Budget 2021
-
Vehicle scrapping policy: డొక్కు బండ్లు తుక్కుకే..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్బన ఉద్గారాల విషయంలో ‘కాలం చెల్లిన వాహనాల’ వాటా గణనీయంగానే ఉంది. దేశంలో 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నాయి. కాలుష్యానికి కారణమవుతున్న డొక్కు వాహనాలను రోడ్లపైకి అనుమతించరాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. 2021–22 బడ్జెట్లో ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా డొక్కు వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి తుక్కు(స్క్రాప్)గా మార్చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన పాత వాహనాలను, పాత అంబులెన్స్లను తుక్కుగా మార్చడానికి, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు సమకూరుస్తామని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు అందుబాటులో ఉన్న విధానం ఏమిటో తెలుసుకుందాం.. పాత వాహనాలు అంటే? ► రవాణా వాహనం(సీవీ) రిజిస్ట్రేషన్ గడువు సాధారణంగా 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో విఫలమైతే స్క్రాపింగ్ పాలసీ ప్రకారం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. అప్పుడు దాన్ని తుక్కుగా మార్చేయాల్సిందే. ► ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిజిస్ట్రేషన్ గడువు 20 ఏళ్లు. గడువు ముగిశాక వెహికల్ అన్ఫిట్ అని తేలినా లేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైనా రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. వెహికల్ను స్క్రాప్గా మార్చాలి. ► 20 ఏళ్లు దాటిన హెవీ కమర్షియల్ వాహనాలకు(హెచ్సీవీ) ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్నెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ► ఇతర కమర్షియల్ వాహనాలకు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలకు జూన్ 1 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైన వాహనాలను ఎండ్–ఆఫ్–లైఫ్ వెహికల్(ఈఎల్వీ)గా పరిగణిస్తారు. ► ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన వాహనాలపై 10 శాతం నుంచి 15 శాతం దాకా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. ► రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, మున్సిపల్ కార్పొరేషన్ల, రాష్ట్ర రవాణా సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, తుక్కుగా మార్చాలని స్క్రాపింగ్ పాలసీ నిర్దేశిస్తోంది. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.50 కోట్లకు పైగా పాత వాహనాలు రోడ్లపై తిరుగున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి వీటన్నింటినీ తుక్కుగా మార్చాలి. ► ప్రతి నగరంలో కనీసం ఒక స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనదారులకు ప్రోత్సాహకాలు ► కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చిన వాహనదారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► తొలుత ఏదైనా రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి వాహనాన్ని తరలించి, తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ► ఆ వాహనం స్క్రాప్ విలువ ఎంత అనేది స్క్రాపింగ్ కేంద్రంలో నిర్ధారిస్తారు. సాధారణంగా కొత్త వాహనం ఎక్స్–షోరూమ్ ధరలో ఇది 4–6 శాతం ఉంటుంది. ఆ విలువ చెల్లిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ► స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు కొత్త వ్యక్తిగత వాహనం కొనుగోలు చేస్తే 25 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్, వాణిజ్య వాహనం కొంటే 15 శాతం వరకూ రోడ్డు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులకు కొత్త వాహనం విలువలో 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని వాహనాల తయారీ సంస్థలను కోరింది. ► పాత వాహనాన్ని తుక్కుగా మార్చి, కొత్తది కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మినహాయింపు ఇస్తారు. స్క్రాప్ రంగంలో కొత్తగా 35,000 ఉద్యోగాలు! పాత వాహనాలను తుక్కుగా మార్చేయడం ఇప్పటికే ఒక పరిశ్రమగా మారింది. కానీ, ప్రస్తుతం అసంఘటితంగానే ఉంది. రానున్న రోజుల్లో సంఘటితంగా మారుతుందని, ఈ రంగంలో అదనంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, కొత్తగా 35,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏమిటి? పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ప్రత్యామ్నాయ వాహనాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యుత్తో నడిచే (ఎలక్ట్రిక్) వాహనాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇథనాల్, మిథనాల్, బయో–సీఎన్జీ, బయో–ఎల్ఎన్జీ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు ► కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చడం ప్రధానంగా పర్యావరణానికి మేలు చేయనుంది. కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. ఆధునిక వాహనాలతో ఉద్గారాల బెడద తక్కువే. ► పర్యావరణహిత, సురక్షితమైన, సాంకేతికంగా ఆధునిక వాహనాల వైపు వాహనదారులను నడిపించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ► పాత వాహనాల స్థానంలో కొత్తవి కొంటే వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఈ రంగంలో నూతన పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ► కొత్త వాహనాలతో యజమానులకు నిర్వహణ భారం తగ్గిపోతుంది. చమురును ఆదా చేయొచ్చు. తద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. ► స్క్రాప్ చేసిన వెహికల్స్ నుంచి ఎన్నో ముడిసరుకులు లభిస్తాయి. ► ఆటోమొబైల్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తక్కువ ధరకే ఈ ముడిసరుకులు లభ్యమవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
ద్రవ్యలోటు రూ.5.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోల్చితే పురోగతి ► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట. సెప్టెంబర్లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం. -
ఏడు మెగా టెక్స్టైల్ పార్క్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్టైల్ పార్క్ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్టైల్స్కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
Ap Budget 2021: సర్వ హితం
సాక్షి, అమరావతి: సర్వ జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్లో అగ్రతాంబూలం దక్కింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణులు, మైనార్టీలు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది కంటే అన్ని వర్గాలకు నిధుల కేటాయింపు పెరగడం విశేషం. పేద, వెనుకబడిన, బలహీనవర్గాల అవసరాలను, ప్రాధాన్యతలను నెరవేర్చేలా కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతంపైగా నెరవేర్చిన ఘనతను దక్కించుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతోపాటు వివిధ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి.. భారీగా నిధులు బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాలు, గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ సబ్ప్లాన్కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,218.76 కోట్లు కేటాయించగా.. ఈసారి 17,403.14 కోట్లకు పెంచింది. తద్వారా గతేడాది కంటే రూ.3,184.38 కోట్లను ఎస్సీల కోసం అదనంగా కేటాయించింది. ఎస్టీ సబ్ప్లాన్కు 2020–21లో రూ.4,814.50 కోట్లు కేటాయించగా ఈసారి 27 శాతం(రూ.1,316.74 కోట్లు) అదనంగా పెంచుతూ రూ.6,131.24 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఎస్సీ సబ్ప్లాన్కు 17,403.14కోట్లు ఎస్టీ సబ్ప్లాన్కు 6,131.24కోట్లు గతేడాది కంటే 3,184.38కోట్లు అదనం గతేడాది కన్నా 27 శాతం అదనపు నిధులు -
AP Budget 2021: మహిళలే మహరాణులు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యయానికి నాంది పలికారు. బడ్జెట్లో సింహభాగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం కేటాయించింది. మహిళల అభ్యుదయానికి వివిధ పథకాల ద్వారా కేటాయిస్తున్న నిధుల వివరాలతో ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. 2021–22 బడ్జెట్లో మహిళలకు రూ. 47,283.21కోట్లు కేటాయించింది. శాఖల వారీగా కేటాయింపులను ఆ నివేదికలో పొందుపరిచింది. రెండు విభాగాలు.. 53 పథకాలు మొత్తం 53 పథకాల కింద బాలికలు, మహిళలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వాటిని రెండు విభాగాలుగా నివేదిక రూపంలో వెలువరించారు. 100 శాతం నిధులను బాలికలు, మహిళలకు కేటాయించే పథకాల వివరాలను మొదటి విభాగంలో పొందుపరిచారు. అందులో 24 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,463.10 కోట్లు కేటాయించారు. బాలికలు, మహిళలకు 30 శాతం నుంచి 99 శాతం వరకు నిధుల కేటాయించిన పథకాలను రెండో విభాగంలో పొందుపరిచారు. అందులో 29 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,820.11 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖదే అగ్రస్థానం బాలికలు, మహిళలకు నిధుల కేటాయింపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానం సాధించింది. ఆ శాఖ రూ.13,072.27 కోట్లు కేటాయించడం విశేషం. రూ.6,337.44 కోట్ల కేటాయింపులతో వైఎస్సార్ ఆసరా రెండో స్థానంలో నిలిచింది. జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,107.36 కోట్ల కేటాయింపులతో మూడో స్థానంలో ఉంది. -
22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 22న సోమవారం శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ 2021–22పై శని, సోమవారాల్లో అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. తర్వాత సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్టెట్పై ప్రసంగిస్తారు. ప్రతిపాదనలకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇదే సమయంలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)కు సంబంధించిన ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29 శాతం నుంచి 31 శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటించే విషయమై పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. దీనికితోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పలు ముందుజాగ్రత్త చర్యలపైనా సీఎం కీలక నిర్ణయాలు వెలువరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ తరగతి వరకు తరగతి గది బోధనను నిలిపివేసే అంశంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని సమాచారం. ఈ విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరంలో ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పీఆర్సీకు ‘సాగర్’కోడ్ అడ్డంకి కాదు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ అడ్డంకిగా మారదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సాగర్ ఉప ఎన్నిక కోడ్ నల్లగొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని, మొత్తం రాష్ట్రానికి వర్తించదని చెబుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిందని, పీఆర్సీ ప్రకటిస్తే ఓటర్లు ప్రభావితం కావడానికి అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సడలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే.. ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు శనివారం, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు ఆదివారం నాటికి వెల్లడికానున్నాయి. -
తెలంగాణ బడ్జెట్కు వేళాయే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఆ మరునాడే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. తొలిరోజున గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా వేస్తారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించి.. ఎప్పటివరకు సమావేశాలు జరపాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 16న సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడనుంది. 17న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ, సమాధానం ఒకేరోజు పూర్తి చేసి.. 18న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో బడ్జెట్పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలోనే సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తేదీలపై అధికారంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మార్చి మధ్యలో నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ లెక్కన ఈ నెల 14 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీగా ఉంటున్నందున ఆ తర్వాతే సమావేశాలు మొదలవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని పద్దులపై సుదీర్ఘంగా చర్చలు కాకుండా స్వల్ప వ్యవధిలోనే ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. సమావేశాల్లోనూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. -
వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడాలంటే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు ఏమాత్రం పెంచలేదు. పైపెచ్చు ప్రధానమంత్రి కిసాన్ యోజనకు గతంలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.65 వేల కోట్లు కేటాయించారు. రైతు వ్యవసాయ సంక్షేమంలోనూ నిధులు తగ్గించారు. అనేక పబ్లిక్ రంగ పరిశ్రమల నుండి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపె నీలకు అవకాశం కల్పించారు. కరోనా సమయంలోనే 100 కార్పొరేట్ కంపెనీల ఆదాయం రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాస్తవంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధాన సమస్యలను అసలు పట్టించుకుం టున్నారా? ఈ రోజు ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నది. దీనివల్ల అనేక శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల అనేక పక్షులు, జంతువులు మనలేకపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోయాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాలంటే మొదట చేయాల్సింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. చట్టాలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కానీ ప్రభు త్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఎవరూ ఏమి చేయలేరు. కాలుష్య నివారణ చట్టాలను గట్టిగా అమలు చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇబ్బంది కలుగుతుంది. కొంత ఆర్థికభారం వారిపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్ నుండి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎక్కువశాతం ఉపయోగించాలి. కార్పొరేట్ కంపెనీల కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఎవరి ప్రయోజనాల కోసం? నేడు హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి ఆహారధాన్యాలు విషతుల్యం అవుతు న్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను, కూరగాయలను, పండ్లను అందించాలంటే ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. పశువులకు అధిక పాల కొరకు ఇచ్చే ఇంజెక్షన్లను రద్దు చేయాలి. ఆహారధాన్యాలను, కూరగాయలను, పండ్లను, కొబ్బరి నీళ్లను విషతుల్యం చేసే అన్ని రకాల మందులను, ఇంజెక్షన్లను నిషే ధించాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను ప్రోత్స హించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే వారు ప్రజల ఆరోగ్యం కోసం పంటలు ఉత్పత్తి చేయరు. లాభాల దిశగా వ్యవసాయ రంగాన్ని మరల్చుతారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కనీస మద్దతు ధర ఉండే పరిస్థితి పోతుంది. కొంతకాలానికి అధిక లాభాల కోసం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి మరోవైపు పంటల ధరలను తగ్గిస్తారు. క్రమంగా రైతు అప్పుల్లో మునిగిపోతాడు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రైతుకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. చివరకు రైతు భూముల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కంపెనీలు రైతుల భూముల్ని కొని పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా చేస్తారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారుతారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల గురించి గానీ, కల్తీలేని పాల గురించి గానీ ఎవరూ ఆలోచించరు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా మొదట జరిగేది కార్మికుల తొలగింపు. నిర్వహణ ఖర్చుల తగ్గింపు పేరుతో నలుగురు పనిచేస్తున్న చోట ఇద్దరితోనే సరిపోతుందనే నెపంతో అనేక మంది ఉద్యోగం కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. నిరుద్యోగులు పెరిగితే, రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం మార్కెట్ మీద పడి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు వేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆశిద్దాం. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తీయడం వల్ల క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్తే వారి రాజకీయ జోక్యం పెరుగుతుంది. చివరకు మనం స్వతంత్రం కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 94940 12734 -
బడ్జెట్పై కాంగ్రెస్ పెడార్థాలు తీస్తోంది
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు బడ్జెట్ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు. -
సెన్సెక్స్–నిఫ్టీ.. రేసు గుర్రాలు
ముంబై: కోవిడ్–19 నేపథ్యంలోనూ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటం, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రకటించడం వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. వీటికి జతగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు జంప్చేసి 51,349 వద్ద ముగిసింది. నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 15,116 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 51,523 వద్ద, నిఫ్టీ 15,160 వద్ద సరికొత్త రికార్డులను అందుకున్నాయి. విదేశీ మార్కెట్లలోనూ బుల్లిష్ ట్రెండ్ నెలకొనడంతో దేశీయంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ, రియల్టీ 3.2–2 శాతం మధ్య ఎగశాయి. పీఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 1–0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, గెయిల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ 7.4–2.5 శాతం మధ్య జంప్చేశాయి. అయితే బ్రిటానియా, హెచ్యూఎల్, కొటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ 2–0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో కంకార్, రామ్కో సిమెంట్, ఎక్సైడ్, అదానీ ఎంటర్, నౌకరీ, సెయిల్, కోఫోర్జ్, మదర్సన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, అమరరాజా 7–5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోపక్క భెల్, పీఎన్బీ, మణప్పురం, ఐడియా, గోద్రెజ్ సీపీ, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బీవోబీ 3.7–1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేటి ట్రేడింగ్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో దాదాపు రూ. 1,877 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 505 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. 2.5 లక్షల కోట్లు ప్లస్ మార్కెట్ల తాజా ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. 2.5 లక్షల కోట్లు జమయ్యింది. గత 6 రోజుల్లో రూ. 16.7 లక్షల కోట్లు బలపడింది. దీంతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 202.82 లక్షల కోట్లకు చేరింది. ఇది కూడా రికార్డు కావడం విశేషం! స్టాక్స్ విశేషాలివీ n బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడంతో బజాజ్ ఫిన్సర్వ్ వరుసగా ఆరో రోజు ర్యాలీతో 52 వారాల గరిష్టానికి చేరింది. n క్యూ3లో నిర్వహణ లాభం 28% పెరగడంతో శ్రీ సిమెంట్ షేరు కొత్త గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. 6 రోజుల్లో ఈ షేరు 23% ర్యాలీ చేసింది. n క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఎంఅండ్ఎం, బజాజ్ ఎలక్ట్రికల్స్, గుజరాత్ గ్యాస్, అఫ్లే ఇండియా కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. n ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 23.5% వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ 52 వారాల గరిష్టానికి చేరింది. -
ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు. రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారంతా ఆందోళన్ జీవులు ‘‘దేశంలో ఆందోళన్ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు. సంస్కరణలతో తోడ్పాటు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి. కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు. పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారు. రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం. చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి. రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్ మోర్చా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ్కుమార్ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ విమర్శించారు. ఆకలితో వ్యాపారమా? దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్ తికాయత్ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు. ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న మోదీ వ్యాఖ్యలను తికాయత్ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సింఘు వద్ద తాత్కాలిక స్కూల్ ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్లోని ఆనంద్ సాహిబ్కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్ను ఒక టెంట్లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నారు. -
పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.16వేల కోట్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది. పిఎంఎఫ్బివై ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్) కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
ఆర్టీసీకి కోవిడ్ సాయం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నష్టాలకు కేంద్రం నుంచి ఆర్థిక చేయూత ఉంటుందని ఆశించిన ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. తాజా బడ్జెట్లో ఆర్టీసీలకు కోవిడ్ నష్టాలకు సాయం చేసే అంశాన్ని పొందుపరచలేదు. రోడ్డు రవాణా సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉన్న నేపథ్యంలో.. కోవిడ్ నష్టాలకు ఎంతోకొంత సాయం అందుతుందన్న ఆర్టీసీ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కోవిడ్ వల్ల ఆర్టీసీ దాదాపు రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయిందని ఇటీవల సంస్థ తేల్చింది. అందులో కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుందని ఆశించింది. ఆ మేరకు బడ్జెట్లో ప్రకటన ఉంటుందని ఎదురుచూసింది. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తర్వాత బడ్జె ట్ పుస్తకంలో అది కనిపించకపోవటంతో ఇక సాయం అందదన్న నిర్ణయానికి వచ్చింది. 2019లో సమ్మె జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయం అంశం పలుమార్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయంపై ప్రశ్నించారు కూడా. కోవిడ్ మహమ్మారి రూపంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు నష్టం వాటిల్లిన నేపథ్యం లో.. మళ్లీ కేంద్రం వాటా, సాయం అంశం చర్చకు వచ్చింది. సాయం లేకపోగా నష్టం చేసే చర్యలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో నగరాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేసే పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంశాన్ని పొందుపరిచిన విషయం తెలిసిందే. ప్రైవేటు సంస్థలు బస్సులను నిర్వహించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా దీనిపై కార్మిక సంఘాల వైపు నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా నగరాల్లో ప్రజా రవాణా బలోపేతం పేరుతో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తే అది తుదకు ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్టే అవుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ సభ్యుడు, సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్టీసీలో వాటా ఉన్నందున కేంద్రం ఆర్థిక రూపంలో సాయం చేయాలని, కానీ ఇలా ఆర్టీసీలను నష్టపరిచే నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. -
పల్లెకూ ఉంది ఓ బడ్జెట్
సత్తెనపల్లి: బడ్జెట్ అంటే బోలెడు లెక్కలు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అవసరాలకు తగిన నిధులు కేటాయించాలి. రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాలి. అది కేంద్ర బడ్జెట్ అయినా.. పల్లె పద్దు అయినా లెక్క పక్కాగా ఉండాల్సిందే. పంచాయతీల ఆదాయ మార్గాలు, పల్లెల ప్రగతికి ఉపకరించే నిధులు, వాటి పద్దుల బడ్జెట్ ఎలా ఉంటుందంటే.. కేంద్ర సహకారమే కీలకం పల్లెలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులే కీలకంగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలయ్యాయి. ఒక్కో వ్యక్తికి సగటున రూ.550 నుంచి రూ.600 వరకు వస్తోంది. ప్రస్తుతం ఈ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం, మండలాలకు 20 శాతం, జెడ్పీకీ 10 శాతం వంతున కేటాయిస్తారు. ఈ నిధుల్లో 50 శాతం టైడ్ ఫండ్స్ రూపంలో పంచాయతీలు కేంద్ర నిబంధనల ప్రకారం వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం అన్టైడ్ ఫండ్స్ను ఒక్క జీతభత్యాలకు కాకుండా ఏ ఇతర పనికైనా వెచ్చించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిధులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయ భవనాలు, రహదారులు, ఇతర నిర్మాణాలు, భూగర్భ జల వనరుల పెంపు తదితరాలను ఈ పథకం కిందే అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పంచాయతీలకు సమానంగా డబ్బులు ఇస్తారు. సాధారణ నిధుల వినియోగం ఇలా.. మొత్తం 47 రకాల పన్నులు విధించడానికి పంచాయతీ పాలకవర్గాలకు అధికారం ఉంది. పన్ను విధింపు, అమలుకు గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి పన్ను, వృత్తి, వినోదం, భూమి రిజిస్ట్రేషన్, వేలం, కాటా రుసుము తదితరాలు ఉన్నాయి. పన్నేతర ఆదాయం కింద చెరువుల వేలం, పరిశ్రమలు, మార్కెట్ యార్డు ప్రకటనలు, సెల్ఫోన్ టవర్లు తదితరాల నుంచి ఆదాయం లభిస్తుంది. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర పన్నుల శాఖ వసూలు చేసిన మొత్తంలో 95 శాతం తిరిగి పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. పంచాయతీలో తలసరి రూ.4 అందిస్తుంది. వినోదపు పన్నును 60:40 నిష్పత్తిలో ఇస్తారు. గనుల తవ్వకానికి సంబంధించి వసూలయ్యే సీనరేజిలో 25 శాతం చెల్లిస్తుంది. ఖర్చులకు ఉందో ఆడిట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఆడిట్ రూపంలో లెక్క సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ లెక్క మాత్రం తప్పకూడదు. వ్యయ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర, పంచాయతీరాజ్ నిబంధనలు పాటించి తీరాలి. -
నీతి ఆయోగ్ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎవరికీ నష్టం జరగదని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశానికి, ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాన్నిబట్టి అన్ని కంపెనీలను కేంద్రం అమ్మేస్తోందనే భావన, ప్రచారం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించేందుకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, డి.ప్రదీప్ కుమార్, జంగారెడ్డి, కృష్ణ సాగర్రావు, డా. ప్రకాశ్రెడ్డిలతో కలసి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కంపెనీల పనితీరు ప్రాతిపదికనే... ప్రభుత్వరంగ కంపెనీల పనితీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాధాన్యత–ప్రాధాన్యేతర, వ్యూహాత్మక–వ్యూహాత్మకేతర అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి నష్టం జరగలేదని, తాము సహకార సమాఖ్య విధానాన్ని నమ్ముతామన్నారు. తెలంగాణ, ఏపీకి అనేక ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్లో తెలంగాణలోని రైల్వే లైన్లకు కేటాయింపులున్నాయని, ప్రస్తుతం రూ. 29 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2,111 కి.మీ. నిడివిగల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 13 ,990 కోట్లు వచ్చాయని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 9,172 కోట్లు వస్తాయని, ఆత్మనిర్భర భారత్ కింద తెలంగాణకు రూ. 400 కోట్లు ఏటా వస్తాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పోలవరానికి నిధుల కేటాయింపులు... కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరానికి ఒప్పందం మేరకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. స్టార్టప్లు, ఇతరత్రా రూపాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా తెలంగాణ, ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నుల కన్నా రాష్ట్ర పన్నులే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్ విలువను బట్టి మారుతూ ఉంటుందన్నారు. పన్నులు పెంచని బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: పేదలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించామని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోవిడ్తో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో శనివారం బడ్జెట్–2021పై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్సింగ్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొ న్నారు. ఠాకూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా ఉందని, నెలకు సగటున రూ.లక్ష కోట్లు జీఎస్టీ వసూలు అవుతోందన్నారు. గతేడాది కంటే ఈసారి 34 శాతం అధికంగా మూలధన వ్యయం పెంచామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు సమం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో అతిత్వరలో 3 ఆటోమొబైల్ తయారీ కేంద్రాలు రాబోతున్నాయని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీతో మరింత మైలేజీ గల వాహనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు లాభం చేకూరుస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఇన్నేళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాదిరిగా ఖర్చు చేయలేదని వివరించారు. బడ్జెట్ పట్ల సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర బడ్జెట్తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిలేదు. సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు. వాళ్లు బడ్జెట్పై ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు కదా. బడ్జెట్ బాగోలేదంటూ సీఎం మీకు ఫోన్చేసి చెప్పలేదు కదా’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం సందర్భంగా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ను ప్రశ్నించినప్పుడు సంజయ్ ఈవిధంగా స్పందించారు. -
రాయని డైరీ.. నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
‘‘ఊరెళ్లాలి మేడమ్ సెలవు కావాలి’’ అన్నాడు అనురాగ్ ఠాకూర్ సడన్గా వచ్చి! ‘‘ఏమైంది అనురాగ్?!’’ అన్నాను. ‘‘ఏం కాలేదు మేడమ్’’ అన్నాడు. ‘‘ఏం కానప్పుడు నువ్వు ఫిబ్రవరి 15 తర్వాత గానీ, మార్చి 8 లోపు గానీ, ఏప్రిల్ 8 తర్వాత గానీ ఊరెళ్లొచ్చు కదా అనురాగ్’’ అన్నాను. అవి సెషన్స్ ఉండని రోజులు. అయినా ఊరెళ్లడానికి సెలవు తీసుకునే వయసు కాదు అనురాగ్ది. నాకన్నా పదిహేనేళ్లు చిన్నవాడు కదా అని మాత్రమే అతడికి ఇస్తే సెలవు ఇవ్వాలి. ‘‘నువ్వేమీ బడి పిల్లాడివి కాదు అనురాగ్. బడ్జెట్ను సమర్పించిన ఆర్థికమంత్రికి సహాయ మంత్రివి. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే సమయానికి ఊరెళతానంటే ఎలా! బడ్జెట్ సెషన్స్ కానివ్వు..’’ అన్నాను. ‘‘బడ్జెట్ సెషన్స్ బోర్ కొడుతున్నాయి మేడమ్’’ అన్నాడు!! ‘‘బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ హల్వాలా ఎలా ఉంటాయి అనురాగ్!’’ అన్నాను. ‘‘ఓ.. హల్వా! రెండు వారాలైంది కదా మేడమ్. మాలో ఎవరికైనా హల్వా చేయడం వచ్చా అని కూడా అడిగారు మీరు..’’ అన్నాడు. నిజమే! నిన్న మొన్న హల్వా చేసినట్లుంది. సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చుట్టూ చిన్న డాక్టర్లు చేరి మాస్కుల్లోంచి కళ్లు అప్పగించి చూస్తున్నట్లు నా ఫైనాన్స్ స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి హల్వా తయారవుతున్న బాణలిలోకి తొంగి చూస్తున్నారు తప్పితే చూడ్డం వచ్చని గానీ, రాదని గానీ చెప్పలేదు! నా వెనుక భుజం మీద నుంచి ఎవరో చెక్క గరిట అందించారు. హల్వాను మెల్లిగా గరిటెతో పైకీ కిందికీ తిప్పుతున్నాను. పిల్ల డాక్టర్లు హల్వా మీదకు వంగి చూస్తున్నారు. ‘హల్వాని ఎలా తిప్పుతాం అబ్బాయిలూ.. పైకీ కిందికా, పక్కలకా..’ అని మా హల్వా డాక్టర్లని అడిగితే, ‘అసలు తిప్పుతామా మేడమ్’ అని తిరిగి నన్నే అడిగాడు ఒక డాక్టర్. ఆ అడిగిన డాక్టర్ ఎవరా అని తలతిప్పి చూశాను. అనురాగ్ ఠాకూరే! ‘కొంచెం చూస్తుంటావా అనురాగ్, బ్రేక్ తీసుకుంటాను..’ అన్నాను. ‘అలాగే మేడమ్’ అని కదా నా సహాయకుడిగా అతడు అనవలసింది.. ‘అందరం బ్రేక్ తీసుకుందాం మేడమ్..’ అన్నాడు! ‘అవును మేడమ్ అందరం బ్రేక్ తీసు కుందాం.. హల్వా కింద స్టౌ మంటను ఆపేసి..’ అనే మాట వినిపించింది! ఆ మాట అన్నది అనురాగ్ డాక్టర్ కాదు. ఇంకో హల్వా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్. ఫైనాన్స్ సెక్రెటరీ. ‘అరె సుబ్రహ్మణియన్.. నువ్వెప్పుడొచ్చావ్?’ అన్నాను. ‘మీ చేతికి గరిటె ఇచ్చింది నేనే మేడమ్’ అన్నాడు. ‘బ్రేకులు మనం తీసుకోవచ్చు సుబ్రహ్మణియన్. స్టౌ మీద ఉన్న హల్వాకు బ్రేక్లు ఇవ్వకూడదు’ అని చెప్పాను. ఆ రోజంతా హల్వాతోనే గడిచిపోయింది. నా టీమ్లో స్టౌ వెలిగించడం వచ్చిన వాళ్లు కూడా లేనట్లున్నారు. ‘హల్వా సూపర్గా ఉంది మేడమ్’ అనైతే అన్నారు. ‘మీరు కూడా నేర్చుకుని చేసి చూడండయ్యా.. ఇంకా సూపర్గా వస్తుంది’ అన్నాను. మోటివేట్ అయినట్లు లేదు. ఈ మగపిల్లలు మాటలు ఎన్నైనా చెబుతారు. వంట మాత్రం నేర్చుకోరు. సండే కావడంతో రిలాక్సింగ్గా ఉంది. మొన్న మాన్సూన్ సెషన్స్కైతే శని, ఆది వారాల్లో కూడా పని చేశాం. ‘‘నమస్తే ఆంటీ..’’ అంటూ వచ్చింది పక్కింట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్న అమ్మాయి. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నట్లుంది. ‘‘రామ్మా.. కూర్చో..’’ అన్నాను. ‘‘ఆంటీ, వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుంది అన్నారు కదా మీరు. అంత ఎలా పెరుగుతుంది ఆంటీ!’’ అంది. ‘‘అబ్బాయిలు వంట నేర్చుకుంటే పెరుగుతుందమ్మా..’’ అన్నాను. పెద్దగా నవ్వింది. ‘‘అవునాంటీ.. వృద్ధి రేటు పెరగడానికైనా ఈ బాయ్స్ వంట నేర్చుకోవాల్సిందే..’’ అంది. -
వారంతా బడ్జెట్పై మాట్లాడలేదు.. అంటే!..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంతి కే.చంద్రశేఖర్రావుతో సహా అగ్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాట్లాడలేదని, అంటే! బడ్జెట్పై వారు సంతోషంగా ఉన్నట్లు స్పష్టం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనురాగ్ బడ్జెట్ రూప కల్పనలో కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షాలు కావాలనే దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నాయి. సంక్షేమం పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. సంక్షేమం ముఖ్యమే కానీ, అభివృద్ధి అంతకన్నా ముఖ్యం. సంక్షేమ పథకాల నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. కరోనా విపత్తులోనూ బడ్జెట్ నిధులను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంది. బడ్జెట్ను రాజకీయ కోణంలో చూడకూడదు. మోదీ నేతృత్వంలో శక్తివంతమైన భారత్ కోసం పని చేస్తున్నాం. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తుంది’’ అని అన్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి, హైదరాబాద్ : వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ. 125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. నిజానికి గత ఏడాది నవంబర్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50గా ఉండగా చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ. 100 మేర ధర పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ. 746.50కు చేరింది. జనవరిలో ఈ ధరలు స్ధిరంగా కొనసాగినా తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ. 771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ. 520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ. 200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ. 40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. రాయితీల్లో భారీగా కోత పడటంతో సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా ఆ భారమంతా వినియోగదారులపైనే పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. పెరిగిన ధరలు, రాయితీల్లో కోతతో ఏటా రూ. వేల కోట్ల మేర సామాన్యుడిపై భారం పడుతోంది. పెట్రో ధరల దూకుడు... రాష్ట్రంలో పెట్రో ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో పెట్రోల్ ధర పది రోజుల వ్యవధిలోనే రూ. 1.27 పైసలు పెరిగింది. జనవరి 25న పెట్రోల్ ధర రూ. 89.15 ఉండగా ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రల్ ధర రూ. 90.42కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటున 13 నుంచి 15 కోట్ల లీటర్ల మేర పెట్రోల్ వినియోగం ఉంటోంది. ఈ లెక్కన పది రోజుల్లోనే వినియోగదారులపై రూ. 19 కోట్ల మేర భారం పడింది. ఇక డీజిల్ ధర సైతం పెట్రోల్తో పోటీ పడుతోంది. ఈ పది రోజల వ్యవధిలోనే దాని ధర సైతం రూ. 1.34 మేర పెరిగింది. గత నెల 25న లీటర్ ధర రూ. 82.80 ఉండగా అది ప్రస్తుతం రూ. 84.14కి చేరింది. -
విద్యకు ‘కరోనా’ కోత!
కరోనా మహమ్మారి కాటేసిన తరువాత ప్రపంచ దేశాలన్నిటా సకల రంగాలూ దెబ్బతిన్నాయి. విద్యారంగం అందులో ప్రధానమైనది. ఈ కరోనా సమయంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. కనుక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకు అత్యంత ప్రాముఖ్యత వుంటుందని అందరూ ఆశించారు. కానీ జరిగింది అందుకు విరుద్ధం. కరోనా వచ్చి విద్యారంగానికి కొత్త అడుగులు నేర్పింది. అంతక్రితం కేవలం వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారినుద్దేశించి ప్రవేశపెట్టిన దూరవిద్య లాక్డౌన్ల పుణ్యమా అని ఇప్పుడు హైస్కూల్ మొదలు పీజీ వరకూ అందరికీ తప్పనిసరి అవస రంగా మారింది. ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా నేర్చుకునే అవసరం పెరిగింది. ఉన్నత విద్య బోధించే క్యాంపస్లు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ స్థితిలో విద్యారంగానికి నిధుల అవసరం చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే కొత్త అవసరానికి తగ్గట్టు అత్యధిక విద్యాసంస్థలు ఇంకా తయారుకాలేదు. చాలా తక్కువ విద్యాసంస్థలు మాత్రమే ఆ దోవన పోతున్నాయి. ఆర్థికంగా వెనక బడిన కుటుంబాల విద్యార్థులకు సబ్సిడీతోగానీ, ఉచితంగాగానీ ల్యాప్టాప్లు అందించాలన్న డిమాండ్ కూడా వస్తోంది. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యార్థులందరికీ అవసర మైన ఉపకరణాలు అందుబాటులో లేకపోతే చదువుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ స్థితిలో విద్య కోసం కేటాయింపుల్ని భారీగా పెంచాల్సివుండగా ప్రస్తుత బడ్జెట్లో అవి గణనీయంగా తగ్గాయి. విద్యకు ఈసారి ఆరు శాతం కోతపడిందని గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు రూ. 99,311 కోట్లు కేటాయించగా, ఈసారి అది కాస్తా రూ. 93,300 కోట్లకు పడిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పరిస్థితి కూడా అంతే. నిరుడు రూ. 38,750 కోట్లు కేటాయించిన ఆ పథకానికి ఈసారి కేవలం రూ. 31,050 కోట్లతో సరిపెట్టారు. ఈ పథకంకింద రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ కొండ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ నడిచే సాధారణ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తారు. దళిత, ఆదివాసీ పిల్లల్లో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా వుంటున్నదని గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాల కల్పన కోసం చేసిన కేటాయింపులు కాస్తా తగ్గితే దాని ప్రభావం ఎలావుంటుందో చెప్పన వసరం లేదు. ఉన్నత విద్యకూ రూ. 1,000 కోట్ల మేర కోత పెట్టారు. ఉన్నత విద్యా నిధి సంస్థ (హెచ్ఈఎఫ్ఏ)కు నిరుడు రూ. 2,100 కోట్లు కేటాయించగా, అదిప్పుడు రూ. 1,000 కోట్లు మాత్రమే. మార్కెట్ రుణాలు సేకరించి, ఆ నిధులతో కేంద్రీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు పదేళ్లలో చెల్లించేవిధంగా రుణాలివ్వాలని 2016లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆనాటి బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఇప్పుడది నామమాత్ర మొత్తానికి పరిమితమైంది. అయితే మధ్యాహ్న భోజనం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వగైరాలకు నిధులు స్వల్పంగా పెరిగాయి. అలాగే కొత్తగా వంద సైనిక స్కూళ్లు నెలకొల్పబోతున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగానికే ప్రభుత్వాలు కోత పెడతాయని నిరుడు మే నెలలో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ మాట చెబుతూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాదిరి చర్యలు తీసుకోవద్దని హితవు పలికింది. కరోనా వైరస్ తీసుకొచ్చిన కొత్త ఇబ్బందుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, వారి సామాజిక సంరక్షణ వగైరాలకు అదనంగా వ్యయం చేయాల్సివుంటుంది గనుక ఇది అవసరమని తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. నూతన జాతీయ విద్యావిధానం సాంకేతిక వనరులను సమృద్ధిగా వినియోగించుకుని మన విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పింది. జాతీయ విద్యా సాంకేతిక వేదిక నెలకొల్పి దాని ఛత్రఛాయలో సాంకేతికత సాయంతో విద్యార్థులకు ప్రామాణికమైన, ప్రయోగ ఆధారిత విద్యను అలవాటు చేస్తామని వాగ్దానం చేసింది. ఆన్లైన్, ఈ–లెర్నింగ్ వేదికల్లో పాఠశాలలు మొదలు కళాశాలల వరకూ విద్యార్థులందరికీ సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోబోతున్నట్టు చెప్పింది. జాతీయ పరిశోధనా సంస్థను నెలకొల్పి ఉన్నత విద్యారంగంలో మెరుగైన పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఇన్ని చేయడానికి సిద్ధపడుతూ నిధులు గణనీయంగా తగ్గించటంలోని ఆంతర్యమేమిటో అర్థం కాదు. అంత పెద్ద పెద్ద ఆశయాల మాటెలావున్నా కరోనా అనంతర పరిస్థితుల్లో అటు ఉపాధ్యాయులకూ, ఇటు విద్యార్థులకూ అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచటం కోసం ప్రైవేటు రంగ సహాయ సహకారాలు తీసుకోవటం అవసరమవుతుంది. నిధుల కోత వల్ల అదైనా ఇప్పుడు సాధ్యమవు తుందా? అసలు కరోనా కారణంగా దీర్ఘకాలం విద్యకు దూరమైన పిల్లలను మళ్లీ బడులవైపు మళ్లించటానికి ప్రభుత్వం దగ్గరున్న కార్యక్రమాలేమిటో కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలని నిర్దేశించిన సుస్థిర లక్ష్యాల్లో విద్య కూడా వుంది. ఒకపక్క విద్యాహక్కు చట్టం రూపొందించుకున్నాం. దాన్ని సమర్థ వంతంగా అమలు చేయడానికి ఇంకేం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో నిధుల కోతతో విద్యా రంగాన్ని మరింత నీరుగార్చటం విచారకరం. సమస్యలున్న మాట వాస్తవమే అయినా వాటి ప్రభావం విద్యారంగంపై పడకుండా చూడటమే వర్తమాన అవసరం. -
ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలల రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పీఆర్సీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి 2021–22 బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 2020–21 బడ్జెట్లో అప్పులు, ఆదాయం మొత్తం కలిపి రూ.1.04 లక్షల కోట్లు ఖజానాకు చేరగా, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం నిలకడగా వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల వరకు చేరవచ్చని ఆ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరికొంత మొత్తం అప్పుల రూపంలో సమకూరినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను రూ.1.83 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించాల్సి ఉంటుందని వారంటున్నారు. అంచనాలు తలకిందులు కరోనా కొట్టిన దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. అంతా సవ్యంగా ఉంటే మరో రూ.30 వేల కోట్ల వరకు సొంత పన్నుల ఆదాయం పెరిగేది. ఈ పరపతి భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడేది. కానీ, కరోనా కాటుతో కీలక రంగాలు దెబ్బ తినడం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే గత ఆరు నెలలుగా (జూలై, 2020 నుంచి) వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ ఆదాయం నిలకడగా ఉండడం, ఈ రెండూ కలిపి సగటున రూ.4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో కొంత మేర ప్రభుత్వ ఖజానా ఊపిరి పీల్చుకుంది. వీటికి తోడు గత రెండు నెలలుగా స్టాంపు, రిజిస్ట్రేషన్ల గల్లా కూడా కళకళలాడుతోంది. డిసెంబర్లో రూ.661 కోట్లు, జనవరిలో రూ.800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.2 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ మూడు శాఖల ద్వారా నెలకు సగటున రూ.5వేల కోట్ల చొప్పున రూ.15 వేల కోట్ల వరకు వస్తాయని ఆ శాఖ లెక్కలు కడుతోంది. సగటున రూ.10 వేల కోట్ల రాబడి గత 3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులను పరిశీ లిస్తే సగటున నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతోంది. అక్టోబర్లో రూ.10,178 కోట్లు, నవంబర్లో రూ.10,239 కోట్లు, డిసెంబర్లో రూ.20,103 కోట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్లో సొంత పన్నులు, కేంద్ర సాయం, ఇతర ఆదాయాలు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఉండగా, మరో రూ.10 వేల కోట్లు అప్పులు కింద సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సగటున రూ.10 వేల కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల వరకు వస్తాయని, అప్పులు ఇంకో రూ.7–8 వేల కోట్ల వరకు తెచ్చుకున్నా, అంతా కలిపి రూ.1.45 లక్షల కోట్ల వరకు బడ్జెట్ చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2020–21 వార్షిక బడ్జెట్ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ జనవరి, ఫిబ్రవరి రాబడులను బట్టి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయాలు నెలల వారీగా..(రూ.కోట్లలో) (మొత్తం వార్షిక బడ్జెట్ అంచనాల్లో డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ 53.7% రాగా, ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం 65.27 శాతానికి చేరింది) -
200 లక్షల కోట్లను దాటేసిన ఇన్వెస్టర్ల సంపద
సాక్షి,ముంబై: బడ్జెట్ 2021 తరువాత దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డులకు నెలవుగా మారింది. కీలక సూచీలు సరికొత్త జీవితాకాల గరిష్టాలను నమోదు చేసిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సంపద కూడా రికార్డుస్థాయికి చేరింది. గురువారం ఆరంభంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ ప్రపంచ మార్కెట్ల సానుకూ సంకేతాలతో మిడ్ సెషన్ నుంచి లాభాల్లోకి మళ్లింది. దీంతో సెన్సెక్స్ 50,474 గరిష్ట స్థాయిని టచ్ చేసింది. అనంతరం సరికొత్త గరిష్టాల దిశగా సెన్సెక్స్ దూకుడును కొనసాగిస్తోంది. ఫలితంగా బిఎస్ఇ-లిస్టెడ్ సంస్థల ఆర్కెట్ క్యాప్ మొదటిసారి రూ .200 లక్షల కోట్లు దాటింది. అంతకుముందు రూ .198.3 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడిదారుల సంపద తాజాగా రూ .200.11 లక్షల కోట్లకు పెరిగింది. నేటి సెషన్లో 350 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, 50614 వద్ద, నిఫ్టీ 14,900 వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. ఐటిసి, ఎంఅండ్ ఎం, ఒఎన్జిసి, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి టాప్ గెయినర్స్గాఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగిసి 50522 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 14874 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కాగా బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ గత నాలుగు సెషన్లలో 4,189 పాయింట్లు సాధించగా పెట్టుబడిదారుల సంపద రూ .13.99 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 2014 నవంబర్ 28 న తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ఇది రెట్టింపై 200 లక్షల కోట్లకు చేరింది. -
బడ్జెట్ తర్వాత పెట్రో సెగ షురూ
సాక్షి, ముంబై: 2021 బడ్జెట్ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అగ్రి సెస్ ప్రభావం వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు. కానీ గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.13 పైసలుండగా, డీజిల్ ధర రూ.82.04 కోల్కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.01,, లీటర్ డీజిల్ ధర రూ.80.41 హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ 90.10 పైసలుండగా, డీజిల్ ధర రూ.83.81 అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.78పైసలుండగా, డీజిల్ ధర రూ.85.99 పెట్రోల్, డీజిల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని కాబట్టి, వినియోగదారులపై అగ్రి సెస్ సంబంధిత అదనపు భారం పడదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినా, పెటట్రోల్ ధరలు మరింత భారం కావాడం వినియోగదారులనుబెంబేలెత్తిస్తోంది. కాగా బడ్జెట్లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద 4 రూపాయల చొప్పున అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రైల్వేకు కేటాయింపుల్లో భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రభావం రైల్వేపై పడింది. గతేడాది కేంద్ర బడ్జెట్లో రైల్వేకు భారీగానే కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఈసారి కొంత కోత పెట్టినట్టు కనిపిస్తోంది. రైల్వేకు సంబంధించిన కేటాయింపులను బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెబ్సైట్లో ఉంచారు. గతేడాది కంటే దాదాపు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపుల్లో కోత పడ్డట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల వారీగా పరిశీలించినా.. కేటాయింపులు కొన్నింటికే పరిమితమయ్యాయి. కోవిడ్ వల్ల ఎదురైన ఆర్థిక ఆటంకాలతో కేటాయింపులు కుంచించుకుపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం పనులను వేగంగా నిర్వహించి రెండు, మూడు ప్రాజెక్టులు అందుబా టులోకి తేవాలని నిర్ణయించినా, వాటికి తగ్గ నిధులు మాత్రం దక్కలేదు. దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను ప్రాధాన్యమైనవిగా నిర్ధారించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు ప్రారంభించేలా చూడనున్నట్టు రైల్వే తాజాగా ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్–మహబూబ్నగర్ డబ్లింగ్, భద్రాచలం రోడ్–సత్తుపల్లి కొత్తలైన్లకు చోటు దక్కింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా గత బడ్జెట్ కంటే నిధులు తక్కువే కేటాయించటం గమనార్హం. గత బడ్జెట్లో కొత్త లైన్లకు రూ.2,856 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం రూ.205 కోట్లే దక్కాయి. డబ్లింగ్ పనులకు గతంతో పోలిస్తే రూ.3,836 కోట్లకు గాను కేవలం రూ.868 కోట్లే దక్కాయి. ఆ ఊసే లేదు.. రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం కొరవడి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగని నేపథ్యంలో.. కొత్త బడ్జెట్లో దాని ఊసే లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ తన వాటాకు మించి నిధులు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిపడింది. ఆ నిధులు వస్తే పనులు జరుపుతామని ఇప్పటికే పలుమార్లు రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవటంతో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టును విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇక కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపు విషయంలోనూ అదే జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఇలా.. పని తాజా బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) గత బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) కొత్త లైన్లకు 205 2,856 డబ్లింగ్ పనులకు 868.10 3,836 ట్రాఫిక్ వసతులకు 72.65 154 ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణం 562.86 584 ట్రాకుల పునరుద్ధరణ 862 900 ప్రయాణికుల వసతుల మెరుగుకు 199.49 672 ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా.. మునీరాబాద్–మహబూబ్నగర్ 149 240 మనోహరాబాద్–కొత్తపల్లి 325 235 భద్రాచలం రోడ్–సత్తుపల్లి 267 520 అక్కన్నపేట– మెదక్ 83.63 - డబ్లింగ్ పనులు కాజీపేట–విజయవాడ 300 404 కాజీపేట–బల్లార్షా 475 483 సికింద్రాబాద్–మహబూబ్నగర్ 100 185 విజయవాడ–కాజీపేట బైపాస్ 286 - మంచిర్యాల–పెద్దంపేట ట్రిప్లింగ్ 4.50 - చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ 50 5 అంతా గందరగోళం.. రైల్వేకు సంబంధించి బడ్జెట్ పింక్ బుక్ను పార్లమెంటులో ప్రవేశపెట్టాక వివరాలు అందిస్తారు. బుధవారం రాత్రి 8 వరకు కూడా ఆ సమాచారం అందకపోయేసరికి, గురువారమే వివరాలు వస్తాయని మీడియాకు వెల్లడించి అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9 సమయంలో బడ్జెట్ వివరాలను ఢిల్లీ నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో వాటిని క్రోడీకరించే సమయం లేదని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలను గురువారమే వెల్లడించగలమని తేల్చి చెప్పారు. -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కేంద్ర బడ్జెట్పై నారాయణమూర్తి స్పందన
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ను తలపిస్తుందని ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రైతు అన్న సినిమా గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్నే ప్రస్తావించలేదని ఆరోపించిన నారాయణమూర్తి డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలను విస్మరించి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. జీఎస్టీ, సెస్లను కేంద్రం పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చి ప్రైవేటుపరం చేస్తే కార్పొరేట్ శక్తులు.. పంచభూతాలను కూడా అమ్ముకుంటాయని, అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలని కోరారు. తాను నిర్మిస్తున్న రైతు అన్న సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది అని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి ప్రథమార్థంలో కానీ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు.. -
బుల్ జోరు : ఆల్ టైం గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ బడ్జెట్ ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూలాభాల్లో కొనసాగుతున్న సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆంరభంలోనే ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకాయి. అనంతరం మరింత ఎగిసి సెన్సెక్స్ 528 పాయింట్లు పెరిగి 50,325 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 163 పాయింట్లు పెరిగి 14,810 గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్ల లాభాలకు సూచీలకు మద్దతునిస్తున్నాయి. వీటితో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా కొనసాగుతుండగా, మరోవైపు, మారుతి, కోటక్ బ్యాంక్, ఎస్బిఐ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ నష్ట పోతున్నాయి. -
అగ్రి సెస్తో రాష్ట్రాలకు నష్టం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తాజా బడ్జెట్లో ‘అగ్రి సెస్ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్–ఏఐడీసీ)’ను ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్లతో పాటు బంగారం, వెండి తదితర 12 వస్తువులపై ఈ సెస్ విధించనున్నారు. ఈ సెస్ కారణంగా వినియోగదారులపై భారం పడకుండా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో సర్దుబాటు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్ సందర్భంగా వివరణ ఇచ్చారు. సాధారణంగా కేంద్ర పన్నుల్లో 41% రాష్ట్రాల వాటాగా ఉంటుంది. కానీ, సర్చార్జ్లు, సెస్లలో రాష్ట్రాలకు వాటా లభించదు. దాంతో, అగ్రి సెస్ కారణంగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో వాటా ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. అగ్రి సెస్ నుంచి రాష్ట్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం ఉండదు. అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి పాండే వెల్లడించారు. తాత్కాలిక, ప్రత్యేక లక్ష్యాల కోసమే సెస్ విధించాలని, వ్యవసాయ మౌలిక వసతుల వంటి సాధారణ లక్ష్యాలకు సెస్ సరికాదని గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ వ్యాఖ్యానించారు. ఈ సెస్ వల్ల కేంద్రం సేకరించే కస్టమ్స్ డ్యూటీ నుంచి రాష్ట్రాలు తమ వాటా ఆదాయాన్ని కోల్పోతాయన్నారు. అయితే, సాధారణంగా కేంద్రం పెట్రోలు, డీజిల్లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా లభించిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోదని, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో సర్దుబాటు చేసే అగ్రిసెస్ ద్వారా రాష్ట్రాలకు ఆదాయ పరంగా నష్టం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో... గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు పరిగణలోకి తీసుకుంటే అగ్రి సెస్ రూపంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ద్వారా కేంద్రానికి రూ.2,016.33 కోట్ల ఆదాయం సమకూరనుంది. 2019–20 లో రాష్ట్రంలో 401.27 కోట్ల డీజిల్, 164.42 కోట్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. దీని ప్రకారం డీజిల్ పై లీటరుకు రూ.4 అగ్రి సెస్ పరిగణలోకి తీసుకుంటే ఏటా రూ.1,605.33 కోట్లు సమకూరనున్నాయి. ఇదేసమయంలో 164.54 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరిగాయి. లీటరు పెట్రోలు పై విధించిన రూ.2.50 అగ్రిసెస్ పరిగణలోకి తీసుకుంటే రూ.411.25 కోట్లు కేంద్రానికి ఆదాయం గా రానున్నది. తెలంగాణలో.. తెలంగాణ విషయానికొస్తే ఏటా రూ.237 కోట్లకుపైగా నష్టం ఉంటుందని అంచనా. రాష్ట్రంలో నెలకు సగటున (2020, డిసెంబర్ అమ్మకాల ప్రకారం) 12.23 కోట్ల లీటర్ల పెట్రోల్, 23.11 కోట్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు పలు రూపాల్లో ఉంటాయి. రాష్ట్ర పన్నుల రాబడులు నేరుగా మన ఖజానాకు చేరితే కేంద్రం విధించే పన్నుల్లో మనకు వాటా వస్తుంది. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డీజిల్పై లీటర్కు రూ.4, పెట్రోల్పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి, ఆ మేరకు సెస్ పెంచింది. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉంటుంది కానీ, సెస్ ద్వారా వసూలు చేసుకునే దానిలో రాష్ట్రాలకు రూపాయి రాదు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో నెలకు జరిగే మొత్తం విక్రయాల్లో డీజిల్పై లీటర్కు రూ.4 చొప్పున రూ.92.44 కోట్లు, పెట్రోల్పై రూ.2 చొప్పున రూ.24.46 కోట్లు ఎక్సైజ్డ్యూటీ తగ్గిపోతుంది. అదే సంవత్సరానికి వస్తే డీజిల్పై రూ.1109.28 కోట్లు, పెట్రోల్పై 293.52 కోట్లు డ్యూటీ రాదు. దీంతో ఈ డ్యూటీలో రాష్ట్రానికి వచ్చే వాటా రాకుండా పోతుంది. కేంద్ర పన్నుల్లో వాటా ప్రకారం మన రాష్ట్రానికి ఈ మొత్తం రూ.1402.80 కోట్లలో రావాల్సిన 2.4 శాతం వాటా రాకుండా పోతోంది. ఇది రూ. 33.64 కోట్లు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీపై రాష్ట్రం అదనంగా 14.5 శాతం పన్ను వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు రూ.1402 కోట్ల మేర డ్యూటీ తగ్గిపోవడంతో ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుంది. ఈ మొత్తం రూ.203.40 కోట్లు ఉంటుందని వాణిజ్య పన్నుల అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే అటు ఎక్సైజ్ డ్యూటీ వచ్చే వాటా, ఇటు ఎక్సైజ్ డ్యూటీపై విధించే రాష్ట్ర పన్ను కలిపితే మొత్తం రూ. 237.04 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
కేంద్ర బడ్జెట్పై కార్మిక సంఘాల కన్నెర్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక కార్మిక సంఘాలు పోరాట బాట పట్టనున్నారు. ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలనే డిమాండ్పై 10 కార్మిక సంఘాలు ఆందోళనలు చేయనున్నాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనల్లో భాగంగా బుధవారం భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్స్ను ప్రతులను దగ్ధం చేస్తామని ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్లో తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్పై ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. -
బయోగ్యాస్ ప్లాంట్లలో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం టాప్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక శిక్షణను కూడా అందిస్తున్నట్లు విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 లక్షల 62 వేల 841 బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక సహాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్కు రూ.7,500 నుంచి 25 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఏర్పాటుచేసే ప్లాంట్కు రూ.35 వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాతపూర్వకంగా చెప్పారు. అలాగే దేశంలోని వివిధ బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాలతోపాటు భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ ద్వారా కూడా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బయోగ్యాస్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు పెద్ద ఎత్తున బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కృషి చేస్తున్నట్లు మంత్రి రాతపూర్వకంగా తెలిపారు. -
తగ్గనున్న లగ్జరీ వాహనాల ధరలు
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ కారణంగా ఆర్థిక రంగంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేలా కేంద్రం వివిధ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ కాలంలో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ హై ఎండ్ వాహనాల అమ్మకాలకు మాత్రం బ్రేక్ పడింది. లగ్జరీ బైక్లపైనా వాహన వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల ఖరీదు చేసే బైక్లపై సుమారు రూ.30 వేల వరకు, రూ.50 లక్షలు దాటిన కార్లపై రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ధరలు తగ్గనున్నట్లు అంచనా. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించడం, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలామంది సొంత వాహనాలకు ప్రాధాన్యమిచ్చారు. కానీ చిన్న కార్లు, బైక్లకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సుమారు 50 వేల వరకు వాహన విక్రయాలు జరిగాయి. కానీ హై ఎండ్ వాహనాలకు మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో హై ఎండ్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. హై ఎండ్పై ఆసక్తి.. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు లక్షన్నర వరకు హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలు దాటిన బైక్లు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. రూ.50 లక్షలు దాటిన కార్లు సుమారు 50 వేల వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం 10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఆడి, బీఎండబ్ల్యూ, రేంజ్రోవర్, ఓల్వో, రోల్స్రాయిస్, లాంబోర్గ్ వంటి అధునాతన వాహనాలు హైదరాబాద్ రహదారులపై పరుగులు తీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ధరల తగ్గింపుతో వినియోగదారులు హై ఎండ్ పట్ల ఆసక్తి చూపవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈవీలకు ఊతం.. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. వాహనాల ధరల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం కొంత వరకు తగ్గింపు ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రైట్ రైట్.. సిటీ రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 ఏసీ ఓల్వో ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల మేరకు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం విద్యుత్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో 20 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా నగరంలో కొన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే రాయితీలపైన ఈ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల గ్రేటర్ ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు అవకాశం లభించనుంది. ఆహ్వానించదగిన పరిణామం కోవిడ్తో లగ్జరీ వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వాహనాల ధరలను కొంత మేరకు తగ్గించాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన మార్పు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. – రామ్కోటేశ్వర్రావు, తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ల దిగుమతి సుంకాన్ని 2.5 శాతం పెంచింది. విడిభాగాల పరికరాలకు కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచడంతో వీటి ధరలు పెరుగుతాయని నగర సెల్ఫోన్ దుకాణ నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల ధరలు మాత్రం ఏప్రిల్ నుంచి మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన రిఫ్రిజ్రేటర్, ఎయిర్ కండిషన్ కంప్రెషర్లలపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 12.5 నుంచి 15 శాతానికి పెంచడం కూడా ఆయా వస్తువుల ధరలపై ప్రభావాన్ని స్పష్టంగా చూపెడుతుందని వ్యాపారులు అంటున్నారు. నగరంలో వేలల్లో సెల్ఫోన్ దుకాణాలతో పాటు వందల్లో ఎలక్ట్రానిక్ షోరూమ్లు రూ.వందల కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల పెంపు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై మరింత భారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత భారమే.. స్మార్ట్ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతి ఒక్కరికీ సమాచార మార్పిడికి ఫోన్లు తప్పనిసరి కావడంతో ధరలు పెరిగినా కొనడం మాత్రం ఆగడంలేదు. అయితే అతి కష్టంమీద సెల్ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ నిర్ణయం గుదిబండలా మారింది. – ఎల్.నరేష్, ఆర్పీ మొబైల్ షాప్, వనస్థలిపురం తప్పదు వాడకం.. ఎలా కొనడం? కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ కేవలం తల్లిదండ్రులు మాత్రమే వాడగా.. ఇప్పుడు పిల్లలకు చదువు కోసం కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్య, పేద తరగతి ప్రజలకు భారమే. – రితిక, సీబీఐటీ కాలేజీ విద్యార్థిని, గండిపేట సామాన్యుడిపై భారమే... ఇంట్లో అవసరాల కోసం రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేసేవారికి భారమే. వచ్చే జీతం ఇంటి అద్దెకు, అవసరాలకు, పిల్లల చదువులకే సరిపోతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలకు రెక్కలు రానుండడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. – పి.శేఖర్, ఎల్బీనగర్ -
రూ.6 లక్షల కోట్లకు చేరిన ఆహారం, ఎరువుల సబ్సిడీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు సుమారు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 బడ్జెట్ అంచనాల్లో రూ.2,27,793.89 కోట్లుగా ఉన్న సబ్సిడీ.. సవరించిన అంచనాల ప్రకారం రూ.5,95,620.23 కోట్లకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. కోవిడ్, లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో అంచనాలు తలకిందులయ్యాయి. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల సబ్సిడీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ సబ్సిడీ బిల్లును రూ.3,36,439.03 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ.1,15,569.68 కోట్ల నుంచి రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.2,42,836 కోట్లుగా అంచనా వేశారు. ఎరువులపై సబ్సిడీ రూ.71,309 కోట్ల నుంచి రూ.1,33,947.3 కోట్లకు చేరగా.. 2021–22లో రూ.79,529.68 కోట్లుగా అంచనా వేశారు. పెట్రోలియం ఉత్పత్తులు(ఎల్పీజీ, కిరోసిన్) మీద సబ్సిడీని రూ.40,915.21 కోట్లుగా అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.39,054.79 కోట్లయ్యింది. 2021–22లో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.14,073.35 కోట్లు కేటాయించారు. -
ఆకాశమే హద్దుగా.. సరికొత్త రికార్డుల దిశగా
సాక్షి, ముంబై: బడ్జెట్ అనంతరం వరుసగా రెండో రోజు కూడా దలాల్ స్ట్రీట్లో లాభాల హవా కొనసాగుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు రికార్డు దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 50వేల మార్క్ని అధిగమించింది. ప్రస్తుతం 1529 పాయింట్ల లాభంతో 50,128 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు ఎగిసి 14721 వద్ద, 14550 స్థాయిని దాటేసింది. బ్యాంకింగ్ షేర్ల లాభాలతో అటు బ్యాంక్ నిఫ్టీ 4 శాతానికి పైగా పెరిగింది.(దలాల్ స్ట్రీట్లో మెరుపులు : ఎందుకంటే?) టాటామోటార్స్, 9 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి 6 306.90 ను తాకింది.టెక్ మహీంద్రా, ఐసీఐసీఐఐ బ్యాంక్, యూపీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో కూడా 3-8 శాతం లాభాలతోట్రేడ్ అవుతున్నాయి. -
బడ్జెట్ 2021: చదువు, నైపుణ్యాభివృద్దిపై దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జాతీయ విద్యా విధానంలో వివరించిన విద్యా సంస్కరణల మేరకు మానవ వనరుల (పాఠశాల, ఉన్నత విద్యా రంగం) రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మానవ వనరుల విభాగంలో మూలధనం పెంచడంలో భాగంగా చదువు, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వెల్లడించారు. సోమవారం ఆమె పార్లమెంట్లో 2021–2022 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆరు ప్రాథామ్యాల ఆధారంగా రూపొందించిన ఈ బడ్జెట్లో మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి ఒకటని చెప్పారు. పాఠశాల విద్యకు రూ.54,873.66 కోట్లు, ఉన్నత విద్యకు రూ.38,350.65 కోట్లు.. మొత్తంగా రూ.93,224.31 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. దేశంలోని తొమ్మిది నగరాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది విద్యా సంస్థల మధ్య సమన్వయం, స్వయం ప్రతిపత్తి, సమష్టి వృద్ధికి దోహద పడుతుందన్నారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొత్త జాతీయ విద్యా విధానం.. ఆఫ్లైన్, ఆన్లైన్, హైబ్రిడ్ మోడళ్లలో అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దీనిని అమలు చేయడానికి క్రెడిట్ బదిలీ విధానంతో పాటు, అకడమిక్ బ్యాంక్ ఏర్పాటవుతుందని, ఇందుకు ఉన్నత విద్య క్లస్టర్ తోడ్పాటు అందించి అభ్యాస వాతావరణాన్ని మెరుగు పరచనుందని వివరించారు. మంత్రి ప్రసంగంలో ఇంకా ముఖ్యాంశాలు ఇలా.. పాఠశాల విద్య ⇔ కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం దేశ వ్యాప్తంగా 15,000 నమూనా పాఠశాలలు ఏర్పాటు. ఆయా ప్రాంతాల్లోని ఇతర పాఠశాలలకు ఇవి అన్ని విధాలా దిక్సూచిగా నిలిచి మార్గనిర్దేశం చేస్తాయి. విద్యా సమూహాన్ని సృష్టించి, రాబోయే రోజుల్లో దశల వారీగా కొత్త విద్యా విధానాన్ని రూపొందించడంలో సహాయ పడతాయి. ⇔ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేట్ క్రీడాకారులు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా 100 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటవుతాయి. సైనిక్ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ సొసైటీ స్థాపించి, నిర్వహిస్తోంది. దేశంలో ప్రస్తుతం 30కి పైగా సైనిక్ పాఠశాలలు ఉన్నాయి. ⇔ స్టాండర్డ్ (ప్రామాణిక) – సెట్టింగ్ (అమరిక), అక్రెడిటేషన్ (గుర్తింపు), రెగ్యులేషన్ (నియంత్రణ), ఫండింగ్ (నిధులు) కోసం నాలుగు వేర్వేరు విభాగాల ఏర్పాటుతో అంబ్రెల్లా స్ట్రక్చర్లో భారతదేశ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కోసం చట్టం చేస్తాం. ⇔ అంబ్రెల్లా స్ట్రక్చర్ విధానం వల్ల ఆయా నగరాల్లోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయం, వనరుల భాగస్వామ్యం, బోధన అభ్యాసానికి సహకారం, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ⇔ తద్వారా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల మధ్య కూడా సహకారం పెరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్లోని 40 ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు పరస్పరం నేర్చుకోవడం ద్వారా విద్యా విధానం మెరుగవుతుంది. ‘గ్లూ గ్రాంట్’ ద్వారా విద్యా రంగానికి ఊతం లభిస్తుంది. ⇔ లద్దాఖ్లోని లేహ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ⇔ ఈ బడ్జెట్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యకు మరింత ఊతం ఇచ్చింది. కొత్తగా దేశంలో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ తరహా స్కూలు నిర్మాణానికి గతంలో రూ.20 కోట్లు ఇస్తుండగా ఈ బడ్జెట్లో రూ.38 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.48 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ⇔ షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లకు కేటాయింపులు పెంచారు. ఈ కేటాయింపులు రానున్న ఐదేళ్ల కాలం ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుదల వల్ల దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఆంధ్రప్రదేశ్లో 2.50 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికే జగనన్న వసతి దీవెన కింద అన్ని వర్గాల పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని ముఖ్యాంశాలు.. ⇔ బోర్డు పరీక్షలను సులభతరం, కోర్ కాన్సెప్ట్లకు తగ్గట్టు పాఠ్యాంశాల తగ్గింపు. 10 + 2 నిర్మాణాన్ని 5 + 3 + 3 + 4 గా మార్చడంతో పాటు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో కనీసం 5వ తరగతి వరకు బోధన. ⇔ కేంద్రీయ విద్యాలయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6,800 కోట్ల బడ్జెట్ కేటాయింపు. గత ఏడాది కేటాయించిన రూ.5,516 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతానికి పైగా ఎక్కువ. ⇔ నవోదయ విద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపును రూ.500 కోట్లు పెంచారు. గతేడాది రూ.3,300 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,800 కోట్లు కేటాయించారు. ⇔ మధ్యాహ్న భోజన పథకంలో రూ.500 కోట్ల పెరుగుదల కనిపించింది. గత ఏడాది రూ.11,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.11,500 కోట్లకు పెంచారు. ⇔ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) కింద ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థుల్లో నైపుణ్య శిక్షణ కోసం రూ.3000 కోట్లు కేటాయింపు. నైపుణ్యం, సాంకేతికత బదిలీ కోసం జపాన్ సహకారంతో శిక్షణ. ⇔ కోవిడ్–19 నేపథ్యంలోనూ 30 లక్షల మందికి పైగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్గా శిక్షణ. 2021–22లో 56 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ (నిస్తా) ద్వారా శిక్షణ ఇస్తాం. ⇔ పరీక్షలు, రొటీన్ లెర్నింగ్కు ప్రాధాన్యత తగ్గించి.. విశ్లేషణాత్మక నైపుణ్యం, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా విద్యార్థులను పరీక్షిస్తాం. ⇔ కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి ప్రతి ఏడాది సీబీఎస్సీ బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఆందోళన, ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతున్నారు. ఈ దిశలో సీబీఎస్సీ బోర్డు 2022–23 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా పరీక్షల్లో సంస్కరణలను అమలు చేస్తుంది. ⇔ వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం, దేశ వ్యాప్తంగా భారతీయ సంకేత భాష ఆధారంగా జాతీయ, రాష్ట్ర పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నాం. ⇔ విదేశీ ఉన్నత విద్యా సంస్థలతో మెరుగైన విద్యా సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ద్వంద్వ డిగ్రీలు, ఉమ్మడి డిగ్రీలు ఇతరత్రా అవసరాల కోసం ఒక నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ⇔ విద్యా సంస్థలు, ఆస్పత్రులను నడుపుతున్న చిన్న చారిటబుల్ ట్రస్టులపై సమ్మతి భారాన్ని తగ్గించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటి వరకు ఉన్న వార్షిక రసీదు మొత్తం రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నాం. ⇔ విద్యా రంగానికి మొత్తం కేటాయింపులు : రూ.93,224.31 కోట్లు ⇔ గతేడాది మొత్తం కేటాయింపులు : రూ. 99,311.52 కోట్లు రంగంపై పెడుతున్న ఖర్చు జీడీపీ %లో 2014–15 2.8 2015–16 2.8 2016–17 2.8 2017–18 2.8 2018–19 2.8 2019–20 3 2020–21 3.5 పాఠశాల విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో) 2019–20 2020–21 2021–22 కేంద్రీయ విద్యా సంఘటన్ 6,331.40 5,516.50 6,800 నవోదయ విద్యాలయ సమితి 3387.60 3,300 3800 ఎన్సీఈఆర్టీ 276.05 300 500 సమగ్ర శిక్ష అభియాన్ 32,376.52 38,750.50 31,050.16 ఉపాధ్యాయ శిక్షణ, వయోజన విద్య – 110 250 మధ్యాహ్న భోజన పథకం 9,699 11,000 11,500 మదర్సాలు, మైనార్టీ విద్య 70.94 220 – ఉన్నత విద్యలో కొన్ని ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో) 2019–20 2020–21 2021–22 ప్రపంచస్థాయి విద్యా సంస్థలు 224.10 500 1,710 విద్యార్థులకు ఆర్థిక సాయం 2,069.95 2,316 2,482.32 మొత్తం డిజిటల్ ఇండియా ఇ–లెర్నింగ్ 457.58 444.40 645.61 పరిశోధన, ఆవిష్కరణలకు 257.08 307.40 237.40 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 4,435.58 4,693.20 4,693.20 ఏఐసీటీఈ 436 416 416 సెంట్రల్ యూనివర్సిటీలకు గ్రాంట్లు 7,988.84 7643.26 7643.26 సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ – 60.35 60.35 ఏపీ, తెలంగాణ గిరిజన వర్సిటీలు 0.63 53.80 53.80 డీమ్డ్ యూనివర్సిటీలు 418.02 351 351 ఐఐటీలు 6,365.92 7,182 7,536.02 ఐఐటీ హైదరాబాద్ 230 150 150 ఐఐఎమ్ 481.29 476 476 ఎన్ఐటీ 3,486.60 3,885 3,935 ఐఐఎస్ఈఆర్ 791.22 896 946 ఐఐఎస్ 596.48 591.65 621.65 ఐఐఐటీలు 328.33 393.35 393.35 - - - - -
బడ్జెట్లో కొత్త ఆరోగ్య పథకం
న్యూఢిల్లీ : కరోనా పడగ నీడలో ఏడాదిగా బిక్కు బిక్కు మంటూ బతకడంతో ఆరోగ్యానికున్న ప్రాధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆరోగ్య సంరక్షణే మార్గమని నిర్ణయానికొచ్చింది. కరోనాని నిర్మూలనకు ప్రజలందరికీ టీకాలు ఇవ్వడమే మార్గమని భావించి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి 35 వేల కోట్లు కేటాయించింది. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం నివారణ, చికిత్స, సంరక్షణే లక్ష్యాలుగా అడుగులు వేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కాకుండా మరో కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రకటించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పేరిట వస్తున్న ఈ పథకం కోసం 64 వేల కోట్లు కేటాయించింది. ఇన్నాళ్లూ ఆరోగ్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేంద్రం ఇప్పుడు నిధుల్ని ఒకేసారి 137శాతం పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 2020–21 సంవత్సరంలో ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు రూ.94,452 కోట్లు కాగా, 2021–22లో రూ.2 లక్షల 23 వేల 846 కోట్లు బడ్జెట్ అంచనాలున్నట్టు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ నుంచి స్వాస్థ్య భారత్ ఆరోగ్య రంగమంటే రోగాలు, చికిత్స, ఆసుపత్రులు, ల్యాబ్లు మాత్రమే కాదు. సంపూర్ణ ప్రజారోగ్యం కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, రక్షిత నీరు, పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే అనారోగ్యమే మన దరి చేరదు. సరిగ్గా ఈ అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని ఆరోగ్య రంగాన్ని మొదటి స్తంభంగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇన్నాళ్లూ అమల్లో ఉన్న సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, పోషణ్ అభియాన్ కార్యక్రమాల్ని కలిపేసి మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దీని కింద 112 జిల్లాల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక జల జీవన్ మిషన్కు రూ.50 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.2 లక్షల 87 వేలు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా 2.86 కోట్ల ఇళ్లకు మంచినీటి సౌకర్యం, పట్ణణ ప్రాంతాల్లో 4,378 స్థానిక సంస్థలకు మంచినీటి సరఫరా, 500 అమృత్ నగరాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపడతారు. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాలు అద్దంలా మెరిసిపోవడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ. లక్షా 41వేల 678 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణ, మురికి నీటి నిర్వహణ, నిర్మాణ రంగం, కూల్చివేతల సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటారు. అదే విధంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 42 పట్టణాల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించడం కోసం రూ.2,217 కోట్లు కేటాయించారు. సంక్షోభం పాఠాలతో సంరక్షణ వైపు అడుగులు కేటాయింపులు ఇలా.. కోవిడ్ వ్యాక్సిన్ 35వేల కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 71,268.77కోట్లు ఆత్మనిర్భర్ స్వాస్థ్య యోజన పథకం 64,180 కోట్లు 2,663 కోట్లు ఆరోగ్య రంగంలో పరిశోధనలు 50 వేల కోట్లు జల్ జీవన్ మిషన్కు ‘‘కరోనా వంటి విపత్తులు మరిన్ని ఎదురైనా భారత్ ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉందని ఈ సారి ఆరోగ్య రంగ కేటాయింపులు తేటతెల్లం చేస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలుష్య నియంత్రణ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజారోగ్యం మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యంతో పాటుగా ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యంపైన కూడా దృష్టి కేటాయించడం హర్షణీయం. బడ్జెట్లో ఆరోగ్య రంగాన్ని అగ్రభాగంలో నిలపడం వల్ల అభివృద్ధికి కూడా బాటలు పడతాయి – ప్రొఫెసర్ కె.శ్రీకాంత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) స్వాస్థ్య భారత్ బడ్జెట్లో కొత్తగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పథకాన్ని తెచ్చారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రాంతీయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం ఈ పథకం కోసం రూ. 64,180 కోట్లు కేటాయించారు. వచ్చే ఆరేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్తో పాటు ఈ కొత్త ఆరోగ్య పథకం అమలవుతుంది. ఈ పథకం ద్వారా ఏమేం చేస్తారంటే... ఆరోగ్య శ్రేయస్సు కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ► గ్రామీణ ప్రాంతాల్లో 17,788, పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ► కొత్తగా నాలుగు ప్రాంతాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ ► ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు, రెండు మొబైల్ ఆస్పత్రులు ►దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్స్, 11 రాష్ట్రాల్లో బ్లాక్ స్థాయిలో 3,382 ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు ►నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), దానికి అనుబంధంగా పనిచేసే అయిదు శాఖల్ని మరింత పటిష్టపరచడం ► ప్రస్తుతం ఉన్న 33 ప్రజారోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటుగా కొత్తగా 17 కేంద్రాల ఏర్పాటు ►ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతం కోసం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ► తొమ్మిది బయో సేఫ్టీ లెవల్ ► ల్యాబొరేటరీల ఏర్పాటు సామాజిక న్యాయం, సాధికారతకు రూ.11,689 సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు బడ్జెట్లో మొత్తం రూ.11,689 కోట్ల కేటాయింపులు జరిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 28.35 శాతం నిధులు పెరిగాయి. వెనుకబడిన తరగతుల వారికి 2020–21 బడ్జెట్లో రూ.8,207.56 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్లో రూ.10,517.62 కోట్లు కేటాయించారు. గత దానితో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. దివ్యాంగుల సాధికారికత కోసం 2020–21లో రూ.900 కోట్లు కేటాయించగా, ఈసారి 1,171.77 కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే 30.19 శాతం ఎక్కువ. జాతీయ కమిషన్లకు రూ.250 కోట్లు.. మూడు జాతీయ కమిషన్లు.. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, సఫాయ్ కరంచారిస్ జాతీయ కమిషన్లకు 2021–22 బడ్జెట్లో మొత్తం రూ.250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించారు. కేంద్ర ఉపకార వేతనాలకు సంబంధించి ఎస్సీ, ఓబీసీ, ఈబీసీలకు నేషనల్ ఫెలోషిప్, ఓవర్సీస్ స్కాలర్షిప్లకు సంబంధించి ఎస్సీలకు, ఓబీసీలకు ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలకు రూ.377 కోట్లు.. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్స్ డిసేబిలిటీ స్టడీస్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూనివర్సల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్లకు మొత్తం రూ.377 కోట్లు కేటాయించారు. సామాజిక సేవలకు రూ.1,017 కోట్లు.. సామాజిక సేవల రంగానికి 2020–21 బడ్జెట్లో రూ.784 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్లో రూ.1,017 కోట్లు కేటాయించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం చేపట్టే జాతీయ కార్యక్రమాలకు సంబంధించి గత బడ్జెట్లో రూ.436.89 కోట్లు కేటాయించగా, ఈసారి 709 కోట్లు కేటాయించారు. -
బడ్జెట్: పెరిగిన కొలువులు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం కొలువుల సంఖ్య 34,14,226కు చేరనున్నట్లు సోమవారం బడ్జెట్లో వెల్లడించారు. మార్చి 1, 2019 నాటికి 32,71,113 కేంద్ర ఉద్యోగాలు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నాటికి 1,43,113 ఉద్యోగాలు పెరగనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, సహకార, రైతు సంక్షేమం శాఖలో మార్చి 1, 2019 నాటికి 3,619 ఉద్యోగాలు ఉండగా ఈ రెండేళ్లలో 2,207 పెరిగి 5,826కు చేరనున్నాయి. అలాగే పౌరవిమానయానంలో 1,058 పెరిగి 1,254 నుంచి 2,312కు, రక్షణ శాఖలో 12,537 పెరిగి 80,463 నుంచి 93,000కు చేరనున్నాయి. అలాగే సాంస్కృతిక శాఖలో 3,638, ఎర్త్ సైన్సెస్లో 2,859, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో 2,263, విదేశీ వ్యవహారాల్లో 2,204, వాణిజ్యంలో 2,139, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 1,452; ఆరోగ్య–కుటుంబ సంక్షేమంలో 4,072, కార్మిక–ఉపాధి కల్పనలో 2,419, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది పునర్వవస్థీకరణలో 1,456 పెరగనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విభాగాల్లోనూ ఇలాగే పెరిగినట్లు వివరించారు. చదవండి: బడ్జెట్: ఈ విషయాలు మీకు తెలుసా! చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రత న్యూఢిల్లీ: ఈ కామర్స్ వ్యాపార సంస్థల్లో పనిచేసే ‘గిగ్’ కార్మికులకూ సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతరుల సమాచారం సేకరించేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గిగ్, ప్లాట్ఫాం కార్మికులతో సహా మొత్తం శ్రామికశక్తికి తొలిసారి సామాజిక భద్రతను కల్పించడానికి నిబంధనలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ఉబెర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ఈ–కామర్స్ సంస్థల్లో పనిచేసే గిగ్, ప్లాట్ఫాం కార్మికులకు క్రమబద్ధమైన వేతనాలు ఉండవు. దీంతో ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్య బీమా, పెన్షన్లు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. దేశంలో మొత్తం 50 కోట్లకు పైగా శ్రామిక శక్తి ఉండగా ఇందులో 40 కోట్లు అసంఘటిత రంగాల్లోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులే ఉన్నారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధం, సామాజిక భద్రత, వృత్తి భద్రత, ఆరోగ్యం–పని పరిస్థితులపై తెచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల పేర్కొన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి? -
వృద్ధులకే కాస్త ఊరట
న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆదాయపన్ను (ప్రత్యక్ష పన్ను) రేట్లలో కచ్చితంగా మార్పులు ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. యథాతథ స్థితికే మొగ్గు చూపించారు. ఆదాయపన్ను శ్లాబుల్లోకానీ, రేట్లలో కానీ మార్పుల జోలికి వెళ్లలేదు. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఆదాయం పెంచుకునేందుకు ఆదాయపన్ను రేట్లను పెంచకపోవడమే. రూ.2,50,000 లక్షల వరకు ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ అలానే కొనసాగనుంది. రూ.2,50,000కు పైన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 వరకు ఉన్నా కానీ (మినహాయింపులు పోను) పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. సెక్షన్ 87ఏ కింద రూ.12,500 రాయితీని పొందొచ్చు. దీంతో పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న అనంతరం నికర ఆదాయం రూ.5లక్షల వరకు ఉంటే పన్ను బాధ్యత లేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే ఆదాయపన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 2020 బడ్జెట్లో నూతన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తూ.. పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చిన విధానంలో కొనసాగొచ్చంటూ మంత్రి సీతారామన్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ రెండు విధానాలు ఇక ముందూ కొనసాగనున్నాయి. కాకపోతే ఒక్కసారి నూతన విధానాన్ని ఎంచుకుంటే, మళ్లీ తిరిగి పాత విధానానికి మారేందుకు వీలుండదు. నూతన పన్ను విధానంలో చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పన్నుల రేటు తక్కువగా ఉంటుంది. భవిష్యనిధి చందాపై పన్ను అధిక ఆదాయ వర్గాల భవిష్యనిధి వాటాలపై స్వల్ప పన్నును మంత్రి ప్రతిపాదించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి తరఫున చందా రూ.2.5లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అధిక విలువ కలిగిన డిపాజిటర్లను మంత్రి లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈపీఎఫ్ అని గుర్తు చేస్తూ.. నెలకు రూ.2లక్షల్లోపు ఆర్జించే వారిపై తాజా ప్రతిపాదన ఎటువంటి ప్రభావం చూపించదని మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ పరిమితిగా ఉందని, ఈ మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. రూ.2.5 లక్షలకు మించి చందాదారుల సంఖ్య మొత్తం సభ్యుల్లో ఒక శాతాన్ని మించదని వ్యయాల విభాగం సెక్రటరీ టీవీ సోమనాథన్ తెలిపారు. 75 దాటితే నో ఐటీ రిటర్న్స్ పెన్షన్ ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కలిగిన 75 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారు ఇక మీదట ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ అందుకుం టున్న బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కూడా వస్తుండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 75 ఏళ్లు నిండిన వృద్ధులపై నిబంధనల అమలు భారాన్ని దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. రిటర్నుల దాఖలులో మినహాయింపునిచ్చినా కానీ, పన్ను బాధ్యత మాత్రం కొనసాగుతుంది. అంటే ఆదాయంపై నిబంధనల మేరకు పన్నును సంబంధిత బ్యాంకు మినహా యించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుందని ఆర్థిక శాఖా కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మీడియాకు స్పష్టం చేశారు. పెన్షన్, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకు నుంచి ఉంటేనే ఈ వెసులుబాటు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఆదాయం వస్తూ, మరో బ్యాంకులో ఎఫ్డీలపై వడ్డీ ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్, ఎఫ్డీలపై వడ్డీకాకుండా ఇతర రూపాల్లో ఆదాయం ఉన్నా కానీ రిటర్నుల దాఖలు తప్పనిసరి. సొంతింటి రుణ వడ్డీపై పన్ను మినహాయింపు అందుబాటు ధరల ఇళ్లను రుణంపై కొనుగోలు చేసుకునే వారికి ఈ బడ్జెట్లో ఊరట లభించింది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో అదనంగా కల్పించిన పన్ను మినహాయింపును.. మరో ఏడాది పాటు 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ బడ్జెట్లో నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఇళ్ల కొనుగోలుపైనా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. వాస్తవానికి ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు గతంలో ఉండగా, దీనికి అదనంగా మరో రూ.1.5లక్షలపైనా పన్ను మినహాయింపును సెక్షన్ 80ఈఈఏ కింద 2019 బడ్జెట్లో ప్రకటించారు. మొదటిసారి ఇంటి కొనుగోలు చేసుకునే వారు, అది కూడా రూ.45లక్షల బడ్జెట్ మించని ఇళ్ల కొనుగోలుదారులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే మొత్తం మీద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.3.5 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఇది కాకుండా ఇంటి రుణం అసలుకు చేసే జమలు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద చూపించుకునే అవకాశం ఎలానూ ఉంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఇవే.. సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్80ఈఈ కింద క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సెక్షన్80సీ: ఈ సెక్షన్ కింద స్టాంప్ డ్యూటీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లింపులు చేసిన ఆర్థిక సంవత్సరానికే క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది. -
కేంద్ర బడ్జెట్: ఇందులో నాకేంటి?
♦ రైతు మద్దతిచ్చారు... బడ్జెట్లో ఢిల్లీ చుట్టూ ఆందోళనలు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపై చట్టంలో హామీ దొరక్కపోయినా... బడ్జెట్లో దొరికింది. కాకుంటే కనీస మద్దతు ధర మరీ కనీసంగా.. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉంది!! సాగు రుణ పరిమితి లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచినా ఇవ్వాల్సింది బ్యాంకులు కదా! ‘ఆపరేషన్ గ్రీన్’ 22 ఉత్పత్తులకు విస్తరించటం ఊరటే. చదవండి: బడ్జెట్ 2021: ఈ విషయాలు మీకు తెలుసా! ♦ విద్యార్థి ఆన్లైన్... అర్థమైందా? స్కూలు బ్యాగు మోసి.. క్లాసు మొహం చూసి ఏడాదవుతోంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యాయో లేదో అర్థంకాని పరిస్థితి. కంప్యూటర్లు, ట్యాబ్లు, మొబైళ్లు లేనివారి గురించి ఆలోచించలేదెవ్వరూ! ఆలోచిస్తే ఈ బడ్జెట్లో మొబైల్ రేట్లు పెంచేస్తారా ఏంటి? మరి ఊహించని సిలబస్ను చూసి నష్టపోయిన పిల్లలకు ఈ బడ్జెట్లో ఏమైనా ఒరిగిందా అంటే.. అదీ లేదు. డిజిటల్ విద్య ఊసే లేదు. కాకుంటే మరో 15వేల కొత్త స్కూళ్లు, 100 సైనిక్ స్కూళ్లు తెస్తామన్నారు. ఇక.. ఉన్నత విద్య నియంత్రణకొక కమిషన్, లేహ్లో ఓ సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్టీ విద్యార్థుల కోసం 750 ఏకలవ్య స్కూళ్లు ఇలా భవిష్యత్తు బాటలు చాలా ఉన్నాయ్. కానీ కోవిడ్ లాంటి వైరస్లు కోరలు చాస్తే..? తగిన ఆన్లైన్ పాలసీ అవసరమైతే ఉంది!. చదవండి: బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు.. ♦ ఉద్యోగి అయినా... పన్ను మారలేదు పన్ను పోటులో మార్పేమీ లేదు. కాకపోతే కొన్ని చిన్నచిన్న ఊరటలున్నాయ్. రిటర్నులు రీ–ఓపెన్ చేసే కాలాన్ని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే వడ్డీకి టీడీఎస్ ఉండదు. ఇక తక్కువ ధరలో ఇల్లు కొనుక్కున్న వారికి రూ.1.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ ఇచ్చే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. పన్ను వివాద మెకానిజం మరింత సులభం చేశారు. కానీ మధ్య తరగతి ఆశగా చూసే ఆదాయపన్ను శ్లాబుల జోలికి మాత్రం వెSళ్లలేదు. పైగా అగ్రిసెస్సు కారణంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి జేబుకు చిల్లు పడొచ్చనే ∙దిగులు వచ్చి పడింది..! చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు ♦ సీనియర్ సిటిజన్ ఇదేం రకం ఊరటబ్బా? 75 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు టాక్స్ రిటర్న్స్ వేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు తాజా బడ్జెట్లో కల్పించారు. కానీ కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకే ఈ వెసులుబాటని క్లాజ్ పెట్టారు. ఈ ప్రకటనతో వారికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పని తప్పింది కానీ, పన్ను మాత్రం రూపాయి తగ్గలేదు. బ్యాంకులే పెన్షన్లో పన్ను మినహాయించేసుకుంటాయి. మరి దీన్ని ఊరట అనుకోవాలా? అయినా మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. అలాంటప్పుడు 75 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తే ఎందరికి లాభమట? ♦ కార్పొరేట్స్ సూపరో.. సూపర్! కార్పొరేట్ల హ్యాపీ అంతా ఇంతా కాదు. ఆ సంతోషమంతా మార్కెట్లలో చూపించేశారు లెండి. పన్ను పెంచలేదు. పైపెచ్చు డివిడెండ్ మినహాయింపులు, ఇన్ఫ్రా డెట్ఫండ్స్ నిధులు సమీకరించుకునే వీలు, ఎన్ఎఫ్ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సీకి పన్ను ప్రోత్సాహకాలు, టాక్స్ ఆడిట్ టర్నోవర్ పెంపు, జీఎస్టీ ఫైలింగ్ సరళీకరణ, కస్టమ్స్ డ్యూటీ క్రమబద్ధీకరణ, మొబైల్స్, ఐరన్, టెక్స్టైల్స్, కెమికల్స్, బంగారం, వెండి, పునర్వినియోగ ఇంధన వనరుల రంగాలకు తాయిలాలు లాంటివన్నీ నవ్వులు పూయించేవే. ఇక ప్రయివేటీకరణ అంటూ అమ్మకానికి పెట్టిన ఆస్తులన్నీ కొనేది ఎలాగూ వీరే. అందుకే తాజా బడ్జెట్తో మార్కెట్ రయ్యి... మంది. -
వ్యవసాయ రంగానికి రూ. 1,31,531 కోట్లు
రైతు ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల ద్వారా వ్యవసాయానికిచ్చే రుణాల పరిమితిని 10% పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు అయింది. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పలు ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెస్ బంగారం, వెండిలపై 2.5% వరకూ ఉంటే.. మద్యంపై 100% వరకూ ఉంది. ఈ నిధులను మౌలిక సదుపా యాలను అభివృద్ధికి ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ఇచ్చే నిధులను గత ఏడాది (రూ.30వేల కోట్లు) కంటే రూ. పదివేల కోట్లు ఎక్కువ చేయడం, సూక్ష్మ బిందు సేద్యం, మార్కెట్ యార్డుల్లో సదుపాయాలు, అభివృద్ధి నిధుల సాయం అందించడం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన హైలైట్స్గా చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీ: తొలిసారి తన డిజిటల్ బడ్జెట్ను పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల న్నది దేశం మొదటి సంకల్పమని పేర్కొన్నారు. వ్యవ సాయ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పశుపోషణ; డెయిరీ, చేపల పెంపకానికి కూడా తగినన్ని నిధులు రుణాల రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతాయని, పండించిన పంటలను కాపాడుకోవడంతోపాటు, సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని ఈ చర్యలన్నింటి కారణంగా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం సెస్ విధించే సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ విస్తరణ... వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తులు (త్వరగా నశించిపోయేవి)ను చేర్చనున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ–నామ్)లో ఇప్పటికే 1.68 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ–నామ్లకు చేరుస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మబిందు సేద్యానికి ప్రస్తుతమిస్తున్న రూ.5000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఫిషరీస్ రంగం అభివృద్ధికి కోచీ, చెన్నై, విశాఖపట్నం, పరదీప్, పెటువాఘాట్లలోని ప్రధాన ఫిషింగ్ హార్బర్లను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వలస కార్మికుల కోసం... దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించే వన్ నేషన్ వన్ రేషన్ పథకం వల్ల 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 86 శాతం మంది లబ్ధిదారులు లాభం పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అసంఘటిత రంగంలోని కార్మికులు మరీ ముఖ్యంగా వలస కార్మికుల సమాచారం సేకరించేందుకు, తద్వారా వారి కోసం పథకాలను రూపొందిం చేందుకు ఒక పోర్టల్ను రూపొందించనున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత పథకాలను గిగ్, ప్లాట్ఫార్మ్ కార్మికులకూ వర్తింపచేసేందుకు, ఈఎస్ఐ సేవలు అన్ని వర్గాల కార్మికులకు అందేలా చేసేందుకు కనీస వేతనాల్లో మార్పులు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు తగిన రక్షణతో రాత్రి షిఫ్ట్లు పనిచేసేందుకు వీలుగా కూడా చట్టాల్లో మార్పులు తేనున్నట్లు చెప్పారు. స్టాండప్ ఇండియా పథకంలో ఎస్సీఎస్టీ మహిళలకు మార్జిన్ మనీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మద్దతు ధర వితరణ పెరిగింది... పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడుల సేకరణ క్రమేపీ పెరుగుతున్న కారణంగా మద్దతు ధర వితరణ కూడా ఎక్కువైందని, 2013 –14తో పోలిస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి పంటల కోసం రైతులకు ఇచ్చిన మొత్తం పెరిగిందని (బాక్స్ చూడండి) వివరించారు. గోధుమల సేకరణ వల్ల 2020–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా గత ఏడాది ఈ సంఖ్య 35.57 కోట్లేనని వివరించారు. పప్పుధాన్యాల సేకరణ 2013–14 కంటే నలభై రెట్లు పెరిగి 2019–20 నాటికి రూ.10,530 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. సెస్ విధింపు.. సుంకాల తగ్గింపు.. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం కొన్ని ఉత్పత్తులపై సెస్ విధించిన ప్రభుత్వం కొన్నింటి సుంకాలను తగ్గించింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్పై సెస్ వసూలు చేయనున్నప్పటికీ సుంకాల తగ్గింపు కారణంగా ఆ ప్రభావం వినియోగదారులపై పడకపోవచ్చు. ఈ రెండు ఉత్పత్తులపై విధించే ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే.. పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల నుంచే బియ్యం సేక రణ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రుణ వితరణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. పెద్ద పెద్ద రైతులు లబ్ధి పొందుతూంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుం టుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తూంటే అసలు రైతుకు సంస్థాగత రుణాల లభ్యత ఉండటం లేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో హెక్టారుకు రూ.30,000 వరకూ సబ్సిడీలు లభిస్తూంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేలకు మించడం లేదు. ఈ అసమానతలను సరిదిద్దగకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించి నప్పటికీ బడ్జెట్లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసు లేనేలేకపోవడం గమనార్హం. జి.వి.రామాంజినేయులు, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, హైదరాబాద్. 5.6%పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది కంటే 5.6 శాతం ఎక్కువ నిధులు లభించగా ఇందులో సగం మొత్తాన్ని ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021–22 సంవత్సరానికి గాను మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సాగునీటి పథకాలకు గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2020–21 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.1,24,519 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా కేటాయింపుల్లో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించు కుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం వినియోగిస్తారు. పీఎం–కిసాన్ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తారు. మద్దతు ధర వితరణ (రూ. కోట్లలో) ఉత్పత్తి 2013–14 2019–20 2020–21 గోధుమలు 33,874 62,802 75,050 బియ్యం 63,928 1,41,930 172,752 పప్పుధాన్యాలు 236 8,285 10,530 పత్తి 90 - 25,974 వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సెస్ దేనిపై ఎంతంటే(శాతాల్లో) శనగపప్పు 50 శాతం ఆపిల్ పండ్లు 35 శాతం కాబూలీ శనగలు 30 శాతం మసూర్దాల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ 20 శాతం ముడి పామాయిల్ 17.5 శాతం బటానీలు 10 శాతం పత్తి, నిర్దిష్ట ఎరువులు 5 శాతం బంగారం, వెండి కడ్డీలు 2.5 శాతం బొగ్గు,పీట్ లిగ్నైట్ 1.5 శాతం పెట్రోలు రూ.2.5 డీజిల్ రూ.4.0 రైతులతో చర్చలకు సిద్ధం: నిర్మలా న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ఆమె చెప్పారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు బైఠాయించారో మాకు అర్థమయింది. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు రైతులతో చర్చలు జరిపారు. కొత్త సాగు చట్టాలపై అంశాల వారీగా సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇదే విషయం స్పష్టం చేశారు’అని మంత్రి నిర్మల అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు, సందిగ్ధాలను తొలగించుకోవాలని ఆమె రైతులను కోరారు. అనంతరం, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌధరి మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించారు. -
గుడ్న్యూస్: పెట్రోల్, డీజిల్పై భారం లేనట్లే
న్యూఢిల్లీ : లీటర్ పెట్రోల్పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 చొప్పున అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి, నిత్యావసరాల ధరలు మండిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ వాస్తవానికి ప్రజలపై ఈ భారం ఉండదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ(బీఈడీ), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్పై బీఈడీ రూ.2.98 ఉండగా, దీన్ని రూ.1.4కు తగ్గించారు. అలాగే ఎస్ఏఈడీని రూ.12 నుంచి రూ.11కు కుదించారు. అలాగే లీడర్ డీజిల్పై బీఈడీని రూ.4.83 నుంచి రూ.1.8కు, ఎస్ఏఈడీని రూ.9 నుంచి రూ.8కి తగ్గించివేశారు. మొత్తంగా ఎక్సైజ్ పన్ను (బీఈడీ+ఎస్ఏఈడీ+ఏఐడీసీ) లీటర్ పెట్రోల్పై రూ.14.9, లీటర్ డీజిల్పై రూ.13.8 కానుంది. ఇప్పటివరకు ఇది వరుసగా రూ.14.98, రూ.13.83గా ఉంది. అంటే కొత్తగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించినా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. వినియోగదారులపై అదనపు భారం పడబోదు. మద్యం ధరల్లోనూ మార్పు లేదు పెట్రోల్ డీజిల్ తరహాలోనే ఇంపోర్టెడ్ మద్యంపై 100 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ప్రకటించింది. 80 కంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న దిగుమతి చేసుకున్న స్పిరిట్స్, వైన్స్పై ప్రస్తుతం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. దీన్ని రూ.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, ఏఐడీసీ కలిపి 150 శాతం కానుంది. అంటే దిగుమతి చేసుకున్న మద్యంపై ఏఐడీసీ విధించినప్పటికీ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. -
కారిడార్లు కీలకం
న్యూఢిల్లీ : రహదారులు, ఉపరితల రవాణాకు బడ్జెట్లో రూ.1.18 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైవే కారిడార్ల అభివృద్ధిని ప్రాధాన్యత కింద చేపడతామన్నారు. గతేడాది ఉపరితల రవాణాకు రూ.91,823 కోట్లు కేటాయించగా సవరించిన అనంతరం రూ.1.01 లక్షల కోట్లకు చేరుకుంది. ఈసారి రోడ్లు, ఉపరితల రవాణా శాఖకు రూ.1,18,101 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటాయిస్తున్నామని, ఇప్పటివరకు ఇదే అత్యధికమని చెప్పారు. ప్రాధాన్యత కారిడార్లు, ప్రాజెక్టులు 2021 –22లో చురుగ్గా సాగుతాయని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు ఆచరణాత్మకంగా ఉన్నాయని, దేశంలో దీర్ఘకాలం పాటు మౌలిక వసతులను పటిష్టం చేయడంలో ఈ చర్యలు ఉపకరిస్తాయని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కారిడార్లు, రహదారుల నిర్మాణానికి అధిక నిధులు 7టెక్స్టైల్ పార్కులు.. హైవే కారిడార్లు.. భారతమాల పరియోజన పథకం కింద రూ.3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కి.మీ. రహదారుల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటికే 3,800 కి.మీ. మేర పూర్తయింది. 2022 మార్చి నాటికి మరో 8,500 కి.మీ. నిర్మాణం చేపడతారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 11,000 కి.మీ. నేషనల్ హైవే కారిడార్ల నిర్మాణం పూర్తి కానుంది. ఆర్థిక కారిడార్లు.. తమిళనాడులో 3,500 కి.మీ మేర జాతీయ రహదారుల కోసం రూ.1.03 లక్షల కోట్లు n కేరళలో 1,100 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.65,000 కోట్లు n పశ్చిమ బెంగాల్లో 675 కి.మీ. జాతీయ రహదారుల కోసం రూ.25,000 కోట్లు n అసోంలో మూడేళ్లలో 1,300 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.34,000 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.19,000 కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులకు ఇది అదనం. ప్రజా రవాణాకు పెద్దపీట ♦ 27 నగరాల్లో మెట్రో, ఆర్ఆర్టీఎస్ పనులు ♦ ‘మిత్ర’ పథకం కింద 7 టెక్స్టైల్ పార్కులు ♦ దేశంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఫ్లాగ్ షిప్ కారిడార్లు / ఎక్స్ప్రెస్ వేస్.. ♦ ఢిల్లీ – ముంబై ఎక్స్ప్రెస్ వే: మిగిలిన 260 కి.మీ పనులు 2021 మార్చి 31లోగా కేటాయింపు. ♦ బెంగళూరు – చెన్నై ఎక్స్ప్రెస్ వే: 278 కి.మీ. మేర నిర్మాణం, 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ కాన్పూర్ – లక్నో ఎక్స్ప్రెస్ వే: జాతీయ రహదారి 27కి ప్రత్యామ్నాయంగా 63 కి.మీ. మేర ఎక్స్ప్రెస్ వే పనులను 2021––22లో చేపడతారు. ♦ ఢిల్లీ – డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్: 210 కి.మీ పొడవైన ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు 2021––22లో మొదలవుతాయి. ♦ రాయ్పూర్ – విశాఖపట్టణం కారిడార్: చత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా 464 కి.మీ. పొడవైన కారిడార్ నిర్మాణ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే కేటాయిస్తారు. 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ చెన్నై – సేలం కారిడార్: 277 కి.మీ. పొడవైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు 2021–22లో మొదలవుతాయి. ♦ అమృత్సర్ – జామ్నగర్ : 2021–22లో పనులు ప్రారంభమవుతాయి. ♦ ఢిల్లీ – కాట్రా : 2021–22లో నిర్మాణ పనులు ప్రారంభం. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం ♦ కొత్తగా నిర్మాణం చేపట్టే 4, 6 వరుసల రహదారుల్లో అమలు చేస్తారు. ♦ స్పీడ్ రాడార్లు ♦ వేరియబుల్ మెస్సేజ్ బోర్డులు ♦ జీపీఎస్ ఆధారిత రికవరీ వ్యాన్లు మరిన్ని చోట్ల మెట్రో కూత.. ♦ మెట్రో రైల్ నెట్వర్క్ను విస్తరించడం, సిటీ బస్సు సర్వీసులను పెంచడం ద్వారా పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ♦ ప్రజా రవాణాలో బస్సులను ప్రోత్సహించేందుకు కొత్త పథకానికి రూ.18,000 కోట్లు కేటాయించారు. పీపీపీ విధానంలో 20,000కిపైగా బస్సులను నడుపుతారు. ఆటోమొబైల్ పరిశ్రమకు నూతనోత్తేజం కల్పించడం, ఆర్థిక వృద్ధి, యువతకు ఉపాధి లక్ష్యంగా ♦ ప్రస్తుతం 702 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండగా మరో 1,016 కి.మీ మేర మెట్రో, ఆర్ఆర్టీఎస్ నిర్మాణ పనులు 27 నగరాల్లో పురోగతిలో ఉన్నాయి. టైర్ –2 నగరాలు, టైర్ 1 నగరాల బాహ్య ప్రాంతాల్లో మెట్రో అనుభూతిని చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ‘మెట్రో లైట్’ ‘మెట్రో నియో’ పరిజ్ఞానం ఉపకరిస్తుంది. ♦ కోచి మెట్రో రైలు ఫేజ్ –2లో 11.5 కి.మీ. నిర్మాణానికి రూ.1,957.05 కోట్లు ♦ చెన్నై మెట్రో రైలు ఫేజ్ –2లో 118.9 కి.మీ. నిర్మాణానికి రూ.63,246 కోట్లు ♦ బెంగళూరు మెట్రో రైల్వే ప్రాజెక్టు ఫేజ్ 2 ఏ, 2 బీ కింద 58.19 కి.మీ. నిర్మాణానికి రూ.14,788 కోట్లు ♦ నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ –2కి రూ.5,976 కోట్లు ♦ నాసిక్లో మెట్రో రైలు కోసం రూ.2,092 కోట్లు ‘పవర్’ఫుల్ లైన్లు 139 గిగావాట్ల సామర్థ్యంతో 1.41 లక్షల సర్క్యూట్ కి.మీ. పరిధిలో ట్రాన్స్మిషన్ లైన్లు, 2.8 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు సదుపాయం గత ఆరేళ్లలో అందుబాటులోకి. డిస్కంల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు విద్యుత్తు వినియోగదారులు తమకు నచ్చిన సంస్థల సేవలను ఎంచుకునేలా చర్యలు. విద్యుత్తు వ్యవస్థలో సంస్కరణలు, నూతన ఇంధన పంపిణీ విధానం కోసం ఐదేళ్లలో రూ.3,05,984 కోట్లు వ్యయం. 2021–22లో జాతీయ హైడ్రోజన్ ఇంధన విధానం అమలు. పోర్టులు, నౌకాయానం, జల రవాణా ♦ మేజర్ పోర్టుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో రూ.2,000 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు 2021–22లో అమలు కానున్నాయి. ♦ భారతీయ షిప్పింగ్ కంపెనీలకు అంతర్జాతీయ టెండర్లలో ఐదేళ్లలో రూ.1,624 కోట్ల మేర రాయితీలు కల్పించనున్నారు. ♦ 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా అదనంగా 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నారు. మరో కోటి మందికి ‘ఉజ్వల’ ఉజ్వల పథకాన్ని విస్తరించడం ద్వారా మరో కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. రానున్న మూడేళ్లలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరిధిలో మరో వంద జిల్లాలను చేరుస్తారు. గ్రామీణాభివృద్ధికి పథకాలకు ఇలా... ⇒2021–22 కేటాయింపు: రూ.1,31,519 కోట్లు (9.5% పెంపు) ⇒2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు (సవరించిన అంచనా: రూ.1,97,377 కోట్లు) ‘ఉపాధి’కి మరింత దన్ను... ⇒2021–22 కేటాయింపు: రూ. 73,000 కోట్లు (19% పెంపు) ⇒2020–21 కేటాయింపు: రూ. 61,500 కోట్లు (సవరించిన అంచనా: రూ. 1,11,500 కోట్లు) ⇒ 2019–20లో సగటు రోజు కూలీ రూ.182 ఉండగా, దీన్ని 2020–21 ఏప్రిల్ 1 నుంచి 10 శాతం పెంపుతో రూ.200కు చేర్చారు. ⇒ మొత్తం 708 జిల్లాలు, 7,092 బ్లాక్లు, 2,68,561 గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలవుతోంది. ⇒ 2021 జనవరి 29 నాటికి ఈ పథకం కింద 14.82 కోట్ల జాబ్ కార్డులు జారీ కాగా, ఇందులో చురుకైన జాబ్ కార్డుల సంఖ్య 9.25 కోట్లు. 28.72 కోట్ల మంది కార్మికులు జాబితాలో ఉండగా, 14.4 కోట్ల మంది కార్మికులు చురుగ్గా ఉపాధి పొందుతున్నారు. కొనసాగుతున్న విద్యుత్ వెలుగులు.. (దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) ⇒ 2021–22 కేటాయింపు: రూ. 3,600 కోట్లు (20 శాతం తగ్గింపు, కానీ సవరించిన అంచనా ప్రకారం 125 శాతం పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు (సవరించిన అంచనా: రూ.2,000 కోట్లు) ⇒ ఈ పథకానికి నిధులు 2020–21 సవరించిన అంచనా ప్రకారం చూస్తే 125 శాతం ఎగబాకాయి. ⇒ గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్లను అందుబాటులోకి తేవడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు. ⇒ 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ను అందించారు. ⇒ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్కు కేటాయింపులు రూ. 4,000 కోట్ల (సవరించిన అంచనా) నుంచి రూ. 5,300 కోట్లకు పెంచారు. గ్రామీణ రోడ్లు.. రయ్రయ్! ⇒ 2021–22 కేటాయింపు: రూ. 15,000 కోట్లు (30% తగ్గింపు) (9.5% పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ. 19,500 కోట్లు (సవరించిన అంచనా రూ.13,706 కోట్లు) ⇒ 2000 సంవత్సరంలో పీఎంజీఎస్వై పథకం ఆరంభం నుంచి ఇప్పటిదాకా (2021 జనవరి 20 నాటికి) 1,70,034 గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు. ⇒ మొత్తం 7,47,990 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లకు ఆమోదం లభించగా, 6,43,999 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. ⇒ ప్రస్తుత ప్రాజెక్టులను రాష్ట్రాల భాగస్వామ్యంతో పూర్తి చేయాలంటే 2025 నాటికి ఏటా రూ.19,000 కోట్లు అవసరం అవుతాయి. ⇒ 2021–22 కేటాయింపు: రూ. 12,294 కోట్లు (మారలేదు, కానీ సవరించిన అంచనా ప్రకారం 76% పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.12,294 కోట్లు (సవరించిన అంచనా: రూ.7,000 కోట్లు) ⇒ 2019 నాటికి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ⇒ గ్రామీణ ఎస్బీఎం రెండో దశను 2020 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 2024–25 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకు రూ.1.4 లక్షల కోట్లను కేటాయించనున్నారు. ⇒ 2020–21లో (డిసెంబర్ 2020 నాటికి) 41.61 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్డు, 70,929 కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం (మరో 31,560 నిర్మాణంలో ఉన్నాయి) జరిగింది. ఠి పట్టణ ప్రాంతాల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు ఐదేళ్ల పాటు ఎస్బీఎం 2.0 (రెండో ఫేజ్) కోసం రూ.1,41,678 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. డిజిటల్ ఇండియాకు జోష్ (భారత్ నెట్) ⇒ 2021–22 కేటాయింపు: రూ. 7,000 కోట్లు (17 శాతం పెంపు) ⇒ 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు (సవరించిన అంచనా: రూ.5,500 కోట్లు) ⇒ భారత్ నెట్ కింద 2021 జనవరి 15 నాటికి మొత్తం 1.63 లక్షల గ్రామ పంచాయతీలకు 4.87 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు ⇒ ఇందులో 1.51 లక్షల గ్రామ పంచాయతీలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ‘జల్ జీవన్’కు నిధుల వరద... ⇒ 2021–22 కేటాయింపులు: 50,011 కోట్లు (335% పెంపు) ⇒ 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు ⇒ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ను ప్రకటించారు. ⇒ 2024 నాటికి గ్రామీణ కుటుంబాలన్నింటికీ (హర్ ఘర్ జల్) తాగునీటిని (హ్యాండ్ పంపులు, కుళాయిలు ఇతరత్రా మార్గాల్లో) అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.3.6 లక్షలకోట్లను వెచ్చించనున్నారు. ⇒ రాష్ట్రాల సమాచారం ప్రకారం 2020–21 ఏడాదిలో (2020 డిసెంబర్ నాటికి) 2.14 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ⇒ ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ పథకం కింద కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు దీనికి రూ.1.87 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తాజా బడ్జెట్లో ప్రకటించింది. సొంతింటి సాకారం దిశగా... ⇒ 2021–22 కేటాయింపులు: రూ. 19,500 కోట్లు (మారలేదు) ⇒ 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు ⇒ 2019 నాటికి గ్రామాల్లో కోటి పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. 2022 నాటికి మరో 1.95 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ⇒ పట్టణాల్లో పీఎంఏవై కోసం ఈ ఏడాది 2020–21లో బడ్జెట్ అంచనాలకు (రూ.8,000 కోట్లు) మూడింతలు (సవరించిన రూ.21,000 కోట్లు) కేటాయింపులు జరపడం విశేషం. ⇒ 1.09 కోట్ల ఇళ్లకు అనుమతులు లభించగా, ఇప్పటిదాకా 70 లక్షల ఇళ్ల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. 41 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. -
బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు..
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ అవసరాల దృష్ట్యా భారీ రక్షణ బడ్జెట్పై ఊహాగానాలు కొనసాగాయి. కానీ గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరుగుదలతో రూ.4.78 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. అయితే మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడంతో పాటు, భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దులను రక్షిస్తున్న సాయుధ బలగాలకు కూడా ఎక్కువ కేటాయింపులే లభించాయి. మరోవైపు తూర్పు లడాఖ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మిలటరీ అవసరాల కొనుగోలు కోసం గత బడ్జెట్ మూలధన వ్యయం కింద రూ.20,776 కోట్లు అదనంగానే సాయుధ బలగాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తే మాత్రం 2020–21 బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,13,734 కోట్లు కేటాయించగా సవరించిన మూలధన వ్యయం రూ.1,34,510 కోట్లుగా నమోదయ్యింది. చైనాతో గొడవ నేపథ్యంలో భారత సైన్యం గత కొన్ని నెలల్లో పలు దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు కొనుగోలు చేసింది. రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు. గత ఏడాది మూలధన వ్యయం రూ.1,13,734 కోట్లతో పోల్చుకుంటే ఇది 18.75 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రూ.1.15 లక్షల కోట్లు పెన్షన్లకు కేటాయించారు. గత ఏడాది (రూ.1.33 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2020–21లో సుమారు రూ.18 వేల కోట్ల పెన్షన్ బకాయిలు చెల్లించడమే ఇందుకు కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. పెన్షన్ను మినహాయిస్తే జీతాల చెల్లింపులు, ఆస్తుల నిర్వహణ వంటి రెవెన్యూ ఖర్చు రూ.2.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆర్మీకి మూలధన వ్యయం కింద రూ.36,481 కోట్లు, నౌకా దళానికి రూ.33,253 కోట్లు, వైమానిక దళానికి రూ.53,214 కోట్లు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసిన దానికంటే రూ.1,841 కోట్లు తక్కువ) కేటాయించారు. గత ఏడాది ఆర్మీకి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు కేటాయించారు. వైమానిక దళ గత ఏడాది మూలధన వ్యయం రూ.43,281.91 కోట్లు కాగా సవరించిన అంచనా రూ.55,055 కోట్లుగా నమోదయ్యింది. సాయుధ బలగాలకు అదనంగా నిధులు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేటాయింపు పెంచారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆర్థికమంత్రి రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపు రూ.92,848.91 కోట్లతో పోల్చుకుంటే ఇది 7.1 శాతం ఎక్కువ. రాజ్నాథ్ కృతజ్ఞతలు రక్షణ బడ్జెట్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కృతజ్ఞతలు తెలి పారు. మూలధన వ్యయంలో దాదాపు 19% పెరుగుదల గత 15 ఏళ్లలో అత్యధికమని పేర్కొన్నారు. కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు తెరిచే ప్రతిపాదనపై రాజ్నాథ్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. సంతృప్తికర బడ్జెట్ కరోనా విపత్తు నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రక్షణ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి. మూలధన వ్యయం రూ.22 వేల కోట్లు పెరగడం ఆహ్వానించతగ్గ పరిణామం. సైన్యం ఆధునీకరణ కసరత్తును కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుంది. – డాక్టర్ లక్ష్మణ్ బెహెరా, ప్రముఖ రక్షణ నిపుణుడు -
బడ్జెట్: ఈ విషయాలు మీకు తెలుసా!
న్యూఢిల్లీ : బడ్జెట్ రోజున ఆర్థ్ధిక మంత్రి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ముందు ఒక లెదర్ బ్రీఫ్కేస్ పట్టుకుని ప్రెస్ ముందుకు వచ్చి ఫొటోలు దిగడం ఒక ఆనవాయితీ. దానికి ఓ కారణం లేకపోలేదు. అదేమిటంటే.. 1869లో బ్రిటిష్ కామన్స్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన జార్జి వార్డ్ హంట్కు సభాధ్యక్షుడి నుంచి అనుమతి రాగానే లేచి తనతో తెచ్చుకున్న బాక్స్ను తెరిచి చూసి ఒక్కసారే అవాక్కయ్యాడు. బడ్జెట్ ప్రసంగం ఉన్న పేపర్లను ఇంట్లోనే మర్చిపోయినట్లు గ్రహించాడు. అప్పటికేదో మేనేజ్ చేశాడు. అయితే అప్పటినుంచి మాత్రం ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సభకు వచ్చేముందు తనవెంట పత్రాలన్నీ తెచ్చుకున్నానని, ఇంట్లో ఏవీ మర్చిపోలేదని పార్లమెంట్ వద్ద గుమికూడిన జనానికి తెలియజేస్తూ బాక్స్ను చూపించి లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు. అదే ఓ సంప్రదాయంగా మారింది. దాంతో మన దగ్గరా దాన్నే ఫాలో అయిపోతున్నారు. చదవండి: ఎన్నికలు: ఆ రాష్ట్రాలకు వరాలపై జల్లు బ్రిటిష్ వారు పాలించేటప్పుడు మనదేశ బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశ పెట్టేవారు. ఎందుకంటే.. మన దేశ కాలమానానికి బ్రిటిష్ కాలమానానికి ఐదున్నర గంటల తేడా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ వివరాలను మరునాడు ఉదయాన్నే బ్రిటన్కు చేరవేయడానికి వీలుగా వారు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అయితే, స్వాతంత్య్రం వచ్చాక కూడా 1999–2000 సంవత్సరం బడ్జెట్కు ముందువరకు మనం కూడా సంప్రదాయాన్ని కొనసాగించాం.. ఏ ఆర్థిక సంవత్సరమైనా ► ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి చివర్లోనే ఎందుకు ముగుస్తుంది? పూర్వం ఆర్థిక సంవత్సరం జూలై 1 నుంచి జూన్ నెలాఖరు వరకు ఉండేది. కొన్నాళ్లు జనవరి నుంచి డిసెంబరు వరకు కూడా ఉండేది. ► స్వాతంత్య్రానంతరం ఆర్థిక సంవత్సరంగా దేన్ని నిర్ణయించాలన్న అంశంపై కమిటీ కూడా వేశారు. చాలా దేశాల్లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే మొదలవుతుంది. దాంతో మనం కూడా ఇదే ఆర్థికసంవత్సరాన్ని కొనసాగించడం వల్ల ఇబ్బందులేవీ తలెత్తకపోవడంతో అప్పట్నుంచి దీన్నే అనుసరిస్తున్నాం. ► 1950–51 బడ్జెట్కు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే ఈ బడ్జెట్లోనే తొలిసారిగా మిగులు సాధించారు. ఏ విధమైన పన్నులూ పెంచలేదు. ఆర్థికవ్యవస్థపై శ్వేతపత్రాన్ని తొలిసారి విడుదల చేశారు. -
బడ్జెట్ 2021: పదేళ్ల మెగా ప్రణాళిక
న్యూఢిల్లీ: కరోనా అన్ని రవాణా వ్యవస్థలతో పాటు భారతీయ రైల్వేపైనా పెను ప్రభావం చూపించింది. కొన్ని నెలల పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,10,055 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. ‘రికార్డు’బడ్జెట్గా అభివర్ణించినా 2020–21 సవరించిన బడ్జెట్ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే. మరోవైపు 2030 కల్లా భవిష్యత్ అవసరాలకు తగిన (ఫ్యూచర్ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్సీ) ప్రారంభించాలని నిర్ణయించారు. ఈడీఎఫ్సీలో భాగంగా 2021–22లో సోన్నగర్–గోమోహ్ సెక్షన్ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్–డాంకుని సెక్షన్ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్ను, భూసావాల్ – ఖరగ్పూర్ – డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్ను చేపడతారు. ⇔ 2022 జూన్కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు ⇔ భవిష్యత్తులో ఖరగ్పూర్ – విజయవాడ ఈస్ట్ కోస్ట్ కారిడార్, ఇటార్సీ – విజయవాడ నార్త్ సౌత్ కారిడార్, భూసావాల్–ఖరగ్పూర్–డాంకుని ఈస్ట్ వెస్ట్ కారిడార్లు ⇔ 2023 కల్లా బ్రాడ్గేజ్ రూట్ల 100 శాతం విద్యుదీకరణ ⇔ రైళ్ల ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్ రైలు భద్రత విధానం 2020 అక్టోబర్ 1 నాటికి 41,548 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)గా ఉన్న బ్రాడ్ గేజ్ రూట్ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్ కిలోమీటర్లకు (72%)చేరుకుంటుంది. 2023 కల్లా 100% విద్యుద్దీకరణ పూర్తవుతుంది. పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన విస్టా డోమ్ ఎల్హెచ్బీ రైల్వే కోచ్లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్ చేసిన ఆటోమేటిక్ వ్యవస్థను అన్ని ప్రధానమైన రూట్లలో ప్రవేశపెడతాం..’అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి మెట్రో రైళ్ల విస్తరణలో భాగంగా చెన్నై మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.63,246 కోట్ల కేంద్ర నిధులు కేటాయించారు. బెంగళూరు మెట్రో రైల్వే ఫేజ్ 2ఏ, 2బీ కోసం రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం 1,957.05 కోట్లు, నాగ్పూర్ మెట్రో రైల్వే ఫేజ్–2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్ మెట్రో కోసం రూ.2,092 కోట్లు ప్రకటించారు. సోమవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసిన రైల్వేని ఆర్థికమంత్రి అభినందించారు. ఇది పూర్తిగా భిన్నమైన, పరివర్తనతో కూడిన బడ్జెట్గా రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ అభివర్ణించారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీకి 20 శాతం అధికం
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక శాఖకు కేంద్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో రూ.14,793.66 కోట్లు కేటాయించింది. 2020–21 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషం. అలా గే ఎర్త్ సైన్సెస్ శాఖకు ప్రత్యేకంగా రూ.1,897.13 కోట్లు కేటాయించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డీఎస్ఐఆర్) ఉన్నాయి. దే శంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ విభాగాలన్నీ కీలకంగా పనిచేశాయి. 2021–22 బడ్జెట్లో డీఎస్టీకి రూ.6,067.39 కోట్లు, డీబీటీకి రూ.3,502.37 కోట్లు, డీఎస్ఐఆర్కు రూ.5,224.27 కోట్లు కేటాయించారు. 2020–21 బడ్జెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.14,473.66 కోట్లు కేటాయించగా, తర్వాత దాన్ని రూ.11,551.86 కోట్లుగా సవరించారు. ఇండియాలో ‘డీప్ ఓషన్ మిషన్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ఐదేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సముద్రాలపై అధ్యయనం, సర్వే, సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2021-22 రూ.14,793.66 2020-21 రూ.11,551.86 అంతరిక్ష విభాగానికి రూ.13,949 కోట్లు అంతరిక్ష విభాగానికి కేంద్రం రూ.13,949 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది గతేడాది రూ.8,228 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.4,449 కోట్లు ఎక్కువ కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంలో రూ.700 కోట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’కు కేటాయించారు. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా నలుగురు మానవులను అంతరిక్షంలోకి పంపడానికి రష్యాలోని జెనెరిక్ స్పేస్ ఫ్లయిట్ ఆస్పెక్ట్లో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిసెంబర్ 2021లో మానవరహిత అంతరిక్ష నౌకను పరీక్షిస్తామని వెల్లడించారు. హోం శాఖకు రూ.1,66,547 కోట్లు కేంద్ర హోంశాఖకు 2021–22 బడ్జెట్లో రూ. 1,66,547 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11.48 శాతం అధికం. ఇందులో మెజారిటీ నిధులు కేంద్ర సాయుధ బలగాల నిర్వహణకు, జనగణనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించనున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో హోం శాఖకు రూ.1,49,387 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.1,66,547 కోట్లకు పెంచారు. ఇం దులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లకు రూ.1,03,802.52 కోట్లు, జనాభా లెక్కలకు రూ.3,768.28 కోట్లు కేటాయించారు. -
ఎన్నికలు: ఆ రాష్ట్రాలపై వరాల జల్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అత్యంత ప్రాముఖ్యత నిచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలలో మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడుల్లో అధికారంలోకి రావడం, అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం దిశగా ఈ కేటాయింపులు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 25 వేల కోట్లను నిర్మల కేటాయించారు. ఈ నిధులతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇది కోల్కతా–సిలిగురి హైవే పునరాభివృద్ధి కోసం అంటూ ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా బల్లలు చరుస్తూ స్వాగతించారు. ఉత్తర బెంగాల్లోని 54 అసెంబ్లీ సీట్లలో 50 గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఈ కేటాయింపులు చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: మౌలిక ప్రాజెక్టులకు ‘మానిటైజేషన్’ ఊతం కేరళకు భారీగా నిధులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేరళలో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తున్న దిశగా.. ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించారు. రూ. 65 వేల కోట్లను రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తూ ఈ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిధులతో 1,100 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. కొచ్చి మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా 11.5 కిలోమీటర్ల ట్రాక్ను ఏర్పాటు చేయడానికి రూ. 1,957.05 కోట్లను కేటాయించారు. ముంబై, కన్యాకుమారి ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా కేరళలో రూ. 50 వేల కోట్లతో 650 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గత అక్టోబర్లో కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. కేరళ అభివృద్ధికి జీవనరేఖగా పేర్కొంటున్న ఈ కారిడార్లో కొల్లం, ఎర్నాకులం, కన్నూర్, తలసేరి, కోజికోడ్, కాసర్గాడ్, త్రివేండ్రం వంటి ప్రముఖ పట్టణాలు ఉన్నాయి. చదవండి: కొంచెం ఖేదం.. కొంచెం మోదం తమిళనాడుకు లక్ష కోట్లు.. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడుపై కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. 3,500 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ. 1.03 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో మధురై–కొల్లం ఆర్థిక కారిడార్ నిర్మాణం కూడా ఉంటుంది. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం ఫిషరీస్ హబ్తో పాటు వివిధ ఉపయోగాలు ఉండే సముద్ర కలుపు పార్క్ను కూడా ఈ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న సముద్ర కలుపు సేద్యంతో తీర ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి’’అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. సముద్ర కలుపు పెంపకం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకంలో భాగంగా రూ. 637 కోట్లు కేటాయించారు. మరోపక్క చెన్నై మెట్రో ప్రాజెక్టుకు రూ. 1,957 కోట్లు ప్రకటించారు. అసోంలో మరోసారి అధికారానికి.. పౌరసత్వ సవరణ చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకిస్తున్న అసోంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంది. ప్రస్తుత బడ్జెట్లో ఆ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 3,400 కోట్లు కేటాయించారు. నిర్మల మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రూ. 19 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే మూడేళ్లలో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, రోడ్లు, బ్రిడ్జీల అభివృద్ధికి తమ శాఖ రూ.80 వేల కోట్లు కేటాయించిందని గత అక్టోబర్లో అసోంలో పర్యటించిన సందర్భంగా నితిన్ గడ్కరీ వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని హైవే నిర్మాణం, ద్వీపంలా ఉండే ప్రాంతం మజూలీ నుంచి జోర్హాట్ జిల్లాను కలిపే బ్రిడ్జి నిర్మాణం ప్రాజెక్టులను ఇప్పటికే ప్రకటించారు. పోచంపల్లి చీరలో మెరిసిన నిర్మల చేనేత వస్త్రాలపై తన మమకారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రదర్శించారు. ఎరుపు, తెలుపు చీరకు పచ్చటి అంచు ఉన్న పోచంపల్లి సిల్క్ చీరలో పార్లమెంట్కు హాజరై అందర్నీ ఆకట్టుకున్నారు. పోచంపల్లి ఇక్కత్గా పిలిచే ఇలాంటి చీరలను తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో నేస్తారు. ఇలాంటి చీరలను 1970లలో నేసేవారమని పోచంపల్లి.కామ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ చీరలను కాటన్, సిల్క్లతో నేస్తారని తెలిపారు. కాగా, బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల ధరించిన చీర కూడా వార్తల్లోకి ఎక్కింది. లాల్పాడ్గా పిలిచే ఈ చీరను పశ్చిమ బెంగాల్లో పూజా కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తారు. సగం తెలుపు, సగం ఎరుపు రంగులు ఉన్న ఇలాంటి చీరలను దుర్గా పూజ, సింధూర్ ఖేలా లాంటి కార్యక్రమాల్లో ధరిస్తారు. -
మౌలిక ప్రాజెక్టులకు ‘మానిటైజేషన్’ ఊతం
న్యూఢిల్లీ: ప్రస్తుత మౌలిక సదుపాయాల అసెట్స్ను విక్రయించడం లేదా లీజుకివ్వడం వంటి మార్గాల ద్వారా సమీకరించే నిధులను (మానిటైజేషన్) కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టులకు వెచ్చించే విధంగా కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ‘కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులు సమీకరించుకునేందుకు ఇదొక ముఖ్యమైన మార్గం‘ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అసెట్ మానిటైజేషన్ ప్రక్రియ పురోగతి గురించి ఇన్వెస్టర్లకు పూర్తి సమాచారం ఉండేలా డ్యాష్బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశీ, అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), పవర్గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) చెరో ఇన్విట్ను (ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. దాదాపు రూ. 5,000 కోట్ల విలువ చేసే అయిదు రహదారులను ఎన్హెచ్ఏఐ ఇన్విట్కు, రూ. 7,000 కోట్లు విలువ చేసే ట్రాన్స్మిషన్ అసెట్స్ను పీజీసీఐఎల్ ఇన్విట్కు ప్రభుత్వం బదలాయించనున్నట్లు వివరించారు. 2019లో 6,835 ప్రాజెక్టులతో ప్రకటించిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ) పరిధిని ప్రస్తుతం 7,400 ప్రాజెక్టులకు పెంచామని మంత్రి తెలిపారు. 2020–25 మధ్య కాలంలో వీటికి దాదాపు రూ. 111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా. అసెట్స్ మానిటైజేషన్, కేంద్ర.. రాష్ట్రాల బడ్జెట్లో పెట్టుబడి వ్యయాలను పెంచడం తదితర మార్గాల ద్వారా ఇన్ఫ్రాకు మరింత ఊతమిస్తామని పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగ ఆర్థిక అవసరాల కోసం రూ. 20,000 కోట్లతో డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ) ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ వివరించారు. వచ్చే మూడేళ్లలో డీఎఫ్ఐ రుణాల పోర్ట్ఫోలియో సుమారు రూ. 5 లక్షల కోట్లకు చేరగలదని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. రీట్స్లోకి ఎఫ్పీఐలు.. దేశీయంగా ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ రంగాలకు నిధుల లభ్యతను మరింతగా పెంచే దిశగా కూడా కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్), ఇన్విట్స్కు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట చట్టాల్లో ఇందుకు సంబంధించిన సవరణలను చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. డివిడెండ్ ఆదాయంపై పన్నులకు సంబంధించి తక్కువ రేటును కూడా వర్తింపచేసేలా ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించారు. -
చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పన్ను పెరిగిన స్థాయిలోనే మొబైల్స్ ధరలూ అధికం కానున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బడ్జెట్ ఫోన్లను అతి తక్కువ లాభాలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. పన్ను భారాన్ని మోసే స్థాయిలో వీటి తయారీ కంపెనీలు లేవు. దీంతో అంతిమంగా కస్టమర్పైనే భారం పడనుంది. అయితే కంపెనీలు చార్జర్లు లేకుండానే మొబైల్స్ను విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు ఎంపిక చేసిన మోడళ్లపై ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి కూడా అని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. దేశీయంగా చాలా సంస్థలు చార్జర్లను స్థానికంగా తయారు చేస్తున్నాయి. స్వల్పంగా ధరలు అధికమైనప్పటికీ మొబైల్స్ అమ్మకాలు తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రతిపాదనలకు వ్యతిరేకంగా.. మొబైల్స్ విడిభాగాలు, చార్జర్ల తయారీకి కావాల్సిన కొన్ని పరికరాలపై సుంకం విధించడాన్ని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు. మొబైల్ ఫోన్ల రేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. మొబైల్స్లో వాడే కొన్ని విడిభాగాలు, చార్జర్ల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలపై 2.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే మదర్బోర్డ్గా పిలిచే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ), కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్స్, వైర్డ్ హెడ్ సెట్స్, యూఎస్బీ కేబుల్, మైక్రోఫోన్, రిసీవర్లపైనా 2.5% కస్టమ్స్ డ్యూటీ విధించారు. మొబైల్ చార్జర్లపై ఏకంగా 10% దిగుమతి సుంకం ప్రకటించారు. చార్జర్/అడాప్టర్ల తయారీకి ఉపయోగించే మౌల్డెడ్ ప్లాస్టిక్ ముడి పదార్థాలు, విడిభాగాలపై 10% సుంకం వసూలు చేయనున్నారు. చార్జర్ల పీసీబీఏ ముడిపదార్థాలు, విడిభాగాలపై సుంకం 10% అధికమైంది. పెంచిన సుంకం.. చార్జర్లు, మొబైల్ ఫోన్ విడిభాగాలపై ఫిబ్రవరి 2 నుంచి, మిగిలినవాటిపై ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. -
బీమాపై ‘విదేశీ’ ముద్ర
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) 74 శాతానికి పెంచే ప్రతిపాదనను బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. మన దేశంలో బీమా ఉత్పత్తుల విస్తరణ ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కాకపోతే ఎఫ్డీఐ పెంపు అనంతరం కూడా బీమా కంపెనీల బోర్డుల్లో మెజారిటీ డైరెక్టర్లు, యాజమాన్యంలో కీలకమైన వ్యక్తులు అందరూ భారతీయులే ఉండాలన్న ‘కంపెనీ నిర్మాణాన్ని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. బీమా చట్టం 1938ను సవరించడం ద్వారా బీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పరిమితిని ప్రస్తుత 49% నుంచి 74%కి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. తగిన రక్షణలతో విదేశీ యాజమాన్యాన్ని, నిర్వహణను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని చివరిగా 2015లో అప్పటి వరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం జరిగింది. మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తుల వ్యాప్తి జీడీపీలో 3.6 శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోలిస్తే తక్కువలో ఉండడం గమనార్హం. అదే సాధారణ బీమా విషయంలో ప్రపంచ సగటు 2.88 శాతం అయితే, మన దేశంలో మాత్రం వ్యాప్తి 0.94 శాతంగానే ఉంది. -
6న దేశవ్యాప్త చక్కా జామ్
న్యూఢిల్లీ/నోయిడా: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ను బంద్ చేయడం, రైతులపై అధికారుల వేధింపులకు నిరసనగా ఈ నెల 6వ తేదీన చక్కా జామ్(రహదారుల దిగ్బంధనం) చేపడతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను మూడు గంటలపాటు.. 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు అడ్డుకుంటామన్నారు. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రైతులకు నీరు, కరెంటు అందకుండా చేస్తోందని నేతలు ఆరోపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో రైతులను పట్టించుకోలేదనీ, సాగు రంగానికి కేటాయింపులను తగ్గించి వేసిందని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. ‘సంయుక్త కిసాన్ మోర్చా’, ‘ట్రాక్టర్2ట్విట్టర్’ అనే ట్విట్టర్ అకౌంట్లను ప్రభుత్వం మూసి వేయించిందన్నారు. బిజ్నోర్లో మహాపంచాయత్ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో రైతుల మహాపంచాయత్ జరిగింది. సోమవారం స్థానిక ఐటీఐ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజ్నోర్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పంచాయత్కు ఆ ప్రాంత రైతు నేతలు కూడా హాజరయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతుగా ఇప్పటికే ముజఫర్నగర్, మథుర, భాగ్పట్ జిల్లాల్లో మహాపంచాయత్లు నిర్వహించారు. సింఘు వద్ద కాంక్రీట్ గోడ ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేపడుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసనలు కొనసాగుతున్న సింఘు వద్ద హైవేపై రెండు వరుసల సిమెంట్ బారియర్ల మధ్యన ఇనుపరాడ్లను అమర్చి, కాంక్రీట్తో నింపుతోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు పలు వరుసల బారికేడ్లను నిర్మించారు. బారికేడ్లతోపాటు ఆందోళనకారులు హద్దులు దాటి రాకుండా ముళ్లకంచెను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లో తాత్కాలిక సిమెంట్ గోడను నిర్మించి, రహదారిని పాక్షికంగా మూసివేశారు. ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జనవరి 26వ తేదీన నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. హైవేకు కొద్ది దూరంలో ఉన్న ఓ వీధి వద్ద చిన్న కందకం కూడా తవ్వారు. రహదారికి రెండు వైపులా సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళనకు యూపీ, హరియాణా, రాజస్తాన్ నుంచి రైతుల మద్దతు పెరుగుతుండటంతో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సింఘు, ఘాజీపూర్, టిక్రిల వద్ద ఇంటర్నెట్ సేవలపై విధించిన సస్పెన్షన్ను మంగళవారం రాత్రి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. వీటితోపాటు రైతులు నిరసన తెలుపుతున్న మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ సస్పెన్షన్ జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరించింది. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికం సర్వీసెస్ నిబంధనలు–2017 ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది. -
పీఎస్యూ ఫర్ సేల్...!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 2.10 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రతిపాదనలు రూ. 35,000 కోట్లు తక్కువకావడం గమనార్హం! అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు) వాటా విక్రయంపై కోవిడ్–19 ప్రతికూల ప్రభావం చూపడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ అంచనాలను తాజాగా రూ. 32,000 కోట్లమేర తగ్గించింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ సీపీఎస్ఈలలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 19,499 కోట్లు మాత్రమే సమీకరించింది. రూ. లక్ష కోట్లు: వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ బాటలో సీపీఎస్ఈల డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మరో రూ. 75,000 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈసారి డిజిన్వెస్ట్మెంట్ వ్యూహంలో భాగంగా నాలుగు రంగాలను ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అణు ఇంధనం(ఆటమిక్ ఎనర్జీ), అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్లను ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను నామమాత్రం చేయనున్నారు. ఈ రంగాలలో మిగిలిన సీపీఎస్ఈలను ప్రయివేటైజ్ చేయడం లేదా విలీనం లేదా అనుబంధ సంస్థలుగా మార్చడం వంటి అంశాలకు తెరతీయనున్నారు. ఇలాకాకుంటే వీటిని మూసివేస్తారు. వచ్చే ఏడాదిలో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ తదితరాల డిజిన్వెస్ట్మెంట్ను పూర్తి చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ సహా మరో రెండు పీఎస్యూ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పీఎస్యూలలో డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్తుల విక్రయయానికి ప్రత్యేక కంపెనీ... వినియోగంలోలేని ఆస్తులు ఆత్మనిర్భర్ భారత్కు సహకరించవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కీలకంకాని ఆస్తుల జాబితాలో ప్రభుత్వ శాఖలు, పీఎస్యూల వద్ద గల మిగులు భూములు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. వీటి ప్రత్యక్ష విక్రయం లేదా ఇతర విధానాలలో మానిటైజేషన్కు వీలుగా ఒక ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)ను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ లిస్టింగ్కు సై రూ. 8–10 లక్షల కోట్ల మార్కెట్ విలువ అంచనా వచ్చే ఏడాది(2021–22)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బాటలో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తాజాగా ఆర్థిక మంత్రి తెలియజేశారు. జీవిత బీమా బ్లూచిప్ కంపెనీ ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే రూ. 8–10 లక్షల మార్కెట్ విలువను సాధించగలదని విశ్లేషకుల అంచనా. తద్వారా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
మార్కెట్కు వ్యాక్సిన్..!
వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో సూచీలు ఉదయం లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 46,618 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల పెరుగదలతో 13,759 వద్ద మొదలయ్యాయి. ఆరురోజుల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో సూచీలు ముందడుగు వేసేందుకే మొగ్గుచూపాయి. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాలు ఒక్కొక్కటి మార్కెట్ను మెప్పిస్తుండటంతో సూచీల జోరు మరింత పెరిగింది. బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వృద్ధికి ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఒక్క ఫార్మా తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 2478 పాయింట్లు పెరిగి 48,764 వద్ద, నిఫ్టీ 702 పాయింట్ల లాభంతో 14,336 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తుదిదాకా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో చివరికి సెన్సెక్స్ 2,315 పాయింట్లు పెరిగి 48,601 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281 వద్ద ముగిసింది. గతేడాది ఏప్రిల్ 7 తర్వాత సూచీలకిది ఒకరోజులో అతిపెద్ద లాభం కావడం విశేషం. సూచీల భారీ లాభార్జనతో గత ఆరు రోజుల్లో కోల్పోయిన మొత్తం నష్టాల్లో 60 శాతాన్ని తిరిగిపొందాయి. లాభాలే.. లాభాలు.. సీతమ్మ పద్దును స్టాక్ మార్కెట్ స్వాగతించడంతో బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు లాభాల వర్షంలో తడిసి ముద్దయ్యారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులో రూ.6.34 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. తద్వారా బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్క్యాప్ రూ.192.46 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రంగాల షేర్లు ఎందుకు దూసుకెళ్లాయంటే... ► బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీతో పాటు, ఆస్తుల నిర్వహణ కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ.22 వేల కోట్ల రీ–క్యాపిటలైజేషన్ను ప్రకటించారు. ఫలితంగా ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు షేర్లు 15 శాతం నుంచి 11 శాతం లాభపడ్డాయి. ఆర్బీఎల్, యాక్సిస్, పీఎన్బీ, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 6 నుంచి 11 శాతం ర్యాలీ చేశాయి. ► జీవిత బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతం 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ఈ రంగానికి చెందిన షేర్లు 12 శాతం నుంచి 4 శాతం లాభపడ్డాయి. ► కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ.1.80 లక్ష కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు ప్రకటించడంతో మౌలిక సదుపాయ రంగ కంపెనీలైన ఎన్సీసీ లిమిటెడ్, అశోకా బిల్డ్కాన్, కేఎన్ఆర్ కన్స్ట్రక్చన్స్, దిలీప్ బిల్డ్కాన్ షేర్లు 14 శాతం నుంచి 5 శాతం లాభపడ్డాయి. ► కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామనే ప్రకటనతో ఆటో షేర్ల ర్యాలీ కొనసాగింది. కొత్త వాహనాలకు గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఆశలతో వాహన రంగ షేర్లు 10 శాతం వరకు లాభపడ్డాయి. వచ్చేది ‘నెవర్ బిఫోర్ బడ్జెట్’ అంటూ ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్కు మాత్రం బూస్టర్ డోస్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్ – 2021కు దలాల్ స్ట్రీట్ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఎన్పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు మార్కెట్ను ఆకట్టుకున్నాయి. కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్లో లేకపోవడం మార్కెట్కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్ల కంటే అత్యధికంగా మార్కెట్ను ఆకట్టుకున్న బడ్జెట్ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్ బడ్జెట్’ రోజున స్టాక్ మార్కెట్ 6% ర్యాలీ చేసింది. 24 ఏళ్ల తరువాత సీతారామన్ తాజా బడ్జెట్ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్ 5% ఎగసింది. భారత ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి పెంచేందుకు కేంద్ర బడ్జెట్ పునాది వేసింది. మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణాన్ని మరింత పరిపూర్ణం చేయనుంది. పీఎస్యూ బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్తో దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో స్థిరత్వం కోవిడ్ ఆర్థిక వృద్ధికి, ఈక్విటీ మార్కెట్లకు కలిసొస్తుంది. – విజయ్ చందోక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ బడ్జెట్ స్వరూపం వృద్ధి ప్రాధాన్యతను కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ, ఆటో స్క్రాపేజీ పాలసీ, అసెట్ మోనిటైజేషన్ అంశాలు మార్కెట్కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 5న వెలువడే ఆర్బీఐ పాలసీ విధాన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. – నీలేశ్ షా, కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్మెంట్ ఎండీ -
రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. ఎంపీలు మిథున్రెడ్డి, బాలశౌరి, రెడ్డెప్ప, నందిగం సురేష్, కృష్ణదేవరాయలు, తలారి రంగయ్య, బి.సత్యవతి, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, వంగా గీత, ఎంవీవీ సత్యనారాయణ, ఆదాల ప్రభాకర్రెడ్డి, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘త్వరలో ఎన్నికల జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేలా బడ్జెట్ ఉంది. విజయవాడ, విశాఖ మెట్రోల గురించి పట్టించుకోలేదు. పోలవరం విషయంలోనూ అంతే. ఖరగ్పూర్–విజయవాడ, ఇటార్సి–విజయవాడ కారిడార్లవల్ల ఏపీకి ఉపయోగం ఉండదు. హోదాపై నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదని తెలుస్తోంది. వైరాలజీ కేంద్రాల్లో ఒకటి ఏపీకి కేటాయించాలని, కొత్త టైక్స్టైల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని, అరకు–విశాఖ విస్టాడోమ్ కోచ్లు మరిన్ని ఇవ్వాలని డిమాండు చేస్తున్నాం. త్వరలో సీఎం జగన్ 26 జిల్లాలు ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లాకొక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీ సివిల్ సప్లయి కార్పొరేషన్కు ఇవ్వాల్సిన రూ.4,282 కోట్లు వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్స్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తే కేంద్రం బడ్జెట్లో విశాఖపట్నం ఒక్కటే ప్రస్తావించింది. ’ అని విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా గత ఏడాది రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చినట్లే ఈ ఏడాది కూడా తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం’ అని మిథున్ తెలిపారు. -
ప్రత్యేక కేటాయింపుల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాల వారీగా, మౌలిక సదుపాయాల రూపేణ భారీ నష్టం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని, అయినా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్కు వివరించారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదన్నారు. వివిధ రంగాలకు అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని.. ఆహారం, పెట్రోల్, ఫెర్టిలైజర్స్ సబ్సిడీలను కూడా తగ్గించారని నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకు రావడానికి అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. -
కొంచెం ఖేదం.. కొంచెం మోదం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం వర్సిటీ మినహా, విభజన హామీలకు సంబంధించి కేంద్ర తాజా బడ్జెట్లో పెద్దగా ప్రస్తావన లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వర్సిటీకి రూ. 60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ)కి రూ.95 కోట్లు కేటాయించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థలకు విద్యా సంస్థల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐఎస్ఈఆర్లకు రూ.946 కోట్లు కేటాయించింది. ఐఐఎంలకు రూ.476 కోట్లు, ఎన్ఐటీలు–ఐఐఈఎస్టీలకు రూ.3,935 కోట్లు, ఐఐటీలకు రూ.7,536 కోట్లు కేటాయించింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల ప్రస్తావన లేదు. దేశ వ్యాప్తంగా కొచ్చి మెట్రో రైల్ నెట్వర్క్, చెన్నై మెట్రో రైల్ నెట్వర్క్, బెంగళూరు, నాగ్పూర్, నాసిక్ మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. రాజధాని నిధుల గ్రాంట్లు, పోలవరం ప్రాజెక్టుకు రీయింబర్స్మెంట్, పునరావాస నిధుల కేటాయింపు, దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి నిధులు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎయిమ్స్కు నిర్దిష్ట కేటాయింపులు లేవు. ఐదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ సంస్థలకు రూ.133.17 కోట్లు కేటాయించగా.. ఇందులో ఏపీకి చెందిన సంస్థ కూడా ఉంది. విశాఖపట్నం–రాయపూర్ మధ్య 464 కి.మీ.మేర రహదారి అభివృద్ధి పనులు 2021–22లో ప్రారంభిస్తామని చెప్పారు. సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధి రైల్వే శాఖకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ కారిడార్ పేరిట ఖరగ్పూర్ నుంచి విజయవాడ, నార్త్ సౌత్ కారిడార్ పేరిట ఇటార్సి నుంచి విజయవాడ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తొలిదశలో చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. రూ.1.03 లక్షల కోట్లతో తమిళనాడులో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నుంచి తట్చూర్కు జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఐఈబీఆర్ కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు ఇంటర్నల్, ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ (ఐఈబీఆర్) కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులు సమకూర్చనున్నట్టు కేంద్రం తెలిపింది. సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, రీసెర్చి (సమీర్) కేంద్రాలకు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గుర్తింపు పొందిన సైంటిఫిక్ సొసైటీ.. మైక్రోవేవ్స్, మిల్లీమీటర్ వేవ్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ సాంకేతిక రంగాల్లో పని చేస్తుంది. ఈ సాంకేతికత అనువర్తనాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్నం, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహటిల్లో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. మొత్తం ఐదు మేజర్ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా పని చేయడానికి, బాధలో ఉన్న మహిళలను ఓదార్చడానికి వారికి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా మహిళా పోలీసు వలంటీర్ల నియామకానికి కేంద్రం అనుమతించింది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో వీటి ఏర్పాటుకు అనుమతించినా, నిధులు కేటాయించలేదు. ఈఏపీ ప్రాజెక్టులకు విదేశీ రుణాలు ఏపీలో మొత్తం పది ప్రాజెక్టులకు విదేశీ రుణాల కింద రూ.15,518.76 కోట్లు రానున్నాయి. ఈ మేరకు కేంద్రం పూచీకత్తు ఇవ్వనుంది. ఆయా ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ► విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు–1 ఏడీబీ నుంచి రూ.1,160.77 కోట్లు. ► 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు ఏఐఐడీ నుంచి రూ.159 కోట్లు. ► 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు ఐబీఆర్డీ నుంచి రూ.367.10 కోట్లు. ► గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,160 కోట్లు. ► ఏపీ అర్బన్ వాటర్ సప్లై సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంఫ్రూవ్మెంట్ ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.2,056.75 కోట్లు. ► గ్రీన్ ఎనర్జీ కారిడార్–ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కు డెన్మార్క్ ప్రభుత్వం నుంచి రూ.363.99 కోట్లు. ► ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంఫ్రూవ్మెంట్ ప్రాజెక్టు (ఫేజ్–2)కు జపాన్ ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు. ► ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టుకు ఐబీఆర్ నుంచి రూ.9,772.15 కోట్లు. ► డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు ఐడీఏ నుంచి రూ.139 కోట్లు. ► ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు ఐబీఆర్డీ నుంచి రూ.140 కోట్లు. -
ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్లు రూ.30,497 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నుల్లో వాటా, రెవెన్యూ లోటు గ్రాంట్లు, ఇతర గ్రాంట్లు కలిపి రూ.2.34 లక్షల కోట్ల మేర నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో ఐదేళ్లకు పన్నుల వాటాగా రూ.1.70 లక్షల కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు రూ.30,497 కోట్లు ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటా తగ్గగా.. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని కోల్పోనుంది. 2021–26 మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను నిర్దేశిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్.కె.సింగ్ నేతృత్వంలో 2017 నవంబర్లో ఏర్పాటైన ఈ కమిషన్ తొలుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటా సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వగా.. ఐదేళ్ల కాలానికి అంటే 2021–2026 వరకు పన్నుల వాటా సిఫారసులతో కూడిన పూర్తి స్థాయి నివేదికను 2020 నవంబర్ 9న రాష్ట్రపతికి సమర్పించింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటాను రాష్ట్రాలకు పంచాలని సిఫారసు చేయగా.. 15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదిక ఇస్తూ 41 శాతం వాటాను సిఫారసు చేసింది. తాజాగా రానున్న ఐదేళ్లకు కూడా 41 శాతం వాటాను సిఫారసు చేసింది. దీని ప్రకారం కేంద్రం రూ.42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది. ఇక మొత్తం 17 రాష్ట్రాలకు రూ.2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది. పది లక్షల జనాభా పైబడిన నగరాలకు గ్రాంట్లు పది లక్షల జనాభా పైబడిన నగరాల్లో పట్టణీకరణ సమస్యలు ఎదుర్కోవడానికి, మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంట్లు సిఫారసు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు రూ.1,116 కోట్లు సిఫారసు చేసింది. ఇందులో విజయవాడకు రూ.514 కోట్లు, విశాఖపట్నానికి రూ.602 కోట్లు సిఫారసు చేసింది. ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, వాయు నాణ్యత తదితర అంశాలకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది. మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం ► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. ► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్ పర్ఫార్మెన్స్)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది. ► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది. ఏపీకి బదిలీ అయ్యే మొత్తం ఇలా.. ► ఆంధ్రప్రదేశ్కు రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి మొత్తంగా రూ.2,34,013 కోట్లు బదిలీ కావాలని ఆర్థిక సంఘం నిర్ధేశించింది. ఇందులో రూ.1,70,976 పన్నుల వాటాగా అంచనా వేసింది. రూ.63,037 కోట్ల మేర గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని నిర్దేశించింది. ► ఈ గ్రాంట్లలో సింహభాగం రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా రానుంది. ఇవి కాకుండా స్థానిక సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యవసాయ రంగానికి గ్రాంట్లతో పాటు రాష్ట్ర ప్రతిపాదనల మేరకు స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు కూడా సిఫారసు చేసింది. ► 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు గ్రాంటు సిఫారసు చేసింది. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా నుంచి పంపిణీ అయ్యాక 2021–22లో రూ.17,257 కోట్లు, 2022–23లో రూ.10,549 కోట్లు, 2023–24లో రూ.2,691 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంచనా వేసి, ఆమేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేసింది. ► అయితే 2024–25లో రూ.8,458 కోట్ల మేర, 2025–26లో రూ.23,368 కోట్లు రెవెన్యూ మిగులు ఏర్పడుతుందని అంచనా వేస్తూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేయలేదు. మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం ► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. ► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్ పర్ఫార్మెన్స్)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది. ► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది. ► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది. విశాఖ అభివృద్ధికి రూ.1,400 కోట్లు విశాఖను ఆర్థిక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో 15వ ఆర్థిక సంఘం ఏకీభవించింది. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అత్యంత అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.1,400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నిధులతో విశాఖలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా దీనికిఅడ్డుకట్ట వేయడానికి నిధుల మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను 15వ ఆర్థిక సంఘం బలపరిచింది. రూ.300 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. పల్నాడు, కనిగిరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ కోరికను 15వ ఆర్థిక సంఘం ఆమోదిస్తూ ఇందుకు రూ.400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. యురేనియంను శుద్ధి చేయడం వల్ల పులివెందుల నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఆ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. ఇందుకోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.2,300 కోట్ల మంజూరుకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ద్రవ్య క్రమశిక్షణ మెరుగు పడాలి ► 2015–16లో ద్రవ్యలోటు–జీఎస్డీపీ రేషియో 3.7 శాతం ఉండగా.. 2016–17లో 4.5 శాతం, 2017–18లో 4.1 శాతం ఉందని, డెట్–జీఎస్డీపీ రేషియో 2015–16లో 28.1 శాతం, 2018–19లో 29.8 శాతం ఉందని ప్రస్తావించింది. అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం లోటును, అప్పులను తగ్గించి మనగలిగే స్థాయికి తీసుకురావాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ► రాష్ట్రం కేంద్ర బదిలీలపై ఎక్కువగా ఆధార పడుతోందని, 2016–17లో ఏపీ మొత్తం రెవెన్యూ రిసీట్స్(టీఆర్ఆర్)లో 50 శాతం కంటే ఇది ఎక్కువగా ఉందని ప్రస్తావించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించింది. ► రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్వీఏ)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ఎక్కువగా ఉందని(2015–16లో 31 శాతం, 2018–19లో 35 శాతం), అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్వరూపానికి ఇది భిన్నమని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. 2016–17 ప్రకారం జాతీయ నిర్మాణంలో కీలకమైన రంగాలపై ఏపీ తలసరి వ్యయం తక్కువగా ఉందని, దీనిని పెంచాలని సూచించింది. ► అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ నష్టాలు 2017–18లో నిర్దేశిత లక్ష్యం 9 శాతం ఉండగా.. వాస్తవానికి అవి 14.26 శాతంగా ఉన్నాయని, 2018–19లో 25.7 శాతానికి పెరిగాయని ప్రస్తావించింది. లీకేజ్ లేకుండా మరిన్ని సంస్కరణలు తేవాలని సూచించింది. ► ఆర్బీఐ అధ్యయనం ప్రకారం ఏపీ, తెలంగాణలో 2014లో రుణ మాఫీ.. రాష్ట్రాల ఆర్థిక క్రమ శిక్షణపై ప్రభావం చూపిందని ఆర్థిక సంఘం ప్రస్తావించింది. కేంద్ర పన్నుల వాటా నుంచి తగ్గిన నిధులు సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పాటు కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా ఈ ఆర్థిక ఏడాది కోత పడటం రాష్ట్రానికి కొంత మేర ఆర్థికంగా నష్టం కలగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21).. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.32,297 కోట్లు (4.111 శాతం) కేటాయింపులు చేశారు. అయితే సవరించిన బడ్జెట్ ప్రకారం రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.22,610 కోట్లేనని తేల్చారు. ఈ లెక్కన రూ.9,687 కోట్ల మేర కోత పడింది. వచ్చే ఆర్థిక ఏడాది (2021–22) బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.047 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. వచ్చే ఆర్థిక ఏడాది కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.26,935 కోట్లు వస్తాయని స్పష్టం చేశారు. ► ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరుతూ వస్తున్నా, పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉండగా, వాటి గురించి ప్రస్తావించలేదు. ► రాష్ట్ర విభజన సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ కాగ్ పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు భర్తీకి కేటాయింపులు చేయలేదు. ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.29,420 కోట్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం అంతకంటే పెరుగుతాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అయితే 2021–22కి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.26,935 కోట్లేనని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నట్లు స్పష్టం అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కరువు ప్రాంతాలకు రూ.100 కోట్లు వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని ఏపీ వంటి రాష్ట్రాలు కేంద్రంతో కలిసి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఈ దిశగా కరువు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు నిధులు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్కు రూ.100 కోట్లు కేటాయించింది. పెరుగుతున్న వడ్డీల భారం ఏపీపై వడ్డీ భారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2011–12 నుంచి 2013–14 వరకు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.4 %గా మాత్రమే ఉన్న వడ్డీ భారం.. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2014–15లో 1.5%గా, 2015–16లో 1.6%, 2016–17, 2017–18లో 1.7%, 2018–19లో 1.8%, 2019–20 (ఆర్ఈ)లో 1.7 %, 2020–21లో(బీఈ)లో 1.8%గా ఉంది. -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్జీవన్ మిషన్కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్తో పాటు బయ్యారం స్టీల్ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్కతా, రాయ్బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!
చరిత్ర రాల్చిన విషపు చుక్క లాంటి కోవిడ్తో... మనుషులే కాదు, వ్యవస్థలూ మంచానపడ్డాయి. కాస్త కోలుకున్నా... పూర్వపు స్థితి వస్తుందో రాదో తెలియని స్థితి. కాకపోతే జనానికిప్పుడు వ్యాక్సిన్ అందుతోంది. ఈ బడ్జెట్తో భారత ఆర్థిక వ్యవస్థక్కూడా తొలిడోసు టీకా ఇచ్చే ప్రయత్నం చేసింది మోదీ ప్రభుత్వం. విద్య, వైద్యం, రోడ్లు, నౌకాశ్రయాలు... ఇలా అన్నింటా మౌలిక సదుపాయాలకు జై కొడుతూ ప్రణాళిక వ్యయాన్ని ఏకంగా రూ.5.54 లక్షల కోట్లకు పెంచింది. ఆరోగ్య, మౌలిక రంగాలపై దృష్టిపెట్టింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ చూపించింది. మరి ఇంత డబ్బెలా వస్తుంది..?? ఒకటి... భారీ అప్పులు తప్పవు. మరి ఆ తరవాత..? ‘సేల్ ః ఇండియా’!!. ఆర్థిక మంత్రి ఆశలన్నీ దీనిపైనే. టోల్ రోడ్లు, రైల్వే లైన్లు, గ్యాస్ పైప్లైన్లు, విమానాశ్రయాలు, గిడ్డంగులు, క్రీడా మైదానాలు... వీటన్నిటికీ ‘ఫర్ సేల్’ ట్యాగ్ తగిలించబోతున్నారు. ఇక ప్రభుత్వ కంపెనీలు ఎల్ఐసీ, బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగం సరేసరి. వాటిలో వాటా విక్రయాన్ని ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తిచేయాలన్నది ప్రణాళిక. నిజానికి ప్రభుత్వానికి వేరే మార్గం కూడా లేదు. ఇక అన్నిటికన్నా సాహసోపేతమైన చర్య... జవాబుదారీ తనమే లక్ష్యంగా మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ. జాతీయీకరణ జరిగిన 51 ఏళ్ల తరవాత ఓ రెండు బ్యాంకులు మళ్లీ ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి అమ్మకాలు పూర్తయితే... భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సిన్ ఇచ్చినట్లే. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? అది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.!! సిక్స్ ప్యాక్ బడ్జెట్... దేశం కరోనా కల్లోలం నుంచి తేరుకొని వృద్ధి బాటలో పరుగులు పెట్టేందుకు ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ ఆరు రంగాలు ఏమిటంటే... ఆరోగ్యంపై త్రికరణ శుద్ధి.. వ్యాధి నివారణ, చికిత్స, బాగోగులే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పించి బడ్జెట్లో కేటాయింపులు 137 శాతం పెంచారు. కోవిడ్ వ్యాక్సినేషన్కు రూ.35,000 కోట్లు ప్రతిపాదించారు. పీఎల్ఐ ఆత్మనిర్భర్ భారత్ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఐదేళ్లలో రూ.1.97 లక్షల కోట్లు. ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వాములుఅయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది. వ్యవసాయ భారతం.. వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదక వ్యయంపై కనీసం 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర. వ్యవసాయ రుణ పరిమితి లక్ష్యం పెంపు. పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలపై ప్రత్యేక దృష్టి. నాణ్యమైన విద్య.. దేశంలో కొత్తగా 100 సైనిక స్కూళ్లు. ఉన్నత విద్యలో నాణ్యతకు కమిషన్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో 750 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు. ఉపాధిని పెంపొందించేందుకు అప్రెంటిస్షిప్ చట్టం. పరిశోధనలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగాలకు వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల కేటాయింపుపై విధివిధానాలు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు. కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన సత్వర న్యాయానికి ట్రిబ్యునళ్లలో సంస్కరణలు. దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పన్ను చెల్లింపుదారులపై ఒత్తిడి తగ్గించేలా పారదర్శక, సమర్థ పన్నుల విధానం. న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రకటించారు. కరోనా సృష్టించిన విధ్వంసంతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిన పెట్టడంతో పాటు, భవిష్యత్తులో విశ్వ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆర్థిక ప్రణాళికను దేశప్రజల ముందుంచారు. దేశ ప్రజలకు కరోనా నుంచి విముక్తి కలిగించే వ్యక్తిగత వ్యాక్సిన్తో పాటు, కరోనాతో కుదేలైన రంగాలకు ఊరట కల్పించి, వృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన వ్యాక్సిన్నూ ఈ బడ్జెట్లో పొందుపర్చారు. కరోనా కల్లోలం నుంచి తేరుకుని వృద్ధి దిశలో పరుగులు పెట్టాల్సిన దేశానికి అవసరమైన ముడి సరుకులను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు. 2021– 22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను సోమవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టారు. ఈ దిశగా ఆరు కీలక రంగాలు పునాదులుగా ‘సిక్స్ పిల్లర్ బడ్జెట్’ను ఆమె ప్రవేశపెట్టారు. స్వాస్థ భారత్, పెట్టుబడులు– మౌలిక సదుపాయాలు, సమగ్ర సమ్మిళిత పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, సృజనాత్మకత– పరిశోధన–అభివృద్ధి, కనీస ప్రభుత్వం– గరిష్ట పాలన.. స్థూలంగా ఈ ఆరు రంగాలు పునాదులుగా బడ్జెట్ను రూపొందించామని నిర్మల తెలిపారు. ‘నేషన్ ఫస్ట్’సంకల్పంలో భాగంగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మౌలిక వసతుల కల్పన, స్వాస్థ భారత్, సుపరిపాలన, యువతకు ఉపాధి అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత, సమ్మిళిత వృద్ధి.. అనే ఎనిమిది అంశాలపై ఆర్థిక మంత్రి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ బడ్జెట్లో ఆరోగ్యం, మౌలిక వసతులపై కేటాయింపులను భారీగా పెంచారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 49% నుంచి 74 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశీయ తయారీ రంగానికి ఉపకరించేలా ఆటోమొబైల్ విడిభాగాలు, మొబైల్ ఫోన్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్ల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. అలాగే, యాపిల్స్, పీస్, పప్పు ధాన్యాలు, ఆల్కహాల్, కెమికల్స్, వెండి, పత్తి.. తదితర పలు ఉత్పత్తుల దిగుమతులపై వ్యవసాయ మౌలిక వసతులు, అభివృద్ధి పన్ను(అగ్రి సెస్– అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్)ను విధించారు. అయితే, ఇంపోర్ట్ డ్యూటీని సర్దుబాటు చేయడం ద్వారా ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడకుండా చూస్తారు. భవిష్యనిధి(ప్రావిడెంట్ ఫండ్)కు ఉద్యోగి ఇచ్చే వాటాపై వడ్డీ ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే, అది ఏప్రిల్ 1, 2021 నుంచి పన్ను పరిధిలోకి వస్తుంది. కాగా, సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్పై, వడ్డీపై మాత్రమే ఆధారపడిన 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇకపై ఐటీ రిటర్న్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే, అందరికీ సొంత ఇల్లు లక్ష్య సాధనలో భాగంగా ప్రకటించిన గృహ రుణ వడ్డీలో రూ. 1.5 లక్షల తగ్గింపు సదుపాయం మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. ఈ పథకం 2022 మార్చి 31 వరకు కొనసాగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ ఇదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. మరోవైపు, ఈ బడ్జెట్పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. గతమెన్నడూ లేనంత నిరుత్సాహపూరితంగా ఉందని అభివర్ణించింది. తప్పు వ్యాధి నిర్ధారణ, చికిత్స రెండు తప్పుడువేనని పేర్కొంది. మౌలికం కోసం.. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడుల కల్పన కోసం ఈ బడ్జెట్లో ఏకంగా రూ. 5.54 లక్షల కోట్లను ఆర్థికమంత్రి కేటాయించారు. ఇందులో ప్రధానంగా రూ. 1.18 లక్షల కోట్లు రోడ్స్ అండ్ హైవే రంగానికి, రూ. 1.08 కోట్లు రైల్వే రంగానికి కేటాయించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఏర్పడేందుకు, ఉపాధి కల్పనకు ఈ నిధులు ఉపయోగపడ్తాయని తెలిపారు. ఇందుకు అదనంగా అవసరమైన నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధిస్తామన్నారు. వ్యూహాత్మక రంగంలో లేని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు, కొత్తగా విధించిన అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ రూపుదిద్దుకునేందుకు భారతీయ తయారీ పరిశ్రమలు ప్రపంచ దేశాలకు సరఫరా కేంద్రాలుగా మారాల్సి ఉందని నిర్మల పిలుపునిచ్చారు. ఇందుకు గానూ ఐదేళ్ల కాలపరిమితితో 2020లోనే రూ. 1.97 లక్షల కోట్లను కేటాయించామన్నారు. దేశీయ టెక్స్టైల్స్ రంగం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో ఏడు ‘మెగా టెక్స్టైల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్క్’లను ఏర్పాటు చేయనున్నామన్నారు. లోక్సభలో బడ్జెట్ను చదివి వినిపిస్తున్న నిర్మలా సీతారామన్. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, ప్రహ్లాద్ జోషి తదితరులు సాగు సాయం కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్తో గత రెండు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలో.. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. రైతు ప్రయోజనాలు లక్ష్యంగా మరే ఇతర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. వ్యవసాయ రుణాల లక్ష్యంలో ఈ సంవత్సరం 10% పెంపును ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పెంపుతో రైతులకు రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉంటాయన్నారు. పంట నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ప్రతిపాదించిన అగ్రి సెస్ మొత్తాన్ని వినియోగిస్తామని తెలిపారు. 2013–14లో గోధుమ సేకరణ కోసం నాటి ప్రభుత్వం రూ. 33,874 కోట్లు ఖర్చుచేయగా, 2020–21లో తమ ప్రభుత్వం రూ. 75,050 కోట్లు ఖర్చుచేసిందన్నారు. స్వమిత్వ పథకంలో భాగంగా 1.8 లక్షల మంది రైతులు ప్రాపర్టీ పట్టాలు పొందారని ఆర్థిక మంత్రి సీతారామన్ గుర్తుచేశారు. వ్యవసాయ మార్కెట్లకు ఇకపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, మండీల కొనసాగింపుపై రైతుల్లో ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో బడ్జెట్లో ఈ ప్రతిపాదన చేశారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ–నామ్) విధానం విజయవంతమైందని, ఇప్పటివరకు 1.68 కోట్ల మంది రైతులు ఇందులో రిజిస్టర్ అయ్యారని, రూ. 1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్మల తెలిపారు. త్వరలో మరో వెయ్యి మండీలను ‘ఈ–నామ్’లో చేరుస్తామన్నారు. మత్య్స పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలోని విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పారాదీప్, పెటువఘాట్ ఫిషింగ్ హార్బర్లను ‘ఎకనమిక్ యాక్టివిటీ హబ్స్’గా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. పెట్రోపై ‘అగ్రి సెస్’ తాజా బడ్జెట్లో పలు ఇతర దిగుమతులతో పాటు పెట్రోలు, డీజిల్లపై కూడా అగ్రి సెస్ను ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ. 2.5ను, లీటరు డీజిల్పై రూ. 4ను అగ్రిసెస్గా నిర్ణయించారు. అయితే, అంతే మొత్తంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆ భారం వినియోగదారుడిపై పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రక్షణ.. నామమాత్రమే చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, రక్షణ రంగ బడ్జెట్ను గత సంవత్సరం కన్నా నామమాత్రంగా 1.4% మాత్రమే పెంచారు. గత సంవత్సరం ఈ మొత్తం రూ. 4.71 లక్షల కోట్లు కాగా, ఈ సంవత్సరం అది రూ. 4.78 లక్షల కోట్లకు పెంచారు. రూ. 1.35 లక్షల కోట్లను ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ హార్డ్వేర్ కొనుగోలు కోసం కేటాయించారు. ‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక వరాలు ప్రకటించింది.పశ్చిమబెంగాల్కు రూ. 25 వేల కోట్లు, తమిళనాడుకు రూ. 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ. 65 వేల కోట్లు, అస్సాంకు 19 వేల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలను బడ్జెట్లో పొందుపర్చింది. ద్రవ్యలోటు తగ్గించేందుకు.. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సంవత్సర ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. మునుపెన్నడు లేనంత ఎక్కువగా ప్రభుత్వ ఖర్చు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఎకానమీకి ద్రవ్య విధాన మద్దతు మరో మూడేళ్లు కొనసాగుతుందని, ద్రవ్యలోటు 2025–26 సంవత్సరానికి జీడీపీలో 4.5 శాతానికి తగ్గుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముంది. అలాగే, పలు ఐరన్, స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయా వస్తువుల ధరలు పెరిగి, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది. పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించి.. ఐదేళ్ల కాలానికి గానూ రూ. 2.87 లక్షల కోట్లతో ‘జల జీవన్ మిషన్ –అర్బన్’ను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. అలాగే, ‘పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్’కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించామన్నారు. నగదు సమీకరణ పథకాల అమలు, ఇతర అవసరాల కోసం ఆస్తులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ఏ ప్రభుత్వానికైనా అవసరమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐడీబీఐతో పాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాలను అమ్మాలని నిర్ణయించామన్నారు. మంత్రిత్వ శాఖల వద్ద, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద అదనంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టనున్నట్లు వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు కాగా, 2020–21 సంవత్సరానికి రూ. 2.1 లక్షల కోట్లు. అయితే, కరోనా కారణంగా రూ. 20 వేల కోట్లను కూడా సమీకరించలేకపోయారు. ముఖ్యాంశాలు మహా కవుల మాటలు ప్రసంగం సమయంలో మహాకవులు రవీంద్రనాథ్ టాగోర్, తిరువళ్లువర్ల కవితాపంక్తులను నిర్మలాసీతారామన్ ఉటంకించారు. ‘తూరుపున పూర్తిగా తెలవారకముందే రానున్న వెలుగు రేకలను ఊహిస్తూ గానం చేయడమే విశ్వాసం’అనే రవీంద్రుడి కవితాపాదాన్ని ఆమె ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే గుర్తుచేశారు. అలాగే, ‘రాజు/పాలకుడు సంపదను సృష్టించి, సమీకరించి, అనంతరం ఆ సంపదను పరిరక్షించి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు’అన్న తమిళ మహాకవి తిరువళ్లువర్ రాసిన పంక్తులను కూడా ఆమె చదివారు. ప్రత్యక్ష పన్నుల వివరాలను వెల్లడించేముందు ఆమె ఈ పంక్తులను వినిపించారు. గత సంవత్సరం కూడా ఆమె తిరువళ్లువర్ను ఉటంకించారు. అంతకుముందు, యూపీఏ ఆర్థికమంత్రి చిదంబరం కూడా తమిళనాడుకు చెందిన ఆ మహాకవి వ్యాఖ్యలను తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ♦ఇది తొలి కాగిత రహిత, డిజిటల్ బడ్జెట్ ♦ఎరుపు రంగు చీరలో, ఎరుపు రంగు వస్త్రంతో రూపొందిన సంచీ(బాహీ ఖాతా)తో నిర్మల సభకు వచ్చారు. బడ్జెట్ను తొలిసారి ట్యాబ్లో చూసి చదివారు. స్వాస్థ్య భారత్.. కరోనా వైరస్ విజృంభణతో మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంది. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో, ఆరోగ్య రంగంలో స్వావలంబన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికే పెద్ద పీట వేసింది. కోవిడ్–19 వ్యాక్సిన్కు కేటాయించిన రూ. 35 వేల కోట్లు సహా మొత్తంగా రూ. 2, 23, 846 లక్షల కోట్లను కేటాయించింది. ఇది ఈ రంగానికి గత సంవత్సరంలో కేటాయించిన మొత్తం కన్నా 137% అధికం. ఆత్మ నిర్భర భారత్ పునాదుల్లో ఆరోగ్య భారత్ అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. వ్యాధి నివారణ, చికిత్స, సమగ్ర శ్రేయస్సు అనే మూడు అంశాలను దృఢతరం చేసేలా కేటాయింపులు జరిపామన్నారు. కోవిడ్–19 టీకా కోసం కేటాయించిన రూ. 35 వేల కోట్లు ప్రాథమిక అంచనాయేనని, అవసరమైతే, ఆ మొత్తాన్ని పెంచుతామని వివరించారు. రూ. 64,180 కోట్లతో త్వరలో ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వాస్థ యోజనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభాన్ని భారత్ అద్భుతంగా ఎదుర్కొందని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ ప్రకటించిన 48 గంటల్లోపే ప్రధాని మోదీ రూ. 2.76 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్కళ్యాణ్ యోజనను ప్రకటించారని గుర్తు చేశారు. ఆరోగ్యానికి వాయు కాలుష్యం చేసే చేటును దృష్టిలో పెట్టుకుని 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలను, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహనాలను నిషేధించేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని ప్రారంభించనున్నామన్నారు. -
ఆరోగ్యరంగానికి అరకొర వ్యయమే
‘ఆరోగ్య పరిరక్షణ ఎట్టకేలకు ప్రధాన పాత్ర పోషించబోతోంది’ అని మొన్న ఆర్థిక సర్వే ప్రక టించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరు కీలక స్తంభాల్లో ఆరోగ్యం మొదటిది. ప్రజారోగ్యానికీ, శ్రేయస్సుకూ ఈసారి కేటాయింపులు 137 శాతం పెంచుతున్నామని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సగర్వంగా చెప్పారు. అయితే మాట్లాడినంత ఘనంగా పరిస్థితేమీ లేదని బడ్జె ట్ను తరచి చూస్తే అర్థమవుతుంది. కరోనా మహ మ్మారి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యరంగానికి కేటా యింపులు ముందుగా ఊహించిందే. మన ఆరోగ్య వ్యవస్థ లోని లోపాలను కరోనా బహిర్గతం చేసింది. రోగ వ్యాప్తిగానీ, దాని పర్యవసానంగా కలిగిన మర ణాలుగానీ అంచనా వేసినంతగా లేకపోవటం అదృ ష్టమే. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యరంగానికి వన రులు పుష్కలంగా వుండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. ఆరోగ్యరంగంపై సమగ్ర దృష్టి సారిస్తూ వ్యాధి నిరోధకత, స్వస్థ పర చటం, శ్రేయస్సు అనే మూడు అంశాలను పటిష్ట పరచాలని నిర్ణయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే పేరిట కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాథ మిక, మాధ్యమిక, ప్రాంతీయ స్థాయిల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం దీని ధ్యేయం. వచ్చే ఆరేళ్లలో ఇందుకోసం రూ. 64,180 కోట్లు వ్యయం చేస్తారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 10,700 కోట్లు. నిరుడు ఆరోగ్యానికి రూ. 67,484 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే అది రూ. 94,452 కోట్లకు పెరి గింది. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేసి, వచ్చే మూడు నాలుగేళ్లలో క్రమేపీ పెంచుకుంటూ పోతే తప్ప ఆరోగ్య రంగ వ్యయంపై మనం పెట్టు కున్న లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు. ఆరోగ్య రంగ వ్యయాన్ని పెంచాల్సిన అవస రాన్ని ఆర్థిక సర్వే కూడా అంగీకరించింది. ఆరోగ్య పరిరక్షణకయ్యే ఖర్చులో 60శాతం ప్రజానీకం వాటా వుండగా మిగిలింది ప్రభుత్వ వ్యయం. మన జీడీపీలో ప్రస్తుతం ఆరోగ్యరంగ వాటా 1 శాతం కన్నా చాలా తక్కువ. దీన్ని 3 శాతానికి పెంచితే తప్ప ప్రజలపై భారం తగ్గదు. 2017నాటి జాతీయ జాతీయ ఆరోగ్య విధానం కూడా ఈ మాటే చెప్పింది. మెరుగైన ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో మన స్థానం 145. ఈసారి పరిస్థితి మారుతుందనుకుంటాము. కానీ ఆమె కేటాయించిన రూ. 2,23,846 కోట్లలో పౌష్టి కాహారం, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్యం అంశాలపై చేసే ఖర్చు కూడా వుంది. వీటికి ప్రాధా న్యత లేదని ఎవరూ అనరు. కానీ ఆరోగ్య వ్యయంగా ఆ అంశాలను చూపడం సరికాదు. అలాగే వ్యాక్సిన్ల కోసం చేసిన రూ. 35,000 కోట్ల కేటాయింపు కూడా ఈ ఏడాదికి పరిమితమైనది. దాన్ని రెగ్యులర్ ఆరోగ్య బడ్జెట్లో భాగంగా పరి గణించలేం. మన ఆరోగ్య రంగ బడ్జెట్ జీడీపీలో ఇప్పటికీ 0.34 శాతం మాత్రమే. జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాన్ని సాధించాలంటే 2021– 22లో జీడీపీలో 1.92 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేయాలని ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అందుకు మనం ఎంత దూరంలో వున్నామో చూస్తే ఆశ్చర్యం కలుగు తుంది. కరోనా మహమ్మారి వంటిది కూడా మన ప్రభుత్వాన్ని కదిలించలేకపోతే దాన్ని మరేది ప్రభావితం చేయగలదు? – ప్రొఫెసర్ దీపా సిన్హా -
ఇది రైతన్నలను బాగుచేసే బడ్జెట్: మోదీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పల్లెలను, రైతన్నలను ఈ బడ్జెట్ తన గుండెల్లో నిలుపుకుందని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, అన్నదాతల ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. వ్యవసాయ మండీల (మార్కెట్ల) సాధికారతే లక్ష్యంగా భారీగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నా యని తెలిపారు. రైతులకు ఇకపై మరింత సుల భంగా రుణాలు అందుతా యని వెల్లడించారు. సంపద సృష్టి, సంక్షే మాన్ని లక్ష్యంగా పెట్టు కొని బడ్జెట్కు రూప కల్పన చేశారని ఉద్ఘాటిం చారు. 2021–22 బడ్జెట్ భారతదేశ దృఢ సంక ల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటు తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. కొత్త దశాబ్దికి పటిష్ట పునాది అసాధారణ పరిస్థితుల మధ్య బడ్జెట్ను ప్రవేశ పెట్టారని ప్రధాని మోదీ వివరించారు. సామా న్యులపై ప్రభుత్వం మరింత భారం మోప నుందని నిపుణులు అంచనా వేసిన ప్పటికీ బడ్జెట్ వివరా లను ప్రకటించిన ఒకటి రెండు గంటల్లోనే పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తం కావడం మంచి పరిణామం అని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) స్ఫూర్తిని ప్రతి బింబించే ఈ బడ్జెట్ కొత్త దశాబ్దం ప్రారంభానికి ఒక పటిష్టమైన పునాది అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి, దిగజారిన ఆర్థిక వ్యవస్థ వంటి ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రపంచానికి నూతన విశ్వాసాన్ని అందించిందని అన్నారు. ప్రజల జీవనం.. సులభతరం ప్రగతి కోసం కొత్త అవకాశాలను విస్తరింప జేయడం, యువత కోసం కొత్త అవకాశాల సృష్టి, మానవ వనరులకు కొత్తరూపు ఇవ్వడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత వైపు అడు గులు, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అనే కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించినట్లు మోదీ తేల్చిచెప్పారు. ఇది సంపద సృష్టికి, సంక్షేమానికి ఊపునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ, ఈశాన్యభారత్తోపాటు లద్దాఖ్పై దృష్టి పెడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని ఈ బడ్జెట్ ఆకాంక్షి స్తోందని అన్నారు. కోస్తా తీరప్రాంత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లను బిజినెస్ పవర్హౌస్లుగా మార్చే దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. నియమ నిబం ధనలను సరళతరం చేయడం ద్వారా ప్రజల జీవనాన్ని ఇంకా సులభతరంగా మార్చడం బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబ డులు తదితర రంగాల్లో ఇకపై సానుకూల మార్పులు వస్తాయ న్నారు. ఆవిష్కరణలపై దృష్టి కేంద్ర బడ్జెట్లోని పార దర్శకతను నిపుణులు సైతం కొనియాడుతున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలను పెంచడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బడ్జె ట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసినట్లు తెలిపారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం యువతకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఆరోగ్యం, పారిశుధ్యం, పౌష్టికాహారం, సురక్షిత తాగునీరు, సమాన అవకాశాలు వంటివి అందక సామాన్య ప్రజలు, మహిళలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఇకపై ఆ సమస్య దూరమవుతుందని వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులి వ్వడం, విధానరమైన సంస్కరణలతో కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ప్రగతి పరుగులు తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. -
సమానత్వ సాధన మరిచిన బడ్జెట్
ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజల మధ్య ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీపురుషుల మధ్య వివక్ష లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని, కొద్దిమంది వ్యక్తుల వద్ద సంపద కేంద్రీకరణ జరగకూడదని, ప్రజలందరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడరాదనీ భారత రాజ్యాంగంలోని 39వ అధికరణ హెచ్చరించింది. ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ ఎనిమిదవ వార్షిక బడ్జెట్ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది. ‘‘భారత ద్రవ్య వ్యవస్థలోని వైఫల్యాల ప్రమాదం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలంటే భారత బ్యాంకులు, తదితర పబ్లిక్ రంగ సంస్థలపైన ప్రభుత్వ నిత్య నియంత్రణను పెందలాడే తొలగించేయాలి. అసమా నతలను తొలగించడంపై కేంద్రీకరణకన్నా ఆర్థికాభివృద్ధి సాధనపైనే కేంద్రీకరిం చాలి. ప్రభుత్వ నియంత్రణ వల్ల ద్రవ్య వ్యవస్థా రంగం పలు వైఫల్యాలకు గుర వుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది’’. – 2021 ఆర్థిక సర్వేక్షణ (30–01–2021) ఇంతకూ అసలు విశేషమేమంటే.. కోవిడ్–19 మహమ్మారి రాకముందు నుంచి పాలకులు ఊదరబెట్టి అదరగొడుతున్న ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ (ఆత్మనిర్భర్ భారత్), ‘అందరికోసం అందరి వికాసం’ (సబ్ కీ సాత్, సబ్ కీ వికాస్) అన్న పాలకుల నినాదాల వెనుక అసలు రహస్యం ఏమిటో తేటతెల్లమై పోయింది. పబ్లిక్రంగ సంస్థల్ని ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ నుంచి పెందలాడే తప్పించి ప్రైవేట్రంగ బడా గుత్త పెట్టుబడి వర్గాలకే ధారాదత్తం చేయాలన్న పాలకవర్గాల నిశ్చితాభిప్రాయాన్ని ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వేక్షణ బాహాటంగానే ప్రకటించింది. భారత ప్రజలమైన మేము మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని అంకితం చేసుకుంటున్నామన్న ప్రకటిత లక్ష్యానికి, ఆ ప్రకటన ఆధారంగానే రూపొందించుకున్న గణతంత్ర రాజ్యాంగం నిర్దేశించిన పౌరుల జీవించే ప్రాథ మిక హక్కులకూ కట్టుబడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆచరణలో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి భరోసా ఇస్తూ అక్షర సత్యంగా దేశంలోని బడుగు, బలహీన వర్గాల, పేద ప్రజా బాహుళ్యానికి వర్తించే ఆదేశిక సూత్రాలను 37, 25, 39వ రాజ్యాంగ అధికరణలుగా స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశిక సూత్రాలు, పౌరులు హుందాగా బతికే, ఆర్థిక స్వాతంత్య్రంపై హామీపడ్డాయని మరచిపోరాదు. ఈ ప్రకటిత సూత్రాల లక్ష్యమే సంక్షేమ రాజ్య స్థాపన. ఆ సంక్షే మాన్ని పేదసాదలకు ఆచరణలో దక్కేలా చూసే బాధ్యతను రాజ్యాంగ అధికర ణలు స్పష్టం చేశాయి. వీటి ప్రకారం పౌరులు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విధిగా పొంద డానికి అర్హులని ఆదేశిక సూత్రాలు విస్పష్టంగానే పేర్కొన్నాయి. ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక, వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజలమధ్యా ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీ పురుషుల మధ్య వివక్షత లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని ప్రజలం దరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడ రాదనీ 39వ అధికరణ హెచ్చరించింది. ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ 8వ వార్షిక బడ్జెట్ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది. అధికారానికి వచ్చినప్పటినుంచీ మోదీ ప్రభుత్వం, ‘మేకిన్ ఇండియా’ నినాదం ద్వారా హోరెత్తిస్తున్న ‘భారతదేశంలోనే తయారీ’ అంటే, ఆ ఉత్పత్తుల్ని మన దేశీయులే తయారు చేయాలనా లేక మన తరఫున విదేశీ పెట్టుబడిదారులు ఇండియాలో ప్రవేశించి తయారు చేయాలనా? ఆ స్లోగన్లో ఉన్న ‘అస్పష్టత’ ఇప్పటికీ తొలగలేదు కాబట్టే బ్యాంకులు సహా మొత్తం దేశీయ ప్రభుత్వరంగ పరిశ్రమలే ఒక్కటొక్కటిగా విదేశీ గుత్త పెట్టుబడులకు జీహుకుం అనవలసిన స్థితికి పాలక విధానాలు చేరుకున్నాయి. ఒకవైపున కోవిడ్–19 వల్ల గత ఏడాదిగా పారిశ్రామిక, వ్యావసాయిక తదితర ఉపాధి రంగాలలో ఏర్పడిన మాంద్యం నేపథ్యంలో జీఎస్టీ పేరిట రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ఫెడరల్ వ్యవస్థ లక్ష్యానికి కేంద్ర పాలకులు చేటు తెచ్చారు. గత ఏడాది ప్రభుత్వ ఆర్థిక సర్వేక్షణ అభివృద్ధి శాతం ఈ ఏడాది 6 శాతం ఉంటుందని అంచనా వేస్తే అది కాస్తా మైనస్ 7.7 శాతానికి దిగజారిపోయింది. వరల్డ్ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ఆర్థిక సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్దండపిండంగా సేవలందించిన ఆర్థిక నిపుణుడు అరవింద్ పనగారియా అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛావాణిజ్య ప్రచారకుడు. ఆయన్ని తీసు కొచ్చి మోదీ మొట్ట మొదటి నీతిఆయోగ్ వ్యవస్థకు అధిపతిని చేశారు. కొద్ది కాలం ఉండి ఆయన అక్కడి నుంచి ఉడాయించారు. అలాగే ఆయన తర్వాత అదే ఆయోగ్ నుంచి మరి ఇద్దరు కూడా తప్పుకున్నారు. ఇక అంతకుముందే రిజర్వ్ బ్యాంక్ అధిపతిగా పనిచేసిన సుప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామరాజన్ మోదీ ప్రభుత్వంతో వేగలేక అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్గా వెళ్లారు. ఇక ఇప్పుడు ఆఖరి అంకుశంగా మోదీ ప్రయోగించిన ఆయుధం ఏమిటంటే.. ఉరుమురిమి మంగళం మీద పడినట్లు మూడు నిరంకుశ రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా గత 70 రోజులుగా భారత రైతాంగం చేస్తున్న భారీ నిరసనో ద్యమంపై ఉక్కుపాదం మోపి కార్పొరేట్ వ్యవసాయానికి తెరలేపేందుకు నిర్ణయించుకోవడమే. అసమ సమాజంలో ఎన్నికల్లో దళితులకు ప్రత్యేత నియోజక వర్గాలు అవసరమని భావించినందున అందుకు వ్యతిరేకంగా వచ్చిన పూనా సంధి సందర్భంగా సత్యాగ్రహంలో ఉన్న గాంధీజీ ప్రాణాల్ని కాపాడినవారు డాక్టర్ అంబేడ్కర్ నాయకత్వాన దళిత వర్గాలేనని మరిచిపోరాదు. దళితులు గాంధీ ప్రాణ రక్షణ కోసం ఉమ్మడి నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయిం చుకున్నందున గాంధీ సత్యాగ్రహం నిలిపేశారు. దళితుల త్యాగం వల్ల గాంధీ తేరుకోవచ్చు గానీ, దళిత బహుజనుల స్థితిగతులు వారి త్యాగానికి తగిన దామా షాలో ఈనాటికీ మెరుగపడలేదు. రాజకీయ పక్షాలు ఈ రోజుకీ గ్రామసీమల్లో ప్రజల మధ్య చిచ్చుపెడుతూనే ఉన్నాయి. ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియకు మోకాలడ్డు పెడుతూనే ఉన్నాయి!! అందుకే అంబేడ్కర్ అన్నారు. ‘పార్లమెంటరీ ప్రజా స్వామ్యం స్వేచ్ఛను గుర్తించిందే కానీ, సమానత్వ సాధనను మరిచిపోయింది. ఈ వైఫల్యం అరాచకత్వానికి, తిరుగుబాటుకు దారితీస్తుంది’. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
ఏసీలు, ఫ్రిజ్లు కొనేవారికి షాక్!
న్యూఢిల్లీ: 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ ఉత్పత్తుల్లో దిగుమతి చేసుకొనే వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచేశారు. దిగుమతి చేసుకున్న విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరగడం వల్ల రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి విదేశీ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని విధించిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు అనుగుణంగా 40 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండీషనర్ల స్థానికంగా ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది.(చదవండి: గృహ కొనుగోలుదారులకు శుభవార్త!) తాజాగా కస్టమ్స్ సుంకం పెంచడంతో స్వల్పంగా ఒక శాతం అంటే రూ.100 నుంచి రూ.500 మధ్య ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు అనేది ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్నంది పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లపై 12.5 శాతం, ఏసీలపై 15 శాతం పన్ను విధించనున్నందున మొత్తం కంప్రెషర్ ధర 25-30 శాతం ఎక్కువవుతుందన్నారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం 0.6 శాతం ఉంటుందని చెప్పారు. రెండు పెద్ద కంపెనీలు కంప్రెషర్ తయారీకి ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయని, కానీ కరోనాతో అంతరాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. -
కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాలవారీగా, మౌలిక సదుపాయాల రూపేనా భారీ నష్టం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని చెప్పారు. అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు తెలిపారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలోకి రావడానికి అవసరమైన ప్రత్యేక దృష్టి కేంద్ర బడ్జెట్లో కనిపించలేదని వెల్లడించారు. బడ్జెట్ సందర్భంగా వివిధ రంగాలకు, కార్యక్రమాలకూ చేసిన కేటాయింపులు అన్నిరాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ఆహారం, పెట్రోల్, ఎరువుల రాయితీలను కూడా తగ్గించిన విషయాన్ని అధికారులు నివేదించారు. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో లైజనింగ్ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. -
అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2021పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ మేరకు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. ఆశగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. బడ్జెట్ సామాన్యునికి అనుకూలంగా లేదని, తెలంగాణకు కేంద్ర మళ్ళీ మొండి చేయి చూపించిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సామాన్యునికి, పేదలకు, చిన్న చిన్న ఆర్థిక రంగాలకు బడ్జెట్ ఏ మాత్రం చేయూతనివ్వలేదని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెట్టలేదని, దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నింటిని విదేశీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్-2021: కిషన్రెడ్డి స్పందన ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల కోసం మాత్రమే ఈ బడ్జెట్ పెట్టినట్టు కనపడుతుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా అని విమర్శనస్త్రాలు సంధించారు. బీజేపీ వల్ల దేశ ఆర్ధికవ్యవస్థకు పెను ప్రమాదం వాటిళ్లబోతోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు, పెద్ద నోట్ల రద్దు ఫేక్ నోట్లు, నల్లధనం బయటికి వస్తుందన్న కేంద్రం ఏ ఒక్కటి గురించి కూడా చర్చించలేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులు రాలేదని, డ్రై ఫోర్ట్ ఇస్తామని ఆ ఊసే లేదని విమర్శించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు ఈ ఎంపీలకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్-2021: కిషన్రెడ్డి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2021పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సృజనాత్మకత, సామర్ధ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్ను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. ( బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!) కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కోవిడ్ వాక్సిన్ కోసం 35,400 కోట్ల రూపాయలు కేటాయించి ప్రధాని మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుంది. దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరం’’ అని అన్నారు. -
పేర్లు లేకుంటే రాష్ట్రాలకు నిధులు రావా?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా, అభివృద్ధి పథంలో పయనించే బడ్జెట్ ఇది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. పన్నుల భారం మోపకుండా ప్రజల బడ్జెట్ మాదిరి ఉందని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్ ఇది అభివర్ణించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. మౌలిక వసతులను మెరుగుపరిచేదని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెంచారని, ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు నిధులు కేటాయించినట్లు వివరించారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించారని ప్రస్తావించారు. అయితే కొన్ని వస్తువులపై సెస్ విధించడంతో మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు పెంచడానికి ఉపయోగపడుతుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తాగునీటి కోసం జలజీవన్ మిషన్ కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రపంచమంతా ఆర్థికంగా నష్టపోయినా దేశంలో ఆత్మనిర్భరతా నినాదంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా బడ్జెట్ రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని తీసిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో ప్రస్తావన లేకపోతే నిధులు, మొండిచేయి చూపినట్లు కాదని పేర్కొన్నారు. పోలవరం గురించి రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ రానున్నట్లు ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు, బడ్జెట్ కేటాయింపుల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. -
పార్లమెంటులో బడ్జెట్(2021-2022) సమావేశాలు
-
ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తుల మీద పన్నుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు 6.5 శాతానికి పైగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఇతర సిగరెట్ తయారీ సంస్థల షేర్ ధరలు కూడా పెరిగాయి. విఎస్టి ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల షేర్లు కూడా 2.06 శాతం, 7.94 శాతం, 0.83 శాతం పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున బడ్జెట్ కు ముందు పొగాకు, మద్యం వంటి వాటిపై పన్ను పెంపు ఉంటుందని అందరు భావించారు. కానీ ఎటువంటి పెంపులేకపోవడంతో సిగరెట్ తయారీ దారులు ఊపిరి పీల్చుకున్నారు.(చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!) వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రవేశపెట్టిన అగ్రిసెస్ను మద్యం మీద ప్రవేశపెట్టారు. కానీ, పొగాకు ఉత్పత్తులపై మీద విధించలేదు. ఐటీసీ, ఇతర సిగరెట్ తయారీ సంస్థల స్టాక్స్ బడ్జెట్ ప్రకటనకు ముందు ఎక్కువ మంది తమ స్టాక్స్ ను అమ్ముకోవడాని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సిగరెట్ తయారీ సంస్థలు కొంచం ఉపశమనం లభించింది. బ్రోకరేజ్ సంస్థ ఎడెల్విస్ సెక్యూరిటీస్ ప్రకారం, ఈ ఏడాది బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై పన్నుల పెంపు విధించే అవకాశం తక్కువగా ఉంటుంది అని అంచనా వేసింది. ఎందుకంటే గత ఏడాది 2020 బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో పన్ను విధించారు. -
ఏపీకి నిరాశ మిగిల్చిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ లోక్సభాపక్ష నేత మిధున్ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి సోమవారం ఇక్కడి విజయ్ చౌక్లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ను బడ్జెట్లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల బడ్జెట్లా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఊసే లేదు.. ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు గత బడ్జెట్లకు ఏమాత్రం భిన్నంగా లేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్లకు సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున వాటికి వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్ట్లను బడ్జెట్లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అలాగే మెట్రో రైల్ విషయానికి వస్తే... కొచ్చి, బెంగుళూరు, చెన్నై, నాగపూర్లలో మెట్రో రైల్ కోసం వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ కావాలని అడుగుతున్నాం. కానీ దాని గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు విషయంలో ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ ఊసే లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం బడ్జెట్లో చేయలేదు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఖరగ్ఫూర్ నుంచి విజయవాడ, నాగపూర్ నుంచి విజయవాడ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరికే ప్రయోజనం ఏమీ ఉండదు. కడప-బెంగుళూరు రైల్వే లైన్కు నిధులు కేటాయించాలని ఇప్పటికి అనేకమార్లు అడిగాం. ఆ కేటాయింపులపై ప్రస్తావన లేదు. ఉద్యానవన పంటల రవాణా కోసం మరిన్ని కిసాన్ రైళ్లు అడిగాం. దేశం మొత్తంమీద 11.8% పండ్లు ఆంధ్రప్రదేశ్లోనే పండుతాయి. కాబట్టి దేశంలోని వివిధ నగరాలకు వాటిని త్వరితగతిన రవాణా చేసేందుకు ఎక్కువ కిసాన్ రైళ్లు నడపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మొహన్ రెడ్డి కేంద్రాన్ని అడుగుతూ వచ్చారు. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఆసక్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. హోదా విషయాన్ని కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాలపై నెట్టివేస్తూ వచ్చిందని అన్నారు. బడ్జెట్ విషయంలో వైయస్ఆర్సీపీ డిమాండ్స్.. దేశవ్యాప్తంగా నాలుగు వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అందులో ఒక వైరాలజీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ సభ్యులంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. దేశంలో ఏడు టెక్స్టైల్స్ పార్క్లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. విస్టాడోమ్ రైల్వే బోగీలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-అరకు మధ్య మరిన్ని విస్టాడోమ్ కోచ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు కేంద్రం చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను త్వరలోనే 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం అనేది చాలా ప్రధానమైన అంశమని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. నదులన్నింటినీ అనుసంధానం చేసిన పిమ్మట టెలీమెట్రీ పరికరాల సాయంతో ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలో ప్రవాహాన్ని అంచనా వేసి ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికగా నదీ జలాలని కేటాయించాలన్నది మా ప్రభుత్వ విధానం. దాన్ని అనుసరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పన్నుల సంస్కరణల విషయానికి వస్తే.. ఒక లక్షరూపాయలకు స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనేది మా డిమాండ్. దాన్ని కూడా ఈసారి బడ్జెట్లో పరిగణలోకి తీసుకోలేదు. బడ్జెట్లో ఒకే ఒక్క ఆశాజనకమైన అంశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్అభివృద్ధి, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంతే తప్ప ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. కరోనా నేపథ్యంలో అభివృద్ధికాముక బడ్జెట్ కావాలి కానీ సర్వసాధారణ బడ్జెట్ అవసరం లేదు. అప్పు చేసి అయినా డబ్బును చెలామణిలోకి తెస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధి అనేది అప్పుడే సాధ్యమౌతుందని అన్నారు. ఈస్ట్రన్ రైల్వే కారిడార్లో ఖరగ్పూర్ - విజయవాడ వరకు సరుకు రవాణా కారిడార్ వేశారు. దీంతో మేం సంతృప్తి పడటం లేదని అన్నారు. బడ్జెట్లో విశాఖపట్నంకు ఫిషింగ్ హబ్ కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాంతో పోల్చి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఫిషింగ్ హార్బర్ ఏమాత్రం సరిపోదని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి.. పీఎం కిసాన్- రైతు భరోసా కింద ప్రతి రైతుకు సీఎం శ్రీ జగన్ గారు రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000 మాత్రమే ఇస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000లకు పెంచాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. రాష్ట్రంలో 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత పనులపై జీవిస్తున్నారు. పీఎం కిసాన్ కేటాయింపుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీన్ని రూ.10,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్లో 1350 వ్యాధులు మాత్రమే కవర్ అవుతుంటే.. సీఎం శ్రీ జగన్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీలో 2,434 వ్యాధులు కవర్ అవుతాయి. దీనినిబట్టి ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీలా ఆయుష్మాన్ భారత్ కూడా అన్ని వ్యాధులు కవర్ చేయాలని కోరారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నవరత్నాల కింద 2020-21 రాష్ట్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమం కోసం చేసిన కేటాయింపుల్లో 110% పెరుగుదల కనిపిస్తుంటే కేంద్ర బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం డిసెంబర్ 2020 నాటికి 38.7 మిలియన్లుగా ఉంది. గతేడాదితో (2019) పోల్చి చూస్తే 27.4 మిలియన్లుగా ఉంది. నిరుద్యోగ శాతం 11.3 మిలియన్లు పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించటానికి సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రత్యేకంగా పెట్టుకోవటం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా రాష్ట్రం ముందుకు వచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు. ఈ బడ్జెట్ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారాయన. దీనిని కేంద్ర బడ్జెట్ అని పిలిచే బదులు. వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ను పరిశీలించి చూస్తే ఇది మిగతా రాష్ట్రాలకు వర్తించదేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు -
బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు
న్యూఢిల్లీ: కరోనా కాలం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసింది. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు కేటాయింపులు అత్యధికంగా జరగడం ప్రధాన అంశం. ఇక మొత్తం బడ్జెట్ను పరిశీలిస్తే శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఈ బడ్జెట్లో యథావిధిగా అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపులు దక్కాయి. దాని తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ. (చదవండి: బడ్జెట్ 2021: చైనా దూకుడుకు చెక్) రూ.4.78 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. దీనిలో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం గమనార్హం. ఈ విషయమై లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలో రక్షణ రంగంలో ఈ స్థాయి మూల ధన వ్యయం లేదని తెలిపారు. ఇక అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖ: రూ.1,66,547 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు వ్యవసాయ, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు రైల్వేలు: రూ.1,10,055 కోట్లు విద్యా శాఖ : రూ.93,224 కోట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు గృహ, పట్టణ వ్యవహారాల శాఖ : రూ.54,581 కోట్లు కొవిడ్ వ్యాక్సినేషన్కు రూ.35 వేల కోట్లు కేటాయించడం విశేషం. స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకానికి తొలి కేటాయింపులు రూ.64,180 కోట్లు -
అసలు ఇదేం బడ్జెట్: సీఎం ధ్వజం
కోల్కతా: ‘‘అసలు ఇదేం బడ్జెట్.. ఇదో నకిలీ బడ్జెట్. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక.. దేశ వ్యతిరేక బడ్జెట్ ఇది. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. సెస్లు విధించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. రైతులు నష్టపోతారు. 15 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పుడేం జరిగింది’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా, పీఎస్యూలు ప్రైవేటీకరణ చేశారు. దీంతో ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ బడ్జెట్ ఎలా ఉందని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాను అడిగాను. మాటలతో ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేలా ఉందని చెప్పారు’’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరును విమర్శించారు.(చదవండి: బడ్జెట్ 2021: ప్రధాని మోదీ స్పందన) అదే విధంగా, బీజేపీకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం అలవాటు లేదని, కేవలం అబద్ధాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటారంటూ మండిపడ్డారు. కాగా బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి బడ్జెట్లో కేంద్రం భారీగా నిధులు కేటాయించడం విశేషం. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. -
బడ్జెట్ 2021: చైనా దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఎప్పుడు రక్షణ శాఖకే ఉంటాయి. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా రక్షణ శాఖకు భారీగా కేటాయింపులు వచ్చాయి. 15 ఏళ్లలో లేనట్టు ఈసారి కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల తెలిపారు. మొత్తం రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. ఇందులో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం గమనార్హం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. దీంతో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం.. సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సరిహదుల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరిపారు. (బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి! ) ఈ కేటాయింపులపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘‘2021-22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్ల కేటాయింపుతో పాటు మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఇచ్చిన ప్రధానమంతి, ఆర్థిక మంత్రికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 15 ఏళ్ల తర్వాత మూలధన వ్యయంలో 19 శాతం పెంపు జరిగింది’’ అని ట్విట్టర్లో రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.రక్షణ రంగానికి గతేడాది కేటాయింపులు పరిశీలిస్తే రూ.3.62 లక్షల కేటాయింపులు జరగ్గా ఈ ఆర్థిక సంవత్సరం రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 7.4 శాతం పెరిగింది. ఇక ఆయుధాల కొనుగోలు, మరమ్మతులకు గతేడాది రూ.1,13,734 కోట్లు ఉండగా ఈసారి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 18 శాతం పెంపుతో రూ.1,35,060 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ నిధులతో ముఖ్యంగా చలికాలంలో లడ్డాఖ్లో50 వేల భద్రతా దళాలకు సౌకర్యాల మెరుగు చేయనున్నారు. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు పక్క దేశం చైనా కన్నా చాలా తక్కువ. చైనా బడ్జెట్ పరిశీలిస్తే 2014-19 కాలంలో 261.11 బిలియన్ డాలర్లు కేటాయించింది. భారత్ కేవలం 71.1 బిలియన్ డాలర్లు కేటాయించడం గమనార్హం. ఇక మన దాయాది దేశం 10.3 బిలియన్ డాలర్లు కేటాయించింది. ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారత్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్లో రక్షణకు అత్యధిక కేటాయింపులు జరిగాయి. I specially thank PM& FM for increasing the defence budget to 4.78 lakh cr for FY21-22 which includes capital expenditure worth Rs 1.35 lakh crore. It is nearly19 percent increase in Defence capital expenditure. This is highest ever increase in capital outlay for defence in 15yrs — Rajnath Singh (@rajnathsingh) February 1, 2021 -
బడ్జెట్ 2021: ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త అవకాశాలు కల్పించేలా బడ్జెట్-2021 రూపకల్పన జరిగిందని, అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టామని హర్షం వ్యక్తం చేశారు. కాగా విపక్షాల ఆందోళనల నడుమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) ఈ అంశంపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘ఇంతకు ముందెన్నడూ లేని అసాధారణ పరిస్థితులలో కేంద్ర బడ్జెట్ 2021 ప్రవేశపెట్టబడింది. తద్వారా భారత్ ఎంతటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలదో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ను రూపొందించాం. రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై దృష్టి సారించాం. ఇకపై అన్నదాతలు సులభంగా రుణాలు పొందగలుగుతారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి(అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) సాయంతో ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేసేందుకు బాటలు పడ్డాయి. సామాన్యుడిపై పన్ను భారం వేస్తామని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బడ్జెట్ ఉంది. యువతకు ఉపాధి కల్పన, సరికొత్త అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్: కడుపుబ్బా నవ్వించే మీమ్స్
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ మీద సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆశల పల్లకిలో నుంచి అగాధంలోకి తోసేసారు కదా, మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్ని మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందించారు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుంది అనుకున్న బడ్జెట్.. ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సామాన్యుడి స్పందన ఎలా ఉంటుందో మీమ్స్ రూపంలో ప్రతిబింబిస్తోంది. ఈ సెటైర్లను చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. మరింకెందుకాలస్యం, బడ్జెట్ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి... (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) I will share my views on today's budget #Budget2021 . Me views rn :- pic.twitter.com/Tbrqxeithf — ULFAT🌸 (@filhaal_to) February 1, 2021 Me explaining budget... #Budget2021 pic.twitter.com/DFA9cYPGS7 — Devendra (@deven_zip) February 1, 2021 Going to office after one year of Work from home. #Budget2021 pic.twitter.com/n9qnMugVJS — Sharpasm (@Sharpasm7) February 1, 2021 Taxpayers to govt before every budget : Please reduce our tax burden Govt:#Budget2021 pic.twitter.com/W6kZX5ttSq — Finance Memes (@Qid_Memez) February 1, 2021 Professionals waiting for #BudgetLikeNeverBefore #Budget2021 pic.twitter.com/SybImcIs0Y — CS Jigar Shah (@FCSJigarShah) January 31, 2021 Indian middle class after #budget2021 #petrolpriceHike pic.twitter.com/h8no8RBseM — sab_moh_maya_hai. (@vaishnavi_j07) February 1, 2021 CA log aaj ke din.. 😊😊😊#Budget2021 #BoloGuruji pic.twitter.com/yHACssrW06 — Akarshan Jaiswal (@Akarshanj_) February 1, 2021 Before Valentine Day After valentine day pic.twitter.com/341I7XjFuk — Heisenberg (@Its_Heisen_berg) February 1, 2021 This #budget2021 is for common middle people Meanwhile middle class people watching budget: pic.twitter.com/a3O0Ag2pBg — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Understanding gains for middle class people in #Budget2021 pic.twitter.com/mwCrhfT40g — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Middle class people to #Budget2021 pic.twitter.com/i3PvCKqbkv — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Every year after Budget . #Budget2021 pic.twitter.com/uBdIblt60y — Economist Hunटरर ♂🥳 (@nickhunterr) February 1, 2021 Common People Vs. Finance Minister during #Budget2021 pic.twitter.com/jEkikCDXEQ — Godman Chikna (@Madan_Chikna) February 1, 2021 Tax payer calculating their next year tax liability after seeing #Budget2021 pic.twitter.com/vkNAgBY0tu — Rahul Pandey (@rahulpandey89) February 1, 2021 -
దలాల్ స్ట్రీట్లో మెరుపులు : ఎందుకంటే?
సాక్షి,ముంబై: కేంద్ర బడ్జెట్లో ఆర్థికమమంత్రి నిర్మల సీతారామన్ ఆరోగ్య సంరక్షణకోసం భారీ నిధులతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం దలాల్ స్ట్రీట్ లాభాలతో కళకళలాడింది. హెల్త్కేర్ వ్యయానికి నిధుల రెట్టింపు, బీమా మార్కెట్లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను ఎత్తివేసే ప్రణాళికలను రూపొందించడంతో బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం 5శాతానికి పైగా ఎగిసాయి. ఆరంభం నుంచీ లాభాలతో ఉన్న మార్కెట్లో బడ్జెట్ ప్రసంగం మొదలు, ముగిసేదాకా తమ జోష్ను కంటిన్యూ చేశాయి. సెన్సెక్స్ 2315 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 14250కి ఎగువన ముగిసింది. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. (బడ్జెట్ 2021 : పడిన పసిడి ధర) ముఖ్యంగా బాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల లాభాలతో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బిఐ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఆస్తి పునర్నిర్మాణ సంస్థ ఏర్పాటు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనే చర్యలు, ప్రభుత్వరంగ బ్యాంకుల విభజన, బీమారంగంలో ఎఫ్డిఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్ వంటి ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని చర్యలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేసాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కోవిడ్ సెస్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వడ్డింపు భయాలు ఉన్నాయని, కానీ వీటిలో ఏదీ బడ్జెట్ 2021 లో కార్యరూపం దాల్చకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. (కేంద్ర బడ్జెట్: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట) మరోవైపు ఇది కార్పొరేట్ బడ్జెట్, ఎన్నికల బడ్జెట్, ప్రజా వ్యతిరేక అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులుంచాలన్న నిపుణుల సూచనలను కేంద్రం అసలు పట్టించుకోలేని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజల చేతుల్లో నగదు పెట్టడం మర్చిపోయిన మోడీ ప్రభుత్వం భారత ఆస్తులను క్రోనీ కాపిటలిస్టులకు కట్టబెడుతోందని ఆయన ట్వీట్ చేశారు. -
మొబైల్ ప్రియులకు షాకిచ్చిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొబైల్ ప్రియులకు షాకిచ్చింది. బడ్జెట్ 2021 ప్రసంగంలో మొబైల్ విడిభాగాలపైన 2.5శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. (చదవండి: లీకైన శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్) ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్బోర్డ్లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన భాగాలు, ఉప భాగాలపై ఇప్పటివరకు ఎటువంటి పన్ను విధించలేదు. కానీ, ఇప్పుడు 2.5 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.(చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) ఇదిలా ఉంటే.. దేశీయంగా ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఉత్పత్తి గొలుసులో భారత్ను భాగస్వామిగా చేసేందుకు , ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. మేకిన్ ఇండియా విధానంలో భాగంగానే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలపై కస్టమ్స్ సుంకాల రేట్లలో పెరుగుదల ఉంటుంది. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం పెరగనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఐతే దిగుమతి సుంకంలో పెరుగుదల ప్రభావం వినియోగదారులపై అంతగా ఉండకపోవచ్చని.. దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్ 97 శాతం అవసరాలు స్థానిక ఉత్పత్తుల వల్లనే సరిపోతాయని కొందరు పరిశీలకులు అంటున్నారు. -
బడ్జెట్ 2021: మందుబాబులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న అంశం సెస్. ఇక మీదట క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్పై కేంద్రం 100 శాతం సెస్ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల కళ్లు బైర్లు కమ్మెలా మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముడి పామాయిల్పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్ని బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ) ఫలితంగా వంట నూనెలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనెలు లీటర్ 140 రూపాయలుగా ఉండగా.. వ్యవసాయ సెస్ అమల్లోకి వస్తే.. ఇది మరింత పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్పై విధించిన వ్యవసాయ సెస్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా వాటి ధరలు యథాతధంగా ఉంటాయిన నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్ 2021 : పడిన పసిడి ధర
సాక్షి,న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక ప్రతిపాదన చేసింది. బంగారంపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారంపై సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి . తద్వారా పసిడి ప్రేమికులకు ఊరట కలుగనుంది. అయితే 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాలు , అభివృద్ధి సెస్ (ఏఐడీసీ)ను బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. ఈ అగ్రి సెస్ విధించడం వల్ల వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకే, కస్టమ్స్ సుంకం రేట్లు తగ్గించినట్టు వెల్లడించారు. జూలై, 2019లో సుంకం 10శాతం నుండి పెంచిన తరువాత విలువైన లోహాల (బంగారం,వెండి) ధరలు బాగా పెరిగాయి. వాటిని మునుపటి స్థాయిలకు దగ్గరగా తీసుకొచ్చేందుకు కస్టమ్ సుంకాన్ని హేతుబద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే డైమండ్, బంగారు ఆభరణాల వ్యాపారుల దీర్ఘకాలిక డిమాండ్ కనుగుణంగా దిగుమతి సుంకం తగ్గింపు సరైన నిర్ణయమని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు బంగారం అక్రమ లావాదేవీలను అడ్డుకునేందుకు ఇ-గవర్నెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 3 శాతం కుప్పకూలింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,500 పడిపోయింది. రూ.47,918లుగా ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం పెరిగింది. ఔన్స్కు 1872.4 డాలర్లుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్టైం గరిష్టం నుంచి దిగి వచ్చాయి. కిలో ధర 73,508 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లలో 10 శాతం పెరిగింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2019 జూలై నెలలో దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన నేపథ్యంలో ఇటీవలికాలంలో పుత్తడి ఆల్టైం గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్, డీజిల్పై సెస్ విధించడం దారుణమన్నారు.(చదవండి: బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం) రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.(చదవండి: ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ) -
ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్పై వ్యవసాయ సెస్సు విధింపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ చేసింది. ఇప్పుడు సెస్ విధింపుతో ఇంధనం ధర మరింత ఎగబాకనుంది. లీటర్ పెట్రోల్పై 2.50 రూపాయలు, డీజిల్పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. ఒక్కసారిగా ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఇక ఈ వ్యవసాయ సెస్సు విధుంపుతో.. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం.. అన్ని అంశాలపై ఉంటుంది. ఇక అప్పుడు సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టు లేదు ధరలిట్టా మండిపోతే’ అని పాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. (చదవండి: బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు) ఇక వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్ విధించి.. ఇతర ట్యాక్స్లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. (చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!) -
కేంద్ర బడ్జెట్: ఆ రాష్ట్రాలపై వరాల జల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది. రానున్న ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసింది. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్పై బడ్జెట్లో స్పష్టమైన మార్కును చూపెట్టింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించింది. రూ.లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధితో పాటు లక్షా 18వేల కి.మీ మేర రైల్వే లైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. (కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2021-22) అలాగే బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు నిధులను తమిళనాడుకు సమకూర్చింది. రానున్న మరో ఆరునెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్శించే విధంగా నిధుల కేటాయింపులు జరిపింది. మరోవైపు ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్పై సైతం కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. బెంగాల్లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్లో నిధులు సమీకరించింది. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. అసోం, బెంగాల్, కేరళలో ఐదు ప్రత్యేక జాతీయ అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఈ కేరళకు సైతం నిధులు భాగానే వడ్డించింది. కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి రూ.1957 కోట్లు కేటాయింపులు జరిపింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయాలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది. మరోవైపు బెంగళూరు, నాగ్పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి రూ.14,788 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. మరోవైపు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంపై కూడా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. అసోంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరిపింది. -
ఆటోమొబైల్ రంగానికి బడ్జెట్ జోష్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈసారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణహితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. (చదవండి: బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం) వాయు కాలుష్య నివారణకుగాను రూ.2,217 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. కాలం చెల్లిన వాహనాల తుక్కు పాలసీ కింద వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మలా పేర్కొన్నారు. త్వరలో తుక్కు విధానం రాబోతున్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీల జోష్ పెరిగింది. ఆటో రంగంలో పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండటంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. -
సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్..
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడం నిరాశ కలిగించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. (చదవండి: కేంద్ర బడ్జెట్: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట) కేంద్ర బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. ఉపాధి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు.ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామని ఆయన తెలిపారు.(చదవండి: బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం: విజయసాయిరెడ్డి) ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, రైల్వే జోన్కు నిధులు కేటాయించకపోవడం నిరాశ పరిచిందని, ఫిషింగ్ హార్బర్ కేటాయించడం ఒక కంటి తుడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలని, విభజిత ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 16 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని... గత ఏడాది కేవలం మూడు మెడికల్ కాలేజీలకు మాత్రమే నిధులు ఇచ్చారని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు కోసం ఎంపీలందరూ కలిసి పోరాడతామన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే అంశాలు బడ్జెట్లో లేవని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సగటు వేతన జీవిని నిరాశ పరిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ‘‘విశ్వాసం పక్షిలాంటిది. తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్న సమయంలో కూడా అది వెలుతురును అనుభవిస్తూ.. పాడుతుంది’’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు గంట 51 నిమిషాలు సాగిన నిర్మల బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. దాంతో పాత శ్లాబులే కొనసాగుతాయని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్యానికి, మౌలిక సదుపాయల అభివృద్ధికి, రైల్వేలకు, వ్యవసాయనికి పెద్ద పీట వేశారు. పెట్రో బాదుడు.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబెలేత్తుతుండగా.. బడ్జెట్ తర్వాత వాటి ధరలు మరింత పెరగనున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 2.50 రూపాయలు, డీజిల్పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధించనున్నారు. దాంతో పెట్రో మంట ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. -
బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాటన్పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ అమల్లోకి రానుంది.(చదవండి: ముగిసిన బడ్జెట్ ప్రసంగం: లోక్సభ రేపటికి వాయిదా) ధరలు పెరిగేవి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు) చెప్పులు పర్సులు చార్జర్స్(మొబైల్ విడిభాగాల్లో కొన్నింటికి మినహాయింపు) సింథటిక్ జెమ్స్టోన్స్ లెదర్ ఉత్పత్తులు సోలార్ ఇన్వర్టర్లు(డ్యూటీ 5 శాతం నుంచి 20 శాతానికి పెంపు) సోలార్ లాంతర్లు(5 నుంచి 15 శాతానికి పెంపు) ఆటో విడిభాగాలు స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు) కాటన్(0 నుంచి 10 శాతం) రా సిల్స్, యాన్ సిల్క్(10 నుంచి 15 శాతానికి పెంపు) ఆల్కహాలిక్ బీవెరేజెస్ క్రూడ్ పామాయిల్ క్రూడ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ ఆపిల్స్ బొగ్గు, లిగ్నైట్, పిట్ యూరియా తదితర ఫర్టిలైజర్లు బఠాణీలు కాబూలీ శనగలు బెంగాల్ గ్రాం పప్పులు ధరలు తగ్గేవి ఐరన్ స్టీలు నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్ కాపర్ వస్తువులు ఇన్సూరెన్స్ షూస్ బంగారం, వెండి ధరలు నాప్తా(హైడ్రోకార్బన్ లిక్విడ్ మిక్చర్) -
బడ్జెట్ 2021: కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15వేల స్కూళ్లు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. అలానే కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.. 100 సైనిక్ స్కూళ్లు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించారు. గగన్యాన్ మిషన్లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తామన్నారు. స్టార్టప్లకి టాక్స్ హాలీడేని మరో ఏడాది పొడిగించారు. లేహ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్కు 3వేల కోట్ల రూపాయలు.. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 5వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మీదట 5 కోట్లు దాటిన లావాదేవీలన్నీ ఇకపై డిజిటల్ విధానంలోనే జరగాలని నిర్మలా సీతారామన్ సూచించారు. -
సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆదాయ పన్ను దాఖలులో మినహాయింపునిచ్చారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది చాలా కీలకమైందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ఆన్ఐఆర్లకు డబుల్ టాక్సేషన్నుంచి ఊరటనిచ్చారు. అయితే ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. దీంతో పాటు మరికొన్ని పన్నుచెల్లింపు ప్రక్రియ చెల్లింపు సరళీకరణ చర్యలను ప్రకటించారు. దీంతోపాటు స్టార్టప్లకు ట్యాక్స్ మినహాయింపు మరో ఏడాది పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటే 75 ఏళ్లు, అంతుకు పైబడిన సినీయర్ సిటిజన్లకు టాక్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే ఎన్నారై పెట్టుబడు దారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఎన్నారైలు భారత్లో ఉండే గడువును 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. గత బడ్జెట్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించామని పేర్కొన్న ఆమె ఫేస్లెస్ ఇన్కంట్యాక్స్ అప్పిలైట్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి పన్ను చెల్లింపుదారులు 6.48 కోట్లకు పెరిగారని ఆమె తెలిపారు. -
బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకుగాను 1,72,000వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2020-21లో రైతులకు 75వేల కోట్ల రూపాయలు కేటాయించామని.. దీని వల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా మరో 1000 మండీలను ఈనామ్తో అనుసంధానిస్తమన్నారు. అస్సాం, బెంగాల్లో పని చేస్తున్న టీ కార్మికుల కోసం1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా.. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: దిగి రానున్న వెండి, బంగారం ధరలు) ‘‘ఇన్సూరెన్స్ యాక్ట్-1938కు సవరణలు చేయాల్సిందిగా ప్రతిపాదిస్తున్నా. తద్వారా బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమవుతుంది. నిబంధనలను అనుసరించి విదేశీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు లభిస్తాయి’’ అని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. I propose to amend the Insurance Act 1938 to increase the permissible FDI limit from 49% to 74% in insurance companies and allow foreign ownership & control with safeguards: Finance Minister Nirmala Sitharaman. #Budget2021 pic.twitter.com/c9WHDH4CQ2 — ANI (@ANI) February 1, 2021 బడ్జెట్ బూస్టింగ్ మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్తో స్టాక్మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది. -
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రోకి భారీగా నిధులు ఇక బడ్జెట్లో మెట్రోలైట్, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగ్పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
దూసుకెళ్తున్న మార్కెట్లు : హెల్త్కేర్ షేర్లు జూమ్
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ కేర్ షేర్లు ఒక్కసారిగా జూమ్ అయ్యాయి. నారాయణ హెల్త్ కేర్ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్హెల్త్ కేర్ ఫోర్టిస్ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి. దీంతో సెన్సెక్స్ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్,హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న ఆమె... ఏళ్లలో రూ . 64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ను బలోపేతం చేయనున్నామని, ఇందుకోసం దేశంలో కొత్త 15 సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. -
బడ్జెట్ 2021: 20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈ సారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. ఇక దీనిలో భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాల లైఫ్టైమ్ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు. (చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
కేంద్ర బడ్జెట్: 64,180 కోట్లతో సరికొత్త పథకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి 2021-22 బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం బడ్జెట్ యాప్ను విడుదల చేసింది. ఇక విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్... కరోనా లాక్డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ‘‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేశాం. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. ‘‘100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం’’ అని తెలిపారు.(చదవండి: లైవ్ అప్డేట్స్: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ) ఇక గతంలో ఎన్నడూలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. గతేడాది లాక్డౌన్ అమలు చేయాలన్న నిర్ణయం కఠినమైనదేనన్న నిర్మలా సీతారామన్... లాక్డౌన్ విధించకపోతే మరింత ఘోరమైన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
బడ్జెట్ 2021: కోవిడ్ సెస్ పడనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టనున్నారా.. లేదా అనే విషయం మరికొద్దిసేపట్లో తేటతెల్లం కానుంది. 2020 ఆర్థిక సంవత్సరాన్ని కరోనా కకావికలం చేసింది. ఆదాయం తక్కువ.. వ్యయం ఎక్కువయ్యింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషన్. దాదాపు 130 కోట్ల మంది జనాభాకు ఉచితంగా.. లేదా నామ మత్రపు ఖర్చుతో టీకా అందించడం అంటే మాటలు కాదు. మాస్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా సెస్ విధించాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనను కోవిడ్-19 సెస్, సర్చార్జ్గా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి ప్రకటన వెలువడనుందని సమాచారం. చాలా తక్కువ మొత్తంలో ఉండనున్న ఈ సెస్.. కేవలం టాక్స్ పేయర్స్కు మాత్రమే వర్తించబోతుందని తెలుస్తోంది. ప్రభుత్వం కోవిడ్-19 సెస్తో పాటు పెట్రోలియం, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సెస్ను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక దీని గురించి మరి కాసేపట్లో తెలుస్తుంది. (చదవండి: బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!) దేశ జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేయడానికి భారీ వ్యయాన్ని కేంద్రం భరించాల్సి వస్తోంది కాబట్టి.. కోవిడ్-19 సెస్ని ప్రవేశపెట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 30 కోట్ల మందికి టీకా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వినోద్ పాల్ ఇంతకు ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా వారికి కూడా తక్కువ మొత్తంలో వ్యాక్సిన్ని అందివ్వాలని భావిస్తున్నారు. కోవిడ్ టీకా పంపిణీ, శిక్షణ, లాజిస్టిక్స్ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎదుర్కొనే అధిక ఖర్చులు చూస్తే, అధిక ఆదాయ వ్యక్తుల కోసం కోవిడ్ -19 సెస్ అవకాశం ఉండవచ్చు. -
బ్యాంక్స్ ఆన్ ఫైర్ : మార్కెట్ల జోష్
సాక్షి, ముంబై: మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400పాయింట్లు జంప్ చేసిన సూచీలు అదేజోరును కంటిన్యూ చేస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్రంగషేర్లులాభాలతో దూకుడుమీదున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 438పాయింట్లుఎగిసి 46723 వద్ద,నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో13744 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, ఐవోసీ తదితర షేర్లు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి పేపర్లెస్గా డిజిటల్ అవతారమెత్తింది. ఈనేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాంప్రదాయకమైన బహీఖాతా పుస్తకం బదులుగా మేడిన్ ఇండియా ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బడ్జెట్ను చదవి వినిపించనున్నారు. ఎర్రటి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్తో మంత్రి నిర్మల సీతారామన్ తదితరులు ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. కేబినెట్ ఆమోదం అనంతరం దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. -
కేంద్ర బడ్జెట్: దిగిరానున్న వెండి, బంగారం ధరలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం) పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు 11వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం బెంగాల్లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధి ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట్కోస్ట్ సరకు రవాణా కారిడార్ బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గానికి ఊరట గృహరుణ మినహాయింపులు 2022, మార్చి 31 వరకు కొనసాగింపు స్టార్టప్లకు ఇచ్చే తాయిలాలు మరో ఏడాది పొడిగింపు పెరిగేవి.. తగ్గేవి మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్పై రూ.4 వ్యవసాయ సెస్సు పెట్రోల్ లీటర్కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు పెరగనున్న మొబైల్ ధరలు అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు 5 % సెస్సు తగ్గింపుతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి రాగిపై పన్ను మినహాయింపులు పెరగనున్న సోలార్ ఇన్వెటర్ల ధరలు ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపు పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు కాటన్పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపు దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు పెరగనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు సీనియర్ సిటిజన్లకు ఊరట పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు. 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం ఎన్నారైలు భారత్లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు ఎన్ఐఆర్లకు డబుల్ టాక్సేషన్నుంచి ఊరట పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు ట్యాక్స్ ఆడిటింగ్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ట్యాక్స్ ఆడిట్ పరిమితి రూ.10 కోట్లకు పెంపు 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్కు ప్రోత్సాహం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 15 వేల పాఠశాలలు శక్తివంతం కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు ఎన్జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు లెహ్, లడఖ్లో యూనివర్సిటీ ఏర్పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ రైతుల సంక్షేమం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు మౌలిక రంగానికి భారీగా నిధులు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు జమ్మూకశ్మీర్లో గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలు బ్యాడ్ బ్యాంక్కు బదలాయింపు ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు బీమా రంగంలో ఎఫ్డీఐలు 74 శాతానికి పెంపు 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు జల జీవన్ మిషన్కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల,400 కోట్లు మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే వాహన పొల్యూషన్ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ ఆత్మనిర్భర్ యోజన పథకం 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్ యోజన పేరుతో కొత్త పథకం నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు ఆరోగ్య రంగానికి పెద్దపీట 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం యూనియన్ బడ్జెట్ యాప్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచాం ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్, బడ్జెట్ యాప్ రిలీజ్ చేసిన కేంద్రం అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం ఆందోళనల నడుమ ప్రసంగం.. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. టీమిండియా అద్భుత విజయాన్ని ఆమె ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్లో అప్లికేషన్ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్ను సభ ముందుంచునున్నారు. మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్ భేటీలో బడ్జెట్కు ఆమోదం అనంతరం లోక్సభలో ప్రవేశపెడతారు. చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మేడ్ఇన్ ఇండియా ట్యాబ్లో బడ్జెట్ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్లో చూసి ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మేడ్ఇన్ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్తో నిర్మలా సీతారామన్, అనురాగ్ఠాకూర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, అమిత్ షా కూడా పార్లమెంట్కు హాజరయ్యారు. బహీ ఖాతాలో ఏం దాచారో.. ఇక వ్యాక్సిన్ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ జరగుతోంది. భారత్ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా బడ్జెట్ను లెదర్ బ్యాగ్లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది. -
సభ సజావుగా సాగాలి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ అర్థవంతంగా సజావుగా పని చేసేలా చూడాలని రాజ్యసభలో వివిధ పార్టీల నేతలను చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సభ సజావుగా సాగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నేతలు తెలిపారు. రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదివారం తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 వరకు నిర్వహించాల్సి ఉండగా సభ్యుల అభ్యర్థన మేరకు స్థాయీ సంఘాలు, మంత్రిత్వశాఖల విభాగాల గ్రాంట్లు, డిమాండ్లు పరిశీలించేందుకు వీలుగా 13న సమావేశం కొనసాగించి అదే రోజు నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్పై చర్చకు మరింత సమయం ఇవ్వాలని పలువురు నేతలు కోరారు. సభలో క్లుప్తంగా మాట్లాడే నేర్పును అందిపుచ్చుకోవాలని, దీనివల్ల సభ్యులకు మరింత సమయం లభిస్తుందని మంత్రులకు వెంకయ్యనాయుడు సూచించారు. సభలో చిన్నపార్టీల సభ్యులకు సమయం కేటాయించే అంశంపైనా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. సుమారు 20 పార్టీలకు చెందిన నేతలందరూ మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చని వెంకయ్య అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్ ఇస్తారా? కేటాయిస్తారా?
ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారుల బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్’ అవవలసిన అవసరమైతే ఉంది. కొద్ది గంటల్లో బడ్జెట్! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్డౌన్ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్’ కరువై పోయింది. ఆ స్పేస్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా? స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్డౌన్లో ఉన్న సమయంలో ఒక్క జూన్ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్ హెల్ప్ లైన్కు 3 లక్షల కాల్స్ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్డౌన్ మొత్తం క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి. స్కూళ్లు మూత పడటం, ఆన్లైన్ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది. ∙∙ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్డౌన్. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి. ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్ హోమ్లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్ బేస్డ్ సోషల్ ప్రొటెక్షన్’ ని కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్ ఉమెన్ కమిషన్ అంచనా వేస్తోంది. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
కేంద్ర బడ్జెట్పై గంపెడాశలతో రాష్ట్రం
సాక్షి, అమరావతి: కేంద్రం సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగినన్ని నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలతో ఎదురు చూస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిలకు బడెŠజ్ట్లో తగినన్ని నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం 100 శాతం రీయింబర్స్మెంట్లను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఊతమందేనా.. రాష్ట్రంలో కొత్తమెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కోరినందున బడ్జెట్లో ఆ కాలేజీలకు నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్తో పాటు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణతో.. ఆ కార్యకలాపాలకు నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్య, వైద్య సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులను ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా కొంత ఉపశమనం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత ఆర్థిక ఏడాది 15వ ఆర్థిక సంఘం ఒక ఆర్థిక ఏడాదికే సిఫార్సులు చేసింది. ఇప్పుడు కూడా కోవిడ్ నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదికే గతేడాది సిఫార్సులనే మళ్లీ చేస్తుందా లేక కొంత మేర గ్రాంట్లు పెంచుతుందా అనే దానిపై రాష్ట్రానికి నిధులు రావడం ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బడ్జెట్ రైలు ఏపీలో ఆగేనా!
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రకటించే రైల్వే బడ్జెట్పై ఏపీ వాసులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తోంది. కానీ ఆ మేరకు ఏపీకి రైల్వే పరంగా నిధులు, పనులు మాత్రం మంజూరు కావడం లేదు. ఈ సారైనా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు, పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్ పచ్చ జెండా ఊపుతుందా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గంలో పురోగతి ఉంది. పిడుగురాళ్ల–శావల్యాపురం మధ్య 46 కి.మీ. రైల్వే లైన్ పూర్తయింది. విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో ఈ ఆర్థిక ఏడాది 106 కి.మీ. మేర విద్యుదీకరణ మార్గం పూర్తయింది. గత బడ్జెట్లో ఈ రైలు మార్గానికి రూ.1,158 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో కనెక్టివిటీ పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. రాష్ట్రంలో నర్సరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్లకు సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. కోస్తా రైల్వే లైన్ అయిన మచిలీపట్నం–బాపట్లకు కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. కడప–బెంగళూరు కొత్త రైలు మార్గానికి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అయితే ఈ దఫా ఈ మార్గం పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్కు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో తెలంగాణ కంటే ఏపీకే ప్రాధాన్యత కేంద్ర బడ్జెట్లో గత ఏడాది రైల్వే శాఖకు కేటాయించిన నిధుల్లో ఏపీకి తెలంగాణ కంటే సింహభాగం కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.6,846 కోట్ల కేటాయింపుల్లో ఏపీకి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులకు రూ.4,666 కోట్లు కేటాయించారు. ధర్మవరం–పాకాల–కాటా్పడి (290 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కి.మీ.) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్ల అంచనాలతో ఈ రెండు ప్రాజెక్టుల్ని మంజూరు చేశారు. ఈ దఫా కొత్త రైలు మార్గాలపై కోటి ఆశలున్నాయి. ఏపీలో డబ్లింగ్ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గం లాభసాటి కాదని రైల్వే బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. -
నేడే ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కరోనాతో ఒకవైపు జనజీవితం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు పార్లమెం ట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్ను ప్రకటించనున్నట్లు ఇటీవల నిర్మల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా మహమ్మారితో కుదేలైన వ్యవస్థలన్నీ ఈ బడ్జెట్పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. కరోనా దుష్ప్రభావాలను నిర్మూలించే సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నాయి. కరోనా కడగండ్లతో చతికిలపడిన సామాన్యుడికి ఊరట కల్పించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలు న్నారు. బడ్జెట్ను లెదర్ బ్యాగ్లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది. ఒక మధ్యంతర బడ్జెట్ సహా మోదీ హయాంలో ఇది 9వ బడ్జెట్. ఈ బడ్జెట్లో వైద్యారోగ్యం, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లో కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. ఉపా« ది కల్పన, గ్రామీణాభివృద్ధి, ఇతర అభివృద్ధి పథ కాలకు కూడా గరిష్టంగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రజల చేతిలో మరింత నగదు ఉండేం దుకు వీలు కల్పించేలా కీలక ప్రకటన ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మరిన్ని విదేశీ పెట్టబడులను ఆకర్షించేందుకు సంబంధిత నిబంధనల్లో సడలింపు కూడా ఉంటుందని తెలుస్తోం ది. కరోనా దుష్ప్రభావాలను తొలగించాలంటే.. కేవలం జమా ఖర్చుల పద్దును ప్రకటిస్తేనో, లేక పాత సీసాలో కొత్త సారాయి తరహా పథకాలను ప్రకటిస్తేనో సరిపోదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకు రావాలంటే.. దేశ బడ్జెట్ ఒక దార్శనిక ప్రకటనలా ఉండాలంటున్నారు. కరోనా తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కొనసాగుతుండటం వంటి సానుకూలతల మధ్య వస్తున్న ఈ బడ్జెట్ దేశంలోని అన్ని వ్యవస్థలకు జవజీవాలను చేకూర్చేలా ఉండాలి. కరోనా ప్రారంభమయ్యేనాటికే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. 2019–20 జీడీపీ 11 సంవత్సరాల కనిష్టానికి దిగజారి, 4 శాతానికి చేరింది. పెట్టుబడుల వృద్ధి రేటు కూడా తిరోగమనంలో ఉంది. ఆ తరువాత, కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్డౌన్తో ఆర్థికరంగ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దాంతో, ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రభుత్వం 3 ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిం చింది. అయితే, అవేమీ పెద్దగా ప్రభావం చూపలేదు. కాగా, ఈ బడ్జెట్లో కరోనా టీకా కార్యక్రమం ఖర్చు ఎంత ఉండనుందనేది ఆసక్తిగా మారింది. బీపీసీఎల్, ఎస్సీఐ, ఎయిర్ఇండియా వంటి సంస్థల ప్రైవేటైజేషన్తో ఎంత ఆదాయాన్ని సమకూర్చు కోవాలని ప్రభుత్వం భావిస్తోందన్న విషయం కూడా నిపుణుల దృష్టిలో ఉంది. ‘ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక రంగానికి సహకరించాలి. పారిశ్రామిక, సేవలు, సాగు రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి. పన్ను ఆదాయంపై రాజీ పడకుండానే ప్రజల్లో వినియోగం పెంచాలి. ఆరోగ్య, విద్య రంగాల్లో కేటాయింపులు పెంచాలి’ అని ‘డూన్ అండ్ బ్రాడ్షీట్’లో గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్గా ఉన్న అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రజలపై భారం వేయకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడమనే క్లిష్టమైన సవాలు ప్రభుత్వం ముందుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. ‘వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతులు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అంశాలపై కూడా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని బ్రిక్వర్క్ రేటింగ్స్ పేర్కొంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం పెంచడంపై, విద్య, వైద్య రంగాల్లో పెట్టబడులు పెంచడంపై దృష్టి పెట్టాలని ‘గ్లోబల్ డేటా’ సంస్థ సూచించింది. -
క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం... భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా... క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం. ► లాక్డౌన్ కారణంగా యూత్ స్పోర్ట్స్కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది. ► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే. ► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్’, ఎన్ఎస్ఎఫ్లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్ సెక్టార్లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్ డెవలపర్స్, స్టార్టప్స్ను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తే... నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్ ఇండియా బ్రాండ్కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. -
బడ్జెట్ టైమ్: ఆర్థిక భారతానికీ టీకా వేస్తారా?
ఒక్క నెల జీతం ఆగితేనే ఆరిపోయే బతుకులు!! మరి ఏడాది పాటు జీవితాలే ఆగిపోతే!!? ఊహలకే అందని ఈ విలయాన్ని... కోవిడ్ నిజం చేసింది. వేల మంది ప్రాణాలు పోయాయి. కోట్ల మంది జీవచ్ఛవాలయ్యారు. కుటుంబపెద్దలు పోయి... కుటుంబాలు వీధినపడ్డాయి. ఆర్థిక రథ చక్రాలు తునాతునకలైపోయాయి. మళ్లీ ఇవి గాడినపడేదెప్పుడు? ఆర్థిక మంత్రి ఈ రోజున ప్రవేశపెట్టే బడ్జెట్... గతేడాది గాయాలకు ఎలాంటి మందు వేస్తుంది? కోవిడ్ కొందరి సంపద పెంచి ఉండొచ్చు. అంబానీ, అదానీ లక్షల కోట్లకు ఎగబాకి ఉండొచ్చు. కానీ కోట్ల మంది అత్యంత విషాదకరమైన ఆర్థిక విష వలయాన్ని చూశారు. స్కూళ్లు మూసేయటంతో.. పాఠాలు చెప్పే టీచర్లు... ఆయాలు... అద్దెలు కట్టలేని చిన్నచిన్న యాజమాన్యాలు... పిల్లల్ని తీసుకెళ్లే ఆటోడ్రైవర్లు... ఈ వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వండి వడ్డించేవారికి తిండిలేదు. థియేటర్లలో సినిమా చూపించేవారు నిజమైన హర్రర్ ఫిల్మ్ చూశారు. చిన్నచిన్న కంపెనీలు, మాల్స్, షాపులు, క్యాబ్లు, సెలూన్లు... వీటి చుట్టూ అల్లుకున్న చిరు ఆర్థిక వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. చదవండి: (స్కూల్ బెల్ నేటి నుంచే..) కూలీలు, తోపుడు బళ్లు, ఇంటిపని వాళ్లే కాదు... పడుపు వృత్తిలో ఉన్నవారు సైతం స్వచ్ఛంద సంస్థల దానధర్మాలపై ఆధారపడక తప్పలేదు. కోట్ల మందికి పిడికెడు బియ్యం కూడా పుట్టని ఈ మహా విలయాన్ని ఇవ్వాళ ప్రవేశపెట్టే ఒక్క.. బడ్జెట్టూ ఏ మేరకు సరిచేయగలదు? ఇవేమీ ఒక్కరోజులో మానిపోయే గాయాలు కాదు. కానీ మందు వేయటం తప్పనిసరి. కాస్త త్వరగా తగ్గే మందు వేయాలి. లోపల గాయం ఇంకొన్నేళ్లు పచ్చిగానే ఉండొచ్చు. నొప్పి బాధయినా ఉపశమించాలి కదా? అందరి ఆశా అదే... అందరి చూపూ ఆర్థిక మంత్రి వైపే!!. సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2021–22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు నేరుగా లబ్ధి కలిగేలా కేంద్ర బడ్జెట్ ఉండాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా తమ విజ్ఞప్తులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగు ణంగా రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంటుల మంజూరు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, రుణాలు సమకూర్చుకునే విషయంలో కొం త సరళంగా ఉండాలని కోరుతున్న రాష్ట్రం... ‘తెలుగింటి కోడలు’ ఈసారి ప్రవేశపెట్టే పద్దులో ఆ విజ్ఞప్తులు ఎంత మేరకు నెరవేరుతాయోననే ఉత్కంఠతో ఉంది. పింఛన్ సాయం పెంపు, కేంద్ర ప్రాయోజిత పథ కాల (సీసీఎస్) అమ లులో రాష్ట్రాలకు స్వేచ్ఛ, కేంద్రం విధించే సెస్ల తగ్గింపు, జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లింపు లాంటి అంశాలు కరోనా కష్టకాలంలో ఊరట కలిగిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని అంశాలపై తమ ప్రతిపాదనలను వివరిస్తూ ఆర్థిక మంత్రి హరీశ్రావు నిర్మలా సీతారామన్కు ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలపై కేంద్ర బడ్జెట్లో స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనే వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లెక్క ఆధారపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ►ఆర్థిక సంఘాలు చేసే సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చే ఆనవాయితీ చాలా కాలంగా వస్తోంది. కానీ 2020–21 బడ్జెట్ సందర్భంగా కేంద్రం ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది. దీంతో కేంద్ర పన్నుల వాటాల్లో తగ్గుదలను భర్తీ చేసేందుకు దేశంలోని మూడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంట్లు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు అమలు కాలేదు. ఈ కారణంగా రాష్ట్రానికి రూ. 723 కోట్ల నిధులు రాలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసును పరిగణనలోకి తీసుకుని వెంటనే ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఆర్థిక సంఘం పరిమితి ముగిసే వరకు ఈ ఆనవాయితీని కొనసాగించాలి. లేఖలో హరీశ్రావు చేసిన విజ్ఞప్తులు ►సెస్లు, సర్చార్జీల రూపంలో కేంద్రం వివిధ వినియోగ వస్తువులపై విధిస్తున్న పన్నులను కేంద్ర పన్నుల వాటాలో కలపడం లేదు. దీంతో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గిపోతోంది. సెస్, సర్చార్జీలు విధిస్తున్న వాటిలో ఎక్కువగా రాష్ట్రాల జాబితాలోవే ఉన్నాయి. దీంతో రాష్ట్రాలకు ఉన్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి తగ్గిపోతోంది. ఈ ఏడాది నుంచి అయినా సెస్లు, సర్చార్జీలను రాష్ట్రాలకు వాటా కల్పించే పన్ను మొత్తంలో కలపడానికి కేంద్రం శ్రీకారం చుట్టాలి. ►కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేందుకు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అనుమతించే మొత్తంతోపాటు జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునే అవకాశాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలి. ►ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 94 (2) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. దీని ప్రకారం ఏటా రాష్ట్రానికి రూ. 450 కోట్లు రావాలి. 2019–20, 2020–21 సంవత్సరాలకు జిల్లాల వారీగా ఇచ్చే ఈ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదు. వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు రానున్న ఐదేళ్ల పాటు కూడా ఈ సాయాన్ని కొనసాగించాలి. ►స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్తింపజేస్తామని 2020–21 బడ్జెట్లోనే చెప్పినా ఇప్పటికీ 50 శాతం జిల్లాలకే వర్తింపజేస్తున్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు ఇప్పటికైనా అమలు చేయాలి. ►జీఎస్టీ పరిహారాన్ని ఎలాంటి నిబంధనలూ లేకుండా రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. కేంద్ర పన్నుల్లో వాటాఏటా పెరిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టాలి. ►జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద పింఛన్ కోసం నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు. పేదల అవసరాలు తీర్చేందుకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఈ బడ్జెట్ నుంచి అయినా దీన్ని రూ. 1,000కి పెంచాలి. ►కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం 2016లోనే నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను రాష్ట్రం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాలకు మరల్చుకునే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ బడ్జెట్లో అయినా ఆ ప్రతిపాదనకు మోక్షం కలిగించాలి. -
బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!
ముంబై: కేంద్ర బడ్జెట్–2021 ప్రభావిత అంశాలు, ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు బడ్జెట్ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం నుండి ఆర్బీఐ ద్రవ్యపాలసీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ అంశాలే ఈ వారం రోజుల్లో మార్కెట్కు కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కంపెనీల క్యూ3 ఆర్థిక గణాంకాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు సూచీల ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. ఇక గడిచిన ఆరురోజుల్లో సెన్సెక్స్ 3056 పాయింట్లు, నిప్టీ 1010 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, బడ్జెట్ నేపథ్యంలో అప్రమత్తత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే..., స్టాక్ మార్కెట్పై బడ్జెట్ ప్రభావమెంత..? నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్–2021ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితులు, దిగజారిన ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే విధంగా ఈ బడ్జెట్లో ఉద్దీపన చర్యలుండొచ్చని ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మౌలిక సదుపాయాల వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందా..? లేదా ఆర్థిక విధానాలకు నిధుల కేటాయింపు ద్వారా వృద్ధిని కోరుకుంటుందా..? అనే అంశాలు మార్కెట్కు అత్యంత కీలకం కానున్నాయి. మొదటి నిర్ణయంతో మార్కెట్ పరుగు తిరిగి ప్రారంభం అవుతుంది. రెండో ఎంపికతో మార్కెట్లో మరింత కరెక్షన్కు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం సంపన్న వర్గాలపై కొత్త పన్నులను విధించడంతో పాటు కార్పోరేట్ ఆదాయాలపై సెస్సును పెంచుతాయనే అంచనాలు దలాల్ స్ట్రీట్ను కలవరపెడుతున్నాయి. మొత్తంగా మార్కెట్కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. ఫిబ్రవరి 3న ఆర్బీఐ పాలసీ సమావేశం ... బడ్జెట్ ఒకరోజు తర్వాత ఫిబ్రవరి 3న (బుధవారం) ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) వెలువడనున్నాయి. నాలుగుశాతం రెపో రేటును యథాతథంగా కొనసాగించవచ్చన్నది అంచనా. విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు..! గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ జనవరి 29న ముగిసిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారిగా నికర అమ్మకందారులుగా మారారు. ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో చివరి వారంలో ఎఫ్ఐఐలు మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఎస్సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు దాదాపు నాలుగునెలల తర్వాత దేశీ ఫండ్లు(డీఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారారు. గడచిన వారంలో డీఐఐలు రూ.3,789 కోట్ల షేర్లను కొన్నారు. తుది అంకానికి క్యూ3 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, హెచ్పీసీఎల్, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, దీవిస్ ల్యాబ్, ఎన్టీపీసీలతో సహా ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. జనవరి ఆటో అమ్మక గణాంకాల విడుదల... నేడు బడ్జెట్ కార్యక్రమంతో పాటు ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్యాసింజర్, మధ్య–భారీ వాణిజ్య వాహన, ట్రాక్టర్ విభాగపు అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ద్వి–చక్ర వాహన విభాగపు విక్రయాలు బలహీనంగా ఉండొచ్చని వారంటున్నారు. అంచనాలకు మించి అమ్మకాలు ఉంటే రానున్న రోజుల్లో ఆటో రంగానికి డిమాండ్ ఉంటుందని ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉంది. గణాంకాల ప్రభావం.... నేడు మెర్కిట్ తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు ఇదే జనవరి వాణిజ్యలోటు లాంటి స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే అగ్రరాజ్యం అమెరికా మెర్కిట్ తయారీ గణాంకాలు కూడా ఈరోజే విడుదల అవుతాయి. ఈ బుధవారం మెర్కిట్ సేవల పీఎంఐ గణాంకాలు వెల్లడవుతాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపగలవు. ఊగిసలాట కొనసాగొచ్చు పలు దేశాల కేంద్ర బ్యాంకుల సరళతర వైఖరితో అంతర్జాతీయంగా లిక్విడిటీ మెండుగా ఉంది. ఈ అధిక లిక్విడిటీ వర్ధమాన దేశాల ఈక్విటీల్లో ప్రవహించడంతో పలు దేశాల స్టాక్మార్కెట్లు అధిక వ్యాల్యుయేషన్తో ట్రేడ్ అవుతున్నాయి. సూచీలను పరుగులు పెట్టిస్తున్న ఈ లిక్విడిటీ ఆధారిత ర్యాలీ ఆధారంగా మన బెంచ్మార్క్ సూచీలు కనీసం 10 నుంచి 15 శాతం దిద్దుబాటు కావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ అస్థిరతను సూచించే వొలటాలటీ ఇండెక్స్ 3 శాతం పెరిగి 25.34 వద్ద స్థిరపడింది. ఇది మార్కెట్లోని అస్థిరతను సూచిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ -
బడ్జెట్ 2021: స్మార్ట్ఫోన్లపై ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. కేంద్రం కూడా అన్ని బడ్జెట్ల కంటే ఇది ప్రత్యేకమని పేర్కొంది. అన్ని రంగాలు కూడా ఈ బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్ఫోన్ తయారీదారులు ఆశిస్తున్నారు. (చదవండి: బడ్జెట్ 2021–22.. ఫోకస్) గతంలో "మేకిన్ ఇండియా" ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సెల్యులార్ హ్యాండ్సెట్లపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచారు. అయితే, ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసిఇఎ) మొబైల్ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను(జీఎస్టి)ను తగ్గించాలనే డిమాండ్ను మళ్లీ కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. గత ఏడాది మార్చిలో మొబైల్ పరిశ్రమపై 50శాతం పన్నును అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతికి కోసం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వారు భావిస్తున్నారు. ప్రతి భారతీయుడికి స్మార్ట్ఫోన్ అందించాలంటే మొబైల్ ఫోన్లపై విధించిన జీఎస్టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడం అత్యవసరం అని ఐసీఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఒక ప్రకటనలో చెప్పారు. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోసం రూ.500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్కు రూ.200 కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని ఐసీఇఎ కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు మొబైల్ ఫోన్, కాంపోనెంట్ తయారీదారులు ఎగుమతి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు మొబైల్ భాగాలపై తక్కువ జీఎస్టీని విధించాలని కోరుకుంటున్నారు. "సబ్ $200 ఎంట్రీ లెవల్(రూ.15,000) మొబైల్ ఫోన్ విభాగంలో స్వదేశీ హ్యాండ్సెట్ తయారీదారులు ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉండటానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది" అని ఐసీఇఎ తెలిపింది. -
ఫోన్ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఫోన్కాల్ దూరంలోనే ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం శనివారం వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ‘రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. జనవరి 22వ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్ సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ‘పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పెద్ద పార్టీలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరాయాలతో చిన్న చిన్న పార్టీలకు ఇబ్బందులు కలుగుతాయి. వాటికి తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోతుంది’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు పార్లమెంట్ సమావేశాల్లో తాము ప్రస్తావించాలని భావిస్తున్న అంశాలను తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, శిరోమణి అకాలీదళ్కు చెందిన బల్వీందర్ సింగ్, శివసేన నేత వినాయక్ రౌత్, టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ రైతు ఆందోళనలను ప్రస్తావించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దురదృష్టకరమంటూ వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆ ఘటనలకు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను బాధ్యులుగా చేయరాదని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రధానిని కోరాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. ఫోన్ కాల్ దూరమే.. రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తోంది. జనవరి 22న రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. గాంధీజి వర్ధంతి పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ రాజ్ఘాట్లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాదిమందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జాతి శ్రేయస్సు కోసం, దేశానికి స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. -
రాష్ట్రాలకు నిధులు పారాలి!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ను అంచనా వేయాలంటే ఒకే ఒక్క కొలమానం ఉంది. ఆర్థిక వ్యవస్థలో విస్తృతమవుతున్న సంస్థాగత అసమానత్వాన్ని తొలగించడానికి అది ప్రతిపాదించే వ్యూహాత్మక పథకమే కీలకం. లాక్డౌన్ అనంతరం భారత్ ఆర్థిక పునరుత్తేజం వైపు సాగే దశను బడ్జెట్ సూటిగా దృశ్యమానం చేస్తుంది. అన్ని సూచికలూ తెలుపుతున్నట్లుగా, నియత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా వైరస్ దాడికి మునుపటి స్థాయిలకు చేరుకుంటున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించిన ముందస్తు అంచనా ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటోంది. కొన్ని నెలలకు ముందు పరిస్థితితో పోలిస్తే ఆశావహమైన భవిష్యత్తును ఇది సూచిస్తోంది. అయితే, ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తున్న చలనసూత్రాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్లో నమోదైన బడా కంపెనీలు సంవత్సరం వారీగా చూస్తే 50 శాతం లాభాలను చవిచూశాయి. ఖర్చులను తగ్గించుకోవడం, అధికాదాయం పొందుతున్న కుటుంబాలనుంచి వినియోగ సరుకులకు డిమాండ్ పెరగడమే కంపెనీల లాభాలకు కారణం. అదే సమయంలో భారతీయ కార్మికులలో మెజారిటీ ఇంకా కోవిడ్–19 కలిగించిన షాక్ నుంచి కోలుకోవలసి ఉంది. ఆర్థికవేత్త ప్రాంజుల్ భండారి సూచించినట్లుగా ఆర్థిక వ్యూహాలపై లాక్డౌన్ విధించిన పరిమితులకు స్పందించే సామర్థ్యం ఉన్న చిన్న తరహా కంపెనీలు పెట్టగల వ్యయానికి పరిమితి ఉండటంతో భారీ కంపెనీలలో మదుపుపెట్టేలా ఆర్థిక గతి మార్పు చెందింది. భండారీ ఎత్తి చూపినట్లుగా ఖర్చుతగ్గింపులో భాగంగా చిన్న తరహా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పంపించివేశాయి. మరోవైపున బడాకంపెనీలు అధిక లాభాలు సాధించేలా లేబర్ మార్కెట్ కోలుకుంటున్న పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తూ, ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ఆర్థిక డేటా పర్యవేక్షణ సంస్థ (సీఎమ్ఐఈ) ప్రకారం, 2019–20తో పోలిస్తే 2020 డిసెంబర్ నాటికి దేశంలో ఉద్యోగాలు కోటి 47 లక్షల మేరకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అమిత్ బసోల్, అజిమ్ ప్రేమ్జీ వర్సిటీకి చెందిన సహ రచయితలు సీఎమ్ఐఈ డేటాను విశ్లేషించిన దాని ప్రకారం 2020 ఆగస్టులో 40 శాతం మంది వేతనజీవులు, 42 శాతం మంది దినవేతన కార్మికులు స్వయం ఉపాధివైపుకు మరలిపోయారు. 2020 డిసెంబర్ నాటికి కూడా ఈ క్రమం కొనసాగుతూనే ఉంది. చాలామంది భారతీయులు నిరుద్యోగం తెచ్చిపెట్టే పెను భారాన్ని భరించలేరు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లే అనియత రంగం నుంచి చాలామంది స్వయం ఉపాధివైపు మారిపోతున్నారు. రెండు, ఉపాధిరంగం కోలుకోవడం అనేది లింగపరమైన వ్యత్యాసాలను ముందుకు తీసుకొచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో మహిళల ఉద్యోగాలపై భారీగా వేటుపడింది. గత సంవత్సరం ఏప్రిల్ నాటికి ఉద్యోగాలు కోల్పోయినవారిలో 73 శాతం మంది పురుషులు 2020 డిసెంబర్ నాటికి ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకున్నారు. అయితే ఇదేకాలంలో 23 శాతం మంది మహిళలు మాత్రమే తిరిగి ఉపాధి అవకాశాలు పొందగలిగారు. మూడు, సీఎమ్ఐఈతో సహా పలు సర్వేలు సూచిస్తున్నట్లుగా వేతనాలు లాక్డౌన్ ముందు స్థాయిలకు పడిపోయాయి. పైగా, బసోల్, అతడి సహ రచయితల అంచనా ప్రకారం కరోనా మహమ్మారి విజృంభించిన తొలి ఆరునెలల కాలంలో భారత్లో దిగువస్థాయిలో ఉన్న 10 శాతం కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతం కోల్పోగా, ఉన్నతస్థానంలో ఉన్న కుటుంబాలకు ఈ స్థితి ఎదురు కాలేదని తెలుస్తోంది. లాక్డౌన్ తీసుకొచ్చిన ఆర్థిక విధ్వంసం సృష్టించిన అసమానతలను ప్రధానంగా నిరుపేదలే భరించాల్సి వచ్చింది. తన ఆదాయాన్ని వదులుకోవడానికి, లాక్డౌన్ బాధితులకు సహాయం చేయడానికి కేంద్రప్రభుత్వం ముందుకు రాకపోవడం, ద్రవ్యవిధాన కొలమానాలపైనే అది ఆధారపడటంతో సంస్థాగత అసమానతలు బాగా పెరిగాయి. కాంట్రాక్టుల రూపంలోని ప్రభుత్వ వ్యయం 2020 నవంబర్లో మాత్రమే పుంజుకుందని గ్రహించాలి. నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో, లేబర్ మార్కెట్లో అనిశ్చితి పెరగటం, సూక్ష్మ చిన్న స్థాయి, మధ్యతరహా పరిశ్రమల రంగం ఘోరంగా కుదించుకుపోవడం, ఉద్యోగాల కల్పనకు బదులుగా లాభాలను సృష్టించడానికి ప్రోత్సాహకాలు అందించడం అలవాటు చేసుకున్న బడా కంపెనీల ఆర్థిక కార్యాచరణతో కలగలిసిపోయిన ఆర్థికవ్యవస్థతో ఆమె తలపడాల్సి ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి అనేది కార్మికులను అక్కున చేర్చుకోవడం కాకుండా వారి ఉపాధిని తొలగించడం ప్రాతిపదికన సాగుతుందని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ తిరోగమన ధోరణిని మార్చడం అనేది అటు నైతిక విధిగానూ, సలక్షణమైన ఆర్థిక వివేచన గానూ ఉంటుంది. ఏదేమైనా ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం కొనుగోలు శక్తిని పెంచకుండా ఉంటున్నప్పుడు డిమాండ్ కుప్పగూలిపోతుం దన్నది గ్రహించాలి. కాబట్టి బడ్జెట్ను ముందుకు తీసుకుపోయే ఏకైక దిశ ఎలా ఉండాలి అంటే, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా.. లాక్ డౌన్లో దెబ్బతినిపోయిన వారికి ఉద్యోగాల కల్పన, సామాజిక భద్రతను అందివ్వడానికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఆ క్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని గణనీయంగా విస్తృతపరుస్తూ బడ్జెట్ రూపకల్పన జరగాలి. డిమాండును ముందుకు తీసుకుపోయేలా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలి. పట్టణాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి నిధులు కేటాయిం చాలి. దీన్ని నగదురూపంలో, ఉపాధి రూపంలో లేక ఇన్సూరెన్స్ రూపంలో ఎలా అమలు చేయాలి అనేది రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయించుకునేలా వీలుకల్పించాలి. ఇవి అత్యవసరంగా చేయవలసిన వ్యయాలు. దీనికి తోడుగా, 2021 ఆర్థిక సంవత్సరంలో కీలకమైన సంక్షేమ పథకాలు (పోషకాహారం, విద్య, గృహవసతి)పై కత్తెర వేశారు. తాజా బడ్జెట్ ఇప్పుడు వీటికి అమిత ప్రాధాన్యత కల్పించాలి. ప్రస్తుత ఉపాధి సంక్షోభానికి దారితీసిన అనేక వ్యవస్థాగతమైన వైఫల్యాలను చర్చిం చడానికి బడ్జెట్పై చర్చలో తావుండదు కానీ దీర్ఘకాలిక విధానాలను పొందుపర్చే దార్శనికతను బడ్జెట్ వ్యక్తం చేస్తే అది స్వాగతించవలసిన ముందడుగుగా చెప్పవచ్చు. ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణకు, ఉపాధి కల్పనకు రెండింటికీ కీలకమైన సాధనంగా వ్యవస్థాగతమైన వ్యయాన్ని పెంచాల్సిన అవసరముందని పలువురు చెబుతున్నారు కానీ మౌలిక వసతుల కల్పనను కేంద్రమే కల్పించాలా లేక రాష్ట్రాలకూ పాత్ర ఉండాలా అనేది కోవిడ్–19పై పోరాటంలో నిర్ణాయక అంశంగా ఉంటుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ మార్గాలు పూడిపోయాయి. పైగా రాష్ట్రాలకు కేంద్రం ద్రవ్యరూపంలో సహాయం చేయడానికి బదులుగా మార్కెట్ నుంచి రుణాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొనడం పురోగతికి ప్రతిబంధకమే అవుతుంది. దీంతో, తాజాగా క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ఎత్తి చూపినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయాలపై కోత విధిస్తున్నాయి లేదా బడ్జెట్ అనంతర రుణాలవైపు సాగిపోతున్నాయి. రాష్ట్రాలకు ఆర్థిక సాధికారత కల్పించి మౌలిక వసతుల కల్పనను ముందుకు తీసుకుపోవడానికి కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ద్రవ్య సహాయం అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై పన్నుల భారాన్ని తగ్గించడం, కోవిడ్–19 గ్రాంట్స్ని అదనంగా కల్పించడం వంటి కీలక అంశాల్లో 14వ ఫైనాన్స్ కమిషన్ కాలం పొడవునా కేంద్రం పూర్తిగా విఫలమైంది. దీంతో 15వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలపై పన్ను భారాన్ని తగ్గించనుందని విస్తృతంగా అంచనా వేస్తున్నారు. చివరగా, కోవిడ్–19 నేపథ్యంలో సమర్పిస్తున్న తాజా బడ్జెట్ భారత్లో చిన్నాభిన్నమైన ఆరోగ్య వ్యవస్థను నిలబెట్టడానికి తగిన విధానాలను తప్పకుండా ప్రతిపాదించాలి. పెంచిన కేటాయింపులు నిజంగా స్వాగతించదగినవి, అవసరమైనవి కూడా. కానీ ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా కేంద్రం తప్పక గుర్తుంచుకోవాలి. బడ్జెట్ అనేది విధాన పత్రం కాబట్టి ఆర్థిక వ్యయాలకు మద్దతు తెలుపుతూ ఒక విస్తృత దిశలో బడ్జెట్ను రూపొందించాలి. అదేసమయంలో రాష్ట్రాలు తమదైన మార్గంలో పయనించేలా అవకాశం కల్పించాలి. యామిని అయ్యర్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ -
ఢిల్లీ తీర్చే డిమాండ్లెన్నో?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశ పెట్ట నున్న 2021–22 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు, ఇతర సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ ప్రాజెక్టులు, పథకాలకు నిధులతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై గతంలో తాను, ఇతర రాష్ట్ర మంత్రులు రాసిన లేఖలను పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్క్, నిమ్జ్, ఐటీఐఆర్, నేషనల్ డిజైన్ సెంటర్ వంటి వాటికి నిధుల మంజూరు అంశాలను ఎంపీలు ప్రస్తావించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, ట్రైబల్ యూనివర్సిటీ, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు, బయ్యారం స్టీల్ ప్లాంటు వంటి అంశాలను సందర్భాన్ని బట్టి టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో ఫార్మాసిటీకి రూ.870 కోట్లు, మెగా టెక్స్టైల్ పార్క్కు రూ.రూ.300 కోట్లు, జహీరాబాద్ నిమ్జ్కు రూ.500 కోట్లు, నేషనల్ డిజైన్ సెంటర్కు రూ.200 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లకు రూ.5వేల కోట్లు, ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గత నెలలో కేంద్ర మంత్రులకు వరుస లేఖలు రాశారు. వీటికి సంబంధించిన ప్రస్తావన పార్లమెంటు వేదికగా తేవాలని టీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానం ఆదేశించింది. చదవండి: (‘వ్యాక్సిన్’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర) ప్రతిష్టాత్మక విద్యా సంస్థల కోసం ఒత్తిడి రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేఖలు రాసింది. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీతో పాటు వేగంగా అభివృద్ది బాటలో పయనిస్తున్న తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని కోరుతోంది. సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన కూడా ముందుకు సాగడం లేదు. యూనవర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపినా ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో హైదరాబాద్కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) మంజూరైంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్ఐడీ విజయవాడకు తరలివెళ్లింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఎన్ఐడీ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మూలధనం సమకూర్చాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతోంది. రైల్వే ప్రాజెక్టులు.. ఇతర మౌలిక వసతులు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వేగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మనోహరాబాద్– కొత్తపల్లి, అక్కన్నపేట– మెదక్, భద్రాచలం– కొత్తగూడెం లైన్లకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు ఇతర రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, సర్వేలు, పలు జాతీయ రహదారులకు అనుమతుల కోసం ఎంపీలు పార్లమెంటు వేదికగా గళమెత్తాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరం చుట్టూ 334 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదంతో పాటు, పలు జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన వినతులు కూడా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. రాష్ట్రానికి అదనంగా నాలుగు రిజర్వు బెటాలియన్లు, రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదన, హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు జాబితాలోని సంస్థల విభజన, బయ్యారంలో సమీకృత స్టీల్ ప్లాంటు ఏర్పాటు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి చాలాకాలంగా స్పందన కోరుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చిరునామాగా ఉన్న హైదరాబాద్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా ప్రకటించేందుకు అవసరమైన నిధులు ప్రకటించాలని కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. -
బిట్కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్కాయన్పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్లెట్లో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్ చేసింది. అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్కాయిన్, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ విధించిన బ్యాన్ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది. (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ) సాధ్యం కాదంటున్న నిపుణులు క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు 'పబ్లిక్' కనుక ఇవి నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతున్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం. ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్బీఐ అధికారిక సమాచారంలో, బిట్కాయిన్ ప్రైవేట్గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్చైన్లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని కాయిన్డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి -
ప్రాణమిచ్చారు... బడ్జెట్ను ఇవ్వలేమా!
చంకలో బిడ్డ. తలపై తట్ట. ఎండలో నడక. తల్లి కష్టపడుతోంది. అలసి ఒగురుస్తోంది. బిడ్డనో, తట్టనో.. ఒక భారం అందుకోమెందుకు? ఎవరైనా వచ్చి చెప్పాలి! ఆలోచన ఇవ్వాలి!! పళ్లెం నిండా పరమాన్నాలు. పక్కనే పండ్లూ ఫలహారాలు.ఎదురుగా ఆకలిగొన్నమ్మ.పేగుల అరుపులపై కొంగు కప్పుకున్నమ్మ. ‘నువ్వు కూర్చోలేదేమిటి!’ అని అడగమెందుకని!‘పిల్లని తినమని అనవేమిరా..’ అని.. ఇంట్లో పెద్దవాళ్లొచ్చి చెప్పాలి. ఆలోచన కలిగించాలి!బడ్జెట్ కూడా ఏళ్లుగా తట్టనీ అందు కోలేదు.. ‘నువ్వు కూడా వచ్చి తినూ..’ అనలేదు. స్త్రీ అనే ప్రాణి ఉందనే ఆలోచనే బడ్టెట్లో లేదు! అప్పుడొచ్చి ఆర్థికవేత్తలెవరో ఇచ్చిన ఆలోచనే..‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’.అంటే.. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వెయ్యడం. ఈసారి బడ్జెట్ మహిళల్ని ఎంతవరకు దృష్టిలో పెట్టుకోబోతోంది?! ఫిబ్రవరి 1 న బడ్జెట్. ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటుంది. అందులో మహిళలకు ఎంతిచ్చారో, ఏమిచ్చారో రెండు రోజుల్లో తెలుస్తుంది! ఎప్పట్లా అయితే ఈసారి బడ్జెట్ ఉండేందుకు లేదు. ఉండటం అన్యాయం అవుతుంది. మహిళలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ప్రణాళికలూ, ప్రభుత్వ విధానాలూ కాపాడలేని విధంగా మహిళలు ఈ ఏడాది కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడారు. తమ ప్రాణాలను పణం గా పెట్టారు. ఆ ‘రుణం’ తీర్చుకునే విధంగా బడ్జెట్ ఉండాలి. దేశ జనాభాలో మహిళ లు 48 మంది ఉన్నా, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ శ్రమలో మహిళల రెక్కల కష్టం 17 శాతం వరకు ఉన్నా.. గత 2020–21 బడ్జెట్లో మహిళల కోసం కేటాయించింది 5 శాతం కన్నా తక్కువే! ఇంట్లో మహిళల శ్రమ, చాకిరి ఎలాగూ ‘ఎకానమీ’ లెక్కల్లోకి రావు. ఆ పదిహేడు శాతానికైనా తిరుగు ప్రతిఫలం ఉండాలి. అది ఈ బడ్జెట్లో ఉండబోతోందా? ఉండబోవడం కాదు. ‘ఉండాలి’ అనే నిబంధన ఉంది. ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (జి.ఆర్.బి) ఆ నిబంధన. 2001 నుంచి ఆలోచించి, 2006లో ఈ జి.ఆర్.బి.ని బడ్జెట్లో తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ‘బడ్జెట్ ఎలాగైనా ఉండొచ్చు. మహిళలకు ప్రాధాన్యం లేకుండా మాత్రం ఉండకూడదు’ అని నాడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేసిన సిఫారసును ఆర్థికశాఖ పరిగణనలోకి తీసుకోవలసిందే. స్త్రీ పురుష అసమానతలు, మహిళలపై హింస, లైంగిక వేధింపులు, వేతనాల్లోని వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం అనుసరించ వలసిన విధానాలలో ఒకటిగా ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ ఒక శక్తిమంతమైన సాధనం అయింది. బడ్జెట్ను ఎలా రూపొందిస్తారో తెలిసిందే. వచ్చేదింత, పోయేదింత అనే అంచనాలు ఉంటాయి. జెండర్ బడ్జెట్ అందుకు భిన్నమైనది. ఇందులో పార్ట్–ఎ, పార్ట్–బి అని ఉంటాయి. పార్ట్ ఎ లో ప్రత్యేకంగా మహిళలు, బాలికల అభివృద్ధి కోసమే దోహదపడే పథకాలకు, కార్యక్రమాలకు ప్రాధాన్యాలు ఉంటాయి. పార్ట్ బి లో మహిళలు, బాలికల సంక్షేమం కోసం ప్రత్యేకించిన కేటాయింపులు ఉంటాయి. పార్ట్ బికి ఎక్కువ వాటా ఉంటుంది. గత ఏడాది బడ్జెట్లో పార్ట్ ఎ, పార్ట్ బి కి కలిపి 1,43,461 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పెట్టి, అందులో పార్ట్ ఎ కి 28, 568 కోట్లు, పార్ట్ బి కి 1,14, 893 కోట్ల రూపాయలు కేటాయించారు. జెండర్ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారత. లైంగిక సమానత్వ సాధన. ఇవన్నీ కూడా విద్య, ఉపాధి, ఆరోగ్యంతో సమకూరుతాయి కనుక కరోనా పెంచిన అంతరాన్ని సరి చేసేందుకు కూడా ఈ ఏడాది బడ్జెట్లో ఈ మూడింటికి ఎక్కువ నిధులు కేటాయించి ఉంటే సబబుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జెండర్ బడ్జెట్ను ఒక ప్రభుత్వ విధానంగా కాక, ప్రభుత్వ నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించే వినూత్న ప్రణాళికలతో రూపొందించవలసిన అవసరం ఉందన్నది ఆర్థికవేత్తల సూచన. చూడాలి, ఈ ఏడాదిని మనం ‘జెండర్ బడ్జెట్’ కన్నా ఎక్కువదైన ‘ఉమన్ బడ్టెట్’గా చూడబోతున్నామేమో. అదే నిజమైతే అది వండర్ బడ్జెట్టే అవుతుంది. -
ద్రవ్యలోటు ఆందోళన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు తీవ్ర ఆందోళనకరమైన స్థాయికి చేరింది. డిసెంబర్ ముగిసే నాటికే రూ.11,58,469 కోట్లకు ఎగసింది. 2020–21 వార్షిక బడ్జెట్ లక్ష్యాలను దాటి ఏకంగా 145.5 శాతానికి చేరింది. రెవెన్యూ భారీగా తగ్గిపోవడం దీనికి నేపథ్యం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. నిజానికి ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం) పరిమితం చేయాలని 2020 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. అయితే జూలైలోనే ఈ పరిమితిని దాటి ద్రవ్యలోటు పెరిగిపోయింది. గణాంకాలు ఇలా... గణాంకాల ప్రకారం డిసెంబర్ 2020 వరకూ భారత్ ప్రభుత్వం రూ.11.21 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. దీనిలో రూ.9,62,399 కోట్లు పన్ను వసూళ్లు. రూ.1,26,181 కోట్లు పన్ను యేతర వసూళ్లు. రూ.33,098 కోట్లు నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్. నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్లో రుణ రికవరీలు (రూ.14,202 కోట్లు), పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా వచ్చిన నిధులు (రూ.18,896 కోట్లు) ఉన్నాయి. అయితే కేంద్ర వ్యయాలు ఇదే సమయంలో రూ.22.80 లక్షల కోట్లుగా ఉన్నాయి. 7 శాతం పెరిగే అవకాశాలు...: 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతంగా నమోదయ్యింది. ఆదాయ వనరుల తగ్గుదల కారణం. కరోనా మహమ్మారితో రెవెన్యూ వసూళ్లు 2020–21లో మరింత పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు 7 శాతం దాటిపోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలి 3.5 శాతం (జీడీపీ) అంచనాలు... తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ స్థాయికి చేరతాయన్న అంశాన్ని తెలుసుకోడానికి ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థికమంత్రి బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సి ఉంటుంది. -
మెప్పించని ఆర్థిక సర్వే.. నష్టాల్లో మార్కెట్
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది. సూచీలకిది ఆరోరోజూ నష్టాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు రెండోరోజూ రూ.2,443 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 5933 కోట్ల భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ కో?లుకునేందుకు దీర్ఘకాలం పడుతుందనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా ఉంది. ఈ పరిణామాలతో బడ్జెట్కు ముందు మార్కెట్లో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది.’’ అని జియోజిత్ ఫైనాన్స్ ఫైనాన్సియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల్లో రూ.11.57 లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు రూ.11.57 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి రూ.197.46 లక్షల కోట్ల నుంచి రూ. 186.12 లక్షల కోట్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 2.01 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇదే ఆరురోజుల్లో సెన్సెక్స్ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లను కోల్పోయాయి. నిరాశపరిచిన ఐఆర్ఎఫ్సీ ఐపీఓ లిస్టింగ్..! గడిచిన వారంలో ఐపీఓను పూర్తిచేసుకున్న ఐఆర్ఎఫ్సీ షేర్లు లిస్టింగ్లో నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.26 తో పోలిస్తే బీఎస్ఈలో 3.84 శాతం(రూపాయి)నష్టంతో రూ.25 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 6.53 శాతం క్షీణించి రూ.24.30 కు చేరుకుంది. చివరికి 4.42 శాతం పతనమైన రూ.24.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.32,475 కోట్లుగా నమోదైంది. దాదాపు రూ.4,633 పరిమాణం కలిగిన ఈ ఐపీఓకు 3.49 రెట్ల అధిక సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్లాక్తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
‘సాగు’పై మరింత స్పష్టత అవసరం
వ్యవసాయ మార్కెటింగ్ను సమూలంగా మార్చివేస్తూ కేంద్రప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటూ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా హింసాకాండను ప్రేరేపించిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళన అందరి దృష్టిని ఆకర్షించటం సరేసరి.. కానీ ప్రభుత్వం వైపున జరుగుతున్న కొన్న పాలనాపరమైన విధానాలు సంస్కరణలను దాచిపెడుతూ బడ్జెట్లో చూపకపోవడం చాలా సమస్యలకు దారితీస్తోంది. గత రెండేళ్లుగా కేంద్రప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లలో ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి ఎరువులు, విద్యుత్ సబ్సిడీ, నీటి వనరుల నిర్వహణలో కేంద్రం గతంలో ఎన్నడూ లేనంత మంచి మార్పులను తీసుకొచ్చింది. మండీల్లో మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద మొత్తాన్నే కేంద్రం కేటాయించినప్పటికీ మండీలను కార్పొరేట్లకు అప్పగిస్తారనే భయాలే రైతులను ఆందోళనవైపు నెట్టాయి. ప్రభుత్వం కాస్త పారదర్శకత ప్రదర్శించి ఉంటే సాగు సంస్కరణ చట్టాలపై భయాలు తొలిగేవి. నేడు పార్లమెంటులో సమర్పించనున్న తాజా బడ్జెట్ సాగుకు సంబంధించిన కీలక అంశాలపై మరింత స్పష్టత ఇస్తుందని ఆశిద్దాం. ప్రస్తుత రైతు సంఘాల ఆందోళన దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెను కష్టాలపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కానీ వచ్చే దశాబ్దం పొడవునా భారత్ అనుసరించే సంస్కరణలు నడిచే మార్గాన్ని ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ బహుశా వెల్లడించకపోవచ్చు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లు ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి. అందుకనే కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతం దాకా తగ్గించిన వైనాన్ని 2019 సెప్టెంబర్ 20న మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తప్పితే అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొనలేదు. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపుతున్న దశలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అయిదు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించి అయిదు ప్యాకేజీలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించారు. వీటిని ప్రధాన్ మంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా నరేంద్రమోదీ అంతకుముందే ప్రకటించి ఉన్నారు. ఈ 5 ప్యాకేజీలలో 20 లక్షల కోట్ల రూపాయల నగదును కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. వ్యవసాయ ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు గుప్పించారు. వీటిలో అత్యవసర సరుకుల చట్టం (ఈసీఏ) 1955కు సవరణతోపాటు వ్యవసాయ మార్కెటింగ్ను క్రమబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలిసిందే. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో జరగాల్సిన మూడు ప్రధాన మార్పుల గురించి సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అవేమిటంటే ఎరువుల సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, నీటివనరుల నిర్వహణ. ఎరువుల సబ్సిడీ 2020 నవంబర్ 12న కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి ఒక ప్రకటన చేస్తూ ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 65 వేల కోట్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇది 2020–21 సంవత్సరానికి గాను బడ్జెట్లో కేటాయిం చిన రూ. 71,309 కోట్ల మొత్తానికి అదనం అన్నమాట. 2020 ఏప్రిల్ 1న ఎరువుల కంపెనీలు రూ. 48 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ బకాయిలను పొందాయి. అనేక సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ కంపెనీలకు తాము అందించిన ఎరువులకు సబ్సిడీ రూపంలో రావలసిన మొత్తాలను ప్రభుత్వం చెల్లించడం లేదు. ఎరువుల సబ్సిడీ బకాయిలను చెల్లించడానికి అదనపు గ్రాంట్ని మంజూరు చేస్తూ ప్రొవిజన్ రూపొందించటం బహశా అసాధారణమైంది. ఇది బడ్జెట్ పరంగా మంచి ప్రతిపాదన అని చెప్పాలి. జీడీపీ 7 శాతానికి పడిపోయిన సంవత్సరంలో పరిశ్రమ వర్గాలు అలాంటి ప్రయోజనం తమకు లభిస్తుందని కనీసం ఊహించలేకపోయాయి. 2020–21కిగాను కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ. 26.33 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినందున వాస్తవ సేకరణ రూ. 19.33 లక్షల కోట్లకే పరిమితం కావచ్చు. అంటే బడ్జెట్ అంచనాల కంటే ఇది 26.6 శాతం తక్కువ అన్నమాట. ఇలాంటి తరుణంలో ఎరువుల పరిశ్రమకు అదృష్టం తలుపు తట్టినట్లే అని స్పష్టమవుతుంది. ఎరువుల కంపెనీలకు సబ్సిడీ కింద బకాయిలను చెల్లించడం అనేది ఎరువుల సబ్సిడీ నిర్వహణలో అతిపెద్ద సంక్షేమ చర్యగానే చెప్పాలి. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా ఎరువుల సబ్సిడీని బదిలీ చేసే విషయంలో ముందుకెళుతుందని చెప్పలేము. కౌలు రికార్డులు కనిపించని సందర్భంగా వాస్తవంగా వ్యవసాయం చేసేవారికి కాకుండా భూ యజమానికి మాత్రమే ప్రత్యక్ష నగదు బదిలీ అందుతుంది. రెండు... ఎరువుల ప్రస్తుత వినియోగం, అందుతున్న వివిధ సబ్సిడీలు రాష్ట్రాలకు సంబంధించి వేరువేరుగా ఉంటున్నాయి. పంజాబ్, హరియాణాలో 2018–19 సంవత్సరంలో హెక్టారుకు 224.5 కేజీల మేరకు ఎరువులను వాడుతుండగా ఒడిశాలో హెక్టారుకు 70.6 కేజీల ఎరువును వినియోగిస్తున్నారు. అదే జమ్మూ కశ్మీరులో 61.9 కేజీల ఎరువును మాత్రమే ఉపయోగిస్తున్నారు. అలాగే పండిస్తున్న పంటలు, సాగు చేస్తున్న భూమిపై ఆధారపడి ఎరువుల వినియోగం ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని రైతులకు ఎరువుల సబ్సిడీ కింద ఏకరూప మొత్తాన్ని స్థిరపర్చడం ఏమంత సులభం కాదు. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా వ్యవసాయంతో సంబంధం ఉన్న అందరినీ సంప్రదించడానికి కేంద్ర ప్రభుత్వం మరింత గట్టిగా ప్రయత్నాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫ్సీఐ బకాయిలు 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కీలకమైన రెండో అంశం ఆహార సబ్సిడీ. దీని ఫలితంగా సబ్సిడీ బకాయిలు అమాంతంగా పెరిగిపోయాయి. భారత ఆహార సంస్థకు చెల్లిం చాల్సిన బకాయిలు 2018 మార్చి 31 నాటికి రూ 1,35,514.52 కోట్లు కాగా అది 2020 మార్చి 31 నాటికి రూ. 2,42,905 కోట్లకు పెరిగిపోయింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద గోధు మలు, బియ్యం అదనపు కేటాయింపుల కారణంగా ఈ సంవత్సరం 315.2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా సరఫరా చేయాల్సి వచ్చింది. దీని ఫలితంగా 2021 మార్చి 31 నాటికి ఎఫ్సీఐకి చెల్లించాల్సిన బకాయిలు రూ. 3,48,808 కోట్లకు పెరిగాయి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో వికేంద్రీకరణ అమలైన రాష్ట్రాల్లో ఆహార సబ్సిడీపై బకాయిలు ఎంత అనేది ఇప్పటికీ తెలియడం లేదు. పీఎం కిసాన్, ఎపీఎంసీలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్లో అత్యధిక కేటాయింపు (2020–21లో రూ. 75,000 కోట్లు) పీఎం కిసాన్ కోసం జరుగుతోంది. ప్రభుత్వం ఈ కేటాయింపును తగ్గిస్తుందని భావించడం కల్లోమాటే. తాజా బడ్జెట్లో ఆశ్చర్యకరమైన అంశం ఏదంటే ఎపీఎంసీ మండీల మౌలిక వసతుల కల్పనను మెరుగుపర్చడానికి తీసుకొస్తున్న కొత్త పథకమే. డ్రైయింగ్, సార్టింగ్, గ్రేడింగ్, స్టోరేజ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా దీంట్లో భాగమై ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతా ఈ మండీలనుంచి వ్యాపారం మొత్తంగా వాణిజ్య విభాగాలకు వెళుతుందనే. ఏపీఎంసీలకు తగుమాత్రం బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఎపీఎంసీ మండీలను బలహీన పర్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తుంది. పైగా మండీలు కొనసాగడానికి ఇది తోడ్పడటమే కాకుండా వాణిజ్య ప్రాంతాలకు మంచి పోటీని కూడా ఈ చర్య తోడ్పడుతుంది. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఏఎమ్పీసీలలో చార్జీలు ఇతర రుసుములను బాగా తగ్గిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక మార్కెటింగ్లో ప్రథమ అవకాశంగా ఈ మండీలే ముందుపీఠిలో ఉంటాయి. పోతే పౌల్ట్రీ, మత్య పరిశ్రమ సంవత్సరానికి 8 శాతం వృద్ది రేటును నమోదు చేస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహకాలు లేకుండానే ఈ రెండు రంగాలు ఇంత వృద్ధిరేటును సాధిస్తున్నాయి. భారతదేశంలోని అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లో వీటికి అత్యాధునిక మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం ఎంతైనా అవసరం. చివరగా, భారత్లోని నీటి వనరుల ఎద్దడి ఎదుర్కొంటున్న జిల్లాల్లో వరి, చెరకు పంటలు పండిస్తున్న ప్రాంతాలను తగ్గించడంలో స్పష్టమైన విధానాలను అమలుచేయడం తప్పనిసరి చేయాలి. అలాంటి వైవిధ్యీకరణకు తగిన రోడ్ మ్యాప్ అమలుకు కేంద్రం, ఆయా రాష్ట్రాలు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించాల్సి ఉంది. సిరాజ్ హుస్సేన్ – కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి జుగల్ మహాపాత్ర – కేంద్ర ఎరువుల శాఖ మాజీ కార్యదర్శి (ది వైర్ సౌజన్యంతో) -
అస్పష్ట ఆర్థిక చిత్రం
ఒక అనిశ్చితి వాతావరణంలో దేన్నయినా స్పష్టంగా అంచనా వేయటం సమస్యే. బడ్జెట్కు ముందు గడిచిన సంవత్సర స్థితిగతుల్ని తెలిపే ఆర్థిక సర్వేను రూపొందించటంలో ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఎదుర్కొనివుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టుముట్టి ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసిన వర్తమానంలో అదంత సులభం కాదు. అయితే శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ఉన్నంతలో పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నించింది. దాని ఆధారంగా రాగల ఆర్థిక సంవత్సరం ఎలా వుండబోతు న్నదో తెలిపింది. కరోనా మహమ్మారిని అదుపు చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి గనుక మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం వున్నదని ఆర్థిక సర్వే హామీ ఇస్తోంది. రాగల ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని, ఆ మరుసటి సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి వుండితీరుతుందని చెబుతోంది. కరోనా మహమ్మారి పర్యవసానంగా వర్తమాన ఆర్థిక సంవ త్సరంలో ఈ వృద్ధి మైనస్ 7.7 శాతానికి పడిపోయిందని అంచనా వేసింది. అయినా వీ షేప్ రిక వరీతో ఇది మళ్లీ కోలుకుంటుందని తెలిపింది. అంటే ఏ తీరులో వృద్ధి రేటు పడిపోయిందో అదే తీరులో మళ్లీ వేగంగా పుంజుకుంటుందని హామీ ఇచ్చింది. వివిధ రకాల సంస్కరణలు, ఇప్పుడున్న నియంత్రణలను సరళీకరించటం, మౌలిక రంగ పరిశ్రమల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, స్వల్ప వడ్డీరేట్లతో రుణాల మంజూరు వంటి ప్రభుత్వ విధానాలే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి తోడ్పడతాయని ఆర్థిక సర్వే భావించింది. అయితే ద్రవ్యలోటు తీవ్రంగా వుంది. ఆర్థిక సర్వే గణాంకాలే ఆ సంగతి చెబుతున్నాయి. ప్రభుత్వానికొచ్చే ఆదాయానికీ, దాని వ్యయానికీ మధ్య లోటు రూ. 11,58,469 కోట్లని సర్వే అంచనా వేసింది. ఆర్థిక ఒడిదుడుకు లను తట్టుకోవటం కోసం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు, ఆహార ధాన్యాల పంపిణీ వగైరాల కోసం ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది. కరోనావల్ల సేవా రంగం, తయారీ రంగం, నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే లాక్డౌన్ కాలంలో చెప్పుకోదగ్గ ప్రధాన అంశం ఒకటుంది. అన్ని రంగాలూ కుంటుపడిన వేళ సాగు రంగం ఒక్కటే ఆర్థిక వ్యవస్థ వెనక దృఢంగా నిలబడింది. అది మరింత దిగజారిపోకుండా ఆదుకుంది. ఆర్థిక సర్వే కూడా దీన్ని గుర్తించింది. నిజానికి కరోనా వ్యాక్సిన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాకుండానే ఆ వ్యాధి క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ప్రజానీకంలో సామూహిక రోగ నిరోధకత ఏర్పడటమేనని వాదించేవారున్నారు. అందుకు ఉదాహరణగా బిహార్ ఎన్నికలను చూపుతున్నారు. భారీగా జనసమూహం పాల్గొన్న వేడుకలను ఉదహరిస్తున్నారు. కానీ ఆ విషయంలో తొందపడి నిర్ణయానికి రావటం అసాధ్యం. యూరప్ దేశాల్లోగానీ, అమెరికాలోగానీ ప్రస్తుతం వున్న పరిస్థితులే ఆ సంగతిని వెల్లడిస్తున్నాయి. అక్కడ అందరూ కరోనా వైరస్ దాదాపు నియంత్రణలోకొచ్చిందని స్వేచ్ఛగా సంచరించారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలబడలేదు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొన్ని నెలల క్రితం ప్రారంభమైనట్టు కనబడిన ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. కనుక వీ షేప్ రికవరీ సాధ్యమేనని చెబుతున్న ఆర్థిక సర్వేను విశ్వసించి భరోసాతో వుండగలమా? కరోనా కాటుకు దేశవ్యాప్తంగా 1,53,847మంది మరణించారు. దాని వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేసిన లాక్డౌన్తో సర్వం స్తంభించిపోవటం వల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పో యారు. అన్ని వర్గాల ప్రజల ఆదాయమూ గణనీయంగా పడిపోయింది. కుటుంబాల నెలసరి ఆదాయం తగ్గిపోవటంతో వ్యయంపై దాని ప్రభావం పడింది. రేపన్న రోజు ఎలాగన్న అనిశ్చితి ఏర్పడటంతో ఖర్చుకన్నా పొదుపుపైనే జనం దృష్టి పెట్టారు. కేవలం తిండి, ఆరోగ్యంవంటి ప్రధాన అవసరాల కోసమే వెచ్చించే ధోరణి అలవడింది. చిన్న దుకాణాలు మొదలుకొని భారీ పరిశ్రమల వరకూ అన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయి. ఉత్పాదకత దెబ్బతింది. ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడటంతో వివిధ వర్గాలు బ్యాంకులకు సక్రమంగా రుణాలు చెల్లిం చటం సాధ్యపడలేదు. బ్యాంకులు కూడా దీన్ని గమనించి రుణాల వసూళ్లలో సంయమనంతో వ్యవహరించాయి. దీన్ని సర్వే పరిగణనలోకి తీసుకుందా అన్న సందేహం వస్తోంది. ఎన్పీఏలు తగ్గాయో, పెరిగాయో బ్యాంకులు వసూళ్లు మొదలుపెడితేగానీ నికరంగా తెలియదు. ఆ రకంగా చూస్తే ఆర్థిక సర్వే మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకుందేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. అలాగే సాగు రంగ సంస్కరణలతో ఆ రంగం మరింత బలోపేతమవుతుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన మూడు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపి వేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పైగా ఆ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సాగు రంగ సంస్కరణలు ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. అలాగే ఆహార సబ్సిడీల వ్యయం పెరిగిపోతున్న తీరును వివరిస్తూ దీన్ని అదుపు చేయాల్సి వుంటుం దని, అందుకోసం కేంద్ర జారీ ధరను పెంచాల్సివుంటుందని సూచిస్తోంది. అది కూడా అంత సులభమేమీ కాదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించాలంటే గట్టి చర్యలు అవసరమవు తాయన్న ఆర్థిక సర్వే భావన సరైందే. అయితే ఆ చర్యలు ఏమిటన్నది ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లోగానీ తెలియదు. ఆ చర్యలు పకడ్బందీగా వుంటే భిన్న రంగాలు పుంజుకోవటం, మళ్లీ ఆర్థిక వ్యవస్థ తేరుకోవటం సాధ్యపడొచ్చు. ఆదాయానికీ, వ్యయానికీ మధ్య సమతూకం సాధిస్తూ ద్రవ్య లోటు విజృంభించకుండా చూడటం వర్తమాన పరిస్థితుల్లో కత్తిమీద సామే. రాగల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎంత సమర్థవంతంగా చేయగలుగుతుందో చూడాలి. -
భారీగా పెరిగిన వెండి ధర
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం వెండి ధర ఒక్కసారిగా దాదాపు రూ.3వేలు పెరగడం విశేషం. అలాగే బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.132 పెరిగి రూ.48,376కు చేరింది. అలాగే క్రితం సెషన్లో రూ.65,495గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ. 2,915 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,844.35 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.35 అమెరికన్ డాలర్లు పలికింది.(చదవండి: ప్రీ బడ్జెట్ ఫీవర్: తీవ్ర ఊగిసలాట) -
ప్రీ బడ్జెట్ ఫీవర్ : తీవ్ర ఊగిసలాట
సాక్షి, ముంబై : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రానున్న బడ్జెట్ మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే లాభాలతో సూచీలు ఫిబ్రవరి సిరీస్ను ఉత్సాహంతో ప్రారంభించాయి. 400 పాయింట్లకు పైగాఎగిసి 5 రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. కానీ ఆ తరువాత తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46285 వద్ద 46 వేల 300 స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ కూడా అదే పరిస్థితి. 183 పాయింట్ల నష్టంతో 13634 వద్ద నిఫ్టీ ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ షేర్లలో కొనుగోళ్ళ మద్దతు కనిపించింది. (ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ , బీపీసీఎల్ లాభపడగా, రిలయన్స్, బ్రిటానియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, హీరో మోటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, డా. రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ , భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి. (ఫిబ్రవరి 1వ తేదీకి లోక్సభ వాయిదా) -
ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి
సాక్షి , న్యూఢిల్లీ: కరోనాసంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మెగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. దీంతో లోక్సభ ఫిబ్రవరి 1 వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఏఈ) డాక్టర్ వి. కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఈ రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆర్థిక సర్వే : 2020-21 2020-21పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను వీ షేప్ రికవరీ ఉంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 - మార్చి 2022 వరకు) జీడీపి వృద్ధి 11 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని సర్వే సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు, ప్రైవేటు రంగం ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే సిఫారసు చేసింది. కాగా కోవిడ్-19 విస్తరణ, పలువురు సభ్యులకు కరోనా సోకిన ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాలను కుదించారు. అలాగే శీతాకాల సమావేశాలను రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి తోడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి 1వ తేదీకి లోక్సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వే-2021ను లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది. రామ్నాథ్ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. ► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ► ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవి. ► స్మార్ట్ఫోన్ తయారీలో ఇప్పుడు మనం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం. ► రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు ► ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలు విజయవంతం. ► పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. ► వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం. ► కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో, ప్రతీసభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా మెరుగైన సౌకర్యాలు పొందుతారు. ► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ యాదృచ్చికంటగా స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరానికి చేరుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరం. ► జాతి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► భారతదేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడటం కోసం వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించాం. ► గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్ల వీరమరణం మరువలేనిది. ► దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకుంటారు. ► కరోనా మహమ్మారి నుంచి ప్రతి పౌరుడిని కాపాడుకుంటూ, ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం. ► ఈ కరోనా టైంలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది. ► కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13వేల కోట్లు బదిలీ ► ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో జరుగుతోంది ► రెండు వ్యాక్సిన్లు కూడా భారత్లోనే రూపొందించారు ► కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగం ► కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు ► రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చాం ► కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం ► ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి కోవింద్ ► క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర ప్యాకేజీ వరంగా మారింది ► గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ ధ్యేయం ► రైతుల అభివృద్ధి కోసం కిసాన్ రైలు తీసుకొచ్చాం ► మత్స్యకారుల కోసం కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ► దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు ► జనఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు చౌకగా ఔషధాలు ► వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ► మత్స్యకారుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయం ► 3 వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది ► గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం. దేశానికి ఎంతో పవిత్రమైన జాతీయ జెండాకు అవమానం జరిగింది. ► భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును కల్పించడంతోపాటు చట్టాలను గౌరవించాలని కూడా రాజ్యాంగం బోధిస్తుంది ► ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ► తుపాన్ల నుంచి బర్డ్ఫ్లూ వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ► కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారత్ నిలిచింది. ► ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం. ► సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. ► కరోనాపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. ► సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. ► మానవత్వంతో కరోనా వ్యాక్సిన్ను ఇతర దేశాలకు పంపించాం. ► పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమలు చేశాం. ► జన్ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ► ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్ కల్యాణ్ యోజన అమలు చేశాం. ► 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ► దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ► దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి ► ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. ► సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ► కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్. ► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ► దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను పొందవచ్చు. ► దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు. ► కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో చాలా మంది పౌరులను కోల్పోయాము. ప్రధానంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాలంలోనే కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం. కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో 2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం, వాక్సినేషన్, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
రియల్టీకి మౌలిక రంగ హోదా ఇవ్వండి!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బడ్జెట్పై దేశీయ డెవలపర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదాను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని డెవలపర్ల సంఘాలు ధీమావ్యక్తం చేస్తున్నాయి. ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేలా, కొనుగోలుదారులకు, డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఉండేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆశాభావంవ్యక్తం చేశారు. సింగిల్ విండో ద్వారా ప్రాజెక్ట్ల అనుమతులు, లిక్విడిటీని పెంచే చర్యలతో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యత వంటివి ఆశిస్తున్నట్లు టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. రియల్టీ రంగ వృద్ధి రాబోయే ఆర్ధిక సవరణల మీద ఆధారపడి ఉందని, ప్రాజెక్ట్లు వేగవంతంగా పూర్తి చేయడానికి ఒకే విండో క్లియరెన్స్ యంత్రాంగాన్ని మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఒకటే స్టాంప్ డ్యూటీ లేదా అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు వంటి సిఫారసులను చేపట్టాలని, దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గి గృహ కొనుగోలుదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్టీ పరిధిలోకే తీసుకురావాలని గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ మనోజ్ గౌర్ తెలిపారు. ఐటీ చట్టం, 1961లోని 80సీ కింద గృహ రుణాల్లో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని, ప్రాపర్టీ అమ్మకం మీద దీర్ఘకాలిక పన్నుల్లో సంస్కరణలు చేపట్టాలని, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల మీద జీఎస్టీని హేతుబద్దం చేయాలని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ కోరారు. అఫర్డబుల్ మరియు మిడ్–ఇన్కం ప్రాజెక్ట్లను పూర్తి చేయడానికి కేటాయించిన ప్రత్యేక ఫండ్ (ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్)ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కోరారు. బంగారం రుణ సంస్థలను ప్రోత్సహించాలి వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న తమను ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే ప్రత్యేకంగా చూడాలని బంగారంపై రుణాలను అందించే ఎన్బీఎఫ్సీలు కేంద్రాన్ని కోరాయి. ‘‘2021–22 బడ్జెట్ నుంచి వృద్ధి అనుకూల విధానాలను ఆశిస్తున్నాము. అప్పుడే రానున్న సంవత్సరాల్లో సామర్థ్యం మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందగలదు. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు ఎంఎస్ఎంఈలు, వ్యక్తులకు వేగంగా రుణ సాయాన్ని అందిస్తున్నాయి. కనుక ఇతర ఎన్బీఎఫ్సీలకు భిన్నంగా చూడాలి. ఎందుకంటే రూ.1,500 మొత్తాల నుంచి సామాన్యులకు రుణాలను అందిస్తున్నాయి. ఇళ్లలోని బంగారాన్ని మానిటైజ్ చేసి ఆర్థిక వ్యవస్థకు సాయంగా నిలుస్తున్నాయి. కనుక పారదర్శకమైన, వృద్ధికి అనుకూలంగా ఉండే నియంత్రణ పరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నాము. అలా చేస్తే కస్టమర్లకు మరింత మెరుగ్గా, వేగంగా సేవలు అందించడానికి వీలు పడుతుంది. బ్యాంకులు, గోల్డ్ ఎన్బీఎఫ్సీల మధ్య ఎల్టీవీ విషయంలో అంతరాన్ని తొలగించాలి. బ్యాంకుల మాదిరే బంగారం కాయిన్లపై రుణాలకు అనుమతించాలి. ఆర్బీఐ నుంచి శాశ్వత రీఫైనాన్సింగ్ విండో ఉండాలి. అలాగే, వడ్డీపై టీడీఎస్ నుంచి మినహాయింపునివ్వాలి’’ అంటూ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ అలెగ్జాండర్ ముత్తూట్ బడ్జెట్ నుంచి తామేమి ఆశిస్తున్నామో తెలియజేశారు. ద్రవ్యలోటు కాకుండా... వృద్ధే లక్ష్యం కావాలి! ఇండియా రేటింగ్స్ బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడిపైన మరీ అంత దృష్టి పెట్టకుండా, ఆర్థిక రివకరీ, వృద్ధిపైనే చర్యలు తీసుకోవాలని ఇండియా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర పంత్ నివేదికలోని అంశాలను వెల్లడించారు. -
పర్యాటకం పట్టాలెక్కేనా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలతో ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం (టూరిజం), ఏవియేషన్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరోనా భయంతో ప్రజలు ముఖ్య అవసరాలు మినహాయించి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు తొలి నాళ్లలో సుముఖత చూపలేదు. దీంతో గడిచిన ఏడాది కాలంలో పర్యాటక రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రకటించే బడ్జెట్లో కచ్చితంగా తమను ఒడ్డెక్కించే చర్యలు ఉంటాయని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. రూ.1.25 లక్షల కోట్ల నష్టం.. కరోనా కారణంగా పర్యాటక రంగం ఒక్కటే 2020లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టపోయినట్టు కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటక రంగంపై 50 శాతం ప్రభావం పడగా.. మార్చిలో 70 శాతానికి పెరిగింది. ఇదే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో పర్యాటక రంగం రూ.69,400 కోట్ల మేర నష్టపోయిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం నష్టాలుగా పేర్కొంది. ఈ రంగం తిరిగి సాధారణ స్థితికి రావాలంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించొచ్చని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశిస్తున్నాయి. పరిశ్రమ డిమాండ్లు.. ► దేశీయంగా చేసే పర్యటనలపై ఆదాయపన్ను మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్ను పర్యాటక రంగం ఈ విడత కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ నమోదిత టూర్ ఆపరేటర్లు, ఏజెంట్లు, హోటళ్ల సేవల కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చుపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. టూరిజమ్ పరిశ్రమ జీడీపీలో 6.23 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. 8.78 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు, ఏవియేషన్, ఆతిథ్యం ఇవన్నీ టూరిజమ్ పరిశ్రమ కిందకే వస్తాయి. ► ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని, జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి. ► గడిచిన 10–12 నెలల కాలంలో దెబ్బతిన్న డిమాండ్ను పునరుద్దరించేందుకు తగినన్ని నిధులు కేటాయించి.. కష్టాల నుంచి బలంగా బయటపడేందుకు, డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలి. ► ఆర్థిక వ్యవస్థ చురుగ్గా మారాలంటే వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఎత్తివేయాలి. ► ఎంఎస్ఎంఈ మూలధన నిధుల రుణాలను పర్యాటక రంగానికీ విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు సహకరించాలి. ► రుణాల వడ్డీపై వెసులుబాట్లు, రుణ చెల్లింపులపై మారటోరియం కల్పించాలి. ► ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎయిర్పోర్ట్ చార్జీలపై లెవీలను, ల్యాండింగ్, నేవిగేషన్ చార్జీలను కూడా తగ్గించాలి. ► లాక్డౌన్లను ఎత్తేసి, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన అనంతరం పర్యాటక రంగంలో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తుండడం, మరోవైపు టీకాల కార్యక్రమం కూడా మొదలైనందున రానున్న నెలల్లో మంచి వృద్ధి ఉంటుందని ఈ రంగం అంచనా వేస్తోంది. ప్రభుత్వపరమైన సహకారం తోడైతే తాము మరింత వేగంగా పురోగమించొచ్చని భావిస్తోంది. ఆతిథ్య రంగాన్ని ముందుగా ఒక పరిశ్రమగా గుర్తించాలి. అద్దె ఇళ్ల విధానాన్ని తీసుకురావాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. పరిశ్రమ ఎంత వేగంగా పుంజుకుంటుందన్నది ప్రభుత్వ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. – కృష్ణ కుమార్, సీఈవో, ఇస్తారా పార్క్స్ 2022 నాటికి దేశీయంగా 22 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలిచే హోటళ్లకు ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి. ఎంఎస్ఎంఈ వర్కింగ్ క్యాపిటల్ రుణాలను టూరిజమ్ పరిశ్రమకూ ఇవ్వాలి. ఎల్టీసీజీని వెనక్కి తీసుకోవాలి. – రోహిత్ వారియర్, వారియర్ సేఫ్ సీఈవో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు దేశీయ పర్యాటక రంగానికి మేలు చేస్తుంది. –దీప్కల్రా,మేక్మైట్రిప్ వ్యవస్థాపకుడు -
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ను పునరుద్ఘాటిస్తూ దేశ రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు కాంగ్రెస్ సహా 18 ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్(ఎం), ఏఐయూడీఎఫ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘దేశ జనాభాలో 60 శాతం ప్రజలు, కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడిన వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ప్రమాదకరంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దుతున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంఘటితంగా రైతులు పోరాడుతున్నారు. గడిచిన 64 రోజులుగా తీవ్రమైన చలిని, భారీ వర్షాలను లెక్కచేయకుండా దేశ రాజధానిలో రైతులు తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నారు. సుమారుగా 155 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంలో కదలిక లేకపోగా.. వాటర్ కెనాన్లతో, టియర్ గ్యాస్తో, లాఠీఛార్జీలతో జవాబు ఇచ్చింది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని ప్రభుత్వ ప్రాయోజిత తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ ఆహార భద్రత స్వరూపం ముక్కలవుతుంది.. ‘మూడు సాగు చట్టాలు రాష్ట్రాల హక్కులపై, రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై దాడి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోనిపక్షంలో అవి దేశ ఆహార భద్రత స్వరూపాన్ని ముక్కలు చేస్తాయి. అంతేకాకుండా కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తాయి’ అని పేర్కొన్నాయి. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.. ‘ప్రధాని, బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మాకు దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్ల మేం సంఘటితంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ను పునరుద్ఘాటిస్తున్నాం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాం’ అని కాంగ్రెస్సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. -
వేడెక్కనున్న పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలకు సంఘీభావంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడికి సిద్ధం కావడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా కాంగ్రెస్, ఆప్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన సమావేశాలు వాడీవేడిగా సాగనున్నట్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఉదయం ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలబడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగిత రహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్, ఎకనామిక్ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రయివేటు మెంబర్స్ బిజినెస్ కూడా పునరుద్ధరించారు. వర్షాకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సాగగా.. బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు. బడ్జెట్ సమావేశాల్లో వచ్చే బిల్లులు ఇవే.. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆర్డినెన్స్ 2020, మధ్యవర్తిత్వం; సయోధ్య (సవరణ) ఆర్డినెన్స్–2020, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్–2021 తదితర ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్దులను పరిగణనలోకి తీసుకుని స్థాయీ సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15న వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి ప్రహ్లాద్ రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ సహా 16 ప్రతిపక్షాలు ప్రకటించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు అడిగితే దేనిపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన సమయం మేరకు చర్చించేందుకు మేం సిద్ధం. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. ఇలా బహిష్కరించడం అవాంఛనీయం..’అని పేర్కొన్నారు. -
‘నెవర్ బిఫోర్’ బడ్జెట్ లో బ్యాంకింగ్ !
‘‘ఈ దఫా ఇంతకు ముందెన్నడూ చూడని (నెవర్ బిఫోర్) విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది...’’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసిన వ్యాఖ్య ఇది. దీనితో ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్పై అన్ని రంగాలకు సంబంధించి ఉత్కంఠత నెలకొంది. ఎకానమీకీ వెన్నెముకగా భావించే బ్యాంకింగ్లోనూ ప్రస్తుతం ఇదే విషయమై చర్చ మొదలైంది. మొండిబకాయిల భారం నుంచి మూలధన సమస్యల వరకూ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన బ్యాంకింగ్కు రానున్న బడ్జెట్లో ఎటువంటి స్థానం లభించనుందన్నదే ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం. మొండిబకాయిల తీవ్రత... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అంతర్జాతీయ రేటింగ్, బ్యాంకింగ్ సేవల దిగ్గజాలు పలు సానుకూల విశ్లేషణలు చేస్తున్నాయి. అయితే ప్రతికూలతల విషయానికి వచ్చే సరికి బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ముందు వరుసలో ఉంటోంది. భారత్ బ్యాంకింగ్పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని భారత్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ప్రస్తావించడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొనడం గమనార్హం. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ‘మొండి’ భారం బ్యాంకింగ్పై ఉంటుంది. నిధుల కొరత... తీవ్ర ఒత్తిడుల నేపథ్యంలో బ్యాంకింగ్ క్యాపిటల్ అడక్వెసీ రేషియో (సీఏఆర్) 2020 సెప్టెంబర్లో 15.6 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ నాటికి కనీసం 14 శాతానికి పడిపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ఇది 12.5 శాతానికైనా పడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వాటాదారులు ఎవ్వరూ ఎటువంటి మూలధనాన్ని అందించలేకపోతే 2021 సెప్టెంబర్ నాటికి నాలుగు బ్యాంకులు కనీస మూలధన స్థాయిని నిర్వహించడంలోసైతం విఫలమయ్యే అవకాశం ఉందని స్వయంగా ఆర్బీఐ నివేదిక పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఈ తరహా బ్యాంకుల సంఖ్య తొమ్మిదికి చేరవచ్చన్న అందోళనా ఉంది. నియంత్రణాపరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక డిపాజిట్లు పెరుగుతుండగా, రుణాలు తగ్గుతుండడం మరో సమస్య. ఎన్బీఎఫ్సీల స్థితీ అంతంతే! దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ)ల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. రుణ మార్కెట్లో ఎన్బీఎఫ్సీలు ప్రధాన మధ్యవర్తిత్వ సంస్థలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఇవి నిధుల లభ్యత, పాలనా, సాల్వెన్సీ (తీసుకున్న రుణాలు తీర్చే సామర్థ్యం) సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రానున్న బడ్జెట్లో ఈ ఒత్తిళ్లను తగ్గించే చర్యలు ఉంటాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల మద్దతు అవసరమన్న వాదనా ఊపందుకోవడం లిక్విడిటీ సవాళ్లకు అద్దం పడుతోంది. ‘బ్యాంకులు కనీసం 50 శాతం నిధులను చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫీసీల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ తీసుకొచ్చిన టీఎల్టీఆర్వో 2.0కు స్పందన తగిన విధంగా లేదన్న విమర్శ ఉంది. ఇక ఎన్బీఎఫ్సీ వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలు లక్ష్యంగా ఆర్బీఐ ఇటీవలే నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. బడ్జెట్లో ఆశిస్తున్న దేమిటి? బాసెల్ నిబంధనలు బ్యాంకింగ్ మూలధనానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న బాసెల్ నిబంధనలను మరో మూడు సంవత్సరాలు పక్కకు పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకింగ్ నుంచి మరింత నిధుల లభ్యత సమకూరుతుందని విశ్లేషిస్తున్నారు. క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ పొడిగింపు చిన్న, లఘు మధ్య తరహా పరిశ్రమలు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీల నుంచి అత్యవసర రుణ లభ్యత పొందడానికి కీలకమైన పథకం ఇది. 100 శాతం రుణ హామీ కేంద్రం నుంచి బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు దీనివల్ల లభిస్తోంది. ఆర్థికవ్యవస్థలో కీలక విభాగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్న ఈ స్కీమ్ను మార్చి 31 తరువాతా పొడిగించేట్లు బడ్జెట్లో చర్యలు ఉండాలి. డిజిటలైజేషన్ భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ ప్రక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయి. బ్యాంకింగ్లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటలైజేషన్ విధానాలు అనుసరించడం వల్ల తమ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని, సత్వర సేవలు పొందడానికి ఇదే ఒక మార్గమని వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్ నుంచి నిధులు ఉద్దీపనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక లిక్విడిటీ మార్కెట్లకు ఊతం ఇస్తున్న నేపథ్యంలో, బ్యాంకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తగిన చర్యలు ఉండాలి. ప్రభుత్వ క్లిష్ల ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకింగ్కు తగిన ద్రవ్య లభ్యతకు ‘మార్కెట్ ద్వారా నిధుల’ సమీకరణ కీలకాంశం. మరింత మూలధనం 2019–20 వరకూ గడచిన 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.3,85,000 కోట్లను సమకూర్చింది. కరోనా సవాళ్లు, తీవ్ర మొండిబకాయిల సమస్య నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులకు మరింత మూలధన మద్దతు అవసరం. తక్షణం బ్యాంకింగ్కు మరో రూ.లక్ష కోట్ల మూలధనం అవసరం అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేటీకరణ – విలీనాలు కొత్త బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనాల దిశగా చర్యలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. సంస్కరణలకు పెద్దపీట బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణల విషయానికి వచ్చే సరికి ప్రైవేటీకరణ, విలీనాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో ‘ఒక బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (హోల్డింగ్ కంపెనీ) ఏర్పాటు ఆవశ్యకతపై చర్చ జరుగుతోంది. దీనితోపాటు పటిష్ట మూలధనంతో కూడిన ఒక డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ) ఏర్పాటు అవసరం ఉందన్నది నిపుణుల విశ్లేషణ. తద్వారా జాతీయ మౌలికరంగ పథకం (ఎన్ఐపీ)అవసరాలు తీర తాయని వారు సూచిస్తున్నారు. ఎన్ఐపీ కింద గుర్తించిన ప్రాజెక్టుల అమలుకు 2020–25 నాటికి రూ.111 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. -
పన్నులు తగ్గిస్తే.. పరిధి పైపైకి!
న్యూఢిల్లీ: బీమా పాలసీలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే.. వాటి ధరలు అందుబాటులోకి వచ్చి మరింత మందికి చేరువ అవుతాయంటూ ఈ రంగం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. బడ్జెట్ ముందస్తు సూచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ముందు పలు డిమాండ్లను వినిపించింది. 2021–22 బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాలని, దాంతో బీమా ప్లాన్లు మరింత ఆకర్షణీయంగా మారతాయని జీవిత బీమా పరిశ్రమ కోరింది. సెక్షన్ 80సీ కింద బీమా ఉత్పత్తులకు మరింత పన్ను మినహాయింపులను ప్రత్యేకించాలని.. దాంతో పన్ను ఆదా సాధనంగా వీటిని మరింత మంది కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారంటూ వివరించింది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.5లక్షల ఆదాయానికే పన్ను మినహాయింపు పొందగలరు. దీన్ని రూ.2లక్షలకు పెంచాలని లేదా బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ప్రత్యేక ఉప పరిమితిని అయినా తీసుకురావాలంటూ ఈ పరిశ్రమ కోరింది. ప్రత్యేక విభాగం..: జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులపై పన్ను ప్రయోజనాల కోసం రానున్న బడ్జెట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నట్టు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ సంజయ్ తివారీ తెలిపారు. మోటారు బీమా, టర్మ్, యూనిట్ లింక్డ్ (యులిప్) ప్లాన్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఎండోమెంట్ ప్లాన్లను సేవింగ్ సాధనంగా పరిగణిస్తూ వీటికి సంబంధించి మొదటి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, తర్వాతి సంవత్సరం నుంచి 2.25 శాతం జీఎస్టీని అమలు చేస్తున్నారు. సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్లపై జీఎస్టీ 1.8 శాతంగా ఉంది. ఎన్పీఎస్, బీమా ఉత్పత్తుల మధ్య పన్నుల పరంగా అంతరం ఉంది. దీంతో ఎన్పీఎస్తో పోల్చినప్పుడు పెన్షన్/యాన్యుటీ ప్లాన్ల విషయంలో ఒకే హోదా కల్పించాలని బీమా కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షలకు అదనంగా.. సెక్షన్ 80సీసీడీ కింద ఎన్పీఎస్లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల పెట్టుబడులపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది. ఇదే విధమైన ప్రయోజనాలను బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ ప్లాన్లపై అందించాలని కోరుతున్నట్టు ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో కామేష్రావు తెలిపారు. స్విస్ ఆర్ఈ డేటా ప్రకారం.. దేశంలో బీమా తలసరి ప్రీమియం 2019–20లో 78 డాలర్లు (రూ.5,850)గా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 818 డాలర్లు (రూ.61,350)గా ఉంది. బీమా వ్యాప్తి (జీడీపీలో ప్రీమియం శాతం) 2019–20లో 3.76 శాతంగా ఉంది. జీవిత బీమా వ్యాప్తి దేశీయంగా 2.82 శాతంగా ఉంటే, అంతర్జాతీయ సగటు 3.55%. ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి.. ‘‘ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం తన వ్యయాలను బడ్జెట్లో ప్రస్తుతమున్న 1.2% నుంచి కనీసం 2.5%కి అయినా వచ్చే మూడేళ్ల కాలంలో పెంచాల్సి ఉంది. ఇందులో అధిక భాగం నిధులను ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆధునికీకరణకు వినియోగించాలి. ఈ దిశగా 2021–22 బడ్జెట్ తొలి అడుగు వేస్తుందని ఆశిస్తున్నాము’’ అని మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ, సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ కామర్స్కీ చేయూత దేశంలో ఏటేటా భారీగా విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగానికీ వచ్చే బడ్జెట్లో కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామర్స్ దిగుమతులు, ఎగుమతులకు ఒకే విడతలో పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడం ఇందులో భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘దేశంలో ఈ కామర్స్ రంగం (ఆన్లైన్ వేదికలపై విక్రయాలు నిర్వహించే సంస్థలు) ఎన్నో రెట్లు వద్ధి చెందింది. దీంతో భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటూ.. తిరిగి భారత్ నుంచి ఎగుమతులు చేస్తుండడంతో నియంత్రణ, సదుపాయాల పరంగా సమతుల్యత అవసరం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయానికి భారీ రుణ సాయం! రూ.19లక్షల కోట్లకు పెంచే అవకాశం న్యూఢిల్లీ: దేశంలో రైతు ఆదాయాన్ని 2020 నాటికి రెట్టింపును చేయాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర సర్కారు.. ఇందు కోసం సాగు రంగానికి రుణ వితరణ (క్రెడిట్) లక్ష్యాన్ని రూ.19లక్షల కోట్లకు పెంచనుంది. ఫిబ్రవరి 1న తీసుకురానున్న బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి క్రెడిట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.15లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా.. దీంతో పోలిస్తే 35 శాతానికి పైగా పెరగనుంది. నిజానికి ఏటా సాగు రంగానికి రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచుతూ వస్తోంది. అంతేకాదు, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి రుణ వితరణ కూడా నమోదవుతోంది. 2017–18 సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, రూ.11.68 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. అలాగే, 2016–17లోనూ రూ.9లక్షల కోట్ల లక్ష్యాన్ని మించి.. రూ.10.66 లక్షల కోట్లకు పెరిగింది. నామమాత్రపు వడ్డీ... వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై 9 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. దీనిపై కేంద్రం రాయితీలు ఇస్తోంది. 2 శాతం రాయితీపోగా 7 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు. అది కూడా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించేస్తే మరో 3 శాతాన్ని ప్రోత్సాహకంగా అందిస్తోంది. వెరసి నికర వడ్డీ రేటు 4 శాతమే అవుతోంది. -
జీడీపీకి సాగు దన్ను
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. మూడవ త్రైమాసికంలో ఎకానమీ మైనస్లోనే ఉంటుందని, నాల్గవ త్రైమాసికంలోనే వృద్ధి బాటకు వస్తుందని విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో 1.3 శాతం క్షీణ రేటును అంచనా వేసిన ఫిక్కీ, నాల్గవ త్రైమాసికంలో 0.5 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం దేశం 9.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని వివరించింది. 7.5 శాతం–12.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణిలో ఉండే వీలుందనీ సర్వే అంచనా వేసింది. అదే విధంగా.. దేశ వ్యవసాయ రంగం కరోనా ప్రేరిత సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఫిక్కీ సర్వే పేర్కొంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య 23.9 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ జారుడు రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరిలో పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన రూపొందించిన అవుట్లుక్ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ♦ 2020–21లో వ్యవసాయ, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుంది. ♦ కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరచింది. రబీ పంట విస్తీర్ణం, తగిన వర్షపాతం, భారీ రిజర్వాయర్ స్థాయిలు, ట్రాక్టర్ అమ్మకాల్లో పటిష్ట వృద్ధి తత్సంబంధ అంశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతికి సూచికగా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం పురోగతికి పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రత్యేకించి గిడ్డంగి సౌలభ్యతలు మెరుగుపడాలి. ♦ కరోనా వల్ల పరిశ్రమ, సేవల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ 2 రంగాలూ 2020–21లో వరుసగా 10%, 9.2% నష్టపోతాయి. ♦ పారిశ్రామిక రంగంలో రికవరీ ఉన్నా, ఇంకా విస్తృత ప్రాతిపదికన ఇది కనిపించడంలేదు. పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్ రికవరీకి దారితీసినా, దీర్ఘకాలంలో సానుకూలతలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ♦ పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆయా విభాగాల పురోగతికి ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీలు ఉండాలి. ♦ 2020–21లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 10.7% క్షీణతలో ఉంటుంది. కనిష్ట–గరిష్ట స్థాయిల శ్రేణి మైనస్ 9.5%– మైనస్ 12.5 శాతంగా ఉంటుంది. ♦ 2020–21లో 6.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. కనిష్ట–గరిష్ట స్థాయిలు 5.8 శాతం – 6.6 శాతం శ్రేణిలో ఉంటాయని అంచనా. ♦ ఇక ప్రభుత్వ ఆదాయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21లో 7.4%గా (జీడీపీలో) ఉండవచ్చు. 7–8.5% శ్రేణిలో ఉండే వీలుంది. -
ఇళ్లకు డిమాండ్ కల్పించండి
కేంద్ర బడ్జెట్ 2021–22లో ఇళ్లకు డిమాండ్ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరింది. వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనానికి తోడు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలను ఫిబ్రవరి 1న బడ్జెట్లో భాగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా వడ్డీ రాయితీని కొనసాగించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మౌలికరంగ హోదా కల్పించాలని, ఈ రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయాలంటూ క్రెడాయ్ బెంగాల్ శాఖా పలు డిమాండ్లు వినిపించింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వినియోగించే సిమెంట్ తదితర ముడి సరుకుల కోసం చెల్లించిన జీఎస్టీని అద్దె ఆదాయంలో సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. దీనివల్ల ద్వంద్వ పన్నులను నిరోధించడంతోపాటు.. దేశంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ను పెంచినట్టు అవుతుందంటూ పారిశ్రామిక మండలి సీఐఐ సైతం కేంద్రానికి సూచించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రియల్ ఎసేŠట్ట్కు తిరస్కరించడం వల్ల డెవలపర్ల నిధులు బ్లాక్ (నిలిచిపోతాయని) అవుతాయని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ప్రాజెక్టుల పూర్తికి గాను రూ.25,000 కోట్ల నిధుల సాయాన్ని (స్ట్రెస్డ్ ఫండ్) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఫర్ చేసిన విషయం గమనార్హం. అలాగే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 43(సీఏ) కింద రిజిస్ట్రేషన్, ఒప్పంద విలువ (సర్కిల్)ల మధ్య అంతరాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 2021 జూన్ 30 వరకు ఇవి అమలు కానున్నాయి. మద్దతుగా నిలవాలి.. ‘‘మానవ చరిత్రలోనే 2020 ఎంతో అసాధారణమైనది. సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వాటాను అందిస్తున్న రియల్ ఎస్టేట్కు రంగాన్ని మరింత పెంచి పోషించాల్సి ఉంది. దాంతో వచ్చే పదేళ్లలో ఈ రంగం పెద్ద ఎత్తున దూసుకుపోతుంది’’ అంటూ క్రెడాయ్ పశ్చిమబెంగాల్ శాఖ ప్రెసిడెంట్ సుశీల్ మెహతా పేర్కొన్నారు. చౌక గృహ రుణంపై చెల్లిస్తున్న వడ్డీలో వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా, దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలి. ఇంటి రుణంలో అసలుకు చెల్లించే మొత్తాలను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చూపించుకునేందుకు అనుమతిస్తుండగా.. ఇలా సెక్షన్ 80సీ కింద కాకుండా ప్రత్యేకంగా రూ. 1.5లక్షలపై పన్ను ఆదాకు అవకాశమివ్వాలి. వాహనాల విలువ క్షీణతపై ప్రయోజనాలు కావాలి ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ వాహనాల వినియోగంతో తరిగిపోయే విలువపై పన్ను ప్రయోజనాలు కల్పించాలంటూ ఆటోమొబైల్ పరిశ్రమ కేందాన్ని కోరింది. మరో వారంలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు వాహనాల తరిగే విలువను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేసింది. వాహన డీలర్లు వార్షికంగా 0.1 శాతం టీసీఎస్ (మూలం వద్దే పన్ను వసూలు)ను పక్కన పెట్టడం అన్నది ఆర్థికంగా వాహన రిటైల్ పరిశ్రమపై ఎంతో భారాన్ని మోపుతుందంటూ, దీన్ని తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) కోరింది. ఖరీదైన కార్లవైపూ చూడాలి.. మరోవైపు.. ఖరీదైన కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, లంబోర్గిని బడ్జెట్లో లగ్జరీ వాహనాలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరాయి. అధిక పన్నుల కారణంగా ఖరీదైన కార్ల విభాగం వృద్ధి చెందలేకపోతున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ ఖరీదైన లగ్జరీ శ్రేణి కార్లపై పన్నులను తగ్గించడానికి బదులు పెంచే చర్యలకు వెళితే డిమాండ్ను దెబ్బతీయడమే కాకుండా, గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి కోలుకోకుండా చేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. -
కేంద్ర బడ్జెట్ : కీలక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రక్రియకు కీలకమైన హల్వా వేడుకతో ఆర్థికమంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నార్త్ బ్లాక్లో నిర్వహించిన హల్వా వేడుకకు నిర్మలా సీతారామన్తోపాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరైనారు. (బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే) యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రతులను పేపర్లెస్గా అందిస్తున్న క్రమంలో యూనియన్ బడ్జెట్ సమాచారాన్ని సులభంగా శీఘ్రంగా అందించేందుకు వీలుగా “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్” ను ఆర్థికమంత్రి లాంచ్ చేశారు. డౌన్లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ అవుట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయాల పట్టిక, ఇతర లింక్స్ యాక్సెస్ మొదలైన వాటితో కూడిన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో దీన్ని రూపొందించారు. ఇది ఇంగ్లీష్ , హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. కేంద్ర బడ్జెట్కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో 'హల్వా వేడుక' నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్వా వేడుక తరువాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన ఉద్యోగులను నార్త్ బ్లాక్ నేలమాళిగలో సుమారు 10 రోజులు లాక్ చేస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021-22 యూనియన్ బడ్జెట్ ప్రతులను ఈ సారి ముద్రించడం లేదు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ప్రతులను డిజిటల్ ఫార్మాట్లోనే సభ్యులకు అందించనున్నారు. అలాగే జనవరి 29న పార్లమెంట్కు సమర్పించే ఆర్థిక సర్వే ప్రతులను కూడా ప్రింట్ చేయడం లేదు. కాగా ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సమాచారం ప్రకారనం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. జనవరి 29 నుంచి ఫ్రిబవరి 15 వరకు తొలి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలుంటాయి..పార్లమెంట్ సమావేశాలకు ముందుగా సభ్యులంతా ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే
సాక్షి,ముంబై: ఆర్థికాభివృద్ధికి గాను కేంద్రం ఇకపై తన దృష్టిని సరఫరాల పరమైన సమస్యల నుంచి నుంచి డిమాండ్ వైపు ఇబ్బందులపైకి మరల్చాలని రేటింగ్స్ సూచించింది. 2021-22 బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని సూచించింది. ముఖ్యాంశాలు చూస్తే... మహమ్మారి కరోనా దేశంలో సమస్యలు సృష్టించడం ప్రారంభించినప్పటి నుంచీ కేంద్రం తన దృష్టిని దాదాపు సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికే కేటాయించింది. డిమాండ్ వైపు సవాళ్లను తొలగించడానికి అంతగా ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఈ విధానం మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికి ప్రయతి్నంచడం మంచిదే. ఇందులో తప్పేమీ లేదు. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ఆర్థిక వ్యవస్థ క్షీణిత, రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి కట్టడి జరగడం హర్షణీయం. అయితే ఇక్కడ వ్యవస్థలో తగిన డిమాండ్ లేకపోతే సరఫరాల వ్యవస్థ పునరుద్ధరణ జరిగినా ఆర్థిక రికవరీలో మున్ముందు తగిన ఫలితాలు కనిపించవు. పైగా ఆర్థిక వ్యవస్థలో మరోదఫా మందగమన సమస్యలు తలెత్తుతాయి. 2012లో తలెత్తిన ఇదే తరహా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా సరఫరాల సమస్యలు రాకుండా భారీ ఉద్దీపనల ప్రకటనలు జరిగాయి. అయినా కంపెనీలు పెట్టుబడులకు పెద్దగా ముందుకురాలేదు. ఫలితంగా తక్కువ వేతనాలు, ఉపాధి కల్పన తగ్గడం తద్వారా డిమాండ్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లనుంచి ఉద్దీపన ప్రకటనలు, సరళతర ద్రవ్య విధానాలు వస్తున్నాయ్. సరఫరాల పరమైన ఇబ్బందులు తొలగుతున్నాయ్. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం ఇంకా మెరుగుపడ్డంలేదు. వేతనాలూ భారీగా పెరగని పరిస్థితి ఉంది. దీనితో వస్తు, సేవలకు తగిన డిమాండ్ నెలకొనడం లేదు. రానున్నది వ్యాపార పునరుద్ధరణ ‘బడ్జెట్’ పారిశ్రామిక రంగంలో 50 శాతం భరోసా ∙డెలాయిట్ సర్వే వెల్లడి కొత్త బడ్జెట్ (2021–22 ఆర్థిక సంవత్సరం) తమ వ్యాపారాల పునరుద్ధరణకు దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన 50 శాతం మంది ప్రతినిధులు భరోసాతో ఉన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న బడ్జెట్ అంశాలు, ప్రతిపాదనలపై ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ తాజాగా నిర్వహించిన సర్వేకు సంబంధించి శుక్రవారం వెల్లడైన కొన్ని అంశాలను పరిశీలిస్తే... కొత్త బడ్జెట్తో ఆర్థిక రికవరీ, డిమాండ్ వృద్ధి నెలకొంటాయని 70 శాతం పారిశ్రామిక వర్గం భావిస్తోంది. వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచడం వల్ల ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగతాయని సర్వేలో పాల్గొన్న కొందరు పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్లో చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. డిమాండ్ పెరుగుదలకు బడ్జెట్లో ప్రధానంగా చర్యలు ఉంటాయని 50 శాతం భావిస్తున్నారు. వస్తు, సేవల సరఫరాల్లో ఇంకా నెలకొన్న ఆంక్షలు, వినియోగదారులో నెలకొన్న ఆర్థిక, ఆరోగ్య సంబంధిత ఆందోళనల ప్రభావం వినియోగంపై ప్రభావం చోపుతోంది. వినియోగంపై కాకుండా పొదుపులవైపే వారి అధిక దృష్టి ఉంది. ఇది డిమాండ్ను కోవిడ్-19 ముందస్తు స్థాయిల్లోనే నిలబెడుతోంది. పన్ను మినహాయింపులు పెంచడం వల్ల వ్యక్తిగత ప్రైవేటు వినియోగం పెరుగుతుంది. ఇది మరిన్ని పెట్టుబడులకూ దారితీస్తుంది. ఆదాయం, డిమాండ్ వృద్ధి లక్ష్యాలుగా ఉపాధి కల్పన ప్రత్యేకించి నైపుణ్యం తక్కువగా ఉన్నవారికి ఉద్యోగ కల్పనపై బడ్జెట్ దృష్టి పెట్టే వీలుంది. భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు, విధానాలు, మౌలిక రంగం పురోగతికి తీసుకునే చర్యలు తయారీ రంగానికి కేంద్రంగా భారత్ ఆవిర్భవించడానికి చొరవలు, డిజిటలైజేషన్ ప్రోత్సాహకాలు దేశాభివృద్ధికి దోహదపడతాయి. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, మౌలిక, విద్యుత్, టెలికమ్యూనికేషన్ పరిశ్రమలు ప్రధానంగా తమ పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది. లఘు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత రుణ పరమైన లభ్యత లభిస్తుందని, ఇది వారి వ్యాపారాలు త్వరిత గతిన గాడిన పడ్డానికి దోహదపడతాయని సర్వేలో పాల్గొన్న ఆయా రంగాల 50 శాతం మంది ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 180 మంది నుంచి అభిప్రాయ సేకరణ : ‘‘పారిశ్రామిక రికవరీ వేగానికి 2021 కేంద్ర బడ్జెట్ చర్యలు ఉంటాయా’’ అన్న శీర్షికన ఆన్లైన్లో డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితుల కల్పన వంటి అంశాలతో కూడిన 12 ప్రశ్నలను సర్వేలో సంధించారు. తొమ్మిది పరిశ్రమల నుంచి 180 మంది ప్రతినిధులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలు ఇవీ... మౌలిక రంగంలో వ్యయాలు పెరగాలి. ప్రత్యేకించి ఉపాధి కల్పన విషయంలో ప్రోత్సాహకాలు కల్పించాలి. మధ్య పేద తరగతి ప్రజలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఆదాయ, ఆర్థిక సహాయాలను కొనసాగించడమే కాకుండా, ఈ దిశలో మరిన్ని చర్యలు ఉండాలి. ఎంజీఎన్ఆర్ఈజీఏ మరిన్ని నిధులు కేటాయించాలి. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడమేకాకుండా, కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన గ్రామీణ కారి్మకులకు సైతం ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. చౌక గృహ నిర్మాణ రంగానికి మద్దతు నివ్వాలి. ఇప్పటికీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్న, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం తన మద్దతు కొనసాగించాలి. ప్రజారోగ్య వ్యయాలను పెంచాలి. ఆయా చర్యల ద్వారా పన్ను యేతర ఆదాయాలు మరింత పెరగడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులను సమకూర్చాలి. రాష్ట్రాల హేతుబద్ధమైన వ్యయ ప్రణాళిలకు కేంద్రం మద్దతు ఉండాలి. తద్వారా 2021-22లో ఎకానమీ వృద్ధి రేటును 10 శాతంపైగా సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును జీడీపీలో 6.2 శాతానికి కట్టడి చేయగలుగుతాం. డిమాండ్ - సరఫరా విధానాలపై వ్యత్యాసం! సరఫరాల వైపు విధానాల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, వస్తు సేవలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాదారులే లక్ష్యంగా పన్ను కోతల వంటి ఉద్దీపన చర్యలు ప్రకటించడం. తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించడం. ఇక వినియోగదారుల అవసరాలు, వారి డిమాండ్లకు అనుగుణంగా పన్ను కోతలు తదితర చర్యలు తీసుకోవడం ఆయా డిమాండ్ చర్యలను తీసుకోవడడం ద్వారా ఆర్థిక పురోగతికి బాటలు వేయడం. రికవరీ బాగుంది : ఆర్థిక రికవరీ తగిన సంతృప్తికరమైన బాటలో నడుస్తోందని ఇటీవలి గణాంకాలు, వ్యాపార సంకేతాలు తెలియజేస్తున్నాయి. స్వావలంభన భారత్, ఉత్పాదన అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి పథకాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి దోహదపడుతున్నాయి. మౌలిక రంగంలో వ్యయాల వల్ల తమ వ్యాపారాలకు గట్టి మద్దతు లభిస్తుందని సంబంధిత పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. - సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
భారత్ ఎకానమీకి సమీపంలో సవాళ్లే!
సాక్షి, న్యూఢిల్లీ: సంస్కరణల అమల్లో బలహీనతలు, ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండడానికి కారణమవుతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయడింది. ఆయా సమస్యల వల్ల తన శక్తిసామర్థ్యాలకన్నా తక్కువ స్థాయిలో సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఫిచ్ విశ్లేషించింది. కోవిడ్–19 మహమ్మారితో స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సంస్కరణల అజెండా ఒకటని పేర్కొంది. సమీపకాలంలో భారత్ వృద్ధిబాటలో సంస్కరణల పటిష్ట అమలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొంది. అలాగే పెట్టుబడులు, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ వంటి అంశాల విషయంలో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషించింది. వ్యవసాయ రంగంలో మార్పులు వ్యవసాయరంగంలో తీసుకువచ్చే సంస్కరణల వల్ల ఈ రంగంలో సామర్థ్యం పెరుగుతుందని, మధ్యదళారీ వ్యవస్థతో పనిలేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారుకు విక్రయించగలుగుతారని పేర్కొంది. తద్వారా రైతులకు ఒకపక్క తగిన ఆదాయం లభిస్తుందని, మరోపక్క వినియోగదారులపై ధరాభారం తగ్గుతుందని వివరించింది. అయితే వ్యవసాయ సంస్కరణల అమల్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని ఫిచ్ విశ్లేషించింది. కార్మిక సంస్కరణలతో ప్రయోజనాలు ఇక కార్మిక మార్కెట్లో చట్ట సంస్కరణల వల్ల సామాజిక భద్రతా విషయంలో కార్మికుని పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ప్రయోజనాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడింది. వృతి పరమైన భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని వివరించింది. కార్మిక వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవడానికీ ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషించింది. చిన్న స్థాయి కార్మికులు వివిధ రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సంపాదించుకోగలుగుతారని పేర్కొంది. ఆయా సంస్కరణలు భారత్ కార్మిక మార్కెట్ను శక్తివంతంగా మలుస్తాయని వివరించింది. ‘‘సమీప కొద్ది సంవత్సరాల్లో కేంద్రం వివిధ రంగాల్లో పటిష్ట సంస్కరణల బాటలో పయనిస్తుందని ముము విశ్వసిస్తున్నాము. అయితే ఇదే సమయంలో అమలు విషయంలో మాత్రం క్లిష్ట పరిస్థితులు తప్పవని భావిస్తున్నాము’’ అని నివేదిక వరించింది. 2021-22లో 11 శాతం వృద్ధి 2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ 9.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం 11 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనావేసింది. 2018–19లో భారత్ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం. వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల 2019–20లోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.2 శాతానికి తగ్గిపోయింది. 2020–21లో కరోనాతో మాంద్యంలోకి జారిపోతున్న పరిస్థితి. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదవగా, సెప్టెంబర్లో ఈ క్షీణత 7.5 శాతానికి పరిమితమైంది. ద్వితీయార్థంలో ఎంతోకొంత వృద్ధి నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంశానికి సంబంధించి రాష్ట్రాలకు తీవ్రక్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్నాయని రేటింగ్, ఆర్థికవిశ్లేషణా సంస్థ క్రిసిల్ తన తాజా అధ్యయనం నివేదికలో తెలిపింది. స్థూల రాష్ట్రాల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 90 శాతం వాటా ఉన్న 18పెద్ద రాష్ట్రాల గణాంకాల పరిశీలన, విశ్లేషణ అనంతరం తాజా నివేదిక రూపకల్పన జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం. పన్ను వసూళ్లు క్రమంగా రికవరీ అవుతున్నప్పటికీ, అధిక వడ్డీరేట్ల సమస్య నెలకొనే పరిస్థితి ఉంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు చేసే రుణ సమీకరణలు ఇందుకు ఒక కారణం. ప్రభుత్వాలకు రెవెన్యూ వ్యయాల విషయంలో కూడా క్లిష్టపరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకపక్క వేతనాలు పెన్షన్లు, వడ్డీరేట్ల భారం మరోపక్క మహమ్మారి కరోనా కట్టడికి ఆరోగ్యరంగంపై అలాగే కార్మిక సంక్షేమానికి చేయాల్సిన వ్యయాలు ఈ విషయంలో నెలకొన్న క్లిష్టతకు మూలం. అధిక రెవెన్యూ లోటు పరిస్థితి రాష్ట్రాల మూలధన వ్యయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరిన్ని రుణలకు రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల మూలధన వ్యయాలు వచ్చే యేడాదికానీ పెరిగే పరిస్థితి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికికానీ, రెవెన్యూ ఆదాయాలు కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2021–22లో 10 శాతం జీడీపీ వృద్ధి జరుగుతుందని అంచనా. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని రేటింగ్ దిగ్గజం స్టాండెర్డ్ అండ్ పూర్స్ అనుబంధ పరిశోధనా విభాగం కూడా అయిన క్రిసిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ అంచనాలకు క్రితం 9 శాతం నుంచి 7.7 శాతానికి ఇప్పటికే మెరుగుపరచింది. అయితే ప్రభుత్వ వ్యయాల విషయంలో ఉన్న పరిమితులు వృద్ధికి అడ్డంకని తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి ద్రవ్యలోటు (కేంద్ర రాష్ట్రాలు కలిపి) ప్రస్తుత ఆర్థిక సంవతసరం 12 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలో ఉండే వీలుందన్న ఇక్రా అంచనాల నేపథ్యంలో తాజా క్రిసిల్ అధ్యయన నివేదిక వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 8.5 శాతానికి తగ్గవచ్చని ఇక్రా అంచనావేసింది. -
బడ్జెట్.. డిమాండ్ను పెంచాలి
న్యూఢిల్లీ: డిమాండ్ను పెంచడంపై రానున్న బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. పన్నుల ఉపశమనం అవసరం.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు బడ్జెట్ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది. -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారని గురువారం లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. స్టాండింగ్ కమిటీలు వివిధ శాఖలకు కేటాయించాల్సిన గ్రాంట్ల పరిశీలన, నివేదికలను సిద్ధం చేసేందుకు ఉభయ సభలు ఫిబ్రవరి 15వ తేదీన వాయిదాపడి తిరిగి మార్చి 8వ తేదీన సమావేశమవుతాయని తెలిపింది. కోవిడ్–19 నిబంధనల దృష్ట్యా గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా షిఫ్టుల వారీగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ కార్యక్రమాలు జరుగుతాయి. లోక్సభ కార్యక్రమాలు రోజులో కనీసం ఐదు గంటలపాటు కొనసాగుతాయని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. గత సమావేశాలు తక్కువ కాలం జరగడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసివేశారు. సభ్యులు ప్రైవేట్ బిల్లులను ఎప్పటిమాదిరిగానే శుక్రవారాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రవేశపెట్టేందుకు కూడా ఈ దఫా అవకాశం ఇస్తున్నారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం