BYJU
-
బైజూస్కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్క్లాట్ తీర్పు ఇచ్చింది. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్టేకింగ్లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్పై తన ట్రేడ్మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
25 శాతం మందికే పూర్తి వేతనాలు..!
బైజూస్ బ్రాండ్పై సేవలు అందిస్తున్న ఎడ్టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్, తన ఉద్యోగుల్లో 25 శాతం మందికే ఫిబ్రవరి నెల పూర్తి వేతనాలు అందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఇలా వేతనం అందుకోబోతున్న వారంతా తక్కువ వేతన స్కేలులో ఉన్న వారే కావడం గమనార్హం. మిగతా వారికి పాక్షిక చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. కొందరు పెట్టుబడిదార్లు నిధులను బ్లాక్ చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వేతనాలు చెల్లిస్తున్నామని బైజూస్ యాజమాన్యం ఇటీవల ఉద్యోగులకు లేఖలు పంపింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను గత శుక్రవారం రాత్రి ప్రాసెస్ చేశామని అందులో పేర్కొంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమచేస్తామని కంపెనీలు వర్గాలు తెలిపినట్లు తెలిసింది. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! -
రూ.4,419 కోట్ల నిధుల మళ్లింపు.. ఇన్వెస్టర్ల ఆరోపణ
ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కోరారు. ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్కు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది. అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు. ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్ను కోరిన వ్యాపారవేత్త కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్సీఎల్టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు
కొవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ రంగంలో బైజూస్ ఓ వెలుగు వెలిగింది. భారీగా నియామకాలు చేపట్టింది. క్రమంగా కరోనా భయాలు తొలగడంతో కార్యకలాపాలు భారంగా మారి అప్పుల్లోకి వెళ్లినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దాంతో ఆ కంపెనీ లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని ఇతర సంస్థలు నోటీసులు సైతం పంపిచాయి. తాజాగా ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు రవీంద్రన్ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్(ఈజీఎం)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్త బోర్డును ఎన్నుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. దానికోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. అయితే వాటాదారుల కోరికను సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టులో సంప్రదించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని చెప్పింది. ఇదీ చదవండి: కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే.. ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నుంచి నోటీసులు అందుకుంది. ఇదిలా ఉండగా, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. -
ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ పిటీషన్ వేయడంతో బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు ఇష్యూ చేసింది. బైజూస్ ఎడ్టెక్ కంపెనీ రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్తోపాటు ఇతర కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో 2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్కు కాలింగ్ ఏజెంట్ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్ బైజూస్కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం! వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
బైజూస్ వ్యవస్థాపకులకు షాక్!
న్యూఢిల్లీ: థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి వ్యవస్థాపకులకు ఉద్వాసన పలకాలని ఆరు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బైజూస్ బ్రాండ్తో ఎడ్యుకేషన్ సేవలందించే కంపెనీని వ్యవస్థాపకుల నియంత్రణ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం వాటాదారుల అసాధారణ సమావేశాన్ని (ఈజీఎం) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశాయి. డచ్ సంస్థ ప్రోజస్ అధ్యక్షతన బైజూస్లో పెట్టుబడులున్న కంపెనీలు ఏజీఎంకు నోటీసు జారీ చేసినట్లు తెలియజేశాయి. పాలన (గవర్నెన్స్), నిబంధనల అమలు అంశాలు, ఆర్థిక నిర్వహణలో అక్రమాలు, డైరెక్టర్ల బోర్డు పునరి్నర్మాణం తదితరాల పరిష్కారం కోసం ఏజీఎంకు పిలుపునిచి్చనట్లు వెల్లడించాయి. వెరసి యాజమాన్య మార్పునకు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. నోటీసు జారీకి మద్దతిచి్చన ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో జనరల్ అట్లాంటిక్, పీక్ ఫిఫ్టీన్, సోఫినా, చాన్ జుకర్బర్గ్, ఔల్ అండ్ శాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి బైజూస్లో ఉమ్మడిగా సుమారు 30 శాతం వాటా ఉంది. బైజూస్ వాటాదారుల కన్సార్షియం ఇంతక్రితం జులై, డిసెంబర్లలోనూ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి పిలుపునిచి్చనప్పటికీ ఆచరణకు నోచుకోలేదని తాజా నోటీసులో ప్రోజస్ పేర్కొంది. కాగా.. ఈ అంశంపై బైజూస్ వెంటనే స్పందించకపోవడం గమనార్హం! 200 మిలియన్ డాలర్ల సమీకరణ.. ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఈక్విటీ రైట్స్ ఇష్యూ ద్వారా 200 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉంది. కంపెనీ వాస్తవ వేల్యుయేషన్ మరింత ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుత విడత సమీకరణ కోసం మాత్రం 220–250 మిలియన్ డాలర్ల శ్రేణిలో పరిగణించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత తక్కువ వేల్యుయేషన్ ఈ ఇష్యూకు మాత్రమే పరిమితం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్పీఎల్) ఈ మేరకు ఈక్విటీ షేర్హోల్డర్లకు రైట్స్ ఇష్యూను ప్రారంభించినట్లు బైజూస్ పేర్కొంది. 2022 మార్చిలో బైజూస్ ఏకంగా 22 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో నిధులు సమీకరించింది. పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 18 నెలలుగా వ్యవస్థాపకులు దాదాపు 1.1 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయడమనేది సంస్థ పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. మరోవైపు, ఇటీవలి కాలంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లు, బైజూస్ లక్ష్యం, రైట్స్ ఇష్యూ తదితర అంశాలను వివరిస్తూ షేర్హోల్డర్లకు కంపెనీ లేఖ రాసింది. దాదాపు 22 నెలల జాప్యం తర్వాత బైజూస్ ఇటీవలే ప్రకటించిన 2022 ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల ప్రకారం నిర్వహణ నష్టం రూ. 6,679 కోట్లకు, ఆదాయం రూ. 5,298 కోట్లకు చేరాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నష్టం రూ. 4,143 కోట్లు, కాగా ఆదాయం రూ. 2,428 కోట్లు. -
బైజూస్పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్బీ లోన్గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..
ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్ బ్రాండ్పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్క్రంచ్’ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది. బైజూస్ అనుబంధ సంస్థలు వైట్ హాట్ జూనియర్, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్, గ్రేట్ లెర్నింగ్ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్లెర్నింగ్ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! బైజూస్ తన వాల్యుయేషన్ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది. -
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ‘బైజూస్’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్కు స్పందిస్తూ ఎన్సీఎల్టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్కు రెండు వారాల గడువు ఇచ్చాం. ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్సీఎల్టీ... ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా వచ్చిన బైజూస్ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది. -
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
బైజూస్లో 3,500 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ (విద్యా సంబంధిత) బైజూస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థలోని వివిధ స్థాయిల్లో బృందాల క్రమబదీ్ధకరణకు తోడు ప్రాంతాల వారీ ప్రత్యేక దృష్టిని విస్తృతం చేయనుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో, దీనికి అనుగుణంగా బైజూస్ తన ఉద్యోగులను గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు ఆన్లైన్ విద్యకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోవడంతో దిద్దుబాటు చర్యలను చేపడుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికైతే తొలగింపులు లేవు. వివిధ యూనిట్ల పునర్నిర్మాణం, డిమాండ్పై అంచనా వేయడం కొనసాగుతోంది. ఇప్పటికి 1,000 మంది నోటీసు పీరియడ్లో ఉన్నారు. మరో 1,000 మంది పనితీరు మెరుగుపరుచుకునే లక్ష్యా లను ఇంకా చేరుకోలేదు. ఈ అంచనా ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బైజూస్లో ఇదే చివరి తొలగింపులు అని, ఈ ప్రక్రియ అక్టోబర్ చివరికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని మరింత చురుగ్గా, అనుకూలంగా మార్చడం ఈ ప్రక్రియ వెనుక లక్ష్యమని తెలిపాయి. స్పష్టమైన జవాబుదారీ తనంతో నడిచే నిర్మాణం ఏర్పాటు చేయడంగా పేర్కొన్నాయి. వ్యాపార పునర్నిర్మాణం.. బైజూస్ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు. ‘‘వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉంది. నిర్వహణ తీరును మరింత సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించుకోవడం, మెరుగైన నగదు ప్రవాహాల కోసం దీన్ని చేపట్టాం. బైజూస్ కొత్త భారత సీఈవో అర్జున్ మోహన్ వచ్చే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పునరుద్ధరించిన, స్థిరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు’’అని వెల్లడించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన కొన్ని ఉత్పత్తులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై కే12 విద్య, ఇతర పోటీ పరీక్షల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రాంతీయ బృందాలు మరింత జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుందని, హైబ్రిడ్ మోడల్, ట్యూషన్ సెంటర్లపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. 2022 అక్టోబర్ నాటికి బైజూస్లో 50,000 మంది ఉండగా, తాజా ప్రక్రియ ముగిస్తే వీరి సంఖ్య 31,000–33,000కు తగ్గనుంది. -
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
ఆకాశ్కు బైజూస్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒప్పందంలో భాగమైన షేర్ల మారి్పడి ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంపై ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్విసెస్ (ఏఈఎస్ఎల్)కు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మాతృసంస్థ థింగ్ అండ్ లెర్న్ (టీఎల్పీఎల్) నోటీసులు పంపింది. వివరాల్లోకి వెడితే .. 2021లో ఏఈఎస్ఎల్ను బైజూస్ 940 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నగదు, షేర్ల మారి్పడి రూపంలోని ఈ డీల్ ప్రకారం ఏఈఎస్ఎల్లో టీఎల్పీఎల్కు 43 శాతం, దాని వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు 27 శాతం, ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు చౌదరి కుటుంబానికి 18 శాతం, బ్లాక్స్టోన్కు 12 శాతం వాటాలు దక్కాయి. ఒప్పందాన్ని బట్టి ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్లో విలీనం చేయాలి. అయితే, విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో షేర్ల మార్పిడిని అమలు చేయాలని కోరుతూ చౌదరి కుటుంబానికి టీఎల్పీఎల్ నోటీసులు ఇచి్చంది. కానీ మైనారిటీ షేర్హోల్డర్లు ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. షేర్ల మారి్పడి ప్రక్రియలో పన్నులపరమైన అంశాలు ఉన్నందున.. దానికి బదులుగా పూర్తిగా నగదే తీసుకోవాలని చౌదరి కుటుంబం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆకాశ్ ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
బైజూస్ ఆఫీస్లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
సాఫ్ట్వేర్! ఇదేదో డిగ్రీ పేరో, కోర్స్ పేరో కాదు. ఇండియాలో ఇదో లైఫ్స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో.. అంతకన్నా స్వేచ్ఛగా యువతరం ఎగిరేలా చేసినా ఓ కొత్త లైఫ్ ట్రెండ్. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్ను కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవే. కెరియర్లో అడుగు పెట్టగానే నెలనెల అకౌంట్లో శాలరీ వచ్చి పడేది. రెండ్రోజులు సెలవు. ఈలోగా కంపెనీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటీవ్స్తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. రెండుమూడేళ్లు తిరిగే సరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు. జీతం వేలు దాటి లక్షల్లోకి ఎగబాకింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో వందకి, వెయ్యికి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసే రేంజ్కి ఎదిగిపోయారు. దీంతో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా అంతా తమ హైక్లాస్ రేంజ్ చూపించుకునే వారు. ఇలా జాబ్, శాలరీలోనే కాదు చేసుకునే అర్ధాంగి విషయంలోనూ పోటీ పడుతున్నారు టెక్కీలు. ‘దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తున్నాం అంటూ బీకాం చదివి ఇంటి దగ్గరే ఉంటున్న 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. మాట్రిమోని వెబ్సైట్లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారనే విషయాల గురించి కులంకషంగా చర్చిస్తూ పెళ్లి ప్రపోజల్స్ సైతం పంపారు. దీంతో వాళ్లు జాబ్ చేస్తున్న కంపెనీలు, తీసుకుంటున్న శాలరీలను చూసి పాపం ఆ యువతికి ఎలాంటి వరుణ్ని భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందనే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. అందులో ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో 14 మంది యువకులతో విడివిడిగా మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు’. శాలరీలు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నాయి. బైజూస్, ఫ్లిప్కార్ట్, డెలాయిట్, టీసీఎస్లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు. సాయం చేయండని అభ్యర్ధించినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. Here's how I approach this Girl is 29 yr old jobless BCOM. For such a girl most of the below options are too good to be safe For instance, Why is 45 LPA guy or a doc vying for her? Unless guys have some major shortcomings Under 30 & under 20 LPA seems a realistic bet (no 14) pic.twitter.com/UXa6KZd2rK — Dr Blackpill (@darkandcrude) July 18, 2023 ఆ ట్వీట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఎందుకు జాబ్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే..మరికొందరు ఈ పోస్ట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా యువతి పెళ్లి చూపుల వ్యవహారం ఎలా ఉన్నా.. ఆర్ధిక మాంద్యంలోనూ ఐటీ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్! -
బైజూస్ ‘ఇంటర్నేషనల్’ సీఈవోగా అర్జున్ మోహన్
న్యూఢిల్లీ: విద్యా రంగ సేవల్లో ఉన్న బైజూస్, తన ఇంటర్నేషనల్ వ్యాపారానికి సీఈవోగా అప్గ్రాడ్ మాజీ చీఫ్ అర్జున్ మోహన్ను నియమించుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఇక ముందు కూడా గ్రూప్ సీఈవోగా కొనసాగనున్నారు. మృణాల్ మోహిత్ భారత వ్యాపారానికి చీఫ్గా కొనసాగుతారని సంస్థ ప్రకటించింది. తాజా నియామకంతో అర్జున్ మోహన్ తన సొంతగూటికి తిరిగి వచి్చనట్టయింది. అప్గ్రాడ్ సీఈవోగా చేరడానికి ముందు 11 ఏళ్ల పాటు అర్జున్ మోహన్ బైజూస్లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా సేవలు అందించడం గమనార్హం. గతేడాది డిసెంబర్లోనే అప్గ్రాడ్కు మోహన్ రాజీనామా చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, యూకే, బ్రెజిల్, మధ్య ప్రాచ్యం తదిత 100 దేశాల్లో బైజూస్కు యూజర్లు ఉన్నారు. అంతేకాదు విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలను సైతం కొనుగోలు చేస్తూ వచి్చంది. అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ (500 మిలియన్ డాలర్లు), కోడింగ్ సైట్ టింకర్(200 మిలియన్ డాలర్లు)ను బైజూస్ గతంలో కొనుగోలు చేసింది. అలాగే, సింగపూర్కు చెందిన గ్రేట్ లెర్నింగ్(600 మిలియన్ డాలర్లు), ఆస్ట్రియాకు చెందిన జియోగెర్బా(100 మిలియన్ డాలర్లు)ను లోగడ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వ్యాపారాలన్నింటికీ మోహన్ నేతృత్వం వహించనున్నారు. ఇటీవలి కాలంలో బైజూస్ పలు ప్రతికూల పరిణామాలు ఎదురు చూసింది. జీవీ రవిశంకర్, రస్సెల్ డ్రీసెన్స్టాక్, చాన్ జుకర్బెర్గ్ తదితరులు బైజూస్ బోర్డుకు రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాలను తాము ఇంకా ఆమోదించదేని రవీంద్రన్ వాటాదారులకు స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్లో బైజూస్ ప్రకటించింది. కంపెనీ ఆడిటర్ సేవలకు డెలాయిట్ రాజీనామా చేసి ని్రష్కమించింది. ఏప్రిల్లో కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సలహా మండలిలో రజనీష్ కుమార్, మోహన్దాస్ పాయ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్, ఐటీ రంగ దిగ్గజం టీవీ మోహన్దాస్ పాయ్ తమ సంస్థ సలహా మండలిలో చేరనున్నట్లు బైజూస్ వెల్లడించింది. తమ విజన్పై వారికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ వ్యవస్థాపకులు దివ్యా గోకుల్నాథ్, బైజు రవీంద్రన్ తెలిపారు. వ్యవస్థాపకులు కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని తమకు నమ్మకం కుదిరిన మీదట సలహా మండలిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కుమార్, పాయ్ తెలిపారు. -
టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్గా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ కంపెనీ ‘డ్రీమ్11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్’ ఉంది. గత ఏప్రిల్తో బైజూస్ ఒప్పందం ముగిసింది. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్లను పిలిచింది. గతంలో ఐపీఎల్ టోర్నీ ప్రధాన స్పాన్సర్గా కూడా డ్రీమ్11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్కు)కంటే డ్రీమ్11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. -
లాభదాయకతకు దగ్గర్లో బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని సంస్థ సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. గ్రూప్ స్థాయిలో లాభదాయకతకు చాలా దగ్గర్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. బైజూస్ వృద్ధి, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిపై ఆందోళనలను తొలగించేందుకు నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రవీంద్రన్ ఈ విషయాలు తెలిపారు. 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ బీ (టీఎల్బీ) రుణదాతలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే సానుకూల ఫలితం రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అంతర్జాతీయంగా టెక్ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ బైజూస్ మాత్రం లాభదాయకత లక్ష్యాల దిశగా గణనీయంగా పురోగతి సాధించిందని రవీంద్రన్ చెప్పారు.బైజూస్ ఆర్థిక పని తీరు, రుణ భారం, ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో జాప్యాలు, కంపెనీ వేల్యుయేషన్ను ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రోసస్ 6 బిలియన్ డాలర్లకు కుదించడం తదితర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్వో అజయ్ గోయల్ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్తో కలిసి కొత్త సీఎఫ్వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
బైజూస్లో ఏం జరుగుతోంది? ఆడిటర్గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్కి ఆడిటర్గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
వెయ్యి మందికి బైజూస్ బైబై
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తాజాగా వివిధ విభాగాల నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్లు) టర్మ్ లోన్ విషయమై అమెరికాలో రుణదాతలతో బైజూస్ న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం గమనార్హం. కొత్త ఉద్యోగుల చేరికను కలిపి చూస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000 స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. బైజూస్ లోగడ 5 శాతం ఉద్యోగులు అంటే సుమారు 2,500 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. 2020 అక్టోబర్ నుంచి ఆరు నెలల కాలంలో ఇంత మందిని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. 2023 మార్చి నాటికి లాభాల్లోకి రావాలన్న లక్ష్యంలో భాగంగా నాడు ఆ నిర్ణయం తీసుకుంది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగమే ఈ తొలగింపులు అన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఏఐతో బోధనకు శ్రీకారం చుట్టిన బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ తమ లెర్నింగ్ మాడ్యూల్స్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ – జెన్ఏఐ)ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. విద్యార్థులు ఆకళింపు చేసుకునే విధానాలను అర్థం చేసుకుని, తదనుగుణంగా బోధనా విధానాలను రూపొందించేందుకు విజ్ సూట్ కింద బీఏడీఆర్ఐ, మ్యాథ్ జీపీటీ, టీచర్జీపీటీ పేరిట మూడు ఏఐ మోడల్స్ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. అయితే, వీటితో టీచర్ల స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశమేమీ లేదని బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్యా గోకుల్నాథ్ తెలిపారు. సంస్థను సమర్ధమంతంగా తీర్చిదిద్దుకునేందుకు, అలాగే ఉపాధ్యాయులు మరింత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఏఐని ఉపయోగించుకోనున్నట్లు వివరించారు. ఏఐ మాడ్యూల్తో కంపెనీ వ్యవస్థ పటిష్టమవుతుందని, ఆదాయం.. మార్జిన్లపై సానుకూల ప్రభావాలు చూపగలదని పేర్కొన్నారు. -
అమెరికాలో కోర్టుకు వెళ్లిన బైజూస్.. ఎందుకంటే..
న్యూఢిల్లీ: 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్బీ) త్వరితగతిన చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలతో ఇన్వెస్ట్మెంట్ సంస్థ రెడ్వుడ్పై దేశీ ఎడ్టెక్ సంస్థ బైజూస్.. అమెరికాలోని న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీఎల్బీ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా రెడ్వుడ్ తమ రుణంలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేసి, తమపై బెదిరింపు వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రుణదాతగా రెడ్వుడ్ అనర్హమైనదిగా తాము పరిగణిస్తున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయ వివాదం తేలేంత వరకు టీఎల్బీకి సంబంధించిన ఎటువంటి చెల్లింపులు చేయరాదని నిర్ణయించుకున్నట్లు వివరించింది. వడ్డీ కింద సోమవారం నాడే 40 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బైజూస్ చెల్లించలేదు. సాంకేతిక డిఫాల్టులు తదితర కారణాలతో రుణదాతలు అనవసర చర్యలకు దిగాయని.. తమ అమెరికా విభాగం బైజూస్ ఆల్ఫాను ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు కొత్త మేనేజ్మెంట్ను నియమించాయని బైజూస్ తెలిపింది. తాము టీఎల్బీ రుణదాతలతో చర్చలు జరిపేందుకు, వారు తమ చర్యలను వెనక్కి తీసుకుంటే యథాప్రకారం చెల్లింపులను జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని వివరించింది. మరోవైపు, తప్పుడు విధానాలకు పాల్పడిందన్న ఆరోపణలతో బైజూస్ అమెరికన్ విభాగాలపై(బైజూస్ ఆల్ఫా, టాంజిబుల్ ప్లే) రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ, ఇన్వెస్టరు తిమోతి ఆర్ పోల్ దావా వేశారు. బైజూస్ ఆల్ఫా నుంచి 500 మిలియన్ డాలర్లను కంపెనీ దారి మళ్లించిందని ఆరోపించారు. -
వచ్చే ఏడాది బైజూస్ ఆకాష్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్.. పరీక్షల సన్నాహక అనుబంధ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ. 4,000 కోట్ల ఆదాయం అందుకునే మార్గంలో ఉన్నట్లు బైజూస్ పేర్కొంది. రూ. 900 కోట్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) అంచనా వేస్తోంది. ఇందుకు బోర్డు అధికారిక అనుమతి ఇచ్చినట్లు బైజూస్ వెల్లడించింది. త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాది మధ్యలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు తెలియజేసింది. 2021 ఏప్రిల్లో ఆకాష్ ఎడ్యుకేషన్ను రూ. 7,100 కోట్లకు బైజూస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
WTC Final: టీమిండియా కొత్త జెర్సీల ఆవిష్కరణ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ఆరు రోజుల ముందు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. భారత జట్టు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించింది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని తయారు చేయడం ఇదే మొదటిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్ సంస్థ ఇవాళ (జూన్ 1) సోషల్మీడియా ఖాతాల ద్వారా ఆవిష్కరించి, అభిమానులతో షేర్ చేసుకుంది. An iconic moment, An iconic stadiumIntroducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Adidas India (@adidasindiaoffi) June 1, 2023 జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. కొత్త జెర్సీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియా కొత్త జెర్సీలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో పాత జెర్సీలకు కొత్త వాటికి తేడా లేదని పెదవి విరుస్తున్నారు. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. ఇదిలా ఉంటే, జూన్ 7న ఆసీస్తో ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్ను (జెర్సీ స్పాన్సర్) అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో అడిడాస్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించింది.ఔ చదవండి: WTC Final: ఆసీస్కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్!
బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత బైజూస్ సంస్థను స్థాపించారు. ఇప్పుడా కంపెనీ విలువ 23 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1.9 లక్షల కోట్లు. రవీంద్రన్ తన భార్య గురించి సీక్రెట్ బయటపెట్టారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సెషన్లో బైజు రవీంద్రన్.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య తన స్టూడెంటేనని వెల్లడించారు. ఆమెతో తాను ఎలా ప్రేమలో పడిందీ వివరించారు. ఆమె తరచూ ప్రశ్నలు అడిగేదని, అలా తనను ఆకర్షిందని చెప్పారు. అది ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదని, తాము భార్యాభర్తలు అయిపోయామని పేర్కొన్నారు. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! 2012లో స్థాపించిన ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అత్యంత విజయవంతమైన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం బైజూస్ మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు. బైజూస్ సీఈవోగా రవీంద్రన్ వ్యవహరిస్తుండగా, దివ్య గోకుల్నాథ్ డైరెక్టర్గా ఉన్నారు. -
అయ్యయ్యో, బైజూస్లో మళ్లీ లేఆఫ్స్: ఈసారి ఎంతమందంటే?
సాక్షి,ముంబై: ఎడ్యు టెక్ యునికార్న్ బైజూస్ మరోసారి ఉద్యోగుల కోతకు నిర్ణయించింది. దాదాపు 15 శాతం మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తోందని కంపెనీలో ఇంజనీరింగ్ టీమ్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. ఇప్పటికే గత ఏడాది అక్టోబర్ లో ఇప్పటికే 2500 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా బైజూస్ మరో 1000 మందికి ఉద్వాసన పలికింది. ఇందులో ఎక్కువగా డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాల నుంచి ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మెరుగైన వ్యయ నిర్వహణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగుల తొలగింపులను సమర్థించుకున్న వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ , కంపెనీ లాభదాయకంగా మారడానికి ఇది కీలకమైన దశ అని అన్నారు. అయితే ఇకపై బైజూస్ లో లేఆఫ్స్ ఉండవని వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ హామీ ఇచ్చిన 3 నెలలు ముగియగానే మరో 1000 మందిని తొలగించడం గమనార్హం. మరి తాజా నివేదికలపై కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
అమ్మకాల ప్రక్రియను మార్చుకున్న బైజూస్
హైదరాబాద్: బైజూస్ తన వ్యాపార విక్రయ విధానంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుత డైరెక్ట్ విక్రయాల స్థానంలో నాలుగు అంచెల టెక్నాలజీ ఆధారితిత విక్రయాల ప్రక్రియను ప్రవేశపెట్టింది. తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులను విక్రయించకుండా నూతన విధానం అడు్డకుంటుందని బైజూస్ తెలిపింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులతో తన కోర్సులను కొనుగోలు చేయించేందుకు బైజూస్ తప్పుడు మార్గాలను అనుసరిస్తోందన్న ఆరోపణలపై.. బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నూతన విక్రయ నమూనా కింద.. బైజూస్ కోర్సులను కొనుగోలు చేయాలంటే నెలవారీ కనీసం ఆదాయం రూ.25,000 ఉండాలి. కోర్సు కొనుగోలుకు ముందు తల్లిదండ్రులు సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, నూతన విక్రయ విధానంలో ఉత్పత్తికి సంబంధించి, రిఫండ్ పాలసీ (వద్దనుకుంటే తిరిగి చెల్లింపులు) గురించి వివరంగా కస్టమర్కు జూమ్ లైవ్ సెషన్లో బైజూస్ తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్తులో ఆధారం కోసం రికార్డు రూపంలో ఉంచుతుంది. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
బైజూస్ ప్రమోటర్ల వాటా పెంపు!
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకులు వాటాను పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్కు సంయుక్తంగా బైజూస్లో 25 శాతం వాటా ఉంది. ఈ వాటాను 40 శాతానికి పెంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధి వర్గాలు తెలియజేశాయి. ఇందుకు ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. కాగా.. గతేడాది(2022) మే నెలలో బైజూస్ వ్యవస్థాపకులు తమ వాటాను 23 శాతం నుంచి 25 శాతానికి పెంచుకున్నారు. బైజు రవీంద్రన్ 80 కోట్ల డాలర్ల నిధులు చేకూర్చడం ద్వారా వాటా పెంపునకు తెరతీశారు. మార్చికల్లా కంపెనీ నష్టాలను వీడీ లాభాల బాటలోకి ప్రవేశించనున్నట్లు బైజూస్ పేర్కొంటోంది. 2020–21లో కంపెనీ రూ. 4,588 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం 2019–20లో రూ. 232 కోట్ల నష్టం నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్ల నుంచి ఆదాయం సైతం 2021లో రూ. 2,428 కోట్లకు నీరసించింది. చదవండి: ఫోన్పే, గూగుల్పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి! -
థాంక్యూ.. సీఎం జగన్ మామయ్య (ఫొటోలు)
-
మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కారణమిదే
Team India- Sponsorship- Byju's- MPL- ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా ఉన్న ఎడ్యుటెక్ సంస్థ ‘బైజూస్’ ఈ ఒప్పందాన్ని ముందే రద్దు చేసుకునే యోచనలో ఉంది. దీనికి సంబంధించి గత నెలలోనే బోర్డుకు ఆ సంస్థ లేఖ రాసింది. నవంబర్ 2023 వరకు అమల్లో ఉండేలా సుమారు రూ. 290 కోట్లతో గత జూన్లోనే బీసీసీఐతో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. కారణమిదే అయితే ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో స్పాన్సర్షిప్ను కొనసాగించరాదని భావిస్తోంది. ఈ అంశంపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. చివరకు 2023 మార్చి వరకు స్పాన్సర్షిప్ కొనసాగించాలని బైజూస్కు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. కిట్ స్పాన్సర్ సైతం మరోవైపు కిట్ స్పాన్సర్గా ఉన్న ఎంపీఎల్ స్పోర్ట్స్ కూడా తమ కిట్ ఒప్పంద హక్కులను మరో సంస్థకు వెంటనే బదలాయించేందుకు అనుమతించమని బోర్డును కోరింది. అదే మొత్తానికి కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెండ్ (కేకేసీఎల్)కు కిట్ స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వమని కోరింది. దీనిపై కూడా చర్చించిన బోర్డు... ఉన్నపళంగా కిట్ స్పాన్సర్ పేరు మార్పుల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ఎంపీఎల్కు కూడా మార్చి 31, 2023 వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Inzamam Ul Haq: 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే! పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది! వీడియో -
అంతరాలను సరిదిద్దుదాం
నేను ఈ రోజు.. నా పుట్టినరోజు గురించి కాదు.. ఈ తరం బిడ్డల గురించి మాట్లాడుతున్నా. ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మాట్లాడుతున్నా. మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా భావి తరాన్ని ఉన్నత చదువులతో తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, నరసరావుపేట: తరాలు మారుతున్నా కొన్ని వర్గాల తలరాతలు మాత్రం మారకూడదన్న పెత్తందారుల సంకుచిత ధోరణులను బద్ధలుకొడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ చదువులు, డిజిటల్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకూడదని ఆ వర్గం వారు కోర్టులకు వెళ్లారు. డిజిటల్ విద్యా బోధన తమ పిల్లలకు మినహా పేదలకు అందకూడదని పెత్తందారీ మనోభావాలున్నవారు ఆరాట పడుతున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడు బాధేసినా మూడున్నరేళ్లుగా ఎక్కడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. పెత్తందారుల కుట్రలను భగ్నం చేయడానికి చిట్టి పిల్లలకు మంచి మేనమామగా, తల్లులకు మంచి అన్నయ్యగా నేను ఉన్నానని హామీ ఇస్తున్నా’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. బుధవారం బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో సభకు భారీ ఎత్తున హాజరైన విద్యార్థులు, ప్రజలు ఆర్థిక అసమానతలకు చదువులే విరుగుడు ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల్లో ప్రపంచ దేశాల మధ్య వ్యత్యాసాలున్నట్లే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల మధ్య అంతరాలున్నాయి. ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో సగటు తలసరి ఆదాయం రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షలు ఉంటుంది. మన దేశంలో తలసరి ఆదాయం రూ.1.65 లక్షలకు అటూ ఇటుగా ఉంటుంది. మన రాష్ట్రంలో దాదాపు రూ.2.50 లక్షలు ఉంటుంది.లక్ష డాలర్లు సంపాదిస్తున్న ఆ దేశాలు ఎక్కడ? మనం ఎక్కడ? స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇదీ పరిస్థితి. ఇలాంటి అంతరాలు ఈ రోజు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఒకేసారి సరిదిద్దలేకపోవచ్చు. ఆర్థిక సమానత్వం లేకపోవడానికి ఎన్ని కారణాలున్నా చదువుల్లో సమానత్వం తీసుకురాగలిగితే ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకుంటుంది. మంచి చదువులు వారి తలరాతలను రాబోయే రోజుల్లో మారుస్తాయి. ఈ అంతరాలు ఇంకానా...? మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసినప్పుడు... ఒక కుటుంబాన్ని గమనిస్తే చదువుకోని అన్న – చదువుకున్న తమ్ముడు, చదువుకోలేని అక్క – చదువుకున్న తమ్ముడు మధ్య వ్యత్యాసం వారి జీవితాల్లో తేడా చూపుతుంది. ఇంగ్లీషు మీడియం చదువులను కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత తేడా కనిపిస్తుంది. బాగా చదువుకునే అవకాశం.. అందులోనూ ఇంగ్లీష్ మీడియం చదువులు మన పిల్లలకు దొరకడంతో వారి తలరాత మార్చే కార్యక్రమం జరుగుతోంది. మన సమాజంలో కొందరు 21వ శతాబ్దంలో ఉండగా మరికొందరు 19వ శతాబ్దంలోనే బతికే పరిస్థితిలో ఉన్నారు. వీరు ఇలానే జీవించాలా? వీరి బతుకులు మార్చలేమా? అనే ప్రశ్నలే నా ప్రతి అడుగులో, మనసులో కనిపిస్తాయి. సామాజిక అంతరాలను కొనసాగించే విద్యా విధానం, అధికారంలో వాటా ఇవ్వని గత రాజకీయ విధానాలను ఇకపైనా కొనసాగించాల్సిందేనా? అన్న ప్రశ్నకు ఆలోచన పెరగాలి. ఈ వివక్ష ఇంకా కొనసాగాల్సిందేనా? అన్నది ఒక్కసారి అంతా గుండెపై చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ట్యాబ్ల పంపిణీని ప్రారంభించి ప్రసంగిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి పలకల నుంచి ట్యాబ్ల దిశగా.. పలక, బలపం చదువులతోనే కొన్ని కులాల విద్యాభ్యాసం ముగిసిపోతుండగా కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబ్లు, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉన్న సమాజాన్ని మనం ఆమోదించవచ్చా? అన్నది అంతా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇవాళ రాజకీయ వ్యవస్థలో నెలకొంది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చే తిరుగుబాటులో మీవాడిగా, మీలో ఒకడిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, ప్రతి తల్లికీ అన్నగా నేనున్నానని, తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. ఈరోజు రూ.686 కోట్లతో 5,18,740 ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని నా దళిత సోదరుడి నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నా. 9,703 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ 2024–25లో ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ విధానంలో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే 4,59,564 మంది విద్యార్థులతో పాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్లు పంపిణీ చేస్తున్నాం. వారం రోజుల పాటు ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. తరగతి గదిలో విద్యార్థులతో సీఎం జగన్ రేపటి పౌరులకు నేటి అవసరాన్ని తీర్చేలా.. ఇక మీదట ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే ప్రతి బాబు, పాపకు ట్యాబ్లు ఇస్తూ వెళతాం. ఇవన్నీ మల్టీ లింగ్యువల్ ట్యాబ్లు. బాగా అర్థం కావడానికి ఇంగ్లిష్, తెలుగులోనూ పాఠ్యాంశాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ట్యాబ్లు అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థం అయ్యేలా దోహదపడతాయి. రేపటి పౌరుల నేటి అవసరమే ఈ ట్యాబ్లు. ట్యాబ్లోనే బైజూస్ కంటెంట్ లభిస్తుంది. క్లాస్ టీచర్ చెప్పే పాఠాలు మరింత సులభంగా అర్థం చేసుకునేలా ట్యాబ్ ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్లో భాగంగా శ్యాంసంగ్ ట్యాబ్లు ఇస్తున్నాం. సెక్యూర్డ్ డిజిటల్ కార్డు కూడా వీటిల్లో ఉంటుంది. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ పాఠాలు... ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ లో ట్యాబ్లు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంది. ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ సబ్జెక్టులు నేర్చుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే వీటికి మూడేళ్ల వారెంటీ ఉంది. బైజూస్ కంటెంట్ను 4 నుంచి 10వ తరగతి పిల్లలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీతో మంచి మాత్రమే జరిగేలా... టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఇదే ఆలోచనతో ట్యాబ్లో సెక్యూర్డ్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సాఫ్ట్వేర్ పొందుపరిచారు. దీనివల్ల ట్యాబ్ల్లో పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు ఉండకూడదు. పిల్లలు ఏం చూశారు? ఏం చదివారు? అన్నది తల్లిదండ్రులు, టీచర్లకు సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ట్యాబ్లు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేవు. ఒక్కో విద్యార్థికి రూ.32 వేల లబ్ధి.. ఈరోజు పిల్లల చేతుల్లో పెట్టే ట్యాబ్ మార్కెట్ విలువ రూ.16,500 ఉంటుంది. బైజూస్ కంటెంట్ను ఎవరైనా శ్రీమంతుల పిల్లలు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏకంగా రూ.15,500 చెల్లించాలి. ఇలా 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్, బైజూస్ కంటెంట్ను బయట కొనుగోలు చేయాలంటే రూ.32 వేలు ఖర్చవుతుంది. మేనమామగా పిల్లల చదువుల కోసం రూ.32 వేలు చొప్పున వ్యయం చేస్తూ మంచి చదువులు అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ బైజూస్ సంస్థను కూడా ప్రశంసించాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రూ.15,500 విలువైన కంటెంట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందించినందుకు బైజూస్కు కృతజ్ఞతలు. 5,18,740 ట్యాబ్ల ఖర్చు రూ.688 కోట్లు కాగా ఇందులో లోడ్ చేస్తున్న కంటెంట్ విలువ మరో రూ.778 కోట్లు ఉంటుంది. మొత్తంగా రూ.1,466 కోట్ల మేర పిల్లలకు లబ్ధి చేకూరుతోంది. డిజిటల్ క్లాస్ రూములు.. ఒకవైపు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీతో పాటు మరోవైపు స్కూళ్లలో డిజిటల్ క్లాసురూమ్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. నాడు – నేడు దశలవారీగా అమలయ్యే కొద్దీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాసులో, ప్రతి సెక్షన్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం.నాడు – నేడు మొదటిదశ పనులు పూర్తైన 15,715 స్కూళ్లల్లో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు వచ్చే జూన్ కల్లా పూర్తవుతుంది. సమూల మార్పులు... ► స్కూళ్లు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యా కానుక కిట్. స్కూల్ బ్యాగుతో పాటు ద్విబాషా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, షూస్, 3 జతల యూనిఫాం, సాక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పంపిణీ. గత సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాలు సైతం ఇవ్వలేని దుస్థితి. ► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్. ► నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్పు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ విధానం, డిజిటల్ క్లాస్ రూములు, ట్యాబ్లు, బైజూస్ కంటెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, గోరుముద్దతో సహా అనేక పథకాలు అమలు. ► మూడేళ్లలో అమ్మఒడి ద్వారా రూ.19,617 కోట్లు వ్యయం. 44,48,865 మంది తల్లులకు, 80 లక్షల మంది పిల్లలకు పథకంతో లబ్ధి. ► రూ.9,051 కోట్లతో విద్యాదీవెన ద్వారా 24,74,544 మంది పిల్లలకు ప్రయోజనం. ► వసతి దీవెన కింద మరో రూ.3,349 కోట్లతో 18,77,863 మంది పిల్లలకు మేలు. ► గోరుముద్ద పథకానికి ఇప్పటివరకూ రూ.3,239 కోట్లు వ్యయం. 43,26,782 మంది పిల్లలకు రోజుకో రకమైన మెనూతో పౌష్టికాహారం. ► విద్యాకానుక కిట్ల కోసం రూ.2,368 కోట్ల వ్యయం. 47,40,420 మంది పిల్లలకు ప్రయోజనం. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణం కింద రూ.4,895 కోట్ల వ్యయంతో 35,70,675 మందికి లబ్ధి. ► మనబడి నాడు నేడు ద్వారా తొలిదశలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్పు. రెండో దశలో మరో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు. ట్యాబ్ల పంపిణీ అనంతరం విద్యార్థులతో సీఎం జగన్. చిత్రంలో ప్రజాప్రతినిధులు, ఇతరులు ► ‘‘అందరికీ సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు. కానీ అందరికీ సమాన అవకాశాలు దొరికితీరాలి. అది కల్పించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలను సీఎం జగన్ గుర్తు చేశారు. ► ‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవటాన్ని దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు బాగుండాలని, తమకన్నా బాగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రతి తల్లిదండ్రీ మనసారా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల.. కులం, ఆర్థిక స్థోమత కారణంగా సరిగా చదివించుకోలేకపోతున్నామని భావించినప్పుడు వారి మనసులు తల్లడిల్లటాన్ని నేను స్వయంగా చూశా’’ ► ‘‘నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలోనూ తల్లులు, తండ్రులు పడుతున్న బాధలు చూశా. బతుకులు మారాలంటే తలరాతలు మారాలి. ఆ తలరాతలు మారాలంటే చదువు అనే ఒకే ఒక్క ఆస్తి ద్వారానే మారుతుంది’’ -
బాపట్ల : సీఎం జగన్ చేతుల మీదుగా ట్యాబ్ల పంపిణీ (ఫొటోలు)
-
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం: సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 'ట్యాబ్లలలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్లు అందిస్తాం. ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుంది' అని సీఎం జగన్ తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. విద్యారంగంలో సీఎం జగన్ కొత్తశకానికి నాంది పలికారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. విద్యారంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనేదే సీఎం జగన్ లక్ష్యం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనేదే సీఎం ఆకాంక్ష అని అన్నారు. 12:10AM ►ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ►రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచిత పంపిణీ ►నెట్తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసూ వెసులుబాటు ►బైజూస్ లెర్నింగ్ యాప్తో లెక్కలు, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, జియాలజీ, సివిక్స్, హిస్టరీ పాఠ్యాంశాలు ►తెలుగు ఇంగ్లీష్ హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ►విద్యార్థులకు అర్థమయ్యేలా సుమారు 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్, వీడియోల రూపంలో పాఠ్యాంశాలు ►బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్లో మొత్తం 57 చాప్టర్లు్ల, 300 వీడియోలు ►ట్యాబ్లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే ఐటీ విభాగం అవగాహన 12:07AM ►రాష్ట్ర వ్యాప్తంగా 5,18,740 ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ►4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు ►రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ►నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్ల పంపిణీ 12:03AM బాపట్ల: యడ్లపల్లి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్ ►కాసేపట్లో జడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం జగన్ 11:30AM సీఎం జగన్కు ఘనస్వాగతం యడ్లపల్లిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా పూలు జల్లుతూ హారతులు పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జన హృదయ విజేత.. నవరత్నాలు పొదిగిన సంక్షేమ సార్వభౌమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం బాపట్ల జిల్లాకు రానున్నారు. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసే బృహత్తర కార్యక్రమానికి తన పుట్టిన రోజున శ్రీకారం చుట్టనున్నారు. విద్యాంధ్ర సాధనకు శంఖారావం పూరించనున్నారు. జయీభవ.. ‘విద్య’యీభవ అంటూ విద్యార్థులను దీవించనున్నారు. వరాల రేడు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఆనందభరితులవుతున్నారు. స్వాగతం.. సుస్వాగతం అంటూ జననేతకు జేజేలు పలుకుతున్నారు. సాక్షి, నరసరావుపేట/వేమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్య హస్తాల మీదుగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్ల పంపిణీ కోసం సుందరంగా ముస్తాబై వేచిచూస్తోంది. దీనికోసం జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేసింది. మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ విజయకృష్ణన్, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాపట్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రెండోసారి జిల్లాకు వస్తున్నారు. అదీ తన పుట్టిన రోజున జననేత జిల్లాలో పర్యటించనుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారీ్టశ్రేణులు, ప్రజలు జననేత రాక కోసం ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు. పటిష్ట బందోబస్తు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం యడ్లపల్లిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఒక అదనపు ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, మరో 890 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 1,050 మంది సిబ్బందితో కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మహేష్, డీఎస్పీలు టి.మురళీకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్, ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఆనందంగా ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. అటువంటి రోజున ఆయన నా నియోజకవర్గంలో పర్యటించడం సంతోషంగా ఉంది. పేదింటి పిల్లల తలరాతలు మార్చే విద్యకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమానికి బాపట్ల జిల్లాను ఎంచుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు. – మేరుగ నాగార్జున, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
80 మిలియన్ డాలర్లకు ప్రోజస్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో టెక్నాలజీ ఇన్వెస్టర్ ప్రోజస్ 80 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ నష్టం ప్రకటించింది. ప్రధానంగా పేయూ ఇండియా వ్యాపారంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి రావడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో పేయూ ఆదాయం 183 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నెదర్లాండ్స్కి చెందిన ప్రోజస్ గ్రూప్ భారత్లో ఓఎల్ఎక్స్, బైజూస్, మీషో, ఎలాస్టిక్రన్, డేహాత్, ఫార్మ్ఈజీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. -
బైజూస్పై బురద రాతలు
సాక్షి, అమరావతి: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక‘ఈనాడు ’విషం చిమ్ముతోంది. ఇందులో నిజానిజాలివీ.. బైజూస్తో బోలెడు ప్రయోజనాలు బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్ను స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్ కంటెంట్ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది. పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. గొప్ప వరం.. బైజూస్ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం. – ఎన్.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా రెండు భాషల్లో చక్కగా.. బైజూస్ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి. – కె.పుష్పవతి, సైన్స్ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు చాలా బాగుంది.. బైజూస్ కంటెంట్ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి కలిగిస్తున్నాయి. – సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం అద్భుతంగా నేర్చుకుంటున్నారు... బైజూస్ యాప్ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది. – ఎం.నరసింహారెడ్డి, హెచ్.ఎమ్, జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా అబద్ధం 1 బైజూస్ కంటెంట్ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉంది. భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. అబద్ధం 2 పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్ను ఫోన్లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. అబద్ధం 3 టీచర్లకు రూ.500 చాలదు ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే. -
బైజూస్ బోధన..ఉచితంగా నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థిని ఇంగ్లిష్ మీడియంలో తీర్చిదిద్దేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రైవేట్గా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా విద్యను ప్రారంభించి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలంటే ఆకర్షించే తరగతి గదులు, మౌలిక వసతులే కాకుండా నాణ్యమైన విద్య సైతం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే నాడు–నేడుతో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండే విధంగా జిల్లాలో 51 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. దీంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు జిల్లాలో 17 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్ ఎడ్టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తరగతి నుంచి బైజూస్ ద్వారాా ఆన్లైన్లో వీడియో పాఠాలు బోధన అందించే విధంగా చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఉచితంగా నాణ్యమైన విద్య ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు 1,42,907 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బైజూస్ అప్లికేషన్ ద్వారా తరగతికి సంబంధించి కంటెంట్ను అప్లోడ్ చేయనున్నారు. బైజూస్యాప్తో విద్యాబోధన అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ యాప్తో పాటు ఇంగ్లిషు లెర్నింగ్ యాప్ను ఉచితంగా అందజేస్తోంది. పర్చువల్ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా యాప్ను రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా విద్యార్థులు బోధనను మరింత సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సోషల్, సైన్స్, మ్యాథ్స్ తదితర సబ్జెక్ట్లన్నింటిని ఇంగ్లిష్తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో విద్యార్థులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడియో పాఠాలు నాణ్యతతో పాటు స్పష్టతతో ఉంటాయి. నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రశ్నలు యాప్లో పొందుపరిచారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రొగ్రెస్ రిపోర్టు ఇవ్వనున్నారు. బైజూస్ యాప్ను విడిగా కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అటువంటిది ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్లో 85,572 మంది బైజూస్ ప్రీమియం యాప్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే యాప్ ద్వారా విద్యాబోధన ప్రారంభమైంది. 21,092 మందికి ఉచితంగా ట్యాబ్లు బైజూస్ వీడియో పాఠాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,092 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేయనున్నారు. ట్యాబ్లను ఈ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బయట మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర 19,446 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843లకే అందుబాటులోకి తీసుకురానుంది. బైజూస్ కంటెంట్కు ఒక్కో విద్యార్థిపై తరగతి బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్లకు సంబంధించి కంటెంట్ను అప్లోడ్ చేయనున్నారు. వీళ్లు 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతికి వెళ్లే సమయంలో ఆయా తరగతి సబ్జెక్ట్లకు సంబంధించిన కంటెంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. విద్యార్థులకు బైజూస్ ప్లాట్ఫాం లాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్లాట్ఫాం లాంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బైజూస్తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయం. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు. వీడియో పాఠాల ద్వారా బైజూస్ సబ్జెక్ట్లకు సంబంధించి కంటెంట్ను అందిస్తోంది. రివిజన్కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. – సుబ్బారావు, ఇన్చార్జి డీఈఓ -
బైజూస్ ఈఎఫ్ఏ ప్రచారకర్తగా ఫుల్బాట్ స్టార్ ప్లేయర్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (ఈఎఫ్ఏ) కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రచారకర్తగా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నియమితులయ్యారు. అందరికీ సమానంగా విద్యను అందించాలన్న ఆశయాన్ని ప్రచారం చేయడానికి ఆయనతో ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. గ్లోబల్ అంబాసిడర్గా ఫుట్బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో కలిసి పనిచేయడం గర్వంగానూ, ఆనందగానూ ఉందని బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్నాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాము దాదాపు 5.5 మిలియన్ల మంది పిల్లలకు సాధికారత కల్పిస్తోంది. మానవ సామర్థ్యాన్ని పెంపొందించే శక్తికి లియోనెల్ మెస్సీని ప్రతినిధులు మరెవ్వరూ ఉండరని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు దాదాపు 3.5 బిలియన్ల మందిఫ్యాన్స్ ద్వారా విదేశాల్లో చేరాలని కంపెనీ యోచిస్తోంది. కాగా సోషల్ మీడియాలో లియోనెల్ మెస్సీ ఫాలోయర్ల సంఖ్య దాదాపు 450 మిలియన్ల మంది ఉండటం విశేషం. -
తప్పనిసరైనందుకే తొలగింపులు..
న్యూఢిల్లీ: ప్రతికూల స్థూలఆర్థిక పరిణామాలను ఎదుర్కొని నిలబడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కొందరు ఉద్యోగులను తీసివేయక తప్పడం లేదని ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్ తమ సిబ్బందికి పంపిన సందేశంలో వివరణ ఇచ్చారు. కార్యకలాపాలను వేగంగా విస్తరించడంతో ఒకే రకం విధులను పలువురు ఉద్యోగులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని, అలాంటి డూప్లికేషన్ను తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందన్నారు. నిలకడగా వృద్ధి సాధించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే గ్రూప్ స్థాయిలో లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. ‘సంస్థ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతో భారమైన హృదయంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే క్షమించండి. కంపెనీని నిలకడైన వృద్ధి బాట పట్టించి మిమ్మల్ని తిరిగి తెచ్చుకోవడమే నా మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది‘ అని రవీంద్రన్ పేర్కొన్నారు. తొలగించే ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఇతర ఉద్యోగాన్వేషణలోనూ కంపెనీ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఆరు నెలల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ బైజూస్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో రవీంద్రన్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
బైజూస్కు రూ.2,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా రూ.2,000 కోట్ల నిధులను సమీకరించింది. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోసహా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని అందుకున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఆదాయం, వృద్ధి, లాభదాయకత పరంగా 2022–23 ఉత్తమ సంవత్సరంగా నిలుస్తుందని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు. గౌరవప్రద పెట్టుబడిదారుల నుండి నిరంతర మద్దతు సంస్థ ఇప్పటివరకు సృష్టించిన ప్రభావాన్ని, లాభదాయకతకు మార్గాన్ని ధృవీకరిస్తుందని చెప్పారు. 120కిపైగా దేశాల్లో 15 కోట్ల మంది బైజూస్ ఉత్పత్తులు, సేవలను వినియోగిస్తున్నారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
అదే టార్గెట్, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి లాభాల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వెల్లడించింది. 2020– 21లో కంపెనీ రూ.2,428 కోట్ల టర్నోవర్పై రూ.4,588 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021– 22లో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే లాభం/నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్ కో–ఫౌండర్ దివ్య గోకుల్నాథ్ తెలిపారు. అలాగే భారత్తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. ‘వీరిలో సగం మందిని భారత్ నుంచి ఎంచుకుంటాం. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. టీచర్లను భారత్, యూఎస్ నుంచి ఎంపిక చేస్తాం’ అని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 50,000 మంది పనిచేస్తున్నారు. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
భారీగా ఉద్యోగాల కోత.. 2500 మందిని ఇంటికి పంపుతున్న స్టార్టప్ కంపెనీ!
ఇటీవల టెక్ కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రముఖ సంస్థల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం భారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ దిగ్గజం బైజూస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కొత విధించేందుకు సిద్ధమైంది. ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ సంస్థలోనూ కోతల పరంపర కొనసాగతోంది. ఇటీవల ఆలస్యంగా జరిపిన ఆడిట్ తర్వాత ఖర్చను తగ్గించుకోవాలని బైజూస్ భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో దాదాపు 5% ఉద్యోగులను తీసివేయాలిని నిర్ణయించుకుంది. ప్రాడెక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ సాంకేతికత వంటి విభాగాలలో దశలవారీగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. దేశంలోని విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభం కావడంతో, ఆన్లైన్ బోధన జరిపే ఎడ్టెక్ సంస్థలకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికీ వరకు బైజూస్ ఈ స్థాయిలో తొలగింపులలో జరగలేదు. మీషో, కార్స్ 24, అనాకాడెమీతో సహా ఇతర స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా మందగమనం, ఇన్వెస్టర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య కేపిటల్ ధనాన్ని ఆదా చేయడంతో పాటు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ వర్క్ఫోర్స్ను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా! -
లాభాలతో కూడిన వృద్ధికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: ఇంతకాలం కేవలం వృద్ధిపైనే దృష్టి పెట్టిన విద్యారంగ స్టార్టప్ బైజూస్ తన విధానాన్ని మార్చుకుంది. దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ బైజూస్, లాభాల ఆధారిత వృద్ధిపైకి తన దృష్టిని మళ్లించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్ రూ.4,564 కోట్ల భారీ నష్టాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం తెలిసిందే. ఈ క్రమంలో బైజూస్ ఉద్యోగులకు సీఈవో లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఐదు నెలలుగా ప్రతి నెలా రూ.1,000కోట్లకు పైగా టర్నోవర్ నమోదు చేస్తున్నామని, కే12 విభాగంలో మన తర్వాతి రెండు స్థానాల్లో ఉన్న పోటీ సంస్థల టర్నోవర్ కంటే ఇది 20 రెట్లు అధికమని చెప్పారు. ‘‘2022–23 ఆ తర్వాతి నుంచి వృద్ధికి, నిలదొక్కుకునే సామర్థ్యాలను జోడిస్తాం. వనరులను మరింత సమర్థవంతంగా వినియోగిస్తాం’’అని రవీంద్రన్ ప్రకటించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి బైజూస్ ఆదాయం 3.3 శాతం క్షీణించి రూ.2,428 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020–21 ఆడిటింగ్ చాలా ఆలస్యమైనట్టు రవీంద్రన్ చెప్పారు. దీనిపై అనేక నిరాధార ప్రచారాలు వ్యాప్తిలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, కంపెనీ వృద్ధి స్థాయికి అనుగుణంగా ఆడిటింగ్కు తగిన విధంగా సన్నద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని చెప్పారు. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
బైజూస్ ఆదాయం హైజంప్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్ స్థూల ఆదాయం మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు రెట్లు దూసుకెళ్లింది. బైజూస్ బ్రాండుతో విద్యా సంబంధ సేవలందించే కంపెనీ రూ. 10,000 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. 202021లో నష్టాలు రూ. 4,588 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో రూ. 2,428 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. కొద్ది నెలల ఆలస్యం తదుపరి కంపెనీ ఆడిటెడ్ ఫలితాలను విడుదల చేసింది. భారీ నష్టాలకు ప్రధానంగా వైట్హ్యాట్ జూనియర్ విభాగం ఆదాయం, నష్టాలను వాయిదా వేయడం, ఆదాయ మదింపులో చేపట్టిన మార్పులు కారణమైనట్లు బైజూస్ పేర్కొంది. 2019–20లో దాదాపు రూ. 232 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్లతో పోలిస్తే ఆదాయం సైతం 1 శాతం తగ్గినట్లు తెలియజేసింది. ఆదాయ నమోదును వాయిదా వేసినప్పటికీ వ్యయాల నమోదును కొనసాగించడంతో నష్టాలు భారీగా పెరిగినట్లు బైజూస్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ వివరించారు. అంతేకాకుండా వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నష్టాలు నమోదు చేస్తున్న వైట్హ్యాట్ జేఆర్ తదితర సంస్థల కొనుగోళ్లు కూడా ఇందుకు కారణమైనట్లు తెలియ జేశారు. అయితే గతేడాది లాభం లేదా నష్టం వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం! తొలి 4 నెలల్లో జూమ్ 2022 ఏప్రిల్-జులైలో సాధించిన రూ. 4,530 కోట్ల ఆదాయం 2021లో నమోదైన మొత్తం ఆదాయం కంటే అధికమని రవీంద్రన్ వెల్లడించారు. కీలక బిజినెస్ 150 శాతం పురోగమించినట్లు తెలియ జేశారు. ఆకాష్, గ్రేట్ లెర్నింగ్ సంస్థల కొనుగోళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు తదుపరి బిజినెస్లో రెట్టింపు వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. వైట్హ్యాట్ జేఆర్ మాత్రం అంతంత మాత్ర పనితీరును చూపుతున్నట్లు ప్రస్తావించారు. 50 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరణకు కంపెనీ నిర్వహిస్తున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు తెలియజేశారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం అబుధాబి సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి 40–50 కోట్ల డాలర్లు, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి 25–35 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులను సమకూర్చుకునే వీలుంది. నిధులను 23 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశాన్ని పక్కనపెట్టినట్లు రవీంద్రన్ తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే బిలియన్ డాలర్లకు దేశీ సంస్థ ఆకాష్ను సొంతం చేసుకోగా.. సింగపూర్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ను 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో యూఎస్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 50 కోట్ల డాలర్లకు, కోడింగ్ సైట్ టింకర్ను 20 కోట్ల డాలర్లకు చేజిక్కించుకుంది. ఆస్ట్రియా గణిత శాస్త్ర సంస్థ జియోజెబ్డ్రాను 10 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో ప్రస్తుత ఉపాధ్యాయుల సంఖ్య 20,000కాగా వచ్చే ఏడాదిలో మరో 10,000 మందిని జత చేసుకునే ప్రణాళికల్లో బైజూస్ ఉంది. కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య ప్రస్తుతం 50,000కు చేరింది. -
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్
సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్సంగ్ ట్యాబ్లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్ను ఇవ్వనుంది. రివర్స్ టెండరింగ్తో మార్కెట్ ధర కంటే తక్కువ ► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్సంగ్ ట్యాబ్లను అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ ద్వారా బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్ అన్నీ కలిపితే బయట మార్కెట్లో శ్యామ్సంగ్ ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. ► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ను, శ్యామ్సంగ్ ట్యాబ్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్కు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్, రూ.12,843 ట్యాబ్ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్ను ఉచితంగా అందిస్తోంది. ట్యాబ్ల ప్రత్యేకతలు ఇవీ.. ► ట్యాబ్లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. ► మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్ కవర్తో 8.7 అంగుళాలు ఉంటుంది. ► పిల్లలు చూడకూడని సైట్లు బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ను ట్యాబ్లలో లోడ్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు. ► కంటెంట్ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. ► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇస్తారు. ► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తారు. ► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్ చేయనున్నారు. ► విజువల్ గ్రాఫిక్స్తో కూడిన కంటెంట్ను ట్యాబ్లో అప్లోడ్ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. బైజూస్తో ఒప్పందంలో ముఖ్యాంశాలు ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్లో ఉంటాయి. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్లో పొందుపరిచారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతిలో నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. -
నవంబర్లో ఆకాష్ టాలెంట్ హంట్– 2022
లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది నిరుపేదలు, బాలికలకు ఉచితంగా జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు నవంబర్లో ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష–2022 (అంతే 2022) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గుదే సంజయ్గాంధీ తెలిపారు. ఆ పరీక్షకు సంబంధించి పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్గాంధీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్షిప్లకు అదనంగా ఇవి అందించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు నవంబర్ 5 నుంచి 13 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ఎంపిక చేసిన తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా సమయంలో ఒక గంట పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్లైన్ పరీక్షను ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలో 90 మార్కులు ఉంటాయని, 35 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్ ఏర్పుల, బ్రాంచి మేనేజర్ జి.గోపీనాథ్లు పాల్గొన్నారు. (క్లిక్: పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్) -
బైజూస్ సేవలు ఉపయోగకరం
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 మిలియన్ విద్యార్థులకు విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సంస్థ విద్యాసేవలు త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ అందుబాటులోకి రానుండటం ముదావహం. నిత్యం పేద విద్యార్థుల అభ్యున్నతిని కాంక్షించే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ 2022 మే నెలలో దావోస్లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమ్మేళనంలో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడం తెలిసిందే. అదే సమయంలో నాణ్యమైన విద్యాసేవలు అందిస్తున్న బైజూస్ సీఈఓ రవీంద్రన్తో కూడా చర్చలు జరిపారు. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు గూర్చి తీసుకుంటున్న శ్రద్ధకు ఆశ్చర్యచకితులైన రవీంద్రన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ తమ సేవలు ఉంటా యని ప్రకటించారు. ఫలితంగా జూన్ 16న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, బైజూస్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం... ప్రతి ఏటా ఒక్కొక్కరికి 20 వేల నుంచి 24 వేల రూపాయలు చెల్లిస్తే కానీ లభించని బైజూస్ విద్యా సేవలను ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అంతేగాదు దాదాపు 4.7 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్లు కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 500 కోట్ల ఖర్చు చేస్తోంది. బైజూస్ యాప్తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్ యాప్ను కూడా ఉచితంగా అందుబాటులోనికి ఏపీ ప్రభుత్వం తెస్తోంది. గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లీషు, అటు తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉండేటట్లు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇంత చేస్తున్నా చంద్రబాబు ఆంగ్ల భాషా మాధ్యమాన్ని వ్యతిరేకించినట్లు... బైజూస్ విద్యాకార్యక్రమాలను కూడా వ్యతిరేకించడం శోచనీయం. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లింపక తప్పదు. (క్లిక్: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్!) – ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, విజయవాడ -
పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్ కంటెంట్ను కొనాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అలాంటిది సీఎం జగన్ చొరవ వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్ అందించేందుకు బైజూస్ సీఈవో రవీంద్రన్ ముందుకు వచ్చారన్నారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్కు మంచి పేరుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్’ అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. -
బైజూస్తో ఒప్పందంతో ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు
-
బైజూస్ తో ఒప్పందం తో ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు
-
బైజూస్ అంటే ఏమిటో నీ మనవడిని అడుగు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు అభ్యాసనాంశాల(కంటెంట్)ను ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం చేసుకుంటే.. అది బైజూసో.. జగన్మోహన్రెడ్డి జూసో అంటూ చంద్రబాబు వెటకారంగా మాట్లాడటం హేయం.. దారుణం అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బైజూస్ అంటే హెరిటేజ్లో అమ్మే జ్యూస్ అనుకుంటున్నావా అంటూ ధ్వజమెత్తారు. బైజూస్ అంటే తెలియకపోతే.. నీ మనవడిని అడిగితే చెబుతాడని ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి ఒక్క అంశంపైనైనా మట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో రిజిష్టర్ చేసుకున్న 150 మిలియన్ల విద్యార్థులకు కంటెంట్ అందిస్తున్న సంస్థ బైజూస్ అని చెప్పారు. ‘మీ కొడుకు, మనవడు మాత్రమే ఇంగ్లిష్లో చదవాలి.. వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలి.. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలి. ఇదేగా మీ ఉద్దేశం’ అని నిప్పులు చెరిగారు. మంత్రి బొత్స ఇంకేమన్నారంటే.. మతి స్థిమితం లేని మాటలు.. ► నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దనేదే మీ లక్ష్యం. బైజూస్ ద్వారా ఆ విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తుంటే దానినీ ఎగతాళి చేస్తావా? బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తప్పు అని ఒక్క మేధావితోనైనా చెప్పించగలవా చంద్రబాబూ? ► బైజూస్ యాప్ తీసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.20 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుని 35 లక్షల మంది పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం. దీనిని చంద్రబాబు ఎగతాళి చేయడం చూస్తే ఆయన మతి స్థిమితం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ► రాజకీయాల్లో నీ కంటే పనికిమాలినోడు ఎవరైనా ఉన్నారా? నువ్వేమైనా రాజకీయాల్లో పుడుంగా? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని దిక్కుమాలిన పనులు చేశావో ఎవరికి తెలియదు? మళ్లీ అధికారంలోకి రావడానికి వాజ్పేయి, అద్వానీ, మోదీ కాళ్లు పట్టుకోలేదా? రాజకీయాల్లో నీకంటే యూజ్లెస్ ఫెలో ఎవరైనా ఉంటారా? రాజకీయంగా పనైపోవడంతో అసహనంతో పిచ్చిపట్టి నీచపు మాటలు మాట్లాడుతున్నావు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ► నారాయణ విద్యా సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ విద్యా వి«ధానాన్ని చంద్రబాబు నీరుగార్చడం వాస్తవం కాదా? అందుకే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 35 శాతం ఉంటే, ప్రైవేటు సంస్థల్లో చదివేది 65 శాతం. ► సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 శాతానికి పెరిగింది. ► దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి జిల్లాకూ యూనివర్సిటీ లేదా కాలేజీ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంగా మార్చారు. మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నారు. చంద్రబాబూ.. విజయనగరంలో మీరు నిర్మించిన మెడకల్ కాలేజీ ఎక్కడుందో చూపగలవా? ► మహానేత వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందింది. తోటపల్లి ప్రాజెక్టును 85 శాతం వైఎస్ పూర్తి చేస్తే.. మిగిలిన 15 శాతం కూడా పూర్తి చేయలేక చంద్రబాబు చేతులెత్తేయడం నిజం కాదా? బాబు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మేము అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ప్రజలకు అండగా ఉన్నాం. చంద్రబాబూ.. సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా? -
మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ అన్ అకాడమీలో ఉద్యోగుల తొలగింపు దశల వారీగా కొనసాగుతుంది. ఇప్పటికే పలు దశల్లో వందల మంది ఉద్యోగులు బయటకు పంపించగా.. తాజాగా పేలవ ప్రదర్శనపై గుర్రుగా ఉన్న అన్ అకాడమీ యాజమాన్యం మరో 150మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అన్ అకాడమీ దేశంలో బైజూస్ తర్వాత సెకెండ్ మోస్ట్ వ్యాల్యూడ్ ఎడ్ టెక్ కంపెనీగా అవతరించింది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసుల నిర్వహణతో ఎడ్టెక్ రంగంలో అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఆ సంస్థలో సాఫ్ట్ బ్యాంక్తో పాటు ఫేస్బుక్, టైగర్ గ్లోబల్, టెమాసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్బ్యాంక్, బ్లూమ్ వెంచర్స్, సీక్వోయా, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, ఎలివేషన్ క్యాపిటల్లు 800 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులతో అన్ అకాడమీని వృద్ది చేయడంతో పాటు ఇతర స్టార్టప్ కొనుగోళ్లుపై ఆ సంస్థ ప్రతినిధులు దృష్టి సారించారు. ఈ తరుణంలో 2020 జులై నెలలో 50 మిలియన్ డాలర్లకు మరో ఎడ్యుకేషన్ సంస్థ ప్రాప్ లీడర్ను సొంతం చేసుకుంది. ప్రాప్ లీడర్ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలన్నీ అన్ అకాడమీ నిర్వహించేది.అయితే కోవిడ్ తెచ్చిన ఎడ్యుకేషన్ సంక్షోభంతో ఆఫ్లైన్ క్లాసులు కనుమరుగయ్యాయి. ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అన్ అకాడమీకి గట్టి పోటీ ఇచ్చాయి. ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు పోటీని తట్టుకుంటూ మార్కెట్లో కాంపిటీటర్లకు చెక్ పెట్టేందుకు అన్అకాడమీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో విపరీతమైన నిధుల కొరత ఏర్పడించింది. 2020లో అన్ అకడామీ కంపెనీ నిర్వహణ కోసం రూ.452కోట్లు ఖర్చు చేయగా రూ.464 కోట్లు లాభాల్ని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మాత్రం భారీగా నష్టపోయింది. 6 రెట్లు పెరిగి రూ.1537కోట్లు నష్టపోయింది. ఖర్చులు సైతం రూ.2వేల కోట్లగా పెరిగాయి. దీంతో ఖర్చు తగ్గించేందుకు పలు దశల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఏప్రిల్ నెలలో 1000మందిని, మేలో 150 మందిని, జూన్లో తాజాగా ప్రాప్ లీడర్లో అడ్వటైజింగ్, మార్కెటింగ్ కాస్ట్ తగ్గించుకునేందుకు 150మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.ఆ మెయిల్స్పై అన్ అకాడమీ యాజమాన్యం స్పందించింది. పనితీరును బట్టి ఉద్యోగులుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇది ఏ సంస్థలోనైనా సర్వ సాధారణమని సంస్థపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేసే ప్రయత్నం చేసింది. చదవండి👉చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
చంద్రబాబు నీ పిచ్చి మాటలు ఆపు: మంత్రి బొత్స సత్యనారాయణ
-
ఆ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా?: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి: దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. బైజూస్పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారు. బైజూస్ సంస్థ గురించి చంద్రబాబుకు తెలుసా?. మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారు?. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. అనుభవం ఉంటే సరిపోదు.. నలుగురికి ఉపయోగపడాలి. బైజూస్ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా?. డిబేట్కు ఎవరు వస్తారో రండి.. మేం సిద్ధంగా ఉన్నాం. 35 లక్షల మంది విద్యార్థులకు బైజూస్తో ఉపయోగం. చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స అన్నారు. ''సామాజికి న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగింది. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబులా మేం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదు. నాడు- నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థుల శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారని'' మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: (చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు) -
AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్!
నిర్ణయాల్లో సీఎం వేగం అనూహ్యం బైజూస్ సీఈవో రవీంద్రన్తో వర్చువల్గా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగం అనూహ్యం. ఇంత వేగంగా స్పందించిన తీరు మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మే 25న ఆయనతో నేను తొలిసారి దావోస్లో సమావేశమయినప్పుడు ఆయన ఈ ఆలోచన చెప్పారు. ఒక యంగ్ స్టార్టప్కన్నా వేగంగా అడుగులు ముందుకు వేయడం హర్షణీయం. ప్రైవేటు స్కూళ్లలోని పిల్లలకు అందుబాటులో ఉండే కంటెంట్ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకు వస్తుండటం గొప్ప విషయం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి ఇంత వేగంగా అడుగులు వేయడం మాకు చాలా ఉత్సాహాన్నిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడ్యు టెక్ కంపెనీగా మాకు సామాజిక బాధ్యత కూడా ఉంది. లాభాల కోసం కాకుండా మంచి చేయడానికి మాకు ఇదొక చక్కటి అవకాశం. లక్షల మంది విద్యార్థులు దీని వల్ల లబ్ధి పొందుతారు. – రవీంద్రన్, బైజూస్ సీఈఓ సులభంగా అర్థం అయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్, నాణ్యమైన కంటెంట్ బైజూస్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్లలో ఏటా రూ.20 వేల నుంచి 24 వేల వరకూ చెల్లించగలుగుతున్న శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ కంటెంట్.. రాష్ట్రంలో పేద పిల్లలందరికీ అందుబాటులోకి రానుండటం విద్యా రంగంలో మేలి మలుపు. ఇదొక గేమ్ ఛేంజర్. – సీఎం వైఎస్ జగన్ బైజూస్తో కలిస్తే.. ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ► బైజూస్ యాప్తో పాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్లో బోధన అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్లో, అటు తెలుగు మాధ్యమంలో కూడా అందుబాటులో ఉంటాయి. ద్వి భాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషా పరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చుకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్లో పాఠ్యాంశాల రూపకల్పన చేశారు. ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, సిమ్ములేషన్స్.. ఇవన్నీ యాప్లో పొందుపరిచారు. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్ ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతి ద్వారా నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్... ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బైజూస్ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మోడల్ ప్రశ్నపత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెల వారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూనే... మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో అత్యుత్తమ ఎడ్యుటెక్ కంపెనీగా అవతరించిన ‘బైజూస్’తో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్’ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్ అమెరికా నుంచి దీన్లో పాల్గొన్నారు. పేద పిల్లలకు ఉచితంగా బైజూస్ ఈ–కంటెంట్ రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా... యూనికార్న్లుగా అవతరించిన పలు స్టార్టప్ల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కావటం తెలిసిందే. ఈ సమయంలో బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్తో... ఎడ్యుటెక్తో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరగాల్సి ఉన్న అవసరాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా నేర్చుకునేలా ఈ– లెర్నింగ్ కార్యక్రమాలుండాలని... దీనిపై తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. దీనికి సరేనన్న రవీంద్రన్... తాజా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఫలితంగానే గురువారం బైజూస్ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ సాధ్యమయింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. పేదరికమన్నది నాణ్యమైన చదువులకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పకడ్బందీగా ప్రాజెక్టు అమలు బైజూస్తో ప్రభుత్వ ఒప్పందం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీదైన కంటెంట్ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘వచ్చే విద్యా సంవత్సరం నాటికి బైజూస్ కంటెంట్ను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పాఠ్య పుస్తకాలుగా అందుబాటులోకి తీసుకురావాలి. విజువల్ ప్రజెంటేషన్లు కూడా పిల్లలకు అందుబాటులోకి తేవడానికి ప్రతి తరగతి గదిలో నాడు–నేడు కింద టీవీ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025 మార్చి నాటికి తమ 10వ తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ నమూనాలో రాస్తారు. కనుక ఇప్పటి నుంచే వారిని నాణ్యమైన బోధనతో ముందుకు నడిపించాలి. అందుకే సెప్టెంబర్ నాటికి 4.70 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇస్తాం. ఈ విద్యార్థులకు 9, 10 తరగతుల్లోనూ ఈ ట్యాబ్ల ద్వారా ఈ–కంటెంట్ సులభంగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులందరికీ కొత్తగా ట్యాబ్లు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామ్యం చాలా పెద్ద అచీవ్మెంట్. నేను అడిగిన వెంటనే బైజూస్ వాళ్లు చాలా సానుకూలంగా స్పందించారు. ఏటా ట్యాబ్ల రూపంలో కనీసం మనకు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టీ. విజయకుమార్ రెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేద పిల్లల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేద పిల్లల జీవితాలను ఇది మారుస్తుందని పేర్కొన్నారు. ‘విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్ సీఈఓ రవీంద్రన్ లాంటి వారు ముందుకు రావడం శుభ పరిణామం. మంచి చదువులను నేర్పే దిశలో పిల్లలను ముందుండి నడిపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహద పడుతుంది. ఇక్కడున్న అందరి కలలు సాకారం కావడానికి బైజూస్ భాగస్వామ్యం గొప్ప బలాన్నిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక గేమ్ ఛేంజర్’ అని చెప్పారు -
విద్యార్థులకు ట్యాబ్ లు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
YS Jagan: వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక ముందడుగు
-
అంతర్జాతీయ వేదికపై బైజుస్..! ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డు..!
అంతర్జాతీయ వేదికపై ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజుస్ తళుక్కున మెరవనుంది. క్రీడారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిఫా వరల్డ్ కప్కు అధికారిక స్పాన్సర్గా ఎంపికైనట్లు బైజుస్ గురువారం ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్లో జరగనుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ను స్పాన్సర్ చేస్తోన్న మొదటి ఎడ్టెక్ భారతీయ కంపెనీగా బైజుస్ అవతరించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం బైజుస్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని బైజుస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ టీమ్కు కూడా అధికారిక స్పాన్సర్స్గా బైజుస్ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-స్పోర్ట్ ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ -2022కి స్పాన్సర్ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించడం, విద్య , క్రీడల ఏకీకరణలో విజయం సాధించడం మాకు గర్వకారణమ’ని బైజుస్ వ్యవస్థాపకుడు అండ్ సీఈవో బైజు రవీంద్రన్ అన్నారు. బైజుస్తో జత కట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫిఫా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కే మదాతి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోని యువతకు సాధికారితను కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. We are delighted to announce that BYJU’S would represent India at the biggest stage as an Official Sponsor of the FIFA World Cup Qatar 2022™️. This would make BYJU’S the first EdTech brand to sponsor this prestigious event globally. Stay tuned for more updates! #FIFAWorldCup pic.twitter.com/4M9cfHT5AN — BYJU'S (@BYJUS) March 24, 2022 చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..! -
బైజూస్ భారీగా నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. వీటిలో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ సగం పెట్టుబడులు అందించినట్లు బైజూస్ పేర్కొంది. తాజా రౌండ్లో 80 కోట్ల డాలర్లు(సుమారు రూ. 6,000 కోట్లు) సమకూర్చుకున్నట్లు తెలిపింది. నిధులు అందించిన కంపెనీల్లో సుమేరు వెంచర్స్, విట్రువియన్ పార్ట్నర్స్, బ్లాక్రాక్ ఉన్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా పెట్టుబడులను 22 బిలియన్ డాలర్ల విలువలో కంపెనీ సమీకరించింది. తాజా పెట్టుబడుల్లో బైజు రవీంద్రన్ 40 కోట్ల డాలర్లు సమకూర్చినట్లు, 9–12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడులతో రవీంద్రన్ వాటా 23% నుంచి 25%కి పెరిగినట్లు తెలియజేసింది. -
బైజూస్తో అనుబంధాన్ని కొనసాగించనున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ కంపెనీ బైజూస్తో అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిశాక బైజూస్తో టీమిండియా జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా బైజూస్ను మరో ఏడాది పాటు పొడిగించనున్నట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. 2019 సెప్టెంబర్ నుండి బైజూస్ భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. అంతకుముందు చైనీస్ మొబైల్ సంస్థ ఒప్పో టీమిండియా జెర్పీ స్పాన్సర్గా ఉండింది. జెర్సీ స్పాన్సర్షిప్కు గాను బైజూస్ ద్వైపాక్షిక సిరీస్లకు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్లకు రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..! -
విద్యార్ధుల కోసం 200 నగరాల్లో 500 ట్యూషన్ సెంటర్లు..రూ.1,500 కోట్లతో బైజూస్!
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ దేశవ్యాప్తంగా బోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 12–18 నెలల్లో 200 నగరాల్లో 500 సెంటర్లను స్థాపించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ వెల్లడించారు. ఇప్పటికే సంస్థ 80 కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పింది. వీటి ద్వారా 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో తరగతులను నిర్వహిస్తోంది. ట్యూషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏడాదిలో 10,000 పైచిలుకు మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. గూగుల్తో చేతులు కలిపింది ఇప్పటికే బైజూస్ దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ డీల్లో భాగంగా గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, బైజూస్కి చెందిన విద్యార్థి పోర్టల్ను అనుసంధానించారు ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్కి చెందిన మ్యాథ్స్, సైన్స్ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్గా బోధిస్తున్నారు. దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్ క్లాస్రూమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ తెలిపారు. గూగుల్తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
2025 నాటికి కోటి మంది విద్యార్థులకు ఉచిత విద్య: బైజూస్
న్యూఢిల్లీ: విద్యా సంబంధిత టెక్నాలజీ కంపెనీ బైజూస్ ఉచిత విద్యా కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని కోటి మంది విద్యార్థులకు ఉచితవిద్య అందించనున్నట్టు తెలిపింది. 2025 నాటికి 50 లక్షల మందికి ఉచిత విద్య అందించాలన్న లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇందులో ఇప్పటికే 34 లక్షల మందిని ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా చేరుకున్నట్టు బైజూస్ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకులనాథ్ తెలిపారు. ఉచిత విద్య అందించేందుకు బైజూస్ 128 స్వచ్చంద సంస్థలతో (ఎన్జీవోలు) భాగస్వామ్యం కుదుర్చుకోవడం గమనార్హం. -
అల్లరి పిల్లాడు..ఆరేళ్లలో లక్షా ఇరవై వేల కోట్లకు అధిపతి
అతనికి ఫిజక్స్లో ఫార్ములాలు అంటే ఇష్టం లెక్కలతో కుస్తీ పట్టడం సరదా. ఇష్టంగా మారిన ఆ సరదానే ఇప్పుడు ఇండియాలో దాదాపు ప్రతీ ఒక్కరికి అతనెవరో తెలిసేలా చేసింది. బంగారు భవిష్యత్తు కావాలనుకునే విద్యర్థులు ఓసారి అతన్ని ఫాలో అవాలనిపించేలా మార్చేసింది. అతని పేరంటే తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడింది. వెరసి నలుగు పదుల వయసు సమీపించగానే లక్షా ఇరవై కోట్ల కోట్ల సంపదను సృష్టించే స్థితికి చేరుకున్నాడు. అతనే రవీంద్రన్.. ఇలా చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టరు... పూర్తి పేరు బైజూస్ రవీంద్రన్. పుట్టింది కేరళా.. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాడు. బైజూస్ రవీంద్రన్ది కేరళలోని అళికోడ్ అనే చిన్న పట్టణం. అక్కడున్న ఓ ప్రైవేటు స్కూల్లో తల్లి లెక్కల టీచరుగా పని చేస్తే.. తండ్రి ఫిజిక్స్ పాఠాలు చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి రవీంద్రన్ హైపర్ యాక్టివ్. స్కూళ్లో చెప్పిన పాఠాలు ఇట్టే చదివేసి ఇళ్లంతా చిందరవందర చేసేవాడు. అతని ఎనర్జీని బర్న్ చేసేందుకు ఆటలవైపు మళ్లించారు తల్లిదండ్రులు. అటా చదువుతో పాటు క్రికెట్, టేబుల్ టెన్నీస్ ఆటల్లో మంచి ఛాంపియన్ అయ్యాడు రవీంద్రన్. ఇదే ఊపులో బిటెక్ కూడా పూర్తి చేసి ఓ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కంపెనీలో ఇంజనీరుగా చేరాడు. ఆ రిక్వెస్టే లేకుంటే పాతికేళ్లు నిండకుండానే విదేశాలు తిరిగే ఉద్యోగం. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతని క్లాస్మేట్స్ చేసిన చిన్న రిక్వెస్ట్ అతని జీవితాన్ని ఇంకో మలుపు తీసుకునేలా చేసింది. రవీంద్రన్తో పాటు బీటెక్ చదువుకున్న అతని ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. రవీంద్రన్ని లెక్కలు, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో సాయం చేయమన్నారు. సరేనన్నాడు రవీంద్రన్. ఎంట్రన్స్లో అద్భుతం ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. మరో వైపు ఎంట్రన్స్ పరీక్షలో స్నేహితులకు హెల్ప్ చేస్తుంటే ఓ చిలిపి ఆలోచన మెదిలింది రవీంద్ర మెదడులో. దాంతో సరదాగా 2007లో ఐఐఎం ఎంట్రన్స్ పరీక్షలకి అటెండ్ అయ్యడు. ఆ పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు ఎవరికీ సాధ్యం కాని విధంగా హండ్రెడ్ పర్సంటైల్ సాధించాడు. ఏదో లక్కీగా అలా జరిగి ఉంటుందని రెండోసారి పరీక్ష రాస్తే మళ్లీ హండ్రెడ పర్సంటైల్ వచ్చింది. ఎంతో మంది కలగనే ఆ మార్కులు సరదాగా పరీక్ష రాస్తేనే రవీంద్రన్కి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అతని సర్కిల్లో రవీంద్రన్ పేరు మార్మోగిపోయింది. కొచ్చి మీదుగా స్నేహితుల సూచనలు, తన మీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పది మంది విద్యార్థులతో ఐఐఎం కోచింగ్ సెంటర్ కోచిలో ప్రారంభించాడు. వారం తిరక్కుండానే పది మంది కాస్త వంద మంది అయ్యారు. ఏడాది గడిచే సరికి ఆ సంఖ్య వేయిని దాటి పోయింది. రవీంద్రన్ లెక్కలు, ఫిజిక్స్ పాఠాలు చెప్పే తీరు భిన్నంగా ఉండటం ఆ పాఠాలు విన్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తుండటంతో రవీంద్రన్ ప్రతిభ కొచ్చి దాటి ప్రకాశించింది. ఫ్రెండ్ ఇంట్లో చిన్న గదిలో మొదలైన కోచింగ్ ఆ తర్వాత టెర్రస్ మీదకి అక్కడి నుంచి ఆడిటోరియం అటుపై ఇండోర్ స్టేడియం వరకు జెట్ స్పీడ్తో సాగింది. ఒకేసారి 20 వేల మంది రవీంద్రన్ కోచింగ్ కావాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్తో బెంగళూరు మీదుగా ముంబై, పూనే, చెన్నైలకు విస్తరించింది. కోచింగ్ ప్రారంభించిన నాలుగేళ్లలోనే ప్లైట్స్లో తిరిగి పాఠాలు చేప్పే దశకు 2009లో రవీంద్రన్ చేరుకున్నాడు. ఒకేసారి 45 సిటీల్లో ఉన్న 20 వేల మంది విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పేంత బిజీ అయ్యాడు రవీంద్రన్. థింక్ అండ్ లెర్న్ మరోవైపు రవీంద్రన్ దగ్గర కోచింగ్ తీసుకుని ఐఐఎంలో చేరి బిజినెస్ పట్టా చేత పట్టుకున్న అతని ఫ్రెండ్స్ మళ్లీ వచ్చారు. ఒక్క ఐఐఎం, జీఆర్ఈలకే కాదు స్కూల్ విద్యార్థుల నుంచి కోచింగ్ మొదలు పెడదామంటూ జట్టు కట్టారు. అంతా కలిసి మరో అడుగు ముందుకు వేసి థింక్ అండ్ లెర్న్ పేరుతో స్కూల్ నుంచి పీజీ వరకు ఆన్లైన్ క్లాసులు అందివ్వాలని 2013లో నిర్ణయించుకున్నారు. బైజూస్ అప్పటికే ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం సామాన్యులకు చేరువయ్యింది. తర్వాత స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిపోతుండటం గమనించి బైజూస్ పేరుతో 2015 ఆగస్టులో మొబైల్యాప్ని అందుబాటులోకి తెచ్చారు. పగలు రాత్రి తేడా లేకుండా పాఠాలు రూపొందించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సమర్థంగా యాప్ను నిర్వహించారు. ఒక్క థియరీతోనే సరిపెట్టకుండా ప్రతీ సబ్జెక్టు సులభంగా అర్థం అయ్యలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అనతి కాలంలోనే 50 లక్షల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో 2.50 లక్షల మంది పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. పెట్టుబడుల వరద రవీంద్రన్ స్థాపించిన బైజూస్ ఎడ్టెక్ యాప్లో అందిస్తున్న కంటెంట్కి ఉన్న ఎఫెక్ట్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్తో పాటు బిజినెస్ మోడల్ గమనించిన ఆలిబాబా గ్రూపు టెన్సెంట్ మొదటిసారి బైజూస్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ వెంటనే మార్క్ జుకర్బర్గ్తో పాటు వెంచర్ క్యాపిటలిస్టు కంపెనీలు ఈ జాబితాలో చేరిపోయాయి. అంతే బైజూస్ నెక్ట్ లెవల్కి వెళ్లేందుకు సమయం వచ్చినట్టయ్యింది. డెకాకార్న్ పెట్టుబడుల ప్రవాహం రావడంతో బైజూస్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా షారూక్ఖాన్, మహేశ్బాబు వంటి స్టార్లు జతయ్యారు. ఇండియన్ క్రికెటర్ల జెర్సీలపై బైజూస్ తళుక్కుమంది. అంతే బైజూస్ యాప్ను మిలియన్ల కొద్ది స్టూడెంట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులకు బైజూస్ కంటెంట్ పట్ల నమ్మకం ఏర్పడింది. మార్కెట్కి కావాల్సింది కూడా అదే. దీంతో 2015లో స్థాపించిన బైజూస్ కంపెనీ మార్కెట్ విలువ 2021 డిసెంబరు నాటికి 16.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూనికార్న్ హోదాను ఉఫ్మనిపించి డెకాకార్న్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఇండియన్ కరెన్సీలో ఒక లక్షా ఇరవై వేల కోట్లకు పైమాటగానే ఉంది. నవ్విస్తూ.. నేర్పిస్తూ.. బైజైస్ రవీంద్రన్ పట్టిందల్లా బంగారం అయ్యిందంటే అతని దగ్గర ఏ మంత్రదండం లేదు. ఉన్నదల్లా పాఠాలను భిన్నంగా చెప్పే నేర్పు. క్లాసు రూములో టీచర్లు సీరియస్గా చెప్పే పాఠాలను రవీంద్రన్ నవ్విస్తూ నేర్పిస్తాడు (లాఫ్ అండ్ లెర్న్). మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో ఎవర్నో మెప్పించేందుకో కాకుండా.. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన మూల విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన పద్దతిలో నవ్వించే వివరణలతో ఆ పాఠాలు హాయిగా సాగిపోతాయి. ఈ చెవితో విన్నది ఆ చెవి గుండా బయటకు పోవడం కాకుండా బుర్రలో నిక్షిప్తమవుతాయి. అవే ఆ తర్వాత పరీక్షల్లో ఫలితాలుగా కనిపిస్తాయి. దివ్యమంత్రం జీఆర్ఈ ఎంట్రన్స్ కోచింగ్ కోసం దివ్య గోకుల్నాథ్ అనే విద్యార్థి రవీంద్రన్ దగ్గర టీచర్గా జాయిన్ అయ్యింది. మిగిలిన విద్యార్థులకంటే భిన్నంగా ప్రశ్నలు అడగడంతో రవీంద్రన్కి ఆమెపై అభిమానం ఏర్పడింది. అదే కోచింగ్ సెంటర్లో కింది తరగతులకి లెక్కల క్లాస్ తీసుకోమ్మని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఇద్దరీ ఫేవరేట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావడంతో.. ఓ రకంగా వాళ్లు గణితంలోనే మాట్లాడుకోవడం మొదలైంది. అలా లెక్కల చిక్కులతో వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బైజూస్లో రూపొందించే ఆన్లైన్ పాఠాల రూపకల్పనలో దివ్యది కీలక పాత్ర. బైజూస్కి ఆమె కోఫౌండర్గా ఉండటంతో పాటు ప్రస్తుతం డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. నాకు ఇదే ముఖ్యం లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్న బైజూస్ మార్కెట్ విలువపై రవీంద్రన్ స్పందిస్తూ.. ‘మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంది అనే దాని కంటే మేం చెప్పే పాఠాలు ఎంత సమర్థంగా ఉన్నాయి... అది వినేవాళ్లకు ఎంత బాగా అర్థం అవుతుంది.. అనే దానిపైనే తన దృష్టి ఉంటుంది. మిగిలినవన్నీ దాని తర్వాతే అన్నారు. ఇక మార్కులు, ర్యాంకులు సాధించడం తమ టార్గెట్ కాదని పాఠం పూర్తిగా అర్థం అవడమే తమ లక్ష్యమని ఎప్పుడు చెబుతుంటారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. ఇప్పుడు బిలియనీర్ -
అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ:ఎడ్టెక్ సంస్థ బైజూస్ తాజాగా అమెరికాలో పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు చేసుకుంటోంది. దీనికోసం స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ (ఎస్పీఏసీ) మార్గం ఎంచుకుంటోంది. చర్చిల్ క్యాపిటల్ సంస్థకు చెందిన ఎస్పీఏసీ భాగస్వామ్యంతో చేతులు కలుపుతోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవి తుది దశలో ఉన్నాయని, మరికొద్ది నెలల్లో డీల్ కుదరవచ్చని పేర్కొన్నాయి. చర్చలను బట్టి చూస్తే 48 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్తో బైజూస్ దాదాపు 4 బిలియన్ డాలర్లు సమీకరించే అవకాశం ఉందని వివరించాయి. అమెరికాలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ కోసం ఎస్పీఏసీ మార్గం ఎంచుకుంటూ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీని విలీనం చేసుకునే ఉద్దేశ్యంతో ఏర్పాటయ్యే వీటికి.. ప్రత్యేకంగా కార్యకలాపాలు అంటూ ఏమీ ఉండవు. ఇవి లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా ఉపయోగపడుతుంటాయి. విదేశీ ఎక్సే్చంజీల్లో భారతీయ సంస్థలు నేరుగా లిస్టయ్యేందుకు వీలు కల్పించేలా విధానాలను రూపొందించే ప్రక్రియ వేగవంతం చేయాలని స్విగ్గీస్, బైజూస్ తదితర స్టార్టప్ సంస్థలు కొన్నాళ్ల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీని కూడా విజ్ఞప్తి చేశాయి. బైజూస్లో జనరల్ అట్లాంటిక్, సెకోయా క్యాపిటల్, చాన్–జకర్బర్గ్ ఇనిషియేటివ్, నాస్పర్స్, సిల్వర్ లేక్, టైగర్ గ్లోబల్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. చదవండి: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు -
బైజూస్ గూటికి జియోజెబ్రా
న్యూఢిల్లీ: ఇటీవల ఇతర సంస్థలను చేజిక్కించుకోవడంలో వేగం చూపుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తు న్న జియోజెబ్రాను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువను బైజూస్ వెల్లడించలేదు. లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా 11.5 కోట్ల మంది విద్యా ర్ధులకు సేవలందిస్తున్న బైజూస్ తాజా కొనుగోలుతో ప్రస్తుత మాథమాటిక్స్ పోర్ట్ఫోలియోకు మరిన్ని అభ్యాసన విధానాలను జత చేసుకోనుంది. అంతేకాకుండా కొత్త ప్రొడక్టులను సైతం ప్ర వేశపెట్టనుంది. కాగా.. మాథమాటిక్స్ లెర్నిం గ్లో పటిష్ట ప్లాట్ఫామ్స్ కలిగిన జియోజెబ్రా ఇకపైన కూడా వ్యవస్థాపకుడు, డెవలపర్ మార్కస్ హోహెన్వార్టర్ ఆధ్వర్యంలో స్వతంత్ర యూనిట్గా కొనసాగనున్నట్లు బైజూస్ పేర్కొంది. -
షారుక్ బ్రాండ్ ఇమేజ్కి భారీ షాక్
ముంబై: ఐపీఓ బౌండ్ టెక్ దిగ్గజం బైజూస్ సంస్థ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్కి సంబంధించిన ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరోసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") అంతేకాదు ఆ అడ్వర్టైస్మెంట్లో స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలో ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు ఏవిధంగా చదువులో సాయం చేయాలి వంటివి వివరించే ప్రకటనలు కావడం విశేషం. ఒక బాధ్యత గల తండ్రి కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోవడం ఏమిటో అంటూ విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఎడ్టెక్ దిగ్గజం బైజు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పై వివరణ ఇవ్వడానికీ కూడా బైజు సంస్థ నిరాకరించింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్లు ఆర్యన్ చిన్నపిల్లవాడు అతనికి బైలు ఇవ్వాల్సిందే అంటూ ... షారుక్ మద్దతు ఇస్తున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల వ్యవహారం మాత్రం షారుక్ సినీ కెరియర్కి పెద్ద ఎదురు దెబ్బ. రాజకీయ నాయకులు ఒక్కసారిగా వారి పదవీ ఊడిపోతే వారికి అప్పటివరకు జరుగుతున్న రాజమర్యాదలన్ని ఏవిధంగా కనుమరుగైపోతాయో అలా ఈ సినీ స్టార్ల పరిస్థితి కూడా ఇంతేలా ఉంది. ఒక్క అనూహ్యమైన సంఘటనతో వాళ్ల స్టార్డమ్ కూడా ఏ మాత్రం పనిచేయదు అంటే అతిశయోక్తి కాదేమో. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
ఫోర్బ్స్ రిచెస్ట్ బిజినెస్ విమెన్ లిస్ట్.. దివ్య సంపద ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గుర్తుపెట్టుకో. నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ.. నీ టార్గెట్ పదో మైల్ అయితే.. పదకొండో మైల్పై గురిపెట్టు అంటాడు బిజినెస్ మ్యాన్ సినిమా హీరో. సరిగ్గా ఇదే థీరీని తన జీవితానికి అన్వయించుకుందీ యువ మహిళా పారిశ్రామిక వేత్త దివ్య గోకుల్ నాథ్. తన ధ్యేయం, లక్ష్య సాధన వైపు దివ్యమైన అడుగులు వేస్తూ సంపదలో రివ్వున దూసుకుపోయింది. ఫలితంగా దేశంలోనే 100 మంది మహిళా ధనవంతులైన ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది దివ్యగోకుల్నాథ్. ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్ సహ వ్యవస్థాపకురాలైన దివ్య గోకుల్నాథ్ కేవలం 35 ఏళ్ల వయసులో ఈ లిస్ట్లో ఆరుగురు దిగ్గజ మహిళా పారిశ్రామికవేత్తల సరసన దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో గోకుల్నాథ్ సంపద గత సంవత్సరంలో దాదాపు రూ. 7,477 కోట్లు పుంజుకుని ప్రస్తుతం ఏకంగా సుమారు రూ. 3.02 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా ధనవంతుల జాబితాలో 47వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి 71 ఏళ్ల సావిత్రీ జిందాల్, హ్యావెల్స్ ఇండియా అధినేత్రి 76 ఏళ్ల వినోద్ రాయ్ గుప్తా, యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత్రి లీనా తివారి, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్షా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అధినేత్రి మల్లికా శ్రీనివాసన్ లాంటి లెజెండ్స్తో పోటీపడ్డారు. దివ్య అంతకుముందు కూడా అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఉమెన్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2020 ఫెమినా పవర్ లిస్ట్. ఫోర్బ్స్ ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ , ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డుతోపాటు, 2021 మేకర్స్ ఇండియా కాన్ఫరెన్స్, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. 1987లో బెంగళూరులో బెంగళూరులో జన్మించింది దివ్య. తండ్రి అపోలో హాస్పిటల్స్లో నెఫ్రాలజిస్ట్, ఆమె తల్లి దూరదర్శన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్. ఏకైక సంతానమైన దివ్యకు చిన్నతనంనుంచే సైన్స్, గణితం శ్రద్ధగా నేర్పించారు. కష్టపడే తత్వాన్ని, లక్ష్యాల్ని సాధించే కమిట్మెంట్ను అమ్మానాన్నల నుంచి అలవర్చుకున్న దివ్య చదువులో బాగా రాణించింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి పైచదువులకు విదేశాలకు వెళ్లేందుకు 2007లో జీఆర్ఈ కోచింగ్ సందర్భంలో బైజూస్ రవీంద్రన్తో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే టీచింగ్ వృత్తిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్తో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఇద్దరుబిడ్డలకు జన్మనిచ్చింది. బోధనలో కొత్త పద్ధతులు అవలంబించాలనే కోరికతో 2011లో, దివ్య తన భర్తతో కలిసి బైజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్కు నాంది పలికింది. సింపుల్ లెర్నింగ్ టెక్నిక్స్తో విద్యార్థుల విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం బైజూస్లో ఏడున్నర కోట్లకుపైగా సబ్స్క్రైబర్లున్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. -
Shahrukh Khan: షారుక్ ఖాన్కి భారీ షాక్!
Aryan Khan Arrest In Drugs Case: కెరీర్ సంగతేమోగానీ.. వివాదాలు తారల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీస్తాయా? అంటే.. అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ను ఓ కూల్డ్రింక్ కంపెనీ, మరొక కంపెనీ బలవంతంగా అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో స్టార్ హీరో షారుక్ ఖాన్కి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్ఫామ్ బైజూస్కి గత కొన్నేళ్లుగా షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన యాడ్స్ సైతం బుల్లితెరపై కనిపిస్తుంటాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ని బైజూస్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ‘డ్రగ్స్ వ్యవహారంలో’ అరెస్టైన విషయం తెలిసిందే. ఓ క్రూయిజ్షిప్ పార్టీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు నిర్వహించడం.. అందులో ఆర్యన్ ఉండడం, అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, ఆపై అరెస్ట్ పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే పిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకానీ షారుక్.. ఓ మేధావి క్యారెక్టర్లో బైజూస్ యాడ్లో నటించడం, పేరెంట్స్కు పిల్లల విషయంలో పాఠాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం మింగుడు పడడం లేదని చాలామంది విమర్శిస్తున్నారు. దీంతో నిన్నంతా(ఆదివారం) బైజూస్ ట్యాగ్ ట్విటర్ టాప్లో ట్రెండ్ అయ్యింది. పిల్లల్ని సక్రమంగా పెంచలేని షారుక్ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బైజూస్ రంగంలోకి దిగినట్లు సమాచారం. షారుక్ను అంబాసిడర్గా తప్పించడంతో పాటు ఇప్పటికే తీసిన యాడ్లను సైతం టీవీల్లో టెలికాస్ట్ కాకుండా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఓ జాతీయ మీడియా ప్రముఖంగా కథనం ప్రచురించింది. మరోవైపు ఈ వ్యవహారం ప్రభావంతో మరికొన్ని బ్రాండ్లు సైతం షారుక్కి దూరమయ్యే అవకాశం ఉందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా సినిమాలతో సక్సెస్కి దూరమైన షారుక్.. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్కూ దూరమైతే కష్టమే మరి! చదవండి: నా కొడుకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి: షారుక్ వీడియో వైరల్ జయపై ట్రోలింగ్ ఇక గతంలో బాలీవుడ్పై డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. పార్లమెంట్ సాక్షిగా నటి జయా బచ్చన్, చిత్ర పరిశ్రమను వెనకేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జయను సైతం ఈ వ్యవహారంలోకి లాగి..‘‘Thali me ched wali’’ aunty పేరుతో ట్విటర్లో ఏకీపడేశారంతా. అసలు విషయం ఏంటంటే.. గతంలో నటుడు, లోక్సభ ఎంపీ రవికిషన్(రేసు గుర్రం ఫేమ్) గతంలో పార్లమెంట్లో మాట్లాడుతూ.. బాలీవుడ్లో డ్రగ్స్ సంస్కృతి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా రాజ్యసభలో మాట్లాడిన జయా బచ్చన్.. కొందరి ఆధారంగా మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆవేశంగా ప్రసగించారు. అయితే ఆర్యన్ అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో ‘ఇప్పుడేమంటావ్ జయా ఆంటీ?’ అంటూ జయా బచ్చన్ను నిలదీస్తున్నారు చాలామంది నెటిజన్స్. Reminds me this epic defence of drug abuse in Bollywoodpic.twitter.com/EcBiD07aLy — Rishi Bagree (@rishibagree) October 3, 2021 #AryanKhan #JayaBachchan No Shor from "Thali me ched wali "aunty pic.twitter.com/fisoYanHCb — Shruti (@kadak_chai_) October 3, 2021 -
అతని ఆలోచనలతో ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక వేత్తలే వెనుకడుగు..!
IIFL Wealth Hurun India 2021: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021గాను హరూన్ ఇండియా-ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక భారత సంపన్నుల నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2021లో భారత్లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది. ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెనకబడ్డారు..! ఇదిలా ఉండగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రముఖ స్టార్టప్ బైజూస్ రవీంద్రన్ రికార్డు సృష్టించాడు. రాకేశ్ జున్జున్వాలా, నందన్ నీలేకని, భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా ఇతర సంపన్నుల కంటే రవీంద్రన్ ముందునిలిచాడు. బైజూస్ రాకతో విద్యారంగంలో గణనీయమైన మార్పులకు ఒక్కింతా రవీంద్రన్ కారణమయ్యాడు అనడంలో సందేహమే లేదు. 2015లో స్థాపించిన బైజూస్కు ఇప్పటివరకు 40 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందులో 2.8 మిలియన్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్. బైజుస్ రవీంద్రన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ .24,300 కోట్లు. ఇది గత ఏడాది కంటే 19 శాతం ఎక్కువ. రాకేశ్ జున్జున్వాలా కుటుంబ సంపద విలువ రూ. 22,300 కోట్లు, ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద విలువ రూ. 22,000 కోట్లు, నందన్ నీలేకని కుటుంబ విలువ రూ. 20,900 కోట్లు, రాజన్ భారతి మిట్టల్ కుటుంబ ఆస్తుల విలువ రూ. 20,500 కోట్లు. ఈ ఏడాది బైజుస్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సింగపూర్ ఆధారిత డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం, గ్రేట్ లెర్నింగ్, కాలిఫోర్నియాకు చెందిన ఎపిక్ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ డీల్స్తో రవీంద్రన్ భారత్లో 67వ ధనవంతుడిగా నిలిచేందుకు సహాయ పడింది. ఈ ఏడాది పలు సంస్థలను కొనుగోలు చేయడానికే సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా బైజూస్ ఖర్చు చేసింది. ఐదేళ్ల వ్యవధిలో, రవీంద్రన్ 504 ర్యాంకులను అధిగమించాడు. స్టార్టప్స్ దూకుడు...! భారత్లో యూనికార్న్ స్టార్టప్స్ గణనీయమై సంపదును సృష్టిస్తున్నాయి. హురూన్ జాబితా ప్రకారం.. సంపన్నులు లిస్ట్లో 46 మంది యునికార్న్స్ స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు స్టార్టప్ విప్లవం భారత్లో ఊపందకుంది. పలు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతున్నారు. -
పిల్లలకు కోడింగ్ నైపుణ్యాలు, టింకర్ను కొనుగోలు చేయనున్న బైజూస్
ముంబై: ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్.. యూఎస్ కంపెనీ టింకర్ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు కోడింగ్ నైపుణ్యాలు అందించే ప్లాట్ఫామ్ టింకర్ను సొంతం చేసుకునేందుకు 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 740 కోట్లు) వెచ్చించవచ్చని అంచనా. గతేడాది(2020) ఆగస్ట్లోనూ కోడింగ్ కార్యకలాపాల సంస్థ.. వైట్హ్యాట్ జూనియర్ను 30 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో తాజాగా టింకర్ కొనుగోలుకి తెరతీసింది. తద్వారా కిండర్గార్టెన్(కేజీ) నుంచి 12వ తరగతి(గ్రేడ్)వరకూ బైజూస్ బిజినెస్ మరింత పటిష్టమయ్యేందుకు వీలుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే బైజూస్ యూఎస్కు చెందిన రెండు కంపెనీలను సొంతం చేసుకుంది. వీటిలో గేమింగ్ స్టార్టప్ ఓస్మో, ఆన్లైన్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ ఉన్నాయి. కాగా.. త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్న బైజూస్ ఈ ఏడాది ఆరు కంపెనీలను హస్తగత చేసుకున్న విషయం విదితమే. ఇందుకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 14,800 కోట్లు) వెచ్చించింది. కంపెనీ ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ 15 సంస్థలను కొనుగోలు చేసింది. ఇందుకు అనుగుణంగా 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు కంపెనీ సిద్ధపడుతోంది. తద్వారా బైజూస్ 21 బిలియన్ డాలర్ల విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ఇటీవల 16.5 బిలియన్ డాలర్ల విలువకు చేరిన పేటీమ్ను అధిగమిస్తూ దేశంలోనే అత్యంత విలువైన యూనికార్న్గా ఆవిర్భవించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
ఈ ఏడాది బైజూస్ ఆదాయం ఎంతో తెలుసా?
ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్గా మొదలైన బైజూస్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. బైజూస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రతీ అడుగు ఓ విశేషంగానే నిలిచింది. తాజాగా మరో సంచలన విషయం ప్రకటించారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్. వేల కోట్ల ఆదాయం ఈ ఏడాది బైజూస్ సంస్థ రెవిన్యూ రూ. 10,000 కోట్ల రూపాయలు ఉండవచ్చంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ పేర్కొని సంచలనం సృష్టించారు. ఎడ్యుటెక్కి సంబంధించి తాము అనేక కొత్త కంపెనీలను కొనుగోలు చేశామని, అవన్నీ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే రూ, 10,000 కోట్ల రెవిన్యూపై 20 నుంచి 23 శాతం మార్జిన్ ఉంటుందని చెప్పారు. దీంతో బైజూస్ సంస్థ ఆదాయం రూ. 2,000 కోట్ల నుంచి రూ. 2,3,00 కోట్ల మధ్యన ఉండవచ్చంటూ అంచనా వేశారు. బ్రాండ్ వాల్యూలోనూ రికార్డ్ కంపెనీ ఆదాయ వివరాలే కాదు బ్రాండ్ వాల్యూలో కూడా మిగిలిన కంపెనీలకు అందనంత జెట్ స్పీడ్తో బైజూస్ దూసుకుపోతుందని రవీంద్రన్ అంచనా వేశారు. రాబోయే రెండేళ్లలో అంటే 2023 నాటికి బైజూస్ సంస్థల బ్రాండ్ విలువ రూ. 30,000 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. చదవండి: భారత్పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు -
Mahesh Babu: మహేశ్... ఇట్స్ ఏ బ్రాండ్
సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్మేన్ సినిమాలో మహేశ్బాబు చెప్పిన డైలాగ్కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్బాబు చేసే యాక్టింగ్కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్లోని క్రేజ్తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్కి వెళ్లిపోయాడు మన మహేశ్. సాక్షి, వెబ్డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్గా మహేశ్బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్కి సలాం కొడుతున్నాయి. వాట్నాట్ కూల్డ్రింక్ యాడ్తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి. మహేశే ఎందుకు మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్ని ఒక్కడుతో మాస్ని, పోకిరితో యూత్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్గా మహేశ్ కనిపిస్తున్నారు. వేరియేషన్స్ వెండితెరపై కూల్ లుక్తో కనిపించే మహేశ్కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్లో జేమ్స్బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్యాడ్స్ అన్నీ సూపర్ యాక్షన్ సీక్వెన్స్లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది. రన్నింగ్ సిగ్నేచర్ సిల్వర్ స్త్రీన్పై మహేశ్బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు. లిస్టు పెద్దదే సోషల్ మీడియాలో టాలీవుడ్కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్కార్ట్, క్లోజ్అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్లో జిగేల్మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్మెంట్కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. -
నీరజ్ చోప్రాకు ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం సాధించిన భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ నేడు ₹2 కోట్ల నగదు రివార్డును ప్రకటించింది. ఒలింపిక్స్ గేమ్స్ లో దేశానికి కీర్తిని తెచ్చిన ఇతర ఆరుగురు పతక విజేతలకు ప్రతి ఒక్కరికి ఒక కోటి రూపాయలను ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రకటించింది. "క్రీడా విభాగాల్లో ఆటగాళ్లను ప్రోత్సహించడానికి మరింత ముందడుగు వేస్తూ.. నీరజ్ చోప్రాకు ₹2 కోట్లు, మీరాబాయి చాను, రవి కుమార్ దహియా, లోవ్లీనా బోర్గోనైన్, పివి సింధు, బజరంగ్ పునియాలకు 1 కోటి రూపాయలను" ప్రకటించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "దేశ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. మేము మా ఒలింపిక్ హీరోలతో కలిసి జరుపుకునే వేడుక సమయం ఇది, 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాదు ప్రతి రోజూ" అని వ్యవస్థాపకుడు మరియు సీఈఓ బైజు రవీంద్రన్ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఈవెంట్లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచారు. -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
బైజూస్ చేతికి సింగపూర్ సంస్థ
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్ను 600 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,466 కోట్లు) దక్కించుకుంది. ప్రొఫెషనల్, ఉన్నత విద్య సెగ్మెంట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రేట్ లెర్నింగ్లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,977 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. బైజూస్ ఇటీవలే అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం ఎపిక్ను 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,730 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. బైజూస్ గ్రూప్లో భాగంగా మారినప్పటికీ వ్యవస్థాపక సీఈవో మోహన్ లక్కంరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్, అర్జున్ నాయర్ల సారథ్యంలో గ్రేట్ లెర్నింగ్ ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనుంది. బైజూస్ టెక్నాలజీ, గ్రేట్ లెర్నింగ్ ప్రొఫెషనల్ కోర్సుల కంటెంట్ ఒక దగ్గరకు చేరేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా కొత్త సెగ్మెంట్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోగలమని బైజూస్ వ్యవస్థాపక, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. ఆన్లైన్లో ఉన్నత విద్యాభ్యాసం పెరిగే కొద్దీ అందుబాటు ధరల్లో అందరికీ విద్యను అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని మోహన్ పేర్కొన్నారు. బైజూస్.. గ్రేట్ లెర్నింగ్ ఇలా.. గ్రేట్ లెర్నింగ్ 2013లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 170 పైచిలుకు దేశాల్లో 15 లక్షల మంది పైగా విద్యార్థులకు కోర్సులు అందించింది. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి దిగ్గజ విద్యా సంస్థలకు చెందిన 2,800 పైగా పరిశ్రమ నిపుణులు ఇందులో మెంటార్లుగా ఉన్నారు. ప్రధానంగా సింగపూర్, అమెరికా, భారత్లో గ్రేట్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. -
గ్రేట్ లెర్నింగ్.. ఇకపై బైజూస్ ఆధ్వర్యంలో
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ యాప్గా పేరొందిన బైజూస్ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్ ఓరియెంటెండ్ సర్వీసెస్పై ఎక్కువగా ఫోకస్ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్, సర్టిఫికేట్ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్లెర్నింగ్ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది. బిలియన్ డాలర్లు ఉన్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్ లెర్నింగ్ను బైజూస్ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్ డాలర్లతో గ్రేట్ లెర్నింగ్ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడికి బైజూస్ సిద్ధమైంది. ఇండిపెండెంట్గానే బైజూస్ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్ లెర్నింగ్ యాప్ను ఇండిపెండెంట్గానే కొనసాగనుంది. బైజూస్ నేతృత్వంలో గ్రేట్ లెర్నింగ్ ఫౌండర్ మోహన్ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్, అర్జున్ నాయర్లు గ్రేట్ లెర్నింగ్ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్ లెర్నింగ్ను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్ లెర్నింగ్ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ యాప్కు 15 లక్షల మంది వినియోగదారులు 170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్లెర్నింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి. అవకాశాలు సృష్టిస్తాం గ్రేట్ లెర్నింగ్ను కొనుగోలు చేయడంపై బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు.