disinvestment
-
డిజిన్వెస్ట్మెంట్@రూ.47,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.47,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. అయితే డిజిన్వెస్ట్మెంట్, ఆస్తుల మానిటైజేషన్ తదితర మూలధన వసూళ్లకింద ఈ మొత్తాన్ని అంచనా వేసింది. వెరసి రూ.47,000 కోట్ల మిస్లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వెరసి పీఎస్యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ(డిజిన్వెస్ట్మెంట్)ను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏడాది మూలధన సమీకరణగా పేర్కొంది.2024–25లో ప్రభుత్వం వార్షిక డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాల నుంచి దూరం జరిగింది. పీఎస్యూలలో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్ తదితర మిస్లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎంఎస్టీసీ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవోలకు దీపమ్ ప్రణాళికలు వేసింది. పీఎస్యూ దిగ్గజాలు హెచ్ఏఎల్, కోల్ ఇండియా, ఆర్వీఎన్ఎల్, ఎస్జేవీఎన్, హడ్కోలలో మైనారిటీ వాటాల విక్రయం(ఓఎఫ్ఎస్)ను సైతం చేపట్టింది. తద్వారా రూ. 13,728 కోట్లు సమకూర్చుకుంది. అయితే ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్సహా వ్యూహాత్మక వాటాల విక్రయం పట్టాలెక్కలేదు. 2021 అక్టోబర్లో టాటా గ్రూప్నకు విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయం తదుపరి ప్రధాన డీల్స్కు చెక్పడింది.ఇదీ చదవండి: డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లుద్రవ్యలోటు@రూ.15,68,936కోట్లుప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం..ద్రవ్యలోటును 2024–25లో అనుకున్న ప్రకారం 4.8% వద్ద (జీడీపీ విలువలో) కేంద్రం కట్టడి చేయగలిగింది. విలువల్లో ఇది రూ.15,68,936 కోట్లు. 2025–26లో 4.4%కి తీసుకురావాలని నిర్దేశించుకుంది. గణాంకాల్లో చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15.70 లక్షల కోట్ల ద్రవ్యలోటు అంచనా వేయగా, అంతకన్నా తక్కువగా రూ.15.69 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. తాజా ద్రవ్యలోటును పూడ్చుకోడానికి రూ.11.54 లక్షల కోట్ల మార్కెట్ రుణాన్ని సమీకరించాలని కొత్త బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మొత్తాలను చిన్న తరహా పొదుపు మార్గాల ద్వారా సమీకరించాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూలంగా రూ.14.82 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను స్వీకరించాలన్నది లక్ష్యం. -
డిజిన్వెస్ట్మెంట్కు ఆర్బీఐ దన్ను
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) భారీ డివిడెండును అందించడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం పెరగకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఈ నెలలో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్లో రూ. 50,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని ప్రకటించవచ్చని రేటింగ్స్ దిగ్గజం కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎన్నికల ముందు తీసుకువచి్చన మధ్యంతర బడ్జెట్లో ఇదే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి ఆర్బీఐ రూ. 2.1 లక్షల కోట్ల డివిడెండును అందించిన నేపథ్యంలో కేర్ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా మారినట్లు కేర్ పేర్కొంది. ఫలితంగా పీఎస్యూలలో భారీ స్థాయి వాటా విక్రయ పరిస్థితులు తలెత్తకపోవచ్చని తెలియజేసింది. ఒకవేళ వనరుల అవసరాలు ఏర్పడితే.. ఆస్తుల మానిటైజేషన్పై దృష్టి పెట్టే అవకాశమున్నట్లు వివరించింది. జాబితాలో.. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) విక్రయం పూర్తికావచ్చని అంచనా. దీంతో ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి వీలు చిక్కవచ్చని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఎస్సీఐకి గల భూములను విడదీయడంతో ఈ ఏడాది కంపెనీ విక్రయానికి మార్గమేర్పడనున్నట్లు తెలియజేసింది. ఇందుకు సానుకూల స్టాక్ మార్కెట్ పరిస్థితులు సైతం తోడ్పాటునివ్వనున్నట్లు అభిప్రాయపడింది. ఎస్సీఐలో పూర్తి వాటాను విక్రయిస్తే ప్రభుత్వానికి రూ. 12,500–22,500 కోట్లు సమకూరే వీలుంది.ఈ బాటలో ఇతర దిగ్గజాలు కంకార్, పవన్ హన్స్ ప్రయివేటీకరణకు సైతం తెరతీయవచ్చని పేర్కొంది. గత పదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 5.2 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. పీఎస్యూలలో 51 శాతానికికంటే తగ్గకుండానే వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 11.5 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు వీలున్నట్లు కేర్ మదింపు చేసింది. పీఎస్యూల నుంచి రూ. 5 లక్షల కోట్లు, బ్యాంకులు, బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా మరో రూ. 6.5 లక్షల కోట్లు చొప్పున అందుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్... రూ. 50,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది. అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదీ తీరు.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది. -
కొనసాగుతున్న ఎఫ్పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
ముచ్చటగా మూడోసారి.. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకానికి బ్రేకులు!
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సర్వీసుల పీఎస్యూ పవన్ హన్స్ లో వ్యూహాత్మక వాటా విక్రయానికి బ్రేక్ పడింది. బిడ్డింగ్లో విజయవంతమైన కన్సార్షియంలోని ఒక కంపెనీపై న్యాయపరమైన వివాదాలరీత్యా అనర్హతవేటు పడటం దీనికి కారణమని దీపమ్ పేర్కొంది. వెరసి పవన్ హంస్ ప్రయివేటైజేషన్ ప్రయత్నాలకు మూడోసారి చెక్ పడింది. బిడ్ను గెలుపొందిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్పీసీపై పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం పవన్ హంస్ డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు దీపమ్ తెలియజేసింది. భాగస్వామ్య కంపెనీ పవన్ హంస్లో ప్రభుత్వానికి 51 శాతం, ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీకి 49 శాతం చొప్పున వాటా ఉంది. 2018లో షురూ: తొలుత పవన్ హన్స్ లో గల 51 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2018లో బిడ్స్కు ఆహ్వానం పలికింది. అయితే ఓఎన్జీసీ సైతం 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2019లో తిరిగి కంపెనీలో 100 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించినప్పటికీ స్పందన లభించకపోవడం గమనార్హం! ప్రభుత్వం 2020 డిసెంబర్లో మూడోసారి పవన్ హన్స్ విక్రయానికి తెరతీసింది. కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ను ఆహ్వానించింది. 2022 ఏప్రిల్లో స్టార్9 మొబిలిటీ కన్సార్షియం గరిష్ట బిడ్డర్గా నిలిచింది. కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీసహా.. బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సైతం భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. -
యూఎస్లో హిందుస్తాన్ జింక్ రోడ్షోలు.. వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో మిగిలిన 29.54 శాతం వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం యూఎస్లో రోడ్షోలకు ఈ నెలలో తెరతీయనుంది. ప్రమోటర్ సంస్థ వేదాంతా.. తమ గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఇది కంపెనీవద్ద గల భారీ నగదు నిల్వలను వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయంగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్లో మిగిలిన వాటాను విక్రయించాలని గతేడాదిలోనే నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వేదాంతా ప్రణాళికలను వ్యతిరేకించింది. కాగా.. వేదాంతా జింక్ ఆస్తుల విక్రయ ప్రతిపాదన గడువు గత నెలలో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం సొంత కార్యాచరణకు సన్నాహాలు ప్రారంభించింది. వెరసి ప్రభుత్వ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైలర్లకు విక్రయించేందుకు వీలుగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను పరిశీలిస్తున్నట్లు దీపమ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం హిందుస్తాన్ జింక్లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్కు 298.1 కోట్ల డాలర్లకు విక్రయించాలని వేదాంతా గతంలో ప్రతిపాదించింది. అయితే సంబంధిత పార్టీ లావాదేవీగా ఈ డీల్ను పరిగణించాలని, ఫలితంగా నగదురహిత బదిలీ చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయ సంబంధ అవకాశాలనూ పరిశీలించేందుకు నిర్ణయించుకుంది. గతేడాదిలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ).. హిందుస్తాన్ జింక్లో ప్రభుత్వానికిగల 29.54 శాతం వాటాకు సమానమైన 124.79 కోట్ల షేర్ల విక్రయానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది. -
డెట్ ఫండ్స్లో కొనసాగుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేష్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్లో డెట్ ఫండ్స్లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. విభాగాల వారీగా.. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► ఓవర్నైట్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో రూ.662 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్లోకి రూ.502 కోట్లు, గిల్ట్ ఫండ్స్లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్నైట్ ఫండ్ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి. -
2022లో డెట్ ఫండ్స్కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు ► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► లిక్విడ్ ఫండ్స్లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి. ► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ► డెట్ ఫండ్స్కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు. -
8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్మెంట్తో కేంద్రం ఆదాయం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా కేంద్రానికి రూ.4.04 లక్షల కోట్లు వచ్చాయి. 59 సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో వాటాల విక్రయంతో అత్యధికంగా రూ.1.07 లక్షల కోట్లు ఖజానాకు సమకూరినట్లు ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఎయిరిండియాతో పాటు 10 కంపెనీల్లో వాటాల విక్రయంతో గత 8 ఏళ్లలో ప్రభుత్వానికి రూ. 69,412 కోట్లు వచ్చాయి. 45 కేసుల్లో షేర్ల బైబ్యాక్ కింద రూ.45,104 కోట్లు లభించాయి. 2014–15 మధ్య 17 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లిస్టయ్యాయి. వీటితో కేంద్రానికి రూ.50,386 కోట్లు వచ్చాయి. వీటిలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా అత్యధికంగా రూ. 20,516 కోట్లు లభించాయి. అటు పారదీప్ ఫాస్ఫేట్, ఐపీసీఎల్, టాటా కమ్యూనికేషన్స్లో తనకు మిగిలి ఉన్న వాటాలను కేంద్రం మొత్తం రూ. 9,538 కోట్లకు విక్రయించింది. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత? -
అమ్మకానికి కోల్ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా సేల్ చేయనున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. 16500 కోట్లు ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ డిజ్ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లో భాగంగా కోల్ ఇండియా,ఎన్టీపీసీ, హిందుస్తాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్, ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ (ఆర్ఐటీఈఎస్) వాటాల్ని ఆఫర్ ఫల్ సేల్కు పెట్టనుంది. 10-20శాతం వాటాల విక్రయం పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. టార్గెట్ రూ.65 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్ఇన్వెస్ట్మెంట్) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)వెబ్సైట్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ చేతిలో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది. -
ఐడీబీఐ వివరాలకు మరింత గడువు
న్యూఢిల్లీ: పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రాసెస్కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్కు అక్టోబర్ 28వరకూ గడువు ప్రకటించింది. అయితే దీపమ్ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్ బిడ్స్కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు బీఎస్ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది. చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే? -
సీఈఎల్ విక్రయానికి స్వస్తి
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సీఈఎల్ కొనుగోలుకి బిడ్ను గెలుపొందిన కంపెనీ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) వద్ద అపరిష్కృతంగా ఉన్న న్యాయ వివాద విషయాన్ని వెల్లడించకపోవడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే కంపెనీ కొనుగోలుకి ఢిల్లీకి చెందిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ రూ. 210 కోట్ల విలువైన బిడ్ను దాఖలు చేయడం ద్వారా గెలుపొందింది. దీంతో గతేడాది నవంబర్లో ప్రభుత్వం సీఈఎల్ విక్రయానికి అనుమతించింది. అయితే ఈ ఏడాది జనవరిలో బిడ్డర్కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పలు ఆరోపణల మధ్య ప్రభుత్వం ఎల్వోఐ జారీని పక్కనపెట్టింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాన్ని బిడ్డర్ వెల్లడించకపోవడంతో సీఈఎల్ విక్రయాన్ని రద్దు చేసేందుకు నిర్ణయించింది. చదవండి: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
సబ్సీడీలపై కొత్త మార్గదర్శకాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్ఈ)లు ఇకపై అనుబంధ సంస్థలలో వాటా విక్రయించాలంటే తాజా మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) ఇందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా(ఎడ్మినిస్ట్రేటివ్) శాఖలకు పీఎస్ఈలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇప్పటివరకూ అనుబంధ సంస్థలలో మెజారిటీ లేదా మైనారిటీ వాటాలు, యూనిట్ల విక్రయాలను దీపమ్ చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడరీలలో వాటాల విక్రయంపై పీఎస్ఈలు నిర్ణయం తీసుకునేందుకు ఈ ఏడాది జూన్లో క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో అనుబంధ సంస్థలకు చెందిన వ్యూహాత్మక వాటాలు, యూనిట్లు, భాగస్వామ్య సంస్థల విక్రయానికి దీపమ్ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వెరసి ఇకపై పీఎస్ఈ మాతృ సంస్థల బోర్డులు వ్యూహాత్మక విక్రయ ప్రతిపాదనలను సంబంధిత పాలనా శాఖలకు పంపించవలసి ఉంటుంది. వీటిని పరిశీలించిన ఆయా శాఖలు తదుపరి దీపమ్కు నివేదిస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటయ్యే ఆల్టర్నేటివ్ మెకనిజం నుంచి ఈ ప్రతిపాదనలకు ముందస్తు అనుమతిని దీపమ్ పొందుతుంది. ఈ నిర్ణయాలను పీఎస్ఈలకు తెలియజేస్తారు. వెరసి మాతృ సంస్థ బోర్డులు ఈ లావాదేవీలను చేపట్టేందుకు వీలుంటుంది. -
బీపీసీఎల్ అమ్మకం ఇప్పుడే కాదు: హర్దీప్ సింగ్ పురి
ముంబై: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన కంపెనీ విక్రయం సమీప భవిష్యత్లో జరగకపోవచ్చని సంకేతాలిచ్చారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 2019 నవంబర్లో బీపీసీఎల్లో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రభుత్వానికున్న 52.98 శాతం వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ కొనుగోలుకి మూడు సూచనప్రాయ బిడ్స్ సైతం లభించాయి. అయితే వేదాంతా గ్రూప్ నుంచి మాత్రమే ఫైనాన్షియల్ బిడ్ దాఖలైంది. దీంతో 2022 మే నెలలో విక్రయ ప్రణాళికను రద్దు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయి సమీక్షకు ప్రతిపాదించింది. పోటీ బిడ్డింగ్కు తెరతీసినప్పటికీ రేసులో ఒకే సంస్థ నిలిస్తే విక్రయ ప్రక్రియ ముందుకెలా సాగుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. చమురు శాఖ ఇక్కడ నిర్వహించిన 25వ ఇంధన సాంకేతిక సదస్సును ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులకు బీపీసీఎల్ విక్రయ అంశాలను వివరించారు. -
సీఈఎల్ విక్రయానికి బ్రేక్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్) విక్రయాన్ని తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీ కొనుగోలుకి బిడ్ చేసిన నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ డిజిన్వెస్ట్మెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే దీనికి కారణమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. నండల్ ఫైనాన్స్పై ఎన్సీఎల్టీలో దివాలా కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని బిడ్డర్ తెలియజేయకపోవడంతో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. గతేడాది నవంబర్లో ప్రభుత్వం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాఖ(డీఎస్ఐఆర్)కు చెందిన సీఈఎల్ను ఢిల్లీ సంస్థ నండల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్కు విక్రయించేందుకు అనుమతించింది. డీల్ విలువ రూ. 210 కోట్లుకాగా.. బిడ్డింగ్ సమయంలో ఎన్సీఎల్టీ కేసు వివరాలను నండల్ ఫైనాన్స్ వెల్లడించలేనట్లు ప్రభుత్వ అధికారి తెలియజేశారు. కాగా.. మరోపక్క పవన్ హన్స్లో వ్యూహాత్మక విక్రయ అంశంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొనుగోలుకి గెలుపొందిన బిడ్డర్లలో ఒకటైన అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్పీసీపై ఎన్సీఎల్టీ వద్ద పెండింగ్లో ఉన్న కేసు వివరాలపై అప్పటికి స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
బీఎస్ఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ.. కేంద్రం వివరణ..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవని కేంద్రం తెలియజేసింది. లోక్సభలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020 ప్రారంభంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) అమలు కారణంగా బీఎస్ఎన్ఎల్ అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేదని లోక్సభలో ప్రకటించారు. సంస్థకు నిర్వహణకు ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సరిపోతుందని చౌహాన్ చెప్పారు. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన స్థిరాస్తులపై కూడా చౌహాన్ సమాధానమిచ్చారు.మార్చి 31, 2021 నాటికి భవనాలు, భూములు, టవర్లు, టెలికాం పరికరాలు , నాన్-టెలికాం పరికరాలతో సహా స్థిరాస్తుల విలువ ఆడిట్ చేయబడిన ఆర్థిక గణాంకాల ప్రకారం రూ. 89,878 కోట్లుగా ఉందని వెల్లడించారు. డిసెంబర్ 31, 2021 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ సబ్స్క్రైబర్లలో 9.90 శాతంగా, వైర్డు బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ల వాటా 15.40 శాతంగా ఉందని తెలిపారు. 2019లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 50ఏళ్లు పైబడిన వారికీ వీఆర్ఎస్ను అమలు చేసే ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలను చేశారు. దాంతో పాటుగా 4జీ సర్వీసుల కోసం సెక్ర్టంను కూడా కేటాయించారు. పలు చర్యల ఫలితంగా 2020-21లో బీఎస్ఎన్ఎల్ అపరేటింగ్ లాభాలు పాజిటివ్గా మారాయని చౌహన్ పేర్కొన్నారు. చదవండి: బీఎస్ఎన్ఎన్లో ఆ సంస్థ పూర్తిగా విలీనం..! మలుపు తిప్పే అవకాశం..! -
రూ. 1.75 లక్షల కోట్లు టార్గెట్..! ప్రైవేటుపరం కానున్న 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు..!
పలు ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగంగా చేపట్టనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్పరం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా కన్పిస్తోంది. అందుకోసం రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 26 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ రూ.1.75 లక్షల కోట్లే లక్ష్యంగా..! ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సుమారు రూ.1. 75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా కేంద్రం బ్యాంకులపై తీసుకువస్తోన్న బిల్లుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటుగా 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కు సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లుతో ద్వారా విస్తృతమైన పెన్షన్ కవరేజీని ప్రోత్సహించడానికి పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ను వేరు చేయడానికి వీలు కల్గుతుందని గత బడ్జెట్ సెషన్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. చదవండి: 81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
ఎల్ఐసీలో వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో వాటా విక్రయానికి (డిజిన్వెస్ట్మెంట్) రంగం సిద్ధమైంది. తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న కమిటీ ఎంత వాటాను విక్రయించేదీ, షేరు విక్రయ ధరను నిర్ణయించనున్నట్లు ఈ సందర్భంగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) జనవరిలోనే ఎల్ఐసీ విలువ మదింపునకు మిల్లీమన్ అడ్వయిజర్స్ను నియమించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎల్ఐసీని లిస్టింగ్ చేసే అంశానికి గత వారమే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్తో దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. ఎల్ఐసీ చట్టానికి బడ్జెట్లో చేపట్టిన సవరణలతో కంపెనీ అంతర్గత విలువను మిల్లీమన్ మదింపు చేయనుంది. ఈ ఏడాది (2021–22) ముగిసేలోగా ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవోను చేపట్టగలదని అంచనా. చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ -
నిధుల సేకరణకు బ్యాంకులు బలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్, నిధుల సేకరణ పేరుతో మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. పెట్టుబడుల ఉపసంహారణకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బాధ్యతలను బాధ్యతలను నీతి ఆయోగ్కి అప్పగించింది. ఈ ప్రక్రియలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. వేగవంతమైన ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహారణకు అత్యున్నత స్థాయి కమిటీ (సీజీఎస్) నీతి అయోగ్ నియమించింది. ఇందులో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు, లీగల్ వ్యవహారాలు తదితర విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్, సీజీఎస్లు ప్రైవేటీకరణకు సూచించిన లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ఇందులో సెంట్రల్ బ్యాంకు, ఐవోబీలలో పెట్టుబడులు ఉపసంహరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రైవేటీకరించేందుకు నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేపడతారు. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా పీఎస్బీల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు జరుపుతోంది. వ్యతిరేకిస్తున్న యూనియన్లు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో.. మార్చిలో రెండు రోజుల పాటు సమ్మెకు దిగాయి. పెద్ద నోట్ల రద్దు, జన ధన యోజన, ముద్ర యోజన వంటి ప్రభుత్వ స్కీముల విజయవంతంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంతో కీలకపాత్ర పోషించాయని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. డిజిన్వెస్ట్మెంట్లో భాగం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సుమారు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 2.10 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ. బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ఎల్ఐసీ సారథ్యంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా కేంద్రం తప్పుకోనుంది. బ్యాంకులో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ గత నెలలో సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీకి 94% వాటా ఉంది. ప్రస్తుతం ప్రమోటరయిన ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకులో 49.21 శాతం వాటా ఉంది. చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు వీఆర్ఎస్.. -
పెట్టుబడుల ఉపసంహరణ ఎవరికి చేటు?
ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా. భారతదేశంలో ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే (పీఎస్యూ) ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ఆర్థిక వృద్ధి, పెరుగుదలలో పీఎస్యులు పోషించే కీలకపాత్ర కారణంగా.. ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి ప్రభుత్వ గుత్తాధిపత్యం క్రమేణా ముగుస్తున్న కాలం లోనూ ప్రభుత్వరంగ సంస్థలు శిఖరస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. 1991 తర్వాత రెండో తరం సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలలో మొదలయ్యాయి. దీంతో పీఎస్యూలను మహారత్న, నవరత్న, మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు. పాలనాపరమైన, ఆర్థిక స్వయంప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం పీఎస్యూల ద్వారా సొంతంగా బిజినెస్ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పీఎస్యూలను పునర్ వ్యవస్థీకరించడం. నష్టాలతో నడుస్తున్న పీఎస్యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలను ఒక ఐచ్ఛికంగా తీసుకొచ్చారు. రెండోది.. లాభదాయకంగా నడుస్తున్న పీఎస్యూలకు ఆర్థిక, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని అందించడమే. అయితే నష్టాలతో నడుస్తున్న పీఎస్యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ప్రోత్సహించినట్లుగా, కీన్సియన్ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడమే. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పీఎస్యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పీఎస్యూలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెబుతూ రాజకీయంగా భాష్యం చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెబినార్ ద్వారా పాల్గొన్న సదస్సులో ‘ప్రైవేటీకరణ, సంపదపై రాబడి’ అనే పేరుతో చేసిన ప్రసంగం యావత్తూ నయా ఉదారవాద ఎజెండాకు సంగ్రహరూపంగానే కనబడుతుంది. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు పైకి లేవనెత్తడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగపరుస్తున్నామని నరేంద్రమోదీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడిచే పీఎస్యూలకు వెచ్చించే డబ్బును సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అలాగే మానవ వనరుల సమర్థ నిర్వహణ వాదాన్ని కూడా ప్రధాని తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వోద్యోగులు తాము శిక్షణ పొందిన రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించలేకపోతున్నారని, అది వారి ప్రతిభకు అన్యాయం చేయడమే అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ప్రధాని చేసిన వెబినార్ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పీఎస్యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు. వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పీఎస్యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం. వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్పరిపాలన భావనకు సంబంధించింది.ఇక్కడ సత్పరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటటువంటి భావజాలపరంగా తటస్థంగా ఉండే లక్షణాలను ముందుకు తీసుకురావడమే తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఈ సత్పరిపాలనా భావనే కేంద్ర స్థానంలో ఉంటోంది.ఇది సంక్షేమవాదం, నయా ఉదారవాదం భావనలపై భావజాలపరమైన చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడం, పబ్లిక్ సెక్టర్ని సంస్కరించడం అనే లక్ష్యాల సాధనలో తన హక్కులను కాపాడుకోగలగాలి.మెజారిటీ ప్రజల ఎంపికద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకురావడానికి కలలు కంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో నయా ఉదారవాదాన్ని అమలు చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదే.ఈ నయా ఉదారవాదంలోనూ సంక్షేమవాదం కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సేకరించిన నిధులను సరిగా ఉపయోగించడం ద్వారా ప్రధాని సూచించినట్లుగా పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలలు తెరవడం, పేదలకు పరిశుభ్రమైన నీటిని కల్పించడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు. మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం ద్వారా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి ముగింపు పలకవచ్చు. కానీ ఒక్క శాతంమంది అతి సంపన్నుల చేతిలో 40 శాతం దేశ సంపద పోగుపడి ఉన్న దేశంలో కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం నుంచి ప్రైవేటీకరణను ఏది నిరోధించగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ గుత్తాధిపతులు కేవలం పరిశ్రమ రంగంతో పాటు ఇతర రంగాల్లో విధాన నిర్ణయాలను కూడా వీరు విశేషంగా ప్రభావితం చేయగలరు.రెండోది, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.మూడోది. ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం, ప్రామాణిక ఆచరణలు లేదా సేవలకు హామీ ఇస్తుంది. పైగా తనదైన జాప్యందారీ వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వీటిని సేవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తికి న్యాయం చేకూర్చలేరు. బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో దివాలాకు సంబంధించిన పలు కేసుల కారణంగా నష్టాల పాలవుతున్న ప్రైవేట్ కంపెనీల జాబితా మరింతగా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ప్రభుత్వం వ్యాపార సామర్థ్యంతోటే ఉండాలి: ప్రభుత్వం కేవలం ఖర్చుపెట్టే సంస్థగానే ఉండిపోవలసిన అవసరం లేదు. సంపాదించే సంస్థగా కూడా ఉండాలి. వ్యాపారంలో కొనసాగినప్పుడు ఇది సాధ్యపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్తమ పాలనను అమలు చేయడమే. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర పీఎస్యూలకు నమూనాగా ఉండాలి. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సంస్కరించినట్లయితే, లాభాలబాట పట్టే ఆ సంస్థలు తిరిగి సాధికారత సాధించగలవు. ఉత్తమపాలన అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా సమర్థతకు, ఆర్థికానికి, సామర్థ్యానికి, జవాబుదారీతనానికి హామీపడగలదు. జుబేర్ నజీర్ వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ -
పీఎస్యూ ఫర్ సేల్...!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. గత బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 2.10 లక్షల కోట్లతో పోలిస్తే తాజా ప్రతిపాదనలు రూ. 35,000 కోట్లు తక్కువకావడం గమనార్హం! అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు) వాటా విక్రయంపై కోవిడ్–19 ప్రతికూల ప్రభావం చూపడంతో ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ అంచనాలను తాజాగా రూ. 32,000 కోట్లమేర తగ్గించింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ సీపీఎస్ఈలలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 19,499 కోట్లు మాత్రమే సమీకరించింది. రూ. లక్ష కోట్లు: వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ బాటలో సీపీఎస్ఈల డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మరో రూ. 75,000 కోట్లను సమీకరించేందుకు ప్రతిపాదించింది. ఈసారి డిజిన్వెస్ట్మెంట్ వ్యూహంలో భాగంగా నాలుగు రంగాలను ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అణు ఇంధనం(ఆటమిక్ ఎనర్జీ), అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్లను ప్రస్తావించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను నామమాత్రం చేయనున్నారు. ఈ రంగాలలో మిగిలిన సీపీఎస్ఈలను ప్రయివేటైజ్ చేయడం లేదా విలీనం లేదా అనుబంధ సంస్థలుగా మార్చడం వంటి అంశాలకు తెరతీయనున్నారు. ఇలాకాకుంటే వీటిని మూసివేస్తారు. వచ్చే ఏడాదిలో బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ తదితరాల డిజిన్వెస్ట్మెంట్ను పూర్తి చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ సహా మరో రెండు పీఎస్యూ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పీఎస్యూలలో డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆస్తుల విక్రయయానికి ప్రత్యేక కంపెనీ... వినియోగంలోలేని ఆస్తులు ఆత్మనిర్భర్ భారత్కు సహకరించవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కీలకంకాని ఆస్తుల జాబితాలో ప్రభుత్వ శాఖలు, పీఎస్యూల వద్ద గల మిగులు భూములు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. వీటి ప్రత్యక్ష విక్రయం లేదా ఇతర విధానాలలో మానిటైజేషన్కు వీలుగా ఒక ప్రత్యేక కంపెనీ(ఎస్పీవీ)ను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ లిస్టింగ్కు సై రూ. 8–10 లక్షల కోట్ల మార్కెట్ విలువ అంచనా వచ్చే ఏడాది(2021–22)లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ఈ బాటలో ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలను ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తాజాగా ఆర్థిక మంత్రి తెలియజేశారు. జీవిత బీమా బ్లూచిప్ కంపెనీ ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 100 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే రూ. 8–10 లక్షల మార్కెట్ విలువను సాధించగలదని విశ్లేషకుల అంచనా. తద్వారా దేశీయంగా అత్యంత విలువైన కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
ఎయిర్ ఇండియా సేల్- గడువు పెంపు
విమానయాన సేవల పీఎస్యూ దిగ్గజం ఎయిర్ ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండు నెలలపాటు గడువు పెంచింది. దీంతో ఆసక్తి కలిగిన సంస్థలు అక్టోబర్ 30లోగా కొనుగోలుకి బిడ్స్(ఈవోఐ) దాఖలు చేయవచ్చని తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన సవాళ్ల నేపథ్యంలో ఆసక్తి వ్యక్తం చేస్తున్న కంపెనీల అభ్యర్ధనలమేరకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ శాఖ దీపమ్(డీఐపీఏఎం) పేర్కొంది. వెరసి ఎయిర్ ఇండియాలో వాటా విక్రయానికి జనవరి నుంచి మూడోసారి గడువును పొడిగించింది. నవంబర్ 20కల్లా అర్హత సాధించిన బిడ్స్ వివరాలను వెల్లడించగలమని దీపమ్ పేర్కొంది. తొలుత 76 శాతమే ప్రభుత్వం ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోనూ పూర్తి వాటాను అమ్మకానికి పెట్టింది. తొలుత ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని భావించినప్పటికీ బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించింది. కాగా.. జనవరి 27న తొలుత మార్చి 31వరకూ ఈవోఐలకు గడువును ప్రకటించింది. తదుపరి జూన్ 30కు పెంచగా.. ఆపై ఆగస్ట్ 30వరకూ చివరి తేదీని పొడిగించింది. సాధ్యాసాధ్యాలు.. ఎయిర్ ఇండియా కొనుగోలుకి టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకుంటున్నట్లు మీడియా పేర్కొంది. ఎయిర్ ఇండియా కొనుగోలుకి ఆర్థికపరంగా ఎలాంటి భాగస్వామ్యానికీ తెర తీయకపోవచ్చని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతోపాటు.. గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో సైతం 50 శాతం వాటాను పభుత్వం విక్రయించనుంది. ప్రభుత్వం ఎయిర్ ఇండియా రుణ భారాన్ని రూ. 23,286 కోట్లకు కుదించినట్లు మీడియా తెలియజేసింది. -
త్వరలోనే టీహెచ్డీసీలో డిజిన్వెస్ట్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చి 31 నాటికి నీప్కో నికర విలువ రూ. 6,301 కోట్లుగా ఉంది. అటు టీహెచ్డీసీఐఎల్ విలువ రూ. 9,281 కోట్లుగా ఉంది. కేంద్రానికి టీహెచ్డీసీఐఎల్లో 74.23 శాతం, నీప్కోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. -
ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 87 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి దక్కించుకునేందుకు టాటా గ్రూప్ గట్టిగా కసరత్తు చేస్తోంది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఎయిరిండియా కోసం బిడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఎయిరిండియా ఫుల్ సర్వీస్ విభాగాన్ని విస్తారాతో కలిసి, చౌక చార్జీల విభాగం ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఎయిర్ఏషియా ఇండియాతో కలిసి నడపవచ్చని యోచిస్తోంది. ప్రస్తుతం మలేషియాకు చెందిన ఎయిర్ఏషియాతో కలిసి చౌక చార్జీల ఎయిర్లైన్స్ వెంచర్ ఎయిర్ఏషియా ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్తో ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ వెంచర్ విస్తారాను టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. ఎయిర్ఏషియాతో భాగస్వామ్య ఒప్పందం ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా మరో చౌక బడ్జెట్ ఎయిర్లైన్స్లో టాటా గ్రూప్ 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. ఎయిరిండియాకు బిడ్ చేసే క్రమంలో ఈ నిబంధనను సడలింపచేసుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎయిరిండియాలో బడ్జెట్ విభాగమైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను .. ఎయిర్ఏషియా ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి ఆమోదం పొందేందుకు ఎయిర్ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు తేది. మార్చి 17. ఉభయతారకం.. ఒకవేళ ఫెర్నాండెజ్ గానీ టాటా గ్రూప్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లయితే రెండు వర్గాలకు ఇది ప్రయోజనకరంగానే ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు. టాటా సన్స్తో జాయింట్ వెంచర్ కింద 2013లో ఎయిర్ఏషియా .. భారత్లో చౌక చార్జీల విమానయాన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందులో టోనీకి 49 శాతం, టాటా సన్స్కు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా గ్రూప్ విస్తారా పేరిట ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ ప్రారంభించింది. ఇందులో టాటాలకు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఎయిర్ఏషియా ఇండియా.. విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు చాలాకాలంగా పర్మిషన్ల కోసం ఎదురు చూస్తోంది. ఇటీవలే క్రిమినల్ కుట్ర, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఫెర్నాండెజ్తో పాటు ఎయిర్ఏషియా బోర్డులో టాటా గ్రూప్ నామినీ ఆర్ వెంకటరమణన్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ఏషియా ఇండియాకు విదేశీ సేవల కోసం అనుమతులు రావడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ఏషియా ఇండియాలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విలీనం ప్రతిపాదనకు ఫెర్నాండెజ్ గానీ అంగీకరిస్తే.. భారత ఏవియేషన్ రంగంలో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు సత్వరం అవకాశం లభించగలదు. అలాగే, ఎయిరిండియా.. విస్తారాలు కలిస్తే దేశీయంగా ఫుల్ సర్వీస్ విభాగంలో టాటాలకు గుత్తాధిపత్యం దక్కగలదని నిపుణులు పేర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 20 భారతీయ నగరాలు, గల్ఫ్.. ఆగ్నేయాసియాలోని 13 ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 25 బోయింగ్ 737 విమానాలు ఉన్నాయి. ఎయిర్ఏషియా 29 ఎయిర్బస్ ఏ320 రకం విమానాలతో దేశీయంగా 21 నగరాల మధ్య సర్వీసులు నడుపుతోంది. ఎయిరిండియాలోకి 100 శాతం ఎఫ్డీఐలపై దృష్టి ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికను మరింత వేగవంతం చేసే దిశగా.. కంపెనీలో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్డీఐ) పరిమితి 49 శాతంగా ఉంది. దీన్ని 100 శాతానికి పెంచిన పక్షంలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 49 శాతం పరిమితి నిబంధనను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)కి పౌర విమానయాన శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వివిధ శాఖల అభిప్రాయాలు కోరుతూ డ్రాఫ్ట్ నోట్ జారీ చేసినట్లు వివరించాయి. -
ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. ఆర్థిక బడ్జెట్ 2020లో ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ప్రభుత్వ పెట్టుబడుల చొరవలో భాగంగా తన వాటాలను విక్రయించనుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీప్రయివేటీకరణ క్రమంలో వాటాను అమ్మకానికి పెట్టింది. అటు ఐడీబీఐ వాటాల విక్రయానికి నిర్ణయం. త్వరలో ఎల్ఐసీ స్టాక్మార్కెట్లో లిస్టింగ్ చేయనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో తన హోల్డింగ్లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం, ఎల్ఐసీలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రకటనతో ఐడీబీఐబ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 17.4 శాతం పెరిగి 39.8 వద్ద ట్రేడ్ అవుతోంది. ( బడ్జెట్ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’) -
ఎయిర్ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభలో గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజంను (ఏఐఎస్ఎఎమ్) పునర్నిర్మించామని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియాను 100శాతం విక్రయించడాన్ని ఏఐఎస్ఎఎమ్ స్వాగతించిందని మంత్రి లోక్సభలో తెలిపారు. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రూ.25,000కోట్లు కోరిందని మంత్రి తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్ ఇండియా రూ.8,556.35కోట్లు నష్ట పోయిందని అన్నారు. కాగా, రూ.50వేల కోట్ల అప్పులతో ఎయిర్ ఇండియా సతమవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాకు మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బీపీసీఎల్, కాంకర్ విక్రయానికి బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్, కంటెయినర్ కార్పొరేషన్ (కాంకర్)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్కు అసోంలో ఉన్న నుమాలిగఢ్ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ సంస్థకే విక్రయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర కెబినెట్ కొత్త తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పీఎస్యుల ప్రయివేటీకరణను ప్రభుత్వం వేగవంతం చేయనుందని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో డీఐపీఏఎమ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మెనెజ్మెంట్) వ్యూహాత్మక అమ్మకాలను చేపడుతుందని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కెబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం కాగా, నీతి అయోగ్, డీఐపీఏఎమ్ సంయుక్తంగా పెట్టబడుల ఉపసంహరణను చేపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్ను మినహాయింపు నిర్ణయానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.3శాతం తేవడానికి పెట్టుబడుల ఉపసంహరణ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు సంస్థ ఉద్యోగులకు ఎయిరిండియా భారీ షాక్ సిద్ధమవుతోంది. ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ సర్కార్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.. ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల (జూలై)15 తో క్లోజ్ చేసింది. ఈ ఖాతాలను బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా వార్తలపై విమానయాన శాఖ , ఎయిరిండియా అధికారికంగా స్పందించాల్సి వుంది. ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ సెక్రటరీ అటన్ చక్రవర్తి ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ.30 వేల కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎయిరిండియాలో సుమారు 10వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. -
ఎయిర్ ఇండియా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, భారత్ ఎర్త్ మూవర్స్ (బీఈఎంఎల్) సహా రెండు డజన్ల కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ఇందులో తొమ్మిది కంపెనీల్లో వాటా విక్రయానికి ముందే వీటికి సంబంధించిన భూములు, ఇతర ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. వీటిల్లో స్కూటర్స్ ఇండియా, ఎయిర్ ఇండియా, భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్, ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్, హిందుస్తాన్ న్యూస్ప్రింట్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ, హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి. ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన కార్యాచరణను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) ఇప్పటికే రూపొందించింది. ‘‘ఆస్తుల నగదీకరణ కార్యాచరణ అన్నది... ఆస్తులను నిర్వచించడం, భిన్న మార్గాల్లో ఏ ప్రక్రియను అనుసరించేది తెలియజేస్తుంది’’ అని దీపమ్ సెక్రటరీ అతనూ చక్రవర్తి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎస్యూల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.80,000 కోట్ల సమీకరణ లక్ష్యం పెట్టుకోగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.90,000 కోట్లుగా ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయం గమనార్హం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆస్తుల అమ్మకం కూడా ఓ భాగం. -
జీ కొత్త వ్యూహాలు : 50శాతం వాటా అమ్మకం
సాక్షి, ముంబై: ఎస్సెల్ గ్రూప్లోని జీ ఎంటర్టైన్మెంట్లో మేజర్ వాటాను ప్రమోటర్ల విక్రయించనున్నారు. మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ,సుభాష్ చంద్ర ప్రమోటర్గా తమ వాటాలో సగభాగాన్ని విక్రయించనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వ్యూహాత్మక బిజినెస్ ప్రణాళికల్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్నకున్న వాటాలో సగభాగాన్ని విదేశీ సంస్థకు విక్రయించనున్నట్లు పేర్కొంది. జీ గ్రూప్ను గ్లోబల్ మీడియా టెక్ సంస్థగా రూపొందించే బాటలో అంతర్జాతీయ భాగస్వామికి ప్రమోటర్ల వాటాలో సగభాగం వరకూ విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ అంశంలో సలహాల కోసం అడ్వయిజర్లతో సమావేశమైనట్లు జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఈ బాటలో గోల్డ్మన్ శాక్స్ సెక్యూరిటీస్, లయన్ ట్రీ సంస్థలను అంతర్జాతీయ వ్యూహాత్మక సలహాదారుగా నియమించాలని నిర్ణయించింది. ఇది 2019 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ముగించాలని భావిస్తోంది.సెప్టెంబర్ నాటికి జీ ఎంటర్టైన్మెంట్లో ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వాటాను కలిగి ఉంది. బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్లో తమ బలం తెలుసు. ఇప్పటికే జీ 5 మార్కెట్లో రెండవ అతిపెద్ద ప్లేయగా ఉంది.. కానీ ప్రపంచ లక్ష్యాలు సాధించడానికి నిర్ణయం తీసుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయెంకా అన్నారు. అలాగే మైనారిటీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబోయే సమయంలో మరింత మెరుగవుతాయని ఆయన చెప్పారు మరోవైపు ప్రమోటర్ల వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. తొలుత 4 శాతం పతనమైంది. వెంటనే కొనుగోళ్ల తిరిగి జోరందుకుంది. ప్రస్తుతం 4 శాతం జంప్చేసి రూ. 455 ఎగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 470 వరకూ ఎగసింది. -
శత్రు షేర్ల విక్రయానికి త్వరలో విధివిధానాలు
న్యూఢిల్లీ: శత్రు దేశాల పౌరులకు భారతీయ సంస్థల్లో ఉన్న షేర్ల విక్రయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర డిజిన్వెస్ట్మెంట్ విభాగం వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తుల వేలంలో అనుభవం ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు, రెవెన్యూ విభాగం మొదలైన వాటితో సంప్రతించి వీటిని ఖరారు చేయనున్నట్లు వివరించింది. ఈ తరహా విక్రయ ప్రక్రియ చేపడుతుండటం ఇదే ప్రథమం కావడంతో మర్చంట్ బ్యాంకర్ ఒకరు సరిపోతారా లేదా మరింత మంది అవసరమవుతారా అన్నది పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు కాస్త సమయం పట్టొచ్చని, మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం దాకా ఈ ప్రక్రియ కొనసాగవచ్చని వివరించాయి. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలు సాధించేందుకు, ఎన్నికల వేల సంక్షేమ పథకాల కోసం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు శత్రు దేశాల పౌరుల షేర్లను విక్రయించే అంశానికి కేంద్ర క్యాబినెట్ గతవారం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా కేంద్రం రూ. 80,000 కోట్లు సమీకరించాలని భావించినప్పటికీ, వాటాల విక్రయం ద్వారా ఇప్పటిదాకా రూ. 15,000 కోట్లు సమీకరించగలిగింది. -
‘శత్రు’ షేర్ల విక్రయం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాల సాధనకు, ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా శత్రు దేశాల పౌరులకు భారత్లోని సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల పైచిలుకు ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాల పాటు నిద్రాణస్థితిలో ఉన్న శత్రుదేశ పౌరుల ఆస్తుల విక్రయానికి ఈ నిర్ణయం దోహదపడగలదని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వీటి విక్రయం ద్వారా వచ్చే నిధులను అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. ‘ఈ షేర్ల విక్రయ ప్రక్రియను ఆర్థిక మంత్రి సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం ఆమోదించాల్సి ఉంటుంది. షేర్ల విక్రయంతో వచ్చిన నిధులను డిజిన్వెస్ట్మెంట్ నిధులుగా పరిగణించి ఆర్థిక శాఖ నిర్వహించే ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది’ అని వివరించింది. 996 సంస్థల్లో 6.5 కోట్ల షేర్లు.. శత్రు దేశ పౌరుల భారతీయ ఆస్తులకు సంరక్షక సంస్థగా వ్యవహరించే సెపి వద్ద మొత్తం 996 కంపెనీల్లో 20,323 మంది షేర్హోల్డర్లకు చెందిన 6,50,75,877 షేర్లు ఉన్నాయి. వీటిలో 588 సంస్థలు క్రియాశీలకంగా ఉండగా, 139 సంస్థలు స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయినవి ఉన్నాయి. షేర్ల విక్రయ ప్రక్రియ ప్రారంభించడానికి ముందుగా.. న్యాయస్థానాల ఉత్తర్వులు, ఇతరత్రా నియంత్రణ సంస్థల ఆంక్షలు మొదలైన ప్రతిబంధకాలేమీ లేకుండా ధృవీకరణ బాధ్యతలను సెపి నిర్వర్తిస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ సేవలు అందించే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లు మొదలైన వారిని టెండర్ ప్రక్రియ ద్వారా దీపం ఎంపిక చేస్తుంది. మొత్తం విక్రయ ప్రక్రియను అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్ పర్యవేక్షిస్తుంది. శత్రు ఆస్తులంటే.. సాధారణంగా యుద్ధాల సమయంలో శత్రు దేశాల పౌరులకు తమ దేశాల్లో ఉన్న ఆస్తులను ప్రభుత్వాలు జప్తు చేస్తుంటాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో అమెరికా, బ్రిటన్ మొదలైనవి తమ దేశాల్లో జర్మన్ సంస్థలు, పౌరుల ఆస్తులను ఇలాగే జప్తు చేశాయి. వీటినే శత్రు ఆస్తులుగా వ్యవహరిస్తుంటారు. 1962లో చైనాతోను,1965 ఆ తర్వాత 1971లో పాకిస్తాన్తోనూ భారత్ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రక్షణ చట్టాల కింద ఈ రెండు దేశాల్లోని పౌరులకు భారత్లో ఉన్న ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. వీటిల్లో స్థలం, భవంతులు, షేర్లు, బంగారం, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. వీటి సంరక్షణ బాధ్యత సెపి చేతిలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం దాకా సెపి వద్ద ఇలాంటి ఆస్తులు సుమారు 2,100 దాకా ఉండగా.. ప్రస్తుతం ఇవి 16,000 దాకా చేరినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. లక్ష కోట్ల పైగానే ఉంటుందని అంచనా. -
పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. 2018–19లో తొలి ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం మూడు పీఎస్యూల ఐపీవోలు, భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రూ.9,600 కోట్లను సమీకరించింది. తన లక్ష్యంలో భారీ మొత్తాన్ని మిగిలిన ఆరు నెలల కాలంలో చేరుకోవాలి. మార్కెట్లో గడిచిన మూడు, నాలుగు నెలలుగా లిక్విడిటీ పరమైన సమస్య నెలకొందని, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నంత వరకు, చము రు ధరల మంటలు చల్లారనంత వరకు లిక్విడిటీ పరమైన ఇబ్బందులు కొనసాగొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న పీఎఫ్సీ, ఆర్ఈసీ తరహా ప్రభుత్వరంగ సంస్థల మధ్య కొనుగోళ్లను పరిశీలిస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు. జాబితాలోని కంపెనీలు విలీనం, కొనుగోళ్లను వెంటనే ప్రారంభించేందుకు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) త్వరలోనే మర్చంట్ బ్యాంకర్ల కోసం బిడ్లను ఆహ్వానించనుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)కి విక్రయించడం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.14,000 కోట్లు సమకూరతాయని అంచనా. ఇక షేర్ల బైబ్యాక్ కోసం కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ తదితర కంపెనీలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో బీహెచ్ఈఎల్, ఎన్హెచ్పీసీ, ఎన్బీసీసీ, ఎస్జేవీఎన్, కేఐఓసీఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఉన్నాయి. ఇప్పటికే నాల్కో, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్యార్డ్ కలిపి రూ.2,000 కోట్లతో షేర్ల బైబ్యాక్కు నిర్ణయించిన విషయం గమనార్హం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఐపీవోలు, ఆఫర్ ఫర్ సేల్ను పరిశీలించడం లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. -
జోరుగా డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో (సీఈఎల్) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి కనీసం రూ. 50 కోట్ల నికర విలువ గల సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. 1974లో ఏర్పాటైన సీఈఎల్ ప్రస్తుతం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహణలో ఉంది. 2017 మార్చి ఆఖరు నాటి లెక్కల ప్రకారం దీని నికర విలువ రూ.50.34 కోట్లు. గతేడాదే ఈ సంస్థ విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా భారత్–22 ఈటీఎఫ్, రైట్స్ సంస్థలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 9,000 కోట్లు సమీకరించింది. రూ. 467 కోట్ల ఇర్కాన్ ఐపీవో.. రైల్వేస్ అనుబంధ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్లో 10 శాతం వాటాల విక్రయంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రూ. 467 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్కు (ఐపీవో) సంబంధించి ధర శ్రేణిని రూ. 470– రూ. 475గా ఇర్కాన్ నిర్ణయించింది. ఈ ఐపీవోలో కేంద్రం 99,05,157 షేర్లను విక్రయిస్తోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఐపీవో 19న ముగుస్తుంది. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. 1976లో ప్రారంభమైన ఇర్కాన్.. రైల్వేస్, హైవేలు, వంతెనలు మొదలైన మౌలిక రంగ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. సంస్థకు రూ. 22,406 కోట్ల మేర ఆర్డర్లున్నాయి. ఈ ఏడాది జూన్లోనే రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ కూడా ఐపీవోకి వచ్చింది. ఏఐఏటీఎస్ఎల్లో వాటాల అమ్మకం .. రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించే ప్రణాళికల్లో భాగంగా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్(ఏఐఏటీఎస్ఎల్)లో వ్యూహాత్మక వాటాల విక్రయ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. మంత్రుల బృందం(జీవోఎ) అనుమతులు వచ్చాక బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను(ఈవోఐ) ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. -
ఓఎన్జీసీలో వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటంలో (డిజిన్వెస్ట్మెంట్) భాగంగా చమురు దిగ్గజం ఓఎన్జీసీలో 5 శాతం దాకా వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ఈ విక్రయం ఉండనుంది. ఓఎఫ్ఎస్ వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) గతవారం అమెరికాలో రోడ్షో కూడా నిర్వహించింది. నిర్దిష్టంగా ఎంత మొత్తం వాటాలు విక్రయిస్తుందన్నదీ వెల్లడికాకపోయినా సుమారు 3–5% మేర డిజిన్వెస్ట్మెంట్ ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ ప్రస్తుత షేరు ధర ప్రకారం దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 11,300 కోట్ల దాకా రావొచ్చు. ఓఎన్జీసీలో కేంద్రానికి మొత్తం 67.45 శాతం వాటా ఉంది. గతంలో 5 శాతం విక్రయం... 2011–12 ఆర్థిక సంవత్సరంలో కూడా ఓఎన్జీసీలో కేంద్రం దాదాపు 5 శాతం వాటాల విక్రయించి రూ.12,750 కోట్లు సమీకరించింది. అప్పట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆదుకోవడంతో ఈ విక్రయ ప్రతిపాదన గట్టెక్కింది. ఆ తర్వాత మళ్లీ మరిన్ని వాటాలు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ.. సబ్సిడీల భారంతో ఓఎన్జీసీ షేరుపై ప్రతికూల ప్రభావాల కారణంగా కుదరలేదు. అయితే, బ్యారెల్ క్రూడాయిల్ రేటు 70 డాలర్ల పైకి చేరిన పక్షంలో సబ్సిడీ భారాన్ని పంచుకోవాలంటూ ఓఎన్జీసీని అడగాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టడం ప్రస్తుతం సంస్థ షేరుకు సానుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో వాటాల విక్రయం సజావుగా జరగొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారంలో వాటాల విధానాన్ని ఉపసంహరించారు. దీంతో అప్పటిదాకా 60 శాతం దాకా వాటాలు భరిస్తున్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల సబ్సిడీ భారం ఆ సంవత్సరం 10 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత పూర్తిగా తొలిగిపోయింది. ఈసారి డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 80వేల కోట్లు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. డిజిన్వెస్ట్మెంట్ మార్గంలో గతేడాది రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లు సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో కేంద్రానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్జీసీ గతేడాది రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేయడం కూడా ఇందుకు దోహదపడింది. అయితే, ఈసారి ఇప్పటిదాకా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా కేవలం రూ. 9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సమీకరించిన నిధుల్లో ఇది కేవలం సగమే కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్ల సామర్థ్యానికి అనుగుణంగా.. మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడకుండా స్వల్ప స్థాయిల్లో డిజిన్వెస్ట్మెంట్ నిర్వహించే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీతో పాటు కోల్ ఇండియాలో 5 శాతం వాటాలు విక్రయించాలని కూడా కేంద్రం యోచిస్తోంది. కోల్ ఇండియా ప్రస్తుత షేరు ధర ప్రకారం మరో రూ. 9,100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఓఎఫ్ఎస్ కోసం ఈ ఏడాది జూన్లో దీపం విభాగం విదేశాల్లో రోడ్షోలు నిర్వహించింది. అటు ఇండియన్ ఆయిల్ (3%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (10% దాకా)లో సైతం డిజిన్వెస్ట్మెంట్ ద్వారా భారీగాగా నిధులు సమకూర్చుకోవచ్చని కేంద్రం యోచిస్తోంది. -
ఎయిరిండియాపై ఆనంద్ మహీంద్ర ఏమన్నారంటే...
సాక్షి, ముంబై: ఎయిరిండియా వాటా అమ్మకంపై నెలకొన్న సంక్షోభంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహాంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఎయిరిండియా వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితిపై ఎయిర్ ఇండియా మాజీ బోర్డు సభ్యుడు కూడా అయిన ఆనంద్ శుక్రవారం వరుస ట్విట్లలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎయిరిండియా వాటా అమ్మకం వ్యవహారం జాతి గౌరవానికి సంబంధించి అంశంగా మారిందని వ్యాఖ్యానించారు. బిడ్ వేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం సంస్థ పూర్వ ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన కఠినమైన చర్యల్ని గుర్తు చేసిందని ఆనంద్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పునర్వైభవం పొందాలంటే ఛైర్మన్కు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నారు. అలాగే రాజకీయ ఒత్తిళ్లనుంచి వారిని దూరంగా ఉంచాలన్నారు. ఈ నిర్ణయాత్మక చర్యలపై విస్తృతమైన మద్దతు కావాలని, ఇదొక రాజకీయం అవకాశంగా ఆయన పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర ప్రతిపాదించిన అయిదు ముఖ్య అంశాలు: పూర్తిగా ఎయిరిండియా బిజినెస్ పుంజుకున్న తరువాత మాత్రమే వాటాను విక్రయించేందుకు ప్రభుత్వంం పూనుకోవాలి. ఇండియన్ మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ను ఎయిర్లైన్ ఛైర్మన్, సీఈవోగా నియమించాలి. ఎయిరిండియాను తిరిగి గాడిలోపెట్టేందుకు కొత్త ఛైర్మన్కు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. రాజకీయ ఒత్తిళ్లనుంచి ఛైర్మన్ను పూర్తిగా దూరంగా ఉంచాలి . ఎలాంటి కఠినమైన నిర్ణయాలనైనా అమలు చేసేందుకు కొత్తగా ఎంపికైన ఛైర్మన్కు పూర్తి నైతిక మద్దతునివ్వాలి. Yes, I quipped then,but this is now a matter of national pride.Time to turn a crisis into opportunity 1)Resolve that a sale will be made,but only after a turnaround 2)Locate&appoint a Govt official with the potential & passion of an E.Sreedharan as Chairman&CEO.. (1/2) https://t.co/8QZPxhrnPu — anand mahindra (@anandmahindra) June 1, 2018 #AirIndia 3) Provide FULL autonomy to the Chairman & CEO with a target horizon for a turnaround. 4) Provide the Chairman COMPLETE insulation from political pressure 5) Provide FULL moral support to the Chairman for all tough measures that will be required (2/2) — anand mahindra (@anandmahindra) June 1, 2018 -
ఎయిరిండియా కథ మళ్లీ మొదటికి
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రయివేటు పరం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చివరిరోజు ఇబ్బడి ముబ్బడిగా బిడ్లు వస్తాయని ఆశించిన సర్కార్ చివరికి సింగిల్ బిడ్ను కూడా సాధించలేకపోయింది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు చివరి రోజు అయిన మే 31వ తేదీ గురువారం కూడా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. బిడ్లు వేసేందుకు సంస్థల నుంచి కనీస స్పందన కరువైంది. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి బిడ్డర్లనుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ, తదుపరి చర్యలను త్వరలోనే నిర్ణయిస్తామని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉన్న ఎయిరిండియాను ప్రయివేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం సంస్థలో 76శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడింది. ఇందుకోసం బిడ్డర్లను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్లు వేసేందుకు మే 14 వరకు గడువు పెట్టింది. అయితే మొదట జెట్ఎయిర్వేస్, ఇండిగో, టాటా లాంటి సంస్థలు ఎయిరిండియాలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. అయితే వాటా విక్రయంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వాటా కొనుగోలు అనంతరం ఎయిరిండియాను వారి సొంత సంస్థల్లో విలీనం చేయరాదని, పాత సిబ్బందిని తొలగించరాదని పేర్కొంది. దీంతో నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ చాలా సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. నిబంధనల్లో కొన్ని మార్పులు చేసిన అనంతరం బిడ్ వేసేందుకు గడువును మే 31వరకు పొడిగించింది. నిబంధనలను సవరించి, గడువు పొడిగించినా కూడా బిడ్ను సాధించడంలో విఫలం కావడం గమనార్హం. -
ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో కేంద్రం వేగంగానే అడుగులేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంతో రూ.72,500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి అందులో సగం మేర పూర్తి చేసింది. నవంబర్ 1 నాటికి వాటాల విక్రయం ద్వారా రూ.30,185 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ నెల 3న ముగిసిన న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవోతో కలిపి చూస్తే కేంద్ర సర్కారు లక్ష్యంలో సగానికిపైనే అంటే రూ.37,000 కోట్లు సమకూరాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. బీమా సంస్థలు బంగారు బాతులు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ లక్ష్యంలో రూ.46,500 కోట్లను ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, రూ.15,000 కోట్లను వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ఇన్సూరెన్స్ కంపెనీల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయన్న అంచనా వేసింది. నవంబర్ 1 నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.25,797 కోట్లు వచ్చాయి. వ్యూహాత్మక వాటాల విక్రయంతో మరో రూ.4,153 కోట్లు జమయ్యాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్లో వాటాల విక్రయంతో రూ.7,600 కోట్లను సమీకరించింది. దీంతో మొత్తం సమీకరించిన నిధులు రూ.37,865 కోట్లు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో ఒక్కటే కేంద్ర సర్కారుకు భారీగా నిధులను సమకూర్చిపెట్టింది. దీని ద్వారానే కేంద్ర సర్కారుకు ఏకంగా రూ.9,700 కోట్ల నిధులు వచ్చి చేరాయి. దీనికితోడు ఎన్టీపీసీలో వాటాలను అమ్మటం ద్వారా కేంద్రం రూ.9,100 కోట్లను రాబట్టుకుంది. ముందే లక్ష్యం పూర్తి! ఇక భారత్ 22 ఈటీఎఫ్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. దీని ద్వారా కేంద్ర సర్కారు 22 సంస్థల్లో తనకున్న వాటాలను కొంత మేర విక్రయించడం ద్వారా రూ.8,000 కోట్లు రానున్నాయి. ఈ ఇష్యూ నేటి(శుక్రవారం)తో ముగుస్తుంది. మరోవైపు వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని కేంద్ర సర్కారు వేగవంతం చేయనుందని సమాచారం. వ్యూహాత్మక వాటాల విక్రయంలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు సంబంధించి కేంద్రం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్లను కూడా ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది. -
పెట్టుబడుల ఉపసంహరణ: ఆ కంపెనీలపై కొరడా
సాక్షి,న్యూఢిల్లీ: అక్రమాలకు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన కళంకిత కంపెనీలను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలో పాల్గొనడాన్ని ప్రభుత్వం నిషేధించనుంది. కేంద్రం తాజాగా జారీ చేసిన నూతన డిజిన్వెస్ట్మెంట్ మార్గదర్శకాల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. అవకతవకలకు పాల్పడటం, నిబంధనల ఉల్లంఘనలపై న్యాయస్థానం నుంచి ప్రతికూల తీర్పులు ఎదుర్కొన్న కంపెనీలు, రెగ్యులేటరీ యంత్రాంగాలు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రతికూల ఆదేశాలు అందుకున్న సంస్థలు పీఎస్యూ కంపెనీల డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనర్హమైనవిగా ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. ఇక ఏదేని కంపెనీపై సెబీ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు వెలువరిస్తే వాటిని న్యాయస్దానాలు నిర్దారించిన అనంతరమే ఆ బిడ్డర్ను అనర్హులుగా ప్రకటిస్తారని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో డిజిన్వెస్ట్మెంట్కు బిడ్డర్ల ఎంపిక కోసం ఆయా కంపెనీల నికర ఆస్తులు, అనుభవాలను ప్రభుత్వం పరిశీలించేది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపే పార్టీల అర్హత, అనర్హతలను విశ్లేషించే క్రమంలో ఇతర క్రైటిరియానూ పరిశీలించాలని తాజాగా నిర్ణయించిన క్రమంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాల విక్రయాన్ని పారదర్శకంగా చేపట్టేందుకు కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా అర్హులను ఎంపిక చేసేందుకు తాజా మార్గదర్శకాలను వెలువరించినట్టు ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. -
ఎయిర్ ఇండియా విక్రయ కసరత్తు వేగిరం
సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇద్దరు ఆర్థిక సలహాదారులు, ఒక న్యాయ సలహాదారు నియామకానికి సంబంధించి గురువారం బిడ్లను ఆహ్వానించింది. ఎయిర్ ఇండియా దాని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్ కోసం బిడ్ల స్వీకరణ..అంటూ ప్రభుత్వం పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 12లోగా ఆయా సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటీసులో పేర్కొంది. -
డిజిన్వెస్ట్మెంట్.. జోష్!
♦ హైపవర్ ప్యానల్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం ♦ ఆర్థిక, రవాణా, పాలన విభాగాల మంత్రులకు చోటు ♦ త్వరలో నాలుగు సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయాలు ♦ జాబితాలో బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, పవన్హన్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్ ♦ వీటికి సంబంధించి అడ్వైజర్ల నియామకం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ(డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఇందుకు గాను అత్యున్నత స్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక, రోడ్డు, రవాణా, పరిపాలనా విభాగం మంత్రులతో ప్రత్యామ్నాయ యంత్రాంగం ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక పెట్టుబడుల వ్యవహారాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమావేశం అనంతరం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. దీనికితోడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా... ఎప్పటికప్పుడు విధానపరమైన అంశాలపై నిర్ణయ అధికారా న్ని సెక్రటరీల కోర్ గ్రూపుకు ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.72,500 కోట్ల నిధుల సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం విధించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.46,500 కోట్లు మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, రూ.15,000 కోట్లు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, సాధారణ బీమా సంస్థల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్ల సమీకరణ ఇందులో ఉంది. ఇప్పటి వరకు మొత్తం మీద రూ.8,427 కోట్ల సమీకరణ పూర్తి చేసింది. నాలుగింటిపై దృష్టి బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, పవన్హన్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్ సంస్థల్లో వ్యూహాత్మక వాటాలను విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. లక్నో కేంద్రంగా నడిచే స్కూటర్స్ ఇండియాలో నూరు శాతం, బెంగళూరు కేంద్రంగా భారీ యంత్రపరికరాలను తయారు చేసే బీఈఎంఎల్లో 26 శాతం, హెలికాప్టర్ సేవల్లోని పవన్హన్స్లో 51 శాతం చొప్పున వాటాలను అమ్మాలనుకుంటోంది. ఈ వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లేందుకు సలహాదారుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సలహాదారులు ప్రొఫెషనల్ ఇంటర్మీడియరీలను ఎంపిక చేస్తారని వెల్లడించాయి. ఈ వర్గాలు అందించిన సమాచారం మేరకు... స్కూటర్స్ ఇండియాలో ముందుగా వాటాల విక్రయం జరగనుంది. ఇక పవన్హన్స్లో వాటాల విక్రయానికి సంబంధించి సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల కోసమే ఇది ఆగింది. మరోవైపు హెచ్పీసీఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తుండటంతో దీని ద్వారా సర్కారుకు రూ.33,000 కోట్ల నిధులు అందనున్నాయి. ఈ డీల్కు సంబంధించి కన్సల్టెంట్, న్యాయ సలహాదారుల నియామకంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నాలుగు సంస్థల ఐపీవోలు నాలుగు ప్రభుత్వరంగ సంస్థల్లో ఐపీవోల ద్వారా వాటాల విక్రయ ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) ప్రారంభించింది. గార్డెన్రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, భారత్ డైనమిక్స్, మిశ్రధాతు నిగమ్ ఇందులో ఉన్నాయి. వీటికి అదనంగా ప్రభుత్వరంగంలోని ఐదు సాధారణ బీమా సంస్థలు కూడా ఐపీవోలకు క్యూలో ఉన్నాయి. ఇక ఈ నెల మొదట్లో 22 ప్రభుత్వరంగ సంస్థలతో ఈటీఎఫ్ భారత్–22ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం నుంచి రానున్న రెండో ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్. దీని ద్వారా 22 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ప్రభుత్వం తగ్గించుకోవాలని అనుకుంటోంది. -
ఎయిర్ ఇండియా అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా అమ్మకానికి మరో కీలక అడుగు పడింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఎయిర్ ఇండియా అమ్మకానికి ఆమోదం లభించింది. మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులు ఎయిర్ ఇండియా సంస్థలో చేరడం వల్ల సంస్థ మరింత నాణ్యంగా, వేగంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు. ఆర్థికమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుకు చేయాలన్న విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కూడా క్యాబినెట్ సమ్మతించిందని తెలిపారు. వాటాల అమ్మకం, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుందని చెప్పారు. కాగా ఎయిర్ ఇండియాలో నష్టాలను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సుమారు రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే . -
లక్ష్యాన్ని మించి డిజిన్వెస్ట్మెంట్ నిధుల సమీకరణ
2016–17లో రూ.46,247 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ.46,247 కోట్లు సమీకరించింది. ఈ మొత్తంలో వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్, ఎస్యూయూటీఐ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ.10,779 కోట్లు, సీపీఎస్ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.35,468 కోట్లు చొప్పున కేంద్రం సమీకరించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ తర్వాత దానిని రూ.45,000 కోట్లకు సవరించింది. చివరకు సవరించిన లక్ష్యాన్ని మించి రూ.46,247 కోట్లు సమీకరించగలిగింది. -
ద్రవ్యలోటు లక్ష్యాలను సాధిస్తాం
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ • అధిక పన్ను వసూళ్లు, డిజిన్వెస్ట్మెంట్ దన్ను న్యూఢిల్లీ: ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను కేంద్రం సాధిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 2017–18 సంవత్సరానికి 3.2 శాతం, 2018–19 సంవత్సరానికి 3 శాతంగా బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. పన్ను వసూళ్ల మెరుగుదల, పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా దీన్ని సాధిస్తామన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో అప్పటివరకూ వెల్లడించని ఆదాయంపై పన్నుల రూపంలో వచ్చే మొత్తాలను బడ్జెట్ పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని జైట్లీ తెలిపారు. పారిశ్రామిక మండళ్లు ఇక్కడ నిర్వహించిన బడ్జెట్ అనంతర సమావేశంలో జైట్లీ శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకన్నా అధికంగా పన్ను వసూళ్లు ఉంటాయని భావిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందన్న ఆశాభావంతో మేము ఉన్నాము. ⇔ పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి అధిక లక్షాలను నిర్దేశించుకున్నాం. ఇందుకు అనుగుణంగా సాధారణ బీమా కంపెనీలు సహా పలు పీఎస్యూ కంపెనీలను లిస్ట్ చేస్తాం. అలాగే లిస్టింగ్ అవసరాలకు అనుగుణంగా వాటాల ఉపసంహరణ జరుగుతుంది. ఆయా అంశాలు ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాయని భావిస్తున్నాం. ⇔ అనవసర అడ్డంకులు, ఉన్నతాధికారుల అలసత్వం వంటి అంశాల నివారణకే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ (ఎఫ్ఐబీపీ)ని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆటోమేటిక్ రూట్ ద్వారానే భారీ పెట్టుబడులు రావాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు తగిన రోడ్మ్యాప్ తయారీ ఉంటుంది. ⇔ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వమే ఒక అసెట్ రీహాబిలిటేషన్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆర్థిక సర్వే ప్రతిపాదన చర్చల దశలో ఉంది. త్వరలో దీని అమలు దిశగా అడుగులు పడతాయి. బ్యాడ్ బ్యాం క్కు కూడా ఇదే వర్తిస్తుంది. సంపన్నులపై పన్నేస్తే తప్పేమీలేదు సంపన్నులపై పన్నులకు సంబంధించి 10 శాతం సర్చార్జ్ విధించడంలో తప్పేమీలేదని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అనేకమంది పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. పన్ను చెల్లింపుదారుల సమాచారం ప్రకారం, 56 లక్షల మంది వేతన జీవుల మినహా, ఏడాది రూ.5 లక్షలపైన తమ ఆదాయాన్ని తమకుతాముగా వెల్లడిస్తున్నవారు దేశంలో కేవలం 20 లక్షల మందే ఉన్నారన్నారు. పన్నులు సరిగా సకాలంలో చెల్లించడం ద్వారా దేశాభివృద్ధికి దోహదపడే సమాజాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో నల్లడబ్బును పోగుచేసుకోడానికి అవకాశాలు సైతం సన్నగిల్లుతాయని జైట్లీ అన్నారు. -
డిజిన్వెస్ట్మెంట్ @ రూ.72,500 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. డిజిన్వెస్ట్చేయదల్చిన పీఎస్యుల్లో 3 రైల్వే పిఎస్యులు( ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిఒఎన్) కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచ స్థాయి పిఎస్యులతో పోటీపడేలా దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం కొన్నింటి విలీనం, కొన్నింటి కన్సాలిడేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎదురైన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పిఎస్యుల లిస్టింగ్ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా, ఉపసంహరణ ప్రక్రియలో జవాబుదారీతనం పెరిగేలా, కంపెనీల వాస్తవ విలువ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.56 వేల కోట్లుగా నిర్ణయించుకున్నా, చివరకు రూ. 45వేల కోట్లనే సమీకరించింది. 10 పిఎస్యుల షేర్లతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్కు మంచి స్పందన వచ్చిందని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది మరో కొత్త ఈటీఎఫ్ను ప్రవేశపెడతామని వెల్లడించారు. -
డిజిన్వెస్ట్మెంట్పై నిర్ణయాధికారం...ఇక మంత్రుల చేతికి..!
• ప్రత్యామ్నాయ యంత్రాంగానికి కేబినెట్ ఆమోదముద్ర... • కమిటీలో ఆర్థిక, రవాణా, పీఎస్యూలకు చెందిన మంత్రులకు చోటు • 5 ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సై న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్మెంట్) జోరు పెంచేందుకు మోదీ సర్కారు కొత్త విధానానికి తెరతీసింది. వాటా అమ్మకాలకు సంబంధించిన అధికారాలన్నీ మంత్రుల బృందానికి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుధవారం ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్మెంట్పై నిర్ణయాలు తీసుకునే ఈ మంత్రుల బృందంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సంబంధిత పీఎస్యూలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఏదైనా సీపీఎస్యూలో వాటా విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత.. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియపై నిర్ణయాలన్నీ మంత్రుల బృందమే తీసుకుంటుంది. వాటా విక్రయించే తేదీ, షేరు ధర ఖరారు, ఎన్నిదశల్లో వాటా విక్రయించాలి ఇతరత్రా అంశాలన్నీ నిర్ణయిస్తుంది. ‘నిర్దిష్ట సీపీఎస్యూలో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గకుండా, యాజమాన్య నియంత్రణను సర్కారు చేతిలో ఉండేవిధంగానే వాటా విక్రయాలు జరుగుతాయి. దీనిప్రకారం ఆయా సంస్థల్లో ఎంత వాటా విక్రయించాలనేది ఇకపై ప్రత్యామ్నాయ యంత్రాంగమే నిర్ణయిస్తుంది’ అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. జాప్యాలు, ఊహాగానాలను తగ్గించేందుకే... డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో జాప్యాలు, విధానపరమైన అంశాలపై ఊహాగానాలను తగ్గించడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రస్తుత 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.56,500 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.36,500 కోట్లను మైనారిటీ వాటా అమ్మకాల రూపంలో.. మిగతా రూ.28,000 కోట్లను వ్యూహాత్మక విక్రయాల ద్వారా సమీకరంచాలనేది ప్రభుత్వ ప్రణాళిక. కాగా, ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగియనుండగా... ఇప్పటివరకూ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ.23,500 కోట్ల నిధులను మాత్రమే సమీకరించగలిగింది. లిస్టింగ్ బాటలో సాధారణ బీమా కంపెనీలు... ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లో వాటా అమ్మకానికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేబినెట్ లైన్క్లియర్ చేసింది. ఈ రంగంలో ఉన్న మొత్తం ఐదు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ‘తాజా ఈక్విటీ జారీ లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వాటా విక్రయం ఉండొచ్చు. ఈ కంపెనీల్లో ప్రభుత్వ వాటాను ఇప్పుడున్న 100 శాతం నుంచి దశలవారీగా 75 శాతానికి తీసుకురావడమే మా లక్ష్యం’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో చెప్పారు. వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వ మూలధన నిధులపై ఆధారపడటాన్ని తగ్గించి... స్టాక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణను ప్రోత్సహించడం, కార్పొరేట్ నైతిక నియమావళిని మెరుగుపచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం వాటా విక్రయానికి ఓకే చెప్పిన పీఎస్యూ సాధారణ బీమా కంపెనీల్లో... న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(జీఐసీ)ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 52 బీమా కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 24 జీవిత బీమా వ్యాపారంలో, 28 కంపెనీలు సాధారణ బీమా రంగంలో ఉన్నాయి. కాగా, భారతీయ జాయింట్ వెంచర్లలో విదేశీ బీమా కంపెనీల వాటా(ఎఫ్డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఇప్పటికే మోదీ సర్కారు ఆమోదం తెలిపింది. ‘ఎలక్ట్రానిక్స్’కు రాయితీల పరిమితి రూ.10,000 కోట్లు న్యూఢిల్లీ: దేశీయంగా నెలకొల్పే ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకు రాయితీల పరిమితిని రూ.10,000 కోట్లుగా కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీ ప్యాకేజీ పథకం(ఎంఎస్ఐపీఎస్)లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ స్కీం కింద కొత్త కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు దరఖాస్తుల అనుమతి గడువును ఏడాదిన్నరపాటు కుదించారు. ‘ఎంఎస్ఐపీఎస్ స్కీమ్లో సవరణ ప్రకారం ఇకపై ప్రతిపాదనలను 2018 డిసెంబర్ వరకూ అనుమతించనున్నాం. అదేవిధంగా ప్రోత్సాహకాల పరిమితి రూ.10,000 కోట్లుగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటివరకూ స్కీమ్లో దరఖాస్తులకు వీలుంటుంది’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ఒకవేళ పెట్టుబడి బిలియన్ డాలర్ల కంటే అధికంగా ఉంటే దానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుందని ఆయన వెల్లడించారు. 2015 ఆగస్టులో ఈ స్కీమ్కు సవరణ చేస్తూ 2020 జూలై 27 వరకూ పొడించారు. చిన్న సంస్థలకు ప్యాకేజీ... దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ఒక ప్యాకేజీని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థలకు నిధుల కల్పన కోసం క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ కింద మూలనిధి(కార్పస్)ని పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. దీనిప్రకారం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో రుణాలను రెట్టింపు చేయనున్నారు. ఇప్పటివరకూ రూ. కోటి వరకూ రుణాలిస్తుండగా.. ఇకపై రూ.2 కోట్ల వరకూ లభిస్తుంది. తాజా నిర్ణయంతో కార్పస్ ఇప్పుడున్న రూ.2,500 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెరగనుంది. దీనికి నిదులను కేంద్రమే సమకూర్చుతుంది. ఎఫ్సీఐకి రూ.45,000 కోట్ల ఎన్ఎస్ఎస్ఎఫ్ రుణం... ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్ఎస్ఎస్ఎఫ్) నుంచి రూ.45,000 కోట్ల రుణం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆహార సబ్సిడీ అవసరాల కోసం ఎఫ్సీఐ ఈ నిధులను ఉపయోగించుకోనుంది. కాగా, 4 రాష్ట్రాలు(అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాలకు ఎన్ఎస్ఎస్ఎఫ్ రుణాల నుంచి మినహాయింపునిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
హడ్కో వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ : హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) డిజిన్వెస్ట్మెంట్ కోసం మర్చంట్ బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం 100 శాతంగా ఉన్న తన వాటా నుంచి 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐపీఓద్వారా వాటాను విక్రయించాలని యోచిస్తున్న కేంద్రం.. ఈ ప్రక్రియకు తగిన సలహా, సహా యకారాలు అందించేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులకు వచ్చే నెల 3 వరకు గడువు ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా జారీ అయ్యే షేర్లకు రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎన్హెచ్పీసీ వాటా విక్రయం సక్సెస్
ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తొలి డిజిన్వెస్ట్మెంట్, ఎన్హెచ్పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయానికి మంచి స్పందనే లభించింది. వాటా విక్రయంలో భాగంగా 125.76 కోట్లు(11.36 శాతం వాటా) షేర్లను ఒక్కో షేర్ రూ.21.75 బేస్ ధరపై ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత వాటా ఇన్వెస్టర్ల విభాగం 1.58 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విభాగం 1.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. ఎన్హెచ్పీసీలో ప్రభుత్వ వాటా 85.96 శాతం నుంచి 74.6 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ప్రైస్(రూ.21.75)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం నేపథ్యంలో ఎన్హెచ్పీసీ షేర్ ధర బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.21.15 వద్ద ముగిసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
కార్పొరేట్లకు బడ్జెట్ లో నిరాశే!
♦ ప్రోత్సాహకాలను తగ్గించే అవకాశం.. ♦ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలు నెరవేరకపోవడమే కారణం ♦ ద్రవ్యలోటు పెరగవచ్చన్న ఆందోళనలు కూడా... ♦ కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతానికి తగ్గిస్తామని ♦ గత బడ్జెట్లోనే కేంద్రం హామీ... న్యూఢిల్లీ: మోదీ సర్కారు రానున్న బడ్జెట్లో కార్పొరేట్ రంగాన్ని నిరాశపరచనుందా? ప్రోత్సాహకాల కోతకు తెరతీయనుందా? ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితులను చూస్తే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించి పోతుందన్న ఆందోళనలకు తోడు డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోవడం వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో ఈ సారి బడ్జెట్లో పన్ను వసూళ్లు, ప్రభుత్వ రంగ వాటా విక్రయాలకు సంబంధించి లక్ష్యాల విధింపులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను సమర్పించనున్న సంగతి తెలిసిందే. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి కోత...! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యం జీడీపీలో 3.9 శాతం(రూ.5.55 లక్షల కోట్లు) కాగా, దీన్ని మించిపోవచ్చనే సంకేతాలు స్పష్టం కనబడుతున్నాయి. డిసెంబర్ నాటికే ద్రవ్యలోటు లక్ష్యంలో 88 శాతానికి(రూ. 4.88 లక్షల కోట్లు) చేరుకుంది. వాస్తవానికి ఈ ఏడాదే ద్రవ్యలోటును 3.6 శాతానికి కట్టడి చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం దీన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోపక్క, ఈ ఏడాది భారీస్థాయిలో రూ.68,500 కోట్ల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా... కేవలం రూ.12,700 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. దీంతో వచ్చే ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.35 వేల కోట్లకు పరిమితం చేయొచ్చన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలకు ఎలా కళ్లెం వేస్తారు, ఆదాయాలను ఎలా పెంచుకుంటారనేదానిపై రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక వేత్తలు దృష్టిపెట్టారు. ఇప్పటికే సంకేతాలు... తాజాగా మోదీ ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న రాయితీలు, పోత్సాహకాలను తగ్గించాల్సి ఉందని... హేతుబద్దీకరించనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కార్పొరేట్లకు రూ.62,400 కోట్ల మేర భారీ పన్ను ప్రయోజనాలు, ఇతరత్రా రాయితీలు అమలవుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నామని గత బడ్జెట్లోనే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు. మూలధన పెట్టుబడులు, పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ), అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ప్రాజెక్టుల ఏర్పాటు చేసే సంస్థలకు ఇస్తున్న పన్ను ప్రయోజనాలకు జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో కోత విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి భారత్ను తయారీ హబ్గా మార్చడం కోసం మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా కంపెనీలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పన్ను ప్రయోజనాల్లో లొసుగులను పూడ్చే క్రమంలో వాటికి కోత వేసే చర్యలను ప్రభుత్వం గనుక చేపడితే.. అది మేక్ ఇన్ ఇండియాకు అవరోధంగా మారొచ్చని కేపీఎంజీకి చెందిన ట్యాక్స్ పార్ట్నర్ రాహుల్ మిత్రా అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ఒక్కో భారతీయ కంపెనీపై అన్ని రకాల పన్నులు కలిపి దాదాపు 34%గా అంచనా. అంతర్జాతీయంగా చూస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ వాస్తవ రేటు 23 శాతంగా లెక్కగడుతున్నారు. అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ రాయితీలే.. కార్పొరేట్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల రూపంలోనే ఉంటున్నాయి. మూలధన పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. 37,000 కోట్ల మేర గండి పడిందని అంచనా. ప్రధానంగా ఐటీ, ఫార్మాతో పాటు కొన్ని తయారీ రంగ కంపెనీల విషయానికొస్తే.. పెట్టుబడులపై దాదాపు 200 శాతం వరకూ మినహాయిం పులు అమల్లో ఉన్నాయి. దీన్ని ఇప్పుడు 60 శాతానికి కుదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను వసూళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు మినహా ఈ సారి కార్పొరేట్ రంగానికి జైట్లీ పెద్దగా చేసేదేమీ లేకపోవచ్చనేది ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ నిధి ఏర్పాటుతో పాటు మూడేళ్లపాటు పన్ను మినహాయింపులు, సరళ నిబంధనలను అమలు చేస్తామంటూ మోదీ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్లపై మరీ కఠిన వైఖరిని ప్రదర్శిస్తారా అనేది వేచిచూడాల్సిందేనని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఇంజినీర్స్ ఇండియా వాటా విక్రయానికి భారీ స్పందన
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో (ఈఐఎల్) 10 శాతం వాటాల విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి మెరుగైన స్పందన కనిపిం చింది. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తితో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) 2.54 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. మొత్తం 3.36 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా 8.56 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దాఖలైన బిడ్ల విలువ దాదాపు రూ. 1,642 కోట్లుగా ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. సూచనప్రాయంగా షేరు ఒక్కింటి ధర రూ. 190.63గా ఉండగలదని (కనీస ధర రూ.189) పేర్కొంది. దీని ప్రకారం లెక్కిస్తే 3.36 కోట్ల షేర్ల విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 640 కోట్లు లభిస్తాయి. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద లభ్యమైన గణాంకాల ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం 2.69 కోట్ల షేర్లు కేటాయించగా.. 5.91 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో ఈ విభాగం 2.2 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 67.38 లక్షల షేర్లు కేటాయించగా.. 3.92 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. 2.64 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాల విక్రయాన్ని కొనసాగిస్తుందని డిజిన్వెస్ట్మెంట్ విభాగం కార్యదర్శి నీరజ్ గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ జరిగిన సంస్థల్లో ఇది ఐదోది. దీనితో కేంద్రం పీఎస్యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 13,340 కోట్లు సమీకరించినట్లవుతుంది. బీఎస్ఈలో ఈఐఎల్ షేరు శుక్రవారం 0.52 శాతం నష్టంతో రూ. 193.05 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీలో డిజిన్వెస్ట్మెంట్పై రోడ్షోలు
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ప్రభుత్వ వాటాల విక్రయ (డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియ జోరందుకుంది. ఇందుకోసం ఆయా కంపెనీలు, డిజిన్వెస్ట్మెంట్ విభాగం రోడ్ షోలు చేపట్టాయి. ఎన్టీపీసీ విద్యుత్ శాఖ, డిజిన్వెస్ట్మెంట్ విభాగం ఈ నెల 5-10 దాకా సింగపూర్, హాంకాంగ్, లండన్, అమెరికాల్లో ఏకకాలంలో రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, న్యూయార్క్లో రోడ్షోలు ఉంటాయని వివరించాయి. ప్రస్తుత షేర్ల ధరల ప్రకారం ఎన్టీపీసీలో 5 శాతం వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ. 5,200 కోట్లు, బీఈఎల్లో 5 శాతం డిజిన్వెస్ట్మెంట్తో రూ. 1,400 కోట్లు రాగలవని అంచనా. రోడ్షోల్లో ఇన్వెస్టర్ల స్పందన, దేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులను బట్టి రెండు సంస్థల్లోనూ డిజిన్వెస్ట్మెంట్ చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నాలుగు సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఖజానాకు రూ. 12,600 కోట్లు వచ్చాయి. -
గట్టెక్కిన ఐవోసీ డిజిన్వెస్ట్మెంట్
- ఖజానాకు రూ. 9,379 కోట్లు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ.. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డిజిన్వెస్ట్మెంట్ గట్టెక్కగలిగింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువయిన తరుణంలో బీమా దిగ్గజం ఎల్ఐసీ తదితర సంస్థాగత ఇన్వెస్టర్లు రంగంలోకి దిగి తోడ్పాటు అందించాయి. దీంతో ఐవోసీలో 10 శాతం వాటాల విక్రయంతో ఖజానాకు సుమారు రూ. 9,379 కోట్లు జమకానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో 24.28 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా 28.74 కోట్ల షేర్లకు (దాదాపు 1.18 రెట్లు) బిడ్లు దాఖలయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 11,107 కోట్లు ఉంటుంది. 5 శాతం డిస్కౌంటు ఇచ్చినప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం అయిదో వంతు షేర్లే కొనుగోలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం తమ కోటాకి సంబంధించి 1.43 రెట్లు ఎక్కువ షేర్లకు బిడ్లు వేసారు. 19.42 కోట్ల షేర్లను వారికి ఉద్దేశించగా.. 27.85 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. మార్కెట్ల పతనానికి అనుగుణంగా ఐవోసీ షేరు ఓఎఫ్ఎస్ కనీస ధర రూ. 387 కన్నా తక్కువకి పడిపోయి బీఎస్ఈలో రూ. 378.25 వద్ద క్లోజయ్యింది. -
రేపే పీఎఫ్సీలో వాటాల విక్రయం
షేరు ధర రూ. 254 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లో 5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో జూలై 27న (సోమవారం) కేంద్రం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను మార్కెట్ రేటుతో పోలిస్తే 2 శాతం డిస్కౌంటుతో రూ. 254గా నిర్ణయించింది. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం పీఎఫ్సీలో 6.60 కోట్ల షేర్ల విక్రయం ద్వారా కేంద్రానికి రూ. 1,600 కోట్లు రాగలవని అంచనా. సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 72.80 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్మెంట్ తర్వాత వాటాలు 67.80 శాతానికి తగ్గుతాయి. రెండు ట్రేడింగ్ పనిదినాలు కాకుండా రెండు బ్యాంకింగ్ పని దినాలకు ముందు వాటాల విక్రయ యోచనలు వెల్లడించే వీలు కల్పిస్తూ ఓఎఫ్ఎస్ నిబంధనలు మార్చిన తర్వాత షేర్ల విక్రయం జరుపుతున్న తొలి కంపెనీ పీఎఫ్సీనే. -
డిజిన్వెస్ట్మెంట్కు 13 సంస్థలు రెడీ!
5 నుంచి 15 శాతం వరకూ వాటాల విక్రయం న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) డిజిన్వెస్ట్మెంట్ తాజా జాబితాలో దాదాపు 13 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) ఉన్నాయి. ఈ దిశలో 5-15 శాతం మేర వాటాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ముసాయిదా కేబినెట్ నోట్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. కాగా తదుపరి జాబితా సిద్ధమయినప్పటికీ, ఏ ప్రభుత్వ రంగ సంస్థ తక్షణం మార్కెట్లోకి వస్తుందన్న విషయం తెలియలేదు. ఇందుకు సంబంధించి కేంద్రం మార్కెట్ కదలికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంస్థలు ఇవీ... * నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), హిందుస్తాన్ కాపర్(హెచ్సీఎల్), ఇండియా టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ), స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ), ఎంఎంటీసీల్లో 15% చొప్పున వాటాల విక్రయం. * ఇంజనీర్స్ ఇండియా(ఈఐఎల్), నాల్కో, ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్(ఐఓసీ)ల్లో 10% చొప్పున డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళిక. * బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ (డీసీఐఎల్)లో 5 శాతం వాటా విక్రయం. వాటాల విక్రయ విలువలు ఇలా...: ప్రస్తుత మార్కెట్లో ఆయా షేరు ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్ ద్వారా రూ.240 కోట్లు, హెచ్సీఎల్ ద్వారా రూ.1,000 కోట్లు, ఐటీడీసీతో రూ.169 కోట్లు, ఎస్టీసీ ద్వారా రూ.140 కోట్లు, ఎంఎంటీసీకి సంబంధించి రూ.800 కోట్లు, ఈఐఎల్ ద్వారా రూ.700 కోట్లు, నాల్కో విషయంలో రూ.1,200 కోట్లు లభించనున్నాయి. ఎన్ఎండీసీ ద్వారా రూ.5,300 కోట్లు, ఐఓసీ ద్వారా రూ.9,000 కోట్లు, బీహెచ్ఈఎల్ విషయంలో రూ.2,900 కోట్లు, ఎన్టీపీసీ విషయంలో రూ.6,000 కోట్ల సమీకరణ జరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.41,000 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. గత వారం ఆర్ఈసీలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.1,550 కోట్లు సమీకరించింది. -
భారత్ రేటింగ్ పెంపు ఇప్పట్లో కష్టమే!
- ద్రవ్యలోటు కట్టడి జాప్యంపై రేటింగ్ ఏజెన్సీల అసంతృప్తి - బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించకపోతే ఇబ్బందేనని హెచ్చరిక న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి) లక్ష్యం విషయంలో మోదీ సర్కారు జాప్యంపై అంతర్జాతీయ, దేశీయ రేటింగ్ ఏజెన్సీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తక్షణం భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్ను పెంచే అవకాశాల్లేవని తేల్చిచెప్పాయి. అంతేకాకుండా బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2015-16) ప్రకటించిన ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్మెంట్) లక్ష్యాన్ని గనుక అందుకోవడంలో విఫలమైతే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించాయి. ఈ ఏడాది(2014-15) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతాన్ని అందుకోనున్నామని.. వచ్చే ఏడాదికి 3.9 శాతం, ఆపై ఏడాది 3.3 శాతం, 2017-18లో 3 శాతం లక్ష్యాన్ని సాధించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గత అంచనాల మేరకు 2016-17 నాటికే 3 శాతం లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంది. అంతేకాకుండా 2015-16 ఆర్థిక సంవత్సరానికి గతంలో కేంద్రం 3.6 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని కూడా తాజాగా పెంచడాన్ని రేటింగ్ ఏజెన్సీలు గుర్తు చేశాయి. 2015-16లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.69,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం రూ.58,425 కోట్లుకాగా, రూ.31,350 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా. మరోపక్క, ప్రభుత్వం సమీకరించే రుణాలను కేవలం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచేందుకు వీలుగా ఉత్పాదకత పెంపునకు మాత్రమే ఉపయోగించాలని కూడా రేటింగ్ ఏజెన్సీలు సూచించాయి. ముడిచమురు ధరలు దిగిరావడం, వృద్ధి పుంజుకుంటున్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యాల సాధనపై ఆందోళన వ్యక్తం చేశాయి. 3 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధనను మూడేళ్లకు పెంచడం రేటింగ్కు సంబంధించి తటస్థం(క్రెడిట్ న్యూట్రల్)గా పరిగణిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. ప్రభుత్వం వృద్ధి పెంపుపై అధికంగా దృష్టిపెడుతున్నందున ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇబ్బందులు తప్పవని కూడా అభిప్రాయపడింది. అయితే, ప్రభుత్వ రుణ సమీకరణ నిధులను వృద్ధి పెంపునకు ఉపయోగించిన పక్షంలో అధిక ద్రవ్యలోటుతో ముప్పేమీ ఉండబోదని ఇండియా రేటింగ్స్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ కూడా తాజాగా ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరించడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్అండ్పీ ‘బీబీబీ మైనస్’(స్థిరమైన అవుట్లుక్తో), మూడీస్.. ‘బీఏఏ3’(స్థిర అవుట్లుక్) రేటింగ్ను కొనసాగిస్తున్నాయి. -
సర్కారీ షేర్లొస్తున్నాయ్.!
⇒ కోల్ ఇండియాలో రేపు 10% వాటా విక్రయం ⇒ కేంద్ర ప్రభుత్వానికి రూ.24,000 కోట్లు లభించే చాన్స్... ⇒ రిటైలర్లకు 20% షేర్ల కేటాయింపు; బిడ్డింగ్ ధరలో 5% డిస్కౌంట్ కూడా.. ⇒ మార్చిలోపే ఓఎన్జీసీలో డిజిన్వెస్ట్మెంట్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల షేర్లు వెల్లువెత్తనున్నాయి. ఈ ఏడాది పీఎస్యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) లక్ష్యానికి మరో 60 రోజులే వ్యవధి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోరు పెంచుతోంది. ప్రధానంగా బడా కంపెనీలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా జనవరి 30న(రేపు) బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూపంలో నేరుగా స్టాక్ మార్కెట్లో షేర్లను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నట్లు కోల్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. 30న స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ(ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30) షేర్ల విక్రయం జరుగుతుందని తెలిపింది. బుధవారం కంపెనీ షేరు ధర బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ.384 వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే కేంద్ర ఖజానాకు రూ.24,257 కోట్లు లభిస్తాయని అంచనా. అమ్మకానికి 63.17 కోట్ల షేర్లు... ప్రస్తుతం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 89.65 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ ద్వారా 10 శాతానికి సమానమైన 63.17 కోట్ల షేర్లను విక్రయానికి పెడుతోంది. తొలుత 5 శాతం వాటా, మరో 5 శాతాన్ని అదనంగా విక్రయించే ఆప్షన్తో ఓఎఫ్ఎస్ ఉంటుంది. ఈ మొత్తం షేర్లలో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు... 25 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించనున్నారు. ఇప్పటివరకూ రిటైలర్లకు ఓఎఫ్ఎస్లో కోటా 10 శాతం కాగా, ఈ ఇష్యూలో రెట్టింపు చేస్తున్నారు. అంటే ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.2 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేయొచ్చు. గురువారం మార్కెట్లు ముగిశాక షేర్ల వేలానికి సంబంధించి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను ప్రకటించనున్నారు. రిటైర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రైస్లో 5 శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీగా నిలుస్తున్న కోల్ ఇండియా... 2010 అక్టోబర్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఈ ఇష్యూ ద్వారా 10 శాతం వాటా విక్రయించిన కేంద్రానికి రూ.15,199 కోట్లు లభించాయి. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద ఐపీఓగా కూడా ఇది నిలిచింది. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంపై దృష్టి... ఇండియన్ ఆయిల్(ఐఓసీ), బీహెచ్ఈఎల్, నాల్కో, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాను విక్రయించే అవకాశాలున్నాయి. పీఎస్సీ, ఆర్ఈసీల్లోనూ 5 శాతం చొప్పున వాటా అమ్మకానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఐసీఓలో 10%, నాల్కో, బీహెచ్ఈఎల్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్లలో 5% చొప్పున వాటాలను అమ్మాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది(2014-15)లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.43,425 కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో సెయిల్లో 5 శాతం వాటాను అమ్మడం ద్వారా ఇప్పటిదాకా లక్ష్యంలో రూ.1,715 కోట్లు మాత్రమే లభించాయి. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎలాగైనా లక్ష్యాన్ని అందుకునేలా కేంద్రం వేగంగా చర్యలు చేపడుతోంది. మరోపక్క, జీడీపీలో ద్రవ్యలోటును 4.1%కి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ డిజిన్వెస్ట్మెంట్ నిధుల చాలా కీలకంగా మారాయి. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ ద్వారానే లక్ష్యంలో సగం నిధులు సమకూరనుండటం గమనార్హం. వరుసలో ఓఎన్జీసీ... ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే(మార్చిలోగా) మరో పీఎస్యూ చమురు అగ్రగామి ఓఎన్జీసీలో కూడా వాటా విక్రయించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం సవాలుగా నిలుస్తున్నప్పటికీ వెనక్కితగ్గబోమని చెప్పారు. కంపెనీలో 5 శాతం వాటాను విక్రయించాలనేది కేంద్రం ప్రణాళిక. ఒకపక్క క్రూడ్ క్షీణత, మరోపక్క పెట్రో సబ్సిడీ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఓఎన్జీసీ షేర ధర పడిపోతూ వస్తోంది. గతేడాది జూన్లో రూ.472 స్థాయి నుంచి ప్రస్తుతం(బుధవారం బీఎస్ఈలో) రూ.354 స్థాయికి దిగజారింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం చూస్తే ఈ వాటా అమ్మకం ద్వారా ఖజానాకు రూ.15,000 కోట్లు లభించొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీలో 68.94 శాతం వాటా ఉంది. హెచ్ఏఎల్ లిస్టింగ్కు సన్నాహాలు... ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఈ మహారత్న కంపెనీ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వీలుగా డెరైక్టర్ల బోర్డును ఏప్రిల్ 1కల్లా పునర్వ్యవస్థీకరించనున్నారు. మరోపక్క, కేవలం విమానయాన తయారీ సంస్థగానే కాకుండా ఈ రంగంలోని టెక్నాలజీ విభాగంపై కూడా మరింత దృష్టిసారించనున్నట్లు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న కంపెనీ చైర్మన్ ఆర్కే త్యాగి బుధవారమిక్కడ తెలిపారు. -
సెయిల్ డిజిన్వెస్ట్మెంట్ సక్సెస్
ప్రభుత్వ ఖజానాకు రూ. 1,715 కోట్లు న్యూఢిల్లీ: స్టీల్ రంగ దిగ్గజం సెయిల్ వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి రెట్టింపు స్పందన లభించింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం 20.65 కోట్ల షేర్లను(5% వాటా) అమ్మకానికి పెట్టగా, మొత్తం 42.93 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖల య్యాయి. ఆఫర్కు నిర్ణయించిన రూ. 83 ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 1,715 కోట్లు లభిం చనున్నాయి. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 75%కు పరిమితం కానుంది. తద్వారా సెబీ లిస్టింగ్ నిబంధనలు అమలు కానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో నిర్వహించిన ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ ధరకు సెయిల్ షేర్లు జారీకానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, ఈ విభాగం నుంచి ఇష్యూకి 2.66 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇక సాధారణ విభాగంలో 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖల య్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు వీలుగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ తదితరాలలో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనుంది. కాగా, బీఎస్ఈలో సెయిల్ షేరు 3 శాతం క్షీణించి రూ.83 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్పై ఈ వారంలో నిర్ణయం!
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయం ప్రతిపాదనకు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్రవేసే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో కంపెనీ డిజిన్వెస్ట్మెంట్కు ఓకే చెప్పవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 89.65 శాతం వాటా ఉంది. గురువారంనాటి షేరు ముగింపు ధర(రూ.356) ప్రకారం చూస్తే 10 శాతం వాటా(63.16 కోట్ల షేర్లు) అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.22,428 కోట్లు లభించవచ్చని అంచనా. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ.43,425 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ మొత్తంలో ఒక్క కోల్ ఇండియా వాటా విక్రయం ద్వారానే సగానికిపైగా ఖజానాకు సమకూరనుండటం గమనార్హం. ఓఎఫ్ఎస్లలో రిటైలర్లకు 20% కోటా: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల వాటా అమ్మకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఆర్థిక శాఖ లైన్క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో షేర్ల విక్రయంలో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల కోటాను 20 శాతానికి పెంచినట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టే పీఎస్యూ డిజిన్వెస్ట్మెంట్లకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. -
బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్ దూకుడు!
న్యూఢిల్లీ: బడ్జెట్ తర్వాత పీఎస్యూల్లో వాటా విక్రయాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తిచేయాలంటూ డిజిన్వెస్ట్మెంట్ విభాగాన్ని(డీఓడీ) ఆర్థిక శాఖ ఆదేశించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్కారు యోచిస్తోంది. 2014-15 మధ్యంతర బడ్జెట్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.36,925 కోట్లుగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టనున్న తొలి బడ్జెట్లో కూడా ఈ లక్ష్యాన్ని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల జోరుతో చాలా పీఎస్యూల షేర్ల విలువలు భారీగానే ఎగబాకాయి. దీంతో వాటా విక్రయాలతో ప్రభుత్వానికి కూడా తగిన రాబడి వచ్చేందుకు వీలుంది. బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్కు సమాయత్తమవుతున్నాం’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి . కోల్ ఇండియా(10 శాతం వాటా విక్రయం), సెయిల్(10%), ఎన్హెచ్పీసీ(11.6%), ఆర్ఈసీ(5%), పీఎఫ్సీ(%) వంటివి ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో ఉన్నాయి. కాగా, చాన్నాళ్లుగా పెండింగ్లోఉన్న హిందుస్థాన్ జింక్, బాల్కోలలో అవశేష(స్వల్పంగా మిగిలిన) వాటాను కూడా విక్రయించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిద్వారా రూ.15,000 కోట్లు ఖజానాకు జమకావచ్చని అం చనా. తాజాగా ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్యూల వాటా విక్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డీఓడీని జైట్లీ ఆదేశించినట్లు సమాచారం. -
ప్రభుత్వ ఈటీఎఫ్లో యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో సంస్థాగత(యాంకర్) ఇన్వెస్టర్లు రూ. 850 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన పది బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్ను మంగళవారం ప్రవేశపెట్టగా, తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. ఈటీఎఫ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల యూనిట్లను రిజర్వ్ చేసింది. కాగా, బుధవారం నుంచీ ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోలుకి రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో కనీసం రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆరు సంస్థలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితర 10 సంస్థల వాటాలతో ఈ ఫండ్ను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఇన్వెస్టర్లకూ ప్రభుత్వం 5% తొలి(అప్ఫ్రంట్) డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా అర్హతగల రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రతీ 15 యూనిట్లకు ఒక లాయల్టీ యూనిట్(6.66% డిస్కౌంట్) లభించనుంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్? వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోగా కోల్ ఇండియాలో 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపాదనను వాయిదా వేసింది. అంతేకాకుండా 5% వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కంపెనీలో 90% వాటా కలిగిన ప్రభుత్వం డివిడెండ్ రూపంలో రూ. 19,000 కోట్లను అందుకోవడం గమనార్హం. -
ఐఓసీలో 10% వాటా విక్రయం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీ ఐవోసీలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తలా 5 శాతం వాటా కొనుగోలు చేశాయి. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 శాతం వాటాను (24.27 కోట్ల షేర్లు) షేరుకి రూ.220 ధర చొప్పున టోకున సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి రూ.5,340 కోట్లు సమకూరాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) ద్వారా ప్రభుత్వం రూ.10,434 కోట్లను సమీకరించినట్లయ్యింది. కాగా, ఐవోసీలో ప్రభుత్వ వాటా 78.92% నుంచి 68.92%కు క్షీణించగా, ఓఎన్జీసీ వాటా 8.77% నుంచి 13.77%కు ఎగసింది. ఇక ఆయిల్ ఇండియా తొలిసారి ఐవోసీలో (5%) వాటాను కొనుగోలు చేసింది. బీఎస్ఈలో ఐవోసీ షేరు 2% క్షీణించి రూ. 269 వద్ద ముగిసింది. లక్ష్యాన్ని అందుకుంటాం ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.16,000 కోట్ల సమీకరణను సాధించగలమని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఐవోసీలో వాటా విక్రయంతో ఇప్పటికే రూ.10,434 కోట్లను సమీకరించామని డిజిన్వెస్ట్మెంట్ శాఖ కార్యదర్శి అలోక్ టాండన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ద్వారా రూ.3,000 కోట్లను సమీకరిస్తామని, తద్వారా ఈ నెలాఖరుకల్లా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారాయన. ఇదే బాటలో యాక్సిస్ బ్యాంక్లో ప్రభుత్వానికి ఉన్న వాటా విక్రయాన్ని కూడా ఈ నెలలో ముగిస్తామన్నారు. ఎల్అండ్టీ, ఐటీసీలలోనూ ప్రభుత్వానికి కొంతమేర వాటా ఉంది. వచ్చే వారమే ఈటీఎఫ్ సీపీఎస్ఈల వాటాలతో ఏర్పాటు చేస్తున్న ఈటీఎఫ్ను ప్రభుత్వం వచ్చే వారం ప్రవేశపెట్టనుంది. ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర 10 ప్రభుత్వ బ్లూచిప్ కంపెనీలలోని వాటాలతో ఈటీఎఫ్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్ను రూ.10 కోట్లకుపైగా ఇన్వెస్ట్చేసే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18న ఆఫర్ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లు, తదితర సంస్థలు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లందరికీ 5% తొలి(అప్ఫ్రంట్) డిస్కౌంట్ లభిస్తుంది. -
లక్ష్యాన్ని దాటేస్తాం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం పొడవునా ద్రవ్యలోటుతో సతమతమైన ప్రభుత్వం చివరి త్రైమాసికం(క్యూ4)లో ఒక్కసారిగా జోష్లోకి వచ్చింది. ఇందుకు ప్రధానంగా డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంపై గురిపెట్టింది. ఇందుకు ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి అందుకుంటున్న భారీ డివిడెండ్లకుతోడు, వాటా విక్రయ ఆఫర్ల వేగాన్ని పెంచింది. వెరసి బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.40,000 కోట్లను మించి నిధులను సమీకరించే బాటలో సాగుతోంది. ఏడాది ముగిసేసరికి రూ. 60,000 కోట్ల వరకూ జమ చేసుకోనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికపరంగా ఇది కొంతమేర ఉపశమనాన్ని కల్పించే అవకాశమున్నప్పటికీ... ప్రణాళికా వ్యయాలను ప్రభుత్వం భారీగా తగ్గించుకోవలసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తాత్కాలిక(ఓటాన్ అకౌంట్) బడ్జెట్ను ప్రభుత్వం వినియోగించుకుంటుందని అంచనా. ఫలితంగా ఈ ఏడాదికి ద్రవ్యలోటునుజీడీపీలో 4.8%కు పరిమితం చేసే అవకాశముంది. ఇది ప్రభుత్వం లక్ష్యంకాగా, గత ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9%కు చేరిన విషయం విదితమే. యాక్సిస్లో వాటా అమ్మకం యాక్సిస్ బ్యాంక్లో ఎస్యూయూటీఐ ద్వారా కలిగి ఉన్న వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. యాక్సిస్లోగల 23.5% వాటా విలువ రూ. 13,000 కోట్లుగా అంచనా. ఇదే విధంగా హిందుస్తాన్ జింక్, ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియాలలోనూ కొంత వాటాను అమ్మే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుకల్పిస్తూ ఒక కంపెనీలో మరో కంపెనీ.. వాటాలను కొనే(క్రాస్ హోల్డింగ్) అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీనిలో భాగంగా ఐవోసీలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా విడిగా 5% చొప్పున వాటాలను కొనుగోలు చేయనున్నాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. 5,500 కోట్ల వరకూ లభించనున్నాయి. హిందుస్తాన్ జింక్, బాల్కోల్లో వాటా విక్రయం ద్వారా రూ. 22,000 కోట్ల వరకూ సమకూరే అవకాశముంది. ఇక కోల్ ఇండియా నుంచి ప్రభుత్వం రూ. 16,500 కోట్ల భారీ డివిడెండ్ను అందుకుంది. కోల్ ఇండియా షేరుకి రూ.29 డివిడెండ్ను చెల్లించింది. ఈ బాటలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తదితర సంస్థలు రానున్న రోజుల్లో మధ్యంతర డివిడెండ్లను చెల్లించనున్నాయి. -
సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) వాటా విక్రయాల(డిజిన్వెస్ట్మెంట్) లక్ష్యం సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలే మిగిలి ఉండటంతో... కేంద్రం త్వరపడుతోంది. ఈ నెల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), ఇంజినీర్స్ ఇండియాల్లో వాటా విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో బీహెచ్ఈఎల్(భెల్), మార్చిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లు క్యూలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంమీద ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం లక్ష్యించిన రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్మెంట్కు దరిదాపుల్లోకి రాగలమని భావిస్తున్నట్లు మాయారామ్ ధీమా వ్యక్తం చేశారు. చిత్రమేంటంటే లక్ష్యం 40వేల కోట్లయితే ఇప్పటిదాకా ఏడు పీఎస్యూల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే సమీకరించింది. ఈ ఏడాది డిజిన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీల్లో పవర్గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎంఎంటీసీలున్నాయి. దిగ్గజాల వరుస... తాజా రోడ్మ్యాప్ ప్రకారం ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియా, హెచ్ఏఎల్లో 10 శాతం చొప్పున వాటా విక్రయించే అవకాశముంది. దీన్లో ఐఓసీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా ద్వారా రూ.500 కోట్లు రావచ్చు. హెచ్ఏఎల్ ద్వారా రూ.3,000 కోట్లు సమకూరే అవకాశముంది. భెల్లో 5 శాతం వాటా విక్రయంతో రూ.2,000 కోట్లు ఖజానాకు జమ కావచ్చు. కోల్ ఇండియా, ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వంటి దిగ్గజ సంస్థల ఇష్యూలు కూడా చాన్నాళ్లుగా జాప్యమవుతూ వస్తున్నాయి. కాగా, ఐఓసీలో డిజిన్వెస్ట్మెంట్పై సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం చర్చించనుంది. ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ఈజీఓఎం ఈ వాటా (19.16 కోట్ల షేర్ల)విక్రయంపై చర్చిస్తుందని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఐఓసీలో కేంద్ర ప్రభుత్వానికి 78.92 శాతం వాటా ఉంది. కొన్ని పీఎస్యూల్లో షేర్లను సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ యంత్రాంగం ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో దీన్ని ఏర్పాటు చేయొచ్చని అంచనా. ప్రతిపాదిత ఈపీఎఫ్లో ఇప్పటికే లిస్టయిన సీపీఎస్ఈల షేర్లు(2-3%)ఉంటాయి. పసిడిపై నియంత్రణలు కొనసాగుతాయ్... బంగారం దిగుమతులపై ప్రభుత్వ నియంత్రణలను ఇప్పుడప్పుడే తొలగించే అవకాశాల్లేవని మాయారామ్ చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మెరుగుపడుతున్నప్పటికీ.. కనీసం మార్చి చివరివరకూ ఈ నియంత్రణలు కొనసాగవచ్చన్నారు. క్యాడ్ రికార్డు స్థాయికి చేరడం, రూపాయి పతనం కావటంతో పుత్తడిపై దిగుమతి సంకాన్ని అంచెలంచెలుగా కేంద్రం 10%కి పెంచడం తెలిసిందే. దీంతో మే నెలలో 162 టన్నుల స్థాయి నుంచి నవంబర్లో 19.3 టన్నులకు పడిపోయాయి. క్యాడ్ కూడా జూలై క్వార్టర్లో 4.8% నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 1.2%కి దిగొచ్చింది. నియంత్రణల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందా అన్న ప్రశ్నకు.. అలాంటి వాదనలకు తగిన ఆధారాల్లేవని మాయారామ్ తేల్చిచెప్పారు. -
ద్రవ్యలోటును కట్టడి చేస్తాం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు లోపు కట్టడి చేయగలమని ఆర్థిక మంత్రి పి. చిదంబరం తాజాగా స్పష్టం చేశారు. 4.8% దాటి తే ఆందోళనకరమని, అయితే దీనిని దాటబోమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ నవంబర్ చివరికి బడ్జెట్ అంచనాల్లో 94%కు ద్రవ్యలోటు చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ చిదంబరం డిసెంబర్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, వెరసి లోటు తగ్గుముఖం పడుతుందని వివరించారు. డిసెంబర్లో ముందస్తు పన్ను చెల్లింపులు వసూలుకావడంతోపాటు, ప్రభుత్వ వ్యయాలు క్షీణిస్తాయని చెప్పారు. దీంతో ద్రవ్యలోటుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదికి ద్రవ్యలోటును జీడీపీలో 4.8%కు పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బాటలో 2016-17కల్లా 3%కు తగ్గించాలని భావిస్తోంది. గడిచిన ఏడాది (2012-13)లో లోటు 4.9%గా నమోదైన సంగతి తెలిసిందే. కష్టమే... ఆదాయాలు క్షీణించడం, డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశంగా నిలవనుంది. లోటు కట్టడికి ప్రణాళికా వ్యయాలను రూ. లక్ష కోట్లమేర ప్రభుత్వం తగ్గించుకోవలసి ఉంటుంది. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 40,000 కోట్ల సమీకరణ లక్ష్యం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,000 కోట్లను సమకూర్చుకోగలిగింది. ఏప్రిల్-నవంబర్’13 కాలంలో ద్రవ్యలోటు రూ. 5,09,557 కోట్లకు చేరింది. ఇది వార్షిక లక్ష్యంలో దాదాపు 94%కాగా, గతేడాది ఇదే కాలానికి 80% స్థాయిలో లోటు నమోదైంది. ఈ ఏడాదికి ఆదాయాలు, వ్యయాల మధ్య లోటును రూ. 5,42,499 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
వారం రోజుల్లో ఎన్హెచ్పీసీ బైబ్యాక్
న్యూఢిల్లీ: జల విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్హెచ్పీసీ తలపెట్టిన బైబ్యాక్ ఈ నెల 29నుంచి మొదలుకానుంది. బైబ్యాక్లో భాగంగా రూ. 10 ముఖ విలువగల 123 కోట్లకుపైగా సొంత షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,368 కోట్లను వెచ్చించనుంది. షేరుకి రూ. 19.25 ధరలో చేపట్టనున్న బైబ్యాక్ను డిసెంబర్ 12వరకూ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క ంపెనీలో ప్రభుత్వానికి 86.36% వాటా ఉంది. బైబ్యాక్లో భాగంగా ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయిం చే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న 17 జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 5,702 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కంపెనీ సొంతం. కాగా, బీఎస్ఈలో షేరు ధర 1.7% క్షీణించి రూ. 17.65 వద్ద ముగిసింది. -
నెలాఖరుకల్లా ఐవోసీ డిజిన్వెస్ట్మెంట్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో భాగంగా ఆయిల్ దిగ్గజం ఐవోసీలో 10% వాటాను ఈ నెలాఖరుకల్లా విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ఏడాదిలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఐవోసీలో వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరుకల్లా ఐవోసీలో 10% వాటాను విక్రయించడం ద్వారా ఇంజినీర్స్ ఇండియా తదితర సంస్థల డిజిన్వెస్ట్మెంట్కు ఊపుతేవాలని యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, కంపెనీ షేరు ధర కనిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఇటు కంపెనీ, అటు పెట్రోలియం శాఖ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్మెంట్ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు రూ. 213 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి 10% వాటాకుగాను రూ. 4,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. కంపెనీలో ప్రభుత్వానికి 78.92% వాటా ఉంది. డిజిన్వెస్ట్మెంట్ను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వం సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీసహా ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది కూడా.