Government of AP
-
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
2 ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
చిరుధాన్యాల సాగుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
-
శ్రీశైలం, సాగర్లో ఉన్న నీళ్లన్నీ మావే
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ తమవేనని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రబీలో సాగు చేసిన పంటలను రక్షించుకోవడం, వేసవిలో తాగు నీటి కోసం ఆ నీటిని విడుదల చేయాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటాకంటే 38.72 టీఎంసీలను అధికంగా ఏపీ వాడుకుందని తెలంగాణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రభుత్వమే కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుందని తెలిపింది. మొత్తం కృష్ణా జలాల్లో ఏపీ కోటాలు ఇంకా 199.31 టీఎంసీలు మిగులు ఉందని తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు ఉన్నాయని స్పష్టంచేసింది. ఈ నీటిని మొత్తాన్ని ఏపీకి విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్కు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి చేరుకోక ముందే, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలు 9వ పేరాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. బోర్డు అనుమతి తీసుకోకుండా విద్యుదుత్పత్తి కోసం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలోనే కలపాలని ఆదిలోనే కోరాం. ♦ తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 392.45 టీఎంసీలు, సాగర్లో 295.24 టీఎంసీలను.. మొత్తం 687.69 టీఎంసీలను వాడుకుంది. ఇందులో వరద రోజుల్లో వాడుకున్న 359.76 టీఎంసీలు, బోర్డు అనుమతితో వాడుకున్న 126.86 టీఎంసీలను మినహాయిస్తే.. 201.07 టీఎంసీలు అక్రమంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలిసింది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే 201.07 టీఎంసీలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉండేవి. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలకు ఉపయోగపడేవి. ♦ వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసి సముద్రంలో జలాలు కలిసే సమయంలో ఏపీ ప్రభుత్వం 191.09 టీఎంసీలు, తెలంగాణ 48.488 టీఎంసీలు వాడుకున్నాయి. ఆ నీటిని ఏ రాష్ట్ర కోటాలో కలపకూడదు. ♦ రెండు రాష్ట్రాల సంయుక్త లెక్కల ప్రకారం జూరాలలో తెలంగాణ 42.22 టీఎంసీలను వాడుకుంది. కానీ, కృష్ణా బోర్డుకు మాత్రం 35.959 టీఎంసీలే వాడుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పింది. అంటే జూరాల నుంచి అదనంగా 6.261 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. ♦ పాకాల చెరువు, వైరా, పాలేరు, లంకసాగర్, ఆర్డీఎస్, కోయిల్సాగర్ వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను 2021 నుంచి బోర్డు దృష్టికి తీసుకురాలేదు. ♦ 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం), తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.71 టీఎంసీలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ వాడుకున్నది 442.52 (52.2 శాతం), తెలంగాణ వాడుకున్నది 404.20 (47.8 శాతం) టీఎంసీలు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి. తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ♦ ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉంటే.. తెలంగాణ అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుంది. ♦ తక్షణమే నీటి లెక్కలను తేల్చి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లో నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయండి. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించండి. -
కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో
సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): పెళ్లంటే నూరేళ్ల పంట... మామిడాకులు, అరటి కొమ్మలు.. టెంకాయ పట్టలతో పెళ్లంటే పెద్ద సందడి. అయితే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్న సామెత ప్రకారం పెద్ద ఖర్చుతో కూడుకున్న తంతు. అందుకే నిరుపేదల పెళ్లిళకు ప్రభుత్వం కూడా తనవంతు సాయంగా కానుక అందించేందుకు సిద్ధమైంది. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు అయితే ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు చదువును ప్రోత్సహించడం, డ్రాపౌట్స్ను తగ్గించి అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన విధించింది. ఇకనుంచి కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. గతంలో టీడీపీ హయాంలో అంతంత మాత్రంగా అందిస్తుండగా, దాన్ని రెట్టింపు చేసి వైఎస్ జగన్ సర్కార్ శనివారం నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద అందించనుంది. వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు. మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్ అసిస్టెంట్(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్ http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
ముంపు ముప్పు ఉండదిక
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో ముంపు నుంచి పట్టణాలను రక్షించేందుకు పురపాలక శాఖ సమాయత్తమైంది. భారీ వర్షాలకు జనావాసాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న దుస్థితికి చెక్ పెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. పట్టణాలు కొన్ని దశాబ్దాలుగా ప్రణాళికా రహితంగా విస్తరించడంతో చిన్న చిన్న వాననీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. భారీ వర్షాలు వస్తే నీటి ప్రవాహానికి మార్గం లేక జనవాసాలు ముంపునకు గురవుతుండటం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో వరద నీటి కాలువలు నిర్మించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రూ.350 కోట్లతో రెండు దశల్లో 14 మునిసిపాలిటీలలో కాలువల్ని నిర్మించనుంది. అనంతరం దశలవారీగా లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లోనూ ఈ కాలువలు నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో 7 కార్పొరేషన్లలో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా గల 32 నగరాలను అమృత్ పథకం పరిధిలోకి చేర్చారు. తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం మొదలైనవి చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం రూ.3,762.91 కోట్ల ప్రాజెక్టు ఇది. అందులో కేంద్రం వాటా రూ.1,056.62 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.436.97 కోట్లు. మునిసిపల్ కార్పొరేషన్లు/ మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో 14 పట్టణాల్లో వరద కాలువల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. అందుకోసం రూ.350.75 కోట్లతో 118 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం నగరాలను ఎంపిక చేసి పనులను మొదలు పెట్టింది. రెండో దశ కింద మిగిలిన 7 మునిసిపాలిటీలను త్వరలో ఎంపిక చేస్తారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. మూడేళ్లలో 32 మునిసిపాలిటీల్లో.. లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లోనూ వరద కాలువలు నిర్మిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. మరో 14 మునిసిపాలిటీలను ఎంపిక చేయనుంది. మూడేళ్లలో మొత్తం 32 మునిసిపాలిటీల్లో కాలువల నిర్మాణం పూర్తి చేయాలన్నది పురపాలక శాఖ లక్ష్యం. అత్యంత ప్రాధాన్య అంశంగా ఈ పనులు చేపట్టామని పురపాలక శాఖ ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. నీటి వనరులతో అనుసంధానం వర్షపు నీరు జనావాసాల్లోకి చేరకుండా నేరుగా ఈ కాలువల్లోకి చేరేలా డిజైన్లు రూపొందించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఎత్తు ప్రదేశం నుంచి నేరుగా శివారు ప్రాంతానికి అనుసంధానిస్తూ భారీ కాలువలు నిర్మిస్తారు. ఆ కాలువలను మునిసిపాలిటీకి సమీపంలో ఉన్న నదులు/సముద్రం /ఇతర నీటి వనరులకు అనుసంధానిస్తారు. దాంతో ఎత్తు ప్రదేశాల నుంచి వర్షపు నీరు వేగంగా కిందకు ప్రవహించి నిర్దేశిత గమ్యానికి చేరుకుంటుంది. -
తుది కేటాయింపులు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. డీఎస్పీ, అదనపు ఎస్పీ, ఎస్పీ (నాన్ కేడర్) పోస్టులకు తుది కేటాయింపులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వీరి నుంచి తాజాగా ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చని సూచించింది. ఉన్నతాధికారుల పునర్విభజన సలహా కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, పునర్విభజన చట్టం నిబంధనల మేరకు కేటాయింపులు చేసి తెలంగాణ, ఏపీ హోం శాఖ, డీజీపీలకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని, ఇందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతోపాటు డీజీపీలు సహకరించాలని స్పష్టం చేసింది. తనను ఏపీకి కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూల్ జిల్లాకు చెందిన డీఎస్పీ జి.నాగన్న దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇది ఒక్కరికి చెందింది కాదు.... తనను ఏపీకి కేటాయించాలంటూ నాగన్న పిటిషన్ దాఖలు చేసినా.. ఇరు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. తుది కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వ వాదన ఏంటో చెప్పాలంటూ పలు పర్యాయాలు గడువు ఇచ్చినా వాదనలు వినిపించకపోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే ఆరువారాలు గడువు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన సీనియారిటీ జాబితాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ కేంద్రం మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించే పరిధి కేంద్రానికి ఉన్నా పట్టనట్లుగా వ్యవహరించిందని పేర్కొంది. నాగన్నను విధుల్లోకి తీసుకోవాలి.... తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు కేటాయించిన డీఎస్పీ జి.నాగన్నను తుది కేటాయింపుల్లో కేంద్రం ఏపీకి కేటాయిస్తే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల్లో జాప్యంతో పదోన్నతులు, ఇతర అలవెన్స్లు, పదవీ విరమణ బెనిఫిట్స్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల్లో జాప్యానికి కారణమైన కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు రూ.5 వేల చొప్పున నాగన్నకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. -
క్వారంటైన్ విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు
-
ఈ క్రాప్ విధానానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
-
సామాన్యులకు ‘సంజీవని’
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా టెస్ట్లు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
-
మారుతున్న పాఠశాలల రూపురేఖలు
-
రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
కరోనా నివారణకు ఏపీలో ఐ మాస్క్ బస్సులు
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కోవిడ్ టెస్టుల శాతాన్ని గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దించింది. విజయవాడ సిటీలో ఎనిమిది చోట్ల శ్వాబ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు రెండు వేల మందికి టెస్టులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..) ఐ మాస్క్ బస్సుల ద్వారా జరుగుతున్న కోవిడ్ టెస్టుల ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం పరిశీలించారు. ప్రతీ అరగంటకు ఒకసారి హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్ !) -
విద్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
-
ప్లాస్మా థెరపీ చికిత్సకు ఏపీ ప్రభుత్వం అనుమతి
-
పేదల విద్యార్ధులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్
-
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో రికార్డు
-
పేద విద్యార్ధుల కోసమే ఇంగ్లీష్ మీడియం
-
రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..
-
టీచింగ్ ఆసుపత్రులకు కొత్త హంగులు
-
ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లు
-
అన్ని వర్గాలకు బాసటగా నిలిచిన సర్కారు
-
తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు
-
కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ అగ్రస్థానం
-
సీఎం జగన్ ఏడాది పాలన..సంక్షేమ పాలన
-
ప్రజల ముంగిట పాలన
-
నేడు అర్చకులు,పాస్టర్లుకు రూ.5వేల చొప్పున సాయం
-
ఏడాది పాలన అద్బుతంగా సాగింది
-
రాష్ట్ర చరిత్రలో ఓ పార్టీ అతిపెద్ద విజయం
-
కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ రికార్డ్
-
మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
-
ఇదీ మన ప్రభుత్వ ఘనత
-
స్కూళ్ల ఫీజులపై ఏపీ సర్కారు ఆదేశం
-
పేదలకు అండగా..
-
ఏపీలో 534కి చేరిన కరోనా కేసులు
-
ప్రభుత్వం కట్టుబడి ఉంది..
-
రెడ్జోన్ ప్రాంతాల్లో ఇంటికే రేషన్
-
పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
పేదలకు తోడుగా సీఎం వైఎస్ జగన్
-
విద్యార్ధులకు ఉచిత దంతవైద్యం
-
కియామోటర్స్పై రాయిటర్స్ కథనం అవాస్తవం
-
మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అద్దె టెండర్లలో గోల్మాల్ కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు. విజయవాడలో రూ.లక్షల్లో అద్దె విజయవాడలో గతంలో లిక్కర్ మార్ట్లు నిర్వహించిన చోట ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. -
2021 నాటికి ‘పోలవరం’ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్ ప్లాన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడింది. ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్ ప్లాన్ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు శనివారం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్కే హల్దార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదికలో ఏం పేర్కొన్నారంటే.. పకడ్బందీ ప్రణాళికతో పనులు - పోలవరం స్పిల్ వేలో 18.48 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు. - స్పిల్ ఛానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. - వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. - 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. - కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. - వచ్చే సీజన్లో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. నిధులు సమకూర్చితే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు .. నవంబర్ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. -
‘బీహార్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చారు’
సాక్షి, అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఏ ఫొటోల ఆధారంగా హైకోర్టు తమ వివరణ కోరిందో అందులో పలు ఫొటోలు మార్ఫింగ్ చేసినవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు సుమోటోగా తీసుకున్న వ్యాజ్యంతో జత చేసి ఉన్న ఫొటోల్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలున్నాయని తెలిపారు. బీహార్లో ఎప్పుడో జరిగిన ఘటన తాలూకు ఫొటోను ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల ఆందోళనతో ముడిపెట్టి మార్ఫింగ్ చేశారని కోర్టుకు వివరించారు. మిగిలిన ఫొటోల్లో చూపిన దానికి, క్షేత్రస్థాయిలో జరిగిన దానికీ చాలా తేడా ఉందని పేర్కొన్నారు. వాస్తవంగా జరిగిన ఘటన తాలూకు అసలు వీడియోలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కోర్టు ముందుంచుతామని తెలిపారు. అంతేకాక అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో తప్ప 2014 నుంచి 144 సెక్షన్ అమలు చేస్తూనే ఉన్నామన్నారు. వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తగిన వ్యవధినివ్వాలని హైకోర్టును శ్రీరామ్ కోరారు. స్పందించిన హైకోర్టు.. విచారణను 20కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు హైకోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చింది. ఏ మహిళను కూడా సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటోల ఆధారంగా సుమోటో వ్యాజ్యం 144 సెక్షన్ విధించడమే కాకుండా, అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని, ఫొటోలను హైకోర్టు తనంతట తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్) పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యానికి సదరు పత్రికలో ప్రచురితమైన ఫొటోలను, ఇతర ఫొటోలను హైకోర్టు జత చేసింది. అలాగే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధింపును సవాలు చేస్తూ పలువురు వేర్వేరుగా 8 పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఓ ప్రాథమిక కౌంటర్ను ధర్మాసనం ముందుంచారు. నిరసనకారులను కొడుతున్నట్లున్న ప్రచురితమైన ఫొటోలు మార్ఫింగ్ చేసినవని వివరించారు. రక్తం కారుతూ ఉన్న ఆ మహిళ ఫొటో బీహార్లోని భాగల్పూర్లో గతంలో జరిగిన ఓ ఘటనలో గాయపడ్డ మహిళ అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2017లో ఘటనలకు సంబంధించి ఫేస్బుక్లో వచ్చిన ఫొటోలను ఇక్కడి అమరావతి ఆందోళనలతో ముడిపెట్టారని తెలిపారు. వాస్తవానికి అటువంటి ఘటనలేవీ ఇక్కడ జరగలేదన్నారు. మార్ఫింగ్ ఫొటోలను ప్రచురించడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. కోర్టు సైతం ఆ ఫొటోల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని, ఘటన పూర్తి క్రమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... నిరసనకారులు సైతం కొంత నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. -
5,000 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాలకు(సబ్ సెంటర్లు) కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 5,000 ఉపకేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఇందులో 90 శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ఈ నేపథ్యంలో 5,000 సబ్సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించాలని, అందులో ఏఎన్ఎంలు, మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో భవనాన్ని రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.1,150 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో సబ్సెంటర్ను 5 సెంట్ల నుంచి 10 సెంట్లలో నిర్మిస్తారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని, మొత్తం 13 ప్యాకేజీలుగా విభజించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే 70 శాతం కేంద్రాలకు స్థలాల సేకరణను పూర్తిచేశారు. కొత్తగా చేపట్టబోయే సబ్సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో అందించే సేవలు - ఇక్కడ 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. - సబ్సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను పరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తారు. - ఆశా వర్కర్ల సాయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యసేవలు అందిస్తారు. - పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు డాక్టర్ల సూచనల మేరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు, విటమిన్ మాత్రలు అందజేస్తారు. - శిశువులు, బాలలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. - క్షయ, కుష్టు వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు ఇస్తారు. - గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తారు. - పల్స్పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. - సబ్సెంటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు పంపిణీ చేస్తారు. -
‘పోలవరం’పై నివేదిక ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిపై ఫొటోలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్ సూట్, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ముప్పు ఉందని ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, ‘రేలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒడిశా తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ కట్పాలియా వాదనలు వినిపించగా.. జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని ‘ప్రాజెక్టు నిర్మాణంపై మీరు స్టే అడుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ‘పనుల నిలిపివేత’ ఉత్తర్వులు అమల్లో ఉండగా.. ఏటా దీనిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తోందని కట్పాలియా నివేదించారు. బచావత్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండాలని, కానీ 50 లక్షల ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం సాగుతోందని, దీనిపైనే తమ అభ్యంతరమని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. పోలవరం నిర్మాణంపై మాకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉంటుందని నివేదించారు. పదే పదే ఎందుకు అభ్యర్థించాల్సి వస్తోంది? ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వైఖరేమిటని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేంద్ర జల సంఘం అనుమతుల మేరకు, బచావత్ అవార్డు ప్రకారమే నిర్మాణం జరుగుతోందని ఖాద్రీ వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ప్రాజెక్టు బచావత్ అవార్డుకు లోబడి ఉన్నప్పుడు పదేపదే స్టాప్ వర్క్ ఆర్డర్ను పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అది పర్యావరణ విభాగానికి చెందినదని ఖాద్రీ వివరించబోగా.. ఒక్కో శాఖకు ఒక్కో న్యాయవాది వస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒడిశా, తెలంగాణ వాదనలపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి’ అని సూచించారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
కోడి పందేల చరిత్రలో ఈ పరిస్థితి ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో కోడిపందేల బరుల వద్దే అనధికారంగా ఏర్పాటుచేసే షాపుల్లో మద్యం ఏరులై పారేది. దీంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి కూడా పెద్దఎత్తున సాగేవి. కానీ, గతానికి కన్నా భిన్నంగా ఈ ఏడాది పందేలు జరిగే ప్రతిచోటా మద్యం అమ్మకాలు, జూదం నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వైర్లెస్ మెసేజ్లు పంపించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వైర్లెస్ కాన్ఫరెన్స్లోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరి ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు, పేకాటలు జరిగితే అక్కడి పోలీసులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పంతం నెగ్గించుకున్న పోలీసులు కోడి పందేల చరిత్రలో తొలిసారిగా పోలీసులు భోగి రోజున ఒక పూట అయినా వాటిని అడ్డుకుని రికార్డు సృష్టించారు. ఏటా పోలీసులు హడావుడి చేయడం.. చివరికి భోగి రోజు ఉదయమే పందేలు మొదలు కావడం ఎప్పుడూ జరిగే తంతే. అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంతమేర వాటిని నిలువరించగలిగారు. భీమవరం, ఎదుర్లంక, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కోడి పందేలు, పేకాట కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అతిథులు పోలీసు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు భీమవరం, తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, గెస్ట్హౌస్లకే పరిమితమయ్యారు. ఆలస్యంగా.. అరకొరగా కోడిపందేలు మరోవైపు.. పోలీసు ఆంక్షల నడుమ తొలిరోజున పందెం కోళ్లు ఆలస్యంగా ఎగిరాయి. కోడి పందేలు జరుగుతాయో లేదోనని భోగి రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే.. పందేలను అడ్డుకుంటామంటూ పోలీసులు బరుల వద్ద పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కోడి పందేల నిర్వాహకులు, కత్తులు కట్టే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడూ ఉండే తంతే అనుకున్న నిర్వాహకులు చివరకు భోగి రోజున కోడి పందేలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆయా బరుల వద్ద పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బరుల వద్ద పందేలు ప్రారంభించుకోవడానికి నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పలేదు. అనుమతి కోసం వారు పడిగాపులు కాసారు. చివరికి మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు అరకొరగానే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజు పందేల రాయుళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీ ఉ.11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉ.10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. హెడ్ వర్క్స్.. ఎడమ కాలువ, కుడి కాలువ, కనెక్టివిటీల(అనుసంధానాలు) పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా అనుకున్న సమయానికి.. అంటే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావిస్తోంది. పోలవరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. ప్రాజెక్టు ఫలాలను 2021 నాటికి రైతులకు అందించాల్సిందేనని జనవరి 7న నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘బిల్ డిస్కౌంట్’ విధానంలో చెల్లింపు ఒక్క పోలవరం ప్రాజెక్టుకే నెలకు సగటున రూ.1,100 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ స్థాయిలో నిధులు సమకూర్చడం కొంత కష్టతరమవుతుంది. అందుకే సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్ డిస్కౌంట్’ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా నిధుల కొరత ఎదురుకాకుండా చూసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో.. కాంట్రాక్టర్లు బీజీ(బ్యాంకు గ్యారంటీ), ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్), పెర్ఫార్మెన్స్ గ్యారంటీ(పీజీ), రిటెన్షన్ అమౌంట్(ఆర్ఏ) రూపంలో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి గ్యారంటీలను సమర్పిస్తారు. ఈ గ్యారంటీలకు సమానమైన నిధులను సంబంధిత బ్యాంకులో కాంట్రాక్టర్లు డిపాజిట్ చేయాలి లేదా అంతే విలువైన ఆస్తులను తనఖా పెట్టాలి. వాటిపై నిబంధనల మేరకు బ్యాంకు సంబంధిత కాంట్రాక్టర్కు వడ్డీ చెల్లిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రతినెలా చేసిన పనుల మేరకు చెల్లించాల్సిన బిల్లులను.. ఆయా కాంట్రాక్టర్లు గ్యారంటీ ఇచ్చిన బ్యాంకులకు ప్రాజెక్టు అధికారులు పంపిస్తారు. వాటిని కాంట్రాక్టర్లకు చెల్లించాలని ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆ మేరకు బ్యాంకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన ఈ సొమ్మును 90 రోజుల్లోగా ప్రభుత్వం రీయింబర్స్ చేయాలి. గడువు దాటితే బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘బిల్ డిస్కౌంట్’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని జలవనరులశాఖ భావిస్తోంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.38,548.87 కోట్లు అవసరం విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. కానీ, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే, ఆ తర్వాత వాటిని కేంద్రం రీయింబర్స్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా దాదాపు రూ.17 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో రూ.3,650 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.38,548.87 కోట్లు అవసరం. -
ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి 2.68 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 2.68 లక్షల క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 60 కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి పరిధిలో రేషన్ సరుకుల సరఫరా కోసం అవసరమైన వాహనాలను వలంటీర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికీ సరుకుల పంపిణీ ప్రక్రియ ఆర్థిక భారంతో కూడుకున్నప్పటికీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వలంటీర్లు తమకు కేటాయించిన రేషన్ కార్డులను మ్యాపింగ్ చేసుకోవాలి. రహదారి సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనుల ఇళ్లకు సైతం వెళ్లి సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అదనంగా అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల లబ్ధిదారులు సబ్సిడీ సరుకులు సక్రమంగా తీసుకునేవారు కాదు. రేషన్ దుకాణాలకు రావడానికి సరైన రహదారులు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రతి నెలా ఒకటి లేదా రెండో తారీఖుల్లో గిరిజనుల ఇళ్ల వద్దే బియ్యంతో పాటు ఇతర సరుకులు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు అమ్మఒడి పథకం ప్రారంభించనున్న సీఎం
-
అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీనిస్తూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది. ఆ ప్రజా సంకల్పయాత్రలో తల్లులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సరిగ్గా అదే రోజున.. నేడు అమ్మఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ‘జగనన్న అమ్మఒడి’ని గురువారం చిత్తూరు నగరంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బడిబయట ఏ ఒక్క చిన్నారి ఉండకూడదనే గొప్ప లక్ష్యంతో.. పిలల్ని బడికి పంపే ప్రతి పేదతల్లికి అమ్మఒడి పథకంలో ఏటా రూ.15 వేల చొప్పున చేయూతనందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి కార్యరూపమిస్తూ.. పిల్లల్ని బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిలో లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎక్కడ చదివించినా పథకం వర్తింపు అమ్మఒడి పథకంలో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు నేరుగా జమచేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. అనంతరం ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ఫరవాలేదని.. పేద పిల్లల చదువుకు ఖర్చుచేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్న మాటల్ని చేతల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా ఆ తల్లికి సాయం అందేలా పథకం అమలు చేస్తున్నారు. జాబితాలో పేరు లేకపోయినా.. అర్హులైతే లబ్ధి జాబితాలో తల్లులు/సంరక్షకుల పేర్లు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఎవరైనా సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందచేయకపోతే.. వారు ఆ పత్రాల్ని గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యాధికారుల దృష్టికి తీసుకెళితే.. వాటిని పరిశీలించి అర్హులైతే లబ్ధిదారులుగా గుర్తిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. నెరవేరుతున్న అమ్మఒడి ప్రయోజనం ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదును జమచేస్తారు. ఈ పథకం అమలుతో బడి బయట పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్థిక సమస్యలతో పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడనుంది. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. ప్రతి స్కూల్లో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం ఉదయం 11.15 గంటలకు చిత్తూరులోని పీవీకేఎస్ గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి సీఎం చేరుకుని విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.45 గంటలకు అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. గురువారం అర్హులైన తల్లులు/సంరక్షకులతో పాటు.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. సీఎం ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి. మాలాంటి వారికి అభయం.. అమ్మఒడి వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఈ ఫోటోలోని మహిళ పేరు వెంకటమ్మ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు స్వగ్రామం.. ఐదేళ్ల క్రితం భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేంది. విధివశాత్తూ 7 నెలల క్రితం కూలికి వెళ్లొస్తూ ప్రమాదానికి గురైంది. కాలు విరగడంతో ఇప్పటికీ నడవలేని పరిస్థితి. ఆమె ఇద్దరు కుమారుల్లో సురేష్ 5 వ తరగతి, భాస్కర్ 4వ తరగతి చదివేవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు బడి మానేసి పనిలో చేరదామనుకుంటున్న తరుణంలో అమ్మఒడి పథకం అభయంగా మారింది. అమ్మఒడి పుణ్యాన వారిద్దరూ ఇప్పుడు స్కూలుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమలాంటి నిరుపేద కుటుంబాల పిల్లల చదువుకు భరోసా అని వెంకటమ్మ ఆనందంతో చెబుతోంది. ఆసరా దొరికింది ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన వక్కలంక బుల్లియ్య, మేరీలు దంపతులు.. మేరీ క్యాన్సర్తో మరణించగా.. బుల్లియ్య అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారిద్దరి పిల్లలు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. ఒకరు స్థానికంగా చదువుతుండగా.. మరొకరు రాజమహేంద్రవరంలోని ఒక స్వచ్ఛంద సంస్థ హాస్టల్లో చదువుతున్నాడు. ఇప్పడు అమ్మఒడి పథకం ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అమ్మఒడి పథకంలో రూ.15వేలు ఆర్థికసాయం రానుండడంతో.. ఇద్దరు పిల్లలను బాగా చదివించేందుకు ఆసరా దొరికిందని అమ్మమ్మ వంగా రాజేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ ఇద్దరు పిల్లలు చదువుకు దూరమవుతారని భయపడ్డానని.. అమ్మఒడి పథకం ఆసరాగా నిలిచిందని ఆమె అంటోంది. -
గొంతు కోస్తోంది!
సాక్షి, గుంటూరు: సంప్రదాయ క్రీడలకు ప్రతీక అయిన సంక్రాంతి సమయంలో ఏటా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. గతంలో గాలిపటాలను ఎగురవేసేందుకు నూలుతో తయారైన దారం (మాంజా) ఉపయోగించేవారు. దీనివల్ల ఎవరికీ.. ఎలాంటి గాయాలయ్యేవి కావు. ఇప్పుడు వీటి స్థానంలో రసాయనాలతో కూడిన చైనా మాంజా వాడకంతో తీవ్ర గాయాల పాలవుతున్న పాదచారులు, వాహన చోదకుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే చైనా మాంజాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించినా మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. కౌశిక్ మృతదేహం (ఫైల్) యథేచ్ఛగా విక్రయాలు చైనా మాంజాలపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తోంది. ఇతర గాలిపటాలను చైనా మాంజాతో సులువుగా తెంపవచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది దీనిపట్ల మొగ్గు చూపుతున్నారు. గాలి పటాలు ఎగిరే సమయంలో ఈ మాంజా విద్యుత్ తీగలు, వృక్షాలకు చిక్కుకుని పక్షులు మృత్యువాత పడుతున్నాయి. వీటి మనుగడకు పెనుముప్పుగా మారిన చైనా మాంజా వినియోగాన్ని పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాలిపటాలను నియంత్రించే క్రమంలో ఒక్కోసారి ఎగురవేసే వ్యక్తులు కూడా గాయాల పాలవుతున్నారు. - గుంటూరులో సోమవారం తండ్రితో కలసి బైక్పై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి కౌశిక్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. - గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో చైనా మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ శర్మ (28) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. - 2018లో చైనా మాంజా కారణంగా గుజరాత్లో 16 మంది మరణించడంతో కైట్ ఫెస్టివల్తో పాటు ఈ మాంజా వాడకాన్ని నిషేధించారు. చట్టం ఏం చెబుతోందంటే.. రసాయనాలు పూసిన చైనా మాంజాతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. 2016 మార్చి 4న ఏపీ ప్రభుత్వం, 2016 జనవరిæ 13న తెలంగాణ సర్కారు వీటి విక్రయాలను నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను అమ్మటం, కొనుగోలు చేయడం నేరం. దీన్ని ఉల్లంఘించే వారికి ఐదేళ్లు, అంతకుమించి జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. చైనా మాంజా తయారీ ఇలా.. దారానికి గాజు పిండి, సగ్గు బియ్యం, గంధకం, రంగులు అద్ది ఉడికించి చైనా మాంజా తయారు చేస్తారు. తమిళనాడులోని ఆరంబాకం, చెన్నైలోని ప్యారిస్, మౌంట్రోడ్డు మొదలైన ప్రాంతాల్లో చైనా మాంజా ఎక్కువగా తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు సరఫరా అవుతుంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట, గుంటూరు నగరంలోని పట్నంబజార్, లాలాపేటలో కూడా చైనా మంజా తయారు చేస్తారు. రాష్ట్రంలోని కర్నూలు చిత్తూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో కుటీర పరిశ్రమగా చైనా మాంజా తయారీ నడుస్తోంది. మనుగడకు ముప్పు చైనా మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు, జంతువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతోంది. చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. నూలు దారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవు –తేజోవంత్, కార్యదర్శి, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రజల్లో చైతన్యం రావాలి ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజాను ఎవరూ వినియోగించకూడదు. జీవోలకే పరిమితం అయిన నిషే«ధాన్ని ప్రభుత్వాలు అమలు చేసి చూపించాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. చైనా మాంజాను స్వచ్ఛందంగా నిరాకరించాలి – గోపాల్ సూరాబత్తుల, వ్యవస్థాపక కార్యదర్శి, యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఇక కఠిన చర్యలు చైనా మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు మృతి చెందడం అందరినీ కలచి వేసింది. చైనా మాంజాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై ఎవరైనా దీన్ని కొనుగోలు చేసినా, అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులను సైతం అప్రమత్తం చేస్తాం. చైనా మాంజా విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం – ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్, కలెక్టర్, గుంటూరు -
ఏపీకి గొప్ప వరం ఆరోగ్యశ్రీ
సాక్షి అమరావతి: ‘పేదలు, సామాన్యులకు ఉచితంగా.. అన్ని వైద్య సేవలు అందించాలంటే గొప్ప సంకల్పం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్పులతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఆ గొప్ప సంకల్పం నాకు కనిపిస్తోంది. అన్ని ఖరీదైన చికిత్సలతో పాటు డెంగీ, మలేరియా వంటి జ్వరాలను ఈ పథకంలో చేర్చడం రాష్ట్ర ప్రజలకు గొప్ప వరంగా భావించాలి. ఇలాంటి పథకం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేందుకు ఆరోగ్యశ్రీ పథకమే ఉదాహరణ’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, యూపీఏ ప్రభుత్వంలో ఆరోగ్య సలహాదారుగా పనిచేసిన డా.కె.శ్రీనాథరెడ్డి.. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా కూడా ఉన్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో మార్పులు చేర్పులపై మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ హెల్త్ కవరేజీ పేరిట అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గొప్ప పథకం. ప్రస్తుత వ్యాధుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే.. ఈ పథకంతో చేకూరే లబ్ధి వల్ల అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులందరికీ చేరువైనట్లే భావించాలి. పకడ్బందీగా అమలు చేస్తే పేదవారి జేబునుంచి ఏమీ ఖర్చు కాదు. ఖరీదైన చికిత్స అవసరమయ్యే వ్యాధులను ఈ పథకంలో చేర్చారు. అంత భారీ వ్యయం చేయడం సాధ్యమేనా? క్యాన్సర్, న్యూరో, గుండెజబ్బులతో పాటు వందలాది జబ్బులు జాబితాలో ఉన్నాయి. వీటికి చాలా వ్యయమవుతుంది. సామాన్యులకు వచ్చే వ్యాధులకు ఉచితంగా వైద్యమందించాలనే దృక్పథంతోనే ఈ జబ్బుల్ని చేర్చారు. భారమైనా ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యమే. ఆరోగ్యశ్రీలో నిబంధనల్ని సరళతరం చేశారు. ఈ మార్పులతో సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? ప్రమాదకర రోగాల చికిత్స కోసం పేదలు డబ్బు ఖర్చు పెట్టలేక మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పథకం అందుబాటులో ఉండి, సకాలంలో వైద్యమందితే లక్షలాది మందికి ప్రాణదానం చేసినట్లే.. రూ.1000 దాటితే రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు. దీని సాధ్యాసాధ్యాల గురించి ఏమంటారు? కచ్చితంగా సాధ్యమే. 2,059 జబ్బుల పరిధిలో బిల్లు రూ. వెయ్యి దాటితే చికిత్స అందిస్తున్నారు. ఇందులో 170 వరకూ డే కేర్ జబ్బుల్ని చేర్చారు. మొదట కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే మిగతా జిల్లాల్లో అమలు చేసే సమయానికి అంతా సర్దుకుంటుంది. డెంగీ, మలేరియా వంటి జ్వరాలనూ పథకం పరిధిలో చేర్చారు. ఈ కొత్త సౌలభ్యం సామాన్యులకు ఎంతవరకూ ఉపయోగపడుతుంది.? ఇటీవలి డెంగీ వంటి జ్వరాలు సోకినప్పుడు సామాన్యులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్లెట్స్ కోసం బాగా ఖర్చవుతుంది. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల వల్ల కూడా వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. పైగా ఇలా జ్వరాల బారిన పడుతున్న వారు వేలల్లో ఉంటారు. కొన్ని జ్వరాలను ఈ పథకంలో చేర్చడం వల్ల అలాంటి వారికి లబ్ధి చేకూరుతుంది. మీరు ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య బీమా పథకాలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీపై ఒక ప్రముఖ వైద్యుడిగా మీ అభిప్రాయం? సామాన్యులకు వైద్యబీమా కల్పించి అమలు చేయడంలో దేశంలో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలను. నాకు తెలిసినంత వరకూ మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి వైద్యబీమా పథకాన్ని చూడలేదు. నిధుల వ్యయం ఒక్కటే కాదు, అమలు చేయాలంటే ప్రభుత్వాలకు గొప్ప సంకల్పం ఉండాలి. రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయం చేయడంపై మీ అభిప్రాయం? నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇలా ఆర్థిక సాయం చేయడం చూడలేదు. కుటుంబ ప్రధాన పోషకుడు జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోజుకు రూ.225 ఇవ్వడమంటే సాహసోపేత నిర్ణయం. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది కాదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడం ఎంత వరకూ ప్రయోజనకరం? కొన్ని చికిత్సలకు కొన్ని ప్రాంతాల్లో వైద్యం చేసే అవకాశం ఉండకపోవచ్చు. రోగులకు న్యాయం జరగాలంటే ఎక్కడ వైద్యం ఉంటుందో అక్కడ చేయించాలి. ఏపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వైద్యానికి అనుమతించడం గొప్ప పరిణామం. -
రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని, ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు కలిగిస్తున్న అపోహలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం విజయవాడలో కన్నా ఆవిష్కరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఎటువంటి జోక్యం చేసుకోదని, ఇది బీజేపీ తరఫున అధికారికంగా చేస్తున్న ప్రకటన అని జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ‘నేనూ దానికి తేడాగా చెప్పడం లేదు కదా?’ అని కన్నా ప్రశ్నించారు. మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందన్నారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. -
నివాస స్థలాలను స్వయంగా పరిశీలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నివాస స్థలాల పంపిణీ కోసం ప్రతిపాదించిన ప్రతి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టు మనం ఇళ్ల స్థలాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన భూముల్లో కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, సరిహద్దుల నిర్ధారణ పనులను వచ్చే వారంలో చేపట్టాలని సూచించారు. తాము పంపిన నమూనాలో భూముల సమాచారాన్ని సోమవారం సాయంత్రంలోగా వాట్సాప్ నంబరు 9013133636కు గానీ, మెయిల్కు గానీ పంపించాలని పేర్కొన్నారు. దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం ‘‘ఇళ్ల పట్టాలు పొందిన వారు ఆ స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ కన్వెయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తర్వాత వీటిపై విక్రయ హక్కులు కూడా కల్పిస్తోంది’’ అని ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న నివాస స్థలాల పంపిణీ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు సైతం మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాశ్ పంపిన సర్క్యులర్లోని ముఖ్యమైన అంశాలు.. - కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/సబ్ కలెక్టర్లు/ ఆర్డీఓలు వెళ్లి పరిశీలించనిదే ఆయా భూములు నివాస స్థలాలకు పనికొస్తాయా? లేదా అన్నది నిర్ధారించలేరు. కాబట్టి నివాస స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదించే ప్రతి భూమిని ఉన్నతాధికారులు తప్పకుండా పరిశీలించాలి. - నివాస స్థలాలకు ప్రతిపాదించే భూములకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కచ్చితంగా వచ్చే వారంలో అమలు చేయాలి. ప్రతి మండలంలో క్రమబద్ధంగా భూముల జాబితాను రూపొందించాలి. విభాగాల వారీగా భూముల జాబితాను రూపొందిస్తేనే ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని, పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ విభాగాలకు సంబంధించిన భూములన్నింటినీ నివాస స్థలాల కోసం వినియోగించుకుంటాం. విభాగాల వారీగా భూముల జాబితా ఎలా ఉండాలంటే... - సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీళ్ల కమిషనర్ వద్ద పెండింగ్లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్లో ఉన్న వివాదాస్పద భూములు - వివిధ ప్రభుత్వ విభాగాల అధీనంలో ఉన్న వినియోగించని భూములు - ఇతరత్రా ప్రభుత్వ భూములు -
చదువుకు భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈమె పేరు ఎం. స్వాతి. భర్త.. నాయుడు. వీరికి ఒక పాప, ఒక బాబు. కూలి పని ఉంటే ఆదాయం, లేకపోతే పస్తులు అన్నట్లుగా సాగే వీరికి పిల్లలను ప్రైవేటు–కార్పొరేట్ స్కూళ్లలో చదివించడం భారంగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కొద్దిపాటి ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉన్నా నోటు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామగ్రి కొనుగోలు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న అమ్మ ఒడి పథకం వీరికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రాష్ట్రంలోని లక్షలాది నిరుపేద తల్లులకు కొండంత అండగా నిలుస్తోంది. పేద పిల్లల చదువులపై భరోసా కల్పిస్తోంది. పిల్లల చదువులపై ఆందోళనతో ఉన్న మాతృమూర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తోంది. దీంతో ప్రతి పేద తల్లి తన పిల్లలను పనికి కాకుండా బడికి పంపి వారికి బంగారు భవిత కల్పించేందుకు అడుగులు వేస్తోంది. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా.. దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హురాలైన ప్రతి తల్లికీ ఈ పథకం వర్తించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా.. ‘నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను’ అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. నవరత్నాలలోని మరో కీలక హామీ ‘అమ్మ ఒడి’ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. దీనివల్ల డ్రాపౌట్లు తగ్గడంతోపాటు పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు అభివృద్ధి సాధించగలుగుతాయన్నది పథకం లక్ష్యం. రూ.6,455.80 కోట్లు మంజూరు ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6455.80 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో ఇప్పటివరకూ 42,80,823 మంది తల్లులను సర్కారు గుర్తించింది. ఒకొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయనుంది. మలివిడత పరిశీలన కొనసాగుతున్నందున ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 43 లక్షల మందికి పైగా తల్లులకు దీని ద్వారా మేలు చేకూరనుంది. ఈ పథకం ద్వారా 81,72,224 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు అమలుచేయాలని ముందు భావించినా తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకూ ప్రభుత్వం వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. అన్ని ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. 1 నుంచి 10 వరకు 72,77,387 మంది, ఇంటర్మీడియట్లో 8,94,837 మంది విద్యార్ధులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో.. సర్కారు అందిస్తున్న సాయంతో పేద తల్లులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జగనన్నకు రుణపడి ఉంటాం నాకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నాను. సీఎం జగనన్న పెట్టిన అమ్మ ఒడి పథకం మాలాంటి వారికి ఎంతో అండగా నిలుస్తుంది. ఆ పథకం సాయంతో మా పిల్లలను బాగా చదివించుకుంటాను. వారి మంచి భవిష్యత్తుకు ఈ పథకం ఓ మంచి మార్గం. జగనన్నకు మేం రుణపడి ఉంటాం. – సుహాసిని, గంగులయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం, వైఎస్సార్ జిల్లా పిల్లల ఫీజులకు ఇక బెంగ ఉండదు నా పేరు ఆదిమూలం సుజాత. నాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. కుమారుడు ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి. అమ్మ ఒడి ద్వారా జగనన్న ఇచ్చే రూ.15 వేలతో పిల్లోడి ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. ఆ భారం ఇక మాపై ఉండదు. వాడి చదువు గురించి డబ్బు బెంగ నాకు ఉండదు. – ఆదిమూలం సుజాత, శివాలపల్లె, చెన్నూరు మండలం, వైఎస్సార్ జిల్లా అమ్మఒడి ఎంతో ధైర్యాన్నిచ్చింది చదువుకోవాలనే కోరిక ఉన్నా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులవల్ల చదువుకు దూరమయ్యాం. మా అమ్మాయికి ఆ పరిస్థితి రాకుండా భార్యాభర్తలిద్దరం కష్టపడుతున్నాం. మాలాంటోళ్లకు జగనన్న అమ్మ ఒడి పథకం ఎంతో ధైర్యాన్నిచ్చింది. ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. దీంతో అమ్మాయిని బాగా చదివించుకుంటాం. – వాగు సుప్రియ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా పిల్లల చదువులకు ఊతం పేదరికం వల్ల మాకు చదువులంటే తెలియదు. మా బిడ్డలనైనా బాగా చదివించుకోవాలనే తపన ఉంది. కానీ, ఆర్థిక స్థోమతలేక అవస్థలు పడుతున్నాం. భార్యాభర్తలిద్దరం రైతుబజార్లో కూరగాయాలు అమ్ముతుంటాం. జగనన్న ప్రవేశపెడుతున్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల సాయం మాకు ఎంతో ఊతమిస్తోంది. – ఒడుగు నారాయణమ్మ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా ‘అమ్మఒడి’ మాలాంటి వారికి వరం నా భర్త కాటూరి లక్ష్మణరావు. మాకు ఇద్దరు మగపిల్లలు. నేను, నా భర్త కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివించుకోడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా ఇచ్చినా ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోయి కావు. ఏడాది క్రితం మా ఆయన మాకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లలను చదువు మాన్పిద్దామనుకున్నా. అమ్మ ఒడి పథకంతో ధైర్యం వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నా. – కాటూరి నాగమణి, కొండెవరం శివారు జోగిరాజుపేట, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా ఎంతో భారం తగ్గించినట్లయింది నా భర్త నాని. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. చదువులేకే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మాలా మా పిల్లలు కావొద్దు. పెద్ద చదువులు చదివించాలన్న ఆశ ఉంది. కానీ, అంత ఆదాయం మాకు లేదనేదే ఆవేదన వెంటాడుతోంది. ఈ తరుణంలో అమ్మఒడి పథకం మాకు ఎంతో భారాన్ని తగ్గించినట్లయ్యింది. – ద్రాక్షారపు చిన్నారి, వాకతిప్ప, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా కొండంత ధైర్యం ఇచ్చింది నా భర్త గురుమూర్తి అనారోగ్యంతో మరణించాడు. నా కుమార్తెలు సౌమ్య ఒకటో తరగతి, అంజలి రెండో తరగతి చదువుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లల్ని చదివించడం కష్టంగా మారుతోంది. జగనన్న అమ్మ ఒడి పథకంతో నా పిల్లలిద్దర్నీ చదివించుకోవడానికి వీలుపడింది. ఎటువంటి ఆధారంలేని నాకు ఈ పథకం కొండంత ధైర్యమిచ్చింది. – సీర నాగమణి, గోకర్ణాపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా నా భర్త ముద్దుక్రిష్ణ ఇటీవల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలతో జీవితం కష్టంగా మారింది. పెద్ద కుమారుడు మూడో తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు వాసుదేవ్ అంగన్వాడీ కేంద్రంలో చేర్చా. ఎటువంటి ఆధారంలేని నేను జగనన్న అమ్మ ఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నా. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా. – రుషవ విమల, కంచిలి, శ్రీకాకుళం జిల్లా పిల్లల చదువులకు వెసులుబాటు నా భర్త నాగరాజు దూర ప్రాంతంలో కూలిపనులు చేస్తూ పంపే డబ్బులతోనే కుటుంబం నెట్టుకొస్తున్నా. మాకు ముగ్గురు పిల్లలు. కంచిలి పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకం వంట పనిచేస్తున్నాను. ఇద్దరు పిల్లలు 5, 6 తరగతులు చదువుతున్నారు. కుటుంబం పోషణ కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అమ్మ ఒడి పథకంతో పిల్లల చదువులకు కొంత వెసులుబాటు కలుగుతుంది. – బంగారు లక్ష్మి, కంచిలి, శ్రీకాకుళం జిల్లా అమ్మ ఒడితో కష్టాలు గట్టెక్కొచ్చు ఇంట్లో అందరూ పనిచేస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, డ్రెస్లు ఉచితంగా ఇస్తున్నా ఇతర ఖర్చులు భరించలేక పోతున్నాం. అందుకే పిల్లలు పై తరగతులకు వచ్చేసరికి బడిమాన్పించాల్సి వస్తోంది. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకంతో ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. – గూడుపు లక్ష్మి, విజయనగరం పిల్లల్ని నిశ్చింతగా చదివించుకోవచ్చు మా ఆయన ఆటోడ్రైవర్. అందరం ఏదో ఒక పనిచేస్తున్నాం. మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. పై క్లాసులకు వచ్చిన మా పిల్లని ఈ ఏడాది చదువు మాన్పించాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేస్తోందని తెలిసి ధైర్యం వచ్చింది. ఇక నిశ్చంతగా పిల్లల్ని చదవించుకోవచ్చన్న భరోసా కలిగింది. – కప్పరెడ్డి సంతోషి,. విజయనగరం కంటోన్మెంట్ -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
-
తగ్గిన మందు.. చిందు!
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. గతేడాది కొత్త సంవత్సర సంబరాలతో పోలిస్తే ఈదఫా 72,243 మద్యం కేసులు తక్కువగా అమ్ముడు కావడం గమనార్హం. గతేడాది 2,05,087 మద్యం కేసులు విక్రయించగా ఈసారి 1,32,844 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక బీర్ల వినియోగం సైతం అమాంతం తగ్గింది. గత ఏడాది వేడుకల్లో 1,45,519 బీరు కేసుల వినియోగం జరగ్గా ఈసారి వేడుకల్లో కేవలం 50,995 బీరు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది కంటే 94,524 బీరు కేసుల వినియోగం తగ్గింది. సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు ఇక విక్రయాల విషయానికొస్తే గతేడాది నూతన సంవత్సర వేడుకల్లో రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగ్గా ఈదఫా రూ.105 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అమ్మకాలు రూ.15 కోట్లు మాత్రమే తగ్గగా వినియోగం భారీగా తగ్గడం గమనార్హం. మద్యం ధరలను పెంచడంతో రూ.105 కోట్ల అమ్మకాలు కనిపిస్తున్నా వినియోగంలో మాత్రం వ్యత్యాసం ఉండటంతో దశలవారీ మద్య నిషేధానికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అవగతమవుతోంది. ప్రజారోగ్యానికే పెద్దపీట మద్యం అమ్మకాల్ని సాధారణ రోజుల్లో ఎలా చేపడుతున్నారో ఈసారి డిసెంబరు 31న కూడా అదే విధానాన్ని అమలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి 1 గంట వరకు విక్రయాలు నిర్వహించి మందుబాబులతో పూటుగా తాగించి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా డిసెంబరు 31, జనవరి 1న రెండు రోజుల్లో కలిపి రూ.200 కోట్ల మద్యం ఆదాయం రాగా ఇప్పుడు 2 రోజుల్లోనూ రూ.125 కోట్లు దాటకపోవడం గమనార్హం. ఈసారి జనవరి 1న రూ.19.78 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రజలంతా కుటుంబాలతో కలసి కొత్త ఏడాది రోజు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్యాన్ని దూరం చేసింది. కృష్ణాలో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం కొత్త ఏడాది సందర్భంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయించగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా విక్రయాలు నమోదయ్యాయి. కృష్ణాలో రూ.17.42 కోట్ల విలువైన మద్యం తాగగా కర్నూలులో అత్యల్పంగా రూ.3.12 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇక వినియోగం పరంగా చూస్తే గత ఏడాది వేడుకల్లో కృష్ణా జిల్లాలో 21,213 కేసుల మద్యం, 13,012 కేసుల బీరు అమ్ముడు కాగా ఈదఫా 19,553 కేసుల మద్యం, 5,824 కేసులు మాత్రమే బీరు వినియోగం నమోదైంది. -
నేటి అర్ధరాత్రికల్లా.. ‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు బుధవారం అర్ధరాత్రికల్లా ఖరారు కానున్నాయి. పంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున మొత్తం 59.85 శాతం స్థానాలను ఆయా సామాజికవర్గాలకు రిజర్వ్ చేస్తూ వారం రోజుల క్రితం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జిల్లా, మండలాల వారీగా సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులతో పాటు ఎంపీపీ పదవులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై జిల్లాలో సోమవారం నుంచే కసరత్తు మొదలైంది. రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచి ఎన్నికల కన్నా ముందు పార్టీ గుర్తు ప్రతిపాదికన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆసక్తిగా ఉండడంతో పంచాయతీరాజ్ శాఖాధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టారు. రిజర్వుడ్ స్థానాలను ఏ ప్రతిపాదికన ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాల్లో కలెక్టరు కార్యాలయ సిబ్బందితోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ రెండు రోజులుగా రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారీగా బుధవారంకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులంటున్నారు. 3న హైకోర్టుకు అందజేత ఇదిలా ఉంటే.. రిజర్వేషన్ల వివరాలను జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అందజేయనుంది. అన్ని జిల్లాల్లోనూ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ బుధవారం పూర్తికాగానే గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం హైకోర్టుకు సమర్పిస్తారు. ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీలు కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే పెద్దఎత్తున కొత్త పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, కొన్ని పంచాయతీలను విలీనం కూడా చేసింది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఒక్కరోజే 66 వేర్వేరు ఉత్తర్వులను జారీచేశారు. -
సజావుగా పోలవరం
పోలవరం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం సవాలే. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటే ఇంకా రూ.30 వేల కోట్లు అవసరం. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదిస్తాం. ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,850 కోట్లు తక్షణమే విడుదలవుతాయి. మిగతా బకాయిలు విడుదల చేసేలా కేంద్రానికి నివేదిక ఇస్తాం. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లపై ఇప్పటికే సీడబ్ల్యూసీ టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) ఆమోదముద్ర వేసింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ కూడా ఆమోదముద్ర వేయగానే ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. – కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హల్దార్ సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉంది. ప్రస్తుతం పనులన్నీ ప్రణాళిక మేరకు సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే ఆ గడువులోగా పోలవరం ఫలాలను రైతులకు అందించవచ్చు’’ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సీజన్లో కాఫర్ డ్యామ్లు, స్పిల్ వే, పునరావాస పనులను సమన్వయంతో చేపట్టాలని కమిటీ జలవనరుల శాఖకు సూచించింది. పెండింగ్లో ఉన్న 9 డిజైన్లపై చర్చించేందుకు వారంలోగా ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి సమగ్ర వివరాలతో హాజరైతే ఆమోదించేలా చూస్తామని తెలిపింది. పోలవరం ఎడమ కాలువ, హెడ్ వర్క్స్ను రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం కుడి కాలువను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. పనుల పూర్తికి ప్రణాళిక.. పోలవరాన్ని 2021లోగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర నిపుణుల కమిటీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ స్పందిస్తూ కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉందని ప్రశంసించారు. కాఫర్ డ్యామ్లలో వరదను దిగువకు వదలడానికి ఉంచిన ఖాళీ ప్రదేశాలను అలాగే ఉంచి.. మిగిలిన పనులు (ఎగువ కాఫర్ డ్యామ్ 42 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ 30 మీటర్లు) పూర్తి చేయాలని సూచించారు. స్పిల్వేలో 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉందని, 48 గేట్లను బిగించాల్సి ఉందన్నారు. ఈ పనులను మే నాటికి పూర్తి చేసి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించగలిగితే అప్పుడు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. అప్పుడు వరదను స్పిల్వే మీదుగా మళ్లించి ఈసీఆర్ఎఫ్ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చన్నారు. హెడ్వర్క్స్ను పూర్తి చేసి జలాశయంలో నీటిని నిల్వ చేసినా కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాలు(కనెక్టివిటీస్) పూర్తి చేయకపోతే ఫలితం ఉండదన్నారు. ఎడమ కాలువ అనుసంధానం పనుల్లో 18 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం పనులు మూడు దశల్లో చేస్తుండటం వల్ల కొంత జాప్యం చోటుచేసుకుంటోందని సీఈ సుధాకర్ బాబు వివరించారు. పునరావాసమే పెద్ద సవాల్.. పోలవరంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలో 1.05 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయని నిపుణుల కమిటీకి అధికారులు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 18,620 నిర్వాసిత కుటుంబాలకుగానూ 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని, మే నాటికి మిగతా 14,698 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా వేగంగా చర్యలు చేపట్టామని, నిధుల కొరత లేకుండా చూస్తే పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్ హల్దార్ ఏకీభవిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి పోలవరం పనులు పూర్తి చేయవచ్చని, ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు నివేదిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆర్కే పచౌరి, ఎస్ఎల్ గుప్తా, రంగారెడ్డి, బీపీ పాండే, డీపీ భార్గవ, భూపేందర్సింగ్, నాగేంద్రకుమార్, దేవేంద్రకుమార్, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
-
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విభజన చట్టం ప్రకారం కేంద్రసాయంతో నిర్మించాల్సిన దుగరాజపట్నంలో పోర్టుకు లాభదాయకత లేదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, రామాయపట్నంలో నాన్మేజర్పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చాలంటూ ఇప్పటికీ తాము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమన్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు పోలవరం ప్రాజెక్ట్పై వెచ్చించిన వ్యయం రీయింబర్స్మెంట్ విషయంలో రూ.3,222.75 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయని, వాటిని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని సోమవారం ప్రశ్నోత్తరాల్లో వి.విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించడానికి ముందు చేసిన రూ.5 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ జరుపుతోందని, ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశం ప్రస్తుతానికి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు జలశక్తి మంత్రి రతన్లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. 31.03.2014 నాటికి అయిన వ్యయం రూ.5,135.87కు సంబంధించి ఆడిట్ నివేదికలు సమర్పించాలని 2018 జూలై, 2019 మే, 2019 జూలై నెలల్లో అడిగామన్నారు. ఇప్పటి వరకు రూ.3,777.44 కోట్ల మేర ఆడిటింగ్ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మధ్యంతర చర్యగా రూ.1,850 కోట్ల మేర ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు ఈ శాఖకు అనుమతి ఇచ్చిందని వివరించారు. కాగా, 26.11.2019న ఆర్థిక శాఖ ఒక లేఖ రాసిందని, దీని ప్రకారం గతంలో ఇచ్చిన షరతుల (ఆడిట్ నివేదిక సమర్పణ)ను సంతృప్తి పరచనంతవరకు తదుపరి నిధుల విడుదల ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఏపీ మొత్తం అప్పులు రూ.3.41 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,41,270 కోట్లుగా ఉందని, 2018–19 సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,06,010 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తెలంగాణ అప్పులు 2018–19 చివరినాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ.1.44 లక్షల కోట్లుగా ఉందని, 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.68 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. -
ఏపీలో మాత్రమే కేజీ రూ. 25
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కేజీ ఉల్లి రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నానా యాగీ చేస్తున్న సందర్భంలో సీఎం స్పందించి మాట్లాడారు. ఇప్పటి వరకు 36,536 క్వింటాళ్ల ఉల్లిపాయలు కొనుగోలు చేసి ప్రతి రైతు బజారులోనూ కేజీ రూ.25 చొప్పున అమ్ముతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకనందున, ఎక్కడ దొరికినా కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. షోలాపూర్, ఆల్వార్ లాంటి చోట్ల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. ‘ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోంది. మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్కువ ధరకు అమ్ముతున్నాం’ అని వివరించారు. హెరిటేజ్లో కిలో రూ.200 చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లి రూ.200 చొప్పున అమ్ముతున్నారని సీఎం జగన్ విమర్శించారు. వీళ్లేమో (టీడీపీ) ఇక్కడకు వచ్చి.. పేపర్లు (ప్లకార్డు) పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని, అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘దేశంలో సంచలనాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు.. వాళ్లకు భద్రత ఎలా పెంచాలన్న అంశంపైనా చర్చ జరగాలి’ అని సీఎం అన్నారు. -
21రోజుల్లో మరణ శిక్ష
నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరూ ఆడపిల్లలే. నాకూ చెల్లెలు ఉంది. భార్య ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎలా స్పందించాలి? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఏరకమైన శిక్షపడితే బాధిత మహిళకు, ఆ కుటుంబానికి ఉపశమనం కలుగుతుందని మనమంతా ఆలోచించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సోమవారం మహిళలు, చిన్నారుల భద్రతపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ హ్యాండెడ్గా ఆధారాలు ఉంటే 21 పనిదినాల్లో ఉరి శిక్ష పడేలా మహిళలు, చిన్నారుల భద్రతపై బుధవారం శాసనసభలో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘దిశ’ లాంటి ఘటనల్లో ఎలా స్పందించాలి? ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ పరిస్థితులను మార్చాలని తపన పడుతూ.. ప్రస్తుతం ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయడానికి సూచనలు, సలహాలు అడుగుతున్నా. హైదరాబాద్లో దిశ ఘటన పట్ల సమాజం అంతా సిగ్గుతో తలవంచుకోవాలి. 26 ఏళ్ల మహిళా డాక్టర్ను టోల్ గేట్కు సమీపంలో రేప్ చేసి, కాల్చేసిన ఘటన మనకళ్ల ముందు కనిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పడు రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? అని ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపించింది. మన రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరిగితే మన పోలీసులు ఎలా స్పందించాలి? మనం ఎలా స్పందించాలన్న దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దిశ ఘటన టీవీల్లో చూసినప్పుడు, విన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన తర్వాత అందుకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. మన చట్టాల్లో మార్పు రావాల్సిందే ‘దిశ’ ఘటనలో తప్పు జరిగిందని మీడియా విస్తృతంగా చూపించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హేట్సాఫ్ టు కేసీఆర్, తెలంగాణ పోలీసు ఆఫీసర్స్.. అని ఈ చట్టసభ సాక్షిగా చెబుతున్నాం. సినిమాల్లో హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే.. అందరం చప్పట్లు కొడతాం. సినిమా బాగుందని చెబుతాం. కానీ నిజ జీవితంలో దమ్మున్న వాళ్లు ఎవరైనా చేస్తే.. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుతో ఢిల్లీ నుంచి వస్తారు. ఇది తప్పు.. ఇలా జరక్కూడదు.. ఇలా ఎందుకు చేశారు? అని నిలదీసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన చట్టాలు ఉన్నాయి. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష లేదు ఢిల్లీలో ఒక ఘటన జరిగితే.. ఇలాంటి ఘటన మున్ముందు జరగకూడదని నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చాం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్షలు పడాలని కోరుకున్నాం. 4 నెలల్లో తీర్పు నివ్వాలి, 4 నెలల్లో శిక్ష వేయాలని ఈ చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఉపశమనం కలిగేలా చట్టం రావాలని తల్లిదండ్రులు, ప్రతి మహిళ, చెల్లి, ప్రతి ఇంట్లోని ఆడపల్లి ఎదురు చూస్తోంది. ఈ దిశగానే మన రాష్ట్రం కూడా ఆలోచిస్తోంది. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. దీనికోసం చట్టాలు మరింత గట్టిగా బలపడాలి. ఒక నేరం జరిగినప్పుడు, రెడ్ హ్యాండెడ్గా నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు.. దిశలాంటి కేసుల్లో నేరాన్ని నిర్ధారించే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను ఏం చేయాలన్నదానిపై మనం చట్ట సభలో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు జరిగితే కొన్ని దేశాల్లో అయితే దోషులు కనిపిస్తే కాల్చేస్తారు. మన దేశంలో చట్టాలను సవరించి, అంగీకార యోగ్యమైన పద్ధతిలో బలమైన చట్టాలను తీసుకురావాలి. వారంలో విచారణ పూర్తి కావాలి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు అలాంటి కేసులు వారం రోజుల్లోపు విచారణ పూర్తి కావాలి. ఆ తర్వాత డీఎన్ఎ రిపోర్టుల్లాంటివి పూర్తి కావాలి. మూడు వారాలు అంటే 21 పని రోజుల్లో దోషులకు ఉరిశిక్షపడే పరిస్థితి రావాలి. మరణ శిక్ష ఉంటుందనే భయం ఉంటేనే తప్ప వ్యవస్థలో మార్పులు రావు. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో, మహిళలపై నేరాలకు సంబంధించి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును పెట్టాల్సి ఉంటుంది. సోషల్ మీడియాను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పక్షపాత ధోరణితో వేరే వ్యక్తుల మీద బురద చల్లడానికి మనస్సాక్షి అనేది లేకుండా దిగజారిపోయారు. సోషల్ మీడియాలో మహిళలను రక్షించే ప్రయత్నం చేయాలి. మహిళల గురించి నెగెటివ్గా ఎవరైనా పోస్టింగ్ చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అది ఉంటే తప్ప ఇలాంటివి ఆగిపోవు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని అడుగులు వేస్తున్నాం. 354 (ఇ)ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చింది. ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కేసు నమోదు చేస్తున్నాం. అందుకే పర్మిట్ రూమ్లను రద్దు చేశాం మనిషి మద్యం తాగినప్పుడు ఇంగితం కోల్పోతాడు. ఇలాంటి వారు మరో నలుగురు కలిస్తే ఆలోచనలు మారతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే పర్మిట్ రూములు అన్నింటినీ రద్దు చేశాం. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామని గర్వంగా చెబుతున్నాం. స్మార్ట్ ఫోన్ల కారణంగా పోర్నోగ్రఫీ కూడా విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఎన్ని నిషేధాలు ఉన్నా దీన్ని కట్టడి చేయలేని పరిస్థితి. పోర్నోసైట్లను బ్లాక్ చేసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటన్నింటిపైనా ఈ బుధవారం ఈ అసెంబ్లీలో విప్లవాత్మక బిల్లును తీసుకొస్తాం. చట్టం రూపకల్పనకు సలహాలు అడిగితే విమర్శలా? మహిళల భద్రత కోసం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది.. శాంతిభద్రతలు లేకుండా పోయాయని విమర్శలు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. చంద్రబాబు పాలనలో మహిళలపై జరిగిన నేరాలను ఒకసారి చూద్దాం. ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలే ఈ లెక్కలు. ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తాం : చంద్రబాబు మహళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాన్ని సమర్థిస్తామని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి తక్షణం శిక్ష పడితే భయం ఉంటుందన్నారు. చట్టానికి సంబంధించి సలహాలు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. -
మహిళల భద్రతకు సరికొత్త చట్టం
సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విప్లవాత్మక చట్టాలు గత బడ్జెట్ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ.. మరోమారు ఆ తరహాలో మరికొన్ని చట్టాలను రూపొందించడానికి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ, మండలి సమావేశాల్లో పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. ఈ చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించాక సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సోమవారం మహిళల భద్రతపై చర్చను ఉభయ సభల్లో చేపట్టనున్నారు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత ఆరు నెలల పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించడాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం, ఇచ్చిన మాట కన్నా ముందుగా, మెరుగ్గా వైఎస్సార్ రైతు భరోసా అమలు, నవరత్నాల్లోని ఇతర పథకాలు, కార్యక్రమాల అమలుపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానితో పాటు అజెండా అంశాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ‘అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్–2019’ను తేనుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రజా రవాణా శాఖ (ప్రభుత్వ) ఉద్యోగులు కానున్నారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మందికి ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. చిరు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రత్యేక బోర్డులు - ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉంది. ఇకపై వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా చట్టాలను చేయనున్నారు. - చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చట్టాలు చేయనున్నారు. - పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల అనంతరం విక్రయించడానికి వీలు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. - నూతన బార్ల విధానం, సగానికి పైగా మద్యం షాపుల తగ్గింపు, 40 శాతం మేర బార్ల సంఖ్య తగ్గింపునకు సంబంధిత చట్టాల్లో సవరణలు చేయనున్నారు. - అడ్వకేట్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు - రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు – ప్రభుత్వ చర్యలు - గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు – కొత్తగా శాశ్వత ఉద్యోగాల కల్పన - వ్యవసాయ రంగం – రైతు భరోసా, మద్దతు ధర - మద్య నియంత్రణ విధానం – ప్రభుత్వ చర్యలు - ఆంగ్ల విద్య ఆవశ్యకత – అమ్మ ఒడి, నాడు–నేడు - విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు - అగ్రిగోల్డ్ బాధితులు – ప్రభుత్వ చర్యలు - సంక్షేమ పథకాలు – ప్రభుత్వ చర్యలు - స్పందన కార్యక్రమం – అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన - రాజధాని – గత ప్రభుత్వ చర్యలు – అప్పులు - విద్యుత్ పీపీఏలు – ప్రభుత్వ చర్యలు - పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు – వాటర్ గ్రిడ్స్ – రివర్స్ టెండరింగ్ - విభజన హామీలు - పెట్టుబడులు – భూ కేటాయింపులు - గృహ నిర్మాణం – ఇళ్ల స్థలాల పంపిణీ - శాంతి భద్రతలు – ప్రభుత్వ చర్యలు -
గ్రాంట్ల రూపంలో రూ.2,19,695 కోట్లు కావాలి
సాక్షి, అమరావతి: విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది. గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నిధుల అవసరానికి సంబంధించి కొంత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. గత ప్రభుత్వం భారీగా పెండింగ్ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
బార్ల లైసెన్స్ దరఖాస్తుకు 9 వరకు గడువు
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బార్ల లైసెన్సులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. స్పందన లేకపోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించి 487 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో మళ్లీ ఒక రోజు గడువు పెంచి సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 301 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలు ఉండగా, అసలు 45 మున్సిపాలిటీల్లోని బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ రెండో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ జారీ చేశారు. మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ దశల వారీగా మద్య నిషేధం వైపు అడుగులు వేయడం వల్లే దరఖాస్తులు రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రొటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధు
సాక్షి, అమరావతి: డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్డీగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. పీవీ సింధుకు 2018 డిసెంబర్ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధును డిప్యూటీ కలెక్టర్గా గత ప్రభుత్వం నియమించింది. -
పకడ్బందీగా సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పాఠ్యాంశాల రూపకల్పనపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలు, ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చర్యలు చేపట్టింది. పాఠ్యాంశాలపై రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలివే.. – ఎస్సీఈఆర్టీ అధికారుల బృందం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమ ప్రణాళికలు, పాఠ్యాంశాలను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర విద్యార్థులకు అవసరమైన రీతిలో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో 180 మంది నిపుణులు విద్యావేత్తలు పాల్గొంటున్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో అనుభవమున్న నిపుణులు, ప్రొఫెసర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఢిల్లీ, మద్రాస్, అంబేడ్కర్, అన్నా, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (ఆర్ఐఈ)– బెంగళూరు, నవోదయ విద్యాలయ సంఘటన్తోపాటు పలు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ల ప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు. – యూకే, యూఎస్ఏ, సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తెప్పించి ఇక్కడి నిపుణులతో ప్రభుత్వం పరిశీలింపచేస్తోంది. అక్కడి మంచి అంశాలను కూడా చొప్పించి రాష్ట్ర సిలబస్ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా అనుగుణంగా ఉండేలా పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారు. పిల్లల చదువులపై దృష్టిపెట్టలేని నిరుపేదలు, కూలి చేసుకుని జీవించే కుటుంబాల్లోని విద్యార్థులకు అనువైన రీతిలో వీటిని సిద్ధం చేస్తున్నారు. – తెలుగు సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నతంగా ఉండేలా మార్పులు చేపట్టారు. 1 నుంచి 6వ తరగతి వరకు 68 మంది ప్రముఖ కవులు, కథకుల రచనల్లోని అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మాండలికాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారు. కథలు, కవితలు, సంభాషణలు, పద్యాలు.. ఇలా తెలుగుకు సంబంధించి అన్ని అంశాలపై విద్యార్థులకు మరింత శ్రద్ధ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. దేశీ, విదేశీ కలబోతతో సిలబస్ ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ దేశీ, విదేశీ కలబోతతో సిలబస్ను రూపొందిస్తున్నాం. ఎవరైనా సిలబస్ను మార్చాలనుకుంటే మన రాష్ట్రం వైపు చూసేలా చర్యలు చేపడుతున్నాం. యూకే, చైనా, సింగపూర్, శ్రీలంక, అమెరికా పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయిస్తున్నాం. అక్కడి మంచి విధానాలను తీసుకుంటాం. మన పిల్లలు వెనుకపడకుండా, అదే సమయంలో హైస్టాండర్డ్స్ లేకుండా సిలబస్ను సరళీకరిస్తున్నాం. -
భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. రాష్ట్రానికి షోలాపూర్ ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్ మార్కెట్కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది. -
రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రూ.450 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రహదారులు (స్టేట్ హైవేస్), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్)పై అన్ని రకాల మరమ్మతులకు కలిపి రూ.625 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రూ.450 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో రాష్ట్ర రహదారులకు రూ.250 కోట్ల, జిల్లా ప్రధాన రహదారులకు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదార్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో స్టేట్ హైవేస్ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్ ఉండే పాలకొల్లు–పూలపల్లి, నర్సాపూర్–అశ్వారావుపేట, బూర్గంపాడు–అశ్వారావుపేట, మార్టేరు–ప్రక్కిలంక రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. తూర్పుగోదావరిలో సోమేశ్వరం–రాజానగరం, కాట్రేనికోన–చల్లపల్లి, కరప–చింతపల్లి, రాజమండ్రి–చినకొండేపూడి తదితర రహదార్లను వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధుల్ని ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతులకు, ట్రాఫిక్, జనసాంద్రత ఎక్కువగా ఉండే రహదారులపై గుంతల్ని సరిజేయడానికి నిధుల్ని ఖర్చు చేయనున్నారు. కాగా గతంలో చేసిన జాతీయ రహదార్ల మరమ్మతుల పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నాయి. వీటికోసం రూ.27 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.293 కోట్ల వరకు పెండింగ్ బిల్లులుండగా క్లియర్ చేసేందుకు ఆర్ అండ్ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రహదార్ల రెన్యువల్కు రూ.700 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ కాంట్రాక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు అనుమతులొచ్చాయి. సాధారణంగా ప్రతి ఏడాది రహదార్లను రెన్యువల్ (దెబ్బతిన్న మేర కొత్తగా లేయర్ వేయడం) చేస్తారు. -
విద్యాభివృద్ధికి ఉన్నత ప్రణాళిక
సాక్షి, అమరావతి: కేంద్రం అందచేసే నిధులను అందిపుచ్చుకుని ఉన్నత విద్యాభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 2023–24 వరకు ఉన్నత విద్యాభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం జగన్ సూచనల మేరకు ఉన్నత విద్యామండలి సన్నద్ధమైంది. ‘ఎక్విప్’ (ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) ద్వారా వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.1,72,490 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందులో కేంద్రం వాటా రూ.1,34,564 కోట్లు కాగా రాష్ట్రాలు రూ.37,926 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ తరపున రూ.7,600 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర నిధులను గరిష్టంగా సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 16 లక్షల మందికి అవకాశం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల చేరికల శాతాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం 8,000 ‘సమ్రాస్’ (సమ్రాస్ అంటే ఐక్యతా భావనతో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హాస్టళ్లు అని అర్థం) హాస్టళ్లను వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. 16 లక్షల మందికి వీటిల్లో అవకాశం కల్పిస్తుంది. ఒకొక్కరికి ఏడాదికి రూ.30 వేల చొప్పున స్కాలర్షిప్ అందించనుంది. బ్రిడ్జి కోర్సులు, ఆన్లైన్ దూరవిద్య కోర్సులకు సంబంధించి కేంద్రం రూ.600 కోట్లు వెచ్చించనుండడంతో రాష్ట్రంలో 250 ఆన్లైన్ దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వృత్తి విద్య కళాశాలల కోసం కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 20 కాలేజీలను నెలకొల్పాలని నిర్ణయించారు. అత్యుత్తమ బోధనాభ్యసన ప్రక్రియలు బోధనాభ్యసన ప్రక్రియలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.36,429.5 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. పాఠ్య ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ, జాతీయ విద్యా సంస్థల మెంటార్షిప్ సమగ్ర మూల్యాంకన విధానాల రూపకల్పన కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.1,822 కోట్లను రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాలతో కార్యాచరణ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర నిధులు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు, పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాం. యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ద్వారా ఈ కార్యక్రమాలను త్వరలోనే చేపడతాం’ – హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) కీలక ప్రతిపాదనలు ఇవీ - అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించే విద్యాసంస్థలకు కేంద్రం రూ. 2,500 కోట్లు చొప్పున ఇవ్వనుంది. - ఇన్స్టిట్యూట్స్ ఎమినెన్స్ కింద 15 సంస్థలకు రూ.1,000 కోట్ల చొప్పున ఇవ్వనుండగా రాష్ట్రంలో ఒక యూనివర్సిటీని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. - గ్లోబల్ ర్యాంకులు సాధించిన 6 ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు రూ.500 కోట్ల చొప్పున కేంద్రం అందించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీలను ప్రతిపాదించనున్నారు. - జాతీయ ర్యాంకులు సాధించిన 15 సంస్థలకు రూ.250 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. దీనికోసం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. - ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలకు కేంద్రం రూ.12,390 కోట్లను కేటాయిస్తుండడంతో రూ.329 కోట్లు రాష్ట్రానికి రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిద్వారా రాష్ట్రంలోని 500 కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, వృత్తివిద్యా సంస్కరణలు, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు అమలు చేయనున్నారు.