Bathroom
-
విద్యార్థినుల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణపై విచారణ
-
ఎంతటి దుర్భర పరిస్థితి.. 118 మంది ఒకటే బాత్రూం
మహబూబాబాద్ అర్బన్: ఈ పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు.. అందులో 132 మంది బాలురు.. బాలికలు 118 మంది.. కానీ ఉన్నది ఒక్కటే మూత్రశాల. బాలురకు చెరువు కట్టే దిక్కు కాగా, బాలికలు ఒకరి తరువాత ఒకరు క్యూలైన్ కట్టాల్సిందే. ఇదేదో మారుమూల గ్రామంలో కాదు.. జిల్లా కేంద్రం పరిధిలోని ఓ ఉన్నత పాఠశాలలో దుస్థితి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి పరిధి ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురకు కలిపి ఒకే మూత్రశాల ఉంది. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిరుపయోగంలో ఉన్నాయి.బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. మగపిల్లలు సమీపంలోని చెరువుకట్టకు వెళ్తుండగా, బాలికలు క్యూలైన్లో నిలబడి మూత్రశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, లేకపోతే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. -
బాత్రూమ్లో మహిళ అనుమానాస్పద మృతి!
బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.గ్యాస్ గీసర్తో విషపూరితమైన కార్బన్మోనాక్సైడ్ గ్యాస్తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.చదవండి: క్రికెట్ బ్యాట్తో కొట్టి.. భర్తను హతమార్చి భార్య -
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్జెండర్ చట్టసభ మెంబర్పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్జెండర్గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
విమానం బాత్రూంలో చిన్నారి..
విమానంలో నాన్స్టాప్గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు. పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తిరువనంతపురం: కేరళలో రెండు రోజుల క్రితం ఒక మహిళ అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి జరిగింది. కేరళ కొల్లంలోని ఓ హాస్ట్ల్లో ఉంటున్న యువతి తాను గర్భవతి అన్న విషయాన్ని స్నేహితురాళ్ల వద్ద దాచింది. ఆదివారం(మే5) హాస్టల్లోని తన గది తలుపు పెట్టుకుని బాత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పల్నాడు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాత్రూమ్లోకి వెళ్లి హెయిర్లోషన్ తాగింది. కొంత సేపటికి వాంతులు కావడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఓత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. బాత్రూమ్కు వెళ్లి బయటకు రాని వరుడు!
విశాఖపట్నం: అంతటా సందడి వాతావరణం.. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న ఆ జంటను చూసి ఇరు కుటుంబాల సంతోషానికి అవధుల్లేవు. పాస్టర్లు ప్రార్థనలు చేసి, క్రీస్తు దీవెనలు అందజేశారు. నూతన జంట కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉంగరాలు మార్చుకునే క్షణం రానేవచ్చింది. ఇంతలో బిగ్ ట్విస్ట్. పెళ్లి కొడుకు బాత్రూమ్కు అని చెప్పి వెళ్లాడు. అక్కడి నుంచి ఎంతకీ రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా అతను తెరవలేదు. చివరకు బతిమలాడటంతో బయటకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. ఏవో కుంటిసాకులు చెప్పుకొచ్చాడు. దీంతో బంధువులు, పెళ్లి పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కొడతారేమోనన్న భయంతో వరుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్కు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, వారి బంధువులను పిలిపించారు. వరుడు, వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అర్థం పర్థం లేని వరుడి తీరును చూసి వధువు, ఆమె బంధువులు వివాహానికి నిరాకరించారు. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది. ఈ ఘటన బుధవారం పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.3 లక్షలు, తులమున్నర చైన్, ద్విచక్రవాహనం లాంఛనంగా ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు. బుధవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. వరుడు తీరుతో రద్దయింది. పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది. -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!. ఇంతకీ ఈ ప్యాలెస్ని పోలిన భవనం థాయ్లాండ్లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు. ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్రూమ్. బంగారు రంగు డిజైన్తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం. View this post on Instagram A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia) (చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..) -
ఆ బిడ్డ భద్రం..!
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బాత్రూమ్లో గర్భిణి ప్రసవించి వదిలి వెళ్లిన పసికందుకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈనెల 16వ తేదీ వేకువజామున కడుపు నొప్పితో వచ్చిన ఓ గర్భిణి ఆస్పత్రి బాత్రూంలోనే ప్రసవించి... బిడ్డను వదిలి వెళ్లిన ఘటన విధితమే. ఆపై బిడ్డకు ఎస్ఎన్సీయూలో చికిత్స అందిస్తున్నారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 1.4 కేజీలుండగా..ప్రస్తుతం 1.5 కేజీలుందని వైద్యులు చెబుతున్నారు. 2 కేజీలు దాటేంత వరకు ఎస్ఎన్సీయూలోనే బిడ్డకు చికిత్స అందించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా బిడ్డకు కాస్త ఇబ్బందులు ఉన్నాయని..మరో రెండు రోజుల్లో ఈ సమస్య కూడా రికవరీ అవుతుందన్నారు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాలుగు వారాల పాటు చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తర్వాతే సంరక్షణకు ఐసీడీఎస్ శిశువిహార్కు పంపనున్నారు. ప్రస్తుతం ఆశాఖ సిబ్బంది పర్యవేక్షణలోనే బిడ్డకు వైద్య సేవలు చేస్తున్నారు. కాగా బిడ్డ వదిలి వెళ్లిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఐఓ రవిరాజు విచారణ కూడా పూర్తి చేశారు. దీనిపై సోమవారం కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బిడ్డను మాకు ఇవ్వండయ్యా... ఆడబిడ్డలంటే చులకన చూసే కళ్లు..ఇప్పటికే చాలానే ఉన్నాయి. ఆడబిడ్డ పుట్టిందని ఆమడ దూరంలోనే నిలబడే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తరచూ చూస్తుంటాం. మగ సంతానం లేదని ఆత్మహత్యలు చేసుకున్న కేసులు సైతం చాలానే ఉన్నాయి. అయితే ఈ వదిలి వెళ్లిన బిడ్డ కోసం పలువురు ముందుకు వస్తున్నారు. ఆ బిడ్డను తమకు ప్రసాదించండంటూ ఆస్పత్రి అధికారులకు నివేదించుకుంటున్నారు. అసలు తల్లి లేకుంటే.. తామున్నామంటూ.. క్యూ కడుతున్నారు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఇలా ఆ బిడ్డనుకోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు మాత్రం బిడ్డను ఐసీడీఎస్కు అప్పగించామని, ఇక చట్ట ప్రకారం వెళ్లాల్సిందేనన్ని స్పష్టం చేస్తున్నారు. బిడ్డను కోరుకునే వారు దతత్త ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్లైన్స్లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్లైన్స్కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్.. ఆకతాయి అరెస్ట్
యశవంతపుర: పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ వీడియో తీయడానికి యత్నించిన యువకుడిని ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపికి సమీపంలోని ముల్కి పక్షికరెకి గ్రామానికి చెందిన సుమంత్ (22)ని అరెస్ట్ చేశారు. నిందితుడు పక్కింటి యువతి స్నానపు గదిలో మొబైల్ దాచి పెట్టాడు. అదే సమయంలో యువతి అన్న బాత్రూమ్కు వెళ్లగా మొబైల్ను గమనించాడు. విచారించగా మొబైల్ సుమంత్దిగా గుర్తించారు. అతని ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బాత్రూమ్లో బీకేర్ఫుల్.. ఇళ్లల్లో రెండో అత్యంత ప్రమాదకర ప్రదేశం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 ఏళ్లు పైబడిన వారిలో 2.35 లక్షల మంది బాత్రూమ్లో గాయపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక చెబుతోంది. ఇంట్లో అతి చిన్న గదే అయినప్పటికీ.. వంటగది తరువాత బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బాత్రూమ్లో సంభవించే ప్రమాదాల కారణంగా ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నిత్యం 370 మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఎముకల చికిత్స కోసం వెళుతున్న వారిలో దాదాపు 35నుంచి 45 శాతం మంది బాత్రూమ్లో జారిపడి గాయాల పాలైనవారే. ప్రముఖ సినీ నటి శ్రీదేవి దగ్గర్నుంచి తాజాగా చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు వరకూ అనేక మంది ప్రముఖుల మరణాలు బాత్రూమ్లోనే సంభవించాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి వదులుగా ఉన్న టాయిలెట్ బౌల్ రిమ్పై కూర్చోవడం వల్ల అది అటూ ఇటూ కదిలి శరీరానికి గాయం చేయవచ్చు. ప్లాస్టిక్ సీట్లు పగిలిపోవడం, వ్యక్తి బరువు వల్ల కూలిపోవడం కూడా గాయాలు కలిగించవచ్చు. టాయిలెట్లలో సిగరెట్లు వంటివి పడేయడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. సాధారణంగా బాత్రూమ్ ప్రమాదాలు మనం టబ్లోంచి బయటకు వస్తున్నప్పుడో, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి. ఇలాంటివి ఆపాలంటే బాత్రూమ్ వాడుతున్నప్పుడు లైట్లు, డోర్ మ్యాట్లు వేయాలి. బాత్రూమ్ నేలను పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించాలి. పాశ్చాత్య టాయిలెట్లో కూర్చుని లేచే సమయంలో హ్యాండిల్ పట్టుకుని లేవాలి. బాత్రూమ్కి వెళ్లినప్పుడు లోపల గట్టిగా గడియపెట్టుకోవకపోవడం వృద్ధులకు మంచిది. షవర్ కింద స్నానం చేసే సమయంలో స్టూల్ వాడాలి. చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చరిత్రలో కొన్ని దుర్ఘటనలు ♦ చైనాలోని జిన్ రాష్ట్ర పాలకుడు క్రీస్తు పూర్వం 581లో టాయిలెట్ పిట్లో పడి మరణించాడు. ♦చరిత్రలో మర్చిపోలేని దుర్ఘటన ఒకటి 1184 జూలై 26న సంభవించింది. ‘ఎర్ఫర్ట్ లెట్రిన్ విపత్తు’గా పిలిచే ఈ ప్రమాదం రోమన్ చక్రవర్తి హెన్రీ అనధికార సమావేశం నిర్వహిస్తుండగా.. దానికి హాజరైన వారి బరువు కారణంగా చెక్క భవనం రెండవ అంతస్తు నేల కూలిపోయింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి మునిగిపోవడంతో 60 మంది మరణించారు. ♦ 1760లో గ్రేట్ బ్రిటన్కు చెందిన కింగ్ జార్జ్ అక్టోబర్ 25న టాయిలెట్లో మరణించాడు. ♦1945లో జర్మన్ జలాంతర్గామి ఒక టాయిలెట్ ప్రమాదంలో మునిగిపోయింది. ♦1983 జూన్ 2న ఎయిర్ కెనడా విమానం–797 వెనుక లావెటరీలో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో 23 మంది మరణించారు. ♦ బ్రిటిష్ వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ షేల్ జూన్ 26, 2011న గ్లాస్టన్బరీ ఫెస్టివల్లో పోర్టబుల్ టాయిలెట్లో గుండెపోటుతో చనిపోయాడు. ♦ టాయ్లెట్ల ఫిట్టింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా దాదాపు 10 వేల ఓడలు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నాయి. వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్ ఇంట్లో 65 ఏళ్లు పైబడిన పెద్దవారు ఉంటే.. బాత్రూమ్ ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి నలుగురిలో ముగ్గురు వృద్ధులు ఏడాదికి ఒకసారైనా బాత్రూమ్లో జారిపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల్లో 65 శాతం చిన్న గాయాలతో సరిపెట్టినా.. మిగతా 35 శాతం మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 42 శాతం మంది టాయిలెట్లలో 7 నుంచి 10 సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. 58 శాతం మంది 11 నుంచి 15 సార్లు పడిపోతున్నారు. సరైన తలుపులు లేకపోవడం ప్రమాదానికి వంద శాతం కారణమవుతుండగా, జారే ఫ్లోర్ 91.9 శాతం, బాత్రూమ్ పరిమాణం 80.3 శాతం, ఎత్తైన తలుపు థ్రెషోల్డ్ 53.5 శాతం, నాన్–స్కిడ్ మ్యాట్ లేకపోవడం 99.5 శాతం, గ్రాబ్ బార్లు లేకపోవడం 97 శాతం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం 96.6 శాతం, బాత్రూమ్లో వెలుతురు సరిపోకపోవడం వల్ల 94.4 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. వేడి నీటి వినియోగం 89.9 శాతం, సీట్ ఉపరితలం 55.6 శాతం, ప్రవేశ ద్వారం వద్ద లైట్ స్విచ్ లేకపోవడం 53 శాతం, చిందరవందరగా ఉన్న మార్గం వంటివి 39.4 శాతం కారణమవుతున్నాయి. ఎన్సీబీఐ మార్కెటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 11 శాతం హార్ట్ అటాక్లు బాత్రూమ్లోనే వస్తున్నాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇవి సంభవిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి బాత్రూమ్లో మరణించే వారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వల్లే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు.. ఆ నీటిని తలపై పోసుకుంటే శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి. దీనివల్ల తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు పక్షవాతం కూడా రావచ్చు. జారి పడిపోయినప్పుడు తల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నుపూస కూడా విరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుధాకర్ కనపర్తి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణుడు, విజయవాడ -
ట్రంప్ దిగజారితే, కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో అతని కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహరిస్తున్నాడనే వార్తలు గుప్పుముంటున్నాయి. తాజాగా అమెరికన్ గాయని ఆబ్రే ఓ డే.. జూనియర్ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేసింది. సుదీర్ఘ కాలంగా జూనియర్ ట్రంప్తో తనకు అఫైర్ ఉన్నట్లువస్తున్న ఆరోపణలు ఒక స్వలింగ సంపర్కుల క్లబ్లోని బాత్రూమ్లో మొదలయ్యాయన్నారు. పాడ్కాస్ట్లో వివరాలు వెల్లడి.. మైకేల్ కోహెనెకు చెందిన ‘మేయా కుల్పా’ పాడ్కాస్ట్లో పాల్గొన్న 34 ఏళ్ల ఆబ్రే ఓ డే తొలిసారిగా తనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్కు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. తనను జూనియర్ ట్రంప్ వేధించి లైంగికంగా సంబంధం ఏర్పరుచుకున్నాడని ఆరోపించింది. మేము మొదటిసారి ఒక గే క్లబ్కు వెళ్లాం. అప్పుడు అతను నా వైపు చెడుగా చూశాడు. ఈ రాత్రికి క్లబ్లోనే ఉంటానని అన్నాడు. అది న్యూయార్క్లో అతి పెద్ద క్లబ్. దాని భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయి. ఆబ్రే ఓ డేకు అప్పుడు మరో మార్గం లేదు అని అనుకుంది. అతని ఇన్స్టాగ్రామ్లో.. పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆబ్రే ఓ తాను అతని ఇన్స్టాగ్రామ్ని మొదటిసారి చూశానని, దానిలో గే కమ్యూనిటీని కించపరిచే అన్ని రకాల జోక్లు ఉన్నాయని తెలిపారు. మేము మొదటిసారిగా గే క్లబ్ బాత్రూమ్లో లైంగిక చర్యలో పాల్గొనడం చాలా సౌకర్యంగా ఉంది అని అతను పేర్కొన్నాడని ఆమె ఆరోపించింది. ఈ జంట శారీరకంగా కలవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, మాజీ డానిటీ కేన్ ఫ్రంట్ వుమన్.. వీరు గతంలోనే బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారని వెల్లడించింది. ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లోనూ.. ఆబ్రే ఓ డే తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట 2011లో ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లో తొలిసారిగా కలుసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు నవ్వుకున్నారు. పార్టీలో ఏదైనా ఫన్నీగా జరిగిప్పుడు మేము ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే సన్నిహితులమయ్యాం అని ఆమె తెలిపింది. తాను ఎప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉంటానని ఆబ్రే ఓ పేర్కొంది. కాగా గత ఏడాది పేజ్ సిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆబ్రే ఓ తనకు జూనియర్ ట్రంప్తో ఉన్నసంబంధం గురించి ప్రస్తావించింది.అయితే జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించలేదు. ఇదికూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. -
కాబోయే జంటపై గ్యాస్ గీజర్ పంజా.. బాత్రూమ్లో స్నానం చేస్తూ..
కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఉద్యోగం, సహజీవనం చేస్తూ.. వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్చేసి ఇద్దరూ బాత్రూమ్లో స్నానం చేయడానికి వెళ్లి బాత్రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు. డ్యూటీకి రాకపోవడంతో ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్లో ఉంచారు. ఆ ఎస్టేట్లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాత్రూమ్లో శవమై తేలిన యువనటుడు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్పుత్ బాత్రూమ్లో శవమై తేలాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. అయితే అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం కారణంగానే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) ఆదిత్య సింగ్ రాజ్పుత్ జర్నీ దిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్పుత్ మోడల్గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించాడు. స్ప్లిట్స్ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) View this post on Instagram A post shared by Aditya Singh Rajput OFFICIAL (@adityasinghrajput_official) -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
-
అమానుషం.. ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన మహిళ
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. ఆస్పత్రి బాత్రూమ్లోనే ప్రసవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన భర్త లింగయ్యతో కలిసి నాలుగు రోజుల కిందట రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచి్చంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. అయితే, పార్వతమ్మకు బుధవారం ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమె బాత్రూమ్లోకి వెళ్లింది. నొప్పులు ఎక్కువ కావడంతో పార్వతమ్మ అక్కడే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది శిశువును ఐసీయూకు తరలించి తల్లీబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. నొప్పులు వచ్చిన సమయంలో సరైన విధంగా వైద్యులు స్పందించి చికిత్స చేసి ఉంటే బాత్రూమ్లో ప్రసవించేదికాదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని పార్వతమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నార్మల్ డెలివరీ కోసం ప్రయతి్నస్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ప్రసవించిందని వైద్యులు చెబుతున్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్ డోర్లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
900 మందికి ఒకే టాయిలెట్టా..!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తొమ్మి ది వందల మంది చదివే ఓ ప్రభుత్వ కళాశాలలో ఒక్క బాత్రూం ఉండటమా? అదీ విద్యా శాఖ మంత్రి ఇలాకాలోనా? ఇలా టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుది దరిద్రపు పాలనని చెప్పేందుకు ఇదొక్కటిచాలని మంగళవారం తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పిల్లలకు కనీసం బాత్ రూంలు కూడా కట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?..విద్యాశాఖ మంత్రి ఊడితే ఎంత అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్ రాకుండా టాబ్లె ట్ వేసుకుంటున్నామన్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నామని నిలదీశారు. -
మీది బాత్రూమా? యాక్ రూమా? ఈ జాగ్రత్తలు లేకపోతే అతిథులు పారిపోతారు మరి!
చాలామందికి ఒంటి మీద ఉన్నంత శ్రద్ధ పాదాల మీద ఉండదు. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచి వస్తువులను అందంగా అమర్చుకోవడంలో ఉన్న తీరిక, ఓపిక బాత్రూమ్కి వచ్చేసరికి ఉండవు. అయితే బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, హాలు ఎంత నీట్గా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకని ఇంటి శుభ్రత ఎంత ముఖ్యమో, బాత్రూమ్ శుభ్రత కూడా అంతే ముఖ్యం. ఇంతకీ బాత్రూమ్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందామా మరి! సాధారణంగా మనకి ఎన్నో పనులు ఉంటాయి. వాటిలో పడిపోయి మనం బాత్రూమ్ని శుభ్రం చేయడం మరిచిపోతాం. మిగిలిన రూమ్లన్నిటికన్నా బాత్రూమ్ తొందరగా ఖరాబవుతుంది. అందుకని వీలైనప్పుడల్లా బాత్రూంని శుభ్రం చేయడం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఎప్పుడు వీలుంటే అప్పుడు బాత్రూంని శుభ్రం చేయడం ఎంతో అవసరం. కానీ కుదిరినప్పుడు కాస్త ఓపిక చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటే దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది బాత్రూమ్. చెత్తాచెదారం లేకుండా బాత్రూంని శుభ్రంగా ఉంచాలన్నా, దుర్వాసన లేకుండా ఉండాలన్నా, ముందుగా బాత్రూమ్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం అవసరం. బాత్రూమ్లో పేరుకుపోయే చెత్తాచెదారం ఏమిటా అనుకుంటున్నారా... ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, రేజర్ బ్లేడ్లు వంటివి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మరచిపోకండి. ఇలా చేస్తేనే బాత్రూమ్ని నీట్గా ఉంచుకునేందుకు వీలవుతుంది. కనుక ఈసారి నుండి తప్పనిసరిగా ఇలా అనుసరించండి. ఎయిర్ ఫ్రెష్నర్/ డిఫ్యూజర్ వాడకం బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే బాత్రూమ్లో ఒక చిన్న డిఫ్యూజర్ ఉంచాలి. దీనివల్ల బాత్రూమ్ నుంచి మంచి వాసన వస్తుంటుంది. ఈ చిన్న డిఫ్యూజర్ని సింకు వెనక పెడితే, ఈ డిఫ్యూజర్ మంచి వాసన వెలువడేట్లు చేస్తుంది. డిఫ్యూజర్ పెట్టుకునే వీలు లేనివారు ఎయిర్ ఫ్రెష్నర్ను బాత్రూమ్లో పెట్టడం వల్ల కూడా మంచి వాసన వస్తుంది. మీరు మీ బాత్రూంలో మీకు నచ్చిన చోట వీటిని పెట్టొచ్చు. తడిసిన తువ్వాళ్లు వద్దు కొంతమంది ఒళ్లు తుడుచుకుని తడీపొడీ టవల్ను బాత్రూమ్లోనే పడేసి వస్తుంటారు. అలాగే అండర్వేర్లు, బనీన్లు కూడా బాత్రూమ్లోనే వదిలేస్తుంటారు. నిజానికి మాసిన బట్టల కన్నా తడిబట్టల నుంచి, తడీపొడి బట్టల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తడి బట్టలు కానీ మాసిన బట్టలు కానీ బాత్రూంలో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంటుంది కాబట్టి వాటిని తొలగిస్తూ ఉండండి. సబ్బులు మంచి సువాసన వచ్చే సబ్బుల్ని బాత్రూంలో పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని బాత్రూంలో పెట్టండి ఇది కూడా మీ బాత్రూమ్ని బాగా ఉంచడానికి సహాయ పడుతుంది. టాయిలెట్ ట్యాంక్లో డిటర్జెంట్ లాండ్రీ డిటర్జెంట్ని మీరు మీ టాయిలెట్ ట్యాంక్లో వేయొచ్చు ఇది కూడా మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఫ్లష్ చేసినప్పుడు సెంటెడ్ వాటర్ వస్తాయి. హెర్బ్స్ వాడకం బాత్రూంలో హెర్బ్స్ ఉపయోగించడం మంచి ఐడియా. పైగా ఇవి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మన బడ్జెట్లోనే వీటిని మనం బాత్రూంలో తెచ్చి పెట్టొచ్చు. లావెండర్ లేదా మింట్ని బాత్రూంలో పెట్టవచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. లేదంటే ఎండిపోయిన యూకలిప్టస్ని బాత్రూమ్లో హ్యాంగ్ చేసి ఉంచితే చాలు... దుర్గంధాన్ని వదలగొట్టి మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు మీ బాత్రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. హాయిగా కూనిరాగాలు తీసుకోవచ్చు. లేదంటే అతిథులు ఎవరైనా వస్తే యాక్ అని వాంతి చేసుకుని పారిపోతారు జాగ్రత్త! చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): ఐదు రోజుల పాటు బాత్రూమ్లోనే ఆ వ్యక్తి మృతదేహం ఉండిపోయింది. ఎక్కడో తమిళనాడు నుంచి ఇక్కడి వరకు వచ్చి పనిచేసుకుంటున్న ఆ మనిషి చనిపోయిన సంగతి ఐదు రోజుల తర్వాత అందరికీ తెలిసింది. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి స్థానిక పాతజాతీయ రహదారి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఇంటిలో ఐదు రోజుల కిందట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతుడు తమిళనాడుకి చెందిన గోవిందన్ వేణుగోపాల్ (54)గా గుర్తించారు. అతను హడ్డుబంగి గ్రామ సమీపంలో గల మార్గర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్వారీ ఇన్చార్జిగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఈ క్వారీ కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. అప్పటి నుంచి వేణుగోపాల్ రూమ్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు క్వారీకి వెళ్లి వచ్చేవారు. అయితే ఐదు రోజులుగా క్వారీకి రావడం లేదని అక్కడి వాచ్మెన్ తెలిపారు. వినాయక చవితి రోజున ఆరోగ్యం సరిగా లేదు రానని వాచ్మెన్కు వేణుగోపాల్ చెప్పారు. ఈ నెల 2న ఇంటి అద్దెను కూడా చెల్లించారు. అప్పటి నుంచి ఆయన కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని ఇంటి యజమాని అనుకున్నారు. శనివారం వేణుగోపాల్ ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని వెళ్లి చూశారు. బాత్రూమ్లో వేణుగోపాల్ మృతదేహం కనిపించడంతో నిశ్చేష్టుడైపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అతను మరణించి ఐదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. క్లూస్టీమ్కు సమాచారం అందించారు. మృతుడు ఒక్కడే ఇంటిలో ఉండడంతో అతను చనిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదని చెప్పారు. చదవండి: మాట్లాడుకుందామని పిలిచి.. అత్యాచారం.. ఆపై హత్య -
మహిళ బాత్రూమ్లో భారీ పైథాన్.. ఆ తర్వాత ఏమైందంటే?
అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్రూమ్లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్ ఘటనే థాయ్లాండ్కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బ్యాంకాక్కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్రూమ్లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్రూమ్ మొత్తం గ్లాస్తో కవర్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ టబ్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్రూమ్లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) -
Crime News: బాత్రూంలో కెమెరాలు! మంచోడు అనుకుంటే..
బంజారాహిల్స్: మంచోడు అనుకుని ఓ ఆఫీస్ బాయ్తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్రూమ్కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లోని ఓ బొటిక్లో హిమాయత్నగర్కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్ రావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్కు గురైంది. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్రూమ్లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్ దాస్ అనే వెస్ట్బెంగాల్కు చెందిన ఆఫీస్ బాయ్ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్రూమ్లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్దాస్ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అమానుషం: ఎవరిదీ పాపం.. మరుగుదొడ్డి వద్ద శిశువు మృతదేహం
తిరువళ్లూరు(చెన్నై): ఓ ప్రైవేటు వైద్యశాల ఆవరణలో ఆడశిశువు మృతదేహం మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. చోళవరం అత్తిపట్టులో ఎంఎంఆర్వీ వైద్యశాల ఉంది. ఇక్కడ సాధారణ, అత్యవసర సేవలకు చిక్సిత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాల ఆవరణలోని ఓ మరుగుదొడ్డి వద్ద ఆడశిశువు మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్టు గుర్తించి చెన్నై వైద్యశాలకు తరలించారు. కాగా నవజాత శిశువును మరుగుదొడ్డికి సమీపంలో పడేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మరో ఘటనలో.. కూలిన విద్యుత్ స్తంభం తిరుత్తణి: తిరుత్తణి శివారులోని కాశినాధ పురం దళితవాడలో హై ఓల్టేజీ విద్యుత్ స్తంభంపై పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పడి విద్యుత్స్తంభం కూలింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో ఇళ్ల ముందు ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభం కూలిన సమయంలో వీధిలో ప్రజలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం కూలిన విద్యుత్ స్తంభం తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దుస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. చదవండి: తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష -
ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం
రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్రూమ్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు శనివారం కాన్బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. -
Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడో యువకుడు. బంజారాహిల్స్ రోడ్నెంబర్-2లో ఓ టెక్నీషియన్ చేసిన నిర్వాకమిది. కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్.. మహిళా బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. టెక్నీషియన్ చేస్తున్న పనిని గమనించిన కొందరు స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. చదవండి: (టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..) -
పాఠశాల టాయిలెట్లను క్లీన్ చేసిన కలెక్టర్
సాక్షి, అడవివరం (విశాఖ పట్నం): వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్ఫూర్తివంతమైన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం అడవివరం జెడ్పీ హైస్కూల్కు విచ్చేసిన ఆయన.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలను ఘనంగా సత్కరించారు. పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న ఆయాల సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పాఠశాలలోని టాయిలెట్లను కలెక్టర్ స్వయంగా క్లీన్ చేసి ఆదర్శంగా నిలిచారు. -
టాయిలెట్స్ ఎవరు కడగాలి?
World Toilet Day 2021: ఇది భలే సహజ విషయం. స్త్రీలకు సహజంగా కేటాయించబడిన విషయం. పిల్లలు పుడితే వారి టాయిలెట్ను శుభ్రం చేయడం స్త్రీల పని. ఇంట్లో బాత్రూమ్లను క్లీన్ చేయడం స్త్రీల పని. వయసు మీరిన వారు లావెటరీ వరకు వెళ్లలేకపోతే కూతురు, కోడలు లేదా పనిమనిషి మొత్తానికి స్త్రీలే వాటిని ఎత్తి పోసే పని. టాయిలెట్స్ కట్టే వరకు స్త్రీలు ఒక అవస్థ పడ్డారు. కట్టాక చీపుళ్లు పట్టుకు నిలబడుతున్నారు. పురుషులకు రెండు చేతులు ఉన్నాయి. వారు ఎందుకు ఈ పని షేర్ చేసుకోరు? ఈ పని స్త్రీలు మాత్రమే ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? మొత్తం మీద పని మనుషులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారు. ఇంటి పని ఒప్పుకునే ముందు ‘టాయిలెట్లు తప్ప’ అని చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి పనిలో టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా ఉండేది. కాని ఇప్పుడు పని మనుషులు ఒప్పుకోవడం లేదు. అంట్లు, బట్టలు, ఇల్లు ఓకే. టాయిలెట్లు? ఎవరికి వారు శుభ్రం చేసుకోవడం కదా సంస్కారం. అయితే అది దాదాపు అన్ని ఇళ్లల్లో స్త్రీ సంస్కారం మాత్రమే. పురుషుడిది కాదు. గాంధీజీ ఏ విషయానికైనా గొప్పవారే. ఆయన తానే ఒక పార పట్టుకుని బహిర్భూమికి వెళ్లేవారు. వచ్చే ముందు పారతో మట్టిపోసి వచ్చేవారు. విసర్జనం ఒక నిత్యకృత్యం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు అందుకై వాడే స్థలం కూడా ఎవరికి వారు శుభ్రం చేయాలి. కాని పురుషుడై ఉంటే అందునా భర్త అయితే ఈ చోటు శుభ్రం చేసే పని భార్యదిగా ఉంటుంది. భార్యది మాత్రమే ఎందుకు? తరతరాల ఇబ్బంది భారతదేశంలో రోజు వారీ తప్పని ఈ అవసరానికి స్త్రీలను తరాలుగా ఇబ్బంది పెట్టారు. టాయిలెట్లు కట్టక, స్తోమత ఉన్నా మూఢత్వం కొద్దీ కట్టక, వారి మర్యాదను పట్టించుకోక ఇబ్బంది పెట్టారు. స్త్రీలు బహిర్భూమికి సిగ్గుతో చితుకుతూ ఊరికి దూరంగా వెళ్లాల్సి రావడం ఒక అంశమైతే రాత్రి పొద్దుపోయాక లేదా తెల్లవారుజామున తుప్పల్లోకో పొదల్లోకో వెళ్లి ప్రమాదాల్లో పడ్డారు. దాడులకు గురయ్యారు. తొంగి చూసే ఆకతాయిల వల్ల అవమానాలు పడ్డారు. ‘స్వచ్ఛభారత్’ వల్ల గాని, దానికి ముందు ప్రభుత్వాలు చేసే ప్రచారం వల్లగాని ఈ సమస్య ఒక కొలిక్కి వస్తున్నా ఇంకా టాయిలెట్లు లేని ఇళ్లు, టాయిలెట్లకు నోచుకోని పేదజనం ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ టాయిలెట్ డే’ నిర్వహించేది ప్రతి మనిషి శుభ్రత కలిగిన, మరుగు కలిగిన ప్రదేశంలో గౌరవం చెడకుండా కాలకృత్యాలు తీర్చుకునే హక్కు కలిగి ఉన్నాడని చెప్పేందుకే. సరే... టాయిలెట్లు వచ్చాయి. వాటిని కడగడం ఎవరి వంతు? నీటి సమస్య... శుభ్రత సమస్య టాయిలెట్లు కడగడం అంటే ఆ కొద్దిపాటి స్థలం కడగడం మాత్రమే కాదు. అందుకు నీళ్లు కావాలి. ఈ దేశంలో 90 శాతం ఇళ్లలో నీళ్లు పట్టాల్సిన, మోయాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత స్త్రీలది. నలుగురు కుటుంబ సభ్యులు కాలకృత్యాల కోసం రోజులో ఐదారుసార్లు టాయిలెట్లను వాడితే ప్రతిసారీ నీరు ఖర్చవుతుంది. ఆ నీరు మోసే పని భారం స్త్రీ మీద పడుతుంది. తమ టాయిలెట్ అవసరాలకు నీరు మోసుకోవాలని పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. భర్త తానే పట్టి తెచ్చి ఉదాహరణగా నిలవాల్సి ఉంటుంది. ఈ రెండూ జరగడం మృగ్యం. ఇంకా సమస్య ఏమిటంటే ‘టాయిలెట్ ఎటికెట్’ను పాటించకపోవడం. టాయిలెట్ వాడి చేతులూపుకుంటూ వచ్చేస్తే ‘నీళ్లు కొట్టండ్రా’ అని స్త్రీలు వారి వెనుక వెళ్లి ప్రతిసారీ నీళ్లు కొట్టాలి. నీళ్లు మోయాలి.. నీళ్లు కొట్టాలి... అన్నిసార్లు టాయిలెట్ను చూడాల్సి రావడం ఎవరికైనా వికారంగానే ఉంటుంది. స్త్రీలకు ఆ వికారం ఎందుకు? ఈ శ్రమ ఎవరిది? ఇంట్లో వయసు మీరిన వారుంటే వారు జబ్బున పడితే స్త్రీల పైప్రాణాలు పైనే పోతాయి. దానికి కారణం వారి టాయిలెట్ అవసరాలు చూడాల్సి రావడమే. ఈ సమస్యను పురుషులు సరిగా అడ్రస్ చేయకపోవడం వల్ల కుటుంబ నిర్మాణంలో అనేక అంతరాలు, అవాంతరాలు వస్తున్నాయి. వయసు మీరిన అత్తగారిని, మావగారిని ఇంట్లో ఉంచుకోవడానికి ‘కొందరు కోడళ్లు’ సుముఖంగా లేరు అని అనడం వింటూ ఉంటే ‘ఆ పెద్దల సేవను ఎవరు చేయాలి?’ అనే ప్రశ్నకు సమాధానం పురుషుడు చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక కారణాల రీత్యా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే వీలు లేదు. ఈ సేవకు పురుషుడు సిద్ధ పడడు. మరి స్త్రీనేగా చేయాలి. చేయడానికి ఆమె నిరాకరించదు, పురుషుడు కనుక ఆ పనిలో భాగం పంచుకుంటే. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. ఫినాయిల్, బ్రష్ పట్టండి ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో టాయిలెట్ శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సబ్బు వాసనలు వచ్చే టాయిలెట్లో వెళ్లడానికి ఇష్టపడతారు ఎవరైనా చెడు వాసనలు వచ్చే టాయిలెట్ కంటే. కనుక పురుషులు తమకు సమయం చిక్కినప్పుడు నెలకు ఇన్నిసార్లు అని టాయిలెట్ను తప్పక శుభ్రం చేయాలి. ఇంట్లో ఉన్న మగపిల్లల చేత చేయించాలి. ఫినాయిల్ వాడటం, బ్రష్ పట్టుకుని కమోడ్లను తోమడం కూడా నేర్చుకోవాలి. నీటి సమస్య ఉన్న ప్రాంతాలైతే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. టాయిలెట్లు కూడా క్లీన్ చేయలేవా అని గీరగా భార్య వైపు చూసే భర్తలు ఒకసారి బాత్రూమ్లో చీపురు, నీళ్లు పట్టుకుని అడుగుపెట్టండి. ప్లీజ్. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. -
మెక్డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం
కొన్ని కొన్ని పనులు సదుద్దేశంతో చేసినప్పటికీ ఒక్కొసారి మనకు తెలియకుండానే అవి పెద్ద పెద్ద వివాదాలకు దారితీసేలా తయారువుతాయి. అచ్చం అలాంటి పరిస్థితినే బ్రెజిల్లోని ఒక మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎదుర్కొంటుంది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) అసలు విషయంలోకెళ్లితే....బ్రెజిల్లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఒక మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయిలెట్ బాత్రూమ్ పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ యూనిసెక్స్ టాయిలెట్ రూమ్ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకేలాంటి టాయిలెట్ రూమ్ లేంటి అంటూ ఒక మహిళ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. పైగా చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినయోగిస్తారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న ఒక ఆడియో క్లిప్ను కూడా ఆరోగ్య అధికారులకు పంపించారు . దీంతో ఆరోగ్య అధికారులు మెక్డొనాల్డ్ రెస్టారెంట్ని సందర్శించడమే కాక ఆరోగ్య నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా నిమిత్తమే కాక అందురూ గుర్తించే విధంగా పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్ రూంలు ఉండాల్సిందేనని చెప్పారు. పైగా రెస్టారెంట్లో రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్ రూంలు ఏర్పాటు చేయాలని లేనట్టయితే మూసివేయడం లేదా జరిమాన వంటి చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందంటూ అధికారులు హెచ్చరించారు. అయితే మెక్డొనాల్డ్స్ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించడానికి స్వాగతించేలా కొద్దిపాటు మార్పులతో ఈ బాత్రూంలు రూపొందించామని అంతేకాక నిర్థిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధికారులకు సహరికరిస్తామంటూ వివరణ ఇచ్చుకుంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్లో పీహెచ్డీ!) -
బాత్రూం గోడలో దూరిన వ్యక్తి.. 2 రోజుల తర్వాత నగ్నంగా దర్శనం
న్యూయార్క్: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సినిమా థియేటర్కు వెళ్లాడు. ఏం అయ్యిందో తెలియదు కానీ.. బాత్రూం గోడకున్న కన్నంలో దూరాడు. దాదాపు రెండు రోజుల తర్వాత గోడ పగలగొట్టిన పోలీసులకు అక్కడ నగ్నంగా ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి న్యూయార్క్లోని ఓ థియేటర్కు వెళ్లాడు. బాత్రూంకు వెళ్లిన వ్యక్తి.. అనుకోకుండా అక్కడ గోడకున్న పెద్ద కన్నంలోంచి లోపలికి వెళ్లాడు. అలా రెండు, మూడు రోజులు గడిచాయి. అప్పటి వరకు కన్నంలో ఉండిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత సాయం కోసం కేకలు వేయసాగాడు. అప్పుడుగానీ అతగాడి గురించి థియేటర్ యాజమాన్యానికి తెలియలేదు. (చదవండి: అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది) ఇక విషయం తెలిసిన వెంటనే థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాత్రూం గోడకు వేరే చోట కన్నం చేసి.. దాని గుండా ఫైబర్ ఆప్టిక్ కెమరాను పంపి.. అతడు ఉన్న ఎగ్జాక్ట్ లోకేషన్ని గుర్తించారు. ఆ తర్వాత గోడను పగలకొట్టి చూడగా.. సదరు వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. (చదవండి: ఫస్ట్డేట్ రోజే విషాదం: టిక్టాక్ స్టార్ కాల్చివేత) అతడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘సదరు వ్యక్తి మానసిక వికలాంగుడు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతడు బాత్రూం గోడ కన్నంలోకి ఎందుకు వెళ్లాడనే విషయం అర్థం కావడం లేదు. బహుశా వెచ్చగా ఉంటుందని భావించి వెళ్లాడేమో’’ అని తెలిపాడు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా! -
రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: నగదు దొంగిలించాడు కానీ.. పట్టుబడితే శిక్షిస్తారేమోనన్న భయంతో ఆ డబ్బును బాత్రూంలోని కమోడ్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో అక్షరాలా రూ.రెండున్నర లక్షలు మరుగుదొడ్లోని మ్యాన్హోల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.18లో నివసించే ప్రకాశ్చంద్ జైన్ అనే వ్యాపారి దీపావళి సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాత్రి బంధుమిత్రులతో కలిసి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట రూ. 3.50 లక్షల నగదు కట్టలు ఉంచాడు. పూజల అనంతరం ఏర్పాటుచేసిన విందు కోసం 18 మంది కేటరింగ్ సిబ్బంది వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో విందు ముగిశాక ప్రకాశ్చంద్తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పంపించేందుకు గేటు వరకు వెళ్లారు. చదవండి: (ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో) అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కేటరింగ్ బాయ్ షేక్ చాంద్ రజాక్ అమ్మవారి ఎదుట పెట్టిన డబ్బు కట్టలను ఎవరూ చూడకుండా తన జేబులో పెట్టుకున్నాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ప్రకాశ్చంద్కు నగదు కట్టలు కనిపించలేదు. దీంతో డబ్బుకోసం అందరూ వెతుకుతుండగా తనను ఎక్కడ పట్టేస్తారోనని రజాక్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి రూ. 2.50 లక్షలను వెస్ట్రన్ టాయ్లెట్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో డబ్బు కట్టలన్నీ డ్రెయినేజీ పైపుల్లోంచి మ్యాన్హోల్లోకి వెళ్లాయి. దొంగలించిన నగదులో రూ. 75 వేలను తన ప్యాంట్ జేబులో దాచుకోగా దొంగను గుర్తించిన యజమాని వాటిని తీసుకొని మిగతా డబ్బుకోసం ఆరా తీశారు. కమోడ్లో పడేసానని చెప్పగానే అందులో చూడగా రూ. 500 నోట్లు నాలుగు తేలుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించి బుధవారం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజాక్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల) -
టాయిలెట్కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది
బ్రిటన్: ఈ మధ్యకాలంలో టాయిలెట్లోనూ, బస్స్టేషన్లోనూ, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్రూంలోనూ అనుకోకుండా ప్రసవం జరగడం గురుంచి మనం వినే ఉంటాం కదా. అచ్చం అలాంటి సంఘటన యూకేలో జరిగింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అనోకోకుండా కైట్లిన్కి టాయిలెట్ రావడంతో సమీపంలో ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోని బాత్రూంలోకి వెళ్లింది. (చదవండి: "థింక్ బి ఫోర్ యూ డయల్") అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏం చేయాలో తోచదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అనుకోకుండా ఇలా జరిగితే ఎవరికైన భయంగానూ, ఆశ్యర్యంగానూ అనిపిస్తుంది కదా. (చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!") -
మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా..
భోపాల్: ఓ కానిస్టేబుల్పై సామూహిక అత్యాచార దాడి మరువకముందే మధ్యప్రదేశ్లో మరో పోలీస్ అధికారిణికి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె డ్రైవర్ ఏకంగా ఆమె ఇంట్లోనే బాత్రూమ్లో కెమెరా పెట్టి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం అతడిని గాలిస్తున్నారు. చదవండి: అంగన్వాడీ టీచర్పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్ఫోన్ లాగేసుకుని ఓ పోలీస్ అధికారిణికి డ్రైవర్గా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన కానిస్టేబుల్ ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపుపై వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సెల్ఫోన్ ఉంచాడు. స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్ఫోన్ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్గా కార్పొరేటర్ భర్త కేసు దీంతో ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్గంజ్ పోలీస్స్టేషన్ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను చంపి.. బాత్రూంలో పాతిపెట్టి
నవాబుపేట: భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య తన బంధువులతో కలసి భర్తను దారుణంగా హత్య చేసి.. బాత్రూంలో పాతిపెట్టింది. నెలన్నర తర్వాత బయటపడిన ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. దుర్పల్లి పంచాయతీ పరిధిలోని మొరంబావికి చెందిన చెన్నయ్య (47) నాలుగు నెలల క్రితం తనకున్న రెండెకరాల భూమిలో ఎకరా పొలాన్ని రూ.14 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో ఇల్లు నిర్మాణం చేపట్టి.. కొంత డబ్బుతో తన అక్కాచెల్లెళ్లకు బంగారం ఇచ్చాడు. దీంతో తనకు డబ్బులు లేకుండా చేస్తున్నాడని భావించిన చెన్నయ్య భార్య రాములమ్మ భర్తతో గొడవపడేది. (చదవండి: గణాంకాలు–వాస్తవాలు) ఇంటి నిర్మాణ పనులు పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంటిలో వాటా ఇస్తానని చెప్పి బావ పెంటయ్యతో పాటు మరో బంధువుతో కలసి భర్తను చంపేందుకు రాములమ్మ పథకం వేసింది. భర్తకు బాగా మద్యం తాగించి టవల్ను గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఇంటి బాత్రూంలో గుంత తీసి శవాన్ని పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. నెల రోజులకు పైగా రాములమ్మ అదే ఇంట్లో నివాసం ఉంటోంది. కాగా జూలై 14వ తేదీ నుంచి అన్న కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లాడని.. చెన్నయ్య చెల్లెలు చెన్నమ్మ వదిన రాములమ్మను నిలదీసింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో జూలై 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసుగా నమోదు చేశారు. తొలుత చెన్నయ్య బంధువులను విచారణ చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం భార్య రాములమ్మను కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. బాత్రూంలో గుంత తీసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఆమె చెప్పడంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. (చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..) సంఘటన స్థలంలో బయటపడ్డ మృతదేహం. (ఇన్సెట్లో) చెన్నయ్య (ఫైల్) -
బ్రిటన్ రాణికి 10వ ముని మనవడు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 తనకి 10వ మునిమనవడు పుట్టినందుకు ఆనందంతో పొంగిపోతున్నారు. రాణి ఎలిజబెత్ మనవరాలు జారా తిండాల్ బాబుకి జన్మని చ్చారు. ఆ బాబుకి లుకాస్ ఫిలిప్ తిండాల్ అని పేరు పెట్టారు. బ్రిటన్ సింహాసనానికి క్యూ కట్టిన వారసుల్లో లుకాస్ 22వ స్థానంలో ఉన్నాడు. రాణి ఎలిజెబెత్ కూతురి కూతురైన జారా తిండాల్, ఆమె భర్త ఇంగ్లండ్ రగ్బీ మాజీ ఆటగాడు మైక్ తిండాల్కు మూడో సంతానంగా లుకాస్ పుట్టాడు. జారా బాత్ రూమ్లోనే బాబుకి జన్మనివ్వడం విశేషం. ఆస్పత్రికి తీసుకువెళ్లే వ్యవధి లేకపోవడంతో బాత్రూమ్లోనే తమ బిడ్డకు స్వాగతం పలికారు. రాణి దంపతులు బాబును చూడాలని ముచ్చట పడుతున్నారని, పరిస్థితులు అనుకూలించాక వాళ్లు కలుసుకుం టారని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. -
బాత్రూంలో చల్లటి గాలి.. అద్దం జరిపి చూసి అవాక్కయ్యింది
-
అద్దం వెనక ఏకంగా అపార్ట్మెంటే కట్టేశారు..!
వాషింగ్టన్: అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో.. భూమి లోపల, కప్బోర్టుల వెనక రహస్య గదులు ఉండే సన్నివేశాలను చాలానే చూశాం. కానీ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్మెంట్ బయటపడిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చూశారా.. లేదా ఇది చదవండి. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. న్యూయార్క్కు చెందిన టిక్టాక్ యూజర్ సమంతా హార్ట్సో అనే మహిళ తన బాత్రూమ్ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్మెంట్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టిక్టాక్లో షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే 7 మిలియన్ల మంది చూశారు. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది రోజులుగా నా బాత్రూమ్లోకి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ కిటికీ, వేరే కూలింగ్ పరికరాలు ఏం లేవు. ఎంత బలమైన గాలి అంటే అది నా జుట్టును వెనక్కి నెడుతుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వీస్తుందా అని వెతకడం ప్రారంభించాను. ఈ క్రమంలో బాత్రూమ్ సింక్కు అతికించిన అద్దం వెనక నుంచి ఈ గాలి వస్తుందని అర్థం అయ్యింది. దాంతో అద్దం జరిపి చూశాను. అక్కడ పెద్ద రంధ్రం కనిపించింది. అసులు నా బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవాలని భావించాను’’ అన్నారు. బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లాలని భావించింది సమంతా. ఈ క్రమంలో ఫేస్మాస్క్ పెట్టుకుని.. చేతికి గ్లౌవుజులు ధరించి బయలు దేరడానికి సిద్ధమయ్యింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తం చర్యగా ఓ సుత్తిని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ఆ తర్వాత బాత్రూమ్ వెనక తనకు కనిపించిన పెద్ద రంధ్రం గుండా లోపలికి ప్రవేశించింది. మొదట అదేదో సీక్రెట్ రూమ్గా భావించిన సమంతా ఆ తర్వాత అక్కడ మొత్తం అపార్ట్మెంట్ని చూసి షాకయ్యింది. అపార్ట్మెంట్ చూసి ఆశ్యర్యంతో గట్టిగా కేకలు వేశారు సమంతా. ఇక ఆ అపార్ట్మెంట్ అంతా చెత్త బ్యాగులు.. వాడేసిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘లోపలికి అడుగుపెట్టిన నేను అక్కడ ఎవరైనా ఉంటారని భావించాను. కానీ అద్దం వెనక ఏకంగా అపార్ట్మెంట్ ఉండటం నిజంగా వింతే’’ అన్నారు. చదవండి: టిక్టాక్ ఛాలెంజ్లో అపశ్రుతి.. బాలిక మృతి వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి -
ఐదేళ్లుగా బాత్రూమే అతనికి పడక గది
రాయగడ : పాయఖానాయే అతిడికి పడకగది అయింది. అందులోనే ఐదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఆధార్కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అందించే బిజు పక్కా ఇళ్లు పొందలేకపోతున్నాడు. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిరుపయోగంగా పడి ఉన్న పాయఖానాను పడక గదిగా మార్చుకొని అందులోనే ఉంటున్నాడు. జిల్లాలోని బిసంకటక్ సమితి పనుగుడ గ్రామంలో త్రినాథ్ పాండు అనే అరవై ఏళ్ల వృద్ధుని గాధ ఇది. సమితిలోని కుంభారిధాముని పంచాయతీ దుబాగుడ గ్రామానికి చెందిన పాండుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. కొడుకులు తనను ఆదరించకపోవడంతో దిక్కు తోచని స్థితిలో పనుగుడకు చేరుకున్నాడు. అక్కడ నిరుపయోగంగా ఉన్న పాయఖానలో తలదాచుకుంటున్నాడు. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుంటేనే ఆ పూట గడిచేది. ఇంతటి దీనావస్థలో జీవనాన్ని కొనసాగిస్తున్న పాండుకు ప్రభుత్వం తరుఫున ఎటువంటి సహాయం అందటం లేదు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తన వద్ద ఎటువంటి ఆధర్ కార్డు, గర్తింపు పత్రాలు లేకపొవడంతో ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నాడు. ఈ విషయమై బిసంకటక్ బీడీవోను ప్రశ్నించగా అతనికి ప్రభుత్వ సహాయం అందేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ
న్యూఢిల్లీ: బాత్రూమ్లో కొండచిలువ కనిపించడంతో ఓ కుటుంబం షాక్ తిన్న ఘటన న్యూఢిల్లీలోని ఓక్లహాలో చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ కుటుంబం ఇంట్లోకి, సరాసరి బాత్రూమ్లోకి ఐదడుగుల కొండచిలువ వచ్చి చేరింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అనే ఎన్జీవోను సంప్రదించి వారికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని బాత్రూమ్లో నక్కిన కొండచిలువను పట్టుకున్నారు. అయితే అది అనారోగ్యంతో ఉన్నందువల్ల అబ్జర్వేషన్లో పెట్టినట్లు ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. వర్షాల వల్ల పాములు తరచూ ఇళ్లలోకి వస్తున్నాయని వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ ప్రతినిధి వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. వర్షపు నీరు వాటి ఆవాసాల్లోకి ప్రవేశించినప్పుడు రక్షణ కోసం పొడిగా ఉండే ప్రాంతాన్ని వెతుకుతూ, అనుకోకుండా గృహ సముదాయాల్లోకి చేరుతాయని తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం) ఫొటో(ఏఎన్ఐ సౌజన్యంతో) పొడవైన నాగుపామును రక్షించిన అధికారులు ఒడిశాలోని బురుఝరి గ్రామంలో భారీ నాగుపాము బావిలో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు స్నేక్ హెల్ప్లైన్ టీమ్ను ఆ ప్రాంతానికి పంపించారు. వారు సుమారు గంటపాటు కష్టపడి ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. నాగుపాము పొడవు 12-15 అడుగులుగా ఉంది. అనంతరం దీన్ని అడవిలో వదిలిపెట్టారు. (ఒకేలా ఉండటమే కాదు ఫలితాలు కూడా ఒకటే!) -
బాత్రూంలో ఆరడుగుల పాము
తమిళనాడు, అన్నానగర్: కోవైలో ఆదివారం ఓ అపార్ట్మెంట్ ఆవరణలోని బాత్రూంలోకి ఆరడుగుల నాగుపాము చొరబడడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుడు దాన్ని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. వివరాలు.. కోవై రామనాథపురం నంజుండాపురం రోడ్డులో ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంది. ఈ ఆవరణలో జనరల్ బాత్రూమ్ ఉంది. అందులోకి ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఓ మహిళ వెళ్లింది. అపుడు ఓ నాగుపాము కనిపించింది. దాన్ని చూసి ఆ మహిళ దిగ్భ్రాంతి చెందింది. సమాచారం అందుకున్న ఉక్కడమ్కి చెందిన పాము పట్టే స్నేక్ అమీన్ సంఘటనా స్థలానికి వచ్చి దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే..
చాలా మందికి తమ స్మార్ట్ఫోన్లను బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే ఫోన్ తీసుకెళ్లి గంటల తరపడి బాత్రూంలో ఉంటారు. దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఈ చెడు అలవాటును పోగొట్టేందుకు ఓ కంపెనీ తమ ఉద్యోగులకు వింత హెచ్చరిక జారీ చేసింది. ఏ ఉద్యోగి అయినా బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపొద్దని నిబంధన పెట్టింది. ఒకవేళ పది నిమిషాల కంటే ఎక్కువ సమయం బాత్రూంలో ఉంటే వాసన చూసి నిర్ధారించుకుంటారట. బాత్రూంలో దుర్వాసన రాకుంటే అతని పేరును పైఅధికారికి తెలిపి చర్యలు తీసుకుంటారట. బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారనే కారణంగానే ఈ నిబంధనలు పెట్టారట. ఈ హెచ్చరికను కాగితంపై రాసి బాత్రూం తలుపులకు అంటించారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసన చూసే లక్కీ ఉద్యోగి ఎవరని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అలా అయితే బాత్రూంలో నీళ్లే పోయను అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొత్త ఉద్యోగం కావాలనుకేవారికి మంచి అవకాశం అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. అయితే ఈ నిబంధన ఏ కంపెనీ పెట్టిందో తెలియరాలేదు. -
గోడలు లేని బాత్రూమ్: నెటిజన్ల మండిపాటు
కాన్బెర్రా : అందరూ తమదైన శైలిలో ఇంటిని నిర్మించుకోవడంతో పాటు ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తికి ఇదంతా పాత పద్దతిగా అనిపించిందేమో.. అందుకే గోడలు లేకుండా బాత్రూమ్ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. ఓ ఇంటి యజమాని బెడ్రూమ్లోని బాత్రూమ్ను గోడలు లేకుండా వింతగా నిర్మించుకున్నాడు. కనీసం అడ్డుగా గ్లాస్లను సైతం అమర్చలేదు. డెబ్రా బెల్లా అనే రిపోర్టర్ ఈ దృశ్యాన్ని తన ట్విటర్లో పంచుకున్నారు. ‘ఈ ఇంటి దంపతులు తమ బాత్రూమ్ను ఇలాగే ఉండాలని కోరుకున్నారు. దీని గురించి మీరేం అనుకుంటున్నారు’ అంటూ.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు డెబ్రా బెల్లా. జూన్ 14న పోస్ట్ చేసిన ఈ ఫోటో చూసిన నెటిజన్లు బాత్రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే ఇదేం బాత్రూమ్ అంటూ మండిపడుతున్నారు. ట్విటర్లో ఈ స్పందన చూసి ఆశ్చర్యపోయిన ఇంటి యజమాని ట్రాయ్ విలియమ్సన్.. భార్య భర్తలు కలిసి తయారు కావడానికి ఇది చాలా అందంగా ఉంటుందని, అంతేగాక ఇదేమి కొత్త కాదని, వారి ఇళ్లల్లో ఇలాంటి నిర్మాణాలు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. Ensuites without walls. The owner of this Wynnum house knocked them down and he says it's what couples want. What do you think? #housesforsale pic.twitter.com/2EylnZKHzp — Debra (@Debrabela81) June 14, 2019 -
ఇకపై ‘బాత్రూం బ్రేక్’ కూడా కౌంటే..!
కోల్కతా : పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణ కోసం ఓ స్కూల్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక మీదట విద్యార్థులు బాత్రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే విషయాన్ని తప్పని సరిగా నమోదు చేయాలంటూ సౌత్ సిటి ఇంటర్నేషనల్ స్కూల్ ఓ నియమం తీసుకొచ్చింది. ఇందుకోసం బాత్రూముల్లో ప్రత్యేకంగా ట్యాబ్లను ఏర్పాటు చేయనన్నుట్లు పేర్కొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ‘జూలై 1నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. మగ పిల్లలు, ఆడ పిల్లల బాత్రూం వెలుపల వేర్వేరు రిజస్టర్లను ఉంచుతాం. విద్యార్థులు బాత్రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే అంశం దీనిలో నమోదవుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ సమయంలో విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే విషయం మాకు సులభంగా తెలుస్తుంది’ అన్నారు. అయితే సదరు పాఠశాల ఇలాంటి నిర్ణియం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. గత వారం కోల్కతాలోని ఓ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఊపిరాడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకుని.. మణికట్టు మీద కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కొత్త రూల్ వల్ల పాఠశాలల్లో ఆత్మహత్యలను పూర్తిగా కాకపోయినా చాలా వరకూ నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ రూల్ వల్ల విద్యార్థులను ప్రతిక్షణం గమనించే అవకాశం ఉంటుందన్నారు. దాంతో పాటు నెలకొకసారి క్లాస్ టీచర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ నూతన నియమాల గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని.. వారు దీనికి మద్దతిస్తున్నారో లేదో తెలపాలని కోరినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. -
ప్రకృతి నిజంగానే పిలుస్తోంది..
జపాన్లోని అకాషీలో ఉన్న హిపోపో పాపా కేఫ్.. లోకల్గా ఇది చాలా ఫేమస్.. ఫుడ్ విషయంలో కాదు.. బాత్రూం విషయంలో.. ఈ హోటల్కు వచ్చినవారు ఒక్కసారైనా బాత్రూంకు వెళ్లివస్తారు. ఎందుకో తెలుసా? ఫొటో చూశారుగా.. ఇందుకే.. ఈ కేఫ్ యజమాని ఓ భారీ అక్వేరియం మధ్యలో బాత్రూంను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.1.8 కోట్లు ఖర్చుపెట్టాడు. దీంతో జనం ఈ కేఫ్కు బారులు తీరుతున్నారు. అయితే.. దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్.. చాలామంది జనం కేఫ్లో అర్డర్ ఇచ్చేదాని కన్నా.. ఎక్కువ సమయం బాత్రూంలో చేపలను చూస్తూ గడిపేస్తున్నారట. మరికొందరైతే.. ఉత్తుత్తినే.. ప్రకృతి పిలుస్తోందంటూ బాత్రూంలో దూరి గంటలు గంటలు గడిపేస్తున్నారట. ఇంకొందరైతే.. మరింత చిత్రంగా.. అవలాగ మమ్మల్నే చూస్తూ ఉంటే.. పనెలా అవుతుందమ్మా.. ఛీ సిగ్గేస్తోంది అంటూ వయ్యారాలు కూడా పోతున్నారట. -
బాత్రూమ్లో జారిపడిన హెచ్డీ దేవెగౌడ
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బాత్రూమ్లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు. -
రైలు బాత్రూమ్లో ప్రయాణికుడి ఆత్మహత్య
సాక్షి, అల్లిపురం(విశా ఖ దక్షిణ) : తిరుపతి – విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్లో గుర్తు తెలి యని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు బుధవారం గుర్తించా రు. రైల్వే పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి–విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్(08574)లోని బాత్రూమ్లో సుమా రు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఉరి వేసుకున్నట్లు ఉదయం 10గంటల సమయంలో ఫిర్యాదు అందింది. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ ఐ ఎల్.రమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను 0891–2746211, 94402252 77, 9440627547 సంప్రదించాలని కోరారు. -
ట్రైన్లో బాత్ రూంలోని నీళ్లతో టీ?
-
సినిమాకు వెళ్తే ప్రాణం పోయింది
సాక్షి, బళ్లారి : స్నేహితులతో కలిసి కొత్త సినిమాకు వెళ్తే ఏకంగా ప్రాణమే పోయిందంటూ మృతుడి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా శాసవాసపురకు చెందిన రాము (25) అనే యువకుడు టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్భంగా మిత్రులతో కలిసి విందు జరుపుకున్నాడు. బళ్లారి నగరానికి వచ్చి ఓ థియేటర్లో అజ్ఞాతవాసి సినిమాకు బుధవారం రాత్రి షోకు వెళ్లాడు. సినిమా మధ్యలో బాత్రూమ్కు వెళ్లాడు. అక్కడ ఫినాయిల్ ఉన్న బాటిల్ను కూల్డ్రింక్గా భావించి సేవించాడు. బాత్రూమ్లోనే అస్వస్థతకు గురయ్యాడు. థియేటర్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా..
స్మార్ట్ ఫోన్.. అది లేకుండా రోజు గడవదు.. ఎక్కడికెళ్లినా ఏం చేసినా ఫోన్ ఉండాల్సిందే. ప్రస్తుతం ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. స్నేహితులతో మాట్లాడాలన్నా.. ఫేస్బుక్లో ఫోటోలు పెట్టాలన్న స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. మనిషి ఫోనుకు ఎంతలా బానిస అయ్యాడంటే చివరకు బాత్రూం వెళ్లే సమయంలో కూడా ఫోన్ వదలడం లేదు. అయితే ఏంటీ.? ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా..? మీరే చూడండి. బాత్రూం లో ఫోన్ వాడటం చాలా ప్రమాదకరం. మీరు బాత్రూంలో ఫోన్ మాట్లాడే, వాడే అలవాటు ఉంటే ఇక నుంచి అయినా మీ అలవాటు మార్చుకోండి. బాత్రూం లోకి ఫోన్ తీసుకుపోవడం వల్ల తొందరగా అనారోగ్యం పాలవుతారని ఓ సర్వే తెలిపింది. మనం చేసే చాటింగులు, ఫేస్బుక్ కాసేపు పక్కనపెడితే మీ ఆరోగ్యానికి ఏ మాత్రం ఢోకా ఉండదు. బాత్రూంలో ఉండే బ్యాక్టీరియా నేరుగా కంటే ఫోన్ మీదకు ఎక్కువ వ్యాపిస్తుంది. మీరు చేతులు శుభ్రపరచుకున్న బాత్రూంలోకి తెచ్చుకున్న ఫోన్ను ముట్టుకోవడం ద్వారానే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుందని తెలిసింది. తద్వారా మీరు చేతులు శుభ్రపరుచుకున్నా ఉపయోగం లేదు. పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. పలురకాల బ్యాక్టీరియా ఫోను ద్వారా వ్యాప్తి చెంది అనారోగ్యం పాలయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. ఒక్క మొబైలే కాదు టవల్స్, బ్రష్ ద్వారా కూడా జబ్బులు వేగంగా వ్యాపిస్తాయి. -
బాత్రూమ్ పైకప్పు కూలి..
కర్నూలు, కల్లూరు (రూరల్) : బాత్రూం పైకప్పు కూలి పాత కల్లూరులో ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. పాతకల్లూరులోని చెంచునగర్లో చెంచు పెద్దక్క(27) మంగళవారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూం వెళ్లింది. ఈక్రమంలో బాత్రూం పైకప్పు కూలింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భర్త వెంటనే అక్కడి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి నాలుగేళ్ల కూతురు ఉంది. పెద్దక్క మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత పరామర్శించారు. ఈమె కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఉద్యోగం కోసం కన్నబిడ్డనే చంపేసింది..
అబుదాబి: ఏమహిళకైనా తల్లి అవబోతోందని తెలిస్తే ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. తనకు పుట్టబోయే బిడ్డకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ప్రాణాలకు తెగించి నవమాసాలు మోస్తుంది. బిడ్డకు జన్మనిచ్చే సమయం అంటే ఆతల్లికి మరో జన్మ ఎత్తడం వంటిది. అమ్మతనంలో అంత గొప్పతనం ఉంది. కానీ ఓ మహిళ అమ్మతనానికి మచ్చ తెచ్చే పని చేసింది. అత్యంత దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 9 నెలల గర్భాన్ని మోసింది. రహస్యంగా జన్మనిచ్చిన శిశువును బాత్రూంకి తీసుకెళ్లి ఫ్లోర్పై కొట్టిచంపింది. అలాగని శిశువు అక్రమ సంతానం కూడా కాదు. ఎందుకంటే గర్భానికి ఆమె భర్తే కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం యూఏఈలోని అబుదాబి నగరానికి వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే గర్భవతి అని తెలిసింది. అది యాజమాన్యానికి తెలిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని గర్భవతిననే విషయాన్ని ఆఫీస్లో, కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడింది. నొప్పులను కూడా భరించి, గదిలోకి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆశిశువును బాత్రూంకు తీసుకెళ్లి బాత్రూం ఫ్లోర్పై కొట్టిచంపింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఓ ఉద్యోగి అధికారులతో పాటు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. శిశువు, తల్లిని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మహిళపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితురాలు చేసిన తప్పును అంగీకరించడంతో జీవితకాలజైలు శిక్ష విధించారు. నిందితురాలి వివరాలు తెలియచేయడానికి పోలీసు వర్గాలు నిరాకరించాయి. -
యువ ఇంజనీర్ అనుమానాస్పద మృతి
బనశంకరి(బెంగళూరు): బాత్రూమ్లో ఓ యువ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన మహదేవపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలు... కర్ణాటకలోని చిక్కమంగళూరు నివాసి వసంతకుమార్ (24) నగరంలోని ఐటీపీఎల్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వసంతకుమార్ నారాయణపురలోని వీఆర్ఎస్ లేఔట్లో ఓ హాస్టల్లో స్నేహితుడు రంజిత్తో కలిసి ఉంటున్నాడు. ఆదివారం ఉదయం రంజిత్ విధులకు వెళ్లగా హాస్టల్లో ఒంటరిగా ఉంటున్న వసంతకుమార్ సాయంత్రం బాత్రూమ్కు వెళ్లి అక్కడ జారిపడి మృతి చెందాడు. విధులు ముగించుకుని హస్టల్కు చేరుకున్న రంజిత్ బాత్రూమ్లోకి వెళ్లి చూడగా వసంతకుమార్ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరుగున‘బడి’
మూణ్ణాళ్ల ముచ్చటగా.. స్వచ్ఛ బడులు ఆయాల పునర్నియామకం జరిగేదెన్నడో? జిల్లాలో ఇంటిముఖం పట్టనున్న 2,526 శానిటేషన్ వర్కర్లు రాష్ట్రంలో మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేక 29శాతం బాలికలు బడులకు తర చూ వెళ్లడం లేదని జాతీయ సంస్థ అధ్యయనంలో తేలింది. కళాశాల స్థాయిలో 12శాతం మంది ఇదే సమస్య కారణంగా బడి మానేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి, బాలికల హాజరు శాతం పెరిగేలా ప్రభుత్వం అన్ని బడుల్లో మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టి పెట్టింది. బడులను స్వచ్ఛంగా ఉంచాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇది మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు నియమించిన శానిటేషన్ వర్కర్లను అక్టోబరు నుంచి నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - రాయవరం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను ఎస్ఎస్ఏ 2014 నవంబర్ నుంచి చేపడుతోంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్ఎస్ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు డ్వాక్రా మహిళలను శానిటేషన్ వర్కర్లగా నియమించే బాధ్యతను గతేడాది డీఆర్డీఏకు అప్పగించారు. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అయితే వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందకపోగా, అకస్మాత్తుగా వీరిని ఇంటికి పంపించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులే శానిటేషన్ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లాలో 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.రెండువేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.నాలుగు వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఐదు నెలలకు రావాల్సిన వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 78లక్షల 15వేలు విడుదల కావాల్సి ఉంది. స్వచ్ఛబడులంటే ఇలాగేనా.. పాఠశాల హెచ్ఎంలకు వచ్చిన మెసేజ్లో శానిటేషన్ వర్కర్లను సెప్టెంబరు నెలాఖరు వరకు మాత్రమే వేతనాలు ఇస్తామని తెలిపారు. శానిటేషన్ వర్కర్లను తొలగించడంతో పాఠశాలల్లో మరుగుదొడ్లను విద్యార్థులు, ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులతో ఎలా శుభ్రం చేయిస్తారు? లేకుంటే ఉపాధ్యాయులే శుభ్రం చేస్తారా? అనే ప్రశ్నలను విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క స్వచ్ఛభారత్ అంటూ ఊదరగొడుతున్న సర్కార్ మరోపక్క ఆయాలను తొలగించడంపై స్వచ్ఛభారత్పై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. శానిటేషన్ వర్కర్లను నియమించాలి.. ప్రభుత్వం పాఠశాలల్లో వెంటనే శానిటేషన్ వర్కర్లను నియమించాలి. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. – టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ ఇదేనా చిత్తశుద్ధి? స్వచ్ఛబడులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? స్వచ్ఛ బడుల పథకంపై ప్రభుత్వం వెంటనే స్పందించి శానిటేషన్ వర్కర్లను పునర్నియమించాలి. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ ఇంకా ఆదేశాలు రాలేదు.. పాఠశాలల్లో శానిటేషన్ వర్కర్లను తొలగించాలంటూ వచ్చిన మౌఖిక ఆదేశాలను పాఠశాల హెచ్ఎంలకు పంపించాం. తిరిగి వారిని పునర్నియామకం చేసుకోవడానికి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎ.నాగరాజు, ఎంఈవో, రాయవరం -
వీడియో తీసి బెదిరిస్తున్నాడు..
రూరల్ ఎస్పీ గ్రీవెన్స్లో ఓ మహిళ ఫిర్యాదు గుంటూరు ఈస్ట్: బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని సోమవారం ఓ మహిళ అడిషనల్ ఎస్పీకి మొరపెట్టుకుంది. జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడుకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. సత్తెనపల్లి నుంచి వృత్తిరీత్యా నరసరావుపేటకు వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు, పక్క పోర్షన్లో ఉండే వ్యక్తి తాను బాత్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ ఆమెకు న్యాయం చేస్తామని చెప్పారు. -
క్రిములను మటుమాయం చేసేస్తుంది
ఇళ్లలో కిచెన్ ప్లాట్ఫామ్స్, బాత్రూమ్ గచ్చు వంటివి సూక్ష్మజీవులకు ఆవాసాలుగా ఉంటాయనేది తెలిసిందే. సూక్ష్మజీవుల బెడద తప్పించుకోవడానికి చాలామంది ఫినైల్ వంటివి వాడుతుంటారు. అయితే, వాటి వాసనను భరించడం చాలా కష్టం. అలాంటి బెడదేమీ లేకుండానే సూక్ష్మక్రిములను తొలగించుకోవడం ఇప్పటి వరకు దాదాపు అసాధ్యంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈ ఫొటోలో మోడర్న్ మంత్రదండంలా కనిపిస్తున్న పరికరం సూక్ష్మక్రిముల పాలిట మంత్రదండంలాగానే పనిచేస్తుంది. ఇది అల్ట్రావయొలెట్ శానిటైజర్. సూక్ష్మక్రిములకు ఆలవాలాలుగా ఉండే ప్రదేశాల్లో ఉపరితలానికి కాస్త చేరువగా ఈ పరికరాన్ని నెమ్మదిగా మంత్రదండం ఆడించినట్లుగా ఆడిస్తే చాలు... సూక్ష్మ క్రిములు అక్కడికక్కడే నాశనమైపోతాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటారా..? రీచార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ పరికరంలో ఒక బల్బు ఉంటుంది. స్విచాన్ చేయగానే బల్బు వెలిగి దీని నుంచి అల్ట్రావయొలెట్ కిరణాలు వెలువడతాయి. ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు సోకిన ప్రదేశంలో సూక్ష్మక్రిములు అక్కడికక్కడే నశిస్తాయి. ఇన్ఫ్లుయెంజాకు దారితీసే వైరస్, ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా సైతం దీని ధాటికి పూర్తిగా నాశనమవుతాయి. -
పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...
ఇంటిప్స్ ♦ బాత్రూమ్ నుంచి వదలకుండా దుర్వాసన వస్తుంటే... బాత్రూమ్లో రెండు మూడు ఆగ్గిపుల్లలను వెలిగించి ఆర్పేయండి. కాసేపటికి ఆ వాసన పోతుంది. ♦ పాలు కాచినప్పుడు గిన్నె అడుగున అంటుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాలను తడి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టాలి. లేదంటే ముందు నీళ్లు పోసి, తర్వాత పాలు పోయాలి. ♦ అరిగి మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఓ గిన్నెలో వేసి, వాటిపై కొద్దిగా గ్లిజరిన్ను నీటిని పోయాలి. కాసేపటికి సబ్బు కరిగిపోతుంది. అప్పుడా లిక్విడ్ని బాటిల్లో వేసి పెట్టుకుంటే హ్యాండ్వాష్లా వాడుకోవచ్చు. ♦ అద్దాలు, గాజు వస్తువులు కిందపడి పగిలినప్పుడు ఎంత శుభ్రం చేసినా కంటికి కనిపించనంత చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడా ఉండిపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే... బ్రెడ్ సై్లస్తో ఆ ప్రాంతమంతా అద్దాలి. అప్పుడా ముక్కలు వాటికి అంటుకుంటాయి. ♦ పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే... వాటిని ఓ బ్రౌన్ బ్యాగ్లో వేసి గాలి, వెలుతురు తగలని చోట ఉంచాలి. -
అత్యవసరం.. అందనంత దూరం
బిట్రగుంట : ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను తీవ్రంగా వేధిస్తుంది. పాఠశాలల్లో ప్రతి సంవత్సరం రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నా నీటి వసతి కల్పించకపోవడం, నిర్వహణాలోపం కారణంగా అవి వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులతో పాటు బోధనా సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోజులో ఎనిమిది గంటలకుపైగా పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు, విద్యార్థులు మరుగుదొడ్లు లేని కారణంగా చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్నారు. మండల పరిధిలో 41 ప్రాథమిక, ఎనిమిది ప్రాథమికోన్నత, ఐదు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా మూడు వేల మందికి పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేని కారణంగా వినియోగానికి నోచుకోవడం లేదు. 19 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నిర్వహణాలోపం కారణంగా పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ప్రతీఏటా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుండటంతో ఒక్కో పాఠశాలలో రెండు, మూడు వంతున కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే ఒక్క పాఠశాలలో కూడా నీటి వసతి లేకపోవడంతో ఒక్క మరుగుదొడ్డి కూడా వినియోగంలోకి రావడం లేదు. మరుగుదొడ్ల సమస్యపై విద్యాశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చైతన్యమేదీ.. నిర్మల్భారత్ అభియాన్, స్వచ్ఛభారత్ పథకాల పేరుతో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తతంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారులు ఏకంగా రాత్రిబస చేసి మరీ మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. అయితే పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యపై మాత్రం ఒక్క అధికారి కూడా దష్టి సారించకపోవడం గమనార్హం. ఏపాఠశాలకు వెళ్లినా పాఠశాల చుట్టూ బహిరంగ మలవిసర్జనతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన కారణంగా ముందుగా వ్యాధులబారిన పడేది కూడా చిన్నారులే. ఈవిషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంపై మండల విద్యాశాఖాదికారి జయంత్బాబును సంప్రదించగా మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
‘మరుగు’న పడేశారు!
♦ రూ. కోట్లు గుమ్మరించినా కానరాని మరుగుదొడ్లు ♦ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మరీ దారుణం ♦ పట్టించుకోని పాలకులు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరుగుదొడ్ల సమస్య వెంటాడుతోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. బాలికల ఆశ్రమాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అత్యవసర సమయంలో పిల్లలు మరుగు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని 46 ఆశ్రమాల్లో ఇదే పరిస్థితి. ఎంతో ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించకుండా మరుగున పడేయడంపై పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట: గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఆశ్రమ పాఠశాలలకు అదనపు భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం, మంచినీటి సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ఎక్కడా వాటి ఆనవాళ్లు కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే పిల్లలకు చుక్కలు చూడాల్సిన పరిస్థితి. బాలికల ఆశ్రమపాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హడ్డుబంగి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేదనే ఉద్దేశంతో ఇక్కడ చదువుకోలేమని విద్యార్థినులు తేల్చి చెప్పారంటేSపరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు ఇలా.. వాస్తవానికి పది మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి ఉండాలి. కానీ 30 మందికి కూడా ఒకటి లేని పరిస్థితి. జిల్లాలో 46 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలు, మూడు జూనియర్ కళాశాలలు, మూడు కేజీబీవీ, రెండు మినీగురుకులాలు, 22 పోస్ట్మెట్రిక్వసతిగృహాలున్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది గిరిపుత్రులు చదువుతున్నారు. వారికి సరిపడా మరుగుదొడ్లు మాత్రం లేవు. రూ.2 కోట్లపైనే వ్యయం ఆశ్రమ పాఠశాలల్లో వివిధ పథకాల ద్వారా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కోసం గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయితే చాలాచోట్ల పూర్తిగా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించిన దాఖలాలు లేవు. హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమపాఠశాలలో 650 మంది చదువుతున్నారు. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడవ్వడంతో అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు. సీతంపేట బాలికల ఆశ్రమపాఠశాలలో 650 మంది విద్యార్థినులు ఉండగా.. 20 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. మరో 20 వరకు అవసరం ఉంది. పూతికవలసలో 520 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ ఉన్న 20 మరుగుదొడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఐటీడీఏ ప్రాంగణంలో బాలుర గురుకుల పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ రన్నింగ్ వాటర్ లేదు. ఒకే బోరు ఉండడంతో విద్యార్థుల స్నాన్నాలకు నీరు చాలడం లేదు. దోనుబాయి గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో 20 వరకు మరుగుదొడ్లు ఉన్నా, రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు. సామరెల్లిలో అదే పరిస్థితి. మిగిలిన ఆశ్రమాల్లో కూడా ఇదే దుస్థితి ఉన్నా సమస్యను పరిష్కరించేందుకు పాలకులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొత్త మరుగుదొడ్లు కడుతున్నాం అవసరమైన చోట కొత్తగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. పాడైన వాటిని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా బాగు చేయిస్తున్నాం. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పిస్తాం. – ఎంపీవీ నాయిక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు మరుగుదొడ్డి సౌకర్యం లేక అవస్థలు తప్పడం లేదు. విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లు నిధులు దోచేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఉపయోగ పడే నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితిని నేనెక్కడా చూడలేదు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
అతడి విమానం ఎంతో గొప్పదట!
అమెరికాః రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడట. తాను ప్రచారానికి వినియోగించే స్వంత ఫ్లైట్ ముందు ఎయిర్ ఫోర్స్ విమానం కూడ ఎందుకూ పనికిరాదన్నాడట. తన విమానంలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు అధ్యక్షుడు ఒబామా ప్రయాణించే విమానానికి సైతం లేకపోవచ్చంటూ చెప్పడం చూస్తే... నిజంగా ఆయనగారి విమానం ఏ రేంజ్ లో ఉందోనని అంతా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారట. తన ప్రచారంలో భాగంగా ఓ వేదికపై స్పీచ్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానంగురించి చెప్పి మురిసిపోయాడట. విమానంలోని సీటు బెల్టులకు, బాత్ రూం లోని ట్యాప్ లకు సైతం బంగారు పూత పూసి ఉంటుందని చెప్పుకొచ్చాడట. సాధారణంగా బోయింగ్ విమానం అంటే 200 మంది ప్రయాణీకులతో, ఎయిర్ హోస్టెస్ లతో సందడి చేస్తుంది. అలాంటిది ట్రంప్ వినియోగించే బోయింగ్ 757 విమానం మాత్రం ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉందట. కేవలం 43 మంది ప్రయాణీకులు మాత్రమే ఎక్కగలిగేట్లు విమానంలో ఏర్పాట్లు చేశారట. స్టాబాంగ్ ఏవియేషన్ నిర్వహణలో ఆ ప్రత్యేక విమానం నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్టెన్ నుంచి ట్రంప్ ఆ విమానాన్ని 2005 సంవత్సరంలోనే కొనుగోలు చేసి, అనంతరం అందులో తనకు కావలసినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు. నిజంగా ట్రంప్ సొంత విమానం చూస్తే అన్ని హంగులూ కలిగిన స్వంత గృహంలా కనిపిస్తుంది. విమానంలో లగ్జరీ సీట్లు, వాటికున్న బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత ఉంటాయి. తన అభిరుచికి తగ్గట్లుగా చేసుకున్న ఏర్పాట్లలో ముఖ్యంగా విమానంలో మీటింగ్ హాళ్ళు, సిల్క్ లైన్ మాస్టర్ బెడ్ రూం, సుమారు వెయ్యి చిత్రాలను ప్రదర్శించగలిగే శక్తి ఉన్న 57 అంగుళాల టెలివిజన్, సకల సౌకర్యాలు కలిగిన బాత్ రూం లు, వీలైనంత వరకూ బంగారు పూతతోనే కనిపిస్తాయట. ఈ ప్రత్యేక విమానంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇన్ని హంగులతో కూడిన ఆ విమానం ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 675 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట. -
'బాత్రూంలోకి వారిని కూడా అనుమతించండి'
వాషింగ్టన్: ఇక నుంచి లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్స్) చేసుకున్నవారిపట్ల వివక్ష చూపడానికి వీల్లేదంటే అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇలాంటివి జరగొద్దని నొక్కి చెప్పింది. లింగమార్పిడి చేసుకున్నవారికి ఆయా పాఠశాలల్లో, కాలేజీల్లోని బాత్రూంలలోకి అనుమతించడం లేదని, ఈ సమస్య ఉత్తర కరోలినాలో అధికంగా ఉందని, దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆదేశించింది. త్వరలోనే అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాలు పంపించనుంది. అయితే, ఏ చట్టం ప్రకారం ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారనే విషయం స్పష్టం చేయకుండా కేవలం విద్యాశాఖ అధికారుల సంతకాలతో ఈ లేఖలను ఆయా విద్యాసంస్థలకు పంపిచనున్నారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు బాత్రూంలలోకి అనుమతి లేకుండా నార్త్ కరోలినా ఒక చట్టాన్ని చేసింది. అయితే, ఈ చట్టం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేలా ఉందని, దీనిని మార్చాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా నార్త్ కరోలినాకు ఫెడరల్ గవర్న మెంట్ కు మధ్య తీవ్ర వైరుధ్యాలు కూడా వచ్చాయి. దీంతో అమెరికా విద్య, న్యాయశాఖలు ఈ అంశంలో జోక్యం చేసుకుని తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. లింగమార్పిడి చేసుకున్నవారికి వారి వారి గుర్తింపు ప్రకారం బాత్ రూంలలోకి అనుమతించాలంటూ అందులో పేర్కొననుంది. -
బాలికల హాస్టల్ లోకి పోకిరీలు
♦ బాత్రూంలో వీడియో చిత్రీకరించే యత్నం ♦ ఒకరిని పట్టుకున్న సిబ్బంది ♦ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత బోధన్ టౌన్ : పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలోకి ప్రవేశించి సెల్ఫోన్లో వీడియోలు తీసిన పోకిరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గురు యువకులు బుధవారం ఉదయం పట్టణంలోని బాలికల వసతి గృహం గోడపైనుంచి లోపలికి ప్రవేశించారు. బాలికలు బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో సిబ్బంది పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పోకిరీలు పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు యువకులు పారిపోగా.. సాయిసిద్ధార్థ పట్టుబడ్డాడు. అతడికి దేహశుద్ధి చేసి ఆర్డీవో శ్యాంప్రసాద్లాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పారిపోయిన ఇద్దరు యువకులనూ అదుపులోకి తీసుకుని ముగ్గురికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సుమోటోగానే కేసునమోదు చేసుకున్నామని తెలిపారు. వసతి గృహనికి భద్రత కరువు నిరుపేద విద్యార్థుల కోసం పట్టణంలోని రాకాసీపేట్లో ఏర్పాటు చేసిన సమీకృత బాలికల వసతి గృహనికి భద్రత కరువయ్యింది. బాలికల వసతి గృహంలో వార్డెన్లు అందుబాటులో ఉండరు. భద్రత లేకపోవడంతో హాస్టల్ చుట్టూ పోకిరీలు చేరి బాలికలను ఆటపట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళలో వసతిగృహం లోకి రాళ్లు విసురుతున్నారని బాలికలు గతంలో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వసతి గృహం గోడ ఎత్తులేకపోవడంతో పోకిరీలు తరచూ ఆమ్మాయిలను ఆటపట్టిస్తున్నారు. భద్రత కోసం హాస్టల్ వద్ద మహిళా కానిస్టేబుల్ను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరినా ఫలితం లేదు. ముగ్గురు యువకులు మూడు రోజులుగా వసతి గృహం వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని తెలిసింది. అధికారులు స్పందించి హాస్టల్ వద్ద భద్రత పెంచాలని, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎవరిదీ పాపం!
♦ అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి ♦ పొరుగింటి బాత్రూంలో మృతదేహం లభ్యం ♦ అనంతరం చెట్లపొదల్లో పడేసిన దంపతులు ♦ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ సయ్యద్ రఫిక్ ♦ జాగిలంతో వివరాలు సేకరించిన పోలీసులు ♦ బాలిక మృతితో గుండెలుబాదుకున్న తల్లిదండ్రులు ♦ జవహర్నగర్ మండలం గబ్బిలాలపేట్లో విషాదం పొట్టకూటి కోసం కోటి కష్టాలుపడుతున్న ఆ దంపతులు నిత్యం కూలీపనులు చేస్తేనే పొట్టగడిచేది. దీంతో వారి పెద్దకూతురు అన్నీతానై తమ్ముడి, చెల్లి ఆలనాపాలన చూస్తుండేది. అంతలోనే ఏం జరిగిందో ఏమో చిన్నారి పొరుగింటి వారి బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. ఆందోళనకు గురైన పొరుగింటి దంపతులు చిన్నారి మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేశారు. అంతా అనుమానాస్పదంగా ఉన్న ఈ ఘటన జవహర్నగర్ ఠాణా పరిధిలోని గబ్బిలాలపేటలో మంగళవారం వెలుగుచూసింది. -జవహర్నగర్ స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన రాజు, కనకమ్మ దంపతులు పదేళ్ల క్రితం జవహర్నగర్కు వలస వచ్చి గబ్బిలాలపేటలోని ఓఅద్దెఇంట్లో ఉంటూ కూలీపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి కుమార్తెలు యేసురాణి(6), రూతు (10 నెలలు), కుమారుడు బెంజిమెన్ (4) ఉన్నారు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో కనకమ్మ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి చివరకు బతికి బట్టకట్టింది. రాజు నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో కూలీపనులు చేస్తూ వారానికి ఓసారి ఇంటికి వస్తుండేవాడు. నిత్యం తెల్లవారుజామునే నిద్రలేచే కనకమ్మ ఇంటి పనులు ముగించుకుని 5 గంటలకే పెద్ద కూతురు యేసురాణికి బెంజిమెన్, రూతు బాధ్యతలు అప్పగించే తాను కూలీపనికి వెళ్తుండేది. సాయంత్రం వరకు చిన్నారి తన తమ్ముడు, చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఇదిలా ఉండగా, సోమవారం కన కమ్మ ఎప్పటిమాదిరిగానే వంటచేసి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యేసురాణి కనిపించకపోవడంతో తన మామ మల్లాకితో కలిసి ఆమె కోసం వెతికినా ఫలితం లేకుండాపోయింది. దీంతో వారు రాత్రి 8 గంటలకు జవహర్నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తమ ఇంటి సమీపంలో ఓ చెత్త పొదల్లో యేసురాణి మృతదేహం కనిపించింది. ఏసీపీ సయ్యద్ రఫిక్, సీఐ నర్సింహారావు వివరాలు సేకరించారు. పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి మేసురాణి ఆడుకున్న సమీప ప్రదేశాల్లో తచ్చాడింది. పక్కింటి బాత్రూంలో మృతదేహం.. కనకమ్మ ఇంటిపక్కనే కూలీపనులు చేసే దస్తగిరి, సంతోష దంపతులు ఉంటున్నారు. సోమవారం రాత్రి యేసురాణి కనిపించకపోవడంతో వారు కూడా కనకమ్మతో కలిసి బాలిక కోసం గాలించారు. ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున సంతోష నిద్రలేచి ఆరుబయట ఉన్న బాత్రూంకు వెళ్లింది. బాత్రూంలో యేసురాణి మృతదేహం చూసి భర్త దస్తగిరికి విషయం తెలిపింది. దీంతో దస్తగిరి పాపను తామే చంపారని జనం భావిస్తారనే భయంతో వెంటనే మృతదేహాన్ని ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. అనంతరం పొదల్లోంచి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. అప్పటికే చిన్నారి ముఖం, కళ్లను చీమలు కొరుక్కుతినడంతో గుర్తుపట్టరాకుండా తయారైంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ రప్పించిన క్రమంలో దస్తగిరి, సంతోషలు ఏసీపీ రఫిక్ ఎదుట జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పాపను వాళ్లే చంపారు.. ఇంట్లో ఆడుకుంటున్న పాపను దస్తగిరి,సంతోషలే చంపి చెట్లపొదల్లోకి పడేశారని యేసురాణి తాత మల్లాకి, కుటుంబీకులు ఆరోపించారు. సాయంత్రం నుండి తమతోనే ఉండి అందరిని నమ్మించేందుకు యత్నించారన్నారు. తెల్లవారుజామున పాప మృతదేహన్ని బయటకి తీసుకువచ్చి నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. తమ్ముడు, చెల్లిని తల్లి లాగా చూసుకున్నావ్ బిడ్డా.. కనిపించకుండా పోయిన బాలిక మృతదేహంగా తేలడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నిత్యం నేను కూలీపనికి పోతే నువ్వు చెల్లెకు, తమ్మునికి గోరుముద్దలు తినిపిస్తూ తల్లిలాగ చూసుకునే దానివి బిడ్డా.. అంతలోనే నీకు నూరేళ్లు నిండాయని మృతురాలి తల్లి కనకమ్మ రోదించిన తీరు హృదయ విదారకం. ఆమె రోదనలకు స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక తర్వాత వివరాలు తెలుస్తాయని ఏసీపీ రఫీక్ తెలిపారు. అయితే, అసలు బాత్రూంలోకి చిన్నారి శవం ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాబు బాత్ రూంలో జారిపడినా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేతకాక ప్రతీదీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. చివరికి చంద్రబాబు బాత్ రూంలో జారిపడినా దానికి కారణం వైఎస్ జగనే అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేక ప్రజా ఉద్యమాలకు కారణమవుతున్నారని చెవిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి తన తీరు మార్చుకుంటే మంచిదని చెవిరెడ్డి హితవు పలికారు. -
మనసెలా వచ్చిందమ్మా..!
వెల్గటూరు: కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని సరస్వతీమాత ఆలయంలోని బాత్రూంలో గురువారం మూడురోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. బాత్రూంలో నుంచి శిశువు అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వెళ్లి చూడగా శిశువు కనిపిం చింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సంతోష్ సంఘటనాస్థలానికి వచ్చి శిశువును పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, వారు శిశుగృహకు తరలించారు. చూడగానే ముద్దొస్తున్న శిశువును వదిలించుకోవడానికి ఆ తల్లికి మనసెలా వచ్చిందోనని స్థానికులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడశిశువు కావడంతోనే వదిలేశారా.. లేక మరేవైనా కారణాలున్నాయూ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య
-
బాత్రూంలో జారిపడి ఫార్మసీ విద్యార్థి మృతి
చిన్నకోడూరు (మెదక్) : మరుగుదొడ్డిలో కాలు జారి పడి ఎం.ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొందిలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు ... గ్రామానికి చెందిన కొడిసెల్ల యాదగిరి, నర్సవ్వ దంపతుల కుమారుడు సతీష్(23) ఎం.ఫార్మసీ సెకండియర్ చదువుతున్నాడు. కాగా సతీష్కు ఆదివారం గుండె నొప్పి రావడంతో సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య లేదని చెప్పారు. సోమవారం ఉదయం సతీష్ ఇంట్లో మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లోపల సతీష్ కిందపడిపోయి ఉన్నాడు. అప్పటికే అతడు మృతిచెందాడు. మరుగు దొడ్డిలో పడిపోవటంతో సతీష్ తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే, మరుగు దొడ్డిలో పడి బలమైన గాయాలతో సతీష్ చనిపోయాడా? లేక గుండెపోటుతో మృతి చెందాడా? అనేది తేలాల్సి ఉంది. -
ఇంటిప్స్
కిచెన్, బాత్రూమ్ ట్యాప్స్పైన గారలా ఏర్పడుతుంటుంది. మురికిగా కనపడతాయి. నిమ్మకాయను సగానికి కోసి, అర ముక్కకు తగినంత ఉప్పు అద్ది, దాంతో ట్యాప్స్ని రుద్దాలి. తర్వాత కాటన్ క్లాత్తో తుడవాలి. మురికంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. ఉతికేటప్పుడు దుస్తుల రంగు పోకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు, వెనిగర్ కలిపి వాటిని నానబెట్టి, తర్వాత ఉతకాలి. -
బాత్రూమ్లో ఆస్కార్... ఇదేం ఆనందం!
ఆ రోజు కేట్ విన్స్లెట్కి నిద్రపట్టలేదు. ఎందుకంటే, ఆ మర్నాడు ఆస్కార్ అవార్డ్ విజేతల ప్రకటన జరుగుతుంది. బంగారు బొమ్మ దక్కుతుందా? పదే పదే ప్రశ్నించుకున్నారు. రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. మర్నాడు ఎన్నో ఆశలతో అవార్డ్ ఫంక్షన్కు వెళ్లారు. బంగారు బొమ్మను దక్కించుకున్నారు. తెగ ఆనందపడ్డారు. అంతలోనే డీలా పడ్డారు. ఇంట్లో ఆస్కార్ ఎక్కడ పెట్టాలి? అని డైలమాలో పడ్డారు. హాలులోని షోకేస్లో పెడితే, వచ్చినవాళ్లంతా అవార్డును తాకుతారు. దొంగిలించే ఆస్కారం కూడా లేకపోలేదు. కష్టపడి తెచ్చుకున్న అవార్డును దొంగలపాలు చేయడమా? ఊహూ.. అయితే ఆస్కార్ అవార్డ్ పదిలంగా ఉండే చోటు ఏది? అని తీవ్రంగా ఆలోచించారు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అవార్డుని తీసుకెళ్లి బాత్రూమ్లో పెట్టేశారు. ఇదేం ఆనందం అనుకుంటున్నారా? బాత్రూమ్కు వెళ్లినవాళ్లు ముందు పని కానిస్తారు. ఏ పని చేసినా చేతులు తడి కావడం ఖాయం. ఆ తడి చేతులతో ఆస్కార్ని ముట్టుకోరు కదా. ఆ విధంగా ఇంట్లోవాళ్ల బారి నుంచి, ఇంటికొచ్చే అతిథుల బారి నుంచి కూడా ఆస్కార్ను కాపాడుకోవచ్చన్నది కేట్ విన్స్లెట్ ఆలోచన. ఇక, దొంగలొచ్చారనుకోండి.. బాత్రూమ్లో విలువైన వస్తువులు ఉంటాయనుకోరుగా.. సో.. ఆస్కార్ సేఫ్గా ఉంటుందనుకుని కేట్ మురిసిపోయారు. 2009లో ‘ది రీడర్’ చిత్రానికిగాను ఆస్కార్ గెల్చుకున్నప్పుడు తాను చేసిన ఈ తతంగాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేట్ విన్స్లెట్ గుర్తు చేసుకున్నారు. -
విమానాశ్రయం బాత్రూమ్లో 4.5 కిలోల బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో నాలుగున్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు చేపడుతున్న తనిఖీలకు బయపడి విమానాశ్రయంలోని బాత్రూంలో లగేజీతో సహా బంగారాన్ని విడిచి వెళ్లిపోయారు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగు నీడలు
VIP రిపోర్టర్ గుండె జబ్బులోళ్లను బాగా సూత్తన్నారు {పసూతి వార్డులో బెడ్స్ సరిపోడం లేదు బాత్రూమ్లు శుభ్రంగా ఉండాలి పెద్దాస్పత్రి.. 1823లో చిన్న ఆస్పత్రిగా ప్రారంభమై 1923లో కింగ్ జార్జ్ హాస్పటల్గా అవతరించింది. 25 విభాగాల్లో వందలాది మంది వైద్య సిబ్బందితో ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి రోజు సగటున రెండు వేలమంది చికిత్స పొందే ఈ వైద్యాలయంలో అనేక సదుపాయాలున్నాయి. రోగులకు సాంత్వన అందించాలన్న సేవాభావముంది. వీటితోపాటు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే కింగ్జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదనబాబు ‘సాక్షి’ తరపున ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో కలియతిరుగుతూ రోగులు, వైద్యులు, సిబ్బందిని పలకరించారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన వైద్య సేవలు కల్పిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు. కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందించడంతోపాటు వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది. మొత్తానికి 1100 మంది నర్సులు అవసరం కాగా కేవలం 204మందే ఉన్నారు. ప్రసూతి వార్డుల్లో సరిపడా పడకలు లేవు. దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం. మిగతా వార్డుల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే మరిన్ని సదుపాయాలు కల్పించడానికి, కొత్త భవనాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్ ఎం.మధుసూదనబాబు, సూపరింటెండెంట్, కింగ్జార్జ్ హాస్పటల్ -
వృద్ధాప్యంలో కీలక సమస్య ‘ఫాల్’
డాక్టర్ సలహా ఇటీవల పెద్దవయసు వారు బాత్రూమ్ల్లోనూ, మెట్ల దగ్గర పడిపోతున్న ఉదంతాలను ఎక్కువగా చదువుతున్నాం. ఇలా పడిపోయే అవకాశాలను ముందుగా తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? - సీహెచ్. సుదర్శన్రావు, మహబూబ్నగర్ ఫాల్ అంటే పడిపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చిన్నవయసు వారు పడిపోయి, ఫ్రాక్చర్ అయినా వారు కోలుకునే వ్యవధి తక్కువ. ఎముక అతుక్కునే తీరు కూడా వేగంగా జరుగుతుంది. కానీ పెద్దవారు పడిపోయి, ఎముక ఫ్రాక్చర్ అయితే అది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తాము పడిపోయే అవకాశాన్ని వృద్ధులు తమకు తామే పరీక్షించుకోవచ్చు. ముందుగా మీ కుడి చేతిని గోడకు ఆనించి నిలబడండి. దాన్ని గోడకు ఆనించి ఉంచే పిడికిలి బిగించి నేరుగా ముందుకు చాపండి. ఇలా కుడి చేతిని నిటారుగా ఉంచి ముందుకు కొద్దికొద్దిగా ఒంగుతూ... పడిపోకుండా గరిష్టంగా ఎంతమేరకు ఒంగగలరో చూడండి. ముందుకు ఒంగకుండా కేవలం కుడి చేయి చాచి ఉన్నప్పుడూ.... పడిపోకుండా ముందుకు ఒంగుతూ చాచిన చేతిని పొడిగించినప్పుడూ ఉన్న తేడా ఒక అడుగు (30 సెం.మీ.) ఉంటే అలాంటి వృద్ధుల్లో ‘ఫాల్’కు (పడిపోవడానికి) అవకాశం చాలా తక్కువ. అయితే ఒకవేళ ఇలా ఒంగుతూ చేతిని సాచినప్పుడు మీరు మీ చేతిని కేవలం 30 సెం.మీ లోపే సాచగలుగుతుంటే మాత్రం బాత్రూమ్లోనో లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడో లేదా ఇతరత్రా కార్యకలాపాల్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ అని గుర్తించండి. ఇలాంటి వాళ్లు నడిచేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి. - డాక్టర్ బి. విజయకుమార్, సీనియర్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ -
చిత్తూరులో ఎస్కార్ట్కు మస్కా
* ఆరుగురు సిబ్బంది కళ్లుగప్పి ఖైదీ పరార్ * ఆస్పత్రి కిటికీలోంచి పారిపోయిన వైనం * ఎస్కార్ట్ సిబ్బందిపై ఎస్పీ వేటు..? చిత్తూరు (అర్బన్) : ఓ ఖైదీని పోలీసులు ఆరోగ్యం బాగాలేందంటే ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించిన తరువాత అతడు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్లాలని చెప్పడంతో చేతికున్న బేడీలను పోలీసులు తొలగించారు. రేయ్.. ఎలాంటి మోసం చెయ్యొద్దురా..! బాత్రూమ్కు వెళ్లిందే వచ్చేయ్. అని చెప్పి పంపించారు. 5 నిముషాలయింది. ఖైదీ రాలేదు. 10.., 15.., 20 నిముషాలయింది. అయినా రాలేదు. తీరా విషయం ఏంటని చూస్తే బాత్రూమ్లో ఉన్న కిటీకి సందులోంచి అతడు పరారయ్యాడు. ఈ సంఘటన శనివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్కు చెందిన సెల్వం అనే అన్భు (45) ఈ ఏడాది జూన్ 12న తిరుపతికి గంజారుు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానిక చంద్రగిరి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా సెల్వం దాదాపు 150 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం రిమాండు విధించగా, అతడు అప్పటి నుంచి చిత్తూరు జిల్లా కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సెల్వంతోపాటు మరో ఖైదీ చిన్నదొరైకు జ్వరం రావడంతో శనివా రం చిత్తూరు జిల్లా జైలులో ఎస్కార్ట్గా ఉన్న ఓ ఏఎస్ఐ, ఐదుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స అనంతరం ఖైదీలను వ్యానులోకి ఎక్కించడానికి ముందు అర్జెంటుగా బాత్రూమ్కు వెళ్లాలని సెల్వం ఎస్కార్ట్గా ఉన్న పోలీసులకు చెప్పాడు. దీంతో చేతికున్న సంకెళ్లను తీసిన పోలీసులు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి వచ్చేయాలని చెప్పి మరీ పంపించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఉన్న మరుగుదొడ్డి లోపలికి వెళ్లి అతడు గడియ పెట్టుకున్నాడు. దాదాపు 20 నిముషాలైనా బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు తలుపులు తట్టినా బయటకు రాలేదు. తలుపులు పగులగొట్టి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుగుదొడ్డిలోని కిటీకీ సందులోంచి సెల్వం పారిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎస్కార్ట్గా వచ్చిన చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఖైదీ పారిపోయినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఓ ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్, నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు నివేదిక ఇచ్చిన వెంటనే వారిని ఎస్పీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పారిపోయిన ఖైదీపై నేరం రుజువైతే దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో ఈ ఘటనపై ఎస్పీ కూడా సీరియస్గా ఉన్నారు. ఎస్కార్టు వెళ్లిన పోలీసులు వీరే రిమాండు ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్లిన వారిలో చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్) ఏఎస్ఐ పెరుమాళ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దాసు, ఏఆర్ కానిస్టేబుళ్లు వెంకటేష్, అయ్యప్ప, వాసు, రామాంజనేయులు ఉన్నారు. -
స్నానం చేస్తుండగా వీడియో తీసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
* సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘనకార్యం * నిందితుడి అరెస్టు సాక్షి,హైదరాబాద్: బాత్రూంలో యువ తి స్నానం చేస్తుండగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొంగచాటుగా తన సెల్ఫోన్తో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆనంద్ కథనం ప్రకారం... గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం హుమాయూన్నగర్లో తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం అతను తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా.. ఎదురింట్లోని బాత్రూమ్లో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అతను బాత్రూమ్ వెంటిలేటర్లోంచి చూడగా యువతి స్నానం చేస్తూ కనిపించింది. అతను తన సెల్ఫోన్ ద్వారా ఆ దృశ్యాలు చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అలికిడి రావడంతో ఉలిక్కిపడ్డ యువతి వెంటిలేటర్ వైపు చూడగా.. సెల్ఫోన్తో ఎవరో చిత్రీకరిస్తున్నట్టు కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి దినేష్ను పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రితో దారుణం!
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం జరిగిపోయింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును బాత్ రూమ్లో వదిలేశారు. స్థానికులు చూసేసరికి శిశువు మరణించి వుంది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టిన శిశువు ఆడపిల్ల కావడంతో ఎవరైనా చంపేసి పడేశారా? లేక మృత శిశువును పడేశారా? అనేది తెలియడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి సంఘటన జరగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ** -
కలెక్టర్ సారు.. కరుణించరూ..
నేరుగా కలవలేక.. రాస్తున్నాం ఈ లేఖ.. * తాగేందుకు నీళ్లు లేవు.. తినేందుకు సరైన భోజనం లేదు * మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు * 30 పాఠశాలల్లో టెన్త్కు టీచర్లే కరువు * 46 ఎంఈవో పోస్టులకు గాను 42 ఖాళీ * జిల్లాలో డిప్యూటీ డీఈవోలు లేరు * సమస్యల వలయంలో సరస్వతీ నిలయాలు * జిల్లా విద్యార్థుల గోడు మాన్యశ్రీ కలెక్టర్ గారికీ... ‘మేము.. మెతుకుసీమ సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులం. చిన్న తరగతి.. పెద్ద తరగతి పిల్లలను కలుపుకుంటే మొత్తం 5.15 లక్షల మంది పిల్లలం ఉన్నాం. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 2,899 ఉండగా.. ఇందులో 1,160 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 పాఠశాలలకు అసలే ఉపాధ్యాయులు లేరు. 920 ఏకోపాధ్యాయ పాఠశాలలు కావడంతో ఏ కారణం చేతనైనా ఉపాధ్యాయుడు రాకపోతే ఆ బడికి అనధికారిక సెలవు ప్రకటించినట్లే. అదేవిధంగా జిల్లాలో 46 మండలాలకు గాను 42 మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 డిప్యూటీ డీఈవోలుకు గాను అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. వీరిని భర్తీ చేయక పోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు, పదోతరగతి సబ్జెక్టు టీచర్లు లేని ప్రాంతాలకు సర్దుబాటు చేస్తూ డిప్యుటేషన్లు వేశారు. ఇందులో పలు అక్రమాలకు తావిచ్చారని, అధికార, అండ బలం ఉన్నవారికి మంచి ప్రదేశాల్లో వేశారని, పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో జిల్లాలోని 30 పాఠశాలల్లో పదో తరగతిలో కీలక సబ్జెక్టులు బోధించే వారే కరువయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు. దీంతో సమయ పాలన విస్మరిస్తున్నారు. వందలాది పాఠశాలల్లో బస్సు వచ్చే సమయమే బడి సమయంగా మారింది. వర్షం కురిసినా సమయానికి బస్సు రాకపోయినా బడికి సెలవే. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కొల్పోయి మా తల్లిదండ్రులు అప్పులు చేసైనా ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సి వస్తుంది. పాఠశాలల్లో స్వీపర్లు లేక, ఉన్న వారికి సకాలంలో వేతనాలు అందక పోవడంతో పాఠశాలలను ఊడ్చి, నీళ్లు చల్లే పనులు మేమే చేసుకుంటున్నాం. చిట్టీ చేతులతో బడిని ఊడ్చడం, గంట కొట్టడం చేస్తున్నా మమ్ములను చూసి అయ్యో అన్నారే తప్పా. స్వీపర్లను నియమించిన వారు లేరు. జిల్లాలో 240 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు, విద్యార్థులు తాగడానికే నీరు లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్ను శుభ్రం చేసే పరిస్థితి లేక కంపు కొట్టడంతో అక్కడ మలవిసర్జన చేయలేక పోతున్నాం. ఆడ పిల్లలైతే పాఠశాలకు దూరంగా వెళ్ళి మలవిసర్జన చేయాల్సి వస్తుంది. రాజీవ్విద్యామిషన్, ఆర్ఎంఎస్ఏ తోపాటు ఇతర పాఠశాల గ్రాంట్లు 2012-13, 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉన్నత పాఠశాలలకు 562, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మరో 1200 అదనపు తరగతి గదులు కావాలని ఉన్నతాధికారులే గుర్తించారు. అయితే జిల్లా అధికారుల కోరిక మేరకు జిల్లాకు రూ. 32.84కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1058 అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు ప్రారంభించారే తప్పా. వాటిని పూర్తి చేయడంలేదు. దీంతో శిథిలావస్థకు చేరుకున్న గదులు ఎప్పుడు కూలిపోతాయో అని బిక్కు బిక్కు మంటూ ఉండాల్సి వస్తోంది. వర్షం వస్తే చెరువును తలపించే విధంగా పాఠశాలలు ఉండటంతో అష్టాచెమ్మా ఆడిన విధంగా బురుదలో వేసిన రాళ్ళపై నుండి బడిలోపలకి వెళ్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలని అధికారులు మీటింగ్లు పెట్టి చెబుతున్నారు. ఈ లెక్కన 1867 మరుగుదొడ్లు అవసరమని అధికారులు లెక్క తేల్చారు. కానీ వీటి నిర్మాణం చేపట్టలేదు. గత సంవత్సరం మంజూరైనా ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించి సుమారు 130పైగా మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచి పోయాయి. కాకి లెక్కలే మాకు పాఠాలు... మధ్యాహ్న భోజన పథకం కింద 2025 వంట గదులు కాగ 900 గదులు పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు కానీ అవి ఎక్కడ పూర్తి చేశారో అంతు చిక్కడం లేదు. ఏజెన్సీలకు మూడు నెలలుగా రూ. 3.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంకా డబ్బులు రాలేదటా!.. దీంతో అప్పు చేసి వంట చేస్తున్నామంటూ భోజనంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అధికారులేమో వంట డబ్బులు బాకీ లేమంటున్నారు. అన్నీ కకిలెక్కలే పట్టణాల్లో ఉన్న పాఠశాలలకు ఒక్కరిద్దరు ఏజెన్సీలు తీసుకొని ఎక్కడో వంట చేసి ట్రాలీ ఆటోలపై తీసుకవచ్చి పెడుతున్నారు. నాణ్యతను ప ట్టించుకున్న వారే లేరు. కంప్యూటర్ విద్యను నేర్పిస్తామని కంప్యూటర్లు పంపించారు. గతేడాది క్లాసులు చెప్పినవారు. జీతాలు ఇవ్వడంలేదని సార్లు మానేశారు. మా స్కూళ్లపై మీరు దృష్టి పెడితే తప్ప గాడిన పడే అవకాశంలేదు. మీ మీద నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాం.. ఇట్లు.. తమ విధేయులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులం -
కంచి యూనివర్సిటీ తీరిదీ!