన్ బీ హీరోస్’ కథాంశమట. కథ ప్రకారం ప్రియాంకది తల్లి పాత్ర అని అర్థమవుతోంది. క్రిస్టియన్ స్లేటర్, యా యా గోస్సెలిన్, అకిరా అక్బర్, ఆండ్రూ డియాజ్లతో పాటు కొందరు ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టులు ఈ వెబ్ ఫిల్మ్లో కీలక పాత్రధారులు. ఈ వెబ్ ఫిల్మ్ను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రియాంకా బాలీవుడ్ కబుర్లు చెప్పుకుంటే ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఏలియన్స్ మమ్మల్ని ఎత్తుకెళ్లాయి
వాషింగ్టన్ : మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధరణ మానవుడికైతే ఏలియన్స్ ఉనికి గురించి తెలుసుకోవడం మహా సరదా. ఇప్పటికి అమెరికాలో రహస్యంగా ఏలియన్స్ గురించి పరిశోధనలు జరుగుతున్నాయని జనాల్లో ఓ బలమైన నమ్మకం. వీటి ఆధారంగా తెరకెక్కిన హలీవుడ్ చిత్రాలకు లెక్కేలేదు. ఈ క్రమంలో ఏలియన్స్, యూఎఫ్ఓల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అమెరికాకు చెందిన పార్కర్. తను, తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్ అపహరించాయి అంటున్నారు. అయితే ఈ సంఘటన 1973 ప్రాంతంలో జరిగిందని తెలిపారు. వివరాలు.. ‘1973 ప్రాంతంలో నేను, హిక్సన్ ఓ షిప్యార్డ్లో కూలీలుగా పని చేసేవాళ్లం. ఓ రోజు మేమిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం. ఆ సమయంలో మా వెనక ఏదో వాహనం ఆగిన శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే.. నీలం రంగు వెలుతురు మా వైపు రావడం కనిపించింది. ఆ వెనకే ఓ 30 అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగింది. అందులో నుంచి మూడు చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే మేం ఇద్దరం స్తంభించిపోయాం. ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనం వైపు లాగడం ప్రారంభించాయి. లోపలికి వెళ్లిన తర్వాత మేమిద్దరం గాలిలో తేలుతున్నాం’ అన్నారు పార్కర్. ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను వంటి ఆకారంతో తమని పరీక్షించాయన్నారు. కాసేపటి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్లాయన్నారు. తమకు స్పృహ వచ్చే సరికి తామిద్దరూ ఆకాశం వైపు చేతులు ఎత్తి సాయం కోసం ఆర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తమ అర చేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ విషయాన్ని చెప్పినప్పుడు తొలుత అధికారులు ఎవరూ నమ్మలేదు. మేం తాగి ఉన్నాం అనుకున్నారు. కానీ మేం పాలిగ్రాఫ్ పరీక్ష(నిజ నిర్థారణ పరీక్ష)లో పాస్ కావడంతో మా మాటలను నమ్మారు. ఆ తర్వాత ఈ విషయం గురించి వాషింగ్టన్ పోస్ట్లో కూడా వచ్చింది అన్నారు. కాగా హిక్సన్ 2011లో మరణించాడు. -
పొత్తుల బాటలో..
17వ లోక్సభ ఎన్నికలకు పొత్తుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పోలిస్తే అధికార బీజేపీ కాస్త ముందుంది. బిహార్లో జేడీయూతోనూ, మహారాష్ట్రలో శివసేనతోనూ బీజేపీ ఒక అంగీకారానికి వచ్చింది. కాగా, కేంద్రంలో అధికారానికి ఆయువు పట్టయిన యూపీలో ఎస్పీ, బీఎస్పీ సయోధ్య కారణంగా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బహుజన్ సమాజ్పార్టీ (బీఎస్పీ) 38, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 37 సీట్లకు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్రీయ లోక్దళ్కు మూడు సీట్లు కేటాయించిన ఎస్పీ, బీఎస్పీ కూటమి కాంగ్రెస్కు మాత్రం రెండు సీట్లు(రాయ్బరేలీ, అమేథీ) వదిలేయడం గమనార్హం. ఇదే కూటమిలోని ఈ రాష్ట్రంలో బీజేపీ తన మిత్రపక్షాలైన అప్నాదళ్(సోనేలాల్ పటేల్), సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)తో ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు చేసుకోలేదు. కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన రెండు సీట్లు గెలుచుకుంది. ఎస్బీఎస్పీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షమైంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు లేకుండా అన్ని సీట్లకూ పోటీ చేస్తానని ప్రకటించింది. బిహార్లో జేడీయూ, బీజేపీ 40 సీట్లున్న బిహార్లో సంకీర్ణ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న జేడీయూ, బీజేపీ చెరో 17 సీట్లకు పోటీచేసేలా ఇటీవల అంగీకారం కుదిరింది. మిగిలిన సీట్లలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన లోక్జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) పోటీ చేస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇతర బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమిలో ఇంకా సీట్ల పంపిణీ పూర్తి కాలేదు. అయితే ఆర్జేడీ 20 సీట్లకు, కాంగ్రెస్ 10 సీట్లకు పోటీచేసేలా ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్సభ సీటుకు సంబంధించి పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపిణీ ఒప్పందం చేసుకుంది. తమిళనాడులో ఏఐఏడీఎంకే 27 సీట్లకు, బీజేపీ ఐదు స్థానాలకు కలిసి పోటీచేస్తాయి. సినీ నటుడు విజయకాంత్ నాయకత్వంలోని ఎండీఎంకే కూడా ఈ కూటమిలో చేరుతుందని, ఈ పార్టీకి నాలుగు సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎస్ రామదాస్ నేతృత్వంలోని వన్నియార్ల పార్టీ పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి)కు ఇదివరకే ఏడు సీట్లు ఏఐఏడీఎంకే కేటాయించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన ఏఐఏడీఎంకే 39కి 37 సీట్లు కైవసం చేసుకోగా, ఎన్డీఏలోని బీజేపీ, పీఎంకేలు చెరో సీటు దక్కించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు కుదిరింది. డీఎంకే 20, కాంగ్రెస్ 9 సీట్లకు పోటీచేస్తాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే పార్టీకి రెండేసి చొప్పున సీట్లను డీఎంకే కేటాయించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మహారాష్ట్రలోని 48 సీట్లలో 45 లోక్సభ సీట్లు పంచుకునే విషయంలో జనవరిలో కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మధ్య అంగీకారం కుదిరింది. రెండింటిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ ఇంకా తేలలేదు. యూపీఏ కూటమిలోకి పూర్వపు ఎన్డీఏ భాగస్వామి స్వాభిమాని షేట్కారీ సంఘటన, సీపీఎం, ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని బీబీఎంను చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు నడుపుతున్న బీజేపీ 25 సీట్లకు, భాగస్వామ్య పక్షం శివసేన 23 లోక్సభ స్థానాల్లో పోటీకి నిర్ణయించారు. కేరళలోని 20 సీట్లలో వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రధాన పక్షాలైన సీపీఎం 16, సీపీఐ నాలుగు సీట్లకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ భాగస్వామ్యపక్షాల మధ్య ఇంకా సీట్ల పంపిణీ పూర్తి కాలేదు. జార్ఖండ్లో కుదరని సర్దుబాటు 14 లోక్సభ సీట్లున్న జార్ఖండ్లో బీజేపీ, దాని మిత్రపక్షాలైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జనతా దళ్(యూ)మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఈ ప్రయతాలు విఫలమైతే బీజేపీ ఒంటరిగా అన్ని సీట్లకూ పోటీచేస్తుందని భావిస్తున్నారు. మళ్లీ పుంజుకున్న కమలం గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నుంచి ప్రతిపక్షంలోకి రావడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో బీజేపీ మళ్లీ పుంజుకుందనీ, ఇప్పుడు ప్రతిపక్షాలతో పోలిస్తే బాగా బలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, రైతు గౌరవ నిధి పథకం, ప్రజాకర్షక బడ్జెట్, ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడి, తదనంతర పరిణామాలతో ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిందంటున్నారు. -
గూగుల్ ‘గ్రహాంతర’ డూడుల్
న్యూఢిల్లీ: భూమికి ఆవల ప్రాణికోటి ఉందా? ఉంటే ఆ గ్రహాంతరవాసులు మనకన్నా బలమైన, తెలివైనవారా? వంటి రహస్యాల్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో శాస్త్రవేత్తలు 1974లో మనిషి ఆనవాళ్లతో ఓ మెసేజ్ను శూన్యంలోకి పంపారు. ఈ మెసేజ్ను ప్యుర్టొరికోలోని అరిసిబో అబ్జర్వేటరీ నుంచి రేడియో టెలిస్కోప్ సాయంతో ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల ద్వారా పంపించారు. ఇది జరిగి శుక్రవారం నాటికి సరిగ్గా 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెసేజ్లో ఒక భాగమైన ‘హ్యూమానిటీ’ చిత్రాన్ని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన డూడుల్గా పెట్టింది. 3 నిమిషాల నిడివిగల అరిసిబో మెసెజ్లో 1 నుంచి 10 అంకెలు, పలు మూలకాల పరమాణు సంఖ్యలు, మనిషి డీఎన్ఏ, మనిషి రూపం (హ్యూమానిటీ), టెలిస్కోప్ వంటి చిత్రాలతో7 భాగాలున్నాయి. ఈ సమాచారమంతా డిజిటల్(1,0) రూపంలో ఉంటుంది. హ్యూమానిటీ చిత్రంలో మధ్య భాగం మానవుడి రూపం, ఎడమవైపున్న చిత్రం సగటు యుక్త వయసు పురుషుడి ఎత్తు (5.94 అడుగులు), కుడివైపున్న ఆకారం 1974లో భూమిపై ఉన్న జనాభా(430కోట్లు)ను సూచిస్తుంది. గమ్యం దిశగా ఇప్పటికి ఈ మెసేజ్ 259 ట్రిలియన్ మైళ్లు ప్రయాణించింది. -
ఏలియన్స్ను దాచేస్తున్నారు.. ఎందుకు?
ఏడున్నర దశాబ్దాలుగా చిక్కక.. దొరక్క... ఊరిస్తూ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన అంశమే ఏలియన్స్ (గ్రహాంతర వాసులు). 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నాయన్న వాదన.. పైగా ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ల హెచ్చరికలు... నిజమో? నకిలీవో? స్పష్టంలేని మీడియా కథనాలు... ఇవన్నీకొందరిలో ‘ఏలియన్స్’ పట్ల విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇదిలా ఉంటే నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కెవిన్ నూథ్(ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ అల్బేనీలో పని చేస్తున్నారు) సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్ల మనుగడ గురించి తెలిసి కూడా నాసా.. గోప్యత ఎందుకు ప్రదర్శిస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘2002 నాసా కాంటాక్ట్ కాన్ఫరెన్స్లో జరిగిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. గ్రహంతరవాసుల అంశంపైనే శాస్త్రవేత్తలమంతా ప్రధానంగా చర్చించాం. అప్పటికే నాసా సేకరించిన సమాచారం గందరగోళంగా ఉంది. ఏలియన్ల మనుగడ నిజమన్న భావనను కొందరు నొక్కివక్కానిస్తే.. మరికొందరు నాన్సెన్స్ అని కొట్టేపారేశారు. మేం కొందరం సభ్యులం తటస్థంగా ఉన్నాం. కానీ, అందరిలో ఏకాభిప్రాయం ఒక్కటే. ప్రజల్లో ఆసక్తి, అనాసక్తి అన్న అంశాలను పక్కనపెడితే వాటి మనుగడపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాసాకు ఉంది. ఆకాశంలో కనిపించి.. అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాటేంటి? అవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా? అక్కడక్కడ భూ మైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? సందేశాలు పంపిన దాఖలాల సంగతేంటి? ఈ రహాస్యాలన్నీంటికి నాసా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ, ఎందుకు దాస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు’ అని ఆయన ఆరోపించారు. గ్రహాంతర వాసులతో మనుషులకు ప్రమాదం నిజంగానే పొంచి ఉందా? ఒకవేళ అనుసంధానం అయితే అవి కత్తి దూస్తాయా..? చేయి చాస్తాయా? ఏలియన్స్ ఉనికి చుట్టూ ఉన్న వాదన సంగతి పక్కనపెడితే.. ప్రజల్లో పెరిగిపోయిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్ఛితంగా ఉంది అని కెవిన్ తెలిపారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు సాక్ష్యాధారాలతోసహా చూపిస్తామని నాసా ఇది వరకే ప్రకటించింది. ఏలియన్ల విషయంలో మరో 20 ఏళ్లలో వాటి జాడను ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది కూడా. అయితే అందుకోసం జరిగే పరిశోధనల విషయంలో హాకింగ్ హెచ్చరించినట్టు ఆచితూచి అడుగెయ్యటం మంచిదన్న వాదన వినిపిస్తోంది. -
నాసా ఫొటో.. మార్స్పై ఏలియన్స్..??
సాక్షి, వెబ్డెస్క్ : ఈ మధ్య కాలంలో గ్రహాంతరవాసుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఫొటో సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈజిప్టులోని మహిళా యోధురాలి విగ్రహం తల ఆకారంలో కనిపిస్తున్న ఓ రాయి చిత్రమది. దీంతో ఏలియన్స్ ఇప్పటికే భూమిపై సంచరించడం ప్రారంభించాయనే వాదన మొదలైంది. భూమిపై ఎన్నో ఆవిష్కరణలు జరగాల్సిన ప్రదేశాల్లో ఈజిప్టు ముఖ్యమైనది. అక్కడ ఉన్న పిరమిడ్ల వంటి చరిత్రక ఆధారాలతో ఏలియన్స్పై ఎన్నో చిత్రాలూ వచ్చాయి. ప్రస్తుతం నాసా పోస్టు చేసిన చిత్రం ఈ మేరకు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. -
చంద్రుడిపై ఏలియన్స్..!!
వాషింగ్టన్ : యువ శాస్త్రవేత్త చంద్రుడిపై తీసిన వీడియో సోషల్మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి పూట చంద్రుడిని 4కే కెమెరా ద్వారా పరిశీలిస్తున్న అతనికి మూడు వింత ఆకృతులు ఎగురుతూ వెళ్లడం కనిపించింది. ఈ వీడియోను పరిశీలించిన కాన్స్పిరసీ థియరిస్టులు అవి ఏలియన్స్ అనే పేర్కొంటున్నారు. మూడు అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్(యూఎఫ్ఓ)లో రెండు కలసి ప్రయాణిస్తుండగా.. ఒకటి మాత్రం వాటి వెనుక ఫాలో అవుతూ వీడియోలో కనిపించింది. అయితే, ఈ వీడియోను నమ్మలేకపోతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం అవి రాళ్లు అని కొట్టిపారేస్తున్నారు. -
చంద్రుడిపై ఏలియన్స్..సోషల్మీడియాలో సంచలనం
-
అమెరికాలో ఏలియన్స్ కలకలం
అరిజోనా, అమెరికా : ఫోనిక్స్ నగర గగనతలంలో అర్థరాత్రి వింత వెలుతురు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కొండ ప్రాంతంలో ఓ వింత ఆకారంలోని వస్తువు ఎగరడాన్ని గమనించిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అది యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) అవునో.. కాదో అర్థం కావడం లేదని కొందరు కామెంట్ చేస్తుంటే.. ముమ్మాటికి ఇది అమెరికన్ మిలటరీ పనే అని మరికొందరు అంటున్నారు. కాగా, కొద్దిరోజులుగా ఏలియన్స్ భూమికి వచ్చి వెళ్తున్నాయన్న వార్తలు సోషల్మీడియాలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. -
20 వేల ఏలియన్ ప్రపంచాలు..!!
కేప్ కానావెరల్, ఫ్లారిడా(అమెరికా) : విశ్వంలోని 20 వేల ఏలియన్ ప్రపంచాలను పరిశోధించేందుకు నాసా నడుంబిగించింది. భవిష్యత్లో కొత్త ఆవిష్కరణలకు ఊపరిలూదుతూ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టీఈఎస్ఎస్(టాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్)ను బుధవారం ప్రయోగించింది. విశ్వంలో ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్న కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ స్థానాన్ని టీఈఎస్ఎస్ భర్తీ చేయనుంది. కెప్లర్తో పోల్చితే రాత్రి సమయాల్లో 400 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని టీఈఎస్ఎస్ స్కాన్ చేయగలుగుతుంది. ప్రాథమికంగా వచ్చే రెండేళ్ల కాలంలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 లక్షలకు పైగా సూర్యుడిలా కాంతిమంతంగా మెరుస్తున్న నక్షత్రాలపై జీవుల జాడ కోసం టీఈఎస్ఎస్ అన్వేషణ చేయనుంది. వీటిలో కనీసం 20 వేలకు పైగా గ్రహాంతరవాసులు నివాసముండే గ్రహాలను టీఈఎస్ఎస్ కనుగొంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిలో 50 గ్రహాలు భూమి సైజుతో సరిసమానంగా, 500 గ్రహాంలో భూమి సైజులో సగం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ గ్రహాలను నాసా గుర్తించిన అనంతరం వాటిపై విస్తృత పరిశోధన సాగించేందుకు 2020లో జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్ను ప్రయోగించనున్నట్లు వివరించారు. -
విమానాన్ని వెంటాడిన ఏలియన్స్..!!
న్యూ హ్యాంప్షైర్ : యుద్ధవిమానాన్ని ఏలియన్స్ వెంటాడాయా?. సోషల్మీడియాలో షేర్ అవుతోన్న కొన్ని ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. యూఎఫ్ఓ జెట్ ప్లేన్ను వెంటాడినట్లు కాన్స్పిరసీ థియరిస్టులు చెబుతున్నారు. కొద్దిసేపు యుద్ధ విమానాన్ని వెంబడించిన యూఎఫ్ఓ తర్వాత దాన్ని ఓవర్టేక్ చేసింది. న్యూ హ్యాంప్షైర్లో ఆకాశ అందాలను చిత్రిస్తున్న ఫొటోగ్రాఫర్ కెమెరాకు ఈ ఫొటోలు చిక్కాయి. 10 సెకన్ల పాటు ఈ దృశ్యం కనిపించిందని అనంతరం చెట్లు అడ్డు వచ్చాయని కెమెరామెన్ పేర్కొన్నారు. -
త్వరలోనే ఏలియన్స్ను కలుస్తామట.!
న్యూయార్క్: గ్రహాంతరవాసులు ఉన్నారనే వాదనను మరింత బలపర్చేలా మరో శాస్త్రవేత్త కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మిచియో కాకు.. త్వరలోనే మనం ఏలియన్స్ను కలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది కూడా ఈ శతాబ్దంలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఏలియన్స్తో మన ముఖాముఖి ఎలా ఉంటుందన్నది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. వాళ్లు మనతో స్నేహంగా మాత్రం ఉండబోరని కాకు అంచనా వేశారు. త్వరలోనే ఏలియన్స్ సంభాషణను రేడియో టెక్నాలజీ సాయంతో వినగలుగుతామని, అయితే వాళ్ల మాటలు విన్నంత మాత్రాన వాటిని అర్థం చేసుకోలేమన్నారు. వాళ్లతో మాట్లాడటం చాలా కష్టమని, ఎందుకంటే వాళ్లు కొన్ని పదుల కాంతి సంవత్సరాల దూరంలో ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాళ్ల టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ముందు వాళ్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కాకు సూచించారు. ఏలియన్స్ వస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వాళ్లు మనల్ని అడవి జంతువుల్లాగా చూసే ప్రమాదం ఉందని ఈ సైద్ధాంతికి భౌతిక శాస్త్రవేత్త ఆందోళన వ్యక్తంచేశారు. -
2018లో తొలిసారి కనిపించిన ఏలియన్లు..!
మెక్సికో : మెక్సికో దేశంలోని బాజా రాష్ట్రంలో కనిపించిన మిస్టరీ వస్తువు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఆకాశంలో కనిపించింది ఏలియన్ సంబంధిత ఆకారమే అనే డిబేట్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మొదలైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. ఇప్పటివరకూ డిస్క్(ఏలియన్ వాహక నౌకగా భావిస్తున్నాం) ఆకారంలో ఉన్న వస్తువును పలుమార్లు గుర్తించిన విషయం తెలిసిందే. తొలిసారి హ్యుమనాయిడ్ రూపంలో ఉన్న గుర్తు తెలియని వస్తువు ఆకాశంలో కనిపించింది. కాగా, 2018లో ఏలియన్లు భూమిపైకి వచ్చాయనే రిపోర్టు రావడం ఇదే తొలిసారి. దీనిపై మాట్లాడిన కాన్స్పిరసీ థియరిస్టు రమీరెజ్.. ఏలియన్లు మన చర్యలను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నాయని చెప్పారు. అంతరిక్షంలోకి మనం చేస్తున్న ఉపగ్రహ ప్రయోగాలను కూడా అవి క్షుణ్ణంగా గమనిస్తున్నాయని తెలిపారు. మనం చేస్తున్న ప్రయోగాలను యుద్ధానికి సన్నాహకాలుగా అవి భావిస్తున్నాయని అన్నారు. 2017లో యూఎఫ్ఓ సైటింగ్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. -
అది ఉత్తర కొరియా న్యూక్లియర్ ఏలియన్..!
-
ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..!
లాస్ ఏంజెల్స్ : సమయం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు కావొస్తోంది. అమెరికాలో అత్యంత ధనిక నగరం లాస్ ఏంజెల్స్ క్రిస్మస్ షాపింగ్ హడావుడిలో ఉంది. ఇంతలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా వచ్చిన ఓ వెలుగు నగరప్రజలను సంభ్రమశ్చార్యాలకు గురి చేసింది. ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీగా ఆకారంలోకి మారి విశ్వంలోకి దూసుకువెళ్తున్నది ఏంటో తెలీక అందరూ అయోమయంలో పడిపోయారు. పలువురు ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో బంధించి ఏలియన్లు భూమి మీదకు వచ్చేశాయా? అంటూ సోషల్మీడియలో పోస్టులు చేయడం ప్రారంభించారు. అలా పోస్టులు చేసిన వారిలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అది ఉత్తరకొరియాకు చెందిన న్యూక్లియర్ ఏలియన్ అంటూ మస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన ప్రముఖ రాకెట్ లాంచర్ ఫాల్కన్-9తో మరోమారు ప్రయోగం చేసింది. దాని వెలుగే ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీ స్థాయికి చేరి నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..! -
డిసెంబర్ 14న ఏం తేలబోతుంది?
వాషింగ్టన్ : ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 14న నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్రహాంతర వాసులు ఉన్నాయా?.. వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది? వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆరోజే దొరకబోతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా ఏలియన్ల జాడలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు. గోల్డీలాక్ జోన్లో ఇవి పరిభ్రమించే ప్రాంతాలను గుర్తించారు. జీవజాలం అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది. వాషింగ్టన్లోని నాసా హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ పౌల్ హెర్ట్జ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. -
ఏలియన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
సాక్షి : టీవీ షోల్లో, సినిమాల్లో ఏలియన్ల ప్రస్తావన వచ్చినప్పుడు జనాలు ఆసక్తిగా గమనించటం పరిపాటే. గ్రహాంతరవాసులు ఉనికి కోసం ఓవైపు అగ్రదేశాలు పోటాపోటీ పరిశోధనలు నిర్వహిస్తున్న వేళ ఓ గ్లోబల్ సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏలియన్లు ఉన్నాయన్న సంగతి పక్కనపెడితే.. వాటి ఉనికిని బలంగా నమ్మే ప్రజల శాతం చాలా ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు మన ఆధునీకరణకు వాటి అవసరం చాలా ఉంటుందని పేర్కొంటూ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలను కూడా వీళ్లు సమర్థించటం గమనార్హం. మొత్తం 24 దేశాల్లో.. 15 భాషల్లో ఈ సర్వే కొనసాగగా.. ది లాస్ట్ జెడి ఈవెంట్లో దీనిని ప్రచురించారు. స్టార్ వార్స్ చిత్రాలో 8వ సిరీస్ గా ది లాస్ట్ జెడి వచ్చే వారం విడుదల కానున్న విషయం తెలిసిందే. మొత్తం 26,000 మందిపై ఈ సర్వే నిర్వహించగా.. 47 శాతం గ్రహాంతరవాసులు ఉన్నాయనే నమ్ముతున్నామని చెప్పారు. అందుకు కొన్ని ఘటనలకు వీరు సాక్ష్యాలుగా చూపారు కూడా. భూమ్మీద అయితే మనుషులు ఎలా ఉన్నారో.. ఇతర గ్రహాలపై కూడా ప్రాణులు ఉండి తీరతాయని 61 శాతం మంది తమ వాదన వినిపించారు. మిగిలిన వారు మాత్రం అదంతా హుళక్కేనని కొట్టి పారేశారు. ఇక ఏలియన్లు ఉన్నాయని ఎక్కువగా నమ్మేవారిలో రష్యన్ల సంఖ్య అధికంగా ఉండగా.. మెక్సికో, చైనా, నెదర్లాండ్ ప్రజలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
వింతజీవులు కాదు.. గుడ్లగూబలే!
పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పది రోజులుగా వాట్సాప్, సామాజిక మాధ్య మాల్లో గ్రహాంతరవాసులని, వింత జంతువులని హల్చల్ చేసిన వింత పక్షుల మిస్టరీ వీడింది. విశాఖలోని పాతనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒడిశా స్టీవ్ డోర్స్ కంపెనీ మూడో అంతస్తు బాత్రూంలో ఉన్న ఆ పక్షులను అటవీ శాఖ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. బాత్రూం సీలింగ్ను తొలిగించి అక్కడ ఉన్న పక్షులను స్వాధీనం చేసుకున్నారు. మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు గ్రహాంతర జీవులు కావని, ఇవి గుడ్లగూబ జాతికి చెందినవని అటవీశాఖ సిబ్బంది నిర్ధారించారు. ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి అడుగున్నర ఎత్తు ఉన్నాయి. తల్లి పక్షి లేని సమయంలో వీటిని స్వాధీనం చేసుకుని జూ అటవీశాఖ సిబ్బంది తరలించారు. -
మానవుల్లానే ఉంటాయట..!
న్యూఢిల్లీ : ఏలియన్లు ఎలా ఉంటాయి?. ఈ ప్రశ్న తట్టగానే గుర్తొచ్చేది.. హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్లుగా చూపించిన చిత్రాలు. కానీ, నిజానికి ఏలియన్లు అలా వికృత రూపాల్లో ఉండవట. ఏలియన్లకు మనిషికి దగ్గర పోలిక ఉంటుందని ఆక్స్ఫర్డ్ పరిశోధన చెబుతోంది. హాలీవుడ్ సినిమాలు, ఫిక్షన్ సాహిత్యం తదితరాలు ఏలియన్లు మనుషులను పోలి ఉండవని చెప్పడం ప్రజల్లో అది పాతుకుపోయిందని పేర్కొంది. ఏలియన్ల గురించి ఆక్స్ఫర్డ్ చేసిన ఈ శోధనకు సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురితమయ్యాయి. మనిషి రూపరేఖలు కాలగమనంలో ఎలా మారుతూ వచ్చాయో.. అచ్చం అలానే ఏలియన్లు కూడా రూపాంతరం చెందాయని పరిశోధన వెల్లడించింది. ఏలియన్ల గురించి ఊహాజనితంగా చెప్పడం కంటే ప్రాక్టికల్గా చెప్పడం చాలా కష్టమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అందుకే భూమి వాతావరణం నుంచే తమ వెతుకులాటను ఆరంభించామని చెప్పారు. ఇప్పటివరకూ థియరిటికల్గా ఉన్న అంశాల( ఏలియన్లకు డీఎన్ఏ ఉండదు, అవి నైట్రోజన్ను పీల్చుకుంటాయి.)ను బేస్గా చేసుకున్నామని తెలిపారు. ఏలియన్లు రెండు కాళ్లతోనో నడుస్తాయా?. వాటికి ఆకుపచ్చని కళ్లు ఉంటాయా? అనే ప్రశ్నలకు తమ వద్ద ఇంకా సమాధానం లేదని చెప్పారు. కానీ, మనిషిని పోలిన అంశాలు వాటిలో ఉన్నాయని కచ్చితంగా చెప్పగలమని అన్నారు. -
ఏలియన్లు ఆమెను కిడ్నాప్ చేశాయంట!
సాక్షి : గ్రహాంతర వాసులు ఉన్నయా? అన్న చర్చ జరిగినప్పుడల్లా... జరిగిన ఘటనలు.. సాక్ష్యాలు మాత్రం అది నిజమేమోనన్న వాదనను తెరపైకి తెస్తుంటాయి. దీనికితోడు స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఈ విశ్వంలో మనకు తెలియని ప్రపంచాలు బోలెడు ఉన్నాయని.. ఎలియన్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కూడా. అదే సమయంలో రాజకీయ వేత్తలు, మేధావులు, సెలబ్రిటీలు కూడా తామూ ఫ్లైయింగ్ సాసర్(ఏలియన్లు వాడే వాహనాలు) లాంటి వాటిని చూశామని చెప్పటం చూశాం. అయితే అమెరికాలోని మియామి కి చెందిన ఓ పొలిటీషియన్ మాత్రం ఏలియన్లు ఏకంగా తనను కిడ్నాప్ చేశాయని వెల్లడించటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. 59 ఏళ్ల బెట్టినా రోడ్రిగుజ్ అగులెరా మియామి స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా కాంగ్రెస్కు పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆమె ఏలియన్ ఇంటర్వ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. తనకి ఏడేళ్ల వయసులో ఉన్న సమయంలో ఆడుకోమ్మని తల్లిదండ్రులు బయటకు పంపించగా.. ఏలియన్లు తనను తమ వెంట తీసుకెళ్లాయని ఆమె చెప్పారు. ‘మొత్తం మూడు ఏలియన్లు అక్కడ ఉన్నాయి. అవి నన్ను స్పేస్ షిప్లోకి తీసుకెళ్లి కాసేపు మాట్లాడాయి. ఓ విమానం లాగే అది ఉన్నప్పటికీ గుండ్రటి ఆకారంలో ఉంది. లోపల సీట్లు.. ఇతర పరికరాలు చాలా తేడాగా ఉన్నాయి. వాటి భాష నాకు అర్థం అవుతోంది. రియో డి జనెరియోలోని జీసస్ విగ్రహం గురించి అవి ప్రస్తావించాయి. భగవంతుడు అంటే మనిషి కాదు.. ఓ శక్తి మాత్రమేనని అవి నాతో చెప్పాయి. దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, అది అర్థం చేసుకునే శక్తి మనుషులకు లేదు. ఈ విశ్వంలో ఒక్క మతం మాత్రమే ఉంది’ అని అవి నాకు వివరించాయి అని ఆమె తెలిపారు. ఆపై అవి తనని ఇంటి వద్ద వదిలేశాయని ఆమె అన్నారు. ఆ తర్వాత కూడా టెలీపతి విధానం ద్వారా అవి తరచూ తనతో మాట్లాడేవని.. ఏఎస్ఐఎస్(ఉగ్రవాద సంస్థ కాదు) అనే ఈజిప్ట్ దేవత గురించి చెప్పాయని.. మాల్టా దీవుల్లో 30 వేల అస్థిపంజరాల గురించి.. సౌత్ ఫ్లోరిడాలోని కొరల్ కాస్ట్లే పిరమిడ్ చరిత్ర గురించి తనతో చర్చించాయని బెట్టినా చెప్పుకొచ్చింది. ఆమె వాదన అసంబద్ధం... రోడ్రిగుజ్ చెప్పే వాటిని కొట్టిపడేసే వాళ్లు లేకపోలేదు. ఆమె చెప్పేది చాలా అసంబద్ధంగా ఉంది. ఇలాంటి ప్రకటనల ద్వారా ఆమె గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. ప్రజలు ఆమెను గుడ్డిగా నమ్మే ప్రసక్తే లేదు అని రిక్ యాబొర్ అనే రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. దీనికి తోడు ఆమెకు పోటీ ఇస్తున్న రిపబ్లికన్ అభ్యర్థులు బ్రూనో బార్రిరో, రఖ్యూల్ రెగలదో.. ట్రాక్ రికార్డుల ఆధారంగా ప్రజలు వారిపై ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని రిక్ అంటున్నారు. డొరల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా పని చేసిన ఆమె.. తర్వాత వైస్ మేయర్గా కూడ ఆకొంత కాలం విధులు నిర్వహించారు. రెండేళ్ల క్రితం మహిళల కోసం నెలకొల్పిన ఓ ఇనిస్టిట్యూట్లో సహ భాగస్వామిగా ఉన్న ఆమెకు.. రాజకీయంగా మంచి పరపతి ఉంది. అయితే ఎటొచ్చి ప్రచారం కోసం బెట్టినా ఏలియన్ల కథను మళ్లీ తెరపైకి తీసుకురావటంతో.. అది ఆమె విజయానికి ఏ మేర సహకరిస్తుందన్నది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అగ్నిపర్వతంపై ఏలియన్లు
-
అగ్నిపర్వతంపై ఏలియన్లు
గ్రహాంతర వాసులు భూమ్మీద మనతో పాటు తిరుగుతున్నారా? మన చుట్టూనే ఉంటున్నారా? మనిషి అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో సంచరిస్తున్నారా? బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్తున్న లావా మధ్యలో ఏలియన్లు ఎలా తిరగగలుగుతున్నారు? సగటు వ్యక్తి నుంచి సైంటిస్టుల వరకూ భయపెట్టే ఈ ఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. వాషింగ్టన్ : అమెరికాలోని ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం రెండునెలల కిందట బద్దలైంది. అప్పటినుంచి ఈ పర్వతం నిప్పురవ్వలను వెదజల్లుతూ.. లావా కిందకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం వేడికి సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. అకాశంలో కూడా 40 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించడానికి సాధ్యమవుతోంది. ఈ అగ్ని పర్వతం బద్దలైన సమయంలో ఆ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక ఫ్లయింగ్ సాసర్.. అగ్నిపర్వతం, లావాకు దగ్గరగా తిరిగింది. అంతేకాక అగ్నిపర్వతం లోపలిదాకా వెళ్లడం, లావా మీద ఏవో ఆకారాలు నడుస్తున్నట్లు కనిపించింది. ఇది కచ్చితంగా మానవ జాతికి అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేదే అని సైంటిస్టులు అంటున్నారు. ఒక కాంతిపుంజం ఆకారంలోని ఆబ్జెక్ట్ను స్పష్టంగా వీడియోల్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో జూన్ 9న రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను అగ్నిపర్వతాన్ని పరిశీలిస్తున్న శాటిలైట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ - ఆగస్టు మధ్య కాలంలో పలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లను పలు శాటిలైట్లు గుర్తించాయి. ఇదిలా ఉండగా ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం వయసును అంచనా వేయలేమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ అగ్నిపర్వతం ప్రతి 6 లక్షల సంవత్సరాలకోసారి బద్దలవుతుందని సైంటిస్టులు తెలిపారు. ఎల్లోస్టోన్ అగ్నిపర్వతానికి చాలా సార్లు గ్రహాంతరవాసులు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని.. ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ తెలిపారు. ఎల్లోస్టోన్కు గ్రహాంతరవాసులకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. -
మూన్ టు మార్స్
అడిలైడ్: ఎన్నో ఏళ్లుగా విశ్వాంతరంలో గ్రహాంతరవాసుల ఉనికి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలోనే తానే గ్రహాంతరవాసిగా మారుతాడని బహుశా అతను ఊహించి ఉండడు! ఇతర గ్రహాలపై మానవుడు కాలనీలు కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస అంతరిక్ష పరిశోధనలు.. ఆ రోజు మరెంతో దూరంలో లేదని చెప్పకనే చెబుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న జనాభా, కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయాలు, విజృంభిస్తున్న కొత్త వ్యాధులు.. ఇవన్నీ భూగోళాన్ని నివాసానికి పనికిరాని గ్రహంగా మార్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవుడికి దిక్కు ఏమిటి? అని అందరూ ఆలోచిస్తుండగా పక్క గ్రహాల నుంచి మానవుడికి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. మరి మానవుడు మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా? చంద్రుడిపైకి వెళ్లాలా, అంగారకుడి మీదకెళ్లాలా? అనే ఎన్నో అనుమానాలు, అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో చంద్రుడిపై మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగితే తర్వాత లక్ష్యం మాత్రం అంగారకుడే (మార్స్) అవుతుంది. భూమితో పలు రకాల పోలికలు ఉండటమే దానికి కారణం. ఈ నేపథ్యంలో చంద్రుడిపై శాశ్వతంగా నిర్మించే కుగ్రామం అంగారక గ్రహాన్ని చేరుకోడానికి తొలిమెట్టు అవుతుందని ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వెల్లడించింది. అంగారక గ్రహానికి చేరుకుని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. తమ తొలి లక్ష్యం చంద్రుడిపై శాశ్వత గ్రామాలను ఏర్పరచడం అయితే అంతిమ లక్ష్యం మాత్రం అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడమేనని ఈఎస్ఏ తెలిపింది. మానవ మనుగడ విస్తరణకు చంద్రుడు ఒక చక్కని ప్రదేశమని అడిలైడ్లో 4 వేల మంది అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులతో జరిగిన వార్షిక సమావేశంలో ఈఎస్ఏ పేర్కొంది. ‘ఓ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని 17 ఏళ్లుగా నివసిస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత, అనువైన గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం. అలాగే అంగారక గ్రహంపైకి తొలి హ్యూమన్ మిషన్ ప్రారంభించే దశలో ఉన్నాం’అని ఈఎస్ఏకు చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. ‘చంద్రుడిపైకి వచ్చే పదేళ్లలో కొన్ని మిషన్లకు ప్రణాళికలు తయారు చేశాం. ఈ మిషన్లు ఓ ఉద్యమాన్ని లేవనెత్తి చంద్రుడిపై శాశ్వత గ్రామాన్ని నిర్మించేందుకు అవసరమైన సమాచార సంపదను సృష్టిస్తాయి’అని వివరించారు. మరోవైపు 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా శాశ్వత లూనార్ కాలనీ (చంద్ర గ్రామం)ని ఏర్పాటు చేసేందుకు స్పేస్ ఏజెన్సీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ‘డీప్ స్పేస్ గేట్వే’అనే కార్యక్రమంలో భాగంగా తొలి లూనార్ స్పేస్ స్టేషన్ను నిర్మించే ప్రాజెక్టును నాసా (నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్) చేపట్టింది. ఈ లూనార్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రష్యా స్పేస్ ఏజెన్సీ, నాసా ఇటీవల సహకార ఒప్పందం కూడా చేసుకున్నాయి. -
ఐఎస్ఎస్ వద్ద కనిపించింది ఏలియన్లేనా?
-
ఐఎస్ఎస్ వద్ద కనిపించింది ఏలియన్లేనా?
సాక్షి, ప్రత్యేకం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కిందిగా ఆకాశంలో ప్రయాణించిన మూడు వింత ఆకారాలు కాన్స్ఫిరసీ థియరిస్టులను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కాన్స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్, బ్లేక్లు బయటపెట్టారు. అయితే, అవి ఏలియన్లా? కాదా? అన్న అంశాలను మాత్రం బయటపెట్టలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కిందుగా వింత ఆకారాలు ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు చెప్పారు. అయితే, బ్రెట్, బ్లేక్లు తీసిన వీడియోను తిలకించిన వారు మాత్రం.. అవి స్పేస్షిప్ లేదా మేఘాలు అయ్యుంటాయని కామెంట్స్ చేశారు. -
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?
-
ఏలియన్స్ ఉన్నాయంట?!
భూమికి దగ్గరగా గ్రహాంతర వాసులు తరచుగా వచ్చి పోతున్నారా? ఏలియన్స్ గురించి నిగ్గు తేల్చిన భారతీయ కుర్రాడు బెంగళూరు : గ్రహాంతర వాసులు ఉన్నారా? వాళ్లు తరచూ భూమికి వచ్చిపోతున్నారా? మనల్ని నిరంతరం గమనిస్తున్నారా? అనే ప్రశ్నలు మనలో చాలా మందిని వేధిస్తున్నాయి. మనల్నే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు సైతం ఇవే అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి విలువైన పరిశోధన జరిపి గ్రహాంతర జీవులు గురించిన సమాచారాన్నిభారతీయ యువ శాస్త్రవేత డాక్టర్ విశాల్ అందించారు . భూమికి 3 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత వద్ద గ్రహాంతర వాసులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహాంతర వాసులును కనుగొనేందుకు చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రహాంతర వాసుల స్పేస్క్రాఫ్ట్ పంపిన 15 రేడియో సిగ్నల్స్ను డాక్టర విశాల్ గుర్తించారు. ఎలా గుర్తించారు? భూమికి సుదూరంగా ఉండే ఎఫ్ఆర్బీ (ఫాస్ట్ రేడియో బరస్ట్) సంకేతాలను ఆస్ట్రేలియాలోని పెర్క్స్ టెలిస్కోప్ నుంచి తొలిసారి గుర్తించారు. తరువాత ప్రపంచంలోని పలు టెలిస్కోప్లు ఈ సంకేతాలను గుర్తించాయి. ఎంత దూరంలో? భూమికి 3 మిలియన్ కాంతి సంతవత్సరాల దూరంలో ఈ గ్రహాంతర వాసులు లేదా ఎఫ్ఆర్బీ ఉంది. ఈ ఎఫ్ఆర్బీని తొలిసారిగా 2012 నవంబర్2న గుర్తించారు. అప్పట్లో కొన్ని రేడియో సంకేతాలు పంపింది. తరువాత మళ్లీ ఇన్నేళ్ళకు 15 రేడియో సిగ్నల్స్ను పంపింది. వాటిని మన శాస్త్రవేత్తలు వినడం.. గుర్తించడం జరిగింది. సంకేతాల విశ్లేషణ గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన సంకేతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు విశ్లేషించే పనిలో పడ్డారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, మరికొందరు సైంటిస్టులు గ్రహంతర వాసులు ఉన్నారని.. వాళ్లు మనకంటే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ని చెబుతున్నారు. ఏలియన్స్ గురించి హాకింగ్స్తో సహా చాలామంది పరిశోధనలు జరుపుతున్నారు. -
నక్షత్రాన్ని ఆక్రమిస్తున్న ఏలియన్లు..!
న్యూఢిల్లీ: ఏలియన్లు ఆక్రమిస్తున్న నక్షత్రంగా అంతరిక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్న 'టాబీ స్టార్'పై మారో మారు నీలి నీడలు పడ్డాయి. దీంతో ఆ నక్షత్ర నుంచి వెలువడే కాంతి పెద్ద మొత్తంలో తగ్గిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అలర్ట్ అయిన శాస్త్రవేత్తలు టెలిస్కోపును ఆ నక్షత్రం వైపు మళ్లించారు. ఆకాశంలో జరగుతున్న సన్నివేశాన్ని చూసి షాక్కు గురయ్యారు. 2015లో తొలిసారిగా టాబీ స్టార్ అనే నక్షత్రాన్ని అంతరిక్షంలో గుర్తించిన పరిశోధకులు.. దాన్ని సొంతం చేసుకునేందుకు ఏలియన్లు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓ నక్షత్రాన్ని ఏలియన్లు ఎలా సొంతం చేసుకుంటాయి?. నక్షత్రాన్ని సొంతం చేసుకోవడం అంటే దాని నుంచి వెలువడే శక్తి మొత్తాన్ని గ్రహించి తమ అవసరాలకు వాడుకోవడం. ఇక్కడ ఏలియన్లు చేస్తున్న పని అదే. టాబీ స్టార్పై ఓ 'డైసన్ స్పియర్'( డైసన్ స్పియర్కు ఒక ఆకారం అంటూ లేదు. కానీ దాని నిర్మాణం భారీ స్ధాయిలో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో కూడా శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. అందుకే దీన్ని హైపోథిటికల్గా భావిస్తున్నారు)ను నిర్మించి నక్షత్రం నుంచి వెలువడే కాంతి శక్తిని మొత్తం గ్రహించేందుకు ఏలియన్లు యత్నిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఏలియన్లకు సంబంధించిన ఎటువంటి రేడియో సిగ్నల్స్ ఆ సమయంలో రాలేదని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలకు ఎలా తెలిసింది.. 2015లో అంతరిక్షంలో అన్వేషణ కొనసాగిస్తున్న నాసా పరిశోధకులు ఓ నక్షత్రం నుంచి వెలువడుతున్న కాంతిలో తేడాలు రావడాన్ని గుర్తించారు. దీంతో అది ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆ నక్షత్రానికి 'టాబీ స్టార్' అని పేరు పెట్టారు. పరిశోధనలో భాగంగా టెలిస్కోపులను ఉపయోగించి నక్షత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ నెల 19వ తేదీ వరకూ ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న కాంతిలో మార్పులు కనిపించలేదు. మే 19వ తేదీన ఏమైంది.. కాంతిలో తేడాలు కనిపించిన నాటి నుంచి టాబీ స్టార్పై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నక్షత్రం నుంచి సాధారణంగా వెలువడే కాంతి కన్నా మూడు శాతం తక్కువగా వెలువడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన బృందం కెప్లర్ టెలిస్కోప్ సాయంతో నక్షత్రంపై ఏం జరుగుతుందో గమనించడం ప్రారంభించారు. ఏదో గుంపు నక్షత్రం వైపు ప్రయాణిస్తున్నట్లు కనిపించడాన్ని గుర్తించారు. దీనిపై మాట్లాడిన పరిశోధకులు అంతరిక్ష ధూళి, అంతరిక్ష వాయువుల కారణంగా కనిపించే గుర్తులు వేరుగా ఉంటాయని చెప్పారు. టాబ్ స్టార్పై కనిపించిన ఆకారాలు గ్రహాంతరవాసులవి కావొచ్చని అభిప్రాయపడ్డారు. -
మన పొరుగునే గ్రహాంతరవాసులు!
లండన్: అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహం మరొకటి ఉందా? అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగిలింది. దీనికి సంబంధించి ఖగోళ పరిశోధకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. భూమిని పోలిన గ్రహం ఒకటి మనకి సమీపంలో ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, ఇది భూమి నుంచి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వెల్లడించారు. ఈ గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉందని, గ్రహాంతరవాసుల జీవనానికి అనుకూలమైన వాతావరణం ఈ గ్రహంపై ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్లానెట్ ప్రోక్సిమా బి అనే ఈ గ్రహాన్ని గతేడాది ఆగస్టులో కనుగొన్నారు. ఇది దాదాపు భూమి పరిమాణంలో ఉంటుంది. యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్కు చెందిన పరిశోధకులు ఈ గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం తన ఉపరితలంపై నీరు ఉండే స్థాయిలో ఆ నక్షత్రం నుంచి కాంతిని గ్రహిస్తోందని వెల్లడించారు. అయితే ఇక్కడ జీవం మనుగడ సాగించగలదా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. -
ఇక్కడ గ్రహాంతరవాసులు ఉండొచ్చు..!
మనం నివసిస్తున్న భూమికి ఓ చంద్రుడు ఉన్నట్లే.. శనిగ్రహానికీ ఎన్ సెలాడస్ అనే ఒక చంద్రుడు ఉన్నాడు. దానిమీద నీళ్లు ఉన్నట్లు కూడా తేలింది. ఇప్పుడు ఆ చంద్రుడి మీద గ్రహాంతరవాసులు ఉండే అవకాశం కచ్చితంగా ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతోంది. ఎన్ సెలాడస్ మీద ఉన్న మంచు కింద నీళ్లు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి నమూనాలను సేకరించి పరిశీలించగా, అందులో 98 శాతం నీళ్లు ఉన్నట్లు తేలింది. మిగిలిన 2 శాతం కూడా హైడ్రోజన్ , కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని బట్టి చూస్తే అక్కడ జీవం ఉందని తెలుస్తోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన సౌత్వెస్ట్ రీసెర్చ్ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త హంటర్ వైట్ తెలిపారు. బహుశా తాము మళ్లీ అక్కడకు వెళ్లి జీవానికి సంబంధించిన ఆనవాళ్లనూ చూడాల్సి ఉందని చెప్పారు. అసలు వేరే గ్రహం మీద జీవాన్ని కనుక్కోవడమే చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి మన చంద్రుడితో పోలిస్తే ఎన్ సెలాడస్ చాలా చిన్నది. చంద్రుడిలో సుమారు 15 శాతం పరిమాణంలో మాత్రమే ఉండే ఎన్ సెలాడస్ మీద జీవానికి కావల్సిన రసాయన ఇంధనం ఉందన్న నిర్ధారణ భూగ్రహానికి వెలుపల జీవం మీద జరుగుతున్న పరిశోధనలో మైలురాయి అని ఆమె చెప్పారు. -
గ్రహాంతర వాసులు ఉన్నారా? లేదా ?
-
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?
⇒ సుదూర విశ్వం నుంచి భూమిని తాకుతున్న ఎఫ్ఆర్బీలు ⇒ వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు ఉన్నారా? అత్యాధు నిక టెక్నాలజీ సాయంతో వారు అంతరిక్ష నౌకలనూ నడపగలుగుతున్నారా? దీనికి అవునంటున్నారు హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు. ఫాస్ట్ రేడియో బరస్ట్స్(ఎఫ్ఆర్బీ)లపై జరిపిన పరిశోధనలతో తామీ అంచనాకు వస్తున్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త మనస్వి లింగం అంటున్నారు. సుదూర విశ్వం నుంచి.. మీకు రేడియో తరంగాల గురించి తెలుసుకదా.. సెల్ఫోన్లు మొదలుకుని.. మిలిటరీ కమ్యూనికేషన్స్ వరకూ అనేక చోట్ల వీటిని వాడుతుంటాం. వీటిల్లో కొన్ని తక్కువ శక్తి కలిగి ఉంటే.. ఇంకొన్ని అత్యధిక శక్తి కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో.. ఎలా ప్రసారం చేయాలో.. తీవ్రతను ఎలా ని యంత్రించాలో మనకు తెలుసు. కానీ.. ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిని తాకాయనుకోండి. ఎలా ఉంటుంది?. అది కూడా కేవలం 5 మిల్లీ సెకన్ల పాటు మాత్రమే ఈ తరంగాలు ప్రసారమవుతూంటే? ఆసక్తికరంగా ఉంటుంది కదూ.. ఈ రకమైన ఎఫ్ఆర్బీను ఆస్ట్రేలియాలోని పార్క్స్ వేదశాల శాస్త్రవేత్తలు 2007లో తొలిసారి గుర్తించారు. విశ్వం నుంచి వెలువడే అనేకానేక రకాల తరంగాల్లో ఇదీ ఒకటి కాబోలు అనుకున్నారు. అయితే 2007 తరువాత ఇప్పటివరకూ ఇలాంటి ఎఫ్ఆర్బీలు కొన్ని డజన్లు గుర్తించడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. 2015లో మెక్గిల్ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త ఇవన్నీ ఒకే దిక్కు నుంచి వస్తున్నట్లు గుర్తించడం.. గతేడాది ఇవన్నీ 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత నుంచి వస్తున్నట్లు గుర్తించడంతో విషయం కొంచెం సీరియస్ అయింది. ఎంతో దూరాన్ని దాటుకుని.. ఈ ఎఫ్ఆర్బీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజసిద్ధమైనవా? లేక ఎవరైనా సృష్టిస్తున్నారా? అన్న అంశాలను తెలుసుకునేందుకు అవి లోబ్, మనస్వీ లింగంల బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రహాంతర వాసులెవరో వీటిని సృష్టించేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వీరు ప్రతిపాదిస్తున్నారు. సౌర శక్తి ద్వారా భారీ సైజు ట్రాన్స్మిటర్ల (ఒక్కొక్కటీ గ్రహం సైజు)తో ఈ రేడియో తరంగాలను సృష్టిస్తున్నారని.. కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలను నడిపించేందుకు వీటిని ఉపయోగిస్తూండవచ్చని అంటున్నారు. ‘‘ఈ వ్యవస్థలో 2 భాగాలున్నాయి. సోలార్ ప్యానె ల్స్ వంటి వాటితో శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే.. రేడియో తరంగాలను ప్రసారం చేసేది రెండోది. ఈ తరంగాల సాయంతోనే లైట్ సెయిల్ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూంటాయి’’అని మనస్వి అంటున్నారు. కోట్ల దూరాన్ని దాటుకుని భూమిని చేరుతున్న ఎఫ్ఆర్బీల శక్తిని పరిశీలిస్తే ఆ రేడియో ట్రాన్స్మిటర్ల సైజు అంచనా వేయవచ్చని.. భూ మి వ్యాసార్థానికి రెట్టింపు సైజున్న ట్రాన్స్మిటర్లను వాడి ఉంటారంటున్నారు. అయితే.. ఎఫ్ఆర్బీలు గ్రహాంతరవాసుల సృష్టి అయ్యేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ ఇప్పటివరకూ పరిశీలించిన ఎఫ్ఆర్బీల సంఖ్య తక్కువ కాబట్టి అప్పు డే ఒక అంచనాకు రాలేమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సముద్రతీరంలో ఏలియన్ల సైన్యం!
పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్మీడియలో అలజడి సృష్టిస్తోంది. కాలిఫోర్నియాకు చేరువలోని పసిఫిక్ తీరంలో ఇందుకు సంబంధించిన చిత్రాలను సెక్యూర్ టీం10 అనే వెబ్ సంస్ధ ప్రచురించింది. ఏలియన్ బేస్ విస్తీర్ణయం దాదాపు 2 మైళ్లకు పైగా ఉందని ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణలు ఒకరు తెలిపారు. ఏలియన్లు అటువైపుగా ప్రయాణించి ఉండొచ్చని లేదా భవిష్యత్తులో భూమిపై దాడి చేసేందుకు వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో తలదాచుకుంటూ ఈ వ్యూహాన్ని అవి కొనసాగిస్తూ ఉండొచ్చని అన్నారు. కాగా, కొన్నేళ్లు ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో వేరే జీవిని గురించిన పరిశోధనలు జరగుతూ వస్తున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ విశ్వాంతరాళంలో మరో జీవి కచ్చితంగా ఉందని వారు మనకంటే ఎన్నో రెట్లు సాంకేతికంగా ముందున్నారని చెప్పిన విషయం తెలిసిందే. -
బృహస్పతిపైకి నాసా ల్యాండర్!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసుల ఉనికిని కను గొనేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగంలో భాగంగా బృహస్పతి గ్రహంపైకి రోబోటిక్ ల్యాండర్ను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రహంపై మంచుతో కప్పబడి ఉండే యూరోపా అనే ఉప్పునీటి సరస్సులో గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్ల గురించి పరిశోధన చేయాలని భావిస్తోంది. యూరోపా సరస్సులోని నీరు భూమ్మీది సముద్రాల్లోని నీరుకు రెండింతలు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ యూరోపా ప్రాంతంపై అధ్యయన సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చేందుకు గతేడాది ప్రాథమిక పరిశోధన ప్రారంభించిన నాసాలోని ప్లానెటరీ సైన్స్ డివిజన్ .. ఫిబ్రవరి 7న తమ నివేదికను నాసాకు సమర్పించింది -
ఏలియన్లు కనిపించాయా?
అంగారక గ్రహంపై ఏలియన్లు కనిపించాయా?. చాలా మంది థియరిస్టులు మార్స్ గ్రహంపై జీవరాశి ఉందని నిరూపించడానికి ఆ గ్రహానికి సంబంధించిన ప్రతి ఫోటోను పరిశీలిస్తున్నారు. తాజాగా మార్స్ గ్రహాంపై క్యూరియాసిటీ రోవర్ తీసిన కొన్ని ఫోటోల్లో ఏలియన్లు ఉన్నాయని ఇది అంగారకుడిపై జీవరాశి నివసిస్తోందనడానికి సాక్ష్యం అని అంటున్నారు. ఆ చిత్రాల్లో రోవర్ వైపు తదేకంగా చూస్తున్న ఓ ఏలియన్, ఒక స్నెయిల్ ఉన్నాయి. దీంతో వారి వాదన మరింత బలపడుతోంది. మార్స్ పై మానవ జీవనానికి అవకాశం ఉందా? అనే లక్ష్యంతో 2012లో క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించారు. అప్పటినుంచి రోవర్ తరచూ మార్స్ కు సంబంధించిన ఫోటోలను భూమికి పంపుతూ ఉంది. ఈ ఫోటోల్లో పలుమార్లు ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. తాజాగా బయటకొచ్చిన ఫోటోల్లో చుట్టుపక్కల ప్రాంతాలతో ఏలియన్ రంగు కలిసిపోయి అచ్చు ఆ ప్రాంతంలోని ఓ రాయిలా కనిపిస్తోంది. -
ఏలియన్స్తో జాగ్రత్త!
లండన్: గ్రహాంతర వాసులతో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. భూమిపై మనం ఉన్న సంగతి వారికి తెలియజెప్పడం ప్రమాదకరమని ఆయన అన్నారు. గ్రహాంతరవాసులు సాంకేతికత పరంగా మన కన్నా ఎంతో ముందుండొచ్చని అభిప్రాయపడ్డారు. 1490ల్లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు, అక్కడి స్థానిక ప్రజలకు ఏం జరిగిందో.. అలాంటి పరిస్థితే మనకూ రావచ్చన్నారు. ఈ విషయాన్ని ‘స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరెట్ ప్లేసెస్’ అనే ఆన్లైన్ చిత్రంలో వివరించారు. గ్రహాంతర వాసులు సాంకేతికతలో మనకన్నా వందల కోట్ల సంవత్సరాల ముందు ఉండి... మనం సూక్ష్మజీవులకు ఇచ్చినంత ప్రాధాన్యం కూడా వారు మనకు ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు. -
ఏలియన్లతో సంబంధాలు వద్దు: హ్యాకింగ్
లండన్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ ఏలియన్ల గురించి మరోసారి మానవాళిని హెచ్చరించారు. ఏదైనా కొత్త ప్రదేశాన్ని, జీవరాశులను కనిపెడితే మనం(మానవులు)సంతోషిస్తారని, ఏలియన్లు అలా భావించకపోవచ్చని అన్నారు. మనుషుల గురించి ఏలియన్లకు తెలిస్తే మన కంటే టెక్నాలజీ వినియోగంలో ఎన్నో రెట్లు ముందున్న వారు భూమిని నాశనం చేసే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యనించారు. హ్యాకింగ్స్ నిర్మించిన సరికొత్త చిత్రం 'స్టీఫెన్ హ్యాకింగ్స్ ఫేవరేట్ ప్లేసెస్' ద్వారా ఈ మెసేజ్ ను ఆయన ప్రపంచానికి తెలియజేశారు. కొలంబస్ మొదటిసారి అమెరికాను కనుగొన్నప్పుడు అక్కడి వారు ఆయనపై దాడి చేసినట్లు.. ఏలియన్లు మానవుల గురించి తెలుసుకున్నప్పుడు కూడా అలానే ప్రవర్తించే అవకాశం ఉందని చెప్పారు. స్టీఫెన్ హ్యాకింగ్స్ నిర్మించిన చిత్రం వీక్షించేవారిని ఆయన విశ్వంలోని ఐదు ప్రదేశాలకు అంతరిక్షనౌక ద్వారా తీసుకువెళతారు. భూమికి 16 కాంతి సంవత్సారాల దూరంలో ఉన్న, నివాసయోగ్యమైన గ్లీస్ 832సీ అనే గ్రహాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. ఏదో ఒక రోజు సినిమాలో చూపినట్లు గ్లీస్ 832సీ లాంటి గ్రహం నుంచి భూమికి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆ సిగ్నల్స్ కు సమాధానం ఇవ్వడంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వయసు పెరిగేకొద్దీ భూమి మాత్రమే విశ్వంలో జీవరాశి కలిగిన గ్రహం కాదనే తన నమ్మకం బలపడుతోందని చెప్పారు. ప్రయోగాలతో యుక్తవయసును గడిపేసిన తాను ప్రస్తుతం ఏలియన్లను కనుగొనడానికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కూడా విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయని హ్యాకింగ్స్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
భారత్పైకి ఏలియన్స్ దండయాత్ర!?
మీరు నమ్మండి.. నమ్మకపోండి. కానీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ప్రభుత్వానికి అందే వేలాది ప్రశ్నల్లో.. ప్రజలకు ఉపయోగపడేవి.. సమాచారాన్ని ఇచ్చేవే కాదు.. ప్రభుత్వ అధికారులను తికమక పెట్టే వికృతమైన వెర్రీమొర్రి ప్రశ్నలు కూడా ఎన్నో ఉంటున్నాయి. రామ్లీలా నాటకంలో ప్రధాని మోదీ నటించారా? మహాత్మాగాంధీ ఐక్యూ ఎంత? దేశంలోని పచ్చగా ఉన్న చెట్లు ఎన్ని, ఎండిపోయినవి ఎన్ని? రాఖీపూర్ణిమ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బూష్కు పంపిన లడ్డూలు ఎందుకు వెళ్లలేదు? ఇలాంటి వెర్రి ప్రశ్నలెన్నో ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చాయి. కానీ తాజాగా ఆర్టీఐ ద్వారా తెరపైకి వచ్చిన ప్రశ్న మాత్రం ఈ వెర్రి ప్రశ్నల్లోనే మహా వెర్రి ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుకంటారా? ముంబైకి చెందిన అజయ్ కుమార్కు ఒక డౌటు వచ్చింది. దేశం మీద ఒక్కసారిగా గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దండయాత్రకొస్తే.. దానిని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా? అంటూ ఆయనకు సందేహం వచ్చింది. దీంతో వెంటనే ఆర్టీఐ ద్వారా ఓ ప్రశ్నాస్త్రాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. ’గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దేశంపై దండయాత్రకు వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా?.. ఈ అంశం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నాకు చెప్పాలి. ప్రభుత్వం వాటిని ఓడించడానికి ఏం చేయబోతున్నది? విల్ స్మిత్ లేకుండా మనం వాటిని ఎదర్కోగలమా?’ అంటూ ఆయన ప్రశ్నించాడు. 1996నాటి సైన్స్-ఫిక్షన్ హాలీవుడ్ సినిమా ’ఇండింపెండెన్స్ డే’ సినిమాలో విల్ స్మిత్ ఎలియన్స్ను ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన సాయం తీసుకోమంటూ ఉదారంగా సలహా కూడా ఇచ్చాడు. తాజాగా ట్విట్టర్ లో జర్నలిస్టు అభిమాన్యు ఘోషల్ పెట్టిన ఈ ఆర్టీఐ ప్రశ్న ఫొటోకాపీ వైరల్ గా మారిపోయింది. -
పదేళ్లలో గ్రహాంతర వాసుల ఉనికి..
న్యూయార్క్: భూమికి సరిగ్గా 40 కాంతి సంవత్సరాల దూరంలో ‘ట్రాపిస్ట్-1’ నక్షత్రం చుట్టూ భూమి పరిణామంలో మూడు గ్రహాలు తిరుగుతున్న విషయాన్ని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల బృందం మే రెండవ తేదీన కనిపెట్టిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ మూడు గ్రహాల్లో జీవి ఉందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వారు కృషి చేస్తున్నారు. భూమిని పోలిన, అంటే జీవి బతికేందుకు అవకాశమున్న వాతావరణ పరిస్థితులు ఆ మూడు గ్రహాల్లో ఉన్నాయో, లేదో కనుగొనేందుకు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుందని, ఆ వాతావరణంలో కచ్చితంగా జీవి ఉందా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు పది నుంచి పాతికేళ్లు పడుతుందని వారు చెబుతున్నారు. విశ్వాంతరాళంలో భూమిని పోలిన గ్రహాలు అనేకం ఉన్నాయనే విషయాన్ని ఎప్పటి నుంచో అంచనా వేసిన ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులను కనుగొనేందుకు ఎప్పటి నుంచో వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెల్సిందే. అందులో రకరకాల మార్గాల్తో శాస్త్రవేత్తలు సంకేతాలు పంపిస్తున్న విషయం కూడా అవగతమే. సౌర కుటుంబం వాతావరణంలోకి ఎగిరే పళ్లాల లాంటి ఆకారాలు వచ్చినప్పుడల్లా అవి గ్రహాంతరవాసుల వాహనాలు కావచ్చుంటూ వాటికి సంకేతాలు పంపించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మన సౌర కుటుంబానికి వెలుపల భూమిని పోలిన గ్రహాలు మూడు ఉన్న విషయాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొనడంతో ఆ గ్రహాలపై జీవి ఉనికిని కనిపెట్టడం కోసం వారు దృష్టిని కేంద్రీకరించారు. ఈ మూడు గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే భూమి లాంటి వాతావరణం కలిగి ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు. నాసా టెలిస్కోప్ ద్వారా తాము ఈ నిర్ణయానికి వచ్చామని వారు చెప్పారు. 2018 నాటికి ‘జేమ్స్ వెబ్ స్పేస్’ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తుందని, అప్పుడు దాని ద్వారా భూమిని పోలిన గ్రహాల వాతావరణంలో గ్యాస్ ఉందా, లేదా ? అన్న అంశాన్ని స్పష్టంగా చూడవచ్చని, జీవి ఉన్నప్పుడు వాతావరణంలో గ్యాస్ నిక్షేపాలు కనిపిస్తాయని ‘నేచర్’ జర్నల్లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల తరఫున వ్యాసం రాసిన ప్రొఫెసర్ మైఖేల్ గిలాన్ తెలిపారు. గ్యాస్తోపాటు నీటి నిక్షేపాలు ఉంటే జీవి బతికే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. నక్షత్రం వైపున్న ఈ భూమిని పోలిన గ్రహాల ముందు భాగంలో ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉందని, వెనకభాగం పూర్తి చీకటిగా ఉండే అవకాశం ఉందని, ఈ రెండు ప్రాంతాల్లో జీవి ఉండే అవకాశం లేదని, ఇరుపక్కల ప్రాంతాలు మాత్రం కొంచెం శీతలంగా ఉన్నాయని, ఆ ప్రాంతంలో జీవి ఉండే ఆస్కారం ఉందని ఆయన చెప్పారు. -
ఎలియన్స్ నన్ను అపహరించి..
గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? భూమి మీద కాకుండా వేరే గ్రహంపై కూడా జీవం ఉనికి ఉందా? అన్నది కచ్చితంగా నిర్ధారణ కాకపోయినా.. ఎలియన్స్ విషయంలో ఎన్నో ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ఎలియన్స్ ఉన్నారా? లేరా? అన్నదే పెద్ద చిక్కుముడి అంటే.. ఓ మహిళ అయితే ఈ విషయంలో అనేకానేక విస్మయకర విషయాలు చెప్పింది. ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తనను గ్రహాంతరవాసులు అపహరించుకుపోయారని, తన పడకగది గోడల నుంచి గ్రహాంతర వాసులు తరచూ బటయకు వచ్చి తనను తీసుకెళుతారని బ్రిటన్కు చెందిన లీసా చెప్పుకొచ్చింది. తన గది గోడల నుంచి బయటకు వచ్చే ఎలియన్స్ తరచూ తనను తీసుకెళ్లేవారని, అలా వాటితో వెళ్లడం వల్ల అవి తన కుటుంబసభ్యుల్లా మారిపోయావని ఆమె తెలిపింది. ఎర్త్ మిస్టరీ న్యూస్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎలియన్స్పై తన శరీరాన్ని తరచూ పరిశీలించేవని, అలా చేస్తుంటే అవి తనను రేప్ చేస్తున్నాయా అనే భావన కలిగేదని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేదని పరిశోధకులు భావిస్తున్నారు. -
‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట
గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఈ జీవులపై ఎన్నో కథలు మరెన్నో ఊహాగానాలను మనం వింటున్నాం. వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరవాసులపై అందరికీ అంతులేని ఆసక్తి. కొందరు గ్రహాంతరవాసులను చూశాం అంటారు..మరికొందరు గుడ్రంగా ఉండే పళ్లాల్లో వచ్చారు అంటారు. అసలు భూమి మీద తప్ప మరో గ్రహాంపై జీవం ఉండే అవకాశం లేదని కొంత మంది శాస్త్రవేత్తలు ఈ వదంతులను కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రహాంతర వాసుల జాడ కోసం ఏళ్లుగా కొనసాగుతున్న పరిశోధనకు మరింత ఉపయోగపడేలా ఒక పెద్ద టెలిస్కోపును చైనా నిర్మించింది. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా దీంతో మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈ భారీ టెలిస్కోప్ను అంతరిక్షంలోని ఇతర జీవజాతుల ఆనవాళ్లు పసిగట్టేందుకు ఉపయోగించనున్నారు. ఏలియన్ల గురించి పరిశోధనలు జరుగుతున్న తరుణంలో దాదాపు 30 ఫుట్బాల్ మైదానాల సైజులో చైనా నిర్మించిన 500 మీటర్ల అపర్చర్ స్పెరికల్ టెలిస్కోపు ప్రపంచంలోని పెద్ద టెలిస్కోపుల్లో ఒకటి. దాదాపు 4,450 ప్యానల్స్ ఉపయోగించి తయారు చేసిన దీని వ్యాసార్థం 500 మీటర్లు, కటక సామర్థ్యం 140 మీటర్లు. 2016 సెప్టెంబరు నుంచి దీనిని చైనా సైంటిస్టులు వాడుకలోకి తీసుకురానున్నారు. ఈ టెలిస్కోప్ చాలా శక్తివంతమైన భూమి ఆకర్షణ తరంగాలను సృష్టిస్తుంది. టెలిస్కోపు ద్వారా భూమి, విశ్వం, మిగతా గ్రహాల గురించి కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా లభించిన సమాచారాన్ని విశ్లేషించి ఇతర గ్రహాల మీద ఉన్న జీవజాతులు, ఏలియన్ల గురించి త్వరగా కనుక్కునే వీలుందని సమాచారం. దీనిని నైరుతి చైనాలోని గాయిజూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో ఏర్పాటు చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపు రూ. 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. -
మైసూరులో గ్రహాంతర వాసులు..!
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా పిరాయపట్టణ తాలూకాలో గ్రహాంతరవాసులు కనిపించారంటూ వదంతులు వ్యాపించాయి. సోమవారం రాత్రి పిరాయపట్టణ తాలూకా సూలకోటె గ్రామానికి చెందిన ఓ రైతు అర్ధరాత్రి తన పొలంలో పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అదే సమయంలో ఆకాశం నుంచి భారీ వెలుగుతో వచ్చిన ఫ్లయింగ్ సాసర్(గ్రహాంతర నౌక) భూమిని ఢీ-కొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని రైతు గ్రామస్థులతో చెప్పడంతో క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా వ్యాపించింది. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఏలియన్స్ గుట్టువిప్పే టెలిస్కోప్
వాషింగ్టన్: మానవుడు సాంకేతికంగా ఎంత అభివృద్ధిని సాధిస్తున్నా ఇంకా విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో సవాలు విసురుతూనే ఉన్నాయి. వాటిలో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) గురించిన కథనాలు ఒకటి. అసలు గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా.. లేదా.. అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఈ మిస్టరీని ఛేదించడానికి నాసా నడుంబిగించింది. దీని కోసం హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు అధిక సామర్థ్యం ఉన్న ‘ ది వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్’ ను (డబ్ల్యూఎఫ్ఐఆర్ఎస్టీ) రూపొందిస్తోంది. విశ్వంలోని అంతుపట్టని రహస్యాలను కళ్లకు కట్టినట్టు చూపించగలిగే సామర్థ్యం ఈ టెలిస్కోప్కు ఉన్నట్టు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జాన్ గ్రన్స్ఫీల్డ్ తెలిపారు. ఇది 2018లో అందుబాటులోకి రానుంది. -
హబుల్కంటే వందరెట్లు పెద్ద!
వాషింగ్టన్: హబుల్ కంటే వందరెట్లు పెద్దదైన టెలిస్కోపు నిర్మాణ పనుల్ని నాసా శాస్త్రవేత్తలు ప్రారంభించారు. వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్(డబ్ల్యూ.ఎఫ్.ఆర్.ఎస్.టి)గా పిలిచే దీని సాయంతో కృష్ణ బిలాలు, విశ్వ ఆవిర్భావం, గ్రహాంతర వాసుల గుట్టును చేధించేందుకు ప్రయత్నిస్తారు. కాస్మోస్ పరిణామం వివరించేందుకు పరిశోధనకులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సౌరవ్యవస్థకు అవతల ఉన్న గ్రహాల పరిశోధనతో పాటు, మానవ నివాస యోగ్య గ్రహాల్ని కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. 2020లో దీన్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు. -
మనుషులా..? గ్రహాంతరవాసులా!
నల్లటి సూటు-బూటు-టోపీలతో పొడవుగా ఉండే వ్యక్తులు. ఎవరో? ఎక్కడివారో? ఎప్పుడు వస్తారో? తెలియదు. అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఎగిరే పళ్లాల(యూఎఫ్ఓ)కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ చెప్పవద్దని గట్టిగా వార్నింగ్ మాత్రం ఇస్తారు. వారి వేషధారణ, మాట తీరు, ఆహార్యం అంతా సాధారణ మనుషుల్లా అనిపించదు. అసలు వారు మనుషులేనా? అన్న అనుమానాలూ ఉన్నాయి.. వారే ‘మెన్ ఇన్ బ్లాక్’ (ఎంఐబీ). వీరి గురించి అమెరికాలో కథలుగా చెప్పుకుంటారు. ఈ ఘటనల ఆధారంగా ఎంఐబీ పేరుతో కార్టూన్, టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా వచ్చాయి. అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తులు ఈ ‘మెన్ ఇన్ బ్లాక్’. అమెరికాలో వీరు పలు చోట్ల రహస్యంగా సంచరిస్తుంటారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. వీరు ఎలా ఉంటారన్న విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోవడం గమనార్హం. కాలి బూట్లు, దుస్తులు, కంటి అద్దాలు, టోపీ, ఓవర్ కోట్ ఇలా అన్నీ నలుపు రంగులోనే ఉండటం వీరి ప్రత్యేకత. వీరు మాట్లాడేది ఇంగ్లిషే అయినా యాస మాత్రం స్థానికంగా వాడేది కాదని, వారి చర్మం రంగు, కళ్లు కూడా విచిత్రంగా ఉన్నాయని, కనుబొమ్మలు లేవని, కనుపాపలు మొత్తం ఒకే రంగులో ఉన్నాయని చూసిన వారు వెల్లడించారు. మనుషుల సహజ లక్షణాలకు విభిన్నంగా కనిపించడంతో వారు తప్పకుండా గ్రహాంతరవాసులే అయి ఉంటారనే వాదన మొదలైంది. ఒంటారియాలో ఓ హోటల్లోకి వచ్చిన వీరి దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఎలా వెలుగులోకి వచ్చారు? మెన్ ఇన్ బ్లాక్ గురించి అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన ఘటనల్లో ‘మౌరీ ఐలాండ్’ ఘటన మొదటిది. 1947, జూన్లో ఫ్రెడ్ క్రిస్మన్- హరాల్డ్ డాల్ అనే ఇద్దరు తీరంలో పడవలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఆరు ఎగిరేపళ్లాలు దీవికి సమీపంగా వచ్చాయని, వ్యర్థాలతోపాటు లావాలాంటి తెల్లటి ద్రవాన్ని తమపై చిమ్మాయని ఆరోపించారు. ఆ వ్యర్థాల కారణంగా తమ పడవలో ఓ వ్యక్తికి చేయి విరగ్గా, కుక్క మరణించిందని చెప్పారు. వెంటనే నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు తమను సమీపించి ఇక్కడ జరిగిందేది బయటికి చెప్పవద్దని బెదిరించారని వాపోయారు. 1953లో మరోసారి! అల్బర్ట్ .కె. బెండర్ అనే వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశాడు. అతనికి యూఎఫ్ఓలపై ఉన్న ఆసక్తితో 33వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ సాసర్ బ్యూరో’ని స్థాపించాడు. అదేక్రమంలో ‘స్పేస్ రివ్యూ’ అనే పత్రికను నడిపేవాడు. దాని నిండా ఎగిరే పళ్లాల గురించిన వార్తలే ఉండేవి. అనతికాలంలోనే ఇతని సంస్థ, పత్రిక అమెరికాలోని 48 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి. 1953లో ఎగిరేపళ్లాలకు సంబంధించిన అతని పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. పలు కొత్త విషయాలు కనిపెట్టాడు. వాటిని అదే ఏడాది సెప్టెంబరు సంచికలో ప్రచురిద్దామనుకున్నాడు. అకస్మాత్తుగా ‘మెన్ ఇన్ బ్లాక్’ వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాను ఎంతో కష్టపడి రాసుకున్న పరిశోధన వివరాలను వారి నోట విన్న బెండర్ నివ్వెరపోయాడు. ఈ విషయాలను ప్రచురించవద్దని హెచ్చరించడంతో బెదిరిపోయి వెనక్కుతగ్గాడు. వాస్తవానికి వీరు ఎవరు? వీరు మొత్తం ముగ్గురు వ్యక్తులని ప్రచారం ఉంది. అమెరికాలో ఎవరైతే తాము ఎగిరే పళ్లాలను, వింత వస్తువులను చూశామని చెప్పుకుంటారో, వారి వద్ద వీరు మరునాడు ప్రత్యక్షమయ్యేవారు. మీకు తెలిసిన ఏ సమాచారాన్నైనా బయటికి వెల్లడించవద్దని బెదిరించేవారని సాక్షులు తెలిపారు. వాస్తవానికి వీరు అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే పేరు తెలియని సంస్థల రహస్య ఏజెంట్లన్న ప్రచారమూ ఉంది. గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని, వదంతులను ప్రచారం చేసే వారిని కట్టడి చేయడానికి ఇలా బెదిరించే వారనే వాదనలూ ఉన్నాయి. మొత్తానికి ‘ఎంఐబీ’లు ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. -
గ్రహాంతరవాసుల వస్తువేనా?
మిస్టరీ కంటిన్యూస్.. అంతుచిక్కని రహస్యమొకటి స్పెయిన్వాసులను కలవరపరుస్తోంది. అకస్మాత్తుగా పంటపొలాల్లో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడడం.., వింతైన గోళాకారపు వస్తువులు ఆకాశంలో నుంచి అమాతంగా వచ్చిపడుతుండడంతో ఆ దేశంలోని కలస్పార్రా ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంతరిక్షం నుంచి అమాంతంగా వచ్చిపడుతున్న ఆ వస్తువులేంటి? అవి తమ ప్రాంతంలోనే ఎందుకు పడుతున్నాయి? జవాబు చెప్పమంటూ స్థానిక అధికారులను, శాస్త్రవేత్తలను నిలదీస్తున్నారు. ఐదు రోజుల్లో ఇది రెండోసారి.. ఈ నెల 3వ తేదీన నల్లని రంగులో, గోళాకారంలో ఉన్న వస్తువు ఇక్కడి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. దీనిని గమనించిన స్థానిక రైతు విషయాన్ని పోలీసు అధికారికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడారు. ఆ గోళం ఎక్కడి నుంచి పడింది? ఇంతకీ ఆ వస్తువు ఏ లోహంతో తయారు చేసింది? దానిపై ఉన్న దారపు పోగులవంటి పదార్థమేంటి? తదితర విషయాలపై పరిశోధన చేసేందుకు తీసుకెళ్లారు. మళ్లీ అలాంటిదే... శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ఒవైపు కొన సాగిస్తుండగానే తాజాగా మంగళవారం మరోసారి అలాంటి ఘటనే పునరావృ తమైంది. 80 డయామీరట్ల వ్యాసా ర్దంతో దాదాపు 20 కేజీల బరువున్న గోళాకారపు వస్తువొకటి మర్సియా ప్రాంతంలో పడింది. కేవలం 9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో పడిన ఈ వస్తువు కూడా ఆకాశం నుంచే పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మరి మండిపోలేదెందుకు? ఈ వస్తువు గురించి తలోరకంగా చెప్పుకుంటున్నారు. స్వర్గం నుంచి పడిన వస్తువంటూ కొందరు, గ్రహాంతరవాసులు విసిరిన వస్తువంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా స్పష్టమైన వివరాలేవీ వెల్లడించలేకపోతున్నారు. గ్రహశకలమని చెప్పలేమని.., అలాగని మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయంతో ఏకీభవిద్దామన కున్నా.. అంతపై నుంచి భూమిపైకి దూసుకొస్తున్నప్పుడు తప్పనిసరిగా మండిపోవాలి. మండుతున్న వస్తువు నేలపై పడినప్పుడు ఆ ప్రాంతంలోని పంటకు తప్పనిసరిగా నిప్పంటుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని మరికొందరు చెబుతున్నారు. ‘ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో పడడానికి కారణమేంటో వెల్లడించాలి. మరిన్ని పడే అవకాశముందా? లేదా? అనే విషయం కూడా చెప్పాలి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతంలో పడుతున్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణనష్టం తప్పదు కదా! దీన్ని స్పెయిన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి.’ - కాలస్పర్రా మేయర్ జోస్ వెలెజ్