cyberabad
-
జేసీ ప్రభాకర్రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్ కు మాధవీలత ఫిర్యాదు
-
Hyderabad: వీధుల్లో వ్యభిచారం!
మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్ పరిధిలో బస్టాప్లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్టీయూ, షీ టీమ్స్తో పాటు కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీసులతో బాలానగర్ డీసీపీ కే సురేష్ కుమార్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 7 మంది ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు. బుధవారం రాత్రి భాగ్యనగర్ బస్టాప్, కూకట్పల్లి, కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్జెండర్లను బైండోవర్ చేశారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం–1956 కింద కూకట్పల్లిలో మూడు, కేపీహెచ్బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్స్లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. -
HYD: స్కూల్కు వెళ్లిన బాలిక మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇక, ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్కు గురైంది. బుధవారం స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలను దిగారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పాపను ఎటు వైపు తీసుకెళ్లాడు అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
ట్రాఫిక్పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్లో కంట్రోల్ సెంటర్కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్గా సెకన్కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. ఇక, సైబరాబాద్లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాగా, జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ వేడుకలు.. ఐటీ ఉద్యోగిని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం! -
Cyberabad: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు కమిషనర్ అవినాష్ మహంతి. తాజాగా కేపీహెచ్బీ పరిధిలో సీఐ వెంకట్, ఆర్జీఐ సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీపీ వీరిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ పరిధిలో ఓ కేసులో ఎంక్వయిరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్కు తీసుకువచ్చి దారుణంగా కొట్టడమే కాకుండా థర్ద్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు. తీవ్రమైన గాయాలతో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో, వెంటనే సీపీ విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వీరిని సస్పెండ్ చేశారు. ఒకే కేసులో సరిగా విచారణ చేయనందుకే శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. -
సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సీపీ స్టీఫెన్ సమావేశం
-
Hyderabad: నగరంలో భారీగా ట్రాఫిక్జాం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షం నగరానికి మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. నగరంలో చాలాచోట్ల వాన నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భారీగా పలు రూట్లలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్.. హైదరాబాద్ శివారు అయిన సైబరాబాద్లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఐకియా నుంచి జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నానక్రామ్ గూడ, బయో డైవర్సిటీ రూట్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ రూట్లలోనూ భారీ వర్షంతో ట్రాఫిక్కు విఘాతం కలుగుతోంది. మరికాసేపట్లోనూ వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశాలతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదీ చదవండి: మళ్లీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ -
HYD: భారీగా డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో కింగ్ పిన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నివారణకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా సప్లై మాత్రం ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసుల.. భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.కోట్ల రూపాయల విలువైన కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. సైబరాబాద్లో భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్ను సీజ్ చేశారు. కాగా, డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్గా ఉన్న చింతా రాకేష్ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ ముఠా.. ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. తాజాగా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు.. అసలు విషయం తెలిసి షాక్! -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
-
డేటా లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: డేటా లీక్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 6 మెట్రోపాలిటిన్ సిటిల్లో 4.5 లక్షల ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు. మొత్తం 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. బుక్ మై షో, ఇన్స్టాగ్రామ్ జొమాటో, పాలసీ బజార్ నుంచి డేటా చోరీ చేశారని తెలిపారు. బైజూస్, వేదాంత సంస్థల డేటా కూడా లీకైనట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటితో పాటు 9, 10, 11, 12 తరగతులు విద్యార్థులు డేటా, పాన్కార్డ్, క్రెడిట్కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్కంట్యాక్స్, ఢిఫెన్స్ డేటా కూడా చోరికి గురైంది. చదవండి: కడుపు తరుక్కుపోయింది.. కన్నీళ్లు ఆగలేదు: సీఎం కేసీఆర్ -
పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
రాయదుర్గం: పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్లో సైబరాబాద్ పోలీసు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం పునరుద్ధరించిన సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులంతా కలిసి సొసైటీని ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ సభ్యులకు మేలు చేసే కొత్త ఆలోచలనకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమన్నారు. సైబరాబాద్ అన్ని రకాల ఫార్మాట్లలో ముందుగా ఉందని, ముఖ్యంగా క్రైమ్ డిటెన్షన్ సైబర్ క్రైమ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్, 17 ఫంక్షనల్ వరి్టకల్స్లో టాప్లో ఉందన్నారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క సర్విసులు, సొసైటీ యాప్ ద్వారా సభ్యులు చూసుకోవచ్చన్నారు. సొసైటీలో లావాదేవీలు అన్నీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో 72 ఏళ్ల చరిత్ర గల పాత సొసైటీని మూసివేస్తూ కోఆపరేటివ్ సొసైటీ ఆర్డర్ల ప్రకారం కొత్త సొసైటీని ప్రారంభించనున్నారు. సొసైటీలో గతేడాది ఏప్రిల్ 1 నాటికి ఉన్న షేర్ హోల్డర్లకు 40 శాతం, 2022–23 ఏడాదికి ఉన్న షేర్ హోల్డర్లకు 11 శాతం డివిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సభ్యులు నెలవారీ పొదుపునకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతానికి నిర్ణయించారు. ప్రతి సభ్యుడికి రూ.10 లక్షల గాను 8.5 శాతం వడ్డీపై లోన్లు ఇవ్వడానికి సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ డీసీపీ యోగేష్ గౌతమ్, సొసైటీ సెక్రెటరీ, ఏసీపీ సురేందర్రావు, కోశాధికారి జి.మల్లేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, డైరెక్టర్లు, ఎస్ఈ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ సరిత, హెడ్కానిస్టేబుల్ రాజారెడ్డి, కె.మాధవీలతా, ఇతర సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
సైబరాబాద్ శివారు ఫాంహౌస్లపై ఎస్వోటీ పోలీసుల దాడులు
-
Hyderabad: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!
సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం! కార్యాలయాలు, విద్యా సంస్థల పునఃప్రారంభంతో సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటంతో నియంత్రణ, క్రమబద్దీకరణలో వీళ్లూ భాగస్వామ్యులవుతున్నారు. వారే ట్రాఫిక్ పోలీసులతో సమానంగా రోడ్ల మీద విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ వలంటీర్లు! ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మేము సైతం అంటూ ట్రాఫిక్ సేవ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన ట్రాఫిక్ వలంటీర్లను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా యెదుల తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 4,500 మంది ట్రాఫిక్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. వలంటీర్లుగా సేవలు అందించాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఏడీఎట్దిరేట్ఎస్సీఎస్సీ.ఇన్ కు మెయిల్ లేదా 9177283831 నంబరులో సంప్రదించాలి. వలంటీర్లు ఏం చేస్తారంటే... తొలుత సాధారణ ట్రాఫిక్ సమయంలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వలంటీర్లు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ (డీడీ), ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు జారీ చేయించడం, రోడ్డు ప్రమాదాలలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో వంటి వాటిల్లో కూడా సహాయం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఈ ట్రాఫిక్ వలంటీర్లు 5,500 గంటలు పని చేశారు. 8,200 ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించారు. వీరిలో 6,100 మంది వాహనదారులకు చలాన్లు జారీ అయ్యాయి. (క్లిక్ చేయండి: మెట్రో స్టేషన్లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..) ఒత్తిడి తగ్గుతుంది అన్ని వర్గాల ప్రజల నుంచి ట్రాఫిక్ వలంటీర్లకు ఆసక్తిగా కనబర్చటం హర్షణీయం. కొన్ని ఐటీ కంపెనీలైతే వారి సెక్యూరిటీ గార్డులను వలంటీర్లగా నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల రాకపోకల సమయంలో వాళ్లే ఆయా మార్గంలోని ట్రాఫిక్ను నియంత్రించుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది. – టీ.శ్రీనివాస రావు, డీసీపీ, ట్రాఫిక్ సైబరాబాద్ -
సైబరాబాద్ పీఎస్ పరిధిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు
-
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్టాప్లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం తో దాడి
-
సైబరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్
-
సైబరాబాద్లో కొత్త రకం సైబర్ అటాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి. కంపెనీపై సైబర్ దాడి చేసి కేటుగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే సైబర్ అటాక్ చేసినట్టు సమాచారం. హాంగర్ కంపెనీ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం, కంపెనీ ఉద్యోగులు విజయ్కుమార్, కరణ్కుమార్, అశ్వంత్కుమార్లను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల నుంచి రివాల్వర్తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక, అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. -
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్పాత్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్పాత్లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్గా.. అలాగే శంషాబాద్, షాద్నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను
సాక్షిహైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల పనితీరుపై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పోస్టింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ)లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే, అక్రమాలకు పాల్పడే పోలీసులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టంచేస్తున్నారు. అంతర్గత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేసారి 126 మంది ఎస్ఐలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. రెండేళ్లు పైబడితే బదిలీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో మొత్తం 36 శాంతి భద్రతల ఠాణాలున్నాయి. ఒకే పీఎస్లో రెండేళ్లకు మించి పోస్టింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోలీసు అధికారుల పనితీరు, సమర్థతను బట్టి పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తాజాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్ల నుంచి ఒక్కొక్కరు, బాలానగర్ జోన్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పేట్బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్ను బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న ప్రశాంత్ను, జీడిమెట్ల ఇన్స్పెక్టర్గా ఉన్న బాలరాజు స్థానంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్లను బదిలీ చేశారు. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ బాలకృష్ణను బదిలీ చేసి, ఆయన స్థానంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్యను సీసీఎస్కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏసీబీ నాగేంద్రబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బీ నివేదికల ఆధారంగా.. పోలీసుల పనితీరుపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో వారి పనితీరు, అక్రమాలపై కూపీలాగుతూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఎస్బీ అధికారులకు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రుజువైన పోలీసులపై చర్యలతో పాటు భవిష్యత్తులో వారికి పదోన్నతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో నార్సింగి ఇన్స్పెక్టర్గా పనిచేసిన గంగాధర్ స్థానికంగా భూ లావాదేవీలలో తలదూర్చి అక్రమార్కులకు వంత పాడిన ఆరోపణల నేపథ్యంలో గంగాధర్తో పాటు ఎస్ఐ లక్ష్మణ్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రాములు (ప్రస్తుతం రాజేందర్ పీఎస్) బలరాం నాయక్ (నార్సింగి పోలీస్ స్టేషన్), అన్వేష్ రెడ్డి (ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లు సహకరించారని, అంతర్గత విచారణలో నిజమని తేలడంతో రెండేళ్ల తర్వాత వారిపై వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్కు ఇన్చార్జ్ కమిషనర్ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
సాక్షి, హైదరాబాద్: కరక్కాయ పొడి విక్రయం పేరిట సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించి, కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ (ఓపీసీ)కు చెందిన మినీ బస్సు వేలానికి సైబరాబాద్ కాంపిటెంట్ అథారిటీ (సీసీఏ) మరోసారి సిద్ధమైంది. ఈసారి 40 సీట్ల సామర్థ్యం ఉన్న అశోక్ లేల్యాండ్ బస్సు (ఏపీ16 టీసీ 4691) రిజర్వ్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తొలిసారి బస్సు వేలం నిర్వహించినప్పుడు రిజర్వ్ ధర రూ.5 లక్షలుగా, రెండోసారి ఏప్రిల్ 20న ధర రూ.4.50 లక్షలుగా నిర్ధారించారు. అయితే రెండు సందర్భాల్లోనూ బిడ్డింగ్లో ఎవరూ పాల్గొనకపోవటం గమనార్హం. దీంతో మూడోసారి బస్సు వేలం నిర్వహించేందుకు సీసీఏ ప్రతినిధులు సిద్ధమయ్యారు. వచ్చే నెల 17, మధ్యాహ్నం 1 గంటలోగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), డాక్యుమెంట్లను సమర్పించాలి. 18న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్లైన్లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక వచ్చిన నగదును దామాషా ప్రాతిపదికన బాధితులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. ఓపీసీ కంపెనీ కరక్కాయ పొడి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించి 425 మంది నుంచి రూ.3 కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. ఈ కేసులో నిందితులు మాటూరి దేవ్రాజ్ అనిల్ కుమార్ అలియాస్ రాజన్, ముప్పాల మల్లికార్జున, వడ్డె వెంకయ్య నాయుడు అలియాస్ వెంకయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.59.5 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకు న్నారు. గోల్డ్, బైక్ వేలం పూర్త యిన విషయం తెలిసిందే. (చదవండి: నూకల పరిహారం ఎంతిద్దాం? ) -
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. బయటకు చెప్పలేక..
రామన్నపేట: అత్యాశకు పోయి ఆన్లైన్ మోసానికి బలై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సైబర్ మోసానికి బలైనవారు ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోనే 1500 నుంచి 2వేల మంది వరకు ఉన్నారు. డిసెంబర్ 14న హగ్స్లీప్ అనే యాప్ మార్కెట్లోకి వచ్చింది. లింక్ ద్వారా ఒకరి ఫోన్ నుంచి మరొకరికి పంపేలా యాప్ను రూపొందించారు. యాప్ను డౌన్లోడ్ చేయగానే వివిధ డిస్కౌంట్లతో కూడిన కూపన్లు ప్రత్యక్షమవుతాయి. వాటిని స్క్రాచ్ చేయగానే డిస్కౌంట్ చూపిస్తుంది. ఓకే చేస్తే డిస్కౌంట్ పోనూ మిగిలిన మొత్తం సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అవుతుంది. డిస్కౌంట్ల పేరిట మస్కా హగ్స్లీప్ యాప్లో రూ.3 వేలు, రూ.6 వేలు, రూ.9 వేలు, రూ.15 వేలు, రూ.25 వేల విలువైన కూపన్లను పొందుపరిచారు. రూ.3 వేలు డిపాజిట్ (బదిలీ) చేస్తే గంటకు రూ.20.80 చొప్పున కేవలం 45 రోజుల్లో రూ.22 వేలు పొందవచ్చని, రూ.25 వేలు డిపాజిట్ చేస్తే గంటకు రూ.117.90 చొప్పున 60 రోజుల్లో రూ.1,50,000 పొందవచ్చని బంపర్ డిస్కౌంట్లను ఎర వేశారు. యువతను బురిడీ కొట్టించిన హగ్ స్లీప్ యాప్ రూ.6 వేలకు గంటకు రూ.40, రూ.9వేలకు గంటకు రూ.60, రూ.15 వేలకు గంటకు రూ.90 స్క్రాచ్ చేసిన వ్యక్తి ఖాతాలో జమ అవుతాయని, ఖాతాలో పడిన మొత్తాన్ని రోజూ ఉదయం పదకొండు గంటల తరువాత డ్రా చేసుకోవచ్చని ఆశ చూపారు. ఉదాహరణకు రూ.3 వేల విలువైన కూపన్ను గనక స్క్రాచ్ చేస్తే డిస్కౌంట్ 20శాతం పోను మిగిలిన రూ.2400 సదరు వ్యక్తి ఖాతా నుంచి యాప్ ఖాతాకు బదిలీ అవుతాయి. డిస్కౌంట్కు సంబంధించిన రూ.600 లింక్ పంపిన వ్యక్తి ఖాతాకు వెళ్తాయి. అత్యాశతో ఎగబడిన జనం మొదట్లో చేరిన కొద్దిమంది ఖాతాల్లో గంట గంటకు డబ్బులు జమ అయ్యాయి. వారు తమ స్నేహితులు, బంధువులకు లింక్ను పంపి డౌన్లోడ్ చేయించి స్కీంలో చేరేలా ప్రోత్సహించారు. కొందరు తమది గ్యారంటీ అని కూడా ప్రోత్సహించారు. దీంతో యువకులు తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ఫోన్లలో లింక్ను డౌన్లోడ్ చేసి మరీ డబ్బులు బదిలీ చేశారు. యాప్లో చేరిన వారిలో ఎక్కువమంది రూ.20 వేల కూపన్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.కేవలం రామన్నపేట మండలంలోనే రెండు వేలకు మందికి పైగా స్కీంలో చేరి రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. డిసెంబర్ 27 తరువాత స్కీంలో చేరిన వారు గంట గంటకు వచ్చిన డబ్బులను డ్రా చేద్దామని ప్రయత్నించగా యువర్ ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రాసెసింగ్ చూపించింది. డిసెంబర్ 31న యాప్ పూర్తిగా మూతపడింది. దీంతో డబ్బులు బదిలీ చేసినవారు బిక్కమొహం వేశారు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న వారిలో రాజకీయ నేతలు, వ్యాపారులతోపాటు రోజువారీ కూలీలు కూడా ఉన్నారు. తాము ఆన్లైన్ మోసానికి బలయ్యామనే విషయాన్ని బయటికి చెప్పలేక కుమిలిపోతున్నారు. దీనిపై రామన్నపేట ఎస్ఐ వెంకటయ్యను వివరణ కోరగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
Telangana: ట్రాఫిక్ ఆంక్షలు: అలా చేస్తే 10వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్బిహేవ్ చేయవద్దని అన్నారు. పబ్లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. -
దిశ ఎన్కౌంటర్: గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ సంఘటన స్థలంలో ఎన్ని బుల్లెట్లు లభ్యమయ్యాయి? వేరే వస్తువులు ఏం సేకరించారు? అనే కోణంలో దిశ కమిషన్ విచారణ సోమవారం కొనసాగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. వెంకన్నను సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. దిశ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో బాగా గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదని.. వాటి 19 కాట్రిడ్జ్లు మాత్రం లభ్యమయ్యాయని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. బుల్లెట్ల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాలని విచారణ అధికారి (ఐఓ) సురేందర్రెడ్డికి సూచించామని.. ఆయన బాంబ్ స్క్వాడ్తో కలసి వెతికినా కూడా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఐఓకు చేతి గ్లవ్జ్లు, పంచ్ మెటీరియల్లను ఎప్పుడు ఇచ్చారని కమిషన్ ప్రశ్నించగా.. గుర్తులేదని సమాధానం చెప్పారు. ఘటనా స్థలం నుంచి కాట్రిడ్జ్లు కాకుండా ఇంకా ఏం సేకరించారని అడగగా.. 9ఎంఎం తుపాకీ, రక్తం అంటిన దూది, మట్టి లభించిందని తెలిపారు. ఎన్కౌంటర్లో పోలీసులు 9 ఎంఎం తుపాకీ, ఏకే–47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్)ను వినియోగించారని చెప్పారు. టెంట్ ఎక్కడిది?... అంతకుముందు ఉదయం 11 గంటలకు దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్స్ట్రక్షన్కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో ప్రత్యక్ష సాక్షి (పంచ్ విట్నెస్) ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్ను విచారించారు. కమిషన్: మీ కళ్లలో మట్టి పడింది కదా.. మరి ఆరీఫ్యే కాల్పులు జరిపాడని ఎలా చెప్పారు? సాక్షి: శబ్దం ముందు నుంచి వచ్చింది కాబట్టి అంచనా వేశా. కమిషన్: ఆరీఫ్ కాల్పులు జరపడం మీ కళ్లతో చూశారా? లేదా? సాక్షి: చూడలేదు. కాల్పులు జరిపాక పోలీసులతో కలసి పక్కనే టెంట్లో నిల్చున్నా. కమిషన్: ఆ సమయంలో అక్కడ టెంట్ లేదు కదా? సాక్షి: లేదు, సీఐ చెప్పినట్లుగా కొంచెం దూరంలో నిల్చున్నా. కమిషన్: టెంట్ ఎప్పుడొచ్చింది? సాక్షి: తెలియదు. కమిషన్: మీ కళ్లల్లో మట్టి పడింది కదా మరి అంబులెన్స్లో ఉన్న వైద్యులకు చూపించుకోలేదా? సాక్షి: లేదు, నాకు నేను కళ్లు తుడుచుకుంటే మంటపోయింది. కమిషన్: ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చారా? సాక్షి: వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కమిషన్: సీపీ మృతదేహాలను చూశారా? సాక్షి: నాకు తెలియదు.. గుర్తులేదు. సాయంత్రం వరకూ సజ్జనార్ అక్కడే.. సోమవారం మధ్యాహ్నం సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. దీంతో ఉదయం 10:32 గం.కు ఆయన హైకోర్టు ఆవరణలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, రహుఫ్ విచారణే సోమవారం కూడా కొనసాగింది. భోజనానంతరం డాక్టర్ వెంకన్న విచారణ జరిగింది. సాయంత్రం 4:02 గంటల వరకూ సజ్జనార్ వేచి ఉన్నా, సమయం లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. గురు లేదా శుక్రవారం ఆయన్ను విచారించే అవకాశముంది. -
Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ.. తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
నిర్లక్ష్యం,అతివేగం.. అంతేనా వృద్ధురాలిని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడమేమో గానీ.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు, హెల్మెట్ పెట్టుకోకపోవడం లాంటి కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అయినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు పెడచెవిన పెడుతూ రోడ్డుపై ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్నారు. రోడ్డుపై వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యపు ధోరణిని వీడాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోవడం లేదనే చెప్పాలి. ఇటీవల ముగ్గరు యువకులు రోడ్డు పై అతి వేగంతో ద్విచక్రవాహనాన్ని నడపడమే కాకుండా, ఓ ప్రమాదానికి కారకులయ్యారు. చివరకి కటకటాలపాలయ్యరు. వివరాల్లోకి వెళితే.. జూలై 11న నార్సింగి సమీపాన ముగ్గురు యువకులు ట్రాఫిక్ రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టి, ఇష్టారీతని డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. అంతేగాక ఆ బండిని మొదటి కుర్చున్న వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి బైకుని నడుపుతున్నాడు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని. ఆ సమయంలోనే ఓ వృద్ధరాలు అటుగా రోడ్డు పక్కన నుంచి వెళ్తుంటే ఆమెను ఢీకోట్టి మరీ వెళ్లిపోయారు. కనీసం కింద పడిని వ్యక్తి ఎలా ఉందో, ఏమైందో అని కూడా చూడకుండా బండిని ఇంకా వేగంగా కదిలించేశారు. అదృష్టవశాత్తు ఆ వృద్ధరాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఇదంతా ఆ చుట్టు పక్కల సీసీ కెమరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ బైకుపై ప్రయాణించిన వారిలో ఇద్దరు దొరకగా వారిపై కేసు నమోదు చేశారు. ఓ సారి ఈ ప్రమాదాలు చిట్టాను పరిశీలిస్తే 2019 నుంచి 2021 మే వరకు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో బయటపడ్డ భారీ మోసం
-
E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్
సాక్షి, హైదరాబాద్: మీ క్షేమం.. భద్రత కోసం నిబంధనలు పాటించండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల తీరులో ఏమాత్రం మార్పు ఉండడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారికి అదే తీరులో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా ముగ్గురు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుండడంతో పాటు సెల్ఫోన్ వినియోగిస్తూ టైటానిక్ సినిమాలో మాదిరి స్టిల్ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు వెంటనే కెమెరాకు పని చెప్పారు. ఆ తర్వాత రూ.3,600 జరిమానా వారికి పంపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ముగ్గురు యువకులు పల్సర్పై వెళ్తున్నారు. మధ్యలో కూర్చున్న యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు చేతులు పెట్టి సెల్ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ను డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పరిశీలిస్తున్నాడు. ఈ సీన్ అచ్చం టైటానిక్ సినిమాలో స్టిల్ మాదిరి కనిపించింది. ఈ విన్యాసం చూసిన పోలీసులు ఫొటో తీసి జరిమానా పంపించారు. పైగా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. దీంతో అన్నీ కలిపి రూ.3,600 జరిమానా విధించారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. జరిమానాలు ఇలా.. హెల్మెట్ ధరించకపోవడం: రూ.100 బైక్కు అద్దాలు లేకపోవడం: రూ.100 బైక్పై ముగ్గురు ప్రయాణం: రూ.1,200 సెల్ఫోన్ డ్రైవింగ్: రూ.1,000 మాస్క్ సక్రమంగా ధరించకపోవడం: రూ.1,000 చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021 -
డ్రంకెన్ డ్రైవర్తో జర్నీనా.. ఆలోచించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సికింద్రాబాద్ క్లబ్ మేనేజర్ గౌతమ్దేవ్ గాడాయ్, ఆయన భార్య శ్రావణి శ్వేతలు మాదాపూర్లో బైక్పై వెళ్తుండగా... మద్యం తాగిన మత్తులో ఎస్యూవీ కారు నడుపుకుంటూ వచ్చిన కాశీ విశ్వనాథ్ రోడ్డు ప్రమాదం చేశాడు. ఈ ఘటనలో గౌతమ్ దుర్మరణం చెందగా, భార్య శ్వేతకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు అతడిపక్కనే కూర్చున్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడంతో మద్యం తాగినట్టుగా తేలింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇన్నాళ్లూ మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారుకుడైన డ్రైవర్పైనే కేసులు నమోదు చేసేవారు. అయితే రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో డ్రంకన్ డ్రైవర్తో పాటు అతడి పక్కనే కూర్చున్న మద్యం తాగిన వ్యక్తిపై కూడా 304 పార్ట్ టూ రెడ్విత్ 109 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే ఈ తరçహాలో చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ డ్రంకన్డ్రైవ్ చెక్లో దొరికిన పక్షంలో ఒక్క డ్రైవర్ పైనే కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాల్లో 153 మంది మృతి.. ‘గతేడాది సైబరాబాద్ పరిధిలో 144 రోడ్డు ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగితే 153 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు వాహనచోదకులే మృతి చెందారు. మరికొందరు ఎదుటి వాహనాల వాళ్లు, పాదచారులు... ఏమాత్రం సంబంధం లేనివారు చనిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకన్ డ్రైవర్ గురించి తెలిసీ మరీ అతడి వాహనంలోనే కూర్చుంటున్న మద్యం తాగిన ఇతర వ్యక్తిని క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నాం. వీటివల్ల డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు తగ్గి ఎంతోమంది ప్రాణాలు నిలిచే అవకాశముంద’ని సైబరాబాద్ పోలీసు విభాగాధికారి ఒకరు తెలిపారు. -
తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే..
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. అందుకే వాళ్లు తీవ్రవాదులతో సమానం. తాగి వాహనం నడుపుతూ సోమవారం ఒక్కరోజే 420 మంది పట్టుబడ్డారు. వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్తో పాటు ఎస్వోటీ పోలీసులనూ భాగస్వామ్యం చేస్తాం’ అని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీ వ్యాఖ్యానించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సజ్జనార్ మంగళవారం విడుదల చేసి, విజన్ 2021ను ప్రకటించారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట, సీసీటీవీ కెమెరాల పెంపు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. మరో మూడు ఠాణాల్లో ‘డయల్ 100 డొమెస్టిక్’ ‘గృహ హింస ఫిర్యాదులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే జగద్గిరిగుట్ట, మియాపూర్, రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లలో ‘డయల్ 100 డొమెస్టిక్ వయొలెన్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టీమ్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటివల్ల సత్ఫలితాలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది కేపీహెచ్బీ, మైలార్దేవ్పల్లి, జీడిమెట్ల ఠాణాల్లోనూ ఈ సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సజ్జనార్ వివరించారు. సీపీ చెప్పిన మరికొన్ని వివరాలు ►రహదారిపై ఏ చిన్న వాహనం వెళ్లి పెద్ద వాహనాన్ని ఢీకొట్టినా పెద్ద వాహనదారుడిపైనా కేసు నమోదు చేస్తున్నారు. దీనికి స్వస్తి పలికి ఎవరు ప్రమాదం చేస్తారో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదును 2021లో పకడ్బందీగా అమలు చేస్తాం. ►జీవో నంబర్ 167 ప్రకారం సైబరాబాద్లో సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచుతాం. ఈ ఏడాది 1,23,000 సీసీ కెమెరాలు బిగించాం. 2021లో దీనికి రెట్టింపు అమరుస్తాం. ►నగరంలోని రహదారులపై వెళ్లే వాహనాలను సీసీటీవీ కెమెరాల ద్వారా సైబరాబాద్లోని భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించవచ్చు. ఫలితంగా ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పడతాం. నేరం జరిగితే నేరగాళ్లనూ పట్టుకుంటాం. ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే క్లియర్ చేసేలా సూచనలు ఇస్తాం. వచ్చే ఏడాదిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను కీలకంగా వినియోగించుకుంటాం. ►సైబర్ క్రైమ్పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. జనాల్లో అవగాహన కలిగించేందుకు ఎస్సీఎస్సీ సహకారంతో సైబర్ మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తాం. అలాగే కొంత మంది పోలీసు సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై ఎఫ్ఐఆర్ నుంచి నిందితుడికి శిక్ష పడేలా చేసేంత వరకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇచ్చాం. వాళ్లు వచ్చే ఏడాది సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తారు. సైబర్ నేరాల కట్టడికి ఏం చేయాలనే దానిపై త్వరలోనే డీజీపీతో సమావేశమవుతాం. -
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
సాక్షి, గచ్చిబౌలి (హైదరాబాద్): న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 31న పబ్లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల లోనూ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్లైన్లో పెట్టినా డయల్ 100, వాట్సాప్ కాల్కు ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్లు, స్టార్ హోటళ్లు, రిసార్ట్లపై నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తాం’అని ఆయన తెలిపారు. కాగా నగరంలో నిషేధానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లు మాత్రం నగరవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నారు. -
ఏటీఎం చోరీలు..నిందితుల హిస్టరీ చూస్తే..
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రాచకొండ పరిధిలో జరుగుతున్న వరుస ఏటీఎం చోరీలపై నిఘా ఉంచామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు దొంగలిస్తున్నారని, అబ్దుల్లాపూర్మెట్లో ఒక పోలీస్ వాహనం దొంగలించి ఏటీఎం చోరీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే దుండగులను గుర్తించామని, వీరంతా హర్యానాలోని మోహత్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు వీరిపై 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులో మొత్తం 6గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. (అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం) 'ఈనెల 15న నాచారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగి, 35 వేల 800 నగదు పోయాయని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాను పరిశీలించగా, ఓ వ్యక్తిపై అనుమానం కలిగింది. ఇందులో మహమ్మద్ సద్దర్ అనే వ్యక్తి వేలిముద్రలు లభించాయి. 2015 నుంచి ఇతను దాదాపు 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. జైలులో ఉండగానే మొయినాబాద్కి చెందిన ఆయుబ్తో సద్దార్ కు జైల్లో పరిచయం అయింది. వీరిద్దరూ కలిసి వరుస దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటికే 118 కేసుల్లో నిందితుడైన ఆయూబ్పై 19 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా లోకల్ వ్యక్తుల పరిచయాలతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. కొందరు లారీ డ్రైవర్లు కూడా వీరికి సహకరిస్తున్నట్లు తేలింది. వీరి నుంచి 42తులాల బంగారు ఆభరణాలు, 70తులాల వెండి, 36వేల నగదు, ఒక మారుతి కారు స్వాధీనం చేసుకున్నాం' అని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్లలో గ్యాస్ కట్టర్తో వరుస చోరీలు చేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రతి ఏటీఎం వద్ద సెక్యూరిటీలను, అలారం సిస్టమ్ను పెట్టుకోవాలని బ్యాంక్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. (పెళ్లి మంటపంపైనే నగలు చోరీ ) -
మోస్ట్ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెండ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్ ఫహీమ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్, అల్వాల్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడి గుర్గావ్కు పారిపోయిన ఇద్దరు సభ్యులతో కూడిన వీరి ముఠాను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అక్కడే పట్టుకున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. జైల్లో కలిసి...జట్టు కట్టి యూపీలోని మోరాదాబాద్ జిల్లా, అజాద్నగర్కు చెందిన ఫహీమ్ అలియాస్ గ్లాస్ కటింగ్ పనిచేసేవాడు. అదే సమయంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, డబ్బుల కోసం కిడ్నాప్లు చేసేవాడు. 2013లో అక్రమ ఆయుధాల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి మురాదాబాద్ జైలుకు పంపారు. జైలులో అతడికి మహమ్మద్ ముర్సలిమ్తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం ఇద్దరు కలిసి హర్యానాలోని గుర్గావ్లో గ్లాస్ కట్టింగ్ వ్యాపారం చేశారు. అయితే సరిపడా ఆదాయం రాకపోవడంతో ఇళ్లల్లో దోపిడీలకు పథకం వేశారు. మూడేళ్లుగా ముప్పుతిప్పలు ముర్సలిమ్, అతడి స్నేహితుడు అరీఫ్ కలిసి ఫహీమ్ గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు తెరలేపాడు. దాదాపు వందకు చోరీలకు పాల్పడిన అతడు పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. తరచు నివాసాలు మార్చే అతను పోలీసుల కంటపడకుండా ఉండేందుకు ఏకంగా చోరీ సొత్తును కరిగించి బిస్కెట్లుగా మార్చి మార్కెట్లో విక్రయించేవాడు. 2017, 2018 మధ్యకాలంలో ఈ ముఠా చందానగర్, రాయదుర్గం, అమీన్పూర్ ఠాణాల పరిధిలో పంజా విసిరింది. సైబరాబాద్కు వచ్చి... దొరికిపోయారు ఈ నెల 4న అరీఫ్ ముఠా కారులో మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలో రెక్కీ నిర్వహించింది. పగటి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించిన వీరు వాటిని లూటీ చేసి హైవేపై వెళుతూ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ గుర్గావ్ చేరుకున్నారు.ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తెలివిగా వ్యవహరించారు. అయితే మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలోని ఘటనాస్థలి వద్ద సేకరించిన శాస్త్రీయ ఆధారాలతో గుర్గావ్లోని సోనా పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. బాలానగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది. స్థానిక పోలీసుల సహకారంతో ఫహీమ్, ముర్సలీమ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బృందంతో పాటు బాలానగర్ డీఐ జేమ్స్బాబు, అల్వాల్ పోలీసు సిబ్బందిని సీపీ సజ్జనార్ సత్కరించారు. రెండేళ్లుగా 16 మంది అంతర్రాష్ట నేరగాళ్లను పట్టుకొని 60 కేసులను ఛేదించామని, ఇదంతా ఎస్ఓటీ, సీసీఎస్, క్లూస్టీమ్ సిబ్బంది కృషితోనే సాధ్యమైందన్నారు. విల్లాలో మకాం.. యూపీ పోలీసులకు వాంటెడ్గా ఉన్న టాప్–10 గ్యాంగ్స్టర్లలో ఒకడైన ఫహీమ్ గుర్గావ్లోని ఎంవీఎన్ సొసైటీ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో ఉంటున్నాడు. గతంలో బినామీ పేర్లపై ఉన్న రెండు ఇళ్లను మొరాదాబాద్ పోలీసులు సీజ్ చేయడంతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. దోపిడీ చేసిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. క్యాసినోతో పాటు లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ & డేటా సెంటర్ను ప్రారంభించారు. దీనిద్వారా ఒకేసారి భారీ స్క్రీన్పై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10 లక్షల కెమెరా దృశ్యాలను నెల రోజులపాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను కూడా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వీక్షించే అవకాశం ఉంది. (తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలే) -
ఐపీఎల్ 2020... తస్మాత్ జాగ్రత్త!
ఢిల్లీ: క్రికెట్ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్ ప్రారంభమైతే జాగ్రత్త పడడం ఏంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు.. ఐపీఎల్ మ్యాచ్లో జరిగే కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా సైబరాబాద్ పోలీసులు ఆలోచించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ రన్ఔట్ను ఉదాహరణగా తీసుకొని ట్రాఫిక్పై అవగాహన కల్పించేలా సోషల్ మీడియా ఫొటోను షేర్ చేశారు. చెన్నై, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ధోని పరుగులు తీయలేక అలసిపోయిన ఫొటోను షేర్ చేశారు. నాగ్పూర్ సిటీ పోలీసులు కూడా ఇలాంటిదే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోల్కతా జట్టుకు చెందిన ఆటగాడు వరున్ చక్రవర్తి ఫొటోను ఉపయోగించారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో మోసాలు చేస్తున్నారని... మీ ఓటీపీ, ఏటీమ్ పిన్ నెంబర్లను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదని పోస్ట్ చేశారు. When you have shared an OTP with a so called "Bank Employee speaking from the Head Office" : pic.twitter.com/28NKdoCrG1 — Nagpur City Police (@NagpurPolice) October 4, 2020 ఇలా ఐపీఎల్ చూసేవారికి కనువిందుతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. (ఇదీ చదవండి: వైరల్: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్ ట్వీట్) -
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 22 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకోగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. సీపీ సజ్జనార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. చందూర్ శశాంక్ అనే ప్రధాన బూకీతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. భర్కత్ అనే ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడని, మొబైల్ ఫోన్ లోనే ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) బెట్ 365, డ్రీం 11, ఎంపీఎల్, బెట్ వే, డ్రీంగురు, మై 11 సర్కిల్, బెట్ 365, కోరల్, బివిన్, 777 బెట్, డెఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, బెట్ఫ్రడ్, లోటస్ క్రికెట్ లైన్ తదితర మొబైల్ యాప్లలో వచ్చే రేటింగ్లు ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎవరికైనా బెట్టింగ్లకు సంబంధించిన సమాచారం తెలిస్తే 9490617444 నంబర్కు కాల్ చేయాలని సీపీ విజ్క్షప్తి చేశారు. ‘‘స్టూడెంట్స్ ఎక్కువగా బెట్టింగ్లలో పార్టీసిపెట్ చేస్తున్నారు. డబ్బు ఎవ్వరికీ ఊరికే రావు. కష్టపడాలి. రాత్రికి రాత్రే శ్రీమంతుడు అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. బెట్టింగులకు నగర యువత దూరంగా ఉండాలని’’ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.(చదవండి: వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..) -
ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు
-
సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి : సీపీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. (జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు) కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. (శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!) -
‘ప్లాన్ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతారు’
సాక్షి, హైదరాబాద్ : అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగల ముఠాను బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురు సభ్యుల ముఠా ఈ నెల 4న దోపిడికి ప్లాన్ చేశారని.. పుత్లిబౌలిలో ఒక వ్యాపారి తీసుకువెళుతున్న మనీబ్యాగ్ను చోరీ చేశారన్నారు. కాగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చోరికి పాల్పడ్డ ఐదుగురు దొంగల ముఠా సభ్యులలో సయ్యద్ పాషా, సయ్యద్ ఫైయజ్ ఇమ్రాన్, అమీర్ ఖాన్తో పాటు వసీంను అరెస్ట్ చేయగా ఒక్కరు మాత్రం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి 2.65 లక్షల నగదు, 2 డాగర్స్ ( కత్తులు), 10 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై గతంలోనూ హత్య, చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లో వీరిపై వివిధ కేసులు నమోదైనట్లు తెలిపారు. -
5 నిమిషాలు.. 20 ఏళ్ల కష్టాన్ని మింగేసింది
సాక్షి, హైదరాబాద్: యాక్సిడెంట్.. రోడ్డు ప్రమాదం భాష ఏదైనా కానీ.. దాని ఫలితంగా ఓ కుటుంబం వీధిన పడుతుంది. ఐదు నిమిషాల కాలం ఓ కుటుంబం తలరాతను తిరగ రాస్తుంది. రోడ్డు మీద వెళ్లేవారైనా.. వాహనాల్లో ప్రయాణం చేసేవారైనా ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే.. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కాపాడినవారు అవుతారు అంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో వారు షేర్ చేసిన ఓ కథనం ఆలోచింపజేస్తుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాపయ్య అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పిల్లల భవిష్యత్తు గురించి అనేక కలలు కంటూ 20 ఏళ్ల క్రితం భాగ్యనగరానికి వలస వచ్చాడు పాపయ్య. ఈ క్రమంలో పేట్ బషీరాబాద్లోని ఒక స్వీట్ షాప్లో సెక్యూరిటీ గార్డ్గా పనికి కుదిరాడు. అదే ఉద్యోగంలో ఉంటూనే ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు.. కొడుకును ఇంటర్ వరకు చదివించాడు. 20 ఏళ్ల క్రితం ఏ కల కని మహానగరానికి వచ్చాడో.. ఆ కలను నేరవేర్చుకున్నాడు. అనుకున్నట్లుగానే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చానని సంతోషించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పాపయ్య యాక్సిడెంట్కు గురయ్యాడు పేపర్ కోసమని వెళ్లి... ప్రతిరోజు ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉన్న పాపయ్య ఎప్పటిలాగే ఈ నెల 16న ఉదయం 8.30గంటలకు జీడిమెట్ల గ్రామంలోని గాంధీ బొమ్మ(పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి) దగ్గర పేపర్ తెచ్చుకోవడానికని రోడ్డు దాటుతుండగా.. మేడ్చల్ వైపు నుంచి సుచిత్ర వైపు జాతీయ రహదారి-44పై వెళ్తున్న ఓ బైక్(AP 29 CA 6628) రోడ్డు దాటుతున్న పాపయ్యను ఢీ కొట్టింది. ఇది గమనించి ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పాపయ్యను వెంటనే దగ్గరలోని బాలాజీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చయ్యింది. అయినా అతడి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. బోయిన్పల్లిలోని రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సాయంత్ర 4గంటలకు పాపయ్య తుది శ్వాస విడిచాడు. రాఘవేంద్ర ఆస్పత్రిలో మరో 40 వేల రూపాయలు ఖర్చయ్యాయి. దాచుకున్న డబ్బు అయిపోవడంతో.. అప్పు తెచ్చి మరి చికిత్స చేయించారు. కానీ పాపయ్యను బతికించుకోలేకపోయారు. 5 నిమిషాలు.. లక్ష రూపాయల అప్పు ఉదయం వరకు సంతోషంగా ఉన్న పాపయ్య కుటుంబానికి సాయంత్రం అయ్యే సరికి పుట్టెడు దుఖం. రూ. లక్ష అప్పు మిగిలింది. అన్నింటి కంటే విషాదం ఏంటంటే ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించి.. వారు సంతోషంగా ఉంటే చూడాలనుకున్న ఆ తండ్రి వాటిని చూడకుండానే మరణించాడు. 20 ఏళ్ల క్రితం పాపయ్య ప్రారంభించిన ప్రయణాన్ని ఇప్పుడు ఆయన కొడుకు మళ్లీ తిరిగి ప్రారంభించాలి. ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఓ రోడ్డు ప్రమాదం.. కేవలం 5 నిమిషాల్లో మింగేసింది. కాబట్టి రోడ్డు దాటుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.. భారీ వాహనాల సమీపంలో రోడ్డు దాటకండి అని సైబరాబాద్ పోలీసులు ప్రజలను కోరుతున్నారు. కాలి నడకన వెళ్లేవారు బాట లేని చోట ఫెన్సింగ్, ఇనుప కడ్డీలు తొలిగించి రోడ్డు దాటకూడదని.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. -
రక్తదానం చేసేవారికి అన్ని సౌకర్యాలు : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్ : రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా రక్తదానం సేకరణ కార్యక్రమం జరిగింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని పోలీసులు సోమవారం 117 యూనిట్ల రక్తదానం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ, తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని సజ్జనార్ తెలిపారు. ఒక్కరుచేసిన రక్తదానం ముగ్గురికి ఉపయోగ పడుతుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. కోవిడ్ కంట్రోల్ రూం నెంబర్స్ 9490617440, 9490617431కు సంప్రదిస్తే పోలీసుల సహకారం అందిస్తామని చెప్పారు. 13 అంబులెన్స్లను అందుబాటులో ఉంచామని, ఇప్పటి వరకు 250 మందికి మెడికల్ ఎమర్జెన్సీ సేవలు అందించామన్నారు. 5వందల పైచిలుకు డయాలసిస్ రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. -
సైబరాబాద్ చార్జర్స్ ఘనవిజయం
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో సైబరాబాద్ చార్జర్స్ జట్టు ఘన విజయం సాధించింది. యూసుఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సైబరాబాద్ చార్జర్స్ 36–24తో గద్వాల్ గ్లాడియేటర్స్పై గెలుపొందింది. 11 రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చార్జర్స్ రైడర్ రాజ్ కుమార్ ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకున్నాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేసిన చార్జర్స్ రైడర్ శ్రీ కృష్ణ (4 పాయింట్లు) ‘బెస్ట్ డిఫెండర్’గా నిలిచాడు. ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన చార్జర్స్ విరామ సమయానికి 16–11తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో మరింత చెలరేగిపోయిన రాజ్ కుమార్ తన రైడ్లలో పాయింట్లు తెస్తూ వచ్చాడు. నల్లగొండ ఈగల్స్ గెలుపు మరో మ్యాచ్లో నల్లగొండ ఈగల్స్ 42–31తో రంగారెడ్డి రైడర్స్పై గెలుపొందింది. ఈగల్స్ రైడర్ మల్లికార్జున్ 19 పాయింట్లతో చెలరేగగా... అతనికి సహచర ఆటగాడు జీవ గోపాల్ (5 పాయింట్లు) తన ట్యాక్లింగ్తో ప్రత్యర్థి రైడర్లను పట్టేసి తోడ్పాటు అందించాడు. విరామ సమయానికి ఈగల్స్ 13–18తో వెనుకంజలో ఉండగా... అనంతరం మల్లికార్జున్, జీవ గోపాల్ చెలరేగడంతో జట్టు విజయం ఖాయమైంది. మల్లికార్జున్కు ‘బెస్ట్ రైడర్’ అవార్డు, గోపాల్కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డు లభించాయి. -
ఏ వార్త అయినా ఏకపక్షంగా రాయెద్దు
-
‘చావు’ తెలివితేటలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదవశాతు మృతిచెందిన ఐటీ ఉద్యోగుల సెల్ఫోన్ నంబర్ ఇంటర్నెట్లో.. లేదంటే వారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటారు. నకిలీ ఐడీలతో డూప్లికేట్ సిమ్కార్డు పొందుతారు. రూ.లక్షల్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ (ముందస్తు ఆమోదిత రుణాలు) తీసుకుంటున్న ఆరుగురు సైబర్ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.53,95,043 కొల్లగొట్టిన ఈ నయా తరహా చీటింగ్కు ఓ ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్లో పనిచేసిన పాలపర్తి రఘురాం పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలు వినియోగించి రూ.2,76,000 రుణం పొందిన విషయం.. ఆ తర్వాత రికవరీకి వెళితే అతడు చనిపోయాడన్న విషయం తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఈ నెల 2న కేసు నమోదుచేశారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్లతో కలిసి వివరాలు వెల్లడించారు. నేరచరిత ఇదీ.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడు వాసి, ప్రధాన నిందితుడు నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్మీడియట్ వరకు చదివి ఒంగోలులోని ఆర్టీఏ కార్యాలయంలో డాటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల కోసం నకిలీ ఓటర్ ఐడీలు, పాన్కార్డులు గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్లో 2011లో నకిలీ వాహన నమోదు పత్రాలు సృష్టించిన కేసులో మాదనన్నపేట పోలీసులు, 2012లో సీసీఎస్ పోలీసులు, 2019 జూన్లో అక్రమ కాల్ రూటింగ్ మోసంలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్బీ, చైతన్యపురిలోనూ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు ఉపయోగించి రూ.91 లక్షలు డ్రా చేసిన కేసులు అతడిపై ఉన్నాయి. నిమ్మగడ్డ ఫణి చౌదరి బంధువు గుంటూరు వాసులు వేణుగోపాల్, క్లాస్మేట్ అయిన పెడవల్లి శ్రీనివాసరావు, స్వరూప్నాథ్ చౌదరిలపై కేసులు ఉన్నాయి. స్వరూప్నాథ్ చౌదరి స్నేహితుడు కండ్రూ హరీశ్, వీర శంకర్రావులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లతో కలిసి ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా నయా మోసాలకు తెరలేపారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. నయా మోసమిలా... ప్రమాదవశాత్తు మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలు ఇంటర్నెట్ ఉపయోగించి (మొబైల్ నంబర్, కార్యాలయ స్థలం వంటివి) గూగుల్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా నిమ్మగడ్డ ఫణి చౌదరి, మండవ స్వరూప్నాథ్ చౌదరిలు సులభంగా తెలుసుకునేవారు. ఈ సెల్ఫోన్ నంబర్ను సేకరించాక హరీశ్, వేణు గోపాల్ ఫొటోలను ఉపయోగించి శ్రీనివాసరావు నకిలీ ఐడీలు సృష్టించి సెల్ఫోన్ నెట్వర్కింగ్ కేంద్రాల్లో సమర్పించి అదే డూప్లికేట్ సిమ్కార్డును పొందేవారు. అలా వారి వద్ద రెండు రోజులు సిమ్కార్డు పనిచేస్తున్న సమయంలోనే మృతుడు కస్టమర్గా ఉన్న బ్యాంక్ల నుంచి సంక్షిప్త సమాచారాలు సెల్ఫోన్ నంబర్కు వచ్చేవి. ఆ విధంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించేవారు. ఆ తర్వాత స్వరూప్నాథ్ చౌదరి, హరీశ్లు ఆయా బ్యాంక్లకు వెళ్లి ఏదో ఒక కారణాన్ని సిబ్బందికి చెప్పి మొబైల్తో అనుసంధానంగా ఉన్న ఖాతాలను గుర్తిస్తారు. కస్టమర్ ఐడీ, బ్యాంక్ ఖాతాలను సేకరించాక నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయి ‘పాస్వర్డ్ మర్చిపోయారా’ అంటూ ఎంపికపై క్లిక్ చేసి జీమెయిల్, ఫోన్ నంబర్ సహాయంతో పాస్వర్డ్ను మారుస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మృతుడి ఐటీ ఉద్యోగుల జీమెయిల్స్, ఈమెయిల్స్ ఇంటర్నెట్లో దొరికితే సరి. లేదంటే మొబైల్ స్టోర్, కొన్నిసార్లు బ్యాంక్ల్లో ఫోన్ నంబర్ ఇచ్చి తెలుసుకుంటున్నారు. ఇలా వారికి ఈమెయిల్ ఐడీ తెలియగానే పాస్వర్డ్ను బ్రేక్ చేసి ఆ మెయిల్కు గతలలో వచ్చిన రుణాలు, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుంటారు. ఇలా వీరు ఈమెయిల్కు మార్చిన పాస్వర్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్కు లాగిన్ అవుతారు. ఆ వెంటనే ప్రీ అప్రూవ్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కోసం అభ్యర్థనలు పంపిస్తున్నారు. అలా ఆయా బ్యాంక్ల నుంచి రుణాలు మంజూరు కాగానే ఆ ఖాతా నుంచి వేణుగోపాల్, వీర శంకర్రావుల పేరుమీద తెరిచిన నకిలీ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసేవారు. ఆ తర్వాత బ్యాంక్లు, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. అలాగే తమ క్రెడిట్ కార్డుల నుంచి క్యాష్ పాయింట్స్లోని వివిధ అకౌంట్లకు బదిలీ చేసుకొని మూడు శాతం కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. మరికొన్ని సందర్భాల్లో మృతుల జీమెయిల్ ఐడీ వివరాలు తెలియకపోతే తాము పొందిన డూప్లికేట్ సిమ్ ద్వారా తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ మార్చాలని అభ్యర్థనలు పెట్టి మారాకా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిన ప్రీ అప్రూవ్డ్ రుణాలు పొందేవారు. డెబిట్ కార్డులు కూడా అభ్యర్థన పెట్టి కొరియర్ కార్యాలయం నుంచి ఫోన్కాల్ రాగానే అక్కడికెళ్లి హరీశ్, వేణుగోపాల్లు నకిలీ గుర్తింపు కార్డులు సమర్పించి తీసుకునేవారు. భవిష్యత్లో ఈ మోసాలను నివారించేందుకు రుణాలు మంజూరు చేసే సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని ఆర్బీఐకు లేఖ రాస్తాం. అలాగే సిమ్కార్డుల జారీలోనూ సరైన వెరిఫికేషన్ ఉండే విధంగా చూడాలని టెలికామ్ సర్వీసెస్కు సూచిస్తామ’ని సీపీ సజ్జనార్ వివరించారు. -
మందు తాగి పట్టు బడితే అంతే..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 1 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. మందు బాబుల ఆటకట్టించేందుకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసెస్లను ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్లో ఎక్కువగా ఈవెంట్స్, పబ్లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఏడాది ప్రతి ఈవెంట్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ట్రాఫిక్ ఆంక్షలు.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. - ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికిల్స్ను అనుమతించరు - పీవీ ఎక్స్ప్రెస్ వే పైనా వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ - కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపైకి అనుమతిస్తారు - లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు యథాతథం - గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ల మూసివేత - కామినేని, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, చింతల్ కుంట అండర్ పాస్ల మూసివేత - తెలుగుతల్లి ఫ్లైఓవర్, నల్గొండ చౌరస్తా పైవంతెన, పంజాగుట్ట ప్లైఓవర్ మూసివేత - వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలు చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు - మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు - రాత్రి 10 నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్పైకి వాహనాల రాకపోకలు నిలిపివేత - ఆ దారుల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులు -
ఆ ఆరున్నర గంటలు ఇలా...
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిందితుల కస్టడీ, కేసు దర్యాప్తు అంశాలను సైబరాబాద్ పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. తదుపరి విచారణ నిమిత్తం నలుగురు నిందితులను చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి కస్టడీలోకి తీసుకోవడానికి, పది రోజుల పాటు విచారించడానికి అనుమతిస్తూ షాద్నగర్ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు రోజుల పాటు జైల్లోనే నిందితుల్ని విచారించిన పోలీసులు గురువారం రాత్రి మాత్రమే బయటకు తీసుకొచ్చారు. చర్లపల్లి–చటాన్పల్లి మధ్య ఆరున్నర గంటల పాటు సాగిన ప్రక్రియలో ఆ నలుగురూ హతమయ్యారు. నిందితులు ఎవరి కంటా పడకుండా ఉండటానికి పోలీసులు తమ వాహనాల్లోని వెనుక సీటుకు, ముందు సీటుకు మధ్య వారిని పడుకోపెట్టి ప్రయాణించారు. చర్లపల్లి–చటాన్పల్లి మధ్య ఎప్పుడు ఏం జరిగిందంటే... గురువారం రాత్రి 11.50 దిశ కేసులో నలుగురు నిందితుల్నీ జైలు అధికారులు సైబరాబాద్ పోలీసు కస్టడీకి అప్పగించారు. గురువారం అర్ధరాత్రి 12.10 నిందితుల్ని జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రత్యేక బృందాలు వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని బయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజాము 1.15 పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్వే మీదుగా దాదాపు 50 కి.మీ. ప్రయాణించిన ఈ ‘కాన్వాయ్’తొండుపల్లి టోల్ప్లాజా వద్దకు చేరుకుంది. తెల్లవారుజాము 1.45 అరగంట పాటు అత్యాచారం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆపై నిందితుల్ని తీసుకుని షాద్నగర్ పోలీసుస్టేషన్కు బయలుదేరారు. తెల్లవారుజాము 3.40 షాద్నగర్ స్టేషన్లో విచారణ తరువాత నలుగురినీ ఒకే వాహనంలో తీసుకుని హతురాలి సెల్ఫోన్ రికవరీ చేయడానికి బయలుదేరారు. తెల్లవారుజాము 4.00 నలుగురు నిందితుల్ని తీసుకుని 10 మంది పోలీసులతో కూడిన బృందం చటాన్పల్లి బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. తెల్లవారుజాము 5.30 సెల్ఫోన్ అక్కడ పాతిపెట్టాం.. ఇక్కడ పాతిపెట్టాం.. అంటూ పలుచోట్లకు తిప్పిన నిందితులు పోలీసులపై రాళ్ల దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం మొదలెట్టారు. తెల్లవారుజాము 5.45 లొంగిపోమంటూ పోలీసులు చేసిన హెచ్చరికల్ని నిందితులు బేఖాతరు చేయడంతో ఆత్మరక్షణకు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. శుక్రవారం ఉదయం 6.15 నిందితుల నుంచి స్పందన ఆగిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఉదయం 6.25 నలుగురూ హతమైనట్లు గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్షీట్
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కుదిపేసి.. మహిళల భద్రతపై పెను సవాళ్లు విసిరిన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శరవేగంగా దర్యాప్తు జరిపి.. నెలరోజుల్లోపే ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉండనున్నారు. మొత్తం 50 మంది పోలీసులు దిశ కేసును విచారించనున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మొదలు కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్తో తమవంతు పాత్ర పోషించనున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసేవరకు ఈ ఏడు పోలీసు బృందాలు పనిచేయనున్నాయి. చదవండి: దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు ఇక, దిశను అత్యాచారం చేసి, క్రూరంగా చంపేసిన నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది. కేసులో కీలకం కానున్న సీసీటీవీ కెమెరా దృశ్యాల వీడియో అనాలసిస్, టెక్నీకల్ ఎవిడెన్స్ అనాలసిస్కు ఇంకొక టీమ్ పనిచేస్తోంది. సీన్ టు సీన్ అనాలసిస్ , క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ కోసం మరో టీమ్ రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ ఏడు బృందాలు సమన్వయంతో పనిచేస్తూ... సత్వరమే ఆధారాలు సేకరించి.. సాక్ష్యాలు క్రోడీకరించే సమగ్రంగా నెలరోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో నెలరోజుల్లోపు విచారణ జరిగి దోషులకు శిక్షలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. -
శంషాబాద్ హత్యాచార ఘటన : సీపీ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు. -
‘డ్రంకెన్ డ్రైవ్’కి రూ. పది వేలు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.. మొన్నటి వరకు రూ.2,000 జరిమానాతోనే సరిపెట్టిన మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ నూతన నిబంధనల ప్రకారం రూ.10,500 జరిమానా వేస్తోంది. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఫలక్నుమా, బహదూర్పుర, సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున నాంపల్లి మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ ట్రాఫిక్ మొబైల్ కోర్టు గురువారం జరిమానా విధించింది. సైబరాబాద్లో రూ.ఐదు వేల ఫైన్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల నుంచి డ్రంకెన్ డ్రైవర్లకు రూ.ఐదు వేల జరిమానా విధిస్తున్నారు. కూకట్పల్లిలోని మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు దాదాపు 50 మందికి రూ. 5 వేల చొప్పున జరిమా నా విధించిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్లో రూ.10,500 జరిమానా తొలిసారిగా 9 మందికి విధించడంతో అక్కడా కూడా ఈ విధానాన్ని ఆయా కోర్టులు అమలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కొత్త జరిమానాల వల్ల డ్రంకన్ డ్రైవ్లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
సైబరాబాద్కు సలామ్..
సాక్షి, సిటీబ్యూరో: ఒక్క వైట్ కాలర్ క్రైమ్ ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసేస్తుంది. ఈ తరహా ఆర్థిక నేరాలను నియంత్రించేందుకుగాను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మార్గదర్శనంలో దాదాపు ఏడాది క్రితం ప్రారంభించిన సైబరాబాద్ ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. ముఖ్యంగా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలపై ఉక్కుపాదం మోపుతోంది. రూ. 50 లక్షలకు పైబడిన బ్యాంక్, చిట్ ఫండ్ మోసాలు, నకిలీ వీసాలు, పాస్పోర్టు కేసులు, ఆర్థిక నేరాల కేసులు, ఉద్యోగ మోసాలు, మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన వారి వ్యథలను చెబుతూనే ప్రజలను చైతన్యం చేయడంలో సఫలీకృతమైన సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ దేశాన్ని ఊపేసిన క్యూనెట్ అనుబంధ ఫ్రాంచైజీల ఆటకట్టించడంలో విజయం సాధించింది. ఒక్క సైబరాబాద్లోనే 38 కేసులు నమోదైన క్యూనెట్ అనుబంధ సంస్థ విహన్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ కేసులో ఇప్పటికే 70మందిని అరెస్టు చేసి, రూ.2.7 కోట్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ కంపెనీపై పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకొని మూసివేత దిశగా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ చరిత్రలోనే ఈ కేసుతో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఇతర కేసుల్లోనూ ఇదే «ధోరణితో ముందుకెళతామని సైబరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ చేధించిన కేసులివీ... ♦ కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీల ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని భారీ ప్రచారం చేసి 650 మందిని మోసం చేశారు. బేగంబజార్లో కిలో రూ.38 చొప్పున కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందికి టోకరా వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పల మల్లిఖార్జున ముఠాను ఆగస్టులో అరెస్టు చేసింది. ♦ మునక్కాయల పొడిని వాడటం వల్ల అనతికాలంలోనే బరువు తగ్గి ఆరోగ్యకంగా ఉండొచ్చంటూ ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ (ఎఫ్ఎంఎల్సీ) కంపెనీ ప్రచారం చేసి తమ సంస్థల్లో చేరిన ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూలు చేసి నాణ్యతలేని ఉత్పత్తులను పంపిణీ చేసింది. మరో ముగ్గురిని చేర్పిస్తే కమీషన్ రావడంతో పాటు మీరు చెల్లించిన డబ్బులు మీ జేబులోకి వస్తాయని, అనతికాలంలోనే లక్షాధికారులు కావొచ్చంటూ అంకెల గారడీ చేయడంతో 60 లక్షల మంది కంపెనీ జాబితాలో చేరిపోయారు. దీనిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా రూ.3 వేల కోట్ల మోసం వెలుగులోకి వచ్చింది. గత సెప్టెంబర్ 8న సదరు కంపెనీ చైర్మన్, మేజేజింగ్ డైరెక్టర్ రాధేశ్యామ్తో పాటు బన్సీలాల్ను అరెస్టు చేశారు. ♦ క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ తమ సంస్థలో రూ.7 నుంచి రూ.10వేల లోపు డబ్బులు చెల్లించి చేరితే ఆరోగ్యకర ఉత్పత్తులు, లేదా కాస్మోటిక్స్, వాచ్లు ఆ ధరకే వస్తాయి. మీరు మరో ముగ్గురిని చేర్పిస్తే కమీషన్ల రూపంలో మీ డబ్బులు మీకు వస్తాయని, ఇలాగే కొనసాగిస్తే అనతికాలంలో లక్షలు సంపాదించవచ్చంటూ ప్రచారం చేసి పలువురిని మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో జనవరి 8న ఆ సంస్థకు చెందిన 58 మంది ప్రతినిథులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సెలబ్రిటీలకు సైతం నోటీసులు జారీ చేశారు. ♦ 2001 నుంచి ఈ–లెర్నింగ్, ఫ్యాషన్ దుస్తులు, హలీడే ట్రిప్ పేరిట 17 లక్షల మందిని మోసగించి రూ.ఐదువేల కోట్ల మోసం వరకు చేశారన్న అభియోగాలపై ఆ కంపెనీ డైరెక్టర్ పవన్ మల్హన్, అతని కుమారుడు హితిక్ మల్హన్ను మంగళవారం అరెస్టు చేశారు. ఆనందంగా ఉంది అతి తక్కువ సమయంలోనే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇందుకు షార్ట్కట్లు కూడా ఏమీ ఉండవు. మల్టీలెవల్ మార్కెటింగ్లో చేరాలంటూ కబురు అందితే తిరస్కరించండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది ఎంఎల్ఎం మోసమైతే పోలీసుల దృష్టికి తీసుకురండి. తాము చేరడమే కాకుండా వందలాది మందిని గొలుసుకట్టు పథకంలో చేర్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్యూనెట్ అనుబంధ సంస్థ విహన్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ విషయంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది.– వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
హబ్.. హిట్ హౌస్ఫుల్!
సాక్షి, హైదరాబాద్: టీ హబ్ అంకుర పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అద్భుతాలకు వేదిక అయింది. స్టార్టప్స్ స్పీడప్ అయ్యాయి. లోకల్ అంకుర పరిశ్రమలు గ్లోబల్ స్థాయిని అందుకున్నాయి. ప్రపంచ ఐటీ విపణిలో తనదైన వాటాను సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్లోని టీ–హబ్లో ఏటా సరాసరి వంద స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకుంటున్నాయి. సాంకేతిక ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ఐటీ, బ్యాంకింగ్, సేవా, బీపీవో, కేపీవో, ఇన్సూరెన్స్ రంగాల్లో వినియోగదారులకు అందించే సేవలను అత్యంత సరళతరం చేయడం ద్వారా టీ హబ్ అద్భుతాలు సృష్టిస్తోంది. విదేశీ మారకద్రవ్యాన్ని భారీస్థాయిలో ఆర్జించడం ద్వారా ఉపాధి, వాణిజ్య రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోంది. నాలుగేళ్ల టీ–హబ్ ప్రస్థానంలో సుమారు 450 కంపెనీలు ఇక్కడే ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా ఎదిగి కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించినట్లు టీ–హబ్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెలిసిన ఈ భవనంలో ప్రస్తుతం 170 అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 870 మంది సాంకేతిక నిపుణులు తమ మేధస్సు, సృజనకు పదును పెడుతుండటం విశేషం. ఇందులో అంకుర పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు మరో ఏడాదిపాటు నిరీక్షించక తప్పనివిధంగా హౌస్ఫుల్ అయింది. టీ–హబ్ అంటే.. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే నిపుణులను, కార్పొరేట్ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్ను గచి్చ»ౌలిలో ఏర్పాటు చేసింది. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలనుకునే సాంకేతిక నిపుణులకు టీ–హబ్ ఓ దిక్సూచిగా మారిందని నాస్కామ్ తాజా నివేదికలో పేర్కొంది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్లు దేశ, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అద్భుతాలు సృష్టించిన టీ–హబ్ స్టార్టప్లివే.. ఎనీటైమ్లోన్.ఐఎన్: నాన్బ్యాంకింగ్ ఆర్థిక సంస్థగా పేరొందిన ఈ సంస్థ గతేడాది ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న పరిశ్రమలకు ఆర్థికదన్ను అందిస్తోంది. మైగేట్: ఈ సంస్థ 8.8 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. లూప్ రియాల్టీ అండ్ అప్నోవేషన్ టెక్నాలజీ: హెచ్డీఎఫ్ డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డును గెలుపొందింది. గ్లామ్ఈగో: ఈ సంస్థ ప్రారంభంలోనే నాలుగుకోట్ల రూపాయల బ్రాండ్ క్యాపిటల్ సాధించింది. పేమ్యాట్రిక్స్: ఈ సంస్థ వంద కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. డొనేట్కార్ట్: ఈ సంస్థ రూ.257 కోట్ల టర్నోవర్ సాధించింది. పల్స్యాక్టివ్స్టేషన్స్: ఈ సంస్థ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ఐటీ పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. స్టాట్విగ్ గెట్స్: ఈ సంస్థ హెల్త్కేర్ రంగంలో చేసిన ఆవిష్కరణలకు యూనిసెఫ్ ప్రశంసలు పొందింది. గాయం మోటార్స్: ఈ సంస్థ ఫోర్బ్స్ ఏసియా–30 సంస్థల జాబితాలో చోటు సంపాదించింది. హగ్ ఇన్నోవేషన్స్: నాస్కామ్ సంస్థతోపాటు లండన్ మేయర్ ప్రశంసలు పొందింది. ఈ ఏడాది చివరలో టీ–హబ్ రెండోదశ టీ–హబ్ మొదటిదశ విజయవంతం కావడంతో ఈ ఏడాది చివరలో మాదాపూర్లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ రెండోదశ భవనాన్ని నిర్మిస్తున్నారు. పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ భవనంలో సుమారు వెయ్యి అంకుర పరిశ్రమలకు చోటు కలి్పంచేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ టీ–హబ్లో పురుడుపోసుకునే స్టార్టప్ కంపెనీలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన ల్యాబ్ 32 ప్రోగ్రాం అద్భుత ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వందలాది కంపెనీలకు సాంకేతిక అంశాలతోపాటు ఆర్థికంగా, వాణిజ్యపరంగా కలిసొచి్చంది. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తాం. –రవినారాయణ్, సీఈవో, టీహబ్ -
పోలీసుల వద్దకే ఆరోగ్య భద్రత
సాక్షి, సిటీబ్యూరో: శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ల పరిధిలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించినా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రతి పోలీసు స్టేషన్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీ ఆదేశాల ప్రకారం సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రుల వైద్యులను సమన్వయం చేసి ప్రతి బుధవారం కొన్ని ఠాణాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలానగర్, మాదాపూర్, రాయదుర్గం, ఆర్సీపురం, శంషాబాద్ పోలీస్ స్టేషన్లలో యశోధ, కేర్ హైటెక్ సిటీ, మ్యాక్స్ క్యూర్, కాంటినెంటల్, సిటిజన్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ, 2డీ ఎకోటెస్టులు, కార్డియో, ఆర్థో, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో కన్సల్టేషన్ నిర్వహించారు. దీంతో పాటు ఎఫ్ఎంస్ డెంటల్, డాక్టర్ ఐ అగర్వాల్, మెక్సివిజన్ వారిచే దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంది. వచ్చే బుధవారం మిగతా పోలీస్ స్టేషన్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రజల వద్దకే పాలనలా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంధి పలికిన సైబరాబాద్ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శిబిరాల్లో సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, అడిషనల్ డీసీపీ సైబరాబాద్ పర్యవేక్షణలో పోలీస్ డాక్టర్లు సరిత, సుకుమార్ పాల్గొన్నారు. సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, డాక్టర్లు సరిత, సుకుమార్, సంబంధిత ఇన్స్పెక్టర్లకు పోలీస్ అధికారుల సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు చార్మినార్: విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ఎంతో అవసరమన్నారు. పోలీసు విభాగంలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ మురళీకృష్ణతో పాటు అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ నారాయణ్ రావు, డాక్టర్ హరినాథ్, డాక్టర్ ప్రశాంత్ గుప్తా, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని పెట్రోలింగ్ వాహనాల ఫిట్నెస్ తదితర అంశాలను పరిశీలించి వాహనాల పనితీరు పట్ల సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు కొత్త పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యపై సైబరాబాద్ కమిషనరేట్లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విడతలవారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయటకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఐటీ ప్రతినిధులు అంగీకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. వర్షం పడినప్పుడు ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో ఉద్యోగులను ఇళ్లకు పంపడానికి ఐటీ కంపెనీలు ఒప్పుకున్నాయని, ఆయా కంపెనీల పనివేళలకు నష్టం కలుగకుండా ఉద్యోగులను బయటకు పంపనున్నాయని ఆయన వివరించారు. ట్రాఫిక్ విభాగం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ సజ్జన్నార్ తెలిపారు. 24 గంటల ముందే వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీచేస్తామని, ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో రద్దీ గురించి అలర్ట్ చేస్తారని తెలిపారు. విడుతలవారీగా ఐటీ ఉద్యోగులు కంపెనీల నుంచి బయటకు రావడం వల్ల పెద్దగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐటీ కారిడార్లో ఇప్పుడు 5 లక్షలు మంది ఉద్యోగులు ఉన్నారని, ఒకేసారి మూడున్నర లక్షల కార్లు బయటకు వస్తుండటంతో రోడ్లు అన్ని ట్రాఫిక్ స్తంభించిపోతున్నాయని, అందుకే ఈ మేరకు పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్ : అగ్రీగోల్డ్, క్యూనెట్ వంటి స్కాంల గొడవ తేలక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ‘ఈ బిజ్ అనే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 1000 కోట్లు వసూలు చేసింది. 2001లో నోయిడా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంది. ఇప్పటికే ఈ సంస్థలో దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారి దగ్గర నుంచి సంస్థ నిర్వాహకులు ఇప్పటి వరకూ సుమారు రూ.1000 కోట్లు వసూలు చేశార’ని సజ్జనార్ తెలిపారు. సజ్జనార్ మాట్లాడుతూ.. ‘తొలుత సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. ఆ తరువాత ఎంతమందిని జాయిన్ చేస్తే.. అంత కమిషన్ ఇస్తామంటారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్ కోర్సు, కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తామని చెప్తారు. అనంతరం ధ్రువపత్రం ఇస్తారు. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. దేశవ్యాప్తంగా ఈ స్కాం బాధితులున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై పరిధిలో ఎక్కువ మంది ఉన్నార’ని సజ్జనార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ను అరెస్ట్ చేశామని.. అంతేకాక సంస్ధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.70 లక్షలను ఫ్రీజ్ చేశామని సజ్జనార్ వెల్లడించారు. -
సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్ సిటీ మొదటిదశా పూర్తికాలేదు!
హైదరాబాద్ను ప్రపంచపటంలో పెట్టింది నేనే.. హైటెక్సిటీ కట్టింది నేనే.. ఔటర్ రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానశ్రయమూ నా ఘనతే.. సైబరాబాద్ కట్టింది నేనే.. అసలు తెలంగాణకు ఐటీ తీసుకొచ్చిందీ నేనే.. – ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చేసే వ్యాఖ్యలివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తనకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ సైబరాబాద్ నిర్మాత తానే అంటారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకూ క్రెడిట్ తీసుకుంటారు. తెలంగాణలో కంప్యూటర్ విజ్ఞానాన్ని పరిచేయం చేసింది తానేనని తడుముకోకుండా చెప్పుకుంటారు. బెంగళూరు సిలికాన్ సిటీని అభివృద్ది చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ దానికి తానే కారణమని ఏనాడూ చెప్పలేదు. ముంబై దీన్ని వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ చక్కెర రైతుల అభివృద్దికి తోడ్పడిన శరద్ పవార్ ఆ ఘనత తనదేనని ఎప్పుడూ గొప్పలు ప్రదర్శించలేదు. తమిళనాడు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని తమిళనాడును ముందుకు తీసుకెళ్లిన దివంగత నేత జయలలిత దానికి తానే కారణమని ఏనాడు పొంగిపోలేదు. సాక్షి, హైదరాబాద్: గడిచిన 25 సంవత్సరాల పరిణామక్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నం చేసినప్పుడు ‘ది బర్త్ అండ్ గ్రోత్ అఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ’ అనే గ్రంథం ఒకటి లభ్యమైంది. భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అభివృద్దికి తోడయ్యేలా, దానికి కృషి చేసిన మహనీయులను గుర్తుచేసే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదలా ఉంచితే, అసలు సైబరాబాద్ను చంద్రబాబే నిర్మించారా? ఆయన పదే పదే చెబుతున్నట్టు అక్కడ ఉన్న కట్టడాలన్నీ ఆయన హయాంలో పూర్తయి సైబరాబాద్గా రూపాంతరం చెందిందా? ఈ అనుమానం కూడా రావడంతో వాస్తవాలు కనిపెట్టేందుకు ‘సాక్షి’ గూగల్ ఎర్త్ను శోధించిననప్పుడు అవన్నీ బూటకమని, బాబు హయాంలో సైబర్ టవర్ మినహా ఎలాంటి కట్టడం లేదని నిర్ధారణ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చర్యల కారణంగా 2010 నాటికి సైబరాబాద్ పూర్తి స్థాయిలో నిర్మితమైంది. 1987లోనే హైదరాబాద్లో ‘ఇంటర్గ్రాఫ్’ సంస్థ... హైదరాబాద్లో ఐటీ కంపెనీల ఏర్పాటు 1987లోనే ప్రారంభమైంది. పీవీ నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయ్యాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి ఐటీ పాలసీని తీసుకొచ్చి అమీర్పేటలోని మైత్రీవనంలో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించారు. మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది కూడా మైత్రీవనంలోనే. కంప్యూటర్లు అనగానే గుర్తుకువచ్చే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ) రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటైంది. అంతకంటే ఐదేళ్ల ముందు 1987 ఆగస్టులో హైదరాబాద్లో ఇంటర్గ్రాఫ్ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి. అదే సంవత్సరం రామలింగరాజు తన సమీప బంధువులతో కలిసి సికింద్రాబాద్లో ‘సత్యం’ కంప్యూటర్స్ను ప్రారంభించారు. అది దినదినాభివృద్ది చెంది 1992లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ తరుణంలోనే హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాదాపూర్లో సైబర్ టవర్స్తోపాటు అక్కడ ఐటీ పరిశ్రమకు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకీ ఉత్తుత్తి గొప్పలు? కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ రంగంలో వాయువేగంతో దూసుకుపోవడానికి తన వంతు సాయపడ్డ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అందుకు తానే కారణమని ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి తమ వంతు ఐటీ వృద్దికి ఊతమిచ్చినా ఎవరూ చంద్రబాబు మాదిరి గొప్పలు చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రమే పదేపదే ఈ దేశంలో తాను లేకపోతే ఐటీ లేదన్న రీతిలో ఎందుకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో 8వ స్థానంలో ఉంది. తెలుగు ప్రజలకు కంప్యూటర్ విజ్ఞానాన్ని తానే నేర్పానని కూడా బాబు పదేపదే చెబుతుంటారు. కానీ అది కూడా ఒట్టిదే అని తేలిపోయింది. దేశాభివృద్దికి సాఫ్ట్వేర్ ఊతమిస్తుందని భావించచడంతో పాటు నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడుతుందన్న భావనతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మొదటి దశలోనే 1992లో హైదరాబాద్కు ఆరు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు మంజూరు చేశారు. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా ఏర్పడ్డ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ తొలుత అమీర్పేటలోనే ఎస్టీపీఐని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇంత ముందుచూపుతో పీవీ వ్యవహరించినా ఆ తర్వాత మూడేళ్లకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దానిని పట్టించుకోలేదు. వారిది దూరదృష్టి.. చంద్రబాబుది ‘రియల్’ దృష్టి 1995లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగుళూరు ఐటీ రంగంలో దూసుకుపోతున్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పైగా దూరదృష్టితో భవనాలు నిర్మించాలని, భూములు కేటాయించాలని అంతకుముందు ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన చంద్రబాబు.. మొదట ఐటీ రంగాన్ని అభివృద్ది చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి, ‘రియల్ ఎస్టేట్’ కోసం దానిని ఉపయోగించుకున్నారు. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ స్టడీస్కు చెందిన రీసెర్చ్ స్కాలర్ దలేల్ బెన్బలాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఏడాది పొడవునా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు తన కోసం, తన సొంత సామాజికవర్గానికి చెందినవారి కోసం భూములను ఏ విధంగా కొనిపించిందీ, ఆ తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణానికి ఎలా పూనుకున్నదీ పూసగుచ్చినట్లు వివరించారు. సైబర్ టవర్స్ శంకుస్థాపనకు ముందే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నల్లగండ్ల ప్రాంతాల్లో చంద్రబాబు భూములు కొనుగోలు చేయడంతోపాటు తన బినామీల ద్వారా కూడా భారీగా భూములు కొనుగోలు చేయించారు. అక్కడ ఐటీ పరిశ్రమ వస్తుందని తెలియని వందలాది మంది పేదలు తమ భూములను అత్తెసరు ధరకు అమ్ముకున్నారు. పేదల భూములు కాజేయడం ఒక ఎత్తయితే, దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. అదే క్రమంలో తన, తన బినామీల భూముల ధరలు పెరిగేందుకు వీలుగా సైబర్ టవర్స్ నిర్మాణం చేపట్టారు. టెండర్లు లేకుండా దానిని ఎల్అండ్టీకి కేటాయించి, భారీగా నజరానాలు కూడా పొందారు. సైబరాబాద్ నిర్మాత బాబు కానే కాదు.. బాబు ఆపధర్మ సీఎంగా మారిపోయే నాటికి సైబరాబాద్ ప్రాంతంలో ఒక్క సైబర్ టవర్స్ తప్ప మరో నిర్మాణం లేదు. అలాంటప్పుడు ఆయన సైబరాబాద్ నిర్మాత ఎలా అవుతారు? సైబరాబాద్ ప్రాంతం ఒక నగరంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. వాయువేగంతో ఆయన తీసుకున్న చర్యల కారణంగా హైటెక్ సిటీ నిర్మాణం 2008 నాటికి తుది దశకు చేరుకుని కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయి. చంద్రబాబు హయాంలో ఫైనాన్సియల్ జిల్లా ప్రతిపాదనేదీ లేదు. అలాంటప్పుడు తానే నిర్మించానని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలంహైదరాబాద్ను తానే కట్టానని చెప్పిన చంద్రబాబుకు అకస్మాత్తుగా తన దృష్టిని సైబరాబాద్ మీదకు ఎందుకు మళ్లించారు? దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన ఓ పంచ్ కారణం. చంద్రబాబు హైదరాబాద్ కడితే కులీఖుతుబ్షా ఏం కట్టారన్న ప్రశ్నకు చంద్రబాబు దిమ్మె తిరిగింది. ఆ వెంటనే సైబరాబాద్ తానే కట్టానన్న పల్లవి అందుకున్నారు. కానీ, చంద్రబాబు దిగిపోయే నాటికి హైటెక్ సిటీ మొదటి దశ కూడా ప్రారంభం కాలేదు. ఫైనాన్షియల్ జిల్లా ఊసే లేదు. దానికి మించి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా లేదు. ఇవన్నీ వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్నవే. 2003 నాటి గూగుల్ చిత్రాలు చూస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్న సైబరాబాద్.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఆరేళ్లకు గానీ నగరంగా రూపాంతరం చెందలేదు. - మరి చంద్రబాబు మాత్రమే ఎందుకు పదేపదే అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు? - తనకు సంబంధం లేని అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో తన ఘనతేనని ఎందుకు డప్పు వేసుకుంటున్నారు? - హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టానని,దానికి హైటెక్ సిటీయే నిదర్శనమని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? - సైబరాబాద్ను తానే సృష్టించానని చెప్పుకోవడం, ఆ ఘనతను సొంతం చేసుకోవడానికి ఎందుకంత తాపత్రయం చెందుతున్నారు? ఇది 2004 మే నెలలో నానక్రామ్గూడ ప్రాంతపు గూగుల్ ఫొటో. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా మొదలే కాలేదని తెలుస్తోంది. -
కామ్గా.. కానిచ్చేస్తున్నారు
దేశవ్యాప్తంగా కొన్నేళ్ల క్రితం వరకు దోపిడీలు, దొంగతనాలు, బ్యాంకు లూటీలు తదితర నేరాలు భారీ స్థాయిలో జరిగేవి. టెక్నాలజీ పెరగడం, కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించడంతో దోపిడీ గ్యాంగ్లు రూట్మార్చి ఆర్థిక నేరాల ద్వారా వందల కోట్లు సునాయసంగా కొట్టేస్తున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో దోపిడీ, దొంగతనాలు తగ్గి ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ప్రతీ ఏటా ఏకంగా 100% పెరిగితే మరికొన్ని చోట్ల 50% పెర గడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా రాష్ట్రంలో 2017 ఒక్క ఏడాదిలోనే రూ.2,739 కోట్ల మేర ప్రజలు ఆర్థిక నేరస్తుల ద్వారా నష్టపోయినట్లు రాష్ట్ర నేరపరిశోధన విభాగం తేల్చింది. వేల కోట్ల దోపిడీ... సాధారణ దోపిడీలు, దొంగతనాలు కాకుండా బ్యాంక్ మోసాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్, చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీములు, టెలీ మార్కెటింగ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, హెల్త్కేర్ ఫ్రాడ్స్, ఇన్యూరెన్స్ ఫ్రాడ్స్, సాఫ్ట్వేర్ పైరసీ, హక్కు సంబంధిత మోసాలు, డిమాండ్ డ్రాఫ్ట్, ఎఫ్డీ రిసీట్, వీడియో పైరసీ, బహుమతులు, లక్కీ లాటరీ మోసాలు, ఎంప్లాయిమెంట్ చీటింగ్, సైబర్ క్రైమ్.. ఇలా అనేక రకాల వైట్ కాలర్ నేరాలు ఆర్థిక నేరాల్లో కీలకంగా మారుతూ వస్తున్నాయి. వీటి ద్వారా వందల నుంచి వేల కోట్ల వరకు మాఫియా దోపిడీకి పాల్పడుతోంది. అప్రమత్తత, ఆలోచన తప్పనిసరి.. ఆర్థిక నేరాల్లో మోసపోతున్న ప్రజలకు అప్రమత్తతే శ్రీరామ రక్ష అని సీఐడీ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. డిపాజిట్లు, లాటరీలు, చిట్ఫండ్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, షేర్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఒకటికి రెండుసార్లు ప్రకటనలిస్తున్న సంస్థ, దాని వెనకున్న జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలని, కంపెనీ సంబంధించిన వివరాలు, అందులో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామని చెప్పే వాటిపై జాగ్రత్త వహించాలని సీఐడీ అవగాహన కల్పిస్తోంది. ఆర్థిక నేరాల్లో నిందితులు టెక్నాలజీని వాడుకుని మోసం చేస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయని సీఐడీ అభిప్రాయపడింది. ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటూ ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్, లాటరీ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారని, వీటి వల్లే నష్టం వందల కోట్లకు చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబరాబాద్కు మొదటిస్థానం... రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో ఆర్థిక నేరాల నమోదులో సైబరాబాద్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. రాజధాని ప్రాంతం చుట్టూ వైట్కాలర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేసులు నమోదవుతున్నా వాటిని ఛేదించడంలో సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, ట్రాకింగ్ లోపంతో నిందితులను పట్టుకోవడం కష్టసా«ధ్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. -
సైబరాబాద్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు నేరాల బాట పట్టకుండా సమాజాన్ని సానుకూల ధృక్పథంతో చూడాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు ‘స్టూడెంట్ పోలీసు క్యాడెట్’(ఎస్పీసీ) ప్రాజెక్టును అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసుల్లా తీర్చిదిద్దితే ఎక్కడా ఎటువంటి నేరాలకు అస్కారం ఉందడదనే భావనతో ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మియాపూర్, శివరాంపల్లి, మైలార్దేవ్పల్లిలోని మూడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎస్పీసీ ప్రాజెక్టుపై సోమవారం అవగాహన కల్పించనున్నారు. రెండేళ్ల వ్యవధి గల ఈ ప్రాజెక్టుకు ఎంపికైన ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు చట్టాలతో పాటు పోలీసింగ్ వ్యవస్థ, సమాజంలోని సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగించనున్నారు. పోలీసులతో పాటు అటవీ, అగ్నిమాపకశాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, విద్యా విభాగాలకు చెందిన అధికారులు కూడా పాఠాలు బోధించనున్నారు. సమాజహితులుగా... బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తయారుచేసిన పాఠ్యాంశాల్లో భాగంగా ట్రాఫిక్ నియమాలతో పాటు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారు. బాల్యవివాహలు, మహిళలు, పిల్లల భద్రతపై పాఠాలు చెబుతారు. అవినీతి నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ప్రకృతి విపత్తుల వేళ పౌరుడిగా వ్యవహరించాల్సిన తీరును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. చట్టాలపై అవగాహన కలిగిస్తారు. సమాజంలో పెరుగుతున్న నేరాలను నిరోధించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, నేరగాళ్లకు పడుతున్న శిక్షలను కూడా పూర్తి స్థాయిలో తెలియ చెబుతారు. కమ్యూనిటీ పోలీసింగ్ పనితీరును వివరిస్తారు. జీవితంలో కష్టాలు ఎదురొచ్చినప్పుడూ ఒత్తిడికి లోనవకుండా వ్యవహరించాల్సిన తీరు, టీమ్ స్పిరిట్తో నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నేషనల్ క్యాడెట్ కాప్స్ (ఎన్సీసీ) తరహాలో విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ (అవుట్డోర్), స్టడీ క్లాసెస్ (ఇండోర్), జిల్లా రాష్ట్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్స్ నిర్వహించనున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఒకటి ఫిజికల్ ట్రైనింగ్, మరొకటి పరేడ్ కోసం అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనున్నారు. అవసరమైతే వలంటీర్లుగా వీరు సేవలను పోలీసులు ఉపయోగించుకోనున్నారు. 2010లో కేరళలోని 127 పాఠశాలల్లో అమలుచేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో దేశవ్యాప్తంగా గతేడాది నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో చేయాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులు నేరబాట పట్టకుండా, ఉగ్రవాద భావజాలాల్లో చిక్కుకోకుండా ఉంటారని, సమాజంపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుందని పేర్కొనడంతో అన్ని రాష్ట్రాలు ఎస్పీసీ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేస్తున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బాధ్యతను తీసుకున్నారు. వీరికి ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని అందజేయనున్నారు. ప్రతి వారం ఒక్కో గంట అవుట్డోర్ కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. -
డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి...
సాక్షి, హైదరాబాద్: యూరియాతో పాలు.. ఇనుప రజను పౌడర్తో టీ పొడి.. ఇటుక పొడితో కారం... బట్టల సోడాతో చక్కెర.. పసుపు పచ్చ మోటానిల్తో పసుపు పౌడర్... జంతువుల కొవ్వుతో వంట నూనె.. నగరంలో ఇలా ప్రతి వస్తువూ కల్తీమయంగా మారింది. ఏ వస్తువు తింటే ఏ రోగమొస్తుందోనని జనం అల్లాడే పరిస్థితి దాపురించింది. నగర శివారు ప్రాంతాలు అడ్డాగా కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి నగర మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని కల్గిస్తుందన్న విషయం తెలిసినా కూడా కేవలం ధనార్జనే ధ్యేయంగా కల్తీ దందా జోరుగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరికీ ప్రవేశం లేకుండా నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఉదయం లేవగానే తాగే కాఫీ లేదా చాయ్ పౌడర్లో చెక్కపొట్టు.. లేదంటే ఇనుప రజను ఉండి ఉంటుందంటే మీకు ఆశ్చర్యంగా కలగవచ్చు! చాయ్ లేదా కాఫీ తయారుచేయడానికి మీరు వాడే పాలలో పంటపొలాలకు వేసే యూరియా ఆనవాళ్లు ఉంటాయంటే మీరు భయకలగ వచ్చు...ఇడ్లీ లేదా దోశ లేదా ఉప్మా లేదా.. చపాతీలు వేసుకునే గోధుమపిండిలో మీరు తినకూడని, మీ కడుపులోకి ప్రవేశించకూడని పదార్థాలు యథేచ్ఛగా కలసిపోతున్నాయన్న వాస్తవం మీరు జీర్ణించుకోలేక పోవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. జీర్ణించుకోలేని సత్యాలు! బ్రాండ్ ఎదో...లోకల్ మేడ్ ఎదో...ఏది స్వచ్ఛమో.. ఏది నకిలీయో..అంతా మాయాబజార్. ఆహార పదార్థాలే ఎక్కువ చిన్న పిల్లలకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నునె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం కల్తీకి గురవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకలీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. నగర శివారు నుంచే.. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్, ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీషరీఫ్, జల్పల్లి, షాహీన్నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్పేట్, నాదర్గుల్, బడంగ్పేట్, కందుకూరు, మామిడిపల్లి, హయాత్ నగర్, పెద్ద అంబర్పేట్, అదిభట్ల, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్దేవ్పల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. రూ.50కి అమ్మే పదార్థం పది రూపాయలకే తయారవుతుంది. ఏకంగా రూ.40 లాభం పొందుతున్నారు. ఇంకాస్త లాభం ఎక్కువ రావాలంటే ప్యాకింగ్ మార్చేసి..బ్రాండ్ అలంకారం చేసి లారీల్లో గ్రామాలకు, బస్తీలు, కాలనీల్లోని చిన్నాచితక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. కల్తీకి గురవుతున్న కొన్ని వస్తువులు ఇలా.... కారం ఇలా కల్తీ ఫ్రీజర్ గోదాముల నుంచి బూజు పట్టిన మిరపకాయలు కోనుగోలు చేస్తారు. వాటిని మర పట్టించి చెక్కపొడి, నూనె, కొన్ని రకాల రసాయానాలు కలిపి కారాన్ని తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఏ బ్రాండెడ్ కారం పొడికి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ కవర్లు తయారు చేయించి అందులో ఆ కారం వేసి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు దాన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. యూరియాతో పాలు... యూరియా, నూనె, క్రిమిసంహారక మందులతో పాటు క్యాస్టిక్ సోడా, అమ్మోనియం వంటి రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. శివారు ప్రాంతాలలోని పలు ఇళ్లలో కల్తీ పాలు తయారు చేసే యూనిట్లపై ఇటీవల ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్... రేషన్ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిషింగ్ చేయించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ప్రజలకు సన్న బియ్యం అని ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. నూనె..నెయ్యి కల్తీ ఇలా... జంతు కళేబరాలతో, వ్యర్థాలను ఉపయోగించి నూనె తయారు చేస్తున్నారు. కళేబరాలను, జంతువుల వ్యర్థాలను మరిగించి వాటి ద్వారా వచ్చే కొవ్వులతో పలు రకాల రసాయనాలు కలిపి నూనె, నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో తేలింది. ఏది అసలు..ఏది నకిలీ? కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఒక ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం.. కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇకపై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకోవడం...ఇలా కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.. పోలీసు నిఘా పెరిగినా.. కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కల్తీ అడ్డాలపై పోలీసులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. పోలీసులు దాడులు పెరుగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పోలీసులు సోదాలు చేసి.. కల్తీల బండారం బయటపెడుతున్నప్పటికీ.. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయన్నది మాత్రం సందేహమే. రాచకొండ పరిధిలోనే ఎక్కువ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కల్తీ కార్ఖానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, కుర్కురే నుంచి మొదలుకొని నిత్యం వాడే వస్తువులు..నూనె, మసాలాలు, అల్లం వెల్లుల్లి, టీ పొడి, పాల పౌడర్ వరకు అన్ని కల్తీల కార్ఖానాలు ఇక్కడే ఉన్నాయి. రాచకొండ ఎస్వోటీ అధికారులు గత కొన్ని నెలల్లో 100 కార్ఖానాలపై దాడులు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. రోగాల దాడి ఇది నగరంలో ఒక యువతి వ్యథ. తీవ్ర జ్వరం.. ముఖంపై ఎర్రని మచ్చలు. ఇంట్లో ఏదో అలర్జీ అనుకున్నారు. వేడివల్ల వచ్చాయేమోనని సీరియస్గా తీసుకోలేదు. నెల గడిచినా తగ్గలేదు. ఓ కార్పొరేట్ హాస్పిటల్కు వెళితే. అక్కడ రక్త పరీక్షలు చేస్తే అసలు సంగతి తేలింది. కల్తీ ఆహారం తినడంవల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధికి గురైనట్టు అక్కడ డాక్టర్లు నిర్థారించారు. నగరంలో ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. రసాయనాలు, విష పదార్థాలతో కల్తీ అవుతున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లే జనం ఇలాంటి వ్యాధుల బారినపడుతున్నారు. కాగా కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా, యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి.... ఇంజినీరింగ్ చదివిన ఓ యువకుడు నగర శివారు ప్రాంతమైన బడంగ్పేట్లో తన తేలితెటలతో కల్తీ నూనె, నెయ్యి తయారు చేసి జోరుగా విక్రయాలు చేశాడు. కల్తీ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్తో పాటు మిషనరీ ఏర్పాటు చేసి ప్లాంట్ నెలకొల్పాడు. తయారు చేసిన కల్తీ నూనె, నెయ్యిని బ్రాండెడ్ స్టికర్లతో ప్యాకింగ్ చేసి నగరంతో పాటు శివారు జిల్లాలకు సరఫరా చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 250 కిలోల కల్తీ నెయ్యి , 50 కిలోల డాల్డా, 2 వేల లీటర్ల నకలీ పామాయిల్ను స్వాధీనం చేసుకున్నారు. -
రాత్రి 11 దాటితే నో ఏటీఎం!
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయి. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ–లింక్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్ వంటి సైబర్ నేరాలు తగ్గించడానికి డీ–లింక్ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. నిర్వహణ కోణంలో చూసిన బ్యాంకర్లు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎం కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ–లింక్ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు. డీ–లింక్ చేయడం ద్వారా ఏటీఎం మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్ చేసినా మిషన్కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్తో లింక్ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు. మూసేయాలని సూచించిన పోలీసులు.. బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్ పోలీసులు కీలక సవరణలు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ–లింక్ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్/క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుని.. రాత్రి వేళల్లో ఏటీఎంలకు స్కిమ్మర్లు, చిన్న కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్లు తస్కరిస్తాయి. వీటి ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు విత్డ్రా చేస్తుంటాయి. మిషన్ను డీ–లింక్ చేసినప్పటికీ వినియోగదారుడు వచ్చి అందులో కార్డు పెట్టే, పిన్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉందని పోలీసులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అలా చేస్తే స్కిమ్మింగ్ పూర్తయిపోతుందని, అలా కాకుండా ఉండాలంటే ఆయా ఏటీఎంల షట్టర్లు దింపడం ద్వారా పూర్తిగా మూసేయాలని సూచించారు. ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామని, అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
ఆన్లైన్ మోసం: ఐదుకోట్లు హాంఫట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నలుగురు వ్యక్తులు కలిసి దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి 5 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఓ మహిళ వీరి వద్ద 7.26,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంతా హవాలా రూపంలో జరిగింది. సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి నిందితులను పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 13 లక్షల రూపాయలు, ఒక ల్యాప్టాప్, 6 సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ట్రేడింగ్ సెంటర్స్ ద్వారా వచ్చే బల్క్ ఎస్ఎంఎస్ల పట్ల జాగ్రత్తగా మెలగాలని, సీఐబీఐలో రిజిస్టర్ అయిన వాళ్ల దగ్గర మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. -
కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్ : కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఈ గ్యాంగ్ సభ్యులు నేరాలకి పాల్పడుతున్నారని చెప్పారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు నుంచి 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై 180 కేసులు ఉన్నాయని తెలిపారు. జైలుకి వెళ్లి వచ్చిన తరువాత తిరిగి 32 చైన్ స్నాచింగ్లు చేశారని అన్నారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కత్తులతో బెదిరించి పరారవుతున్నారని వివరించారు. బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులు సలీం, సయ్యద్ నజిమ్, సల్లాఉద్దీన్, సయ్యద్ జహంగీర్, అముల్ కోలేకర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. -
ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైబరాబాద్ పరిధిలో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ బస్సు సర్వీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత సైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్ల ఆయన తెలిపారు. మూడు మార్గాల్లో ఈ సైబర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణ కోసం ఈ బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్ ప్రారంభించిన డీజీపీ
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ ఫ్యూషన్ సెంటర్ను డీజీపీ మహేందర్రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్, సోషల్ మీడియా ల్యాబ్, డయల్ హాక్ ఐ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతన సాంకేతికతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవహారాలను ఫ్యూషన్ సెంటర్తో అనుసంధానం చేయవచ్చన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ను అనుసంధానించవచ్చు అని పేర్కొన్నారు. ఈ ఫ్యూషన్ సెంటర్ నేర శాతాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కాగానే ఈ టెక్నాలజీ సెంటర్ను అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. పోలీసు శాఖ టెక్నాలజీకి మారుపేరుగా మారుతుందని డీజీపీ అన్నారు. జిల్లాల్లో ఉన్న మినీ కమాండ్ కంట్రోల్తో ఈ ఫ్యూషన్ సెంటర్ను అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా శాంతి భద్రతలను కాపాడుతామని తెలిపారు. టెక్నాలజీకి మారుపేరుగా మారిన హైదరాబాద్కు పెట్టుబడులను ఆకర్షించే విధంగా తమ వంతు కృషి చేస్తామని డీజీపీ పేర్కొన్నారు. -
ఈ ఏడాది కేసులు పెరిగాయి: సీపీ
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా తెలిపారు. ఏడాదిలో మొత్తం 2600 కేసులు నమోదయ్యాయని.. గతేడాదితో పోలిస్తే 800 కేసులు పెరిగాయన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ..' సైబరాబాద్ పరిధిలో 729కి మందికి ఓ పోలీస్ చొప్పున భద్రత పర్యవేక్షిస్తున్నారు. నగరంలో అన్ని పండుగలు శాంతియుతంగా జరిగేలా పోలీసులు పనిచేశారు. అంతే కాకుండా 35 జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భారీ భద్రత కల్పించాం. సైబరాబాద్ పరిధిలోని షీ టీమ్స్180 కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి, 70 వేల మంది మహిళలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టిన 870 కేసులను షీ టీమ్స్ పరిష్కరించాయి. వరకట్న వేధింపులు, గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేలా ఐదు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆరు సెన్సేషనల్ డెకాయిడ్స్ కేసులను చేధించాం. పెరు అంతర్జాతీయ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నాము. 100 గుట్కా కేసులు నమోదు చేసి.. 3 కోట్ల 79 లక్షల విలువైన గుట్కా సీజ్ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా 9 స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేశాము. మరో వైపు 13 వేల 500 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి' అని సీపీ తెలిపారు. -
100 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి
హైదరాబాద్: సైబరాబాద్, వికారాబాద్, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుళ్లకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దాదాపు వంద మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్సై)గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
ప్రజలకు మరింత చేరువ
చేవెళ్ల రూరల్: సైబరాబాద్ పరిధిలో పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. చేవెళ్ల డీఎస్పీ కార్యాలయ స్థానంలో ఏసీపీ కార్యాలయం కొనసాగుతుందన్నారు. అంతకుముందు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులతో సీపీ మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా నగరానికి కూరగాయలను తీసుకొని వెళ్తుంటారని, వారి వాహనాల్లో తిరిగి వచ్చే సమయంలో పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని సీపీకి వారు వివరించారు. రైతులకు మినహారుుంపు ఇవ్వాలని ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి, నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గంగారెడ్డి, శృతకీర్తి, ఎంపీపీ ఎం.బాల్రాజ్, జేడ్పీటీసీ సభ్యురాలు శైలజ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దేవుని విజయలక్ష్మి, శర్వలింగం, వైస్ చైర్మన్ మానిక్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు సైబర్ నేరాలు బారినపడకుండా ఉండేందుకు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులు, క్యాబ్, ఆటో డ్రైవర్లకు నగదు రహిత లావాదేవీలపై శనివారం ఐడీఆర్బీటీ ఫ్రొఫెసర్, మొబైల్ పేమెంట్ ఫోరమ్ ఫర్ ఇండియా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ వీఎన్ శాస్త్రి, సైబర్ సెల్ ఏసీపీ జయరాం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ...సైబర్ నేరాల్లో రికవరీ కావడం చాలా కష్టమని, అందుకే సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి బారినపడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నగదు రహిత లావాదేవీల వినియోగం కారణంగా ఎదురయ్యే కొత్త తరహా మోసాలను ఆధునిక పరిజ్ఞానంతో పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం లా అండ్ అర్డర్, సైబర్ సెల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ...మొబైల్ పేమెంట్లపై వివిధ టెక్నిక్లను వినియోగదారులకు వివరించడంపై దృష్టి సారించాలన్నారు. ఒకటి ఆఫ్లైన్, ఒకటీ ఆన్లైన్ లావాదేవీల కోసం రెండు బ్యాంక్ ఖాతాలు వినియోగించడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు. మొబైల్ బ్యాంకింగ్లో ఆ¯న్లైన్ నగదు లావాదేవీలకు అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీసు డాటా (యూఎస్ఎస్డీ) ఎంతో ఉత్తమమని డాక్టర్ వీఎన్ శాస్త్రి వివరించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కనడ, పంజాబీ తదితర అన్ని భాషల్లో యూఎస్ఎస్డీ ఉంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకైనా సులభంగా ఆన్లైన్ నగదు లావాదేవీలు అర్ధమవుతాయన్నారు. క్రెడిట్కార్డు మోసాలు, ఫిషింగ్, స్కిమ్మింగ్, విషింగ్లపై వివరించారు.సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు, పోలీసులు స్పందించాల్సిన తీరుపై ఏసీపీ జయరాం వివరించారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణి కుమార్ మాట్లాడుతూ...‘మొబైల్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉందని, నగదు రహిత లావాదేవీలపై అవగాహన తీసుకరావడం ద్వారా క్యాష్లెస్ ఎకానమీలో ప్రపంచంలోనే తొలి స్థానం సాధించవచ్చ’ని వివరించారు. కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్వోలు, ఈ–కాప్స్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిథులు పాల్గొన్నారు. -
సైబరాబాద్లో సాఫీగా ప్రయాణం!
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్లో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఏ చిన్న వర్షమొచ్చినా, ఎక్కడైనా వాహనం రోడ్డుపైనా నిలిచిపోయినా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుండటంతో సిటీవాసులు గంటలకొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా నానా తంటాలు పడాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో కొన్నిసార్లు వలంటీర్ల సహాయం తీసుకుని వాహనాలు క్లియర్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. వీటికితోడు వాహనాలు కూడా రోడ్డుపై ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడి నుంచి వెళుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. వీటన్నింటిపై అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బస్సు బేలు, ట్రాఫిక్ జంక్షన్లు, ఫ్రీలెఫ్ట్ల వద్ద బొల్లాడ్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటి కోసం బడ్జెట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ కాన్సెప్్టను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)కి వివరించడంతో వారు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు వెయ్యి బొల్లాడ్స్ ఇచ్చేందుకు ఆర్థిక సహాయం అందించారు. స్వచ్ఛందంగా ముందుకు.. అయితే ట్రాఫిక్ దిగ్భంధనం చేదించడంలో తమవంతు సహకారం అందిస్తామని బడా కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బొల్లాడ్స్ను దాదాపు 1500 వరకు కొనుగోలు చేసి ఇచ్చేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలానే మిగతా కంపెనీలు కూడా ముందుకొస్తే ట్రాఫిక్ తిప్పలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కూడా పూర్తిస్థాయిలో తమకు ఆర్థిక సహకారం అందిస్తే హైదరాబాద్లో మాదిరిగానే సైబరాబాద్లోనూ ట్రాఫిక్ కష్టాలను నియంత్రించవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. అంతటా ట్రాఫిక్ తిప్పలే... అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మియాపూర్, రాజేంద్రనగర్, ఉప్పల్, వనస్థలిపురంతో పాటు ఐటీ కారిడార్లోని మదాపూర్, గచ్చిబౌలిలలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలలో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్రీ లెఫ్ట్ జంక్షన్లను ఏర్పాటుచేసి కొంతమేర ట్రాఫిక్ను నియంత్రించడంలో సక్సెస్ అయిన పోలీసులు...దానికి కొనసాగింపుగా వాహనాలు సరైన మార్గంలో ముందుకెళ్లేందుకు బొల్లాడ్స్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాల్లోని బస్బేలు, ట్రాఫిక్ జంక్షన్లు, ఫ్రీ లెఫ్ట్ల వద్ద వీటిని క్యూలైన్లలో ఏర్పాటుచేస్తున్నారు. జంక్షన్ల వద్ద ఏర్పాటుచేసిన బొల్లాడ్స్ వల్ల ఎదురుగా వెళ్లే వాహనాలు, రైట్ టర్న్ తీసుకునే వాహనాలు సాఫీగా వెళ్లిపోతున్నాయి. -
సైబరాబాద్లో ఐదుగురు సీఐల బదిలీ
సాక్షి,సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. సైబర్క్రైమ్స్ సీఐ కె.బాలకృష్ణారెడ్డిని కొత్తగా ఏర్పాటు చేసిన బాచుపల్లి పోలీస్స్టేషన్కు, దుండిగల్లో పనిచేస్తున్న సీహెచ్ శంకర్రెడ్డిని జీడిమెట్లకు, శంషాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బొల్లం శంకరయ్యను దుండిగల్కు, శంషాబాద్ సీసీఎస్లో ఉన్న చంద్రబాబును సైబర్క్రైమ్స్కు, వెకెన్సీ రిజర్వులో ఉన్న పుష్పన్కుమార్ను సీసీఎస్ శంషాబాద్కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ పోలీసు కమిషనరేట్ల పరిధి పెంపు
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధి మరింత పెరగనుంది. ఇప్పటికే మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లతో కూడిన మల్కాజిగిరి జోన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో ఎల్బీనగర్ జోన్లతో పాటు భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లతో కూడిన భువనగిరి జోన్ను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజన సందర్భంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్లోకి, శంషాబాద్ జిల్లాలోకి వచ్చే కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో చేర్చే అంశంపై దృష్టి సారించాలని తాజాగా సీఎం కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలెట్టారు. భువనగిరి జోన్లోకి మరిన్ని ఠాణాలు... భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఇప్పటికే ఉండేలా సైబరాబాద్ విభజన సందర్భంలో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం గవర్నర్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. భువనగిరితో పాటు బీబీనగర్, బొమ్మల రామారం, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, వలిగొండ ఠాణాలు ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉండగా... తాజాగా ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), గుండాల, రామన్నపేట, మోత్కూరు, ప్రతిపాదిత మండలాలు మోటకొండూరు, అడ్డగుడూరులోకి వచ్చే ఠాణాలు అన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో భువనగిరి జోన్లో మరిన్ని ఠాణాలు కలిసే అవకాశం కనబడుతోంది. అయితే వీటిలో ఎన్ని ఠాణాలు రాచకొండ పరిధిలోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. సైబరాబాద్ పరిధి మరింత విస్తృతి... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉన్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్నగర్ డివిజన్లతో శంషాబాద్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్ డివిజన్లతో మాదాపూర్ జోన్, పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లతో బాలానగర్ జోన్లు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం... సైబరాబాద్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు వచ్చి చేరుతున్నాయి. వీటిలో ఆమన్గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు ఉన్నాయి. ఈ ఠాణాలను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అయితే ఈ రెండు కమిషనరేట్ల ఏర్పాటు కోసం గవర్నర్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సవరణ చేసి మరిన్ని ఠాణాలు కలపడంపై దృష్టి సారించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
ఇంటి వద్దకే పోలీసు సేవలు
సాక్షి, సిటీబ్యూరో: మహిళలను కించపరడం, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో వారిని వేధించడం, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా.. ఇలాంటి నేరాల నియంత్రణ కోసం నలుగురు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు శుక్రవారం ప్రకటించారు. సైబరాబాద్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి దాదాపు నెల రోజులైన నేపథ్యంలో తన పని తీరును సమీక్షించడంతో పాటు త్వరలో తీసుకోబోయే ప్రత్యేక చర్యలను ఆయన తొలిసారిగా మీడియాకు వివరించారు. మహిళలు, బాలల కేసుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఎస్కే సలీమా, సైబరాబాద్ క్రైమ్స్ ఏసీపీ టి.ఉషారాణి, శంషాబాద్ ఏసీపీ అనురాధ, ఐటీ కారిడార్ ఉమెన్ ఇన్స్పెక్టర్ సునీత సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కేసుల్లో తొలి రెస్పాండెంట్గా స్థానిక పోలీసులు ఉంటారని, బాధితులు ఠాణాకు రాలేని సందర్భంలో వారి తరఫున బంధువులు ఫిర్యాదు చేసినా చాలని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా పోలీసు అధికారులు బాధితుల ఇంటికెళ్లి, వారితో మాట్లాడి జరిగి ఘటన తీరు తెలుసుకుంటారని, వారి సంభాషణను కూడా రికార్డు చేయడంతో పాటు ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరిస్తారని కమిషనర్ తెలిపారు. తమతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు, బలవంతంగా తీసిన ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి మహిళలను లోబర్చుకొనేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని, నిందితులకు కఠిన శిక్ష పడినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు. పేపర్ వర్క్పై ఫోకస్ పెడితేనే శిక్షలు రెట్టింపు... ‘‘క్రైమ్ సీన్లోనే పోలీసు అధికారులు పంచనామా పూర్తి చేయాలి. బాధితుల వివరాలన్నీ రాతపూర్వకంగా నమోదు చేయాలి. ఘటనాస్థలికి క్లూస్టీం తప్పనిసరిగా వెళ్లాలి. ఇలా సేకరించే మౌనసాక్ష్యాలే చాలా కేసుల్లో నేరగాళ్లకు భారీ శిక్షలు విధించేందుకు తోడ్పడతాయి. అందుకే నేరగాళ్లను అరెస్టు చేయడమే కాదు వారికి శిక్ష పడేంత వరకు చక్కటి డాక్యుమెంటేషన్(పేపర్ వర్క్)తో పోలీసులు ముందుకు వెళ్లాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు వెనుకాడబోం. ఠాణాకు వచ్చే బాధితుల ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలే గానీ రోజుల తరబడి పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుకోవద్దు’ అని సందీప్ శాండిల్యా కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. క్యాష్లెస్ విధానం షురూ... సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాదిరిగానే సైబరాబాద్లోనూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు క్యాష్లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని సందీప్ శాండిల్యా తెలిపారు. ఇంటికి చలాన్లు, సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశం రాగానే వాహనదారులు దగ్గరలోని ఏపీ ఆన్లైన్, మీసేవ/ఈసేవ కేంద్రాలకు వెళ్లి జరిమానా చెల్లించాలన్నారు. -
వ్యభిచార దందాపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్: నగరంలో వ్యభిచార దందాను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందా నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మెజిస్ట్రేట్కు ఉందని, మేజర్లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి 75 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కు చెందిన 40 మందికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఇటువంటి అరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్నగర్ మండలం అల్కాపురిలోని దుగ్గిరాల అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 103, దిల్సుఖ్నగర్ లలితా నగర్లోని శిల్పి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 106, సరూర్నగర్ కర్మన్ఘాట్లోని జ్యోతినగర్ రోడ్డు నంబర్ త్రీలోని రెండో అంతస్తు ప్లాట్ నంబర్ 22ను, కొత్తపేట న్యూ మారుతీనగర్ బాబు కాంప్లెక్స్లోని తొలి అంతస్తు 1-6-30ని సరూర్నగర్ తహసీల్దార్ సీజ్ చేశారు. అలాగే, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇళ్లలో ఇకపై అటువంటి కార్యకలాపాలు ఆపేయాలని ఆరు అపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. -
ముగ్గురు పోలీసు అధికారుల రిటైర్మెంట్
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులు గురువారం పదవీ విరమణ చేశారు. మియాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ ఎం.రాంచందర్, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏఎస్ఐ బి.వీరేశం, కార్ అంబర్పేటలోని ఏఆర్హెచ్సీ ఎం.జగన్ రెడ్డిల పదవీ విరమణ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ సందీప్ శాండిల్యా సన్మానించారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ వారిని కోరారు. -
తాగినడిపితే తాట తీస్తారు
సాక్షి, సిటీబ్యూరో/మన్సూరాబాద్: మందు తాగి వాహనాలు నడిపేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఎంవీ యాక్ట్ 2016 ప్రకారం డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారన్నారు. ఈ కేసులో జైలుకెళితే కన్విక్షన్(నేరం)గా పరిగణిస్తారని తెలిపారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్, అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్లోని గోటేటీ కల్యాణ మండపంలో డ్రంకన్ డ్రైవ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించేందుకు పగటి పూట కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఈ ఏడాది ఇప్పటివరకు 5879 మంది డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదుకావడం దారుణమన్నారు. ఇందులో 202 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఎక్సైజ్ శాఖతో కలిసి మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాలలో బ్రీత్ఎన్లైజర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాల యజమానులు 30 ఎండీ కన్నా ఎక్కువ మద్యం సేవించిన వారిని గుర్తించి వారు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 30ఎండీ కన్నా మద్యం సేవించి వాహనం నడుపుతూ మొదటిసారి చిక్కితే 6 నెలలు జైలుశిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధిస్తున్నారని, నూతన చట్టంలో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. మైనర్లు పట్టుబడితే వారి కళాశాల, పాఠశాల యజామాన్యాలకు తెలియజేసి వారి అడ్మిషన్లు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అతిగా మద్యం సేవించి వాహనం నడిపితే వారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం పరిధిలో 500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ...మైనర్లు మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మైనర్లకు మద్యం అమ్మే బార్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నామని, భర్త పట్టుబడితే భార్య, యువకుడు పట్టుబడితే తల్లిదండ్రులను తీసుకొని కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఫస్ట్ టైమ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ రైడ్... మద్యం తాగడం వల్ల జరిగే అనర్ధాలపై అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ అవగాహన కల్పించాయి. మందుబాబులు మిషన్ స్మార్ట్ రైడ్ రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్ ఉచితంగా అందజేస్తామని మిషన్స్మార్ట్ రైడ్ ప్రతినిధి నాగేశ్వర్రావు తెలిపారు. ఆ తర్వాత యాప్ ద్వారా బుక్ చేసుకుంటే తమ సంస్థతో టై అప్ అయిన ఉబెర్ క్యాబ్లు సర్వీసు అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ దివ్యచరణ్రావు, డీసీపీ తప్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్రావు ట్రాఫిక్ డీసీపీ రమేష్నాయుడు, సీఐ కాశిరెడ్డి, అమృత పౌండేషన్ ప్రతినిధి డా. దేవిక, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు షీ-సేఫ్ యాప్
-సైబరాబాద్ వెస్ట్ పోలీసుల సహాకారంతో ఎస్సీఎస్సీ రూపకల్పన -మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు సాక్షి, సిటీబ్యూరో ఈ యాప్ షీ సేఫ్ గురూ...అతివల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ వెస్ట్ పోలీసులు... సొసైటీఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) సహాకారంతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఐటీ కారిడార్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు మహిళలకి కనీస రక్షణ కల్పించడమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఈ యాప్ ప్రస్తుతం పైలట్ పద్ధతిన అమలుచేస్తున్నారు. మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా అపదలో చిక్కుకున్న మహిళలను...ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉన్నా తక్షణం రక్షించేందుకు వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిల సెల్ఫోన్లలో ఈ యాప్ నిక్షిప్తమై ఉంటే నమ్మకమైన నేస్తం వెన్నంటి ఉన్నట్టేనని అంటున్నారు. ఈ యాప్ను సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకోగానే మహిళలు వివరాలు నమోదుచేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు ఆ వివరాలన్నింటిని డయల్ 100తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయనున్నారు. ఎక్కడున్నా వచ్చేస్తారు... ఇప్పుడు చాలా మంది ఆండ్రాయిడ్ సౌకర్యం ఉన్న ఫోన్లనే వినియోగిస్తుండటంతో ఆయా ఫోన్లను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసి వివరాలు పొందుపరిచిన అమ్మాయిలు అపద సమయాల్లో యాప్లో ఉన్న మీట నొక్కితే కమాండ్ కంట్రోల్ సెంటర్కి సందేశం వెళ్లేలా ఫీచర్స్ రెడీ చేశారు. బాధితులు వీడియోలు, ఫొటోలు పంపించొచ్చు. ఒంటరి ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉంటే అక్కడి ప్రదేశాన్ని వీడియో తీసి పంపించొచ్చు. వాయిస్ రికార్డు చేసి పోలీసులకు చేరవేసేలా ఫీచర్ను రెడీ చేశారు. వీటన్నింటితో పోలీసులు అప్రమత్తమై బాధితురాలి సెల్ఫోన్ నంబర్ను ట్రాక్ చేయడం ద్వారా ఎక్కడుందో తెలుసుకొని సమీప పోలీసులను అక్కడికి పంపిస్తారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్లలోని పెట్రోలింగ్ వాహనాలన్నింటిలోనూ జీపీఎస్ ఉండడంతో బాధితురాలున్న చోటుకు సమీప గస్తీ వాహనానికి సమాచారమిస్తారు. ఆమె ఫోన్ అందుబాటులో ఉంటే తాము ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుకోగలుగుతారో చెబుతారు. ఆగంతకులెవరైనా అపహరించి ఆమె సెల్ఫోన్ని పడవేసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొంటారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ పరిసరాల్లోని దుండగుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి పట్టుకునేలా కార్యాచరణకు దిగుతారు. మరో రెండు వారాల్లో అందుబాటులోకి... మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ పోలీసులు సరికొత్తగా షీ సేఫ్ యాప్ను రెడీ చేసేందుకు ఎంతగానో సహకరించారు. అభయలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండడంతో పాటు మహిళా ఉద్యోగుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతుండటంతో వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యాప్ల కంటే ఇది భిన్నమైనది. మరో రెండు వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకరానున్నాం. షీ సేఫ్ యాప్ సెల్ఫోన్లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తత ప్రచారం కల్పిస్తాం. -భరణి ఆరోల్, కార్యదర్శి, ఎస్సీఎస్సీ.