candidates list
-
ధనవంతులకు బీజేపీ.. నేరస్తులకు ఆప్.. టిక్కెట్ల లెక్కలివే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ నాల్గవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్లు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 699 మంది అభ్యర్థులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి.పార్టీల పరంగా చూస్తే నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టిక్కెట్లు కేటాయించింది. దీని తరువాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 132 మంది అభ్యర్థులు (19శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. 81 మంది అభ్యర్థులు (12శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో రూ. 3.2 కోట్లు ఉండగా, అది నుండి 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
ఢిల్లీ బీజేపీ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ తరఫున పర్వేష్ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది. ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gehlot) కిందటి ఏడాది నవంబర్లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో నజఫ్గఢ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి నెగ్గిన కైలాష్.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పదేళ్లపాటు షీలా దీక్షిత్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ.. కిందటి ఏడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఎలక్షన్స్లో ఈస్ట్ ఢిల్లీ గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా.. ఆలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక.. 2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో.. ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.दिल्ली बीजेपी ने विधानसभा चुनाव को लेकर 29 उम्मीदवारों की लिस्ट जारी की Delhi BJP | #BJP pic.twitter.com/nFVRcxASCV— News24 (@news24tvchannel) January 4, 2025 -
హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్పై పోటీ ఎవరంటే..
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. మంగళవారం 21 మంది అభ్యర్థులతో రెండో జాబితానువ విడుదల చేసింది. బరోడా నుంచి బరిలోకి ప్రదీప్ సంగ్వాన్ను బీజేపీ బరిలోకి దింపింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్పై కెప్టెన్ యోగేష్ బైరాగిని బీజేపీ పోటీకి నిలిపింది.Haryana elections | BJP releases its second list of 21 candidates. Pradeep Sangwan to contest from Baroda. pic.twitter.com/hisVZkD7Ix— ANI (@ANI) September 10, 2024కీలకమైన జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్కు పోటీగా కెప్టెన్ యోగేష్ బైరాగి పేరును బీజేపీ ప్రకటించగా.. ఆయన ప్రస్థానం గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ ప్రకారం.. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ హర్యానా స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ యోగేష్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక.. ఈ జాబితా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. గనౌర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మల్ రాణి స్థానంలో దేవేంద్ర కౌశిక్, రాయ్ ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణ గెహ్లావత్ స్థానంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీని బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కర్నాల్ నుంచి కాకుండా ఈసారి లాడ్వా సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపింది బీజేపీ.చదవండి: Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్కు ఆప్ అల్టిమేటం! -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
-
4th Phase Election: ఏపీ, తెలంగాణలో అభ్యర్థుల సంఖ్య..
సాక్షి, ఢిల్లీ: నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా.. బీహార్లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీజమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మందిజార్ఖండ్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీమధ్యప్రదేశ్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు 74 మంది పోటీమహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మందిఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మందిఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు బరిలో 130 మందివెస్ట్ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది. -
బీజేపీ మరో జాబితా: డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మరో జాబితా విడుదల చేసింది. మంగళవారం బీజేపీ 12వ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్ (బాబీ)ని బరిలో నిలిపింది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే. 12 జాబితాలోని అభ్యర్థులు వీరే.. సతారా(మహారాష్ట్ర)-ఉదయన్రాజే భోంస్లే, ఖదూర్ సాహిబ్ (పంజాబ్)-మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్పూర్ (పంజాబ్)- అనితా సోమ్ ప్రకాష్, బటిండా( పంజాబ్)- పరంపాల్ కౌర్ సిద్ధూ, ఐఏఎస్, ఫిరోజాబాద్, (ఉత్తరప్రదేశ్) ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా (ఉత్తరప్రదేశ్)-శశాంక్ మణి త్రిపాఠిని పోటీలో నిలిపింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 12वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/VdGHChERQa — BJP (@BJP4India) April 16, 2024 అదే విధంగా తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా డా. టీఎన్ వంశీ తిలక్ను బరిలోకి దించింది. भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने तेलंगाना एवं उत्तर प्रदेश में होने वाले आगामी विधानसभा उप-चुनाव 2024 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/LMFNNFueC0 — BJP (@BJP4India) April 16, 2024 21 మంది అభ్యర్థులతో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. The BJP Central Election Committee has decided on the following names for the ensuing elections to the Legislative Assembly of Odisha. Here is the second list. pic.twitter.com/nmuVozPOE2 — BJP (@BJP4India) April 16, 2024 -
కాంగ్రెస్ మరో జాబితా.. కన్హయ్య కుమార్ అక్కడి నుంచే..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనటంలో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రటించింది. పదిమంది అభ్యర్థులతో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్, అలహాబాద్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈశాన్య ఢిల్లీ సీటు నుంచి కన్హయ్య కుమార్ బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా 75 మందితో ఒడిస్సా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/jHaWDAlXKB — Congress (@INCIndia) April 14, 2024 The candidates selected by the Central Election Committee of Congress for the ensuing elections to the Legislative Assembly of Odisha 👇🏼 pic.twitter.com/V6RkjWAKdF — Congress (@INCIndia) April 14, 2024 -
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు లోక్సభ, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ మంగళవారం(ఏప్రిల్ 2) విడుదల చేసింది. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీశీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ లోక్సభ బరిలో ఉండనున్నారు. ఇక అసెంబ్లీ టికెట్లు పొందినవారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూరు, చింతలపూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగనున్నారు. ఇదీ చదవండి.. చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా -
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్కు పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్పూర్ నుంచి దినేష్సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్సింగ్ భార్య ప్రణీత్ కౌర్కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్మెషిన్ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
సీపీఎం మొదటి లిస్ట్ విడుదల
రానున్న లోక్సభ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో ఒకటీ రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు తమ అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు ఉన్నాయి. కేరళకు చెందిన 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో అలప్పుజా నుంచి సిట్టింగ్ ఎంపీ ఆరిఫ్, వడకర నుంచి మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ టీచర్, కాజీకోడ్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎలమరం కరీం ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని 17 పేర్లలో ముర్షిదాబాద్కు చెందిన మహ్మద్ సలీం పేరు కూడా ఉంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మధురై నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎస్ వెంకటేశన్, దిండిగల్ ఆర్ సచ్చిదానందంలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును, ఆంధ్ర ప్రదేశ్లోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును మొదటి జాబితాలో వెల్లడించింది. -
Lok Sabha: టీకాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్.. మూడు స్థానాలపై సస్పెన్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మిగిలి ఉన్న ఎనిమది లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియాగాంధీ, రాహుల్తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్కుమార్రెడ్డి, అలాగే సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు. ఇక, ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దఫాల్లో ఏఐసీసీ తొమ్మిది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎనిమిదింటిలో మూడు పార్లమెంట్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుండి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగెంధర్, రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక, భువనగిరి నుండి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. లేనిపక్షంలో బీసీ అభ్యర్థికి ఈ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి లోక్సభ స్థానానికి ఓయూ విద్యార్థి నేత కైలాష్ అప్లికేషన్ పెట్టుకున్నారు. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ముగ్గురిలో ఎవరు? నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మస్కత్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానంపై దమ్మాటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. మెదక్ రేసులో నీలం మధు ఉన్నారు. ఆదిలాబాద్ సీటు కోసం ఆదివాసీ, లంబాడ నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ 2.నాగర్కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, 3. మెదక్: వెంకట్రామిరెడ్డి, 4. మహబూబ్నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి, 5. కరీంనగర్: వినోద్ కుమార్, 6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, 7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్, 8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు, 9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 10.మహబూబాబాద్ : మాలోత్ కవిత, 11. మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి, 12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు, 13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, 14. వరంగల్ : కడియం కావ్య 15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 16. భువనగిరి - క్యామ మల్లేశ్ 17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి -
వలస పక్షులకే ఏపీ బీజేపీలో ఎంపీ సీట్లు
-
పవన్ కళ్యాణ్..మరీ ఇంత దుర్మార్గమా ?
-
బీజేపీ పల్లవి డెంపో.. గోవాలో నయా హిస్టరీ..
పనాజీ: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన కీలకంగా మారింది. ఇక, తాజాగా గోవాలో బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. 111 మందితో ఆదివారం జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బరిలోకి దింపింది. దీంతో, రాష్ట్రంలో బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఉన్నారు. ఇదిలా ఉండగా.. 1962 నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించిండం విశేషం. ఇక, పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కు అధిపతిగా కొనసాగుతున్నారు. #WATCH | Goa: BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections. On her candidature from South Goa, Pallavi Shrinivas Dempo says, "I am grateful to the BJP for this nomination and I accept this in deep humility... We will try our level best to win this… pic.twitter.com/7vDWZnecva — ANI (@ANI) March 24, 2024 -
మోసపోయిన బీజేపీ నేతలు...టీడీపీ నేతలకే ఎంపీ సీట్లు
-
111 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా
-
కంగనా రనౌత్, నవీన్ జిందాల్కు బీజేపీ టికెట్లు.. మరో 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ..పేర్లు ఖరారు ?
-
కాంగ్రెస్ 4వ జాబితా
-
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు..!
-
టీడీపీలో ఆగ్రహ జ్వాలలు
-
టీడీపీ 3వ జాబితా కనిపించని సీనియర్ నేతల పేర్లు...
-
టీడీపీ మూడో లిస్ట్ విడుదల
-
టీ కాంగ్రెస్ లో సీట్ల పంచాయతీ
-
టీ కాంగ్రెస్ రెండో జాబితాలో వలస నేతలకు ప్రాధాన్యం
-
సామాజిక న్యాయమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
-
అభ్యర్థుల ప్రకటన తరువాత రాష్ట్రవ్యాప్తంగా అంబరానంటిన సంబరాలు
-
శంఖం మోగింది.. యుద్ధం మొదలైంది..
-
శంఖం మోగింది.. యుద్ధం మొదలైంది..
-
నన్ను నమ్మి సీటు ఇచ్చిన సీఎం జగన్ కి మాటిస్తున్న..
-
సామాజిక న్యాయమే లక్ష్యంగా..సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎం జగన్
-
వైఎస్సార్సీపీ శ్రేణుల సంబరాలు...లోకేష్ Vs లావణ్య
-
మహిళలకే అగ్రతాంబూలం... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట
-
వైఎస్సార్సీపీ జాబితాలో BCలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట
-
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళే..
-
YSRCP Candidates List: అభ్యర్థుల జాబితా (జిల్లాల వారి లిస్ట్)
-
Watch Live: ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటన
-
YSRCP విశాఖ అభ్యర్థులు వీళ్లే
విశాఖపట్నం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
ఎవరికీ అన్యాయం జరగదు..వైఎస్సార్సీపీ ఫైనల్ లిస్ట్ పై సజ్జల క్లారిటీ
-
ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టేలా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పేర్లు..
-
వైఎస్సార్ ఘాట్ వద్ద..175 శాసనసభ, 25 లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
-
175 స్థానాల్లో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ
-
సింగిల్ షాట్ లో జగన్ లిస్ట్...175 మంది అభ్యర్థులు రెడీ
-
టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్...సీనియర్లకు షాక్
-
టీడీపీ రెండో జాబితా విడుదల.. పలువురికి షాక్
సాక్షి, గుంటూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక, రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు. రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్కు నిరాశ. మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్కు అవకాశం.. గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్కు కేటాయింపు. గాజువాకలో జనసేనకు నిరాశ. సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు. రెండో జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నేతలకు దక్కని చోటు టిక్కెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు పెనమలూరులో బోడేకు నో టికెట్ టిక్కెట్ లేదని చంద్రబాబు నుంచి ఫోన్ కొన్ని అనివార్య కారణాలతో సీటివ్వలేకపోతున్నామని చంద్రబాబు నుంచి ఫోన్ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో బోడే ప్రసాద్ , బోడే అనుచరులు చివరి ప్రయత్నంగా టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి టిక్కెట్ ఇవ్వాలని అడిగేందుకు సిద్ధమవుతున్న బోడే టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధప్రసాద్, దేవినేని ఉమా మైలవరం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా , వసంత కృష్ణప్రసాద్ , బొమ్మసాని సుబ్బారావు అవనిగడ్డ టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ సీటు టీడీపీకి కేటాయించకపోతే సహకరించమంటున్న టీడీపీ నాయకులు టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధ ప్రసాద్ -
వైఎస్సార్సీపీ ఫైనల్ లిస్ట్
-
BJP: అరుణాచల్ అభ్యర్థుల జాబితా విడుదల
లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొనడంతో కేంద్రంలోని అధికార బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేసేందుకు కాషాయ పార్టీ పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందుకెళ్తోంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 60 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో(ఎస్టీ) సీటు నుంచే మళ్లీ బరిలో దిగనున్నారు. అరుణాచల్ బీజేపీ చీఫ్ బియూరామ్ వాహ్గే పక్కే-కేసాంగ్ (ఎస్టీ) నుంచి,, ఉప ముఖ్యమంత్రి చౌనా మేన్ చౌకన్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిన పూర్తి జాబితాను పార్టీ తన ట్విటర్లో షేర్ చేసింది. -
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ
-
రెండో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు.. నేడు కీలక భేటీ
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్బంగా అభ్యర్థులకు ఖరారు చేయనున్నట్టు సమాచారం. కాగా, తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు సాయంత్రం ఆరు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక, మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
మహిళా అభ్యర్థి ఒక్కరేనా? కాంగ్రెస్ నాయకురాలి అసంతృప్తి
కేరళలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో తగినంత మహిళా ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత కూడా రానున్న లోక్సభ ఎన్నికలకు కేరళ నుంచి ఒక్క మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టడం పట్ల కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయాల్లో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిస్తున్నారని, కేరళలోని పార్టీ నేతలు ఆయన పిలుపును పట్టించుకోవాలని షామా మహమ్మద్ కోరారు. ''మీరు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. చివరిసారి (2019లో) ఇద్దరు మహిళా అభ్యర్థులు (కేరళ నుంచి) ఉన్నారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈసారి ఒక్కరే ఉండటం దురదృష్టకరం” అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు కేరళ నుంచి కాంగ్రెస్ ప్రకటించిన 16 మంది అభ్యర్థుల జాబితాలో అలత్తూర్ నియోజకవర్గ అభ్యర్థి రమ్య హరిదాస్ ఒక్కరే ఏకైక మహిళ. కాంగ్రెస్ ముఖ్య నేత, కేరళ మాజీ సీఎం కే కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్.. పార్టీ తనను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ బీజేపీలోకి ఫిరాయించిన క్రమంలో తాజాగా షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కె సుధాకరన్ కొట్టిపారేశారు. ఆమె ప్రకటనపై మీడియా సుధాకరన్ స్పందనను కోరగా వెళ్లి ఆమెనే అడగాలని, ఆమెకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు. -
హస్తం తొలి జాబితా విడుదల
-
నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన !
-
నేడు బీజేపీ కోర్ గ్రూప్ భేటీ.. ఏపీ అభ్యర్థులపై చర్చ!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక చేస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బీజేపీ హైకమాండ్ కోర్ గ్రూప్ సభ్యులు భేటీ కానున్నారు. వివరాల ప్రకారం.. నేడు బీజేపీ హైకమాండ్ గ్రూప్ భేటీ కానుంది. కోర్ గ్రూప్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంతోష్ జీ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా రెండో విడతలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ఎల్లుండి జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కోర్ గ్రూప్ అభ్యర్థులను జాబితా సిద్ధం చేయనుంది. ఇక, తొలి జాబితాలో భాగంగా బీజేపీ 194 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కోర్ గ్రూప్ భేటీలో సభ్యులు.. ఏపీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది. ఇక, ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున సభ్యులను ఎంపిక చేసి అధిష్టానానికి లిస్ట్ను పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, తదితరులు హైకమాండ్తో సమావేశం కానున్నారు. -
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేను: బీజేపీ ఎంపీ అభ్యర్థి
న్యూఢిల్లీ: బీజేపీ తొలి జాబితాలో పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన భోజ్పూరి నటుడు, గాయకుడు పవన్ కుమార్ సింగ్ తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ‘నాపై బీజేపీ అధినాయకత్వం పూర్తి నమ్మకంతో నాకు అసన్సోల్ నియోజకవర్గం సీటు కేటాయించింది. కానీ, నేను పోటీ చేయలేను. కొన్ని కారణాల వల్ల నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’ అని పవన్ కుమార్ సింగ్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ప్రకటించారు. भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व को दिल से आभार प्रकट करता हु। पार्टी ने मुझ पर विश्वास करके आसनसोल का उम्मीदवार घोषित किया लेकिन किसी कारण वश में आसनसोल से चुनाव नहीं लड़ पाऊंगा…@JPNadda — Pawan Singh (@PawanSingh909) March 3, 2024 బిహార్కు చెందిన పవన్ కుమార్ సింగ్ను బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దించటంపై పెద్ద ఎత్తున దుమారం రేపింది. బెంగాలీ మహిళలపై అభ్యంతరకరమైన పాటలను రూపొందించినట్లు ఆయనపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో పవన్కుమార్ అభ్యర్థిత్వం వల్ల అసన్సోల్ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని బీజేపీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అంతలోనే పవన్కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించటం గమనార్హం. బీజేపీ తొలి జాబితాలోనే పశ్చిమ బెంగాల్లో 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన 20 మందిలో అసన్సోల్ సెగ్మెంట్ నుంచి పవన్ కుమార్ సింగ్కు అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా.. పోటీ నుంచి పవన్ కుమార్ వైదొలుగుతున్నట్లు ప్రకటించటంపై బెంగాల్ బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. -
బీజేపీ మార్పు మంత్రం: 33 సిట్టింగ్ స్థానాల్లో కొత్త ముఖాలు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 గెలుపే లక్ష్యంగా నిన్న( శనివారం) 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి వీలుగా మొదటి జాబితాలో గతంలో పోల్చితే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే భిన్నమైన సమీకణలతో గెలుపు గుర్రాలకే మొదిటి జాబితాలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోని 195 అభ్యుర్థుల్లో 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టి కొత్త వారికి బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. అసోం అసోంలో 11 లోక్సభ సీట్లు ప్రకటించగా.. ఆరుగురు సిట్టింగ్లు కాగా మిగిలిన ఐదుగురు కొత్తవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజ్దీప్ రాయ్ గెలుపొందిన సిల్చార్ లోక్సభ నియోజకవర్గం నుంచి పరిమళ్ సుక్లబైధ్యను బీజేపీ పోటీకి దింపింది. అటానమస్ డిస్ట్రిక్ట్ (ఎస్టీ) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హోరెన్ సింగ్బే బదులు అమర్సింగ్ టిస్సోని బరితో దింపింది. గౌహతి లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాకు బదులు బిజులీ కలిత మేధి పోటీ చేయనున్నారు. ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ గెలిచిన తేజ్పూర్ లోక్సభ స్థానం నుంచి రంజిత్ దత్తాకు బీజేపీ అవకాశం ఇచ్చింది. దిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ రామేశ్వర్ తేలీని పక్కనబెట్టి కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ను బీజేపీ లోక్సభ బరిలోకి దించింది. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లోని 11 స్థానాలకు అభ్యర్థుల జాబితాలో నలుగురు ముఖాలకు బీజేపీ అవకాశం ఇచ్చింది. జంజ్గిర్ చంపా (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గుహరమ్ అజ్గల్లీకి బదులుగా కమలేష్ జంగ్డేను బరిలోకి దించింది. రాయ్పూర్ నుంచి సునీల్ కుమార్ సోని స్థానంలో సీనియర్ నేత బ్రిజ్మోహన్ అగర్వాల్ అవకాశం వచ్చింది. మహాసముంద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ చున్నీ లాల్ సాహుకు బదులుగా బీజేపీ అభ్యర్థి రూప్ కుమారి చౌదరి, సిట్టింగ్ ఎంపీ మోహన్ మాండవి స్థానంలో భోజ్రాజ్ నాగ్ని కాంకేర్ (ఎస్టీ) తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నునారు. ఢిల్లీ ఢిల్లీలోని ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పక్కనపెట్టది. రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ను పక్కన పెట్టి చందానీ చౌక్ లోక్సభ స్థానం నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్ బీజేపీ ప్రకటించింది. పశ్చిమ ఢిల్లీ స్థానానికి బీజేపీ రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ స్థానంలో కమల్జీత్ సెహ్రావత్కు అవకాశం ఇచ్చింది. ప్రస్తుత కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్కు బీజేపీ అవకాశం ఇచ్చింది. దక్షిణ ఢిల్లీ నుంచి రమేశ్ బిధూరిని పక్కనబెట్టి బీజేపీ ఆయన అభ్యర్థిగా రామ్వీర్ సింగ్ బిధూరిని ప్రకటించింది. గుజరాత్ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను పక్కన బెట్టిన బీజేపీ గుజరాత్లోని 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రభాత్భాయ్ సావాభాయ్ పటేల్కు బదులుగా రేఖాబెన్ హితేష్భాయ్ చౌదరిని బరిలోకి దించింది. అహ్మదాబాద్ వెస్ట్ (ఎస్సీ ) స్థానంలో మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన కిరీట్ సోలంకి బదులు.. దినేష్భాయ్ కిదర్భాయ్ మక్వానా అవకాశం ఇచ్చారు. రాజ్కోట్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపి మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందారియాను పక్కబెట్టి.. కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలాకు అవకాశం ఇచ్చింది. పోర్బందర్ నియోజకవర్గంలో ఎంపీ రమేశ్భాయ్ లావ్జీభాయ్ ధాదుక్కు బదులు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అవకాశం ఇచ్చింది. పంచమహల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రతన్సిన్హ్ మగన్సిన్హ్ రాథోడ్కు బదులు రాజ్పాల్సిన్హ్ మహేంద్రసింగ్ జాదవ్ బరిలోకి దింపింది. జార్ఖండ్ జార్ఖండ్లో ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా హజారీబాగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటాని శనివారం ప్రకటించారు. ఆ స్థానం మనీష్ జైస్వాల్ను పోటీకి దింపింది బీజేపీ. లోహర్దగా (ఎస్టీ) సీటులో మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన సుదర్శన్ భగత్ను పక్కనబెట్టి సమీర్ ఓరాన్ను ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితాలో.. ఏడుగురు సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది బీజేపీ. గ్వాలియర్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్కు బదులుగా భరత్ సింగ్ కుష్వాహను బరిలోకి దించింది. గుణ స్థానంలో సిట్టింగ్ ఎంపీ కృష్ణపాల్ సింగ్ యాదవ్ను తప్పించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అవకాశం ఇచ్చింది. రాజ్బహదూర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సాగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లతా వాంఖడే బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను అభ్యర్థిగా ప్రకటించేందుకు విదిశా స్థానంలో సిట్టింగ్ ఎంపీ రమాకాంత్ భార్గవను బీజేపీ పక్కనపెట్టింది. ఇక.. ప్రస్తుతం సాధ్వి ప్రజ్ఞా సింగ్కు చెందిన భోపాల్ స్థానం నుంచి అలోక్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ గుమన్సింగ్ దామోర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రత్లాం (ఎస్టీ) స్థానం నుంచి అనితా నగర్ సింగ్ చౌహాన్కు బీజేపీ అవకాశం ఇచ్చింది. -
195 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో 9 మంది అభ్యర్థులు ఖరారు...ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళే
-
BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే
ఢిల్లీ, సాక్షి: లోక్సభ ఎన్నికలు 2024 కోసం అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మొత్తం 195 స్థానాల్లో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీళ్లలో ముగ్గురు సిట్టింగ్లే ఉండగా.. ఓ సిట్టింగ్కు మొండిచేయి ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్లే పోటీ చేస్తారని తెలిపింది. అలాగే.. చేవెళ్ల నుంచి కొండావిశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, నాగర్కర్నూల్ నుంచి పీ.భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్కు అవకాశం ఇచ్చింది. ఇక హైదరాబాద్ నుంచి కొంపెల్ల మాధవీలతకు ఛాన్స్ ఇచ్చారు. హాట్ నియోజకవర్గం భావిస్తున్న మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక.. ఇటీవలె బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములుకి మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో పీ.భరత్కు అవకాశం ఇచ్చారు. ఇక తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో.. ఆదిలాబాదు, పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను బీజేపీ పెండింగ్లో ఉంచినట్లయ్యింది. సంబంధిత వార్త: టార్గెట్ 370.. బీజేపీ హాట్ ఫస్ట్ లిస్ట్ -
ఎన్నికల షెడ్యూల్ కు ముందే బీజేపీ లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
-
AAP: రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రకటన.. ఢిల్లీలో తొలిసారి ఇలా!
ఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆప్ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ మంగళవారం.. ఢిల్లీ, హర్యానాలో తమ పారటఈ నుంచి పోటీ చేసే లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మూడు సీట్లలో పోటీ చేయగా.. ఆప్ నలుగురు అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేసింది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతీకి న్యూఢిల్లీ లోక్సభ స్థానం, సహిరామ్ పెహల్వాన్ (దక్షిణ ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) మరియు కుల్దీప్ కుమార్ (తూర్పు ఢిల్లీ) సెగ్మెంట్లను ఆప్ ప్రకటించింది.పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో పోటికి దిగనుంది. ఇక.. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో ఆప్ లోక్ సభ అభ్యర్థి సుశీల్ గుప్తాను బరిలోకి దింపుతున్నట్లు పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తామని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ సీనియర్ నేత సందీప్ పాఠక్ వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక తీవ్రంగా కసరత్తు చేశామని, పలుసార్లు చర్చించి పార్టీ లెక్కల ప్రకారమే బరిలో నిలుపుతున్నామని ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ పేర్కొన్నారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆప్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జనరల్ స్థానం అయిన తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీ నిలుపుతున్నామని చెప్పారు. కుల్దీప్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లోక్సభ ఎన్నికల్లో జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని పోటీనికి నిలపటం ఢిల్లీ ఇదే తొలిసారి అని తెలిపారు. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆప్ మొదటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడేవారికే టికెట్లు ఇస్తూ వస్తోందని పేర్కొన్నారు. -
త్వరలో వందమంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా!
ఢిల్లీ: రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పలు వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమిలో విమర్శల స్థాయిని పెంచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పలు రాష్ట్రాల్లో పొత్తులో భాగం సీట్ల పంపకం విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తూ దూసుకుపోతోంది. అయితే బీజేపీ సైతం తమ అభ్యర్థులను త్వరలో ప్రటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే గురువారం బీజేపీ.. దాదాపు 100 మంది లోకసభ అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రటకటించనున్నట్లు సమాచారం. ఈ వందమంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీ అనతరం బీజేపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తుందని సమాచారం. అయితే అభ్యర్థుల మొదటి జాబితా బీజేపీకి కీలకం కానుంది. బీజేపీ ఈసారి 370 సీట్లు గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తంగా 400 సీట్లలో గెలుపొందాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్లోని వారణాసి సెగ్మెంట్ నుంచి పోటీ చేసి.. భారీ విజయాలను నమోదు చేసుకున్నారు. 2014లో 3.37 లక్షల మేజార్టీ, 2019లో 4.8 లక్షలకు భారీ మేజర్టీతో విజయం సాధించారు. ఇక..2019 సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్లో పోటీ చేసి గెలుపొందారు. గతంలో ఆ లోక్సభ స్థానంలో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే. అద్వానీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘నేను దేశంలో వస్తున్న మార్పును అంచనా వేయగలను. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుంది. బీజేపీ సైతం సొంతంగా కనీసం 370 సీట్లలో విజయం సాధిస్తుంది’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అదే కనుక జరిగితే జనసైనికులు పవన్ కళ్యాణ్ ని ఈడ్చి తన్నుతారు..
-
ఐదో జాబితా ఇన్ఛార్జ్లు వీరే..
-
తెలంగాణ ఎన్నికలు.. మన అభ్యర్థులు ఏం చదివారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈసారి ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మూడో వంతుపైగా పట్టభద్రులు ఉన్నారు. ఇక, డిగ్రీతో పాటు న్యాయవాద విద్యను అభ్యసించిన వారు ఎక్కువగా ఉండగా వైద్యులు, ఇంజనీర్లు కూడా పోటీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారూ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలే చదవుకోనివారు, పదో తరగతిలోపే చదివిన వారు కూడా ప్రధాన పార్టీల్లో ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇవే.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, ఇంటర్ పాసైన వారి సంఖ్య 330, చదువుకోనివారి సంఖ్య 89, ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117, డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143, డిప్లమా చదివిన వారి సంఖ్య 53, డాక్టరేట్ ఉన్న వారి సంఖ్య 32. -
తెలంగాణ బీజేపీ ఐదో లిస్ట్ లో గందరగోళం
-
నేడు బీజేపీ నాలుగో జాబితా విడుదల
-
నేడు టీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేసే అవకాశం
-
మూడో జాబితా విడుదలకు టీ కాంగ్రెస్ సిద్ధం
-
సీపీఎం తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదల
-
రేపు బీజేపీ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్
-
ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ. అక్టోబర్ 22వ తేదీన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే.. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది. ఫస్ట్ లిస్ట్ ►బెల్లంపల్లి- శ్రీదేవి ►సిర్పూర్ - పాల్వాయి హరీశ్బాబు ►గోషామహల్- రాజాసింగ్ ►దుబ్బాక-రఘునందన్రావు ►కరీంనగర్-బండి సంజయ్ ►ఆదిలాబాద్- పాయల్ శంకర్ ►బోథ్(ఎస్టీ) సోయం బాపూరావు ►నిర్మల్- ఏ.మహేశ్వర్రెడ్డి ►ముథోల్-రామారావు పటేల్ ►ఆర్మూర్- పైడి రాకేష్రెడ్డి ►జుక్కల్- టీ.అరుణతార ►కామారెడ్డి- కె.వెంకటరమణారావు ►నిజామాబాద్ అర్బన్- ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ►ఖానాపూర్- రమేష్ రాథోడ్ ►కోరుట్ల- ధర్మపురి అరవింద్ ►సిరిసిల్ల- రాణీ రుద్రమరెడ్డి ►చొప్పదండి-బొడిగె శోభ ►మానకొండూరు అరెపల్లి మోహన్ ►కుత్భల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్ ►సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు ►కల్వకుర్తి-ఆచారి ►మహేశ్వరం- శ్రీరాములు యాదవ్ ►వరంగల్ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్రావు ►వరంగల్ వెస్ట్-రావు పద్మ ►నిమాజాబాద్ అర్బన్- యెండల లక్ష్మీనారాయణ ►ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్ ►ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి ►కార్వన్-అమర్ సింగ్ ►చార్మినార్- మెఘారాణి ►చంద్రాయణ గుట్ట-సత్యనారాయణ ముదిరాజ్ ►యాకత్పురా-వీరేంద్రయాదవ్ ►బహుదూర్ పురా- వై.నరేష్కుమార్ ►కొల్లాపూర్- ఏ సుధాకర్రావు ►నాగార్జున సాగర్-కే.నివేదిత రెడ్డి ►సూర్యాపేట- సంగినేని వెంకటేశ్వరరావు ►భువనగిరి-గూడూరు నారాయణరెడ్డి ►తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య ►జనగాం- డా.ఏ దశ్మంతరెడ్డి ►స్టేషన్ ఘన్పూర్-డా. గుండె విజయరామారావు ►బాల్కొండ-ఆలేటి అన్నపూర్ణమ్మ ►జగిత్యాల- డా.బోగా శ్రావణి ►రామగుండం-కందుల సంధారాణి ►చొప్పదండి-బోడిగ శోభ ►నర్సాపూర్- ఎర్రగొల్ల మురళీయాదవ్ ►పటాన్చెరు-టీ.నందీశ్వర్గౌడ్ ►వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్ ►భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి ►ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్ నాయక్ ►భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు ►పాలకుర్తి- లేగ రామ్మోహన్రెడ్డి ►డోర్నకల్ (ఎస్టీ)- భుక్యా సంగీత ►మహబూబాబాద్ (ఎస్టీ)- జతోత్ హుస్సేన్ నాయక్ రెండో జాబితా మహబూబ్నగర్-ఏపీ మిథున్రెడ్డి -
కాంగ్రెస్ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితా ప్రకటన ఏమోగానీ.. పూటకో ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం ఉదయం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ఈ సాయంత్రమే అన్ని స్థానాలకు ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్. ఈ తరుణంలో మరో ప్రచారం వినవస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్.. హరీష్రావు సిద్దిపేట.. కేటీఆర్ సిరిసిల్లలోనే ఈ పోటీ ఉండనుందని తెలుస్తోంది. బరిలోకి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో పాటు సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ సీఈసీ.. అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 14 స్థానాల్ని మాత్రం పెండింగ్లో ఉంచింది. పెండింగ్ జాబితాలో ఖమ్మంలో ఇల్లందు.. పాలేరు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ.. తుంగతుర్తి.. సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్.. జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. మలివిడత జాబితా ఎప్పుడనేదానిపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశాం. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరింది. ఏ స్థానాలు ఇవ్వాలి అనేదానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది’’ అని తెలిపారాయన. -
ఫైనల్ స్టేజ్కు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఐదు స్థానాలపై టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, ఇప్పటికే మొదటి జాబితాలను విడుదల చేసిన హస్తం పార్టీ.. రెండో జాబితాపై తర్జనభర్జన పడుతోంది. అయితే, అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రెండో జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశముంది. ఇందులో భాగంగానే రేపు(శుక్రవారం) ఉదయం 9.30కు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఇక, తెలంగాణ కాంగ్రెస్లో ఐదు సీట్లలో హోరాహోరి పోటీ నెలకొంది. సంక్లిష్ట స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. కాగా, అభ్యర్థుల ఎంపిక ఒక నియోజకవర్గంతో మరో నియోజకవర్గం ముడిపడి ఉంది. హోరాహోరీ స్థానాలు ఇవే.. 1. బోథ్: డాక్టర్ నరేష్ జాదవ్ / రాథోడ్ బాపురావు 2. తుంగతుర్తి: అద్దంకి దయాకర్ / డాక్టర్ వడ్డేపల్లి రవి 3. మహేశ్వరం: కిచ్చేన గారి లక్ష్మారెడ్డి / పారిజాతా రెడ్డి 4. జడ్చర్ల: ఎర్ర శేఖర్ / అనిరుధ్ రెడ్డి 5. మక్తల్: శ్రీహరి / ప్రశాంత్ రెడ్డి. అయితే, మక్తల్ సీటు బీసీకి ఇస్తే జడ్చర్ల సీటు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, మక్తల్ నుంచి సీటు ఆశిస్తున్న శ్రీహరి ముదిరాజ్, జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్ ముదిరాజ్ టికెట్ ఆశిస్తున్నారు. తాండూరు టికెట్ మనోహర్ రెడ్డికి, మహేశ్వరం టికెట్ కేఎల్ఆర్కి వచ్చే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. -
బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో కనిపించని సీనియర్లు..సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ
-
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం
-
బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై సస్పెన్స్..!
-
తెలంగాణలో ఇంకా అధికారికంగా వెల్లడికాని బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ఇంకా ఇతర అప్డేట్స్