fornication
-
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం
సాక్షి,బళ్లారి: నగరంలోని ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఇన్ఫ్యాంట్రీ రోడ్డులో వేశ్యవాటికపై కౌల్బజార్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. తనిఖీలు చేసి పలువురు మహిళలను రక్షించడంతో పాటు సెంటర్ను నిర్వహిస్తున్న ప్రభుగౌడతో పాటు మరో ఏడుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగాల్యాండ్, ఢిల్లీ, వెస్ట్బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలను రక్షించి, అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిని పట్టుకున్నారు. నగరంలో పలు స్పా(మసాజ్) సెంటర్ల పేరుతో లోపల అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే స్పా సెంటర్లలో అసాంఘీక కార్యకాలాపాలు జరుపుతూ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయిలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లను తనిఖీ చేస్తే పైన బోర్డులు మాత్రం మసాజ్ సెంటర్లు అని చూపుతూ లోపల మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు సమాచారం. -
భార్య కువైట్లో.. భర్త దారుణ హత్య
నాగోలు: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భరత్నగర్కు చెందిన తంగడపల్లి రాములు(50)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విజయలక్ష్మీ ప్రస్తుతం కువైట్లో ఉండగా, రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్లో నివాసముంటోంది. రాములుపై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో 5 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాయినగర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయమై జరిగిన గొడవలో జైలుకు వెళ్లిన రాములు ఏప్రిల్ 24న బయటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఫతుల్లాగూడ, ఆప్కోకాలనీ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ పృధ్వీదర్రావు, సీఐ కాశిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు క్లూస్టీం, డాగ్స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
సేలం: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె కుమారుడు స్నేహితులతో కలిసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం అలగాపురం పెరియపుదూర్కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ (36). ఇతనికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గోపాల్కు పెరియపుదూర్కు చెందిన జ్యోతి (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జ్యోతికి భర్త లేకపోవడంతో గోపాల్ భార్య పిల్లలను వదిలేసి ఆమె ఇంటి వద్దకే వెళ్లిపోయాడు. జ్యోతికి కుమారుడు ఉలగనాథన్, మరో కుమార్తె ఉన్నారు. గోపాల్కు జ్యోతి కుమారుడు ఉలగనాథన్కు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం జ్యోతి ఉద్యోగానికి వెళ్లగా, గోపాల్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం 4గంటల సమయంలో ఉలగనాథన్ నలుగురు స్నేహితులతో ఇంటికి వచ్చి గోపాల్తో గొడవకు దిగాడు. తర్వాత వారంతా కలిసి కత్తితో గోపాల్ను నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన గోపాల్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలగాపురం పోలీసులు పరారైన ఉలగనాథన్ సహా ఐదుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
కిరాతకం
భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త కిరాతకుడిగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. విచక్షణా రహితంగా కత్తితో నరికి భార్యను హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పున్నపాక్కం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. తిరువళ్లూరు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలిగొంది. భర్త కాలయముడై ఆమెను హత్య చేశాడు. వివరాలు... తిరువళ్లూరు జిల్లా ఆట్రంబాక్కం గ్రామానికి చెందిన నాగరాజ్కు, బీమంతోపు గ్రామానికి చెందిన నందినితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అడపిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజ్కు, నందినికి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. నాగరాజ్ తీరుతో విసుగు చెందిన నందిని, భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ స్థితిలో ఆమెకు పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నందిని తిరువళ్లూరులోని ప్రయివేటు నగల దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని రాత్రి 10.20 గంటలకు ప్రియుడితో కలిసి బైక్పై ఇంటికి బయలుదేరింది. పున్నపాక్కం సమీపంలో వస్తుండగా నాగరాజ్ వారిని అడ్డుకుని భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. భయాందోళన చెందిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నందినిని అటువైపు వెళుతున్న వారు తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత ఫలించక నందిని బుధవారం ఉదయం నాలుగు గంటలకు మృతి చెందింది. నందిని హత్యపై కేసు నమోదు చేసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగరాజ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతోనే హత్య చేసినట్టు నాగరాజ్ పోలీసులు ఎదుట నేరం అంగీకరించాడు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నామక్కల్ జిల్లా కుమార పాళయంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. నామక్కల్ జిల్లా కుమార పాళయం సమీపం కోట్టైమేడు ప్రాంతానికి చెందిన ఆర్ముగం(43). ఇతని భార్య నాగమ్మాళ్. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్ముగం పక్క ఇంట్లో నివశిస్తున్న కన్నియప్పన్(45), అతని భార్య మరకదం(35). వీరి కుమారుడు గౌరిశంకర్(22). ఇలాఉండగా మరకదంకు ఆర్ముగంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు ఏర్పడేవి. ఈ స్థితిలో మూడు రోజుల కిందట ఆర్ముగం, మరకదం గదిలో ఏకాంతంగా ఉండగా గౌరిశంకర్ చూశాడు. దీంతో ఆవేదన చెందిన గౌరిశంకర్ తండ్రితో చెప్పి బోరున విలపించాడు. అనంతరం గౌరిశంఖర్, కన్నియప్పన్లు కలిసి ఆర్ముగంను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్ముగం వీధిలో వస్తుండగా ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న కుమారపాళయం పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్ముగం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కుమార పాళయం జీహెచ్కు తరలించారు. గౌరిశంఖర్, కన్నియప్పన్లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఏఎస్ఐ భార్య అనుమానాస్పద మృతి
అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ దేవదాస్ భార్య సరళ (48) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే తన బావే హత్య చేసి ఉంటాడని మృతురాలి చెల్లెలు ఆరోపించింది. అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిందని భర్త చెబుతున్నాడు. అనంతపురం సెంట్రల్: నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్రోడ్డు భాగ్యనగర్ కాలనీలో ఏఎస్ఐ దేవదాసు, సరళ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కీర్తి, హరితారాణి, మనోహర్లు సంతానం. పెద్ద కుమార్తె బీటెక్ చదువుతుండగా, మిగతా ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సరళకు అన్నదమ్ములు లేకపోవడంతో తండ్రి నుంచి రూ.కోట్లు విలువజేసే ఆస్తులు వచ్చాయి. తొలినాళ్లలో అన్యోన్యంగా సాగిన వీరి సంసారంలో కొన్నేళ్ల నుంచి కలహాలు ప్రారంభమయ్యాయి. దేవదాసు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అనేకసార్లు ఆమె తన చెల్లెలుకు చెప్పుకొని బాధపడింది. దీనిపై గతంలో డీఎస్పీ మల్లికార్జునవర్మకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సరళ మృతి చెందింది. గుట్టుగా ఖననానికి ఏర్పాట్లు! బంధువులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా ఖననం చేయడానికి దేవదాసు యత్నించడం అనుమానాలకు దారితీసింది. విషయం తెలుసుకున్న మృతిరాలి చెల్లెలు వారి ఇంటికి వచ్చి గొడవకు దిగింది. తన అక్కను బావే హింసించి చంపారంటూ ఆరోపించింది. మృతురాలి బంధువులను పక్కకు తోసేసి ఖననం చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగించి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు యత్నించారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం తమ అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుపట్టారు. చేసేదిలేక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే.. ఏఎస్ఐ దేవదాసు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనకు అడ్డుగా ఉందనే కారణంతో తమ అక్క సరళను హింసించి హత్య చేశాడని మృతురాలి చెల్లెళ్లు కమల, వర్ణ, అనితలు ఆరోపించారు. అక్క మృతి చెందితే మరో వివాహం చేసుకోవాలని కుట్ర పన్నాడన్నారు. అనేక సార్లు హింసించాడని, దీనిపై గతంలో పనిచేసిన డీఎస్పీ మల్లికార్జునవర్మకు ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. అయితే వారు దుప్పటి పంచాయితీ చేసి పంపించారని ఆరోపించారు. దేవదాసు, ఆయన అన్న ఇద్దరూ ఏఎస్ఐలు అని, కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో పాటు దేవదాస్ ఆస్తులు కూడా పిల్లల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతోనే చనిపోయింది.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ సరళ మృతి చెందింద భర్త దేవదాసు తెలిపారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లామని, వ్యాధిని పరిశీలించిన అనంతరం అడ్మిషన్ చేసుకోలేదని వివరించారు. పరిస్థితి విషమించి ప్రాణం విడిచిందని చెప్పారు. -
కామాంధుడు
♦ ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం ♦ ఆమె కుమార్తెపై అత్యాచారం ♦ వారం క్రితం బిడ్డకు జన్మనిచ్చిన యువతి ♦ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్యాపిలి: మండల కేంద్రమైన ప్యాపిలిలో ఘోరం చోటు చేసుకుంది. భర్త లేని ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ కామాంధుడు ఆమె కూతురిపై కూడా అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను తల్లిన చేసిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. మండల పరిధిలోని హెచ్ఆర్ పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు 18 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఆమె ప్యాపిలికి వచ్చి ఓ హోటల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ప్యాపిలికి చెందిన వారం సుబ్రమణ్యం (60)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ ఆమె ఇంటికి వచ్చే సుబ్రమణ్యం కన్ను ఆమె కుమార్తె(22)పై పడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో వెళ్లి బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాది కాలంగా ఇలానే ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నాళ్ల తర్వాత నెల తప్పిన ఆమె.. విషయాన్ని తల్లికి చెప్పేందుకు భయపడింది. ఏడో నెలలో కుమార్తె కడుపు ముందుకు రావడాన్ని గమనించిన తల్లి ఆమెను గట్టిగా నిలదీసింది. బోరుమని ఏడుస్తూ కుమార్తె జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించిన తల్లి..కుమార్తెను తీసుకుని హాస్పిటల్కు వెళ్లింది. అయితే ఏడో నెల కావడంతో అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పడంతో నిరాశతో వెనుతిరిగింది. వారం రోజుల క్రితం కుమార్తె ఆడపిల్లను జన్మనిచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయిందని భావించిన తల్లి..తన కూతురుతో కలసి ఆదివారం ప్యాపిలి పోలీస్స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారం సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. -
ప్రియుడే కడతేర్చాడు
అన్నానగర్: వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. ఆనంది పెద్ద కుమారుడు సుజీధరన్ డిగ్రీ, రెండవ కుమారుడు అస్సుధన్ ప్లస్ఒన్ చదువుతున్నాడు. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది. దీంతో ఆనంది కుటుంబం సహా పేటైలో నివాసం ఉంటోంది. వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్ సమీపంలో ఉన్న సింగమ్పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో ఆనంది భర్త చంద్రశేఖర్, చెల్లప్ప స్నేహితులని, తరచూ వారి ఇంటికి వెళ్లే వాడని చంద్రశేఖర్ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానంతో అంతమొందించాడు!
- మహిళను చంపేసి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం - కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు - నలుగురి నిందితుల అరెస్ట్ - మరొకరి కోసం గాలిపు నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి, అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె.. శ్రీనివాసులుగా దూరంగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కడతేర్చాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్ సహాయం తీసుకున్నాడు. మే 8వ తేదీన పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20వ తేదీన పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం సంఘటన స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురి నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు. -
ఉసురు తీసిన అవమానభారం
ఇద్దరు పిల్లల గొంతు నులిమి తండ్రి ఆత్మహత్య - భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడమే కారణం – కర్నూలు మండలం శివరామపురంలో ఘటన కర్నూలు సీక్యాంప్: భార్య వివాహేతర సంబంధం ముగ్గురి ఉసురు తీసింది. పల్లెటూరు కావడంతో తలా ఒక మాట అనడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కర్నూలుకు శివారులోని శివరామపురం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, బంధువులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన వికలాంగుడు చాకలి మహేష్(32) స్థానికంగా కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి(26), కుమార్తె హారిక(5), కుమారుడు ఆకాష్(4) సంతానం. మహేష్ తండ్రి నడిపెన్న(60), తల్లి పాపమ్మ(52) ఇతని వద్దే ఉంటున్నారు. ఎనిమిది నెలల క్రితం లక్ష్మి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారనే ఆలోచన లేకుండా భార్య వెళ్లిపోవడం.. స్థానికుల సూటిపోటి మాటలతో మహేష్ ఇంటికే పరిమితమయ్యాడు. చివరకు చావే శరణ్యంగా భావించాడు. అయితే తను చనిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారనే భావనతో ముందుగా ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేవాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మబ్బువాళ్లపేటలో దారుణం
⇒బడిలోనే టీచర్ హత్య ⇒ ఆర్థిక లావాదేవీలే కారణమా..? ⇒ అనాథలైన ఇద్దరు చిన్నారులు ⇒ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు విద్యార్థులకు నీతి బోధనలు చేస్తూ సమాజానికి మంచి పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. వివాహితురాలైన టీచర్ను ప్రేమ పేరిట వంచించాడు. ఆర్థిక లావాదేవీలతో గొడవ పడ్డాడు. చివరికి ఆమెను అందరూ చూస్తుండగానే బడిలోనే హత్య చేశాడు. ఈ సంఘటన గంగవరం మండలం మబ్బువాళ్లపేటలో గురువారం జరిగింది. పలమనేరు:పాఠశాలలోనే ఉపాధ్యాయురాలు హత్యకు గురైన సంఘటన జిల్లాలో సంచల నం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలం సూరయ్యగారిపల్లికి చెంది న చంద్రమౌళి(45) గంగవరం మండలం లోని గుండుగల్లు బొమ్మనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఓ టీచర్ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇదే మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పలమనేరుకు చెంది న ప్రేమకుమారి(40)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలి యడంతో చంద్రమౌళి భార్య అతన్ని వదిలేసింది. ఈ నేపథ్యంలో చీటీలు వేస్తానని చెప్పి ప్రేమకుమారి నుంచి చెక్కులు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంగా 2014 మేలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. అప్పట్లో తనను తిరుపతికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ప్రేమకుమారి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పిం చారు. తనకున్న పలుకుబడితో మళ్లీ ఉద్యోగంలో చేరిన చంద్రమౌళి ఆరునెలలుగా ప్రేమకుమారి వెంట పడుతున్నాడు. భార్య ప్రేమకుమారి ప్రవర్తనపై విసుగు చెందిన భర్త రమేష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఎక్సైజ్ ఎస్ఐగా చేరాల్చి ఉండగా.. ఎక్కైజ్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో ప్రేమకుమారి పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇంటర్వూ్యల్లో ఎస్ఐగా ఎంపికైంది. త్వరలోనే ఆమె ఆ పోస్టులో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె గత వారం నుంచి పాఠశాలకు వెళుతోంది. ఎక్సైజ్ ఎస్ఐగా వెళ్లొద్దని ప్రియుడు బెదిరిస్తుండడంతో బెదిరింç ³#ల నేపథ్యంలో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకుని బడికి వెళుతోంది. గురువారం సైతం ఆమె తండ్రి అర్జునయ్యతో కలిసి వెళ్లింది. ఇంతలో మంకీ క్యాప్తో వచ్చిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో ప్రేమకుమారిని కత్తితో 12 చోట్ల పొడిచాడు. విద్యార్థులు కేకలు వేయడంతో అర్జునయ్య అగంతకున్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. 108లో ఆమెను పలమనేరు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందింది. తమ కుమార్తెను ముసుగులో వచ్చి నరికింది చంద్రమౌళేనని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనాథలైన పిల్లలు ప్రేమకుమారికి బంగారుపాళ్యం మండలానికి చెందిన రమేష్తో పెళ్లి జరిగింది. వీరికి లయగ్రేస్(11), గిరిగ్రేస్(6) పిల్లలు ఉన్నారు. రమేష్ స్థానికంగా హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు. తల్లి మృతిచెందడం, తండ్రి దూరంగా ఉండడంతో పిల్లలకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డలను బాగా చూసుకోండి రెండు రోజుల క్రితం ప్రేమకుమారి పాఠశాలకు వెళుతూ తన బిడ్డలకు మీరేదిక్కని, బాగా చూసుకోవాలని తమతో చెప్పిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
నిజామాబాద్ రూరల్ (నిజామాబాద్ అర్బన్): వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భార్య, భర్త ను దారుణంగా చంపిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తానాఖూర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన గీత కార్మికుడైన వెల్పూర్ సాయిలు (38) హత్యకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సాయిలు స్వగ్రామానికి వచ్చి పదిరోజులైంది. భర్త విదేశాలకు వెళ్లడంతో సాయిలు భార్య నీలావతి అలియాస్ లీలా గ్రామానికి చెందిన తిరుపతి రమేశ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం విషయంలో లీలావతి, సాయిలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పథకం ప్రకారం సోమవారం రాత్రి తిరుపతి రమేశ్, లీలావతి కలిసి సాయిలును ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశారు. మంచంపై పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. బయట నుంచి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయం ఇంట్లో నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక దళ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి మంటలు ఆర్పారు. అప్పటికే మంచంతో పాటు సాయిలు మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో వస్తువులు, దుస్తులు బూడిదయ్యాయి. హతుడికి 6వ, 7వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సతీశ్ సందర్శించారు. నిందితులు ఇరువురు పరారీలో ఉన్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విజయవాడలో పట్టపగలే దారుణహత్య
-
విజయవాడలో దారుణహత్య
⇒ పట్టపగలే యువకుడిపై దాడి ⇒ అడ్డుకున్న మృతుడి తల్లికి కత్తిపోట్లు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పట్టపగలు నడిరోడ్డుపై యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన విజయవాడలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోలా పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర(21) పండ్ల మార్కెట్లో కూలీ పనులు చేస్తుంటారు. పద్మ భర్తను వదిలివేసి ఒంటరిగా ఉంటోంది. మార్కెట్లో మేస్త్రీగా పనిచేస్తున్న ఫ్రైజర్పేటకు చెందిన గణపా శివతో పద్మకు వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తన ఇంటికి రావద్దంటూ శివకు పద్మ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. తన సొమ్ము కాజేసి చివరికి ఇంటికి రావద్దంటూ గెంటివేశారని కక్ష పెంచుకున్న శివ అదనుకోసం ఎదురు చూశాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నరేంద్ర తను పనిచేస్తున్న దుకాణం వద్దకు బైక్పై వచ్చాడు. రోడ్డుపక్కన బైక్ పార్క్ చేయబోతున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న శివ కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగెడుతుండగా శివ వెంటాడి నరికాడు. తన కుమారుడిపై దాడి చేస్తున్న విషయం తెలుసుకున్న పద్మ కేకలు వేస్తూ పండ్ల దుకాణం నుంచి బయటకు రాగా ఆమెపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న పద్మ, ఆమె కుమారుడు నరేంద్రను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన నరేంద్ర మార్గమధ్యంలో చనిపోగా అతని తల్లి చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కానిస్టేబుల్ హత్య
► మహిళా కానిస్టేబుల్ సహా ఇద్దరి అరెస్ట్ ► మరో ముగ్గురు కానిస్టేబుళ్ల వద్ద విచారణ తిరువళ్లూరు: తిరువళ్లూరులో మహిళా కానిస్టేబుల్ నడిపిన వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. మృతుడు, హంతకుడు ఇద్దరూ పోలీసులు కావడం గమనార్హం. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తేనీ జిల్లా కూంబై గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(30) బీఎస్ఎఫ్ ఉద్యోగి. ఇతని భార్య (23) తిరువళ్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయుధ విభాగం (వీఆర్)లో కానిస్టేబుల్. ఈమె తిరువళ్లూరులోని పూంగానగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని తండ్రి (70), అక్క తో కలిసి నివసిస్తోంది. ఇలాఉండగా తిరునల్వేలి జిల్లా వన్నియకుళం గ్రామానికి చెందిన ఇరుళపాండ్యన్ కుమారుడు అమృతరాజ్(25) చెన్నైలో వీఆర్ కానిస్టేబుల్. ఆరు నెలల కిందట ఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతకుముందు తిరువళ్లూరులో పనిచేస్తున్న వీఆర్ కానిస్టేబుల్ కల్లన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి అమృతరాజ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు కల్లన్ తో సబంధం గురించి తెలుసుకుని అతనికి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. మద్యం మత్తులో వెళ్లి హత్యకు గురైన కానిస్టేబుల్: అమృతరాజ్ హెచ్చరించిన విషయాన్ని కల్లన్ తన సహచరులతో చెప్పాడు. అనంతరం సహచరులు మదురై ఉసిలంబట్టికి చెందిన సుందరపాండ్యన్ (24), ఊత్తపాళ్యంకు చెందిన చంద్రన్ మదురైకు చెందిన సంతానకుమార్(26)తో కలిసి మద్యం తాగి సదరు మహిళ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అమృతరాజ్ అక్కడే ఉండడంతో వారు అతనితో ఘర్షణ పడ్డారు. అమృతరాజ్ ఇంటిపైకి వెళ్లగా సుందరపాండ్యన్ అతన్ని వెంబడిస్తూ వెళ్లాడు. ఆ సమయంలో అమృతరాజ్ పక్కన ఉన్న కత్తితో సుందరపాండ్యన్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీనిపై అతని సహచరులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సుందరపాండ్యన్ ను తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అమృతరాజ్, కల్లన్, చంద్రన్, సంతానకుమార్, మహిళా కానిస్టేబుల్ వద్ద విచారణ చేపట్టారు. నిందితులను డీఐజీ ఆదివారం మధ్యాహ్నం విచారించారు. -
హత్య చేసి.. కాల్చివేసి...
పావగడలో యువకుడి దారుణ హత్య హతుడు దేవరకొండ వాసిగా గుర్తింపు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు పావగడలోని మున్సిపల్ బస్టాండు సమీపంలో దేవరకొండకు చెందిన రంగనాథ్(35) దారుణ హత్యకు గురయ్యాడని ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి మంజునాథ్ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బస్టాండు సమీపంలోని ఎస్బీఐ సమీపంలో చరండీలో పడేశారన్నారు. అంతటితో ఆగక హతుడ్ని గుర్తు పట్టకుండా ఒంటిపై పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేరుుంచిన భార్య నిందితుడి అరెస్ట్ బెంగళూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి తన భర్తను హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. వివరాలు...జిల్లాలోని ఎన్.ఆర్పుర తాలూకాలోని కట్టినమనె గ్రామానికి చెందిన యోగేంద్ర (42)కు సమీప గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది కాలంగా వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కుందాపురకు చెందిన బస్ డ్రైవర్ వినయ్గౌడతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి విషయం ఆమె భర్త యోగేంద్రకు తెలియడంతో పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. పెద్దల ఎదుట పంచాయతీ పెట్టడానికి యోగేంద్ర నిర్ణరుుంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వినయ్తో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం వేసింది. కుటుంబ విషయం మాట్లాడాలని భర్త యోగేంద్రను ఇంటికి పిలిపించింది. దీంతో శుక్రవారం రాత్రి యోగేంద్ర భార్య ఇంటికి బయలుదేరాడు. అప్పటికే గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు వినయ్గౌడ యోగేంద్రను తలపై బండరాళ్లతో మోది హత్య చేసి పారిపోయాడు. భార్యతో మాట్లాడ్డానికి వెళ్లిన తమ కుమారుడు ఎంతకీ తిరిగి రాకపవోడంతో యోగేంద్ర కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో యోగేంద్ర విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వినయ్గౌడను అరెస్ట్ చేసి విచారించగా యోగేంద్రను అతడి భార్యతో కలసి హత్య చేసినట్లు అంగీకరించారు. -
కొడుకులు కొట్టిన కేసులో రూ.10 లక్షలకు సెటిల్మెంట్
కాశిబుగ్గ(వరంగల్): కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి! శీర్షికన మంగళవారం ‘సాక్షి’ మెరుున్ ఎడిషన్ లో కథనం ప్రచురితమవడంతో బాధితుడి కుమారులు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ స్థానిక మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో తండ్రి పోషాల రమేశ్ మీద ఫిర్యాదు చేశారు. గతంలోనూ బ్లాక్ మెరుుల్ చేసి, డబ్బు వసూలు చేశాడని, తమకు ఎలాంటి ఆస్తి సంపాదించి ఇవ్వలేదని తెలిపారు. గతంలోనూ తమ ను డబ్బుకు ఇబ్బందిపెట్టి కోర్టుకు వెళ్లాడని చెప్పారు. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకుని తమను, తమ తల్లిని వేధిస్తున్నాడని, ఉన్న కొద్ది ఆస్తిని రెండో భార్య పేరున రాశాడని వివరించారు. 2 నెలలుగా తమ టెంట్హౌస్లో తిష్టవేసి తమను షాపులోకి రానివ్వకుండా, రూ.20 లక్షలివ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, తామందుకు నిరాకరించడంతో తమపైనే రాడ్తో దాడి చేశాడని, ఆ రాడ్తోనే తానూ కొట్టుకుని కోర్టుకు వెళ్లాడని ఆరోపించారు. కాగా పెద్ద మనుషుల సమక్షంలో రూ.10 లక్షలిస్తే తమ జోలికి రానని చెప్పాడని, ఈ అవమానాలను భరించలేక అందుకు కూడా ఒప్పుకున్నామని వారు చెప్పారు. -
రాధాకృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల అదుపులో బాబాయి, అబ్బాయి, మేనమామ వీరులపాడు : తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కక్షతో మెండెం రాధాకృష్ణ(35)ను గ్రామానికి చెందిన కామాల యాకోబు, అతని బాబాయి కామాల జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. హత్యకు పాల్పడిన ఇరువురితో పాటు వారికి ఆశ్రయమిచ్చిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావును అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన మెండెం రాధాకృష్ణ ఈ నెల 7న గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలోని ఆర్అండ్బీ రహదారి పక్కనున్న పంట బోదెలో శవమై కనిపించాడు. మృతుని తల్లి వెంకట్రావమ్మ తన కుమారుడిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందిగామ రూరల్ సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాధాకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతుని శరీరంపై గాయాలుండడమే కాక ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో మృతుని తల్లి ఇచ్చిన అనుమానితుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టగా యాకోబు, తన బాబాయి జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు తేలింది. నిందితులను విచారించగా తల్లితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కక్షతో తన బాబాయితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దొరికిపోయారు ఇలా.. ఈనెల 7న రాత్రి సమయంలో రాధాకృష్ణ మద్యం దుకా ణం సమీపంలో ఉండడాన్ని గమనించిన యాకోబు, జమలయ్యలు గొంతు నులమడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న పంట బోదెలో పడేసి ఇబ్రహీం పట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావు ఇంటికి నిందితులు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి విజయవాడ పరి సర ప్రాంతాల్లో ఉన్నారు. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో గురువారం ఉదయం 7 గంటల సమయంలో కంచికచర్ల బస్టాండ్కు చేరుకున్నారు. వీరు బస్టాం డ్ సమీపంలో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో సీఐ సత్యకిషోర్ సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. ఎస్ఐ అవినాష్, ట్రైనీ ఎస్ఐ ప్రియకుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది
జోగిపేట : అందోలు మండలం డాకూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జహంగీర్ (65)హత్య కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి జోగిపేట సీఐ వెంకటయ్య గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మతో జహంగీర్కు అక్రమ సంబంధం ఉందని, అయితే రెండు సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందిన అర్జునయ్య ఎల్లమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. ఈ విషయం జహంగీర్కు తెలియడంతో పలుసార్లు ఇద్దరిని పిలిచి మందలించారు. అయినా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. తమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడని భావించిన అర్జునయ్య ఎలాగైనా జహంగీర్ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్జునయ్య, తన బావమరిది అనిల్, ఎల్లమ్మలు కలిసి జహంగీర్ను హత్య చేసేందుకు పథకం వేశారు. జూలై 24వ తేదీ రాత్రి జహంగీర్ ఇంట్లో ఎల్లమ్మతో కలిసి నిద్రిస్తున్న సమయంలో బావ, బావ మరిది కలిసి జహంగీర్ ఇంటి వద్దకు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఎల్లమ్మ ముందు రచించిన పథకం ప్రకారం తలుపులు తెరచింది. వారిద్దరూ గదిలోకి ప్రవేశించి జహంగీర్ తలపై కట్టెలతో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మ ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి అర్జునయ్య, అనిల్, వారికి సహకరించినందుకు ఎల్లమ్మలపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. ఎస్ఐ విజయ్రావు, ట్రైనీ ఎస్ఐ గౌతంలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను జోగిపేట మున్సిఫ్కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కుటుంబంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
పిల్లలను వదిలి ప్రేమికుడితో వెళ్లిన వివాహిత ప్రియుడు హ్యాండివ్వడంతో తిరిగి భర్త చెంతకు భర్త అంగీకరించకపోవడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ మండ్య: పరపురుషుడి వ్యామోహంలో పడిన ఓ వివాహిత భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత సదరు ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. తనతో కాపురం చేయకపోతే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే తనను వదిలి వెళ్లిన భార్యను స్వీకరించేది లేదని భర్త చెబుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. మహిళ రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసమున్న సాగర్కు పరిచమేర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో భర్తను వదిలి సాగర్తో వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. దీంతో భార్య,భర్తల మధ్య గొడవలు మొదలయ్యి శశి బంధువులు సాగర్కు దేహశుద్ధి చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసుల సమక్షంలోనే తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్ను పెళ్లి చేసుకొని అతనితోనే జీవిస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా అంగాకరించాడు. ఇకపై రశ్మికి,తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం రశ్మి ప్రేమికుడు జరుగుతున్న పరిణామాలతో బెదిరిపోయి పారిపోయాడు. దీంతో రశ్మి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడంతో తిరిగి భర్త వద్దకే చేరుకుంది. ఇకపై భర్తతోనే ఉంటానని, అందుకు ఒప్పుకోకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇంట్లో తిష్టవేసింది. దీంతో ఏమి చేయాలో తోచని స్థితిలో రశ్మిపై అమె భర్త శశి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కాగా ప్రజలు మందు, మీడియా ముందు తనను తన పిల్లను వదిలేసి వెళ్లిన రశ్మిని తిరిగి భార్యగా స్వీకరించేది లేదని ఆమె భర్త శశి తేల్చి చెప్పారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
అనంతగిరి: మండలంలో భీంపోలు పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మద్దేల సరోజిని అలియాస్ చిన్ని(22) అనే యువతి ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనిఓ మహిళ వేధించడంతో భరించలేక సరోజిని మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు శృంగవరపు కో ట కమ్యూనిటీహెల్త్సెంటర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను సరోజిని సూ సైడ్ నోట్లో రాసినట్టు అనంతగిరి ఎస్ఐ పి.దామోదరనాయుడు తెలి పారు. గుమ్మకోటకు చెందిన పెరుమాళ్ళ మహేష్, అతని భార్య గీత,మహేష్ వదిన భవానీ వివాహేతర సంబంధం పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని, బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నట్టు సరోజీని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి దేముడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.సోమవారం శృంగవరపుకోటసీహెచ్ిసీలోమృతదేహానికిపోస్టుమార్టంపరీక్షలు నిర్వహించారు. -
‘రఘుపై నిర్భయ కేసు నమోదు చేయాలి’
అనంతపురం : గుమ్మఘట్ట మండలం బైరవానితిప్పకు చెందిన ఇద్దరు మహిళలను వంచించిన అధికార పార్టీ నేత సోదరుడు రఘుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, బీకేఎస్ కొండమ్మ మాట్లాడారు. రఘు ఓ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు తన అక్క కూతురిని వివాహం చేసుకున్నాడన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి మనస్థాపానికి గురైన కట్టుకున్న భార్య గతంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. మరోవైపు గర్భవతి అయిన బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో అధికారబలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో సదరు బాలిక కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. తన సోదరుడు టీడీపీ నాయకుడనే ధైర్యంతోనే రఘు బరి తెగించాడని ధ్వజమెత్తారు. ఇద్దరు యువతుల జీవితాలతో చెలగాటం ఆడిన రఘును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష మహిళా సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పైసాచికం!
చిన్న మొత్తాల కోసమే ప్రాణాలు తీస్తున్నారు బయటపడకూడదని చేసినవే ఎక్కువ నేరగాళ్లలో విద్యాబుద్ధులు లేనివారే అత్యధికం సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మి హత్య సైతం ఇలానే సిటీబ్యూరో: భారీ ఆస్తి/సొత్తు కోసం... వ్యక్తిగత కక్ష... భూ వివాదం... వివాహేతర సంబంధం... ఒకప్పుడు ఇవే హత్యలకు దారి తీసేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న చిన్న మొత్తాల కోసమూ కిరాతకులు తెగిస్తున్నారు. ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మీ హత్య ఈ కోవకు చెందినదే. అతడి నుంచి రూ.10 వేలు తీసుకోవడానికి ప్రయత్నించిన స్నేహితుడు నరేష్కుమార్రెడ్డి... అది సాధ్యం కాకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. ఓతప్పు కప్పిపుచ్చేందుకు ‘మరోటి’... ఈ తరహా చిన్న మొత్తాల కోసం జరుగుతున్న హత్యల్లో అనేకం ఉనికి బయటపడకూడదనే చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. నేరగాళ్లు తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల నుంచి తొలుత డబ్బు మాత్రమే తీసుకోవాలని ఆశిస్తుంటారు. అయితే ఎదుటి వారి స్పందన ఆధారంగా దోపిడీకి తెగబడతారు. ఆపై బాధితుల ద్వారా విషయం బయటకు రాకుండా ఉండటం, పోలీసుల ఫిర్యాదులు తదితరాలు తప్పించుకోవాలని భావిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బరితెగిస్తున్న నేరగాళ్లు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తులు పరిచయస్థులైతేనే ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు. ‘భవిష్యత్తు’ లేని వాళ్లే నేరగాళ్లు... చిన్న మొత్తాల కోసమూ బరితెగించి హత్యల వరకు వెళ్తున్న నేరగాళ్ల సామాజిక, ఆర్థిక నేపథ్యమూ కీలకమైన అంశమని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉంటున్న వారిలో నిరక్షరాస్యులు, సామాజిక హోదా లేని వాళ్లు, భవిష్యత్తుపై ఆలోచనలు లేని వాళ్లే ఎక్కువగాా ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వీరికి చదువు, ఉద్యోగం వంటివి లేకపోవడం, కుటుం బాలకూ దూరంగా ఉండటం, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యాలకు దూరంగా ఉండటం, బయట ఉన్నా-జైల్లో ఉన్నా సామాజిక జీవితంలో మార్పుచేర్పులు లేకపోవడం తదితరాల వల్లే ఈ నేరగాళ్లు బరితెగిస్తున్నారని అంటున్నారు. హష్మీని హత్య చేసిన నరేష్కుమార్రెడ్డి విషయాన్నే తీసుకుంటే ఇతడు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వాడు. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు సరిగ్గా అబ్బకపోవడంతో ఐటీఐతో సరిపెట్టాడు. ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ నగరానికి చేరుకున్నాడు. చివరకు పనీ పాటా మానేసి అవారాగా మారాడు. చివరకు రూ.10 వేల కోసం హష్మీని హత్య చేసి హంతకుడిగా మారాని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. క్రైమ్ కేస్ స్టడీస్... ఉప్పల్ బీరప్పగూడలో నివసించే కురుమ వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా డ్రైవర్. ఇందిరానగర్లోని హిజ్రా వద్దకు వచ్చిన ఇతడు మద్యం తాగాడు. అదే ప్రాంతానికి వచ్చిన కావూరి బ్రహ్మం అనే యువకుడిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అతడు కాదనడంతో వెం టాడి మరీ బండరాయితో మోది చంపేశాడు. కర్ణాటకకు చెందిన నెహామియా, జహీరాబాద్కు చెందిన అనిల్ నగరంలో ఫుట్పాత్లపై నివసిస్తూ చిన్నచిన్న పనులు చేసుకునేవారు. వీరిద్దరూ రెతిఫైల్ సమీపంలో జేబులో నగదుతో ఉన్న ఓ వ్యక్తిని వీరిద్దరూ చూశారు. దీంతో అతడికి మాయమాటలు చెప్పి చిలకలగూడలోని పాడుబడిన రైల్వే క్వార్టర్స్లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ వ్యక్తిని చంపేసిన ఇద్దరూ... రూ.5 వేలతో ఉడాయించారు. బాలాపూర్కు చెందిన అంజయ్య కంచన్బాగ్ హఫీజ్బాబానగర్ నిర్వాసితులకు పాలు విక్రయించే వాడు. నిత్యం ఇతడి వద్దకు ఓ వ్యక్తి వచ్చి రూ.10 తీసుకునే వాడు. ఓరోజు ఆ నగదు ఇవ్వడానికి అంజయ్య నిరాకరించడంతో సదరు వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశాడు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..
దోమతోటి హత్యకేసులో నిందితుల అరెస్టు తిరువూరు: డీసీసీ కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కపాలేనికి చెందిన కొర్రప్రోలు శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన మున్నంగి హనుమారెడ్డి, సింగంశెట్టి హనుమంతరావు, శివశంకరరెడ్డి కలిసి నాగేశ్వరరావును 17వ తేదీ రాత్రి అక్కపాలెం వాటర్ట్యాంకు వద్ద కత్తులు, రాడ్లతో హతమార్చారు. శ్రీనివాసరెడ్డి భార్యతో హతుడు నాగేశ్వరరావుకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య జరగడానికి ఒకరోజు ముందు వీఎంబంజరులోని ఒక హోటల్లో మకాం వేశారని, హత్య చేసిన వెంటనే నిందితులు అంతకు ముందు కొనుగోలు చేసిన అంబాసిడర్ కారులో పారిపోయారని తెలిపారు. హతుడి ద్విచక్రవాహనం సహా పరారైన శివశంకరరెడ్డి మైలవరం వద్ద ఒక లారీని ఢీకొన్న ప్రమాదంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. శివశంకరరెడ్డి మినహా మిగిలిన ముగ్గురిని ఉండవల్లిలో అరెస్టు చేశామని, విజయవాడ ఆటోనగర్లో కొనుగోలు చేసిన మారణాయుధాలు, అంబాసిడర్ కారును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు, తిరువూరు సెక్టార్-2 ఎస్ఐ కన్నప్పరాజు, పీఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 302 సెక్షను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. దర్యాప్తు కొనసాగింపు నాగేశ్వరరావు హత్యకేసులో మరికొందరు నిందితులున్నట్లు కాంగ్రెస్ నాయకులు, మాల మహానాడు ప్రతినిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానితుల్ని విచారిస్తున్నామని, ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.