Dress Code
-
రాయల్ నేవీ చీర!
‘రాయల్ నేవీ’ అనేది కొత్త డిజైన్తో వచ్చిన చీర కాదు. విషయం ఏమిటంటే... సాంస్కృతిక వైవిధ్యాన్ని విస్తృతపరచడానికి శ్రీకారం చుట్టింది యూకే రాయల్ నేవీ. ఇందులో భాగంగా ‘ఫార్మల్ డ్రెస్కోడ్’ను అప్డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో మహిళా ఆఫీసర్లు చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలాంటి కల్చరల్ డ్రెస్లను ధరించడానికి అనుమతిస్తున్నట్లు తొలిసారిగా బ్రిటిష్ నేవీ ప్రకటించింది. అయితే వీటిపై యూనిఫాం షర్ట్, బ్లాక్ బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్థానీ నేవీ ఆఫీసర్ దుర్దాన అన్సారి ఫొటోను జత చేస్తూ రాయల్ నేవీ(ఆర్ఎన్) డైవర్సిటీ నెట్వర్క్ చైర్ పర్సన్ జాక్ కనాని లింక్డిన్లో కొత్త పాలసీ గురించి ప్రకటించారు. ఈ ఫొటోలో అన్సారి తెల్లని చీరలో మెస్ జాకెట్ ధరించి కనిపిస్తుంది. అయితే ‘ఫార్మల్ డ్రెస్కోడ్’లో మార్పు తేవడం కొందరు మాజీ బ్రిటిష్ అధికారులకు బొత్తిగా నచ్చలేదు. ‘సాంస్కృతిక గుర్తింపును యూనిఫామ్తో కలపడం సరికాదు’ అని విమర్శించారు. అయితే వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా ఫార్మల్ డ్రెస్కోడ్ అప్డేట్పై ఎక్కువ మంది సానుకూలంగా, సంతోషంగా స్పందించారు.(చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
డ్రస్ మార్చుకొని ఆడు... కుదరదు!
నేను తగ్గేదేలే... అయితే మేము ఆడించేదేలే! ఇటు చెస్ దిగ్గజం కార్ల్సన్, అటు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో కార్ల్సన్ అర్ధాంతరంగా టోర్నీకి గుడ్బై చెప్పాడు. అలాగని అక్కడేదో పెద్ద ఘోరమేమీ జరగలేదు. కానీ అహం, ఆవేశం కలగలిపి చిన్న డ్రస్ కోడ్ అంశమే పెద్ద వివాదంగా మారింది. చెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. న్యూయార్క్: మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లసన్ చదరంగంలో ఎత్తులు పైఎత్తులు వేసే దిగ్గజ ఆటగాడు. ‘ఫిడే’ ప్రపంచ చెస్ వ్యవహారాలను చక్కబెట్టే సంస్థ. ఓ ఆటగాడు... ఓ సమాఖ్య... ఓ డ్రెస్ కోడ్... చిన్న అంశం సర్దుకుంటే పోటీల ఫలితాలు మీడియాలో వచ్చేవి. కానీ ఆ అంశం కాస్త వివాదంగా... చివరకు చినికి చినికి గాలివానలా మారి పెద్దవార్త అయ్యింది. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) పంతానికే పోయాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య మాత్రం ఎంతవారైనా ‘ఫిడే’ నియమావళినే సుప్రీమ్ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో ఆటగాడు, సమాఖ్య వైరిపక్షాలుగా మారాయి. ఫిడే క్రమశిక్షణ చర్యలు చేపట్టడంతో... మీరేంటి నాపై చర్యలు తీసుకునేది నేనే టోర్నీకి ఇప్పుడే ఇక్కడితోనే గుడ్బై చెబుతానని కార్ల్సన్ ఉన్నపళంగా నిష్క్రమించాడు. అసలేం జరిగింది? న్యూయార్క్లో ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. మన మేటి భారత గ్రాండ్మాస్టర్లు అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి తదితరులు సైతం ఆడుతున్నారు. శనివారం ర్యాపిడ్లో ఎనిమిదో రౌండ్ తర్వాత డిఫెండింగ్ చాంపియన్, నార్వే దిగ్గజం కార్ల్సన్ జీన్స్ వేసుకొని చెస్ బోర్డు దగ్గరకు ఆడేందుకు వచ్చాడు. టోర్నీ చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హొలొజాక్ ముందుగా డ్రస్కోడ్ విషయమై నార్వే స్టార్కు సున్నితంగా చెప్పారు. జీన్స్ ప్యాంట్ ధరించి ఆడటం ఫిడే నియమావళికి విరుద్ధమని దయచేసి ప్యాంట్ మార్చుకొని రావాల్సిందిగా ఆర్బిటర్ సూచించారు. తర్వాత 200 డాలర్లు (రూ.17,078) జరిమానా విధించారు. కానీ అప్పటికప్పుడు జీన్స్ మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని మాగ్నస్ ‘ఎలాగూ జీన్స్తో వచ్చాను కదా... ఈ రౌండ్ పూర్తయ్యాక మార్చుకుంటాలే’ అని చెప్పేశాడు. దీంతో ఆర్బిటర్ అలా అయితే ఆడించటం కుదరదని స్పష్టం చేశారు.అయినాసరే డ్రస్ మార్చుకునేందుకు కార్ల్సన్ ససేమిరా అనడంతోనే వివాదం మొదలైంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా అతనికి తొమ్మిదో రౌండ్ ప్రత్యర్థిని (పెయిరింగ్ ఇవ్వలేదు) కేటాయించలేదు. అంటే ఇది ఆ రౌండ్కు అనర్హత వేటు. ఈ క్రమశిక్షణ చర్యల్ని ఏమాత్రం సహించని కార్ల్సన్ ర్యాపిడ్ తొమ్మిదో రౌండే కాదు... బ్లిట్జ్ పోటీలు సహా మొత్తం టోర్నీనే బాయ్కాట్ చేస్తున్నానని అక్కడినుంచి నిష్క్రమించాడు. -
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!) -
Kashi Vishwanath Temple: వారణాసి ఆలయంలో పోలీసులకు అర్చకుల డ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు దోతీ కుర్తా ధరించారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్కోడ్గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఆలయంలో పోలీసులు పూజారుల దుస్తులు ధరించాలంటూ ఆదేశాలు ఇచి్చనవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, విశ్వనాథ ఆలయంలో పోలీసుల డ్రెస్కోడ్ను వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమరి్థంచారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయని అన్నారు. రద్దీగా ఉన్నప్పుడు పోలీసులు నెట్టివేస్తే భక్తులు ఆగ్రహిస్తారని తెలిపారు. ఆర్చకుల వేషధారణలో ఉన్నవారు నెట్టివేస్తే పెద్దగా సమస్యలు రాబోవన్నారు. -
జొమాటో యూనిఫామ్లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్కోడ్ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్గా ఉన్న దుస్తులు, స్లీవ్లెస్, షార్ట్స్కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ మరో కీలక నిర్ణయం?.. ఆఫీస్లో ఉద్యోగులు ఇలా ఉండాల్సిందే?
ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) స్వస్తి పలికింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో నవంబర్ 1నుంచి (అంచనా) సిబ్బంది కార్యాలయాల నుంచి పనిచేయనున్నారు. ఈ తరుణంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ ముగింపు పలికిన టీసీఎస్.. తాజాగా ఉద్యోగులకు మరోసారి మెయిల్స్ పంపింది. ఆఫీస్కి వచ్చే ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో సంస్థ సంప్రదాయాల్ని మరువకూడదని గుర్తు చేసింది. ముఖ్యంగా, వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ ఉద్యోగులకు పంపిన మెయిల్స్లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ వాటాదారులు సంస్థ సంప్రదాయాలకు గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. డ్రెస్ కోడ్ పాలసీలో భాగంగా సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో సరైన వస్త్రధారణ ఉండేలా మార్గదర్శకత్వం చేస్తున్నట్లు లక్కడ్ తెలిపారు. ఈ సందర్భంగా నా సహచరులు దాదాపూ రెండేళ్ల పాటు ఇంటి వద్ద నుంచే పని చేశారు. ఇప్పుడు కార్యాలయాల నుంచి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో క్లయింట్ల ఉద్యోగులు డ్రెస్ కోడ్ గురించి స్పష్టత ఇచ్చేలా లక్కడ్ ఉద్యోగులు మెయిల్స్ చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల కోడ్ విషయానికి వస్తే..పురుషులు తప్పని సరిగా ఫుల్ - స్లీవ్డ్ షర్టులతో టక్ చేసుకోవాలి. మహిళా ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు సెమినార్లు, క్లయింట్ మీటింగ్లలో బిజినెస్ ఫార్మల్స్ తప్పని సరి. శుక్రవారం హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్నెక్, ఖాకీ చొక్కాలు, చినోలు, కుర్తీ, సల్వార్ (మహిళలు)లను మాత్రమే అనుమతిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఉద్యోగుల డ్రెస్ కోడ్ నిబంధనలపై టీసీఎస్ యాజమాన్యం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
New Parliament Dress Code: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) నిపుణులు ఈ యూనిఫామ్లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. NIFT designed New dress code for Parliament staff includes 1. Modi Jacket 2. Cream shirt with Lotus emblem 3. Khaki trousers 😂😂 pic.twitter.com/RWlP93mNha — Mac (@pattaazhy) September 12, 2023 ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్ పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా -
కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..
కట్టు..బొట్టు తీరు.. ఇదివరకైతే కేవలం సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం! తర్వాత వ్యక్తిగత అభిరుచికి అద్దమైంది! అటు తర్వాత సమయ సందర్భాలకు సూచిక అయింది! ఇప్పుడు.. పార్టీలు.. ప్రత్యేక వేడుకలు.. అంతెందుకు సరదా కాలక్షేపాలలో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఈ కట్టు.. బొట్టు.. తీరు మార్చుకుంది! సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ! దాన్నే మోడర్న్గా ‘డ్రెస్ కోడ్’ అంటున్నారు! పలు రంగుల్లో.. భిన్నమైన డిజైన్లలో.. క్లాస్గా.. మాస్గా.. ఫన్గా.. వియర్డ్గా.. ట్రెడిషనల్గా.. ట్రెండీగా.. కనిపిస్తోంది! ఒకరకంగా ఇది.. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ల అడ్రెస్ కోడ్గా మారింది!! ఆ విధంబెట్టిదనినా.. బార్బీ మూవీ ఫ్యాషన్.. మరిస్సా స్మిత్ అతి పెద్ద బార్బీ అభిమాని. గత సంవత్సరం బార్బీ సినిమా ట్రైలర్ విడదలైనప్పటి నుంచి ఆమె తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను మొత్తం బార్బీ ట్రెండ్ తోనే నింపేసింది. అచ్చం బార్బీలాగే రెడీ అయి వీడియోలు చేసింది. బార్బీ చిత్రం విడుదలైనప్పుడైతే అచ్చం బార్బీలాగే వెళ్లి ‘పింక్ ఫ్యాషన్ చాలెంజ్’ విసిరింది. అలా బార్బీ అభిమానులు మొత్తం ఆ సినిమాకు పింక్ డ్రెస్ కోడ్లోనే వెళ్లి చూశారు. కొంతమంది ఆ చాలెంజ్ ఏమిటో తెలియకుండానే పింక్ డ్రెస్లో వెళ్లి చూశారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన దేశంలోనూ కొనసాగుతోంది. దశాబ్దాల నాటి బొమ్మ పట్ల ప్రజలు తమ ఇష్టాన్ని వ్యకం చేసే విధానాల్లో ఈ పింక్ ఫ్యాషనూ ఒకటైంది! ఇది ఎంతలా ట్రెండ్ అయిందంటే పలు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా బార్బీ అభిమానుల కోసం స్పెషల్ డిజైన్స్ను, ఆఫర్స్ను ప్రకటించేంతగా! ఇదే తరహాలో.. ఆ తర్వాత విడుదలైన ‘ఓపన్ హైమర్’ సినిమాకూ చాలా మంది బ్లాక్ డ్రెస్ కోడ్లో వెళ్లారు. దెయ్యాల డ్రెస్ కోడ్.. హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే అరివీర భయంకరమైన వేషాధారణ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ గ్లోబలైజేషన్లో భాగంగా మన దేశంలోకీ ప్రవేశించింది. హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. ఎంజాయ్ చేస్తోంది. నిజానికి ఈ ‘హాలోవీన్ డే’ రెండువేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీనకాలంలో పేగన్లు (మధ్యయుగం నాటి ఓ మతానికి చెందినవారు) సమ్ హెయిన్’ అనే పండగను జరుపుకునేవాళ్లట. అదే ఈ హాలోవీన్ పండగకు ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్తో పూర్తయ్యేది. అక్టోబర్ మాసం ఆఖరి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది. కొత్త సంవత్సరాది సందర్భంగా అంతకుముందు చనిపోయిన పెద్దల ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో ఉండే తలుపు తెరుచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు. వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. నిప్పు అంటే ఆత్మలు భయపడతాయని ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా మొదలైన ఆ నమ్మకం తర్వాత సంప్రదాయంగా.. పదహారో శతాబ్దానికి ఓ పండగగా మారిపోయింది. పెళ్లి డ్రెస్ కోడ్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్లలోనూ డ్రెస్ కోడ్ మొదలైంది. మెహందీ, హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్, పెళ్లి. ఇలా ఒక్కో వేడుకకు పెళ్ళికూతురు, పెళ్లి కొడుకుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, ఆత్మీయులు కూడా డ్రెస్ కోడ్లో కనిపిస్తున్నారు. అంతేకాదు మతాలకనుగుణంగా ఆయా పెళ్లిళ్లలో ఆయా సంప్రదాయాల రీతిలో దుస్తులు ధరిస్తున్నారు. ఉదాహరణకు క్రిస్టియన్లలో వధూవరులు తెల్ల గౌన్, బ్లాక్ సూట్ వేసుకుంటే, హిందువుల్లో వధూవరులు పసుపు చీర, తెల్ల పంచెలు ధరించడం! ఇలా మతాలు, పద్ధతులే కాకుండా పలు ప్రాంతాల్లోని ఆచారవ్యవహారాలూ ఆ డ్రెస్ కోడ్లో భాగమవుతున్నాయి. పెళ్లి ఆపేస్తున్నారు.. చైనాలో వివాహ వేడుకకు సంబంధించి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గతంలో పెళ్లి కోసం రిజిస్ట్రారు ఆఫీస్కి.. తమ ఇష్టానుసారమైన వస్త్రధారణతో వచ్చేవారట. దీంతో ఆ క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం.. ఓ డ్రెస్ కోడ్ను ప్రవేశ పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చే దంపతులు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి. లేనిపక్షంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మంజూరు కాదు. కనీసం పెళ్లిరోజు అయినా దేశ సంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఓనం చీర.. దక్షిణాదిన ఘనంగా జరుపుకునే పండగల్లో కేరళకు చెందిన ఓనం ఒకటి. ఆ పండగనాడు మిగిలిన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా, బంగారు అంచుతో కూడిన తెల్లటి కాటన్ లేదా సిల్క్ చీరను కట్టుకుంటారు మలయాళ మహిళలు. ఆ చీరను కసవ్ అంటారు. ఇప్పుడు ఈ కట్టూ బొట్టూ ఓనం రోజున ఒక్క కేరళకే కాకుండా దేశమంతటికీ కోడ్గా మారింది. తమిళనాడులో అయితే కళాశాలలు, కార్యాలయాల్లోని విద్యార్థులు, ఉద్యోగినులు ఓనం చీరలను ధరించి తరగతులకు, విధులకు హాజరవుతున్నారు. అయితే కరోనా తర్వాత ఓనం చీర కోడ్ కేరళలో ఒకరకంగా యూనిఫామ్గా మారిందని చెప్పవచ్చు. కరోనా లాక్డౌన్తో అక్కడ నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. వాళ్లను ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ‘సేవ్ ది లూమ్’ సంస్థ ఆ రాష్ట్ర మహిళా న్యాయవాదుల కోసం ఓనం చీరలనే మోనోక్రోమ్ చీరలుగా మార్చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్నూ నేయించింది! ఈ డిజైన్ను ‘విధి’ అంటున్నారు. ఇప్పుడది అక్కడ చాలా ఫేమస్. బ్లాక్ అండ్ వైట్.. నలుపు, తెలుపు.. న్యాయవాద వృత్తికి చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా! ప్రతి రంగుకున్నట్టే దీనికీ కొన్ని సానుకూల, ప్రతికూల అర్థాలున్నాయి. ఒక వైపు విషాదం.. నిరసనను సూచిస్తూనే ఇంకో వైపు బలం.. అధికారాన్నీ సూచిస్తుంది. న్యాయవాద వృత్తికి నలుపు రంగునే ఎంచుకోవడానికి మరో కారణం.. అప్పట్లో రంగులు అంతగా అందుబాటులో లేవు. విస్తారమైన ఫాబ్రిక్ నలుపు రంగులో మాత్రమే ఉండేది. అలాగే న్యాయవాది డ్రెస్లోని ఇంకో రంగు తెలుపు.. కాంతిని, స్వచ్ఛతను, మంచితనాన్ని సూచిస్తుంది. వాది, ప్రతివాది రెండు పక్షాల న్యాయవాదులు ఒకే విధమైన డ్రెస్ కోడ్ను ధరిస్తారు. స్కూల్ యూనిఫాం స్టోరీ.. 16 వ శతాబ్దంలో యూకేలో యూనిఫామ్లు ప్రారంభమయ్యేంత వరకు అవి పాఠశాల క్రమశిక్షణలో భాగం కాదు. పిల్లలు తమకు నచ్చిన దుస్తులను ధరించి బడికి వెళ్లేవారు. 16వ శతాబ్దంలో మెజారిటీ పాఠశాలలు స్వచ్ఛంద పాఠశాలలు. మెజారిటీ విద్యార్థులు వెనుకబడినవారే. కాబట్టి నాటి స్వచ్ఛంద సంస్థలు ఒకే రంగు, ఒకే డిజైన్ కుట్టిన దుస్తులను విరాళంగా ఇచ్చేవి. ఇవే యూనిఫామ్ పుట్టుకకు నాంది అయ్యాయి. అలా నాటి నుంచి చాలా బడులు తమ విద్యార్థులు అందరికీ డ్రెస్ కోడ్ను తప్పనిసరి చేశాయి. ఈ యూనిఫామ్లు పిల్లల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలకు చెల్లుచీటీ పాడి బడిలో పిల్లలంతా సమానమనే భావనను పెంచాయి. క్రమశిక్షణలో భాగం చేశాయి. చాలా దేశాలు విద్యార్థుల డ్రెస్ కోడ్ అయిన ఈ యూనిఫామ్ను అమోదించినప్పటికీ, యూనిఫామ్ అనే ఆ పదానికి అభ్యంతరం చెబుతున్న దేశాలూ ఉన్నాయి. అలాంటి దేశాలు యూనిఫామ్ను సున్నితంగా ‘స్కూల్ డ్రెస్’ అంటున్నాయి. మన దేశంలో ముంబైలోని కొన్ని పాఠశాలల్లో బ్లేజర్లు, ప్యాంటు, స్కర్టులు లేదా ట్యూనిక్స్, బూట్లు, సాక్స్లు వాళ్ల యూనిఫామ్లో భాగం. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఇంగ్లిష్ మీడియం బడులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా బడి యూనిఫాం కలోనియల్ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం దానిని మార్చుకున్నాయి. జపాన్లో బాలికల పాఠశాల యూనిఫామ్లు బ్రిటిష్ నావికాదళ యూనిఫామ్ను పోలి ఉంటాయి. అక్కడి పిల్లలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు తమ షూను తీసివేయాలి. తరగతి గదిలో వారు ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటారు. యూని కోడ్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా వలయాంచిరంగార గ్రామంలో వందేళ్ల చరిత్ర ఉన్న సర్కారు బడి ఒకటి ఉంది. అందులో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్ విమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి.. పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు యూనిఫామ్గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. ఆటలు ఆడేటప్పుడు బాలికలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్ను తెచ్చారు. బాడ్మింటన్, షటిల్ ఆడాలన్నా.. హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకి ఎగురుతుందేమోననే బిడియంతో ఆడపిల్లలు ఆటలు ఆడడానికి ముందుకు రావడంలేదట. మంచి క్రీడాకారులు కాగల సత్తా ఉన్న అమ్మాయిలను వస్త్రధారణ కారణంతో అలా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అని ఆలోచించిన సి. రాజి.. ఆ స్కూల్ డ్రెస్ని అలా మార్చేశారు. ఫ్రెషీ చాయిస్ ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థాయ్లాండ్లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్ను ప్రకటించింది. ఫ్రెషర్స్లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్ను ప్రకటించే ఆనవాయితీగల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా డ్రెస్ కోడ్ను ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్స్, డార్క్ కలర్ లాంగ్ స్కర్ట్స్ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్నైనా ధరించే అవకాశాన్ని ‘ఫ్రెషీ చాయిస్’ పేరిట ట్రాన్స్జెండర్లకు కల్పించింది. ఆధ్యాత్మిక డ్రెస్ కోడ్ పలు ప్రసిద్ధ దేవస్థానాల్లో ఎప్పటి నుంచో డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు కూడా ఆమోద ముద్ర వేశారు. జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులకే కాదు పంజాబీ డ్రెస్పై చున్నీ లేని యువతులకు సైతం ఆలయాల్లో అనుమతి దొరకడం కష్టం. సంప్రదాయ పద్ధతి తప్పనిసరి కావడంతో చాలామంది పంచె, చీరలను కొనుగోలు చేసి, సంప్రదాయ పద్ధతిలో దైవాన్ని దర్శించుకుంటున్నారు. ఈ తరహాలోనే అయ్యప్ప దీక్ష భక్తులు నలుపు రంగులోనూ, భవానీ భక్తులు ఎరుపు రంగు, హనుమాన్ భక్తులు కాషాయం.. ఇలా భక్తులు ఆయా దైవ దీక్షల నియమాసారం ఆయా రంగుల డ్రెస్ కోడ్లో దీక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే పలు మతాలకు సంబంధించిన అధిపతులు, పూజారులు, సన్యాసులకూ పలు రంగుల డ్రెస్ కోడ్ ఉంది. పోప్స్ తెల్లని, నల్లని దుస్తులు ధరిస్తే.. హిందూ, బౌద్ధ మతాల్లోని పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, భిక్షువులు కాషాయ దుస్తుల ధరిస్తారు. జైనంలో శ్వేతాంబరులు పేరుకు తగ్గట్టు తెల్లటి డ్రెస్ కోడ్లో ఉంటారు. ముస్లిం మతంలో ప్రాంతాలను బట్టి ఆకు పచ్చ, తెలుపు, నలుపు వంటి రంగులు కనిపిస్తుంటాయి. లెక్కల్లో.. గణాంకాల ప్రకారం పదహారవ శతాబ్దంలోనే స్కూల్ యూనిఫామ్, సైనికుల యూనిఫామ్, బిజినెస్ యూనిఫామ్, ఉద్యోగుల యూనిఫామ్.. ఇలా రకరకాల డ్రెస్ కోడ్లను వారు చేస్తున్న పనికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో యూనిఫామ్ల రకాలు 80 వేల కంటే ఎక్కువే! చదువులు.. వృత్తులు.. విధులకు సంబంధించిన యూనిఫామ్స్ని పక్కనబెడితే.. విందు వినోదాలు.. వేడుకలు.. సరదా కాలక్షేపాలు వంటి వాటన్నిటికీ డ్రెస్ కోడ్ ఓ ట్రెండ్ అయింది. పార్టీలు, పబ్బులు సరే.. పాప్ స్టార్స్ కన్సర్ట్స్కీ.. ఆ పాప్ స్టార్స్ స్టయిల్స్ను ప్రతిబింబించే డ్రెస్ కోడ్లో హాజరవుతున్న అభిమానులూ ఉన్నారు. ఇలా డ్రెస్ కోడ్ కూడా ఫ్యాషన్లో చేరి.. ఎక్స్ప్రెషన్కి.. కమ్యూనికేషన్కీ ఓ టూల్గా మారింది! (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
టీచర్లకు డ్రస్ కోడ్! కొత్త రూల్ని జారీ చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్లు, జీన్స్లు, టీ షర్ట్లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్ అవసరమని నోటిఫికేషన్లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్ కోడ్, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పారు. (చదవండి: పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..) -
మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మహిళల డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని ,వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు డ్రేస్ కోడ్ వివాదమేంటి? కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో సల్మాన్తో కలిసి నటించిన పాలక్ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ తన సినిమా సెట్లో ఉన్న మహిలందరూ నిండుగా, మెడ వరకు వస్త్రాలు ధరించేలా చూస్తారు’ అని పేర్కొంది. దీనిని నెటిజన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. సల్మాన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు. (చదవండి: మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్సిరీస్లివే ) అందుకే ఆ కండీషన్ పెట్టా: సల్మాన్ తాజాగా ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ను వ్యాశ్యాత రజత్ శర్మ ఓ ప్రశ్న అడిగారు. ‘మీ సినిమా సెట్లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ ప్రశ్నించారు. (చదవండి: నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య ) దీనికి సల్మాన్ ఖాన్ జవాబిస్తూ ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు శరీర భాగాలు చాలా విలువైనవి అన్నదే నా అభిప్రాయం. వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే అంత మంచింది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు, మన తల్లులు, సోదరీమణులూ, భార్య వంటి మహిళలను వక్రబుద్ధి తో చూసే కొందరిని ఉద్దేశించి చెబుతున్న మాట. దుస్తుల కారణంగా మహిళలు అవమానాలకు గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను’ అని సల్మాన్ వివరించారు. నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి ఇదే కార్యకమ్రంలో తనకు వస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. బెదిరింపుల కారణంగా తనకు భద్రత పెంచారని, దీంతో గతలో మాదిరి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నాడు. ‘ట్రాఫిక్లోనూ నా చుట్టు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!?
మొదలైన ముహూర్తబలమో ఏమో కానీ, కొన్ని నిత్యం వివాదాస్పదమే. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్రం కొన్నేళ్ళ క్రితం ఆరంభించిన ‘జాతీయ ఉమ్మడి అర్హత – ప్రవేశ పరీక్ష’ (నీట్) అందుకు ఓ ఉదాహరణ. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కొంతకాలంగా ఉన్న ‘నీట్’ వ్యతిరేకత చాలదన్నట్టు, ఆదివారం నాటి పరీక్ష వివాదాల్లో మరో మెట్టు పైకెక్కింది. ఆడవారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికైంది. కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో ‘బ్రాసరీలు’ విప్పించి, ఆ తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతించిన ఘటన అత్యంత హేయమైనది. ‘నీట్’ సహా అనేక పరీక్షల్లో ఆడపిల్లల్ని వేధించడానికి అనువుగా మారిన అర్థరహిత ‘దుస్తుల నిబంధ నల’పై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఒక్క మార్కుతో జాతకాలే మారే చోట మాస్ రిగ్గింగ్తో ‘నీట్’ ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతోంది. ‘నీట్–2022’కు దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. జూలై 17న 497 పట్నాల్లో 3,570 కేంద్రాల్లో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిం చింది. త్వరలోనే ఫలితాలు విడుదల చేయాలి. తీరా పరీక్షలో అక్రమాల నేపథ్యంలో మళ్ళీ పరీక్ష పెట్టాలనే వాదన వినిపిస్తోంది. ఇన్నేళ్ళయినా నిక్కచ్చిగా ఒక పరీక్ష పెట్టలేకపోవడం సర్కారీ చేతకానితనమే. కరోనా వల్ల తరగతులే సరిగా జరగలేదంటూ, పరీక్ష వాయిదా కోరుతూ విద్యా ర్థులు వీధికెక్కినా, వారి గోడు విన్నవారు లేరు. ఇప్పుడేమో హిందీ మాధ్యమ అభ్యర్థులకు ఆంగ్ల ప్రశ్నపత్రాల పంపిణీ, ఆడవారి ఆత్మ గౌరవాన్ని హరించే ‘డ్రెస్ కోడ్’ లాంటివి మరింత తల వంపులు తెచ్చాయి. కనీసం అభ్యర్థి రాసే మీడియమ్లోని పేపరైనా ఇవ్వలేకపోతే, మార్కుల నష్టానికి పూచీ ఎవరు? రాష్ట్రాల స్థానిక ప్రవేశపరీక్షలతో పోలిస్తే, ‘నీట్’ లోపరహితమనీ, వైద్యవిద్యలో ప్రవేశాలు పారదర్శకంగా సాగుతాయనీ కేంద్ర వర్గాల మాట. పరీక్షలో ప్రమాణాలు పెంచడం ఓకే కానీ, నిర్వహణలో లోపాలే విద్యార్థులకు శాపాలు. తాజా ‘నీట్’లో మాస్రిగ్గింగ్కు తెర తీసిన 8 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేయడం అందుకు మచ్చుతునక. పరీక్ష రాయాల్సిన అసలు అభ్యర్థుల స్థానంలో వేరొకరెళ్ళి రాస్తున్నారంటే ‘నీట్’లో అక్రమాలకు ఆస్కారమే లేదని ఎలా అంటాం? పైగా, ఢిల్లీ, హరియాణా ల్లోని పలు కేంద్రాల్లో ఇదే తంతు! పరీక్ష మర్నాడు పుంజీడు మంది పట్టుబడ్డా, దొరకని దొంగలు ఎందరున్నారో ఎవరు చెప్పగలరు? రాజస్థాన్లో ఓ చోట నిర్ణీత గడువు ముగిసిన తర్వాతా పరీక్ష కొనసాగుతూనే ఉంది. సాక్షాత్తూ ఓ ఎంపీ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్లయితే... బయో మెట్రిక్ హాజరు తీసుకోకుండానే అందరినీ పరీక్షకు అనుమతించారనీ, అయినవాళ్ళయిన అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా ‘నీట్’ పేపర్లనే మార్చేశారనీ వార్త. ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఏ’ పరీక్షలు నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇంత సంబడంగా సాగుతోందంటే ‘నీట్’ ఏ మాత్రం నీటుగా నడుస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. వాములు తింటున్న స్వాముల్ని వదిలేసి, కనబడని సూదుల కోసం వెతికినట్టు... అక్రమార్కుల కన్నా ఆడవారి లోదుస్తులకుండే లోహపు కొక్కీ ‘నీట్’ పరీక్షకులకు అభ్యంతరకరంగా, ప్రమాద కరంగా కనిపించడం పరాకాష్ఠ. పరీక్ష రాయాల్సిన పిల్లలు ఏడుస్తున్నా కరగక, ‘లోదుస్తులు ముఖ్యమా, భవిష్యత్తు ముఖ్యమా’ అని ప్రశ్నించి, లోదుస్తులు విడిస్తే తప్ప పరీక్ష రాయనివ్వని పరిస్థితి కల్పించారంటే మనం ఏ నాగరక సమాజంలో ఉన్నట్టు? ఆ షాక్లోనే పరీక్ష రాసిన పిల్లల్ని తిరిగి చాటుగా ఆ దుస్తులను ధరించనివ్వక, అదేదో పరీక్షా కేంద్రం బయటకెళ్ళి చేసుకొమ్మనడం ఎంత రాక్షసత్వం? ఈ కర్కశత్వంతో హృదయం గాయపడిన ఆ చిన్నారులకు ఏ మందు రాస్తే గాయం మానుతుంది? జీవితాంతం వేధించే దారుణ అనుభవానికి తోడు అసలేమీ జరగలేదనీ, విద్యార్థిని అబద్ధమాడుతోందనీ ‘ఎన్టీఏ’ బుకాయించడం విడ్డూరం. చివరకు మరో నలుగురు పిల్లలు ముందుకొచ్చి, తమకూ ఎదురైన అదే అనుభవాన్ని వెల్లడించాల్సి వచ్చిందంటే మన ప్రవేశ పరీక్షల్లోని పాశవిక నిబంధనల్ని ఏమనాలి? గతంలోనూ ‘నీట్’లో ఇలాంటివే జరిగాయి. 2017లో కేరళలోనే కన్నూరులోని ఓ పరీక్షా కేంద్రంలో లోదుస్తుల్ని విప్పమని నలుగురు స్కూలు టీచర్లు ‘అతిగా ప్రవర్తించి’, ఆనక సస్పెండ య్యారు. అప్పట్లో సీబీఎస్ఈ నిర్వహించిన ‘నీట్’ ఇప్పుడు ‘ఎన్టీఏ’ చేతికొచ్చింది. పాత ‘అతి’ మాత్రం మారలేదు. చీటీలు పెట్టకుండా, ఆధునిక పరికరాలను వాడకుండా కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించాలనుకోవడం తప్పు కాదు. పొడుగు చేతుల దుస్తులు, బూట్లు వేసుకోకూడదన్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘ఆభరణాలు, లోహపు వస్తువులు ధరించ రాద’న్న నిబంధనను సాకుగా చేసు కొని, లోహపు కొక్కీతో ధరించే లోదుస్తులు విప్పేయాలనడం విపరీతం, వితండవాదం. వచ్చే జేఈఈ లాంటి అనేక ప్రవేశపరీక్షలకూ దాదాపు ఇవే నిబంధనలు గనక ఆడపిల్లల ఆత్మగౌరవ హననం అక్కడా పునరావృతం కాదన్న గ్యారంటీ లేదు. కేరళ విద్యా శాఖ మహిళా మంత్రి ఖండిం చినా, ఇప్పటికీ పెదవి విప్పని కేంద్ర పెద్దలు, బాధ్యులు ఇలాంటి ఘటనలకు తెరపడేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే వివాదాలు, రిగ్గింగ్లతో ‘నీట్’ నవ్వులపాలైంది. రీ–ఎగ్జామ్ అంటూ పెట్టాల్సి వస్తే, అధికారుల వైఫల్యానికి మూల్యం చెల్లించేది – అమాయక విద్యార్థులు, వారి కుటుంబాలే! -
అక్కడ మగవాళ్లు గడ్డం లేకుండా ఆఫీసుకి రాకూడదట!
Taliban have enforced a new dress code: అఫ్గనిస్తాన్లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎప్పడూ ఏదో ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే అఫ్గనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ని అమలు చేసింది. దీని ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం లేకుండా కార్యాలయానికి రాకూడదని తెలిపింది. పాశ్చాత్య సూట్లు ధరించకూడదని, తమ తలలను కప్పుకోవడానికి టోపీ లేదా తలపాగాతో పాటు సంప్రదాయ పొడవాటి టాప్స్ , ప్యాంటులు ధరించాలి అని పేర్కొంది. ఈ కోడ్ను ఉల్లంఘిస్తే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడమే కాకుండా చివరికి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పైగా గతవారం నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా బాలికలు పాఠశాలలకు హాజరుకాకుండా నిషేధించింది. దీంతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయమై తాలిబన్లకు విద్యాహక్కును గౌరవించమని నొక్కి చెప్పింది. ఆఖరికి పురుషులు, కుటుంబ సభ్యులు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడాన్ని నిషేధించింది కూడా. (చదవండి: రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి) -
డ్రెస్కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్కోడ్ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్ను మార్చేసింది. వారి డ్రెస్కోడ్ పట్ల మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్కోడ్ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
పాకిస్తాన్ ఆంక్షలు...నో జీన్స్ అండ్ టైట్స్
ఇస్లామాబాద్: కొన్ని ఇస్లామిక్ దేశాల్లో మహిళా వస్త్రధారణ పై ఆంక్షలు విధించడం సాధారణం. అఫ్గనిస్తాన్లో తాలిబన్లు కూడా కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. తాజాగా పాకిస్తాన్ కూడా అదే తరహలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫెడరల్ డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎఫ్డీఈ) మహిళా ఉపాధ్యాయులను టైట్స్, జీన్స్ ,పురుష ఉపాధ్యాయులను జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదంటూ ఆంక్షలు జారీ చేసింది. అంతేకాదు మహిళలు/పురుష ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎఫ్డీఈ నిర్ణయించింది. పాకిస్తాన్లో అన్ని విద్యాసంస్థలలోని బోధన/బోధనేతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తాము సూచించిన నియమాలను పాటించేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. -
అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
పాట్నా: ‘కళాశాలకు వస్తుంటే తల విరబూసుకుని జట్టు వేసుకోకుండా వస్తే ఇకపై అనుమతి లేదు. హీరోయిన్ మాదిరి తయారై వస్తే కళాశాలలోకి అడుగు పెట్టేదే లేదు’ అని బిహార్ భగల్పూర్లో ఉన్న సుందర్వతి మహిళా మహావిద్యాలయం నిర్ణయం తీసుకుంది. విద్యా ఆవరణలో క్రమశిక్షణ, పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇటీవల విద్యాలయ ప్రిన్సిపల్ పలు నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్తో పాటు అలంకరణ, వేషధారణ పలు విషయాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు) కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడ వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని రావొద్దు. కళాశాల గేటు లోపలకి వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దు. డ్రెస్ కోడ్ విధిగా పాటించాలి. రాయల్ బ్లూ బ్లేజర్ లేదా, చలికోటు ధరించాలి. పైవీ ఏవైనా ఉల్లంఘిస్తే కళాశాలకు అనుమతించరు. ఈ నిబంధనలను విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమణ్ సిన్హా తెలిపారు. ఈ నిబంధనలపై విమర్శలు రావడంపై కొట్టిపారేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఇదో తుగ్లక్ నిర్ణయమని ఎద్దేవాచే సింది. మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యాలయంలో మొత్తం విద్యార్థులు 1,500మంది ఉన్నారు. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో -
Vidhi Collections: ఈ క్లాత్లో అస్సలు గంజి ఉండదు!
న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన చీరలను వారి ముందుంచింది. ‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్వైట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల లాక్డౌన్ విధింపులతో పండగలు, వేడుకలు లేవు. అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్ ది లూమ్ వ్యవస్థాపకుడు రమేష్ మీనన్ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్ కసవు నేతలో పుట్టుకొచ్చింది. సౌకర్యానికే ప్రథమ స్థానం న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్. ‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్ వేర్ని మెయింటెయిన్ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది. కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్ను లాంచ్ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వేర్గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్ పేరొందుతాయి అని చెప్పచ్చు. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ డ్రస్లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ !
సాక్షి, ఒంగోలు: సచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పని దినాల్లో పట్టణ ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బంది రాకపోకలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సచివాలయాల్లో పనిచేసే వారిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. అందుకుగాను వారికి కూడా డ్రస్ కోడ్ అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ఆధారం చేసుకొని మిగిలిన సచివాలయాల్లో కూడా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించింది. ఒక్కో సచివాలయంలో పదిమందికి తగ్గకుండా సిబ్బందిని నియమించారు. జనాభాను ఆధారం చేసుకొని సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 179 వార్డు సచివాలయాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 884 గ్రామ సచివాలయాలున్నాయి. వీటిలో దాదాపు 8535 మంది పనిచేస్తున్నారు. వేలాది మంది పనిచేస్తుండటంతో వారందరినీ యూనిఫామ్గా ఉంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ డ్రస్ కోడ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఒకటి రెండు జిల్లాలను ఎంపికచేసి, అక్కడి ఒకటి రెండు సచివాలయాలకు డ్రస్ కోడ్ అమలు చేస్తోంది. డ్రస్ కోడ్ పట్ల సానుకూల స్పందన లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. (అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపులకు లైన్ క్లియర్) ట్యాగ్ కలర్తో క్యాడర్ గుర్తింపు: సచివాలయాల్లో డ్రస్ కోడ్ను అమలు చేయనున్న నేపథ్యంలో ఏ క్యాడర్కు చెందిన సిబ్బంది ఎవరన్న విషయాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్లను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. వార్డు సచివాలయాల్లో దాదాపు పది విభాగాలకు చెందినవారు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు ధరించేందుకు ట్యాగ్లను వినియోగిస్తారు. ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్, డిజిటల్ అసిస్టెంట్కు రెడ్ ట్యాగ్, హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్, మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్, వీఆర్ఓకు బ్రౌన్ ట్యాగ్, అగ్రికల్చరల్/ హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్కు గ్రే ట్యాగ్ ఇవ్వనున్నారు. వలంటీర్లకు కూడా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విషయంలో వలంటీర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 18187 మంది వలంటీర్లు ఉన్నారు. వీరికి కూడా డ్రస్ కోడ్ అమలుచేసే విషయమై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వలంటీర్లకు ఎలాంటి డ్రస్ కోడ్ అమలు చేయాలనే విషయమై చర్చ నడుస్తోంది. వలంటీర్లు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఆ సమయంలో వలంటీర్లు డ్రస్ కోడ్ పాటించడం ద్వారా ఎవరైనా కొత్తవారు కూడా వారిని వెంటనే గుర్తించి తమ పింఛన్ల విషయమై మాట్లాడే వీలు కలగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పింఛన్లకు అర్హత సాధించినవారు కూడా తమ ప్రాంతంలో వలంటీర్ పింఛన్ల పంపిణీకి తిరుగుతున్న సమయంలో గుర్తించి వాటిని వెంటనే పొందే వెసులుబాటు కూడా కలగనుంది. మొత్తం మీద డ్రస్ కోడ్లతో సచివాలయాలు సరికొత్త శోభను సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...
భువనేశ్వర్: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తోన్నాయి. అత్యవసర సర్వీసులు వారు తప్ప మిగిలిన వారందరూ ఇంటి దగ్గర నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయి. సాధారణంగా అడ్వకేట్లు అంటే నల్లని కోర్టు వేసుకొని కేసులు వాదిస్తూ ఉంటారు. అయితే ఒడిషా హైకోర్టు మాత్రం ఇకపై లాయర్లందరూ తెల్లని వస్త్రాలు ధరించి తమ వాదనలు వినిపించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) వర్చువల్ కోర్టు సిస్టమ్ ద్వారా అడ్వకేట్లందరూ కోర్టు ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లాక్కోర్టుని, గౌన్ను ధరించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. తెల్ల షర్ట్, తెల్లసెల్వార్కమీజ్, తెల్లటి చీరలో కోర్టు ముందు హాజరు కావాలని ఒడిషా హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. దీంతోపాటు బుధవారం నాడు వాదనలు వినే జడ్జీలు పొడుగాటి గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (కోల్కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు) -
డ్రెస్కోడ్ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్కోడ్పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్కోడ్లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు. -
సచివాలయ ఉద్యోగులకు డ్రెస్కోడ్
పట్నా : సచివాలయ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ ధరించి విధులకు హాజరుకారాదని నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు కేవలం సౌకర్యవంతంగా, సింపుల్గా ఉండే లేత రంగు దుస్తులు ధరించాలని కోరింది. కార్యాలయ సంస్కృతికి విరుద్ధమైన దుస్తులతో అధికారులు, ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నట్టు గమనించామని..కార్యాలయ నిబంధనలకు ఇది విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహదేవ్ ప్రసాద్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ సంప్రదాయ వస్త్రధారణతోనే కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులు సౌకర్యవంతంగా, సింపుల్గా ఉండే లేత రంగు దుస్తుల్లో విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..
కేరళ, ఎర్నాకుళం జిల్లాలో వలయాంచిరంగార అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందేళ్లు దాటిన ఆ పాఠశాలలో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్ఉమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు స్కూల్ యూనిఫామ్గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. బాలికలకు ఆడేటప్పుడు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్ను తెచ్చారు. ‘‘ఆటల్లో ఒకటో తరగతి పిల్లలు ఉన్నంత చురుగ్గా పెద్ద తరగతుల పిల్లలు ఉండడం లేదు. ఒకటి– రెండు తరగతుల్లో చురుగ్గా ఉన్న పిల్లలు కూడా నాలుగైదు తరగతులకు వచ్చే సరికి ఆటలాడడానికి బిడియపడుతున్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన పిల్లలకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నది వాళ్ల దుస్తులే. ఆటల్లో పైకెగిరి షటిల్ రాకెట్తో కాక్ను కొట్టాలన్నా, ఒక్క గెంతులో లాంగ్ జంప్ చేయాలన్నా, హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకెగురుతుందేమోననే బిడియంతో ఆటలాడడానికి ముందుకు రావడం లేదు. క్రీడాకారులుగా తయారుకాగలిగిన సత్తా ఉన్న పిల్లలను వస్త్రధారణ కారణంగా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అనిపించింది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నట్లు రెగ్యులర్ స్కూల్ డ్రస్ ఒకటి, స్పోర్ట్స్ పీరియడ్కి మరో రకం డ్రస్ అనే నియమం పెట్టడం మాకు కుదరదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రస్ చేంజ్ రూములు ఏర్పాటు చేయడం కష్టం. ఇంటి నుంచి స్కూలుకి నడిచి వచ్చే పిల్లలకు తమ వెంట మరో జత దుస్తులు తెచ్చుకోవడం కూడా కష్టమే. అందుకే స్కూల్ డ్రెస్ని ఇలా డిజైన్ చేశాం. నిక్కర్ని కూడా ముందు ఉన్నట్లు తొడల వరకే కాకుండా, అందరికీ మోకాళ్ల వరకు ఉండేలా నియమం పెట్టాం’’ అన్నారు ప్రధానోపాధ్యాయురాలు రాజీ మేడమ్. తల్లిదండ్రులకూ సంతోషమే రాజీ మేడమ్ డిజైన్ చేసిన యూనిసెక్స్ యూనిఫామ్ పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. బాలికలు మాత్రం... నిక్కర్ జేబులో చేతులు పెట్టుకుంటూ సంతోషపడుతున్నారు. చాక్లెట్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన రూపాయిని జేబులో దాచుకుంటూ, మధ్యలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. రాజి మేడమ్ పదేళ్లుగా వలయాంచిరంగార ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు, ఆమె చదివింది కూడా అదే స్కూల్లో. ప్రస్తుతం ఆమెతో పని చేస్తున్న అనేక మంది సిబ్బంది ఆమెకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లే. ‘తనకు స్కూల్లో ప్రతి అంగుళం తనకు తెలుసని, గ్రామంలో ప్రతి ఒక్కరితో పరిచయం ఉందని, అందువల్లనే స్కూలు అవసరం ఏమిటో గుర్తించి పరిష్కరించడంలో తనకు అందరి సహకారం ఉంటోందని’ చెప్పారు రాజీ మేడమ్.– మంజీర -
మహిళా ఉద్యోగులకు డ్రెస్ కోడ్పై దుమారం
లక్నో : యూపీలోని ఫతేహబాద్లో ఓ సహకార వైద్యారోగ్య కేంద్రంలో అధికారి ఇచ్చిన తాలిబన్ తరహా ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. మహిళా సిబ్బంది జీన్స్, టీషర్ట్లు కాకుండా సల్వార్ సూట్, చీరలు ధరించి మాత్రమే కార్యాలయానికి రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు వచ్చే సమయంలో మేకప్ వేసుకోరాదని సూచించారు. ఈ ఉత్తర్వులు మహిళా ఉద్యోగులకే కాదని, పురుషులకూ వర్తిసాయని అధికారులు చెప్పుకొచ్చారు. పురుషులు టీ షర్ట్స్, జీన్స్తో కార్యాలయానికి హాజరు కాకూడదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమావేశంలో సహకార వైద్యారోగ్య కేంద్రం ఇన్చార్జ్ డాక్టర్ మనీష్ గుప్తా ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ సెంటర్ ఉద్యోగులందరూ విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన ప్రకటించారు. డ్రెస్ కోడ్ పాటించడంలో విఫలమైన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించడం విశేషం. డ్రెస్ కోడ్ విషయం బయటకు పొక్కడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో ఉద్యోగులు అసలు విషయం చెప్పేందుకు తటపటాయించగా, సదరు అధికారి మాత్రం ఈ ఉత్తర్వులు పొరపాటుగా జారీ అయ్యాయని సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేశారు. డ్రెస్ కోడ్పై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఎవరూ జారీ చేయలేదని చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ముఖేష్ వివరణ ఇచ్చారు. డ్రెస్ కోడ్ ప్రకటించిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
టీ షర్టు.. లెగ్గింగ్లు వద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. చీర మినహా మిగిలిన అన్ని డ్రస్సులను విధిగా దుపట్టాతో ధరించాలని స్పష్టం చేసింది. దుస్తుల రంగులు సైతం సున్నితమైనవిగా ఉండాలని తెలిపింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలి. అలాగే, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. -
అన్నవరంలో కొత్త నిబంధన
అన్నవరం (ప్రత్తిపాడు): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించే భక్తులు ఇకపై విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్బాబు తెలిపారు. స్వామివారి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర సేవలలో పాల్గొనేటప్పుడు, స్వామివారి దర్శనం సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అనుమతిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పురుషులు పంచె, కండువా ధరించాల్సి ఉంటుందన్నారు. షర్టు ధరించవచ్చు, ప్యాంటు మాత్రం ధరించకూడదని తెలిపారు. మహిళలు చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి. ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఈవో వివరించారు. దేవస్థానం సత్రాలలో వసతి గదులు తీసుకునే భక్తులు జూలై ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా గదులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గదులు కావాల్సినవారు తప్పనిసరిగా ఆధార్కార్డ్ చూపించాలన్నారు. ఎవరి పేరుపై రూమ్ రిజర్వ్ అయి ఉంటుందో వారికే రూమ్ ఇస్తారన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకున్న భక్తులు వారు రిజర్వేషన్ చేయించుకున్న సమయం దాటాక రెండు గంటల వరకు మాత్రమే గదులు ఇస్తారని, ఆ సమయం దాటితే మరో భక్తునికి ఆ గది కేటాయిస్తామన్నారు. నగదు వాపస్ కూడా ఇవ్వబోమని తెలిపారు. ప్రాకారం, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు రద్దు ఆలయ రక్షణ చర్యలలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి స్వామివారి ఆలయ ప్రాకారంలో, వ్రత మండపాల ఆవరణలో వివాహాలు చేసుకోవడం నిషేధించామని ఈవో తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఆలయం తలుపులు మూసేశాక ఆ ప్రదేశంలోకి ఎవరినీ అనుమతించరని వివరించారు. -
పాఠశాలకు.. పాత దుస్తులతోనే!
వికారాబాద్ అర్బన్: పాఠశాలల పునఃప్రారంభ గడువు ముంచుకొస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయలేదు. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల్లో పేద, ధనిక భేదాభిప్రాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా యూనిఫాం అందజేస్తున్నారు. అయితే స్కూళ్లు తెరుచుకునే సమయంలో కాకుండా విద్యాసంవత్సరం చివరలో యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటికే బడికి వేసవి సెలవులు వస్తుండటంతో అధికారులు పంపిణీ చేసిన వస్త్రం మూలన పడి ఉంటోంది. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జూన్ 1న విద్యార్థులు పాత దస్తులతోనే పాఠశాలకు రానున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా పాత బట్టలతోనే పాల్గొననున్నారు. ఏటా ఇదే పరిస్థితి... విద్యార్థులకు అందించే యూనిఫాం విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఏటా విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో వస్త్రం పంపిస్తున్నారు. ఇలాగైతే సకాలంలో పిల్లలకు దుస్తులు ఇవ్వలేకపోతున్నామని తెలిసి కూడా వస్త్రం పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. వస్త్రం వచ్చిన తర్వాత విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు మూడు నెలల సమయం తీసుకుంటారు. విద్యాసంవత్సరం ముగుస్తున్న సమయంలో పాఠశాలల వారీగా పిల్లల కొలతలు తీసుకుంటే స్కూళ్లు తెరిచే నాటికి కొత్త దుస్తులు అందించవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాలో 1,043 పాఠశాలలు... జిల్లాలో 1,043 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 88,648 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసి, సెలవులు పూర్తయ్యి.. పాఠశాలలు తెరిచే సరికి అవి పాతబడి చిరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచిన సమయంలో విద్యార్థులు పాత దుస్తులతోనే వస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం నుంచే పాఠ్య పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు కూడా అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఏడాది ఎంత మేర వస్త్రం ఆర్డర్ ఇచ్చారనే అంశంపై ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎంఈఓల నుంచి వివరాలు తీసుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఖర్చు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల కోసం ప్రభుత్వం ఏటా ఒక్కొక్కరికి రూ.200 ఖర్చు చేస్తోంది. వీటిలో ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలుకు రూ.160, కుట్టు కూలికి రూ.40 చెల్లిస్తున్నారు. కూలి చాలా తక్కువగా ఉందని దర్జీలు సైతం దుస్తులు కుట్టడానికి ముందుకు రావడం లేదు. -
స్కూల్ యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరుగనుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతుండగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర బంధువులు, స్నేహితులు వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పి.. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని హితబోధ చేస్తున్నారు. స్కూల్ యూనిఫాంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను లోనికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా సివిల్ డ్రెస్లో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు నిర్ధేశిత సమయం ముగిసిన తర్వాత ఐదు నిమిషాల లోపు 9.35 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లను నిరాకరించే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎలాంటి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
మూడునాళ్ల ముచ్చటే....!
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ సంప్రదాయ దుస్తులలో రావాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించాలనే నిబంధనతో పాటు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధం. ఈ రెండు దుర్గగుడి దేవస్థానంలో అమలు కావడం లేదు. సెల్ఫోన్ల నిషేధం మూడేళ్ల కిందట నుంచి అమలు చేస్తుండగా, జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్ను అమలు చేస్తున్నారు. సెల్ఫోన్ కౌంటర్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్పై కొన్ని ఆరోపణలు రావడంతో దేవస్థానమే స్వయంగా కౌంటర్లు నిర్వహిస్తుంది. ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా దేవస్థాన సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులను చూసి తమ సెల్ఫోన్లను కౌంటర్లలో భద్రపరుస్తున్నారు. వీఐపీలు, రూ.100, రూ.300 టికెటుపై వచ్చిన భక్తుల వద్ద సెల్ఫోన్లు కనిపించడం, దర్శనం తర్వాత వారు ఆలయ ప్రాంగణంలోనూ, రాజ గోపురం వద్ద అమ్మవారి ప్రతిమల వద్ద ఫొటోలు దిగుతూ కనిపించడంతో కౌంటర్లలో సెల్ఫోన్లు పెట్టిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని కౌంటర్లలోని సిబ్బందిని ప్రశ్నిస్తే క్యూలైన్ల వద్ద తనిఖీలు లేవని, కౌంటర్లలో ఫోన్లు పెట్టిన వారివే తాము భద్రపరుస్తామని పేర్కొం టున్నారు. ఆలయ అధికారులలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, ఆలయంలో అమలు చేసే ని యమ నిబంధనలను సాధారణ భక్తులకే అమలుచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. క్యూలైన్లో వచ్చే వారికే డ్రస్ కోడ్ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్ అమలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకే డ్రస్ కోడ్ అమలు చేయడంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఘాట్రోడ్డు, మమా మండపం మెట్లు, లిప్టు ద్వారా వచ్చే భక్తులకు ఖచ్చితంగా డ్రస్కోడ్ అమలు చేస్తున్నారు. డ్రస్కోడ్ కోసం దేవస్థానం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.100 చీరలను విక్రయిస్తుంది. కొంతమంది ప్రముఖులు, వీఐపీలు, ప్రొటోకాల్ ఉన్న వారు డ్రస్ కోడ్ పాటించడకుండా ఆలయానికి చేరుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ వంటి శాఖలతో పాటు మరి కొన్ని శాఖలకు చెందిన అధికారులు అమ్మవారి దర్శనానికి విచ్చేసినప్పుడు వారి సిబ్బంది దగ్గర ఉండి మరీ దర్శనాలు చేయిస్తున్నారు. ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఎటువంటి డ్రస్ కోడ్ అమలు కాదా అంటూ ఆలయ సిబ్బందిపై మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఫిర్యాదులు చేసే వరకు వెళ్లుతున్నారు. తాజాగా గురువారం ఓ భక్తురాలు డ్రస్ కోడ్ పాటించడం లేదని వెనక్కి పంపిన సెక్యూరిటీ సిబ్బంది, కొద్ది నిమిషాలలోనే ప్రొటోకాల్ ఉన్న వారికి ఎటువంటి డ్రస్ కోడ్ పాటించడకుండా అమ్మవారి దర్శనానికి పంపడం ఆ భక్తురాలు గమనించింది. అటు సెక్యూరిటీ సిబ్బందితో పా టు ఘాట్రోడ్డులోని సమాచార కేంద్రం లోని సిబ్బందిౖపై చిందులు తొక్కింది. దేవస్థాన అధికా రులు భక్తులందరిని ఒకేలా చూడాలని, అలా చేతకాని పక్షంలో నిబంధనలు పెట్టడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవస్థానంలో ఓ నిబంధన పెట్టినప్పుడు దానిని సక్రమంగా అమలు చేసేవిధంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. సెల్పోన్లు నిషేధం, డ్రస్ కోడ్ సక్రమంగా జరిగేలా పర్యవేక్షకులు లేకపోవడం గమనార్హం. -
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వెళ్లి దాడులు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులకు యూనిఫాం, దానిపై పోలీసు పేరు, కోడ్ ఉంటాయని గుర్తు చేసింది. యూనిఫాంను పక్కన పెట్టి సివిల్ డ్రెస్సులో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలున్నా కూడా, వాటిని పట్టించుకోకుండా సివిల్ డ్రెస్సులో వెళ్లి ఓ రిసార్ట్లో దాడులు చేయడాన్ని తప్పుపట్టింది. నేరశిక్షాస్మృతి (సీఆర్పీసీ) కంటే పోలీసులు ఉత్తర్వులు గొప్పవి కావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పోలీసులకు హితవు పలికింది. పోలీసులు తమ పరిధిని దాటి వ్యవహరించరాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాడులు చేసిన పోలీసులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదంది. ఈ కేసులో హాజరు కావాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను ఆదేశించింది. తదు పరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమ్మీ చట్టవిరుద్ధం కాద ని హైకోర్టు చెప్పినా పోలీసులు కరీంనగర్లోని తమ రిసార్ట్పై తరచూ దాడులు చేస్తుండటాన్ని ప్రశ్నిస్తూ పుష్పాంజ లి కంట్రీ రిసార్ట్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపి పుష్పాంజలి కంట్రీ రిసార్ట్పై దాడులు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసు లు వైఖరి మార్చుకోకపోవడంపై యాజమాన్యం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ విచారించారు. -
కొత్తగా.. పండగలా..
ఆకాశం నుంచి నక్షత్రాలు తెచ్చి అల్లినట్టుగా...భూమ్మీద ముగ్గులు తెచ్చి అద్దినట్టుగా...తోకాడించే గాలిపటాలనుగగనానికి పంపినట్టుగా...అంతా పండగలా.. కానీ, కొంచెం కొత్తగా!తెలుగింటి విరిబోణి కట్టు లంగా ఓణీ. సంప్రదాయ వేడుక లేదా పండగ అనగానే పట్టు లంగా ఓణీ తలపుకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకే టైప్ డ్రెస్ కోడ్ అనే నేటితరానికి మరికొంచెం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇలాంటి డిజైన్ లెహంగా, దుపట్టాలను ఎంపిక చేయచ్చు. అయితే, కలర్ కాంబినేషన్స్, అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్ కలర్స్ అయినా కట్, కుట్టుతో ఇలాంటి కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ రంగులు అయితే పెద్ద పెద్ద ఆభరణాలు ధరించినా అందంగా కనిపిస్తారు. అదే, స్పెషల్ అనిపించే గ్రే, లైట్ క్రీమ్, సియాన్.. వంటి రంగులకు ఆభరణాల అలంకరణ అంతగా నప్పవు. డిజైన్లో ఉన్న తేడాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర అలంకరణపై దృష్టి పెట్టాలి. ►గ్లాస్ బీడ్స్, ముత్యాలు, జర్దోసీల కలయికతో ఎంబ్రాయిడరీ చేసిన రా సిల్క్ లెహెంగా, జాకెట్టు గ్రాండ్గా కనువిందు చేస్తుంది. దీనికి రెడ్ కలర్ కట్వర్క్ నెటెడ్ దుపట్టా జత చేయడంతో చూపులను కట్టడి చేస్తుంది. ►జర్డోసీ, గ్లాస్ బీడ్స్తో ఎంబ్రాయిడరీ చేసిన పసుపు లెహెంగా పండగ సమయంలో ధరిస్తే చూపు తిప్పుకోనివ్వదు. లెహెంగా అంచు రంగును పోలిన నీలాకాశపు కట్ వర్క్ దుపట్టా మింట్ రా సిల్క్ డిజైనర్ బ్లౌజ్ లెహంగాకి పర్ఫెక్ట్ మ్యాచ్. ►సంప్రదాయ వేడుకలకు చిరునామాగా నిలుస్తాయి ఎరుపు, పసుపు రంగులు. ఎరుపు రంగు రా సిల్క్ మీద సీక్వెన్స్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌ, కట్వర్క్ దుపట్టా లుక్ని అందంగా మార్చింది. బెల్ట్ భాగం ప్రత్యేకతను నిలుపుతోంది. ►ముదురు ఎరుపు లంగా, జాకెట్టు దానికి క్రీమ్ కలర్ దుపట్టా సరైన కాంబినేషన్. అయితే ఇందుకు ఫ్యాబ్రిక్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. బీజ్ టుల్ లెహెంగా మీద ఆలోవర్ సిక్వెన్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌజ్, కట్వర్క్ నెటెడ్ దుపట్టా కళను రెట్టింపు చేస్తుంది. ►లేత గులాబీని తలపించే బీజ్ టుల్ లెహెంగా, దాని మీద ఆలోవర్ సీక్వెన్ వర్క్ అబ్బురుపరుస్తుంటుంది. దీనికి లేత నీలం రంగు కట్వర్క్ దుపట్టా, సీక్వెన్ బ్లౌజ్ ఆకర్షణీయంగా రూపుకట్టింది. ►రా సిల్క్ లెహెంగా, మీద గ్లాస్ బీడ్స్, జరీ వర్క్ చేయడంతో ట్రెండీ లుక్ తీసుకువచ్చింది. లెహెంగా రంగులోనే డిజైనర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ నెటెడ్ కట్వర్క్ దుపట్టా జతచేయడంతో అందానికి అంబరమే హద్దుగా మారింది. ఫాయిల్ప్రింటెడ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన లెహెంగా ఇది. దీనికిజర్దోసీ వర్క్ చేసిన బ్లౌజ్ని జత చేయడంతో యంగ్ లుక్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. ఇదే రంగు సీక్వెన్ కట్ వర్క్ దుపట్టాతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. -
డ్రెస్ కోడ్ వచ్చేసింది..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులే...కాదు పంజాబీ డ్రస్పై చున్నీ లేని యువతులు సైతం తెలుగు వారి సంప్రదాయ పద్ధతికే ఆమోద ముద్ర వేశారు. ఆంగ్ల సంవత్సరాది నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో డ్రస్ కోడ్ను అమలు చేయగా, ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు ఆమోద ముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు దేవస్థానంలో అమలు చేస్తున్న డ్రస్ కోడ్ బాగుందని కితాబు ఇచ్చారు. ఆధునిక డ్రస్లలో వచ్చిన యువతులు, మహిళలు దేవస్థానం విక్రయించిన చీరలను కొనుగోలు చేసి సంప్రదాయ పద్ధతిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. కేవలం చీరలే కాకుండా పంజాబీ డ్రస్పై చున్నీ లేని వారికి కూడా అమ్మవారి దర్శనానికి అనుమతించకపోవడంతో యువతులందరూ కలిసి చీరను కొనుగోలు చేసి చున్నీలుగా ధరించారు. రూ.100లకే అమ్మవారి చీర డ్రస్ కోడ్ అమలు చేస్తున్న దుర్గగుడి అధికారులు భక్తుల కోసం దేవస్థానమే రూ.100లకు చీరను విక్రయించింది. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల వద్ద ఆధునిక డ్రస్లు వేసుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి డ్రస్ కోడ్ గురించి తెలియజేశారు. భక్తులు దేవస్థానం విక్రయిస్తున్న రూ.100 చీరలను కొనుగోలు చేసి వాటిని ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పంజాబీ డ్రస్పై చున్నీ లేకపోవడంతో కొంతమందికి సిబ్బంది అడ్డు చెప్పగా, వారందరూ కలిసి ఒక చీరను కొనుగోలు చేసి, దానిని చున్నీగా కట్ చేసుకుని ధరించడం కనిí ³ంచింది. డ్రస్ కోడ్ బాగుందని కొంతమంది విద్యార్థినులు పేర్కొన్నారు. డ్రస్ కోడ్ పాటించి అమ్మవారిని దర్శించుకున్న కొంత మంది యువతులు, కళాశాల విద్యార్థినులతో దేవస్థాన ఈవో వీ.కోటేశ్వరమ్మ మాట్లాడారు. ముంబయి, మహా రాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల నుంచి విచ్చేసిన భక్తులు చీరలను ధరించి ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కనిపించింది. చీర «గురించి ఎప్పుడూ తెలియని వారు కూడా ధరించారు. మరింత ప్రచారం కల్పించాలి.. సంప్రదాయ వస్త్రాలను ధరించి అమ్మవారిని దర్శించుకోవడం బాగుంది.. డ్రస్ కోడ్పై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం దేవస్థాన పరిసరాలలోనే కాకుండా నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్తో పాటు ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి. కాటం సాయిశిరీష, ఇంజనీరింగ్ విద్యార్థిని ఈవోనే మాకు చీర ఇచ్చారు... కొత్త సంవత్సరం నుంచి డ్రస్ కోడ్ అనే విషయం మాకు తెలియదు. గుడికి వచ్చిన మాకు ఈవో గారు చీరను ఇచ్చారు. చీరతో మా ఫ్రెండ్కు ఓనీ, నాకు చున్నీగా చేసుకున్నాం. అమ్మవారి దర్శనానికి అందరూ సంప్రదాయ దుస్తులలోనే వస్తే బాగుంటుంది. ఆలయాలలో సంప్రదాయాలను పాటించడం మనందరి బాధ్యత. శ్రావ్య, ఇంజినీరింగ్ విద్యార్థిని -
‘టీ షర్టులు, ఫ్యాంట్లు వేసుకుని రావొద్దు’
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంగ్ల సంవత్సరాది వేళ దుర్గమ్మ భక్తులందరూ ఇకపై ఫ్యాషన్ దుస్తులను వదిలి, సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి కొత్త సంప్రదాయానికి ఆలయ అధికారులు తెరలేపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఈవో వీ.కోటేశ్వరమ్మ తెలిపారు. అలా వచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా పంచె, లుంగీ ధరించి రావచ్చు. ఇక మహిళలు, యువతులు పంజాబీ డ్రస్సు, టాప్పై తప్పని సరిగా చున్నీ ధరించి రావాలని సూచించారు. మహిళలు చీరలు, లంగా వోణీలు ధరించి దర్శనానికి రావచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు టీ షర్టులు, ఫ్యాంట్లు ధరించి ఆలయానికి రావద్దని పేర్కొన్నారు. అలాగే పురుషులు, స్త్రీలు షాట్స్, సీవ్లెస్ టీ షర్టులు ధరించి రావద్దని సూచించారు. మరో వైపు అమ్మవారి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రాని పక్షంలో ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం నిర్వహించే ప్రత్యేక కౌంటర్లో రూ.100కు చీర అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శానానికి సంప్రదాయ దుస్తుల్లోనే అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించగా, ఆర్జిత సేవల్లో గత కొన్ని నెలలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో పొట్టి దుస్తులకు నో..
అహ్మదాబాద్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహిళల భద్రతపై రాజీపడబోమని వడోదర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో పొట్టి దుస్తులు వేసుకోరాదని మహిళలు, యువతులను పోలీసులు హెచ్చరించారు. చిన్నారులు, సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపే కార్యకలాపాల్లో పాల్గొనరాదని పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యపానం, మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని వడోదర పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లోత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏటా నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ 31న విపరీతంగా మద్యం,డ్రగ్స్ సేవించడంతో పాటు అసభ్యకర ధోరణులతో సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగుతున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాత్రి పదిగంటల తర్వాత బాణాసంచా కాల్చరాదని స్పష్టం చేశారు. వేడుకల నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, అశ్లీల నృత్యాలు చేయరాదని పేర్కొన్నారు. ఇక న్యూఇయర్ వేడుకల సందర్భంగా వడోదరలో 40 చెక్పోస్టులు నగరంలో 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్టు నోటిఫికేషన్లో పొందుపరిచారు.కాగా పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళలు, పురుషులు వారు ఏం ధరించాలనేదానిపై నియంత్రణలు తగవని ఇది మోరల్ పోలీసింగ్కు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
దుర్గగుడిలో డ్రెస్ కోడ్
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): మహిళలు జీన్స్, షాట్స్, టీ షర్టులు, స్లీవ్లెస్ షర్టులు ధరించి వస్తే అమ్మవారి దర్శనం కానట్లే. పురుషులు సైతం షాట్స్, సగం ప్యాంట్లు ధరించి వస్తే అమ్మవారి దర్శనానికి అనుమతించరు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవస్థానంగా పేరున్న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్ను అమలు చేయడానికి దేవస్థాన ఈవో వీ కోటేశ్వరమ్మ నిర్ణయించారు. ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలుకు దేవస్థాన పాలకమండలి ఆమోదంతోపాటు వైదిక కమిటీతో చర్చలు జరిపారు. జనవరి 1వ తేదీ నుంచి డ్రెస్ కోడ్ అమలుకు రంగం సిద్ధమైంది. లంగాజాకెట్, లంగాఓణీ, పంజాబీ డ్రెస్, చుడీదార్ ధరించిన మహిళలనే అనుమతిస్తారు. అమ్మ శారీస్ పేరిట చీరలను విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.100లకే చీర అందుబాటులోకి తీసుకువస్తున్న దేవస్థానం, చీరలు కట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రెస్ కోడ్ అమలుపై భక్తులకు అవగాహన కల్పించేలా దేవస్థాన ప్రాంగణంలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. -
లిప్స్టిక్, స్లీవ్లెస్ వద్దు!
శివాజీనగర (బెంగళూరు): రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాజాగా ఎంపికైన పుష్ప అమర్నాథ్.. బాధ్యతలు స్వీకరించకముందే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. మహిళా అధ్యక్షురాలిగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఆ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు ఆమె డ్రెస్ కోడ్ పెట్టారు. విధిగా చీరలే ధరించాలని, అవీ నీలిరంగువే అయి ఉండాలని నిర్దేశించారు. అలాగే, లిప్స్టిక్ వేసుకోకూడదని, మేకప్ అవసరం లేదని, స్కర్ట్స్, స్లీవ్లెస్ దుస్తులు ధరించరాదని నిషేధం విధించారు. చక్కగా చీర కట్టుకొని మెడ వరకు బ్లౌజ్ ధరించాలని సూచించారు. కొత్త మేడమ్ ఆదేశాలపై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
మహిళా పోలీసులకు కొత్త డ్రెస్కోడ్
కర్ణాటక, బనశంకరి : మహిళా పోలీసుల డ్రెస్ కోడ్లో పోలీసు శాఖ సంపూర్ణ మార్పులు తెచ్చింది. విధి నిర్వహణలో అనుకూలంగా ఉండేలా ఖాకీ చీరల స్థానంలో ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలనే ఆదేశాలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. మహిళా కానిస్టేబుళ్లు చీరలు ధరించి విధులు నిర్వర్తించడం కష్టతరంగా ఉండటం, నేరాలు జరిగిన సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి, నేరస్థులను వెంబడించడానికి ఇబ్బందిగా ఉండటంతో గతనెల 3న పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ నీలమణి రాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో డ్రెస్కోడ్లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై చీరలకు బదులు ఖాకీ ప్యాంట్, షర్ట్ ధరించాలని, చెవి కమ్మలు, నుదుట బొట్టు, చేతి గాజులు చిన్నసైజులో ఉండాలని, ఒక చేతికి చిన్నసైజులో లోహంతో చేసిన గాజు ధరించవచ్చంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. కేశాలంకరణలో కొన్ని మార్పులు చేశారు. జుట్టును వదులుగా వదిలేయకుండా కొప్పుగా చుట్టి నల్లరంగు నెట్టెడ్ బ్యాండ్తో ముడి వేసుకోవాలని ఆదేశాల్లో సూచించారు. నల్లరంగు హెయిర్డై మినహా జుట్టుకు ఏ ఇతర రంగు వేయరాదు. పూలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. శాఖలోని మహిళా అధికారి నుంచి సిబ్బంది వరకు ఒకే డ్రస్కోడ్ అమలులో ఉంటుంది. -
‘యాదాద్రి’లో డ్రెస్కోడ్ అమలేదీ?
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి) అధికారులు, సిబ్బంది డ్రెస్కోడ్ను పాటించడం లేదు. ప్రతిరోజూ వైట్ దుస్తులు (యూనిఫాం) ధరించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఎవరు సిబ్బంది.. ఎవరు భక్తులు అనే తేడా లేకుండా పోతోంది. దేవస్థానానికి ప్రముఖులు వచ్చినప్పుడు తప్పితే మిగతా సమయాల్లో డ్రెస్కోడ్ అమలు కావడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో వైట్ యూనిఫాం ధరించి విధులకు హాజరవుతుంటే ఇక్కడి అధికారులు, సిబ్బంది అలా ఎందుకు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నా.. యాదాద్రిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి పునరుద్ధరణ పనులను కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నారు. దీంతో యాదాద్రి పేరు జాతీయ, అంతర్జాతీయంగా మారుమోగు తోంది. అన్ని విభాగాల్లో పనుల నాణ్యత బాగుందని ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేట్ సైతం కైవసం చేసుకుంది. ఈ సర్టిఫికెట్ దేశంలో ఏ ఆలయానికి రాకపోవడం గమనార్హం. ఇతంటి ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది యూనిఫాం ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతపెద్ద తిరుమలలోనే చిన్న అధికారుల నుంచి ఏఈఓల వరకు ప్రతిరోజూ యూనిఫాం వేసుకుని విధులు నిర్వహిస్తుంటారు. కానీ మన యాదాద్రిలో మాత్రం ఆలయ ఈఓ గీతారెడ్డి ప్రత్యేకంగా ఆదేశా>లు జారీ చేస్తే తప్ప యూనిఫాం ధరించని దుస్థితి నెలకొంది. అదికూడా ముఖ్యమైన వీఐపీల వస్తేనో, రాజకీయ నాయకులు వస్తేనో ఆదేశాలు ఇస్తున్నారు. కాని విధిగా ప్రతి ఉద్యోగి వైట్ యూనిఫాంతో విధులకు హాజరు కావాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు కూడా కిందిస్థా?ఇ అధికారులను హెచ్చరించాల్సింది పోయి ఉన్నతాధికారులు సైతం యూనిఫాం ధరించడం మర్చిపోయారు. దీంతో డ్రెస్ కోడ్ అమలుకు నోచుకోవడం లేదు. ప్రత్యేక డ్రెస్కు ఖర్చు ఇలా.. ప్రతి సంవత్సరం యాదాద్రి దేవస్థానం అధికారులకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన వైట్ యూనిఫాం దుస్తులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి రెండు జతల యూనిఫాం ఇస్తున్నారు. తెలంగాణాలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి దేవస్థానంలోని వైట్ యూనిఫాంను ప్రతి రోజు ధరించి విధులను నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే యాదాద్రిలో మాత్రం డ్రెస్కోడ్ అమలు కాని దుస్థితి నెలకొంది. వైట్ యూనిఫాం వేసుకోకుండా విధులకు హాజరైన అధికారులెవరూ, సామాన్య భక్తులు ఎవరూ అని తేడా తెలియకుండా పోయింది. దీంతో దైవదర్శనానికి వచ్చిన తమకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే ఎవరిని అడగాలో తెలియకుండా ఉందని భక్తులు అంటున్నారు. ప్రతిరోజూ విధిగా యూనిఫాం వేసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమయానికి రాని అధికారులు ! కొంతమంది అధికారులు ఈఓ రాని రోజుల్లో విధులకు ఉదయం 10 గంటలకు రావాల్సిన అధికారులు 11, 12 గంటలకైనా రాని రోజులు ఉన్నాయి. దీంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే మగ్గుతున్నాయి. ఒక్కో ఫైల్ను రోజుల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నారు. కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లులు నెలల తరబడి రావడం లేదని కొంతమంది కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈఓ గీతారెడ్డి ఏమంటున్నారంటే.. నూతన ప్రధానాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నందున కొన్ని విషయాలపై దృష్టిపెట్టడం లేదు. కాని డ్రెస్ కోడ్ పాటించకపోవడం అనేది నిజమే. దీనిపై కఠిన నిర్ణయం తీసకుం టాను. అవసరమైతే యూనిఫాం వేసుకోవాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తానని పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగులకు డ్రస్ కోడ్
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ తన ఉద్యోగులకు డ్రస్ కోడ్ ప్రకటించింది. ‘ఆపరేషన్ డ్రస్ కోడ్’ ను తన ఉద్యోగులందరికీ అమల్లోకి తెస్తున్నట్టు ఐటీ డిపార్ట్మెంట్ బుధవారం పేర్కొంది. ఐటీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఈ మేరకు ఓ అధికారిక ఆర్డర్ను జారీచేశారు. ఈ ఆర్డర్లో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులదరూ, స్టాఫ్ మెంబర్లూ, ఇతర అధికారులు వర్క్ప్లేస్లో చక్కగా, శుభ్రంగా, ఫార్మల్లో కనిపించాలని పేర్కొన్నారు. అత్యధిక మొత్తంలో ఉన్న ఉద్యోగుల్లో, ముఖ్యంగా డిపార్ట్మెంట్లో పనిచేసే యువకులు ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో వస్తున్నారని, ఇది వారి దగ్గర్నుంచి ఊహించనిదని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ తన ఆర్డర్లో అన్నారు. ఇక నుంచి అధికారులు, స్టాఫ్ మెంబర్లందరూ ఫార్మల్గా, క్లీన్గా, మంచి దుస్తుల్లో ఆఫీసుల్లో కనిపించాలని ఆదేశించారు. ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక వారిని సాధారణ వస్త్రాలు మార్చుకుని, ఫార్మల్గా రావడం కోసం తిరిగి ఇంటికి కూడా పంపనున్నట్టు చెప్పారు. -
కాలేజీకి చీరలోనే రావాలి
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు డ్రెస్ కోడ్ను ప్రకటించింది. కాలేజీలో చదివే అమ్మాయిలు జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ లాంటి దుస్తులు ధరించి కాలేజీకి రావొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. సంప్రదాయ దుస్తులు సల్వార్-కమీజ్, చీరలో మాత్రమే కాలేజీకి హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అన్ని ప్రభుత్వ కాలేజీలకు లేఖలు పంపింది. కళాశాలల ప్రిన్సిపాల్స్.. బాలుర, బాలి కల దుస్తుల రంగు (డ్రెస్ కోడ్ కలర్)ను నిర్ణయించి ఈ నెల 12నాటికి తుది నివేదికను పంపాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. విద్యార్థులు క్యాంపస్లో ఉన్నంత కాలం డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. అయితే బోధనా సిబ్బందికి డ్రెస్ కోడ్పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తిరోగమ చర్య అని, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పి తమ హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ హిస్టరీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రపంచం ఒక అడుగు ముందుకు సాగితే, భారత్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందంటూ అభిప్రాయపడ్డారు. కనోరియా కాలేజీకి చెందిన విద్యార్థిని అంజలీ మాట్లాడుతూ.. ‘మాకు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి తర్వాత మేము జీన్స్, టీ షర్ట్స్ ధరించే చాన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మాకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్ ధరించొద్దు అనడం విచారకరమని’ అన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అబ్బాయిలను కుర్తా పైజామా వేసుకురావాలని ఎందుకు బలవంతం చేయడం లేదు? స్త్రీ, పురుషులు సమానం అనే ప్రభుత్వం స్త్రీలపై మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. డ్రెస్ కోడ్కు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. వీరు డాక్లర్లు, ఇంజనీర్లను కోరుకోవడం లేదు. బాబాలను తయారు చేయాలని చూస్తోంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఆరోపించారు. కాగా డ్రెస్ కోడ్ అమలును ప్రభుత్వం సమర్థించుకుంది. క్యాంపస్లో క్రమశిక్షణ పెంపొందించడం కోసమే డ్రెస్కోడ్ అమలు చేస్తున్నామని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్, నిర్వాహకులు కాలేజీ సంఘాలతో చర్చలు జరిపి, వారు ఏకాభిప్రాయానికి వచ్చాకే డ్రెస్ కోడ్ అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
ఉద్యోగుల వస్త్రధారణపై గైడ్లైన్స్
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఉద్యోగులకు కొత్తగా డ్రస్ కోడ్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు ధరించే దుస్తులపై గైడ్లైన్స్ జారీచేస్తూ 2018 జనవరి 6న ఓ సర్క్యూలర్ పంపింది. వర్క్ ప్లేస్లో అందరూ అంగీకరించే, ఆమోదించే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి వస్త్రధారణ ఉండాలని తెలిపింది. ఈ మోడల్ డ్రస్ కోడ్కు ఉద్యోగులందరూ కట్టుబడి ఉండాలని తెలిపింది. మగవాళ్లు స్మార్ట్ పార్మల్స్ లో, ఆడవాళ్లు పార్మల్ ఇండియన్ లేదా వెస్ట్రన్ డ్రస్ల్లో రావాలని సూచించింది. మొత్తం బ్యాంకు శాఖలు 24వేలు ఉండగా.. వాటిలో 2.69 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాప్కు, ఇతర అడ్మినిస్ట్రేటివ్, బ్రాంచ్ లెవల్ స్టాఫ్కు ప్రత్యేక డ్రస్ కోడ్లను ప్రకటించింది. వ్యక్తిగత పరిశుభ్రతను ఉద్యోగులు కలిగి ఉండాలని, అశుభ్రమైన లుక్ను విడిచిపెట్టాలని బ్యాంకు తన ఉద్యోగులను ఆదేశించింది. ఎవరూ టీ షర్ట్, జీన్స్, స్పోర్ట్ షూస్, షార్ట్స్, త్రీ పోర్త్ ధరించి ఆఫీసుకి రావొద్దని సూచించింది. సాలిడ్ కలర్ షర్ట్పై ప్రింటింగ్ ఉన్న టై, చెక్ షర్ట్పై సాధారణమైన టై ధరించాలని తెలిపింది. అందరూ షూస్ వేసుకునే ఆఫీసుకు రావాలని, చెప్పులు వేసుకుని ఆఫీసుకు రాకూడదని తెలిపింది. -
ఉత్తమమైతే తెలుపు.. వెనుకంజలో ఉంటే ఎరుపు
మలప్పురం: కేరళలోని మలప్పురంలో ఓ పాఠశాల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రెండు వేర్వేరు డ్రెస్ కోడ్లు అమలు చేసేందుకు సిద్ధమైంది. తెలివైన విద్యార్థులు, తెలివి తక్కువ విద్యార్థులు అని విభజించి వారికి యూనిఫాం నిబంధనను విధించటంపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పండిక్కడ్ ప్రాంతంలోని అల్ ఫరూఖ్ ఇంగ్లిష్ స్కూల్లో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమలు చేయాలని పాఠశాల నిర్ణయించింది. తెలివైన విద్యార్థులకు తెలుపు యూనిఫాం, చదువులో వెనుకంజలో ఉన్న వారు ఎరుపు గళ్ల చొక్కాను యూనిఫాంగా ధరించాలని ఆదేశించింది. చదువులో వెనకంజలో ఉన్న విద్యార్థుల్లో కసి పెంచటం, పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే, పిల్లలపై ఇలాంటి వివక్షత చూపటం సరికాదని చైల్డ్ లైన్ సమన్వయకర్త అన్వర్ కరకాదన్ అన్నారు. ఈ అంశంపై పూర్తి నివేదికను విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు. -
భద్రాద్రిలో భక్తులకు డ్రెస్ కోడ్
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర దేవస్ధానం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. భద్రాద్రి రాముని దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు శ్రీ సీతారామచంద్రుల అంతరాలయ దర్శనానికి ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. మగవారు పంచె, కండువా, స్త్రీలు చీర లేదా పంజాబి డ్రెస్ ధరించి వస్తేనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ప్రత్యేక పూజలు, నిత్య కల్యాణానికి కూడా ఇదే సాంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. ఈ నిబంధన జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు ఖరారు చేస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
ఆ విద్యార్థినికి క్షమాపణ చెప్పండి
► ‘నీట్’కేంద్రంలో లోదుస్తులు తీయించిన ఘటనపై సీబీఎస్ఈ ► నలుగురు మహిళా టీచర్ల సస్పెన్షన్ ► కేంద్రం దృష్టికి తీసుకెళతాం: కేరళ సీఎం న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఇటీవల జరిగిన జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశపరీక్ష ‘నీట్’లో డ్రెస్ కోడ్పై కఠిన నిబంధనలు పెట్టి, కేరళలో విద్యార్థిని లోదుస్తులు సైతం తొలగించిన ఘటనపై సీబీఎస్ఈ చర్యలు చేపట్టింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో విద్యార్థినికి క్షమాపణలు చెప్పాల్సిందిగా సదరు పరీక్షా కేంద్రం ప్రిన్సిపాల్ను ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమంది. దీంతో పాటు కేరళలోని నలుగురు మహిళా టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇది అత్యుత్సాహంతో జరిగిన ఘటనగా పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్మన్ ఆర్కే చతుర్వేది మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్తో భేటీ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకుంది. అలాగే మరో విద్యార్థి షర్ట్ పొడుగు చేతులు కత్తిరించమన్నందుకు ఎర్నాకులంలోని ఓ పరీక్ష కేంద్రం అధికారులపైనా వేటు వేసింది. అయితే అత్యున్నత స్థాయి పరీక్ష అయినందున కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సి వచ్చిందంటూ సీబీఎస్ఈ ప్రతినిధి రమాశర్మ సమర్థించుకున్నారు. ఈ నెల 7న నీట్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల డ్రెస్కోడ్ అమలుకు సంబంధించి దిగ్భ్రాంతికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. విచారణకు ఆదేశించాం: సీఎం మరోవైపు, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది మానవత్వాన్ని అవమానపరచడమేనన్నారు. విద్యార్థుల దుస్తులు తొలగించడం, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేయడం క్రూరమైన, అమానవీయ, అవమానకర చర్యలని ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నిత్తాల వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని, పోలీసు విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. దీనిపై పది రోజుల లోగా నివేదిక ఇవ్వాలని కేరళ బాలల హక్కుల కమిషన్ సీబీఎస్ఈని కోరింది. -
డ్రెస్ కోడ్ పేరుతో మహిళలపై వివక్షత
లండన్: నికోలా థోర్ప్ అనే యువతి లండన్లోని ఓ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసేది. ఆఫీసుకు ఓ రోజు హై హీల్స్ వేసుకుపోనందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక అప్పటి నుంచి ఆమె.. ఉద్యోగాల్లో డ్రెస్ కోడ్ పేరుతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించడంపై పోరాడుతోంది. థోర్ప్ పోరాటానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. సుమారు 1,50,000 మంది వర్క్ ప్లేస్లో మహిళలకు డ్రెస్ కోడ్కు వ్యతిరేకంగా పార్లమెంట్ వెబ్సైట్లో థోర్ప్ దాఖలు చేసిన ఆన్లైన్ పటిషన్ పై సంతకాలు చేశారు. దీంతో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఈ అంశంపై వెస్ట్మినిస్టర్ హాల్లో డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై కొనసాగుతున్న ఈ డ్రెస్కోడ్ వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు. డిబేట్లో భాగంగా లేబర్ పార్టీ ఎంపీ గిల్ ఫర్నిస్ తనకూతురు ఎమిలి(27) ఏవిధంగా వివక్షకు గురయ్యారో వివరించారు. డ్రెస్ కోడ్లో భాగంగా హై హీల్స్ వేసుకున్న ఎమిలి కాలికి గాయం అయిందని ఆమె వెల్లడించారు. గాయం కారణంగా తీసుకున్న సెలవులకు ఆమె పనిచేస్తున్న సంస్థ చెల్లింపులకు నిరాకరించిందని తెలిపారు. పొట్టి దుస్తులు, హై హీల్స్తో పాటు కొన్ని ఉద్యోగాల్లో ఎలాంటి లిప్స్టిక్ వాడాలో కూడా చెబుతున్నారని గిల్ వెల్లడించారు. కొన్ని చోట్ల పనిచేసే మహిళలు 8 గంటలు హై హీల్స్లో నిలబడాల్సి వస్తుందని, ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని గిల్ వాపోయారు. మరో ఎంపీ, పిటిషన్స్ కమిటీ చైర్మన్ హెలెన్ జోన్స్ ఈ తరహా వివక్షకు సంబంధించిన విషయాలు తమను షాక్కు గురిచేశాయని తెలిపారు. మహిళా ఉద్యోగులను డ్రెస్ కోడ్ పేరుతో వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. -
ఐదు నెలలు.. అడ్రెస్ లేదు..!
పాత దుస్తులతోనే పాఠశాలకు.. • సగం విద్యాసంవత్సరం గడిచినా దుస్తులు కరువు • వస్త్రం కొనుగోలు ధర నిర్ణరుుంచని ప్రభుత్వం • పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల మధ్య అసమానతలు తొలగిస్తూ.. అంతా సమానమనే భావన కల్పించేందుకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో 1,591 పాఠశాలలు ఉన్నారుు. వాటిలో 2,13,093 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 49,336, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28,983, ఉన్నత పాఠశాలల్లో 1,34,774 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుల మతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఒకే రకం దుస్తులు ఉండా లన్న నిబంధన ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వమే దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట కుట్టించిన దుస్తులను పంపిణీ చేసేవారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తులు చిన్నవి, పెద్దవి కావడంతో ప్రభుత్వం ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేసి.. ఎస్ఎంసీ ద్వారా కుట్టించి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసేవారు. జతకు రూ.40 చొప్పున కుట్టుకూలీ ఇచ్చేవారు లేకపోవడంతో ఈ బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారు. ఒక వేళ వస్త్రం కొనుగోలు చేసినా పాఠశాలలకు చేర్చి.. విద్యార్థులకు పంపిణీ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం ముగిసిపోరుుంది. అందరికీ ఒకే కొలత... విద్యార్థులకు దుస్తులు అందజేయటం వరకు బాగానే ఉన్నా.. అందరికీ ఒకే విధంగా కుట్టించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఒక్క జత వస్త్రానికి రూ.160, కుట్టేందుకు రూ.40 వెచ్చించారు. దర్జీ అందరికీ ఒకే కొలత ప్రకారం కుట్టి పాఠశాలలకు పంపిణీ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు పొడవుగా ఉండటం, మరి కొందరు లావుగా ఉండటంతో ఆ దుస్తులు వేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈసారి అనుమానమే... ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా దుస్తుల పంపిణీ జాడేలేదు. ఇప్పటివరకు వస్త్రం కొనుగోలు చేయకపోవడంతో దుస్తులను పంపిణీ చేస్తారనే నమ్మకం కూడా లేదు. వేసవి సెలవుల్లోనే వస్త్రం ఎంపిక చేయడం.. కుట్టడం ప్రక్రియ చేపడితే పాఠశాలలు తెరిచేలోగా పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వస్త్రానికి సంబంధించిన ధరను ప్రభుత్వ ఖరారు చేయకపోవడంతో కొనుగోలు చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు దుస్తులు అందిస్తాం.. ఇది పాత మాట.. ప్రస్తుతం ఐదు నెలలుగడుస్తోంది.. సగం విద్యా సంవత్సరం గడిచిపోరుుంది.. దుస్తుల పంపిణీ ఏమోగానీ.. అవసరమైన వస్త్రం ఎంపిక కనీసం చేపట్టలేదు.. పాతవి.. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.. పాఠశాలల తనిఖీలకు వచ్చిన రాష్ట్రస్థారుు అధికారులు ఉపాధ్యాయుల పనితీరు, సమస్యలను పరిశీలించారే తప్ప విద్యార్థుల దుస్తుల గురించి పట్టించుకోనట్లు తెలుస్తోంది. - వైరా -
ఆ కాలేజీలో జీన్స్, లెగ్గిన్స్ నిషేధం!
కేరళ : తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాలికల డ్రస్ కోడ్పై ప్రత్యేక ఆదేశాలు జారీఅయ్యాయి. జీన్స్, లెగ్గిన్స్, ఇతర శబ్దాలు చేసే ఆభరణాలు ధరించి విద్యార్థులు కాలేజీకి రావడానికి వీల్లేదని, డ్రస్ కోడ్లో భాగంగా వాటిని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గురువారం ఈ సర్క్యూలర్ను జారీచేశారు. రెగ్యులర్ అటెండెన్స్, ఫైనల్ ఇంటర్నెల్ మార్కులపై నిబంధనలు జారీచేసిన ఆయన, డ్రస్ కోడ్పై కూడా ఆదేశాలు విద్యార్థులకు పంపారు. ఈ సర్క్యూలర్ల్లో అబ్బాయిలు, అమ్మాయిలు కాలేజీలో చేసివి, చేయకూడని విషయాలను పేర్కొన్నారు. కాలేజీకి వచ్చే ముందు కచ్చితంగా ఫార్మల్ డ్రస్ వేసుకుని రావాలని వైస్ ప్రిన్సిపాల్ ఆదేశించారు. అబ్బాయిలు చక్కగా, శుభ్రమైన దుస్తులు ధరించాలని, ఫార్మల్ డ్రస్, షూతో కనిపించాలని వైస్ ప్రిన్సిపాల్ ఈ సర్క్యూలర్లో తెలిపారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చుడీదార్ లేదా చీరలోనే కాలేజీకి రావాలని చెప్పారు. జడలను కూడా వదులుగా కాకుండా, గట్టిగా కట్టుకుని రావాలని పేర్కొన్నారు. అయితే కేరళలో మొదటిసారేమీ డ్రస్ కోడ్పై ఇలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఈ ఏడాది మొదట్లో కోజికోడ్లోని ఓ కాలేజీ కూడా అమ్మాయిలు కాలేజీకి జీన్స్ వేసుకోని రాకూడదని ఆదేశించింది. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలపై డ్రస్ కోడ్లపై వస్తున్న ఆదేశాలపై అమ్మాయిలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. చీరలను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టతరమని, ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ సమయాల్లో ముఖ్యంగా దుప్పటాతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. -
'ఆలస్యమైతే హాస్టల్ లోకి రానివ్వడం లేదు'
భోపాల్: దుస్తుల ధారణ, హాస్టల్ సమయంపై ఆంక్షలు విధించడాన్ని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ) విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాత్రి 9.30 గంటల్లోపు హాస్టల్ కు చేరుకోకపోతే లోపలికి అనుమతించబోమన్న అధికారులు నిర్ణయాన్ని విద్యార్థినులు తప్పుబట్టారు. క్యాంపస్ లో షార్ట్స్, స్కర్టులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకున్నారు. 'ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. అటు నుంచి అటే కోచింగ్ కు వెళుతున్నాం. ఒక్కోసారి కోచింగ్ క్లాసుల్లో ఆలస్యమవుతోంది. రాత్రి 9.30 గంటల తర్వాత వస్తే హాస్టల్ లోకి అనుమతించడం లేదు. అలసిపోయిన వచ్చిన మేము లాబీలో పడుకోవాల్సి వస్తోంది. అబ్బాయిలకు ఇటువంటి నిబంధన పెట్టలేద'ని హర్ష అనే విద్యార్థిని వాపోయింది. విద్యార్థినుల దుస్తులపై ఆంక్షలు విధించడాన్ని అతిపిన్న వయసులో సర్పంచ్ గా ఎన్నికైన భక్తి శర్మ తప్పుబట్టారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని, దుస్తుల ధారణ విషయంలో నియంత్రణలు సరికాదన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులతో అధికారులు చర్చించాలని సూచించారు. -
పొట్టి దుస్తులు వేసుకుంటే పెళ్లి ఆపేస్తారు!
బీజింగ్: వివాహాలపై ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చైనా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రజల్లో వివాహంపై సదాభిప్రాయం ఏర్పడేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ఇష్టరీతిలో వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి డ్రెస్ కోడ్ పాటించాలంటూ కొత్తగా నియమాలు పెట్టారు. వివాహం చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే దంపతులు సాంప్రదాయ దుస్తువులలోనే కనిపించాలని, లేనిపక్షంలో మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చేది లేదని తెలిపారు. బ్యూరో ఆఫ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ హాన్ మాంగ్జి ఈ వివరాలను వెల్లడించారు. షార్ట్, ఇతర పొట్టి దుస్తువుల్లో వధూవరులు కనిపిస్తే వారి వివాహాన్ని నిలిపివేయడంతో పాటు మ్యారేజ్ లైసెన్స్ పోస్ట్ పోన్ చేస్తామని హెచ్చరించారు. షార్ట్స్ ధరించి స్లిప్పర్స్ తో కనిపించడం కూడా తమ సాంప్రదాయంపై వధూవరులలో ఉన్న ఆసక్తిని తెలుపుతుందన్నారు. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని డైరెక్టర్ వెల్లడించారు. 2015లో 36 లక్షల జంటలు విడాకులు తీసుకోగా, అందులో కేవలం బీజింగ్ నగరంలో 55 వేల విడాకులు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే కొందరు విడాకుల వ్యవహారంపై మండిపడ్డారు. పెళ్లంటే వారికి పిల్లలు ఆడుకునే ఆటలాగ కనిపిస్తుందా అంటూ స్థానిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. యువతలోనే ఎక్కువగా విడాకులు తీసుకునే ఆలోచన ధోరణి ఉందని, కనీసం పెళ్లిరోజు కూడా సాంప్రదాయాలను పాటించక పోవడం దురదృష్టకరమని హాన్ మాంగ్జి అన్నారు. -
ఉపాధ్యాయులు ఇక పంచెల్లోనే రావాలి
► ప్రభుత్వ టీచర్లకు డ్రెస్ కోడ్ ► వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు ► పాఠశాల వేళల్లో సెల్ఫోన్ వాడకం నిషేధం ► విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ► ప్రభుత్వ నిర్ణయంపై టీచర్ల సంఘాల పెదవి విరపు వైఎస్సార్ జిల్లా: పూర్వం ఉపాధ్యాయుడు అనగానే పంచెకట్టు, మెడలో తువ్వాలుతో హుందాగా కనిపించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల్లో ఆధునికత సంతరించుకుంది. సమాజంలో గురువు స్ధానం ఎప్పటికీ గౌరవనీయమైపదే. అందువల్ల రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా అన్ని విధాలా ఆదర్శంగా ఉండాలన్నది అత్యధికుల భావన. సరిగ్గా అదే ఉద్దేశంతో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు వస్త్రధారణ సూచిస్తూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. తాజా మార్గదర్శకాల్లో ఉపాధ్యాయులు ఎలాంటి వస్త్రధారణ పాటించాలనేది స్పష్టంగా సూచించనప్పటికీ, ధరించకూడనవి మాత్రం స్పష్టంగా తెలిపారు. పాఠశాల పని వేళల్లో ఇవి ధరించకూడదు ► జీన్స్ ఫ్యాంట్ ► చిత్ర విచిత్ర రంగులున్న చొక్కా ► రెండు, నాలుగు జేబులున్న చొక్కా ► బూట్లు (షూ) ► టీ షర్ట్, ► రౌండ్ నెక్ టీషర్ట్ ► నాలుగు, ఆరు, ఎనిమిది జేబులు ఉన్న ప్యాంటు పని వేళల్లో సెల్ ఫోన్లు నిషేధం ఉపాధ్యాయులకు వస్త్రధారణ నిబంధనతోపాటు పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు వినియోగించకూడదు. సెల్ ఫోన్కు కాల్ వస్తే ఏకాగ్రత దెబ్బతిని ఆ ప్రభావం పాఠ్యాంశాలపై ఉంటుంది. ఎక్కువ మంది ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ఫోన్లు రావడం.. బయటకు వెళ్లి మాట్లాడటం పలు పాఠశాలల్లో నిత్యం చోటుచేసుకుంటోంది. మరికొంత మంది ఉపాధ్యాయులు తరగతి గదిలోనే సెల్ఫోన్ వినియోగించడం, వాట్సాప్ చూసుకోవటంలో నిమగ్నమవుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్) పాఠశాలల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నారు. ఇదిలా ఉండగా హెడ్మాస్టర్ మొదలు ప్యూన్ వరకు అందరి వద్దా ప్రస్తుతం అధునాతన అండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఉన్నాయి. తరచూ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల పని వేళల్లో సెల్ ఫోన్ వాడకంపై నిషేధాన్ని ఎంత వరకు సక్రమంగా అమలు చేయగలరనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఉపాధ్యాయులకు ప్రభుత్వంజు డ్రెస్ కోడ్ అమలు చేయనుండటంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భోదనా సామర్థ్యాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించేంకు ృషి చేయాల్సిన ప్రభుత్వం దాని గురించి మరిచిపోయి అనవసరంగా డ్రెస్ కోడ్ అంటే ఉపాధ్యాయులను మానసికంగా అందోళనకు గురుచేయడమే అంటున్నారు. -
మా ఆవిడ వల్లే ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకుంది!
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇటీవల డ్రెస్ కోడ్ మార్చుకోవడం తన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఘనతేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ తాజాగా తన డ్రెస్ కోడ్ ను మార్చిన సంగతి తెలిసిందే. మామూలుగా ధరించే ఖాకీ నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టింది. దీని గురించి లాలూ స్పందిస్తూ 'ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకునేలా రబ్రీదేవి చేయగలిగారు' అని ట్వీట్ చేశారు. వారిని ప్యాంట్ల నుంచి మళ్లీ నెక్కర్లలోకి మారుస్తామంటూ ఆరెస్సెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దాదాపు రెండు నెలల కిందట ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ను తన భార్య తప్పుబట్టిందని, దీంతో ఇబ్బందిగా ఫీలైన ఆరెస్సెస్ నాయకత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిందని లాలూ తెలిపారు. 'నిక్కర్లు వేసుకొని బహిరంగంగా తిరగడానికి ఆరెస్సెస్ వృద్ధ నేతలు సిగ్గుపడటం లేదా?' అంటూ గత జనవరిలో రబ్రిదేవీ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను బిహార్ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రబ్రిదేవి 19వ శతాబ్దంనాటి పాతకాలపు మహిళలా మాట్లాడుతున్నారని సుశీల్మోదీ విమర్శించారు. కాగా, గత ఆదివారం నుంచి డ్రెస్కోడ్ మారుస్తున్నట్టు ఆరెస్సెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాలెంటైన్ కపుల్
ఫన్కార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన టైటానిక్ వాలెంటైన్ కపుల్ పార్టీ ఆకట్టుకుంది. సుశీలా బకాడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పైరేట్ బ్రూ వేదికయింది. డ్రెస్కోడ్ అదిరింది. పలు జంటలు పాల్గొని సందడి చేశాయి. - సాక్షి, సిటీబ్యూరో -
ఇక పొట్టి దుస్తుల నుంచి విముక్తి
లండన్: ఎట్టకేలకు బ్రిటన్ విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బంది పైచేయి సాధించింది. బ్రిటన్ ఎయిర్ వేస్ విమానాల్లో పనిచేసే సిబ్బందికి పొట్టి దుస్తులు ధరించడం నుంచి విముక్తి లభించింది. మహిళా, పురుష సిబ్బంది ఇకపై తమ కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరించేందుకు అనుమతి లభించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ ఎయిర్ వేస్ సంస్థకు సిబ్బందికి మధ్య జరుగుతున్న ఘర్షణలాంటి చర్చకు చివరకు తెరపడింది. సాధారణంగా బ్రిటన్ ఎయిర్ వేస్ లో విమాన కేబిన్ సిబ్బంది స్కర్ట్స్ ధరించడం డ్రెస్ కోడ్ గా ఉంది. అయితే, అది తమ మత సాంప్రదాయాలను గౌరవించేలా, కొన్ని వైద్య సంబంధమైన కారణాల దృష్ట్యా తమకు కాళ్లనిండా దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలంటూ విమానంలో పనిచేసే సిబ్బంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, అంతకుముందు వారు కావాలనుకుంటే అలా దుస్తులు ధరించే అవకాశం ఉండేది. కానీ, 2010లో కొత్త నిబంధనలు వచ్చి సిబ్బందికి అలా వస్త్రాలంకరణ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా, ఇటీవల వారిడిమాండ్ ను పరిగణించిన విమాన సంస్థ అందుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ'సాధారణంగా మా విమానాల్లో పనిచేసే సిబ్బంది అంబాసిడర్ బ్రిటిష్ ఎయిర్ వేస్ యూనిఫాం ధరిస్తారు. పైజామాలకు అనుమతి ఉండదు. అయితే, ఇక నుంచి వారికి ఆ సౌకర్యం ఉంటుంది' అని చెప్పారు. -
ఇక ఆ ఆలయాల్లోకి వెళ్లాలంటే ధోతి, శారీలతోనే..
మదురై: తమిళనాడులో పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటున్నారా..? అయితే, అంతకంటే ముందే మీరు ఓ పంచె, చొక్కా, పైజామాతో సిద్దమవ్వండి. ఎందుకంటే ఇక అక్కడి ముఖ్యమైన కొన్ని ఆలయాల్లోకి భక్తులు ప్రవేశించాలంటే పురుషులకైతే ఈ వస్త్రాలు తప్పనిసరి. మహిళలకైతే చీరలు, చుడిదార్లు, హాఫ్ శారీతో పావడాయ్ ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఆలయాల్లో ప్రత్యేక నోటీసులు అంటించారు కూడా. కొన్ని గుర్తించిన ఆలయాల్లోకి ప్రవేశించాలంటే ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనంటూ ఈ నెల ప్రారంభంలో మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఇకపై ఆలయాల్లోకి లుంగీ, బెర్ముడాస్, జీన్స్, టైట్ లెగ్గిన్స్ అనుమతించరు. రామేశ్వరం, మీనాక్షివంటి ఆలయాల్లో ఈ నోటీసులు పెట్టారు. -
మారుతున్న ఖాకీ నెక్కరు...
రాంచి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనగానే మనకు ఖాకీ నెక్కరు, తెల్లని షర్టు, నెత్తిన నల్ల టోపి, నడుముకు తోలు బెల్టు గుర్తుకొస్తాయి. తరాలు మారుతున్నా డ్రెస్ కోడ్ మారక పోవడం పట్ల ఆరెస్సెస్ నేతలే ఎప్పటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి తరంతోపాటు డ్రెస్ కోడ్ మారకపోవడం వల్లనే నేటి యువత ఆరెస్సెస్లో చేరేందుకు ఉత్సాహం చూపించడం లేదని వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్లోని రాంచిలో గతవారం జరిగిన చర్చల్లో డ్రెస్ కోడ్ గురించి నేతలు ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్, సర్కార్యవాహ్ భయ్యాజీ జోషి లాంటి వారు డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని అభిప్రాయపడగా, మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ నేతలు మాత్రం విభేదించారు. డ్రెస్కోడ్ మార్చాల్సిందేనని వాదించిన వారిలో కూడా ఎలాంటి దుస్తులు ఉండాలి, అవి ఏ రంగుల్లో ఉండాలి, ఎలాంటి బూట్లు ధరించాలనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్యాంట్తోపాటు పలురంగుల చారలుగల తెల్లిటి షీ షర్టులు ధరించాలని కొంత మంది, ఖాకీ లేదా బ్లూ కలర్ ప్యాంటులతోపాటు స్లీవ్లెస్ తెల్లటి టీ షర్టులు ధరించాలని మరికొందరు, తెల్లటి బూట్లు, ఖాకీ సాక్సు ధరించాలని ఇంకొందరు సూచించారు. నెత్తిన నల్లటోపీని కొనసాగించడం, ప్యాంట్లు, ఖాకీ సాక్స్ ధరించే విషయంలో మాత్రం అందరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా డ్రెస్ కోడ్ ఎటూ తేలకపోవడంతో వచ్చే ఏడాది మార్చి నెలలో పుణెలో జరుగనున్న అఖిల భారత ఆరెస్సెస్ మహాసభలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. 1925లో ఆరెస్సెస్ పుట్టినప్పుడు పూర్తిగా ఖాకీ నెక్కరు, ఖాకీ చొక్కానే ఉండేది. 1939 వరకు అదే డ్రెస్ కోడ్ కొనసాతూ వచ్చింది. నాజీలు, ఇటలీ నియంత ముస్సోలిని సైన్యం ప్రభావంతో తెల్లటి చొక్కాలు వచ్చాయి. 1973లో తోలు బూట్ల స్థానంలో లాంగ్ బూట్లు వచ్చి చేరాయి. ఆ తర్వాత రెగ్జిన్ బూట్లు వచ్చి చేరాయి. 2010లో క్యాన్వాస్ బెల్టు స్థానంలో తోలు బెల్టు వచ్చింది. ఆ తర్వాత నాజీల డ్రెస్కోడ్తోపాటు నాజీల్లా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ లాంటి పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతుండడంతో అప్పటి నుంచి డ్రెస్ కోడ్ మార్చడంపై అడపాదడపా చర్చలు సాగుతూనే ఉన్నాయి. -
జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు
పుణె: ఆధునికతకు అనుగుణంగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించడమే ఆమె చేసిన నేరమైంది. సంప్రదాయ విరుద్ధంగా దుస్తులు వేసుకుందని ఆమెను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. పుణెలోని గుల్తెకేడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరిస్తున్న విషయమై భార్య పూజ(21)తో రంజీత్ నిషాద్ (24) గొడవ పడేవాడు. ఒక రోజు ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంజీత్ పూజపై దాడి చేసి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. గత శుక్రవారం ఇంటిలోని మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
'పొట్టి దుస్తులు వేసుకున్నదని నో ఎంట్రీ'
న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సరైన దుస్తులు వేసుకోలేదంటూ ఆమెను సిబ్బంది విమానాన్ని ఎక్కనివ్వలేదు. ఫ్రాక్ ధరించిన ఆమె ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్హోస్టెస్ మాత్రం అదే తరహా ఫ్రాక్లు ధరిస్తారు' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విషయమై పురబి దాస్ ఇండిగో కస్టమర్ కేర్ను సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొని విమానంలో ప్రయాణించడం అనుమతించరని వారు పేర్కొన్నారు. -
పుష్కరాల్లో విద్యుత్ సిబ్బందికి డ్రెస్ కోడ్
విశాఖపట్నం : గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక విధులు నిర్వర్తించే ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) సిబ్బంది ఒకే రకమైన దుస్తులు ధరించనున్నారు. పుష్కరాల్లో ఒక్కో ప్రభుత్వ విభాగానికి ఒక్కో డ్రెస్ కోడ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఇటీవల సూచించడంతో ఏ దుస్తులు ఉండాలనేదానిపై ఉద్యోగుల నుంచి సీఎండీ అభిప్రాయాలు సేకరించి చివరికి నీలం, నలుపు రంగు దుస్తులను ఎంపిక చేశారు. పురుషులు నేవీ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మహిళలు నేవీ బ్లూ చీర, జాకెట్ ధరించాలని సీఎండీ ఆర్.ముత్యాలరాజు మంగళవారం ఆదేశించారు. ఈ రకమైన రెండు జతల దుస్తులను ప్రతీ ఉద్యోగి పుష్కరాల విధులకు తెచ్చుకోవాలని సూచించారు. దుస్తులకు అయ్యే ఖర్చు రూ.1200 ఉద్యోగి జీతంతో కలిపి అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగే గోదావరి పుష్కరాల్లో 1800 మంది ఈపీడీసీఎల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై కమిటీల వారీగా ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు వెలువడ్డాయి. -
‘తెలుపు’ అతి అవుతోంది!
డ్రెస్ కోడ్పై ఫెడరర్ విమర్శ లండన్: వింబుల్డన్ నిర్వాహకులు సంప్రదాయం అంటూ ఘనంగా చెప్పుకోవచ్చు గాక... కానీ పైనుంచి కింది వరకు అన్నింటా తెలుపు రంగు మాత్రమే కనిపించాలనే డ్రెస్ నిబంధన ఆటగాళ్లలో అసహనం రేపుతోంది. ఈ విషయంపై గత ఏడాదే విమర్శలు చేసిన స్టార్ ఆటగాడు రోజర్ ఫెడరర్ మరోసారి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. తనకు వింబుల్డన్ అంటే చాలా ఇష్టమని, అయితే ఇప్పుడంతా ‘అతి’గా మారిపోయిందని అతను అన్నాడు. ‘నిబంధనలు అవసరానికి మించి కఠినంగా ఉన్నాయి. మేమంతా తెలుపులోకి మారిపోయాం. ఇంకా తెలుపు, తెలుపు అంటూ ఒకటే నస’ అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు. పాత రోజుల్లో ఎడ్బర్గ్, బెకర్ ఫోటోలు చూస్తే రంగులు కనిపిస్తాయని, ఇప్పుడైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫెడెక్స్ అభిప్రాయ పడ్డాడు. తాజాగా బుధవారం కెనడా ప్లేయర్ బౌచర్డ్ నలుపు ‘బ్రా’ విషయంలో హెచ్చరిక అందుకుంది. రంగుల ఫ్యాషన్లను ఇష్టపడే మరో క్రీడాకారిణి బెథానీ మాతెక్... ఫెడరర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూనే మోకాళ్ల వరకు తెలుపు సాక్స్ వేసుకొచ్చి మరీ తన నిరసనను ప్రదర్శించింది! వింబుల్డన్ వద్ద అగ్ని ప్రమాదం! వింబుల్డన్లో బుధవారం మ్యాచ్లు ముగిసిన కొద్ది సేపటికి సెంటర్ కోర్టు వద్ద స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బయటికి పంపించారు. మ్యాచ్లు ముగిసినా... మరి కొంత సేపు అక్కడే ఉన్న అభిమానులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలను తరలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో హాల్లో సెరెనా విలియమ్స్ మీడియా సమావేశం జరుగుతోంది. దీనిని కూడా హడావిడిగా ముగించి అందరినీ ఆల్ఇంగ్లండ్ క్లబ్ పరిసరాలనుంచి తరలించారు. -
పొట్టి స్కర్ట్స్, టీ షర్టులు వద్దు...
కోలకతా: కోలకతాలోని ఓ ప్రముఖ కళాశాల యాజమాన్యం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమని కనీసం సంప్రదించకుండా ఇలాంటి నిబంధనలు తగవంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే... కోలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు డ్రెస్కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అబ్బాయిలు రౌండ్ నెక్ టీ షర్టులు, కాప్షన్స్, పిచ్చిరాతలు ఉన్న టాప్స్, అమ్మాయిలు పొట్టి గౌనులు ధరించి కాలేజీకి రావడాన్ని నిషేధించింది. విద్యార్థినీ విద్యార్థులు విధిగా పొడుగు చేతుల చొక్కాలు, చీరలు, సల్వార్ కమీజులు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది. దీంతోపాటు అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాన్ని కూడా తప్పు బట్టింది. ఇక కళాశాల యాజమాన్యం నిర్ణయంపై విద్యార్థి సంఘాలు సోమవారం నుంచి ఆందోళన దిగాయి. మరోవైపు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక నిబంధనలా అంటూ మేధావులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇది తీరని భంగపాటు అంటూ అనేకమంది విద్యావేత్తలు , ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు. -
ట్రాన్స్జెండర్లకూ డ్రెస్కోడ్
ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటి సారిగా థాయ్లాండ్లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్ను ప్రకటించింది. ఫ్రెషర్స్లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్ను ప్రకటించే ఆనవాయితీ గల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్ల (లింగ మార్పిడి చేసుకున్నవారు)కు కూడా డ్రెస్ కోడ్ ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్, డార్క్ కలర్ కలిగిన లాంగ్ స్కర్ట్ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్నైనా ధరించే అవకాశాన్ని ట్రాన్స్జెండర్లకు కల్పించింది. 'ఫ్రెష్యీ ఛాయిస్' పేరిట యూనివర్సిటీ ఫేస్బుక్ పేజీలో డ్రెస్ కోడ్ను పోస్ట్ చేయగా, ప్రపంచం నలుమూలల నుంచి లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ముందుగా 'స్కూల్ ఆఫ్ ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్' కళాశాలలో ట్రాన్స్జెండర్లకు డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నామని, వచ్చే స్పందనను బట్టి మిగతా కళాశాలల్లో కూడా ఈ కోడ్ను అమలు చేస్తామని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మూడో జెండర్ను కూడా గుర్తిస్తూ గత జనవరిలో థాయ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
40 డిగ్రీల ఎండలో సూటా?
ప్రోటోకాల్కు విరుద్దంగా ప్రధాని పర్యటనలో నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ ధరించి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఐఏఎస్ అధికారి, బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా ఎట్టకేలకు వివాదంపై స్పందించారు. నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్లో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. 'దేశంలో అత్యధికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో బస్తర్ కూడా ఒకటి. 40 డిగ్రీల ఎండలో.. బంద్గలా లేదా నార్మల్ సూటు ధరించి ఉక్కపోతను అనుభవిస్తూ విధులు నిర్వర్తించడం నావల్ల కాదు బాబోయ్..' అంటూ వాట్సాప్ మెస్సేజ్ల ద్వారా ఐఏఎస్ సహచరులతో తన గోడు వెలిబుచ్చుకున్నాడు. 'అయినా నేనేమీ టీషర్లు, స్లిప్పర్సు ధరించానా? బ్లూ షర్లు, బ్లాక్ ప్యాంటు, షూ.. ఇలా కంప్లీట్ ఫార్మల్ వేర్ లో ఉండటం తప్పెలా అవుతుంది?' అని మనసులో మాటను మిత్రులతో పంచుకున్నారు. అసలీ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోలేదని, ఆయన తనకు 'హలో' చెప్పారని, మీడియానే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసిందని అమిత్ కటారియా పేర్కొన్నారు. గతవారం ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ 24 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ దుస్తులు ధరించినందుకు బస్తర్ కలెక్టర్ అమిత్ కటారియాకు ఛత్తీస్గఢ్ సర్కారు నోటీసులు కూడా జారీచేసింది. -
టీచర్లతో లవ్వా.. హవ్వ!
ఓ లలనా...ఓ సఖియా అంటూ ఓ విద్యార్థి, ఓ లేడీ టీచర్ చేతులు పట్టుకొని చెట్టూపుట్టలు తిరుగుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూసి తమిళనాడు ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. విద్యాశాఖాధికారులను పిలిచి చీవాట్లు పెట్టింది. ఇలాంటి పాశ్చాత్య తరహా పోకడలను తక్షణమే అరికట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కదయనల్లూర్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గత మార్చి 31న ఓ 26 ఏళ్ల లేడీ టీచరు, ఓ పదహారేళ్ల కుర్రాడిని ప్రేమించి అతడితో పారిపోయింది. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత దిండుగల్ జిల్లాలోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో 22 ఏళ్ల లేడీ టీచర్, నీవు లేక నేను లేను.....అంటూ 20 ఏళ్ల అబ్బాయితో ఉడాయించింది. ఈ రెండు సంఘటనలపై దుమారం రేగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. ఆగమేఘాల మీద కదిలిన విద్యాశాఖ అధికారులు వెంటనే ఓ ఫార్మల్ కమిటీని ఏర్పాటు చేశారు. సదరు కమిటీ వారు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్లను పిలిపించి ఇలాంటి ప్రేమ కలాపాలను అరికట్టడం ఎలా ? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంతోపాటు లేడీ టీచర్లకు 'ప్రవర్తనా నియమావళి'ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ నాయకుల్లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్మం కనిపించేలా స్కర్టులు, టీ షర్టులు, జీన్ పాంట్ల లాంటి పాశ్చాత్య దుస్తులను లేడీ టీచర్లు ధరించరాదని, సామాజిక వెబ్సైట్ల ప్రభావం పెరిగిన నేపథ్యంలో తరగతి గదిలోకి వారు సెల్ఫోన్లు తీసుకెళ్లరాదని, ప్రేమకలాపాలపై నిఘా ఉంచేందుకు విద్యా సంస్థల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమేరాలను అమర్చాలని 'తమిళనాడు హయ్యర్ సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఆంటోని అంబరసు, 'తమిళనాడు గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఎస్. తమిళాని ఆ చర్చల్లో వాదించారు. తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దనడం సమంజసమేనని, డ్రెస్ కోడ్ నిర్దేశించడం సమంజసం కాదని, ఇప్పుడు దీన్ని అనుమతిస్తే మున్ముందు ముఖాలు కూడా కనిపించకుండా ముసుగులు వేసుకోమనే కోడ్కు దారితీస్తుందని పోస్ట్గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎస్. మురుగన్ వాదించారు. విద్యార్థులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి గానీ, టీచర్లకు ప్రవర్తనా నియమావళి ఏంటని కొంత మంది ఫెమినిస్టులు వాదించారు. చివరకు వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మౌఖిక ఆదేశాలతో లేడీ టీచర్లకు 'కోడ్', విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఓ పాఠశాలలో లేడీ టీచర్లంతా కలిసి 'వియ్ లవ్ అవర్ టీచర్స్' అనే అక్షరాల క్రమంలో విద్యార్థులను కూర్చోబెట్టారు. ఇందులో కూడా 'లవ్వే' ఉంది కదా! అని ఆ విద్యార్థులంతా ఎంత బుద్ధిగా కూర్చున్నారో! -
సింగపూర్ బృందానికి తిరుమలలో డ్రెస్ కోడ్ ఇబ్బందులు
తిరుమల: ముఖ్యమంత్రి వెంట మంగళవారం తిరుమలకు వచ్చిన సింగపూర్ బృందానికి డ్రెస్ కోడ్తో ఇబ్బందులు వచ్చాయి. తిరుమల శ్రీవారిని దర్శించడానికి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలి. ఈ బృందంలో పురుషులు పంచె, చొక్కా, మహిళలు చీరతోనూ, చుడీదార్లతోనూ వచ్చారు. అయితే, పురుషులు కొందరు పంచెలు ధరించేందుకు నానా తంటాలు పడ్డారు. టీటీడీ ఈవో, జేఈవో ముందస్తు చర్యలు తీసుకుని వారికి పంచె ధరించడంపై అవగాహన కల్పించారు. ఇందుకు ఏఈవో స్థాయి అధికారులను నియమించారు. దీంతో వారు పంచెలు ధరించి దర్శనానికి వచ్చారు. సీఎం వెంట వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్యాంటు మీద పంచె చుట్టుకుని వచ్చారు. -
బీచ్లలో డ్రెస్ కోడ్
పణజి: గోవా బీచ్లలో వస్త్రధారణపై ఇటీవల కాలంలో చాలా తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు యువతుల వస్త్రధారణపై వాడివేడిగా మంత్రుల స్థాయిలో చర్చ జరుగగా, ఇప్పుడు పురుషుల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు. బీచ్లలో పురుషులకు కూడా వస్త్రధారణ కోడ్ ఉండాలని ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైకేల్ లోబో మంగళవారం డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పురుషులకు వస్త్రధారణ కోడ్ ఉండాలన్నారు. సరైన స్విమ్ సూట్ (ఈత కొట్టే సమయంలో వేసుకునేది) ధరించాలని, అసభ్యకరంగా కనిపించే లో దుస్తులను అనుమతించరాదని ఆయన అన్నారు. మగ యాత్రికులు కొందరు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారని ఆయన చెప్పారు. సింగపూర్, దుబాయ్, మలేషియాలలో మాదిరి ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో గోవా బీచ్లో యువతుల బికినీలపై నిషేధించాలని ఓ మంత్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో గోవా టూరిజం శాఖ కంగారు పడింది. గోవా బీచ్లో బికినీలపై నిషేధం లేదని ప్రకటించింది. అంతే కాకుండా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్ పరిక్కర్ గోవా బీచ్ లలో బికినీ ధరించడంపై నిషేధం విధించడం లేదని ఓ ప్రకటన చేయవలసి వచ్చింది. -
'ఊడిపోతాయనే లుంగీలను అనుమతించలేదు'
లుంగీ కట్టుకు వచ్చారని ఏకంగా ఒక హైకోర్టు జడ్జినే అనుమతించకుండా బయటకు పంపేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్బు.. ఇప్పుడు తన డ్రెస్ కోడ్ను మరోసారి పరిశీలించుకోడానికి సిద్ధమైంది. పూర్తి ప్యాంటు, షర్టు లేదా కాలర్ ఉన్న టీషర్టు, లెదర్ బూట్లు ధరించిన వారికి మాత్రమే తమ క్లబ్బులోకి ప్రవేశం అంటూ చాలా కాలంగా ఈ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే.. ఈనెల 11వ తేదీన ఓ పుస్తకావిష్కరణకు వచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంధామన్ సంప్రదాయ పద్ధతిలో లుంగీ కట్టుకుని రాగా, ఆయనను వెక్కి పంపేశారు. 'స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ఈ వివక్ష కొనసాగడాన్ని నేను అంగీకరించలేను. వాళ్ల సభ్యులకైతే నిబంధనలు పెట్టుకోవచ్చు గానీ, ఆహ్వానం మీద వచ్చినవాళ్లకు కాదు' అని ఆయన మండిపడ్డారు. దీనిపై తాజాగా క్లబ్బు యాజమాన్యం వివరణ ఇచ్చింది. న్యాయమూర్తిని అడ్డుకున్న సభ్యుడు తమకు క్షమాపణలు చెప్పారని, ముందుగా న్యాయమూర్తికి డ్రస్ కోడ్ గురించి చెప్పకపోవడం తప్పేనని తెలిపింది. అయితే.. మరో సీనియర్ సభ్యుడు మాత్రం అసలు విషయం చెప్పారు. తాగిన మత్తులో లుంగీ జారిపోతే బాగోదు కాబట్టే లుంగీలను నిషేధించామని, కానీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేమని ఆయన అన్నారు. -
పోలీస్ వ్యవస్థ శక్తిమంతమైతే మంచిదేగా!
-
మెట్రో పోలీస్
... ఇక సూపర్ కాప్ సేఫ్, స్మార్ట్ సిటీగా రాజధాని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల తరహాలో ప్రత్యేక డ్రెస్కోడ్ ఆధునిక హంగులతో 1,650 ఇన్నోవా వాహనాలు ల్యాప్టాప్లు, జీపీఎస్, ఇంటర్నెట్, వైర్లెస్ వ్యవస్థలు ‘గల్లీ గస్తీ’ పేరిట 1,500 బైక్లతో పెట్రోలింగ్ పోలీసు అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా..ఇన్నోవా వాహనాలు, ల్యాప్టాప్లు, జీపీఎస్, వేగమైన ఇంటర్నెట్, వైర్లెస్ వ్యవస్థ.. నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే పోలీసులు. పాశ్చాత్య దేశాల్లో కనిపించే పోలీసింగ్ తీరిది. మరికొద్ది రోజుల్లోనే ఈ అత్యాధునిక పోలీస్ వ్యవస్థ మన హైదరాబాద్లో కనిపించనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా బలగాల తరహాలో ఇక్కడి పోలీసులకు ఆధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. పోలీస్ అంటే ఖాకీ డ్రెస్, టోపీ, చేతిలో లాఠీ అనే విధానం ఇక కనుమరుగు కాబోతోంది. రాజధానిలో పోలీసు రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. చైన్ స్నాచింగ్ దగ్గరి నుంచి తీవ్రమైన నేరాలదాకా అన్నింటినీ పూర్తి స్థాయిలో నియంత్రించి హైదరాబాద్ను సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మార్చేందుకు తోడ్పడే సౌకర్యాలు పోలీసులకు అందబోతున్నాయి. బస్తీల్లో పహారా కోసం మోటారు సైకిళ్ల మీద ‘గల్లీ గస్తీ’ పోలీసులు రానున్నారు. నేరం ఎక్కడ జరిగినా.. పది నిమిషాల్లోగా పోలీసులు ఆ స్థలంలో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. శనివారం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ల పోలీసు కమిషనర్లు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. తొలి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసు వ్యవస్థ తీరుతెన్నులను పూర్తిగా మార్చాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లోని పోలీసు వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని తదనుగుణంగా మార్పులు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ నేరం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలంలో ఉండాలని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం ద్వారా వారు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే పరిస్థితులు తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్లోని ట్యాక్సీలు ముంబై తరహాలో కామన్ బ్రాండింగ్ (ఒకే రంగు వాహనాలు) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా.. రాజధానిలో శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఇతర శాఖలతో పాటు మంత్రులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్లో పోలీసు భవనాలు: జూబ్లీహిల్స్లో గుర్తించిన ఎనిమిది ఎకరాల స్థలంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను కొత్తగా నిర్మించాలని... ట్రాఫిక్, ఇతర నగర రక్షణ వ్యవస్థల ప్రధాన కార్యాలయాలన్నీ ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించేలా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలీసుల కొత్త డ్రెస్కోడ్ వీలైనంత త్వరలో అమల్లోకి వస్తుందని.. మిగతా నిర్ణయాలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆధునిక హంగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రిక్రూట్మెంట్ ద్వారా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. పాత వాహనాలకు చెక్ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతమున్న పోలీసు వాహనాలను సమూలంగా మార్చివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయిం చారు. వాటి స్థానంలో 1,650 కొత్త ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వాహనాల్లోనే జీపీఎస్, 4జీ ఇంటర్నెట్, ల్యాప్టాప్, వైర్లెస్ వ్యవస్థ, సైరన్, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక బ్రాండ్ ఉండేలా డ్రెస్కోడ్ను వీలైనంత త్వరగా మార్చనున్నారు. 1,500 బైకులతో ‘గల్లీగస్తీ’.. హైదరాబాద్ నగరంలో పోలీసు పహారాను విస్తృతంగా పెంచేందుకు ‘గల్లీ గస్తీ’ పేరిట మోటారు సైకిళ్లతో కూడిన పెట్రోలింగ్ వ్యవస్థను కేసీఆర్ రూపొందించారు. బస్తీల్లో 24 గంటలూ పోలీసులు పహారా కాయడం వల్ల చైన్ స్నాచింగ్, దొంగతనాలు, ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ‘గల్లీ గస్తీ’ కోసం 1,500 కొత్త మోటారు సైకిళ్లను కొనుగోలు చేసి షిఫ్టుల వారీగా పోలీసులు పహారా కాసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎక్కడ నేరం జరిగినా 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించే పరిస్థితులను కల్పించేలా వాహన వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు స్వేచ్ఛ, భద్రత విషయంలో పోలీసులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బస్టాపుల్లో పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలని సూచించారు. -
మారనున్న తెలంగాణ 'ఖాకీ' డ్రెస్ కోడ్
-
పోలీస్ డ్రెస్ కోడ్ పూర్తిగా మార్చండి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో 'అధునాతన టెక్నాలజీని వాడుతూ న్యూయార్క్ తరహా పోలీసింగ్ను నిర్వహించాలి' అని కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1650 ఇన్నోవాలు, అవసరం మేరకు టూవీలర్లు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో కేసీఆర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది డ్రెస్ కోడ్ను పూర్తిగా మార్చాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ జంటనగరాలు అంతా కవరయ్యేలా సీసీ కెమరాలు తక్షణం అమర్చండని కేసీఆర్ అధికారులకు తెలిపినట్టు సమాచారం. Follow @sakshinews -
‘కట్టు’ తప్పకుండా ఆట
మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడల్లో ముందు గుర్తు చేసుకోవాల్సింది ఇరాన్ మహిళలను. వీళ్లకు అనేక కట్టుబాట్లు ఉంటాయి. ఏ క్రీడలో పాల్గొన్నా ఏ మాత్రం శరీరం కనిపించకుండా బట్టలు ధరించాలి. స్విమ్మింగ్ పోటీల్లోనూ ఇరాన్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇంట్లో నుంచి బయటకెళ్లినప్పుడు మహిళలు హిజాబ్(బురఖా) ధరించినట్లే.. క్రీడల్లోనూ క్రీడాకారిణులు అదే బాటలో నడుస్తారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నప్పుడు మహిళా క్రీడాకారిణుల వేషధారణ మిగతా దేశాల వారికి విభిన్నంగా కనిపించినప్పటికీ.. వారికి మాత్రం అదంతా మామూలు విషయమే. తమ దేశ కట్టుబాట్లను కచ్చితంగా పాటిస్తామని వారు ప్రతి ఇంటర్వ్యూలోనూ కుండ బద్దలు కొట్టేస్తారు. 2005లో హైదరాబాద్ ఆసియా కబడ్డీ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీల్లో ఇరాన్ మహిళల జట్టు తమ డ్రెస్తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎప్పట్లాగే ఇరాన్ నిబంధనల ప్రకారం హిజాబ్ ధరించి పోటీల్లో బరిలోకి దిగారు. మిగిలిన జట్ల క్రీడాకారిణులు నిక్కర్లతో ఆడితే.. ఇరాన్ మహిళల జట్టు మాత్రం హిజాబ్తోనే మ్యాచ్ ఆడారు. తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వారి వేషధారణ అభిమానులకు విచిత్రంగా అనిపించినప్పటికీ.. ఇలాగే బరిలోకి దిగడం తమకెంతో ఇష్టమని చెబుతుంటారు. స్విమ్మింగ్లోనూ... మహిళలు పాల్గొనే ఏ క్రీడాంశమైనా హిజాబ్ తప్పనిసరి. కబడ్డీ నుంచి మొదలుకుని ఫుట్బాల్ వరకు ప్రతి ఆటలోనూ హిజాబ్ ధరించే పోటీల్లో పాల్గొంటారు. చివరికి స్విమ్మింగ్లోనూ హిజాబ్ తప్పనిసరి. అది స్వదేశంలో అయినా సరే, విదేశాల్లో అయినా సరే.. నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక క్రీడాకారిణులకు శిక్షణ కూడా మహిళలే ఇస్తారు. ఒకవేళ మహిళా కోచ్లు అందుబాటులో లేకపోతే వారిని ఆ క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతించరంటే నిబం ధనలు ఎంత కచ్చితంగా పాటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కొందరు క్రీడాకారిణులు తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే చివరికి వారు కట్టుబాట్ల విషయంలో బద్దులుగానే ఉంటారు. డ్రెస్ కోడ్ పాటించకుంటే వేటే... కొన్ని దేశాల్లో మహిళలు క్రీడల్లో బరిలోకి దిగుతున్నప్పుడు సాధారణంగా డ్రెస్ కోడ్ గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరాన్లో మాత్రం క్రీడాకారిణులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది. లేకుంటే జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వారిని అనుమతించరు. క్రీడాకారిణులు లాంగ్ స్లీవ్ బ్యాగి టాప్, ట్రాక్ సూట్ బాటమ్స్, హెడ్ స్క్రాప్స్తో బరిలోకి దిగుతారు. ఈ డ్రెస్ను హిజాబ్గా పరిగణిస్తారు. క్రీడ ఏదైనా ఇరాన్ మహిళలు తప్పనిసరిగా డ్రెస్కోడ్ను పాటిస్తారు. నిజానికి 35 ఏళ్ల కిందటి వరకు క్రీడాకారిణులు వేసుకునే స్పోర్ట్స్ డ్రెస్పై పెద్దగా పట్టింపులు ఉండేవి కావు. అందరిలాగే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని ఆడేవారు.. అయితే ఇరాన్ విప్లవం తర్వాత 1979 నుంచి ఇరాన్ ప్రభుత్వం మహిళల డ్రెస్ విషయంలో నియమ నిబంధనలు విధించింది. అప్పటి నుంచి నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడకుండా నిషేధం విధిస్తారు. -
చీరలకు ఇక చెల్లు