container
-
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను తీసుకువచ్చిన ‘ఎస్ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
కంటైనర్ టెర్మినల్ మూసేయలేదు
నెల్లూరు (పొగతోట): కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదని యాజమాన్యం చెబుతున్నా.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హడావుడి చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. శనివారం నెల్లూరులోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో కాకాణి మాట్లాడుతూ.. కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, అక్రమ టోల్గేట్లు పెట్టి సంపాదించుకుంటున్నారని విమర్శిస్తున్న సోమిరెడ్డి వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారారు. ఈ విషయంలో దమ్ముంటే విచారణ జరిపించాలని చాలెంజ్ చేశారు. అదానీని కలుస్తానని సోమిరెడ్డి చెప్పడం కలెక్షన్ల కోసమే అని ఆరోపించారు. సోమిరెడ్డికి కళ్లు కనిపించడం లేదని, కళ్లల్లో చుక్కల మందు వేసుకుని చూడాలని హితవు పలికారు. ‘ప్రస్తుతం సోమిరెడ్డి అధికారంలో ఉన్నారు. కంటైనర్ టెర్మినల్ విషయంలో ధైర్యం ఉంటే టోల్గేట్ ఎక్కడ పెట్టారో.. అక్రమంగా ఎవరు సంపాదిస్తున్నారో నిరూపించాలని.. లేదంటే అన్నీ మూసుకుని కూర్చోవాలి’ అని హితవు పలికారు. అ«ధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపైనే దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టులో యాష్ పాండ్తోపాటు లే అవుట్ల యజమానుల నుంచి వసూళ్లు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి సంపాదన కోసం సోమిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చెప్పారు.‘మీరు శిలఫలాకాలు, విగ్రహాలు, ఆస్తులను కూల్చామని విర్రవీగుతున్నారు. మీరు ఎక్కడ ఏవేవి కూల్చారో వాటిని మీతోనే వాటిని పునరి్నరి్మంచే రోజు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల కోసం తాము వాచ్మెన్ డ్యూటీ చేస్తామని కాకాణి అన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా ఉండి అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా వచ్చి కార్యకర్తల వెన్నంటే ఉంటామని, అండగా నిలుస్తామన్నారు. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. -
అది ప్యాంట్రీ కార్.. బే‘కార్’ రాతలేల రామోజీ
సాక్షి,అమరావతి/సాక్షి, నంద్యాల: 2024 మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించనున్నదన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు అందాయి. బయట సర్వేలే కాదు.. స్వయంగా ఈనాడు, ఈటీవీ కంట్రిబ్యూటర్లు నిర్వహించిన సర్వేలోనూ ఎంత తక్కువ అనుకున్నా వైఎస్సార్ సీపీ 150 సీట్లపై మాటే కైవసం చేసుకుంటుందని తేలడంతో ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. చంద్రబాబు కన్నా ముందే ఆయన భయంతో వణికిపోతున్నారు. ఉచ్ఛనీచాలు మరిచి కథనాలు రాస్తున్నారు. పైత్యం ఎక్కువై ఏమీ లేకున్నా.. అక్కడేదో ఉన్నట్లు, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఊహాగానాలతో అసత్యాలు అల్లుకుని యథేచ్ఛగా వార్తలు రాస్తున్నారు. ఇలాంటి పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది? అంటూ బుధవారం ఈనాడు కట్టుకథను అల్లింది. ప్యాంట్రీ కార్.. కంటెయినర్లా కనిపించిందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పే రుతో బస్సుయాత్రను బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు మూడు వారాల (21రోజులు)పాటు ప్రజలోనే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కోసం ఆహారాన్ని వండేందుకు ఏపీ 16 జడ్ 0363 నంబర్ గల ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనం మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామాన్లు తీసుకొచ్చింది. వాహనంలో వాటర్ బాటిళ్లు, వంటకు అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నాయి. ఈ వాహనం మంగళవారం తాడేపల్లి నుంచి బుధవారం ఉదయానికి వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలానికి చేరుకుంది. అక్కడే డీజిల్ కొట్టించుకుని సీఎం వైఎస్ జగన్ బస చేయనున్న ఆళ్లగడ్డకు మధ్యాహ్నానికి చేరుకుంది. చిన్నసైజులో ఉన్న ఈ ప్యాంట్రీ వాహనం ఈనాడుకు, రామోజీరావుకు ఓ పెద్ద కంటెయినర్గా కనిపించింది. అంతే ఈ కంటెయినర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏమి తెచ్చింది.. అంటూ నిస్సిగ్గుగా ఉన్మాదపు రాతలను ఆ పత్రిక అచ్చేసింది. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి ప్యాంట్రీ వాహనం విజువల్స్, ఫొటోలు తీసినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ఫొటోలు.. వీడియోలు తీయడం నిషిద్ధం. ఇది తెలిసినా ఈనాడు పత్రిక నిబంధనలు మీరి ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా అడ్డగోలు రాతలు రాసింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈనాడు, ఈటీవీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా, అధికారులెవరినీ వివరణ అడగకుండా బురద జల్లేలా రాసిన రాతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఒక వార్త రాసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం జర్నలిస్టు విధుల్లో ఓ భాగం. కానీ, ఈనాడు అత్యుత్సాహానికి పోయి ఊహలతో అబద్ధాలు ప్రచురించింది. దీంతో ప్యాంట్రీ వాహనంలో ఏముందో సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ ఫొటోలతో సహా బహిర్గతం చేసింది. దీంతో ఈనాడు పరువు పోయింది. ఇవేం రాతలంటూ ఆ పత్రికను ట్రోలర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. బెడిసికొట్టిన లోకేశ్ అతి టీడీపీ నేత నారా లోకేశ్కు తరచూ అభాసుపాలవ్వడం రివాజుగా మారింది. బుధవారమూ రొటీన్గా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ను ఎందుకు తనిఖీ చేయలేదు’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనికి ఈనాడు క్లిప్పింగ్ను జత చేశారు. అయితే వెంటనే స్పందించిన సోషల్ మీడియా లోకేశ్ను రీట్వీట్లతో ఓ ఆట ఆడుకుంది. వాహనంలో ఉన్న వస్తువులతోపాటు వాహన వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి చేద్దామనుకున్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. -
బకరాలైన లోకేష్, యెల్లో బ్యాచ్...
-
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రైఈస్ట్తో మిక్స్ చేసి బ్యాగ్ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది. 18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది. -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్ను ఢీకొట్టి కంటైనర్ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్ను ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్లు కంటెయినర్ను పరిశీలించి 13 బ్యాగ్లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!
..అవును, ఇళ్లు కదులుతాయి. ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలనో... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్ నిర్మించుకోవాలనో... ప్రతిచోటా ఆఫీస్ పెట్టడం కుదరడం లేదనో...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్ను తరలించే సదుపాయం ఉంటే బాగుండనో అనుకుంటారు. ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కంటైనర్ హోమ్లు. కొన్నిరోజులు లేదా నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తర్వాత ఉంటున్న ఇంటిని వేరే చోటుకు మార్చాలనుకునేవారికి కంటైనర్హోమ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్దగా నిర్మాణ వ్యయం లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని తయారుచేస్తున్నారు. దాంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఫాంహౌస్లు, కాఫీషాపులు, టీస్టాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. తయారీ ఇలా.. కంటైనర్ హోమ్ అనగానే ప్రధానంగా ఇవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి. ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా. పైకప్పు, ఫ్లోర్ తుప్పుపడతాయేమో..విద్యుదాఘాతం జరిగితే.. ఇలా అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరని తయారీదారులు సూచిస్తున్నారు. సౌకర్యాలు ఇలా.. గాల్వనైజింగ్ స్టీల్, ఎండీఎఫ్ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చినవారు టైల్స్ వేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా వాటర్ఫ్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు. టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్బోర్డులు, ఎల్ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే. విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్సర్క్యూట్కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్కు అనుసంధానిస్తున్నారు. పైన 50 ఎంఎం ఇన్సులేషన్ చేయడంతో షార్ట్సర్క్యూట్కి అవకాశం ఉండదు. నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ హోమ్లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్రూమ్, కిచెన్ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు. పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. ఖర్చు తక్కువ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
కంటైనర్ ఢీ.. యువ ఇంజనీర్ తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా అతి వేగంగా రాంగ్రూట్లో వచ్చి బైక్పై వెళ్తున్న కొస్మెట్టి అఖిలేష్ (29)ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మావల పోలీసు స్టేషన్ పరిధిలో ని బైపాస్ జాతీయ రహదారి 44 బట్టిసావర్గాం శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న అఖిలేష్ విధి నిర్వహణలో భాగంగా బోథ్ మండల కేంద్రానికి బైక్పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో బట్టిసావర్గాం శివారు ప్రాంతంలో కంటైనర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మావల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. తీరని శోకం.. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జైరామ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. జైరామ్ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. ఇవి చదవండి: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
ఎర్ర సముద్రంలో ఆగని హౌతీల దాడులు!
న్యూయార్క్: అమెరికా నేతృత్వంలో ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత కూడా ఎర్రసముద్రంలో తొలిసారి ఓ నౌకపై దాడి జరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మెర్స్క్ హాంగ్జౌ అనే వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. హాంగ్జౌ నౌక డెనార్క్కు చెందిన నౌక. అయితే.. దాడి జరిగినప్పటికీ ప్రయాణానికి ఇబ్బంది కలగలేదని అమెరికా తెలిపింది ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ పేరిట అమెరికా, ఫ్రాన్స్, యూకేల నౌకలు ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ను అమెరికా నేతృత్వంలో చేపట్టాయి. డెన్మార్క్ కూడా ఈ కూటమిలో చేరింది. ఈ గస్తీ తర్వాత కూడా ఓ నౌకపై దాడి జరగడం గమనార్హం. అయితే.. ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి శత్రువులకు చెందిన 17 డ్రోన్లను, నాలుగు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 1200 వాణిజ్య నౌకలను క్షేమంగా ఎర్ర సముద్రం దాటించామని అమెరికా నేవీకి చెందిన వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్జౌపై దాడి జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది. ఇదీ చదవండి: హౌతీ రెబెల్స్ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్ల ద్వారా రవాణా చేస్తున్నారు. తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది. అంతేకాకుండా, ఏపీ సెజ్కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
గ్లోబల్ టూరిజం హబ్గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ మినీ బస్సు ఓ కంటైనర్ను ఢీ కొట్టిన ఘటనలో 12 మంది మరణించారు. దాదాపు 23 మంది గాయాలపాలయ్యారు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ఘటన జరిగింది. 35 మందితో ప్రయాణిస్తున్న మినీ బస్సు సమృద్ధి ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి ప్రయాణిస్తుండగా ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో వైజపూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అదుపుతప్పి కంటైనర్ను వెనక భాగంలో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 5గురు పురుషులు, 6గురు మహిళలు కాగా ఓ మైనర్ బాలిక కూడా ఉంది. 23 మంది క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలిచారు. మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: భారత్కు చేరిన మూడో విమానం -
ఎయిర్పోర్ట్ నుంచే గోల్డ్ కంటెయినర్ ఎత్తుకెళ్లారు
అట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచే బంగారంతో కూడిన ఓ కంటెయినర్ను మాయం చేశారు దుండగులు. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులో 14.8 మిలియన్ డాలర్ల విలువైన బంగారంతో పాటు అదనంగా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కూడిన కంటెయినర్ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. కార్గో సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చోటుకి దీనిని తరలించారు. అక్కడి నుంచి దానిని గమ్యస్థానానికి భద్రంగా చేర్చాలని ఏర్పాట్లు చేయబోయారు. ఇంతలోనే అది మాయం అయ్యింది. ఈ కంటెయినర్ ఎవరికి చెందిందనే వివరాలను, ఎక్కడికి చేరుకోవాలనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికాలో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న భారీ దోపిడీ ఇది. అలాగే.. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని అభివర్ణిస్తున్నారు అక్కడి అధికారులు. ఐదున్నర స్క్వేర్ ఫీట్స్తో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ కంటెయినర్ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు పీల్ రీజినల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ దుయివెస్టెయిన్ ప్రకటించారు. ఇది లోకల్ గ్యాంగ్ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. అది ఇంకా కెనడాలోనే ఉందా? లేదా కంటెయినర్ను దేశం దాటించారా? అనే విషయంపైనా పోలీసులకు స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. గతంలోనూ కెనడా ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఘటనలే రెండు, మూడు జరిగాయి కూడా. -
AP: నేడు కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం.. ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్మించిన కంటైనర్ సబ్స్టేషన్ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్డ్ టెక్నాలజీ)తో అతి తక్కువ స్థలంలో ఈ సబ్స్టేషన్ను నిర్మించారు. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ కె.పద్మజనార్దనరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాసనగర్లో ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సబ్స్టేషన్ ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతమైంది. ఈ సబ్స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవున ఉంది. అందులోనే సబ్ స్టేషన్కు సంబంధించిన పరికరాలు అన్నింటినీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా ఈ కంటైనర్ సబ్స్టేషన్ను నిర్మించారు. దీని నుంచి ట్రాన్ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తారు. పూర్తి ఆటోమేషన్ విధానంలోనే ఈ కంటైనర్ సబ్ స్టేషన్ పనిచేస్తుంది. ఈ సబ్ స్టేషన్తో అర్బన్ ప్రాంతాల్లో బహుళ ప్రయోజనాలున్నాయి. ఎంతో ప్రయోజనకరం గొల్లపూడి ప్రజలకు ఈ కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం «శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిషత్తులో నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ కంటైనర్లో సబ్ స్టేషన్ను నిర్మించారు. మా ప్రాంత విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే స్పందించారు. కంటైనర్ సబ్స్టేషన్ నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – కారంపూడి సురేష్, మార్కెట్ యార్డు చెర్మన్ గొల్లపూడి నిర్వహణ వ్యయం తక్కువ కంటైనర్ సబ్స్టేషన్ల ద్వారా డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. దీని నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. – వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ప్రయోజనాలు ఇలా.. కంటైనర్ సబ్స్టేసన్లో సమస్య తలెత్తితే వెంటనే సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా సబ్స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చి సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉంది. సబ్స్టేషన్ లోపల ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలో అయినా సమస్య తలెత్తితే సబ్స్టేసన్లో తెలుసుకొనే వీలుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట రిమోట్ లోకేషన్ నుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. -
దైవదర్శనానికి వెళ్లొస్తూ..
కామారెడ్డి క్రైం: వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఓ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన రామారెడ్డి బైపాస్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన పుల్లూరి మహోదర్రావు (55), లక్కోడి మధుసూదన్రెడ్డి (58), ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎస్.శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణారావు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో రామారెడ్డి బైపాస్కు కొద్ది దూరంలో వీరి కారును.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న మహోదర్రావు, మధుసూదన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణారావు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పతికి తరలించారు. కంటైనర్తో డ్రైవర్ అక్కడ నుంచి పరారు కాగా.. తూప్రాన్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. మహోదర్రావు సీఎం కేసీఆర్ బావమరిది శ్రీనివాస్రావు సమీప బంధువని తెలిసింది. -
ప్రపంచంలోని టాప్ 10 బిజీయెస్ట్ కంటైనర్ పోర్ట్లు (ఫోటోలు)
-
కంటైనర్లో విద్యుత్ సబ్స్టేషన్
విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలంటే దాదాపు 20 సెంట్ల స్థలం అవసరం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో.. సబ్స్టేషన్ కాస్తా ఓ కంటైనర్లోనే ఇమిడిపోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. సబ్ స్టేషన్లు నిర్మించాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కంటైనర్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. స్థల భారం తప్పడంతోపాటు అనేక లాభాలుంటాయని విద్యుత్శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడలోని గొల్లపూడి వద్ద తొలి కంటైనర్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాధారణంగా నౌకల్లో సరుకుల్ని తరలించేందుకు కంటైనర్లను వినియోగిస్తుంటారు. ఇటీవల కాలంలో కంటైనర్ ఇళ్లు సైతం నిర్మిస్తున్నారు. తాజాగా కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) కంటైనర్ సబ్స్టేషన్ నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాస నగర్లో రూ.5.50 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం కాగా.. మార్చిలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సబ్స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవు ఉంది. అందులోనే సబ్స్టేషన్కు సంబంధించిన పరికరాలన్నీ అమర్చారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా దీనిని నిర్మించారు. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఇది∙పనిచేస్తుంది. తిరుపతి, విశాఖపట్నంలోనూ ఈ కంటైనర్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకతలు ఇవీ.. ► సాధారణ సబ్స్టేషన్కు 20 సెంట్ల స్థలం అవసరం. కంటైనర్ సబ్స్టేషన్కు 2నుంచి 3 సెంట్ల జాగా సరిపోతుంది. ► సాధారణ సబ్స్టేషన్కు మూడు నెలలకొకసారి నిర్వహణ తప్పనిసరి. కంటైనర్కు నిర్వహణ వ్యయం అవసరం లేదు. విద్యుత్ పంపిణీ సాధారణ సబ్స్టేషన్ కంటే మెరుగ్గా ఉంటుంది. ► అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు వీలుంటుంది. బ్రేక్ డౌన్స్ ఉండవు. ఓఎన్ఎం సిబ్బందికి పూర్తి రక్షణ ఉంటుంది. ► రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాల్లో సైతం వీటిని నిర్మించవచ్చు. అక్కడ అవసరం లేకపోతే మరో ప్రాంతానికి తరలించవచ్చు. ► వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిచోట శివారు ప్రాంతాల నుంచి కూడా కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. సమస్య తలెత్తితే.. సబ్స్టేసన్లో సమస్య తతెత్తితే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి పరిష్కరించే వెసులుబాటు ఉంది. లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయి సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలోనైనా సమస్య తలెత్తితే సబ్స్టేసన్లోనే ఉండి తెలుసుకునే వీలుంది. ఎంతో ప్రయోజనం కంటైనర్ సబ్స్టేషన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించాం. వీటివల్ల డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. జనావాసాల్లో స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. – జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ గొల్లపూడి ప్రాంతానికి వరం గొల్లపూడి ప్రాంత ప్రజలకు కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. నూతన గృహ, వాణిజ్య సముదాయాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్లో వాటికి నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకు రావడానికి కంటైనర్ సబ్స్టేషన్ నిర్మించారు. విద్యుత్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, ఉమ్మడి కృష్ణా జిల్లా -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు) -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం) -
హైవేపై మృత్యుఘోష.. నలుగురు దుర్మరణం
గుడిహత్నూర్(బోథ్): సమీప బంధువు అనారోగ్యానికి గురవడంతో పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ నగర్కు చెందిన సయ్యద్ రఫతుల్లా అహ్మద్ (56) పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. సమీప బంధువు అనారోగ్యానికి గురవడంతో ఆయనను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన ఇద్దరు కుమార్తెలు శబియా హష్మీ, జుబియా హష్మీ, తమ్ముని కొడుకు సయ్యద్ వజాహద్, డ్రైవర్ శంషోద్దీన్తో కలిసి ఆదిలాబాద్కు బయలుదేరారు. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మండలంలోని సీతాగోంది మూలమలుపు వద్దకు రాగానే వీరి కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారు.. ముందున్న కంటెయినర్ లారీ లోపలికి చొచ్చుకు పోయింది. వెనుకా ముందు లారీల మధ్యలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ శంషోద్దీన్ (50), శబియా హష్మీ (26), తమ్ముని కొడుకు సయ్యద్ వజాహద్ (17) అక్కడికక్కడే ప్రాణాలు వది లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు వచ్చి కారులో ఇరు క్కుపోయిన సయ్యద్ రఫతుల్లా అహ్మద్ (56), జుబియాను ఘటనా స్థలం నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి రఫతుల్లా అహ్మద్ చనిపోయారు. జుబియా హష్మీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృత దేహాలను బయటకు తీసేందుకు సుమారు 2 గంటల పాటు స్థానికులు, పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి కారణమైన లారీ కొద్ది దూరంలో బోల్తా కొట్టింది. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రమాద స్థలంలోనే మరో ప్రమాదం కాగా, ప్రమాద స్థలంలోనే సోమవారం ఉదయం వేగంగా వెళ్తున్న ఓ లారీడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. దీంతో కంటెయినర్ వెనుక ఉన్న మరో కంటెయినర్ సైతం ఢీకొట్టింది. ఇలా వరుసగా మూడు లారీలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో మధ్యలో ఉన్న లారీడ్రైవర్ ఎడమకాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. -
బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్కి సమీపంలోని సీతాకుంద్లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. -
బంగ్లాదేశ్ ఘోర అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చిన ప్లవర్వేజ్
ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన దగ్గర ఉన్నవాటి నుంచే అదృష్టం తలుపుతడుతుందని కూడా అనుకోం. ఒక్కోసారి చాలా వింతగా అనుకోను కూడా అనుకోని, ఊహించని సంఘటనలు ఎదరువుతుంటాయి. ఇలాంటి సంఘటనల కారణంగానే మన కళ్లముందు అప్పటి వరకు చాలా సాదాసీదాగా ఉన్నవాడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోతుంటాడు. అలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతోమందిని చూసుంటాం. కానీ ఇంట్లో వృద్ధాగా పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ఒక కుటుంబాన్ని కోటిశ్వరుణ్ణి చేసిందంటే నమ్మగలరా!.ఔను నిరుపయోగంగా ఒక మూలన పడి ఉన్న ప్లవర్ వేజ్ ఓ కుటుంబం తలరాతని మార్చేసింది. వివరాల్లోకెళ్తే...యూకేలోని మిడ్ల్యాండ్స్లో నివసిస్తున్న ఒక కుటుంబం 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేశారు. ఐతే వాళ్లు దాన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగా కొన్నేళ్లు ఉపయోగించారు. కాలక్రమేణ పగుళ్లు రావడంతో దాన్ని వంటగదిలో ఓ మూలన పెట్టేశారు. ఆ ప్లవర్ వేజ్ని వాడడం మానేసి చాలా ఏళ్లయ్యింది. ఐతే అనుకోకుండా ఒక రోజు వారింటికి వచ్చిన ఓ ఆర్కియాలజిస్ట్ దృష్టిలో ఆ ప్లవర్ వేజ్ పడింది. ఆయన ఆ ప్లవర్ వేజ్ జాడీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు. ఇది నీలిరంగులో ఉన్న వెండి, గోల్డ్తో తయారు చేయబడిన పాత్ర అని చెప్పాడు. ఇది 18వ శతాబ్దపు రాజు కియాన్లాంగ్ కాలంలో ఉపయోగించేవారని ఆ పాత్రపై ఉన్న ఆరు అక్షరాల ముద్ర ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ రాజరికపు ప్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని తెలుసుకుని ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై ఎనిమిది అమర చిహ్నాలు ఉన్నాయని, అవి దీర్ఘాయువును శ్రేయస్సును సూచిస్తుందని ఆ నిపుణుడు వివరించాడు. ప్రస్తుతం ఈ జాడి ధర రూ. 1 కోటి 44 లక్షల రూపాయల వరకు పలుకుతుందని కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక చైనా ధనవంతుడు ఆ ఫ్లవర్ వేజ్ జాడీని 1.2 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అంతేగాదు తమ వంశీయులు పోగొట్టుకున్న వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడతను. (చదవండి: బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ఆడాడు...ముచ్చెమటలు పట్టించేసిందిగా: వీడియో వైరల్) -
సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లుక్తో రైతు బజార్ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్ స్టోర్స్ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కంటైనర్ స్టోర్స్ను విస్తరిస్తామని చెప్పారు. -
రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు సోమవారం వెల్లడించారు. గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ నుంచి జిప్సమ్ పేరుతో వచ్చిన 17 కంటెయినర్లు ఉత్తరాఖండ్లోని ఓ సంస్థకు అందాల్సి ఉందని తెలిపారు. వాటిని తనిఖీ చేయగా 205.6 కిలోల బరువున్న రూ.1,439 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని చెప్పారు. ఉత్తరాఖండ్కు చెందిన సంస్థ యజమానిని ఎట్టకేలకు అనేక ప్రాంతాల్లో సోదాల అనంతరం పంజాబ్లోని ఓ కుగ్రామంలో పట్టుకున్నట్లు చెప్పారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్లో గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన సుమారు 3 టన్నుల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. పాక్ బోటులో రూ.280 కోట్ల హెరాయిన్ పాకిస్తాన్కు చెందిన పడవలో అక్రమంగా తరలిస్తున్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ కచ్ తీరంలో పట్టుబడింది. సోమవారం ఉదయం భారత ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అల్ హజ్ అనే పడవను తీరరక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలతో పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ పడవలోని వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని కనీసం ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం, పడవతోపాటు అందులో ఉన్న 56 కిలోల బరువున్న రూ.280 కోట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత డ్రగ్ చేరాల్సి ఉందని, కరాచీకి చెందిన ముస్తాఫా అనే స్మగ్లరే ఈ రాకెట్ వెనుక ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
‘మీ చెత్త మాకెందుకు?’.. దిమ్మతిరిగే షాక్
Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది. ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. (చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్!.మాది కాదంటున్న చైనా) -
వెలుగులోకి చైనా కుతంత్రాలు.. ఎక్కడి నుంచైనా దాడి చేసేలా
China Hiding Missiles in Shipping Containers Plans to Attack Anywhere in the World: నయానో, భయానో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా.. అందుకోసం ఎన్నో దుష్టపన్నాగాలను పన్నుతోంది. ఇప్పటికే హంకాంగ్ను ఆక్రమించేందుకు హాంకాంగ్ లా పేరిట కొత్త సెక్యూరిటీ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై హాంకాంగ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా చైనా దుష్ట పన్నాగం ఒకటి వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?) చైనా షిప్పింగ్ కంటైనర్లలో క్షిపణులని అక్రమంగా తరలిస్తోన్నట్లు సన్ పత్రిక వెల్లడించింది. ఈ మిస్సైల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఓడరేవులకు అక్రమంగా చేరవేస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. వీటిని ప్రయోగించేందుకు చైనా సిద్ధపడుతోన్నట్లు తెలిసింది. ‘ది సన్’ నివేదిక ప్రకారం, ప్రపంచ మహాసముద్రాలలో చైనాకు చెందిన భారీ నౌకలు ఉన్నాయి. కొంతమంది పాశ్చాత్య పరిశీలకులు చైనా ఈ విధంగా క్షిపణులను అక్రమ రవాణా చేయడం.. కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడంతో సమానమని భావిస్తున్నారు. ఈ కంటైనర్లు సాధారణ కంటైనర్ల వలె కనిపిస్తాయి, కాబట్టి వాటిని ఇతర కంటైనర్లతో కలిపి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. (చదవండి: దుబాయ్లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా) అదే సమయంలో, శత్రు దేశ నౌకాశ్రయాలకు ఈ క్షిపణులను చేరవేయడం ద్వారా చైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా ఆకస్మిక దాడిని ప్రారంభించగలదు. చైనా వద్ద స్టెల్త్ క్షిపణులు ఉండే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటజీ సెంటర్ రిక్ ఫిషర్ తెలిపింది. అమెరికా, చైనా ఇరు దేశాలు ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యంగా నిలవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇక తైవాన్ భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో చైనా పావులు కదుపుతుండగా.. డ్రాగన్ నుంచి తైవాన్ను కాపాడతామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో చైనా ఇలా కంటైనర్లలో మిస్సైల్స్ని రవాణా చేస్తుందనే వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) ఈ కొత్త క్షిపణుల నమూనా 2016 ఆర్మ్స్ ఫెయిర్లో కనిపించింది. అప్పటి నుంచి చైనా వీటిని ఎప్పుడైనా ప్రయోగించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన కోరిక మేరకు అరాచకాలను సృష్టించేందుకు కంటైనర్ క్షిపణులను పూర్తిగా ఉపయోగించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్ -
ఎవర్గివెన్ కన్నా పెద్ద నౌక!.. సూయజ్ దారి ఇస్తుందా?
ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్ కెనాల్లోకి ప్రపంచంలోనే అతి పెద్దదైన భారీ ఓడ ప్రవేశించబోతోంది. ఈ ఏడాది మార్చిలో సూయజ్ కెనాల్లో నిలిచిపోయిన ఎవర్ గివెన్ నౌకను మించిన ఓడ ఇది. ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల పాటు సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకుపోయి, నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఆ తర్వాత నౌక కింద ఇసుకను తవ్వి, అతి కష్టంమీద దానిని మళ్లీ సముద్ర మార్గంలోకి మళ్లించగలిగారు. ఈ నౌక నిలిచిపోయిన కారణంగా సముద్ర వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు వస్తున్న ఎవర్ ఏస్ నౌక అంతకంటే పెద్దది. ఎక్కువ కంటెయినర్లను మోసుకొని వస్తోంది. చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా? ప్రస్తుతం ఇది బ్రిటన్లోని సఫోల్క్లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్ నౌకాశ్రయంలో ఉంది. బుధవారం దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారీ కంటెయినర్ల లోడ్తో రాటర్డామ్కు చేరుకొనేందుకు ఎవర్ గివెన్ వెళ్లిన మార్గంలోనే సూయజ్ కెనాల్ గుండా వెళ్లనుంది. దీంతో అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఎవర్ గివెన్కంటే పెద్దదైన ఈ నౌక సూయజ్ కెనాల్ను దాటేంతవరకు ఉత్కంఠ తప్పదని వాణిజ్యవర్గాలు అంటున్నాయి. తైవాన్కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్ గ్రీన్ మెరైన్కు చెందిన ఈ నౌక ఎవర్గ్రీన్ ఎ క్లాస్లో కొత్త తరానికి చెందినది. ఎవర్ గివెన్కు 20,124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్ ఏస్ ఏకంగా 23,992 కంటెయినర్లను మోసుకెళ్లగలదు. ఇవే కాదు ఈ రెండింటి మధ్య ఇంకా చాలా తేడాలున్నాయి. రెండింటి పొడవు ఒకటే. వెడల్పు, లోతులో, సామర్ధ్యంలో ఎవర్ ఏస్ ఎక్కువ. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?
Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్ గీవెన్ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్ నుంచి ఎవర్ గీవెన్ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. సూయజ్లో ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్ గీవెన్ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మూడు నెలల తర్వాత సూయజ్ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్గీవెన్ నౌకను సూయజ్ కెనాల్ అథారిటీ సీజ్ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్ బ్లాక్ అయినందుకు గాను 916 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్ కెనాల్ అథారిటీ, ఎవర్గీవెన్ నౌక యాజమాన్యమైన షోయ్ కిసెన్ ఖైషా, ఇన్సురెన్స్ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్గీవెన్ నౌకను జులై 7న రిలీజ్ చేశారు. సూయజ్ టూ ఇంగ్లండ్ సూయజ్ కెనాల్ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్లోని రోటర్డ్యామ్కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్లోని ఫెలిక్స్టోవ్ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆగస్టు 20న ఇంగ్లండ్ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్ గీవెన్ ఆగస్టు 20న మరోసారి సూయజ్ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్ కెనాల్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్గీవెన్కు తోడుగా రెండు టగ్ బోట్లను కూడా పంపింది. ఎవర్గీవెన్తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది. 22వ సారి ఎవర్గీవెన్ నౌకను తైవాన్కు చెందిన తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ షిప్టింగ్ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్గీవెన్పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్ కాలువను దాటింది. -
దుబాయ్లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా
అబుదాబి: దుబాయ్లో బుధవారం అర్థరాత్రి దాటాకా భారీ పేలుడు సంభవించింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా భారీ శబ్ధాలతో హడలెత్తినపోయారంటే పేలుడు తీవ్రత ఏం రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. #ÚLTIMAHORA Se produjo una gran explosión en el puerto de Dubai, Emiratos Árabes. Aún desconocen las causas. pic.twitter.com/OxROQzvTmP — EL IMPARCIAL (@elimparcialcom) July 7, 2021 #BREAKING: Another Video: - Huge Damage - Major explosion and fire at Jebel Ali Port, Dubai, UAE. Reports it was on an oil tanker. #BREAKINGNEWS #UAE #Dubai #SaudiArabia #MiddleEast #Israel #Iran #Iraq pic.twitter.com/W34gXzGfh5 — International Leaks (@Internl_Leaks) July 7, 2021 -
కంటైనర్లో రూ.36 కోట్ల బంగారం..
సాక్షి, చెన్నై: ఎన్నికల తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సేలం సమీపంలో ఓ కంటైనర్లో రూ.36 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా విస్తృత తనిఖీలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి సేలం వైపుగా వచ్చిన ఓ మినీ కంటైనర్ను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.36.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సరైన రసీదులు లేని దృష్ట్యా, ఆ మినీ కంటైనర్ను భద్రత నడుమ గంగవళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. గిండి నుంచి సేలంలోని నగల షోరూమ్కు ఆభరణాలు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరి సొమ్మో.. తంజావూరులోని నగరాభివృద్ధి శాఖకు చెందిన ఓ అధికారి లాకర్లో రూ.3.39 కోట్ల నగదు, రూ. 174 సవర్ల నగలు ఉన్నట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి ఏసీబీ వర్గాలు ఆ లాకర్ను తెరిచి చూడగా, నగదు, నగలు బయటపడ్డాయి. చెన్నై తిరుప్పోరూర్– కేలంబాక్కం మార్గంలో ఓ వాహనంలో రూ. 24 లక్షలు అధికారులు పట్టుకున్నారు. అది ఏటీఎంకు తరలిస్తున్న నగదుగా వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. కోవిల్ పట్టిలో మంత్రి కడంబూరురాజు వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. స్వతంత్ర అభ్యర్థులా మజాకా.. చెన్నై తిరువొత్తియూరు నుంచి హైకోర్టు న్యాయవాది జాకీర్హుస్సేన్ (47) స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగల డిపాజిట్కు సంబంధించి ధర్నా చేసి ఎన్నికల అధికారి దేవేంద్రన్కు ఆయన ముచ్చెమటలు పట్టించారు. విల్లివాక్కంలో స్వతంత్ర అభ్యర్థి కంద స్వామి రూ. పది వేల నగదుకుగాను 18 కేజీల చిల్లరను అధికారులకు సమర్పించి ముచ్చెమటలు పట్టించడం గమనార్హం. -
‘ప్రపంచంలోనే మొదటి విద్యుద్దీకరణ టన్నెల్ ఇది’
సాక్షి, న్యూఢిల్లీ: పూర్తిగా కరెంటు సదుపాయం ఉన్న డబుల్ స్టాక్ కంటైనర్లను తీసుకెళ్లేందుకు వీలున్న ఏకైక విద్యుద్దీకరణ టన్నెల్ను భారత రైల్యే నిర్మిస్తోంది. ఇలాంటి భారీ టన్నెల్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ లేదు. దీన్ని హరియాణాలోని సోన్హా అరావళి పర్వత శ్రేణుల్లో నిర్మిస్తోంది. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్గా పిలిచే ఈ ప్రత్యేక సొరంగం నిర్మాణ పనులను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేపట్టింది. ఇప్పటి వరకు కిలోమీటర్ వరకు కావింగ్ పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్) ఓ ఇంగ్లీష్ ఛానెల్ ప్రకారం.. డబుల్ స్టాక్ కంటైనర్లు వెళ్లడానికి అనువుగా ఉండే ప్రపంచ మొట్టమొదటి సొరంగం ఇదే. ఈ సోరంగం ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరలేదని నిపుణులు తెలిపారు. ఎందుకంటే ఇది 250 కోట్ల నుంచి 50 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ప్రోటిరోజోయిక్ రాళ్లతో నిర్మించారు. ఈ రాళ్లు ఎంత బలమైన వస్తువునైనా మోసే సామర్థ్యం ఉన్నవని నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా సింగిల్ కంటైనర్లను మాత్రమే సొరంగాల్లో తీసుకెళ్తారు. కానీ ఈ భారీ సోరంగ మార్గం గుండా డబుల్ కంటైనర్లను, ఒక కంటైనర్పై మరో కంటైనర్ ఉంచి తీసుకెళ్లవచ్చు. కంటైనర్ ఎంత బరువు ఉన్నప్పటికి ఈ సొరంగం చెక్కు చెదరదని నిపుణులు అభిప్రాయపడినట్లు రైల్యే అధికారులు వెల్లడించారు. -
వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కొత్త హంగులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఎగుమతుల వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యకలాపాలను విస్తృతం చేయాలని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లూ ఎగుమతుల వాణిజ్యంపై ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తల కోసం ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించిన టీఎస్టీపీసీ మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారిస్తోంది. కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్లు, ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు, వేర్ హౌజ్లు తదితరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ట్రక్ పార్కింగ్ టెర్మినళ్లు, ట్రేడ్ ఫెయిర్, ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లను నిర్మించేందుకు టీఎస్టీపీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.13 కోట్లతో కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్ హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ఎగుమతులు, దిగుమతుల కోసం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మామిడిపల్లి వద్ద కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్ను నిర్మించారు. రూ.13 కోట్లతో 7.10 ఎకరాల్లో నిర్మించిన ఈ ఫ్రైట్ స్టేషన్ నిర్వహణ కోసం ఓపెన్ టెండర్ విధానంలో ఏజెన్సీని ఎంపిక చేయాల్సి ఉంది. వరంగల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో ట్రేడ్ ఫెయిర్ కాంప్లెక్సు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, భూ కేటాయింపు ప్రతిపాదన కలెక్టర్ వద్ద పెండింగులో ఉంది. 150 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు 150 ఎకరాల్లో నాలుగు భారీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు బాధ్యతను నాలుగు ప్రైవేటు సంస్థలకు టీఎస్టీపీసీ అప్పగించింది. జీఎంఆర్, ఎంబసీ, హెచ్డీఎంఏ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ లాజిస్టిక్ సంస్థల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇదిలాఉంటే హైదరాబాద్లో ట్రేడ్ సెంటర్, వరంగల్లో ట్రేడ్ ఫేర్ కాంప్లెక్సు, ప్యాక్ హౌజ్లు, పీక్యూ ల్యాబ్లు, వేపర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తదితర ప్రాజెక్టుల సవివర నివేదికలు (డీపీఆర్) రూపొందించే బాధ్యతను గ్రాంట్ థార్న్టన్ కన్సల్టెన్సీకి టీఎస్టీపీసీ అప్పగించింది. వాణిజ్య ఎగుమతులు ప్రోత్సహించేందుకు టీఎస్టీపీసీ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా అమలయ్యేలా చూస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
కంటైనర్లలోనే వారి కాపురాలు
సాక్షి, పెనుకొండ : ఈ భవనం కియా కార్ల పరిశ్రమ సమీపంలోని ఎర్రమంచి రహదారిలో కంటైనర్లతో నిర్మించారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన దీని పేరు ‘విదమ్ హాస్పెటాలిటీ’ పేరుతో కొరియన్లకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. బేగ్ అనే కొరియన్ దీనిని నిర్వహిస్తున్నాడు. కంటైనర్లలో భవంతులు నిర్మించి నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనేక మంది నిర్వహిస్తున్నారు. పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లవుతోంది. ఇందులో పని చేయడానికి వందలాది మంది కొరియన్లు వారి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పలువురు కొరియన్లు సమీపంలోని భవనాల్లో బాడుగలకు ఉంటున్నారు. మరి కొందరు కంటైనర్ బాక్సులతో రూపొందించిన భవనాల్లో నివసిస్తున్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు. భద్రత డొల్ల.. కంటైనర్లలో కాపురం ఉండడం అంత శ్రేయస్కరం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఏ మాత్రం షార్ట్సర్క్యూట్ జరిగినా, ఏ ఇతర ప్రమాద సమయాల్లోనైనా ప్రాణాపాయం తప్పదని అభిప్రాయపడుతున్నారు. 2017లో కంటైనర్లో నివాసం ఉంటున్న తాడిపత్రికి చెందిన ఇద్దరు బేల్దార్లు పొగ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కంటైనర్ కాపురాలు మరిన్ని పెరగడం ఆందోళన రేపుతోంది. అనుమతులు ప్రశ్నార్థకమే? ఒక భవనం నిర్మించాలంటే గ్రామ పంచాయతీ లేదా అహుడా అనుమతి ఉండాలి. అయితే కంటైనర్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా దీనిని ప్రశి్నంచకపోవడంతో నిర్మాణాలు మరింత జోరందుకుంటున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడం వల్లే వీటి నిర్మాణాలు అధికమవుతున్నాయనే విమర్శలుమున్నాయి. ఇప్పటికే ఎర్రమంచి, హరిపురం, అమ్మవారుపల్లి, దుద్దేబండ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. కియా, ఏపీఐఐసీ అతిథి గృహాలు సైతం కంటైనర్లతో నిరి్మంచడం గమనార్హం. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇలాంటి నిర్మాణాలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్లు, గెస్ట్హౌస్లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
కంటైనర్ టెర్మినల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విమాన్నగర్లోని కంటైనర్ టెర్మినల్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు కంటైనర్లు, ఓ భారీ క్రేన్ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 3.5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్విందర్ యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విమాన్నగర్లోని టెర్మినల్లో కంటైనర్లను ఒకదానిపై మరొకటిని క్రేన్ సహాయంతో పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ కంటైనర్ను మరోదానిపై పెడుతుండగా క్రేన్లో ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. గమనించిన క్రేన్ డ్రైవర్ వెంటనే కిందకి దిగి పారిపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. క్రేన్కు ముందు ఉన్న టైర్లకు మంటలు అంటుకుని, కంటైనర్లకు కూడా వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. వెంటనే మర్రిపాలెం, స్టీల్ ప్లాంట్, పోర్టు, ఆటోనగర్లోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఐదు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. అయితే క్రేన్కు ఉన్న హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ 3.5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లందని సీజీఎం ఎల్విందర్ తెలిపారు. దగ్ధమైన క్రేన్ ధర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే ప్రథమమని చెప్పారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు కంటైనర్ టెర్మినల్ వద్ద గుమిగూడారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిపైకి కంటెయినర్ లారీ దూసుకువచ్చింది. ఆగి ఉన్న మరో కంటెయినర్ లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నాగాలాండ్కు చెందిన దానేశ్వర్ దాస్, అస్సాం రాష్ట్రానికి చెందిన ఉతోపన్ పెగు, బాబు బోరి, బిష్వజిత్ పెగు బతుకుదెరువు కోసం జిల్లాలోని ఇస్నాపూర్కు వచ్చి స్థానిక మహేశ్వర్ ఆసుపత్రి సమీపంలో ఉంటూ హిండ్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దానేశ్వర్ దాస్, ఉతోపన్ పెగు, బాబు బోరి, బిష్వజిత్లు వారి స్నేహితుడైన అస్సాం కు చెందిన మంజన్ పెగుతో కలసి కిరాణా సామాను తీసుకోవడానికి ఇస్నాపూర్ చౌరస్తాకు నడుచుకుం టూ వస్తున్నారు. వారు ప్రముఖ్నగర్ కాలనీ సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్ పక్క నుంచి వెళుతుండగా అదే సమయంలో వెనకాల నుంచి దూసుకువచ్చిన మరో కంటెయినర్ లారీ వీరిని ఢీకొట్టింది. అదే వేగంలో పక్కనే ఆగి ఉన్న కంటెయినర్ లారీని కూడా ఢీకొంది. దీంతో కంటెయినర్ డ్రైవర్ వెంకటేశ్కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఢీకొన్న కంటెయినర్ క్లీనర్ గోవింద్ మానేకు కూడా తీవ్ర గాయాలయ్యా యి. దానేశ్వర్ దాస్(19), ఉతోపన్ పెగు (25) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో డ్రైవర్ వెంకటేశ్, క్లీనర్ గోవింద్ మానే, మంజన్ పెగును చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బాబు బోరి, బిష్వజిత్లను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా, ప్రథమ చికిత్స చేసి వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దానేశ్వర్ దాస్, ఉతోపన్ పెగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బస్సును ఢీకొన్న కంటైనర్,ఆరుగురు మృతి
-
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఇక కంటైనర్ చెక్పోస్టులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని వివిధ ప్రాంతా లకు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రాంతాల్లో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏటా పది వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. డిసెంబర్ నాటికి గంజాయి సాగు పూర్తవుతుంది. జనవరి నుంచి గంజాయి రవాణా ఊపందుకుంటుంది. దీంతో స్మగ్లర్లు గంజాయి రవా ణాకు ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఎక్సైజ్, పోలీసుల కళ్లుగప్పి స్మగ్లర్లు గంజా యిని వివిధ వాహనాలు, రైళ్లలో ఇతర ప్రాంతా లు, రాష్ట్రాలకు తరలించుకుపోతూనే ఉన్నారు. గంజాయి సాగు సీజను ముగిశాక స్మగ్లర్లు వాటి రవాణాపైనే దృష్టి సారిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తున్నారు. తొలుత విశాఖ జిల్లాలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇందుకు స్థలం సమస్య అడ్డంకిగా మారింది. కొన్నిచోట్ల రెవెన్యూ, మరికొన్ని చోట్ల అటవీ భూములు ఉన్నాయి. ఆ స్థలాల్లో చెక్పోస్టులకు అవసరమైన నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు రావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. దీంతో చెక్పోస్టుల ఏర్పాటు ఆలోచన ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నా అంతగా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం కొత్త ఆలోచన చేశారు. చెక్పోస్టుల నిర్మాణాలకు జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో కంటైనర్ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికయితే భూమి కేటాయింపులకు అవసరమైన ప్రక్రియలో పెద్ద జాప్యం ఉండదు.కంటైనర్లను కొనుగోలు చేసి వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ వాటిని చెక్పోస్టులకు వీలుగా మార్పులు చేసి వినియోగంలోకి తెస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో కంటైనర్ను రూ.4.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. కాగా కంటైనర్ చెక్పోస్టులను ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోనే విశాఖలో తొలిసారిగా ఏర్పాటు చేస్తుండడం విశేషం. వంద మందికి పైగా అవసరం.. ఒక్కో చెక్పోస్టులో షిఫ్టుకు ఒక సీఐ/ఎస్ఐ, ఏడెనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబు ళ్లు అవసరమవుతారు. ఈ లెక్కన ఒక్కో చెక్పోస్టుకు 20–25 మంది చొప్పున ఐదింటిలో 100 మందికి పైగా సిబ్బంది కావల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అయినప్పటికీ గంజాయి రవాణాకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సిబ్బందిని చెక్పోస్టులకు సర్దుబాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే.. ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగే ప్రధాన జంక్షన్లయిన కేడీపేట సమీపంలోని భీమవరం, చింతపల్లి రోడ్డులోని డౌనూరు, పాడేరు సమీపంలోని వంట్లమామిడి, అరకు చేరువలో ఉన్న సీతన్నపాలెం, దేవరాపల్లిలో ఈ చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తమ శాఖ కమిషనర్ ప్రతిపాదించిన కంటైనర్ చెక్పోస్టులు సాధ్యమైనంత త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటైనర్ బీభత్సం
-
కాస్త తీయం‘డబ్బా’..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల :ఎరక్కపోయి తలపెట్టి ఇరుక్కుపోయిందిఈ గేదె. ద్వారకాతిరుమల తూర్పువీధిలో సోమవారం కనిపించిన ఈ దృశ్యాలుస్థానికులను కాసేపు ఆందోళనకు గురిచేశాయి. కుడితి కోసం డబ్బాలో తలపెట్టినఈ గేదె.. ఇరుక్కుపోయింది. డబ్బా ఎంతసేపటికీ రాకపోవడంతో రోడ్డుపై హల్చల్ చేసింది. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఎవరూ డబ్బా తీసేందుకు సాహసించలేదు. ఆఖరికి ఇద్దరు యువకులు చాకచక్యంగాగేదె తల నుంచి డబ్బాను తీశారు. దీంతో బతుకు జీవుడా అంటూ గేదె పరుగులు పెట్టింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
బోయినపల్లిలో అగ్నిప్రమాదం : కార్లు దగ్ధం
-
కంటైనర్కు మంటలు: డ్రైవర్ సజీవదహనం
దొడ్డబళ్లాపురం : ఆ డ్రైవర్ రోడ్డు పక్కన కంటైనర్ను నిలుపుకుని దాబాలో భోజనం చేశాడు.. తర్వాత కంటైనర్లోనే నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో ఏమైందో గాని కంటైనర్కు మంటలు అంటుకుని డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని నెలమంగల పరిధిలోని 4వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రాజస్థాన్కు చెందిన సురేంద్రకుమార్(35) ఈ ఖాళీ కంటెయినర్కు డ్రైవర్గా ఉన్నాడు. ఈ కంటైనర్ను దాబస్పేట నుండి కేరళ క్యాలికట్కు తీసుకెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి ఆలస్యం కావడంతో 4వ జాతీయ రహదారిపై దొడ్డేరి గ్రామం వద్ద హెచ్పీ డాబా సమీపంలో రోడ్డు పక్కన కంటైనర్ను నిలుపుకుని దాబాలో భోజనం చేసి వాహనం లోపలే నిద్రించాడు. అర్థరాత్రి ఏం జరిగిందోకానీ అకస్మాత్తుగా కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే కాలిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే క్యాబిన్ అంతా కాలిపోయింది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కంటైనర్ హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాలలో కంటైనర్ కలకలం
-
రాజమండ్రి హైవేపై కంటైనర్ బీభత్సం
రాజమండ్రి: రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఆలమూరు మండలం మడికి గ్రామం వద్దగల హైవేపై కంటైనర్ వేగంగా వస్తూ రోడ్డు పక్కన ఉన్నవారిపైకి దూసుకు వెళ్లింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఐదు ఆటోలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కంటైనర్ బోల్తా.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
హైదరాబాద్: బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ బోల్తాకొట్టింది. వేగంగా వెళ్తున్న కంటైనర్ లక్డీకాపూల్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాకొట్టింది. మెహిదీపట్నం నుంచి గ్లూకోస్ బిస్కెట్ల లోడ్తో ఈ కంటైనర్ మహావీర్ హాస్పిటల్ మీదుగా పంజాగుట్ట వైపు వెళ్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో ఉండే ఈ రోడ్డులో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ ఎవరికీ ఏమీ కాలేదు. కాగా, ఉదయం వరకు ఈ కంటైనర్ను తొలగించలేదు. దీన్ని తొలగించేందుకు 40 టన్నుల క్రేన్ అవసరం ఉన్నందున అది వచ్చేవరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
కంటైనర్ ఢీకొని చిన్నారి మృతి
మంత్రాలయం రూరల్: కంటైనర్ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన ఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ రాజు, లక్ష్మి దంపతులు తమ ఏకైక కుమారుడు వినోద్ను తీసుకుని కర్ణాటక రాష్ట్రంలోని రాయాచూర్ జిల్లా మాల్కాపురం గ్రామానికి ఉపాధి నిమిత్తం వెళ్లారు. పనులు ముగించుకుని మంత్రాలయం నుంచి చిలకలడోణ గ్రామానికి ఆటోలో బయలుదేరారు. గ్రామం చేరుకొని ఎడమ వైపు నుంచి రోడ్డు దాటుతుండగా చైన్నె నుంచి పుణె వెళ్తుతున్న కంటైనర్(ఎంహెచ్12ఎంవీ1639) చిన్నారి వినోద్ను ఢీకొట్టింది. గాయాలపాలైన వినోద్ను చికిత్స నిమిత్తం ప్రయివేటు వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజానగరం మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు దివాన్ చెరువు వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
వృద్ధురాలిని తప్పించబోయి...
• కంటెయినర్ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు • ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు జడ్చర్ల టౌన్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురా లిని తప్పించబోరుున టూరిస్ట్ బస్సు.. ఆగి ఉన్న కంటెరుునర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో బస్సులోని ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి స్వల్ప గాయాల య్యారుు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. కేరళ రాష్ట్రం మళక్పురం జిల్లా పెరుంతల్మన్నలోని అల్షిఫా ఫార్మా కాలేజీకి చెందిన 28 మంది విద్యార్థులు, ముగ్గురు ట్యూటర్లతో కలిసి విజ్ఞాన యాత్ర కోసం పొంపి ట్రావెల్స్ బస్సులో సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు. బస్సు డ్రైవర్ హకీం ఉదయం 8 గంటల సమయంలో జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోరుు పక్కనే నిలిపి ఉన్న కంటెరుునర్ను ఢీకొట్టాడు. దీంతో కంటెరుునర్ పైపులు 8 అడుగుల మేర టూరిస్టు బస్సులోకి చొచ్చుకుపోయారుు. ప్రమాదంలో బస్సులో నిద్రిస్తున్న మన్నార్కాడ్ గ్రామానికి చెందిన కండక్టర్ రాజీవ్ (30), పెరినింతమన్నకు చెందిన క్లీనర్ అల్మీన్ (28) పైపుల్లో ఇరుక్కుపోరుు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ హకీం తీవ్ర గాయాలతో బయటపడి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. ఆరుగురికి తీవ్ర, 25 మందికి స్వల్ప గాయాలయ్యారుు. కొందరు క్షతగాత్రులను మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రికి, మరికొందరిని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ గంగాధర్ ఘటనాస్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను వేరుచేసి మృతదేహాలను బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల తహసీల్దార్ జగదీశ్వర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. -
కంటైనర్ - కారు ఢీ:ఆరుగురు మృతి
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విల్లుపురం జిల్లా ఆచనూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులంతా చెన్నై వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డుప్రమాదంలో ఎస్బీఐ ఉద్యోగుల దుర్మరణం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూరు -అమీర్పూర్ హైవేపై బుధవారం అర్థరాత్రి జరిగిన దుర్ఘటనలో ఏడుగురు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా గాటంపూర్లో విధులు ముగించుకుని మారుతి ఒమ్ని వ్యానులో వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు కంటెయినర్ ఢీ కొట్టింది. దాంతో ఒమ్ని వ్యాను అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అనంతరం కంటెయినర్ వ్యాన్ మీద పడిపోయింది. మారుతి ఒమ్నిలోని ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఫీల్డ్ అధికారి, అసిస్టెంట్ మేనేజర్సు, వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. మరోవైపు కంటెయినర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కంటైనర్ కోసం ఏడు గంటలు విద్యుత్ కట్
తిరువళ్లూరు: ప్రయివేటు కంటైనర్ వెళ్లేందుకు అనుగుణంగా అధికారులు ఏడు గంటల పాటు విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే వరుసగా రెండో రోజు కూడా విద్యుత్ను కట్ చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు సిప్కాట్ నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు కంటైనర్ మంగళవారం వెళ్లాల్సి వుంది. కంటైనర్ భారీ స్థాయిలో ఉండడంతో విద్యుత్ వైర్లకు తలుగుతుందన్న ఉద్దేశంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. కాగా సిప్కాట్ నుంచి తిరువళ్లూరు ఆవడి రోడ్డు వరకు వచ్చిన కంటైనర్ను అక్కడే నిలిపి వేశారు. అనంతరం బుధవారం ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి బయలు దేరిన కంటైనర్ సాయంత్రం నాలుగు గంటలకు ఐసీఎంఆర్ను దాటింది. ఈ కారణంగా బుధవారం సైతం దాదాపు ఏడు గంటల పాటు విద్యుత్ను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉండగా విద్యుత్కు తీవ్ర అంతరాయం కలగడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. జిరాక్స్షాపులు, రైస్మిల్స్ వ్యాపారులకు ఇబ్బందులు తప్పలేదు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ కంటైనర్ కోసమే కోత విధించామని తెలిపారు. -
అగ్ని ప్రమాదానికి గురైన కంటైనర్
-
ఇన్సురెన్స్ కోసం రెండు రోజులు ఆగి..
* వాగులో పడిన కంటెయినర్ వెలికితీత * అదుపు తప్పి వాగులో పడిన వైనం * బీమా ఏజెంట్ల సమక్షంలో తంతు పిడుగురాళ్ళ: పట్టణంలోని ఎర్రవాగు బ్రిడ్జిలో వారం రోజుల కిందట ఓ కంటైనర్ పడిపోయింది. దాని లోపల ఎనిమిది కొత్త కార్లు ఉన్నాయి. అవి దెబ్బతినకుండా జాగ్రత్తగా ఎర్రవాగులో నుంచి బయటకు తీయాల్సివుండడంతో కార్ల యాజమాన్యం ఇన్సూరెన్సు ప్రతినిధుల సమక్షంలో శనివారం కార్ల లోడును బయటకు తీయించింది. కంటైనర్ను వాగులోంచి బయటకు తీయడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఇందుకు ఆరు పొక్లెయిన్లను ఉపయోగించారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. -
బైక్ను ఢీకొన్న కంటైనర్
ఇద్దరు దుర్మరణం కావలిరూరల్ : బైక్ను కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి కావలి సమీపంలో జాతీయ రహదారిపై తుమ్మలపెంట క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డి నగర్కు చెందిన మర్రిపూడి వెంకటేశ్వర్లు (50) భవన నిర్మాణ సామాగ్రి అద్దెకు ఇస్తుంటాడు. మర్రిపూడి శ్రీనివాసులు (42) స్థానికంగా కేబుల్ డిష్ నడుపుతున్నాడు. ఇద్దరు చిన్నాన్న, పెదనాన్న కుమారులు. ఇద్దరు గురువారం నెల్లూరుకు వెళ్లి పని ముగించుకుని తమ పల్సర్బైక్పై ఇంటికి వస్తున్నారు. కావలి బైపాస్ రోడ్డులో తుమ్మలపెంట బ్రిడ్జి వద్దకు రాగానే బైపాస్ రోడ్డు దిగే సమయంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ బైక్ను ఢీకొంది. బైక్ పూర్తిగా ధ్వంసం కాగా ఇరువురిని కొది ్దదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ముఖాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. బైక్ను ఢీకొన్న లారీ డివైడర్ను దాటి అవతలి వైపు రోడ్డు మార్జిన్లోకి దిగిపోయింది. సమాచారం అందుకు కావలి రూరల్ ఎస్సై పుల్లారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బైక్ నంబర్ ఆధారంగా మృతులను గుర్తించారు. వెంకటేశ్వర్లుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసులుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్తంభించిన ట్రాఫిక్ ప్రమాదం జరగడంతో ఒక వైపు రోడ్డులో కంటైనర్ అడ్డుగా నిలబడి పోయింది. మరోవైపు రోడ్డు మధ్యలో మృతదేహాలు పడిపోయాయి. చీకటి పడటంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై పుల్లారావు తన సిబ్బందితో కలిసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇరు మార్గాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు. -
కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్!
లండన్: కోకా కోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్లో కలకలం రేపింది. దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
కంటైనర్ డ్రైవర్ సజీవ దహనం
కంచికచర్ల : కంచికచర్ల శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్ను మద్యం లోడుతో వెళ్లుతున్న కంటైనర్ లారీ ఢీకొనటంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మృతుడు రాజస్థాన్కు చెందిన డ్రైవర్ రవీంద్రసింగ్ కుస్వాహ్(40)గా గుర్తించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుంచి సామర్లకోటకు కంటైనర్ లారీ మద్యం లోడుతో వెళ్తోంది. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు దాటి నక్కలంపేట రోడ్డు వద్ద కు రాగానే ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టింది.నల్గొండ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ బహిర్భూమి కోసం అప్పుడే టిప్పర్ను అక్కడ ఆపి వెళ్లాడు. కంటైనర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ముందు ఉన్న వాహనాన్ని గుర్తించలేకపోయాడు. ఢీకొన్న ధాటికి కంటైనర్ లోడులోని మద్యం సీసాలు క్యాబిన్లోనికి చొచ్చుకొచ్చి బద్ధలుకాగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రవీంద్రసింగ్ కుస్వాహ్ కాలిబూడిదయ్యాడు. ఆకస్మాత్తుగా సంభవించిన ఈఘటనతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కంచికచర్ల ఎస్ఐ కే ఈశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కదిలిన కంటైనర్లు
టీనగర్: అరవకురిచ్చి సమీపంలో నడిరోడ్డుపై రూ.1,600 కోట్లతో నిలిచిన కంటైనర్లు గురువారం బయలుదేరాయి. అక్కడ భద్రతా పనులు నిర్విహ స్తున్న పోలీసులు 22 గంటల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కర్నాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని మదురా రిజర్వ్బ్యాంకు నుంచి తిరువనంతపురం శాఖకు రూ.1,600 కోట్ల నగదుతో రెండు కంటైనర్ లారీలు ఈ నెల 18వ తేదీ రాత్రి బయలుదేరాయి. ఈ లారీలు కరూర్ జిల్లా అరవకురిచ్చి సమీపంలోని మలైకోవిలూరు వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెళుతుండగా ఒక లారీ యాక్సిల్ మరమ్మతుకు గురైంది. దీంతో మరో లారీ నిలిచిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది లారీల చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు. లారీలు నిలిచిపోయినట్లు జీపీఎస్ పరికరం ద్వారా కనుగొన్న సదరు లారీ సంస్థ దీనిపై అధికారులకు సమాచారం తెలిపింది. దీనిగురించి కరూర్ ఎస్పీ రంజితాపాండేకు సమాచారం అందింది. ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం అరవకురిచ్చి డీఎస్పీ గీతాంజలి, ఇన్స్పెక్టర్ విజయకుమార్ సహా పోలీసు బృందం అక్కడ భద్రతా పనులు నిర్వహించారు. మరమ్మతుకు గురైన కంటైనర్కు విడి భాగాలు పుణే నుంచి రావాల్సి ఉన్నందున అక్కడి నుంచి మదురైకు విమానంలో విడిభాగాలు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అరవకురిచ్చికి కారులో పంపేందుకు కంటైనర్ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇలాఉండగా నగదుతో కంటైనర్లు నిలిచినట్లు తెలియడంతో పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. అంతేగాకుండా కంటైనర్లు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులకు సమస్య ఏర్పడింది. కంటైనర్లో యాక్సిల్ మరమ్మతుకు గురైనా మొదటి, లేదా రెండవ గేర్లో వాటిని నడపవచ్చు. లారీలను నెమ్మదిగా తీసుకువెళ్లమని పోలీసులు సూచించారు. అయితే డీజిల్ ఎక్కువగా ఖర్చవుతుందని డ్రైవర్ వ్యతిరేకించాడు. క్రమంగా అక్కడికి చేరుకునే ప్రజల సంఖ్య పెరుగుతుండడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు చర్చలు అనంతరం అందుకు డ్రైవర్లు సమ్మతించారు. ఇలాఉండగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు కంటైనర్లు అక్కడి నుంచి బయలుదేరాయి. బుధవారం రాత్రి నుంచి రెండు కంటైనర్లు మదురైలో నిలిపిఉంచారు. పుణే నుంచి విడిభాగాలు అందిన తర్వాత మరమ్మతులు జరిపి తిరువనంతపురం తీసుకువెళ్లేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో కరూరు ఆదాయపన్ను శాఖ ఇన్స్పెక్టర్ నటరాజన్ ఆధ్వర్యంలోని అధికారులు కంటైనర్లకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించారు. తర్వాత కంటైనర్ లారీలు బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి వెళ్లారు. -
కరెంట్ తీగలు తగిలి దగ్ధమైన కంటైనర్, కార్లు
చిత్తూరు: కార్లతో వెళ్తున్న కంటెయినర్పై విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో వాహనంతోపాటు అందులోని కార్లు దహనమయ్యాయి. కంటెయినర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చిత్తూరు సమీపంలో చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రం కొటాను జిల్లాకు చెందిన కంటెయినర్ డ్రైవర్ ఆలం(27) బుధవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి ఎనిమిది కార్లను లోడ్ చేసుకుని బయలుదేరాడు. చిత్తూరు నగరంలోని ఇరువారం గ్రామం వద్ద ఉన్న ఎన్హెచ్-4 జాతీయ రహదారి కూడలిలో కిందికి వేలాడుతున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను గమనించకుండా వాహనాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఆ తీగలు కంటెయినర్కు పట్టుకోవటంతో తెగి లారీపై పడ్డాయి. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో వాహనానికి మంటలు వ్యాపించాయి. అప్పటికే షాక్తో డ్రైవర్ ఆలం కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఆ వాహనంలోని అయిదు కార్లు పూర్తిగా కాలిపోయాయి. మూడు కార్లు పాక్షికంగా కాలాయి. లారీలో క్లీనర్ లేకపోవడంతో ప్రమాదాన్ని పసిగట్టే వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. -
కారు, కంటైనర్ ఢీ: ముగ్గురు మృతి
గంగవరం(చిత్తూరు): చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లి వద్ద మంగళవారం రాత్రి కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా కారులో తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
హింసను అరికట్టేందుకు ' స్పీక్ అప్'!
దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ ఆరెంజ్ కంటెయినర్ లో ' స్పీక్ అప్' పేరిట నిర్వహించిన కార్యక్రమం.. హాజరైన వారికి కన్నీళ్ళు తెప్పించింది. బాధిత మహిళల ఆవేదనను బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వినిపించిన ఆ స్వరం... అక్కడివారి హృదయాలను కదిలించింది. ఓ తాగుబోతు భర్తనుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపుల వివరాలతో... బాధిత మహిళ జీవిత గాధ ఆధారంగా రూపొందించిన ఆడియో కథనం అది. మనసులను కదిలించిన ఆ భావోద్వేక సౌండ్ ట్రాక్ మహిళాలోకాన్నే మేలుకొలిపేందుకు, అవగాహన కల్పించేందుకు నినాదమైంది. అరబ్బు దేశంలో మొదటిసారి మహిళలపై గృహ హింసకు వ్యతిరేకంగా 'దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛిల్డ్రన్' ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇంటరాక్ట్రివ్ కార్యక్రమం అది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు పునాదిగా మారింది. పదిమంది మహిళల్లో సుమారు ఏడుగురు తమ జీవిత కాలంలో హింసను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం తెలుస్తోందని కార్యక్రమం మేనేజర్ ఫాతిమా అస్ ఫలాసి తెలిపారు. బాధితులు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలన్నదే తమ ఆశయమని, గుండె లోతుల్లో దాచుకున్న వారి భావోద్వేగాలను తెలుసుకొని వారికి ఉపశమనం కలిగించేందుకు తమ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని ఫాతిమా భావిస్తున్నారు. ఇటువంటి వేదికపై మహిళలు హింసపై మాట్లాడడం మంచి సంకేతమని, మరొకరికి సహాయంగా మారుతుందని ఫాతిమా అంటున్నారు. గత ఏడు సంవత్సరాల్లో దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛైల్డ్ సుమారు 15 వందలకు పైగా గృహహింస కేసులను పరిష్కరించింది. బాధితుల్లో ఎక్కువశాతం 18 ఏళ్ళ వయసున్నవారు... ఇతర దేశాలనుంచి వచ్చి, దుబాయ్ లోని పురుషులు, కుటుంబ సభ్యులవల్ల శారీరకంగానూ, మానసికంగానూ గృహ హింసకు గురైన వారే ఉన్నారు. అయితే మహిళలపై హింసకు పాల్పడటంలో ఏ దేశం మినహాయింపు కాదని, సుమారు ఆరు వందల మిలియన్లకు పైగా గృహహింసకు గురౌతుంటే దాన్ని హింసగా గుర్తించడం లేదని ఫాతిమా అన్నారు. అయితే హింస ఎటువంటిదైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆమె తెలిపారు. అలాగే సమావేశం తర్వాత ఎందరో తమ అనుభవాలను, కన్నీటి గాధలను తమతో పంచుకున్నారని, సౌండ్ ట్రాక్ విన్నవారు స్పందించి, గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. అల్ ఫలాసీ ఆరెంజ్ కంటైనర్ మరి కొద్ది నెలల్లో గృహహింస నిర్మూలకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇటీవల జనంలో గృహహింసపై అవగాహన కల్పించేందుకు, జీవితాలను తీర్చిదిద్దేందుకు ఎన్నో టీవీ కార్యక్రమాలను సైతం రూపొందిస్తున్నారు. అయితేనేం రోజురోజుకూ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఆరెంజ్ కంటైనర్ మరి ఏ మేరకు సేవలు అందించగల్గుతుందో వేచి చూడాలి. -
లారీని ఢీకొట్టిన కంటైనర్
ప్రత్తిపాడు : జాతీయ రహదారిపై ధర్మవరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఖాళీ కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఖాళీ కంటైనర్ డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసుల కథ నం మేరకు .. భీమవరం నుంచి రొయ్యలను తీసుకు వచ్చేం దుకు విశాఖ నుంచి ఖాళీ కంటైనర్ బయలుదేరింది. ధర్మవరం ఎన్హెచ్పై జెడ్పీ హైస్కూల్ జంక్షన్ సమీపానకొచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. లారీ వెనుక చక్రాలు ఊడిపోయి, దాని కిందకు కంటైనర్ ముందుభాగం దూసుకుపోయింది. ఈ సంఘటనలో విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సందులూరు గ్రామానికి చెందిన కంటైనర్ డ్రైవర్ కాటపల్లి శివ (23) కేబిన్లోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. విజయనగరం జిల్లా జామి మం డలం కొత్తవలస గ్రామానికి చెందిన కంటైనర్ రెండో డ్రైవర్ బాజిరెడ్డి వెర్రినాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెర్రినాయుడును కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేబిన్లోనే నరకయాతన రోడ్డు ప్రమాదంలో లారీని ఢీకొన్న ఖాళీ కంటైనర్లో డ్రైవర్ ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించి, చివరకు మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు లారీ కిందకు కంటైనర్ కేబిన్ దూసుకుపోయి, నుజ్జునుజ్జయ్యింది. కేబిన్లోనే విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం సందులూరు గ్రామానికి చెందిన డ్రైవర్ కాటపల్లి శివ ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటకు పైగా మృత్యువుతో పోరాడి, చివరకు ప్రాణాలొదిలాడు. పోలీసులు, హైవే మెయిన్టినెన్స్ సిబ్బంది డ్రైవర్ను కేబిన్ నుంచి వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రేన్ను రప్పించి, దాని సహాయంతో లారీ కింద ఇరుక్కుపోయిన కేబిన్ నుంచి డ్రైవర్ మృతదేహాన్ని మూడు గంటల తరువాత గానీ వెలికి తీయలేకపోయారు. -
ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొన్న బస్సు.. 22 మందికి గాయాలు
భోగాపురం: మండలంలోని సుందరపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను పుష్కర యాత్రకు వెళ్లివస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 22 మంది గాయపడ్డారు. వీరంతా శ్రీకాకుళం జిల్లావాసులే. సుందరపేట సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 11 మందిని 108 వాహనంలో విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన 11 మంది వేరే వాహనాల్లో తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, తిమ్మాపురం, భైరిశాస్త్రులపేట, కృష్ణాపురం, కరవంజి గ్రామాల్లో ఉంటున్న 10 కుటుంబాలకు చెందిన 39 మంది మంగళవారం ఉదయం ప్రైవేట్ బస్సులో రాజమండ్రి వెళ్లారు. పుష్కర స్నానాలు ముగించుకుని రాత్రి 7.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సుందరపేట టోల్ప్లాజా సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ను బస్సు బలంగా ఢీ కొంది. దీంతో 22 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిలో సిమ్మ నారాయణ, సిమ్మ అప్పన్న, రావాడ సుశీల, లంక శ్రీదేవి, వెలమ భారతిల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారి బంధువులు తెలిపారు. డెంకాడ ఇన్చార్జి ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు కేంద్రాస్పత్రిలో చికిత్స విజయనగరం ఆరోగ్యం: సుందరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిలో 10 మంది జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆముదాలవలస మండలం తిమ్మాపురానికి చెందిన సిమ్మ నారాయణమ్మ, రావాడ సుశీల, సిమ్మ అమ్మన్నమ్మ, ప్రైవేట్ బస్సు డ్రైవర్ ప్రసాద్రావు, క్లీనర్ రాంబాబు, జలుమూరు మండలం కరవంజి గ్రామానికి చెందిన ఎస్.శ్రీరాములు, అతని భార్య నాగమ్మ ఆముదాలవలస మండలం కణుగులవలసకు చెందిన బి.కృష్ణారావు, అతని భార్య బి.సుగుణ, మేనకోడలు భారతి ఉన్నారు. -
అగ్రి ప్రమాదంలో చిక్కుకున్న కంటెయినర్
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు వద్ద టైర్ల కంటెయినర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వైపు 300 ఎంఆర్ఆఫ్ టైర్ల లోడుతో వెళుతున్న కంటెయినర్ సోమవారం సాయంత్రం ఉప్పలపాడు వద్దకు వచ్చేసరికి ప్రమాదం సంభవించింది. కంటెయినర్ డ్రైవర్ ముందున్న బస్సును అధిగమించబోయాడు. ఈ ప్రయత్నంలో కంటెయిన్ రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ డివైడర్కు బలంగా తగలడంతో పేలిపోయి మంటలు లేచాయి. కంటెయినర్లో టైర్లు ఉండడంతో స్వల్ప వ్యవధిలోనే లారీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ సిలిండర్ల కంటైనర్ బోల్తా
కర్నూలు : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో గ్యాస్ సిలీండర్ల లోడ్తో వెళుతున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో కర్నూలు- తిరుపతి రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భారత్ గ్యాస్ సిలండర్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ఆళ్లగడ్డ సమీపానికి రాగానే బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఆళ్లగడ్డ) -
రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంటైనర్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి కూలర్లతో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
మంటల్లో కంటైనర్
నెల్లూరు: నెల్లూరు జిల్లా తడ చెక్పోస్ట్ వద్ద విద్యుద్ఘాతంతో కంటెయినర్ లారీ తగలబడిపోయింది. ఐరన్ షీట్స్తో లక్నో నుంచి చెన్నై వెళ్తున్న లారీని డ్రైవర్ తడ చెక్పోస్టు వద్ద ఆపి కిందకు దిగారు. ఈ సమయంలో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ కింద ఉన్న డీజిల్ ట్యాంక్ను తాకడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. కొద్దిక్షణాల్లో లారీ పూర్తిగా దగ్ధమయింది. కంటెయినర్ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. మంటలను ఆర్పివేసేందుకు తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి ఫైరింజన్లు వచ్చినా అప్పటికే పూర్తిగా లారీ బూడిదయింది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు, చుట్టుపక్కలవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. (తడ) -
బస్టాప్లోని ప్రయాణికులపై కంటెయినర్ బోల్తా
సతారా/సాక్షి, ముంబై: మహారాష్ర్టలోని సతారా జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పార్గావ్-ఖండాలా మార్గంలో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపై ఓ కంటెయినర్ అదుపుతప్పి బొల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో 15 మంది గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడు ఇచ్చేందుకు చక్కెర సంచుల లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ ప్రయత్నించగా అది అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది. -
కంటెయినర్ కిందపడి 8 మంది మృతి
ముంబై: పూణే-సాతార రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కొందరు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక ఖండాల పోలీసుల కథనం ప్రకారం సాతార నుంచి పుణే దిశగా చక్కెర సంచుల లోడుతో వస్తున్న కంటెయినర్ పార్గావ్-ఖండాల గ్రామం వద్ద అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది. ఎదురుగా వస్తున్న బస్సుకు సైడు ఇచ్చేందుకు కంటెయినర్ డ్రైవర్ ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటెయినర్ కింద పడి ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తరువాత కంటెయినర్ డ్రైవర్ పారిపోయాడు. ** -
సాయం కోసం వెళ్లి మృత్యులోగిలికి..
శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై ఆగి ఉన్న ఓ కంటెయినర్ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యా యి. ఆర్జీఐఏ ఠాణా ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగూడ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై ఉదయం 6.30 గంటల సమయంలో ఓ కంటెయినర్ మరమ్మతుకు గురవడంతో రోడ్డుపై నిలిపారు. అదే సమయంలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓ లారీని సాయం కోసం కంటైనర్ డ్రైవర్ ఆపాడు. వాహనం చెడిపోయింది.. పనిముట్లు ఇవ్వాలని కోరాడు. దీంతో లారీ డ్రైవర్ షేర్ఖాన్(45), క్లీనర్ ఇస్మాయిల్ఖాన్(27)లు తమ లారీని కొద్ది ముందుకు తీసుకెళ్లి ఆపారు. అనంతరం కిందికి దిగి పనిముట్లతో కంటెయినర్కు మరమ్మ తు చేయసాగారు. అదే దారిలో శంషాబాద్ వైపు వస్తున్న మరో లా రీ వెనుక నుంచి కంటెయినర్ను వేగంగా ఢీకొంది. దీంతో కంటె యినర్ బోల్తాపడింది. దానికి మరమ్మతు చేస్తున్న షేర్ఖాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో ఇస్మాయిల్ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. కంటెయినర్కు సంబంధించిన డ్రైవర్తో పాటు క్లీనర్కు కూడా గాయాలయ్యాయి. కంటెయినర్ను ఢీకొన్న లారీ డ్రైవర్ వెంకటరమణ కాలికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసు లు షేర్ఖాన్ మృతదేహానికి స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు నగరంలోని బోరబండ వాసి అని పోలీసులు తెలిపారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లారిన బతుకులు
జహీరాబాద్ : తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారాయి. పీర్ల పండుగకు హాజరయ్యేందుకు ముంబై నుంచి వరంగల్కు వస్తుండగా.. మృత్యువు కంటెయినర్ రూపంలో ముగ్గురిని బలిగొంది. మృతుల్లో ఇద్దరు మంబై వాసులు కాగా మరో వ్యక్తి వరంగ ల్ జిల్లా వాసి. ఈ సంఘటన మండలంలోని బూచనెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (26) ముంబైలోని ఓ ప్రాంతంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన హసన్అలీ (48), అన్వర్ అన్సారి (43)లు మిత్రులు కాగా ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చే సేవారు. కాగా వీరికి గోవర్ధన్ తో పరిచయం ఏర్పడింది. అయితే గోవర్దన్ తన సొంత గ్రామంలో జరిగే పీర్ల పండుగకు హసన్, అన్సారీలను ఆహ్వానించాడు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక వరంగల్ జిల్లా రేగొండ మండలం గోడికొత్తపల్లికి కారులో బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ సమీపంలోని బూచనెల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న హసన్అలీ, పక్కనే కూర్చొన్న వరంగల్కు చెందిన గోవర్ధన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న అన్వర్ అన్సారి తీవ్రంగా గాయపడి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న జహీరాబాద్ సీఐ సాయి ఈశ్వర్గౌడ్, చిరాగ్పల్లి ఎస్ఐ విజయకుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయించారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన రూ.3 లక్షలను పోలీసులు భద్రపర్చారు. ప్రమాద స్థలంలో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
కల్వర్టును ఢీకొన్న కంటైనర్