gudivada
-
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
-
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామా మొదలుపెట్టింది. తులసి బాబుకి టీడీపీతో సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీలో ఇన్నాళ్లు ఉన్నా తమకు సంబంధం లేదంటూ టీడీపీ ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కేసులో టీడీపీ నేత తులసిబాబు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకి బినామిగా ఉన్న నిందితుడు తులసిబాబు.. నారా లోకేష్తోనూ గతంలో ఫోటోలు దిగాడు. గుడివాడలో కలెక్టర్ ఇతర అధికారులతోనూ తులసిబాబు సమీక్షలు చేశారు. టీడీపీకి ఇప్పుడు సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ వింత ప్రకటన చేశారు. గుడివాడ టీడీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన తులసిబాబు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి వ్యవహారాలు చక్కపెట్టారు.ఇదీ చదవండి: నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా! -
గుడివాడ గురుకుల పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించిన ప్రిన్సిపాల్
-
పోలీసుల సమక్షంలోనే పేర్ని నానిపై దాడి
-
పేర్ని నాని లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణుల వీరంగం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో రవికిరణ్కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఖండించారు. -
గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య రచ్చ
-
దాతల భాగస్వామ్యం కావాలి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనే భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు. 2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభంవచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. -
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
-
కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు
-
గుడివాడలో దుమ్మురేపుతున్న కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-
గుడివాడ సిద్ధం సభలో సీఎం జగన్పై మరో దాడికి కుట్ర
కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం. – అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ -
దద్దరిల్లిన గుడివాడ..
-
ఒక రాయి వేసినంతమాత్రాన మీ జగన్ అదరడు.. బెదరడు
-
గుడివాడ సభకు ఓ రేంజ్లో పోటెత్తిన జనం..
-
అదరను.. బెదరను.. సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరిగిందన్న ఏపీ సీఎం జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నా సంకల్పం చెదరదు: సీఎం జగన్
మీ బిడ్డ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపుని ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే.. వాళ్లు ఓటమిని అంగీకరించారని అర్థం. – గుడివాడ సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బెదిరే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో నిలవడం చేతకాని వారు ఎన్ని మాటలు మాట్లాడినా లెక్క చేయబోనన్నారు. 15వరోజు బస్సుయాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా గుడివాడ శివారు నాగవరప్పాడులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క జగన్పై.. పదిమంది కుట్రదారుల దాడి గుడివాడలో ఈరోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది జన సముద్రం. మే 13న జరగనున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజా సముద్రం ఇది. పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి.. కొనసాగించేందుకు.. ఇంటింటి అభివృద్ధి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? పేదలకు మంచి చేస్తూ 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కేందుకు, మరో వంద మందితో నొక్కించేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారానికి మీరంతా సిద్ధమేనా? రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే మీ సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. ప్రజలకు మంచి చేశానన్న ధైర్యంతో నిలబడ్డ మీ ఒక్క జగన్పై మోసాలే అలవాటుగా పెట్టుకున్న పదిమంది కుట్రదారులు దాడి చేస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ బెదరడు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీజేపీ, కాంగ్రెస్.. కుటిల పద్మవ్యూహంతో ఒక్కటై మీ జగన్ మీద బాణాలు సంధిస్తున్నాయి. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీ సేవకుడిగా ఉన్న మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. అయినా సరే మీ బిడ్డ అదరడు, బెదరడు. కారణం.. ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడి మీద ఓ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఆ దుష్టచతుష్టయం, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే దాని అర్థం.. విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారనే. తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. దేవుడు... పెద్ద స్క్రిప్టు రాశాడు నా నుదిట మీద వారు చేసిన గాయం కన్నుపై, తలపై తగలలేదంటే దాని అర్థం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాశాడనే! నా నుదిట మీద వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలను పేదలు ఎన్నడూ మరిచిపోయే పరిస్థితి ఉండదు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం. మంచి చేయకూడదన్నదే బాబు ఫిలాసఫీ ఈ కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసఫీని ఒక్కసారి చూస్తే పేద ప్రజలకు ఎలాంటి మంచి చేయకూడదన్నదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబు ఎలాంటి వారో ఆయన నైజం చూస్తే అందరికీ తెలుస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నదీ, తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నదీ ఈ బాబే. కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వొద్దని, ఎన్టీఆర్ను దింపేసి రూ.5.25కి పెంచేసిందీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నదీ ఈ బాబే. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్నదీ, ప్రభుత్వ పాఠశాలలను పాడు పెట్టిందీ ఈ బాబే. పేదల ఇళ్లకు అడ్డుపడిందెవరు? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అడ్డుపడి కులాలు, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసింది చంద్రబాబు కాదా? సీఎంగా ఉంటూ బీసీలను, ఎస్సీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? ఈ బాబే కదా! విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు?.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అన్నది ఎవరు? ఈ బాబే. ఆ హోదాను తాకట్టు పెట్టిందీ ఈ బాబే. మానవత్వం, మంచితనం లేదు.. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్ పిల్లనిచ్చి చేరదీస్తే చెప్పులు వేయించి వెన్నుపోటు పొడిచింది బాబు కాదా? మళ్లీ అవసరమైతే ఎన్టీఆర్ ఫొటో బయటకు తీసి దండలు వేస్తాడు. ఇంత నీచమైన వ్యక్తి బాబే. ఆ మనిషికి మానవత్వం, మంచితనం లేదు. దొంగ వాగ్దానాలు, మోసం, కుట్రలు, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదే చంద్రబాబుకు తెలిసిన నీతి. చేపలకు కొంగను కాపలా పెట్టినట్లే చంద్రబాబును నమ్మడం అంటే చెరువులో చేపలకు కొంగను కాపలా పెట్డడం లాంటిదే. దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే. పులి నోట్లో తల పెట్టడమే. మరి మీ జగన్ను చూడండి. ఈ 58 నెలల కాలంలో మీరిచ్చిన అధికారంతో, దేవుడి ఆశీస్సులతో గ్రామగ్రామాన, ఇంటింటా జగన్ తెచ్చిన మార్పులు ఏమిటో మీరే చూడండి. ప్రతి గ్రామంలో ఏడు వ్యవస్థలు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా ఏకంగా ఏడు వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్లు, మహిళా పోలీసులు, కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామంలోనూ మీ బిడ్డ మార్కు కనిపిస్తోంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి? జన్మభూమి కమిటీలు, పచ్చ పాముల అవినీతి కాట్లు, లంచాల గాట్లు. అదే మీ బిడ్డ మార్కు చూస్తే అవినీతి, వివక్ష లేకుండా నేరుగా మీ చేతికే అందించే సేవలు కనిపిస్తాయి. ఈ తేడాను గమనించాలి. పౌర సేవల్లో మనం తెచ్చిన విప్లవాత్మక మార్పులను చూడండి. దేశ చరిత్రలో అవ్వాతాతలకు రూ.3,000 చొప్పున ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంటి వద్దకే రేషన్తోపాటు జనన, కుల ధృవీకరణ పత్రాలతో సహా 600 రకాల సేవలు ప్రతి గడపకూ అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో వలంటీర్ వ్యవస్థ మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను గతంలో ఎన్నడైనా చూశారా? కేవలం ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు చేసిందేమిటంటే జన్మభూమి కమిటీలను తెచ్చి గ్రామాన్ని, రాష్ట్రాన్ని దోచేశాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేశాడు. రైతన్నకు చెప్పినవి ప్రతీ ఒక్కటీ చేశా. రైతన్నలకు తొలిసారిగా పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. పగటి పూట ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా, ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్, అమూల్తో సహకార రంగాన్ని పటిష్టం చేసింది ఎవరంటే మీ బిడ్డ, మీ జగనే. రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చిందెవరంటే అది కూడా మీ జగనే. వందేళ్ల తర్వాత 30 లక్షల ఎకరాల భూములను సర్వే చేసి సర్వ హక్కులు కల్పించింది కూడా మీ జగనే. మనం తెచ్చిన మార్పులు చూసి.. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా రైతన్నలకు మంచి చేయకపోగా చెడు చేసిన చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఈ 58 నెలల్లో మనం చేసిన పనులు, పథకాలను చూస్తే కడుపు రగిలిపోకుండా ఉంటుందా? విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చి విద్యార్థులను, తల్లితండ్రులను ప్రోత్సహించాం. అమ్మఒడి, విద్యాకానుక, నాడు – నేడు, గోరుముద్ద, డిజిటల్ బోధన, ట్యాబ్లు, పెద్ద చదువులకు ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్ అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెనతోపాటు మూడో తరగతి నుంచే టోఫెల్ను సైతం ప్రవేశపెట్టాం. మన విద్యార్థులు ఇక్కడ నుంచే ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాల్లో చదువుకునేలా సరికొత్త విధానాలు మీ బిడ్డ పాలనలోనే అమలు జరుగుతున్నాయి. చదువుల విప్లవంతో బాబుకు కడుపు మంట మన విద్యారంగంలో ఇన్ని విప్లవాలు కళ్లెదుటే కనిపిస్తుంటే చంద్రబాబుకు కడుపు మండదా? చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే నారాయణ, చైతన్య కోసం బలి పెట్టిన చదువులు గుర్తుకొస్తాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి. ఇక వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని వెయ్యి నుంచి మూడు వేల ప్రొసీజర్లకు విస్తరించడంతో పాటు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. ఆరోగ్య ఆసరాతో ఉపాధి భృతి కూడా మీ బిడ్డ పాలనలోనే అందుతోంది. మారిన మన గ్రామాలు... మొట్ట మొదటిసారిగా మన గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, అరోగ్య సురక్ష, నాడు – నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారాయి. ఏకంగా 54 వేల కొత్త నియామకాలు ప్రభుత్వ వైద్య రంగంలో చేపట్టాం. ప్రభుత్వ రంగంలో మరో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? చేసింది ఎవరు? మీ బిడ్డ పాలనలోనే కదా! మరి చంద్రబాబు కడుపు మండదా? వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్కు ఎక్కడుంది? ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలి. గతంలో ఏం చెప్పారు? ఆ తరువాత చేసిందేమిటనేది తెలియచెప్పాలి. బాబు మోసాల చిట్టా ఇదిగో 2014లోకూడా చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి రంగురంగుల హామీలిచ్చారు. దత్త పుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించారు. ఆ విఫల హామీల్లో ప్రధానమైనవి ఒక్కసారి పరిశీలిస్తే.. ► రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. మరి రూ.14,205 కోట్ల రుణాలలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చి ఒక్కరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల్లో నెలకు రూ.రెండు వేలు చొప్పున ఒక్కో ఇంటికి రూ.1,20,000 ఎవరికైనా ఇచ్చాడా? పక్కా ఇల్లు ఇస్తానన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఎక్కడైనా చేశాడా మరి? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్ని మించి అభివృద్ధి చేసి ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుడివాడలో కనిపిస్తోందా? ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ కొత్త హామీలతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు. మహిళా సాధికారత.. అక్కచెల్లెమ్మల సాధికారతకు చంద్రబాబు ఓ విలన్. వాగ్దానాలతో వంచించడంలో ఆయనకున్న అనుభవం ఇంకెవరికీ లేదు. అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచాడు. అదే మీ బిడ్డ ట్రాక్ రికార్డు చూస్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, 30 లక్షల ఇళ్ల పట్టాలు కనిపిస్తాయి. పిల్లల పెద్ద చదువులకు విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్. కల్యాణ మస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచి చదువులను ప్రోత్సహిస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాం. నామినేటెడ్ పనులు, పదవుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ జగనే. మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం. ప్రతి ఇంటికి మంచి చేసి, మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడాలంటూ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి కళ్లల్లో కళ్లు పెట్టి చూసి నిజాయితీగా ఈ వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాడు. ప్రజలందరికీ మంచి చేసిన మన జెండా తలెత్తుకుని సగర్వంగా ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కిందపడుతోంది. మీ ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు సీఎంగా ఉంటే మన జీవితాల్లో వెలుగులు విరబూస్తాయన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని స్టార్ క్యాంపైనర్లు ఇంటింటికీ వివరించాలి. ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు.. స్వయం ఉపాధితో పేదల జీవితాలు బాగుపడతాయని విశ్వసించి ఎన్నడూలేని విధంగా చేదోడు, వాహన మిత్ర, మత్స్యకార భరోసా లాంటివి తీసుకొచ్చాం. ఇలా ఏది చూసినా మీ జగనే. లా నేస్తం చూసినా గుర్తుకొచ్చేది మీ జగనే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఇవాళ నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉద్యోగాల్లో, నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. నాలుగు సీ పోర్టుల ఏర్పాటుతోపాటు 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్ పోర్టుల విస్తరణ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టింది మీ జగనే. తొలిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలిచి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అండగా నిలబడింది మీ జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం వరుసగా ఏటా నంబర్వన్గా నిలిచామంటే కారణం మీ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. అందరి అవసరాలు తీర్చారు కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే ‘నిన్న జరగాల్సిన సిద్ధం సభ ఒక రోజు ఆలస్యమైనా సీఎం జగన్ను దీవించేందుకు మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉంది. ఐదేళ్ల పాలనలో స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరి అవసరాలను జగనన్న ప్రభుత్వం తీర్చింది. దళారులకు తావులేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది నిరుపేదల ప్రాణాలను వైఎస్సార్ కాపాడితే సీఎం జగన్ ఆ దారిలో మరో నాలుగు అడుగులు ముందుకేసి సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే ఎంతోమంది అనారోగ్య బాధితులు ఒక్కసారి సీఎం జగన్కు కలిస్తే ఎంత ఖర్చయినా పరిష్కారం లభిస్తుందన్న భరోసాతో కనిపించారు. ఒక వ్యక్తిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకం ఇదీ. వైఎస్ జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు మాయా కూటమి కట్టాడు. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు. దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ను పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలకు తెగించారు. భౌతికంగా తొలగించాలనే కుట్రతో శనివారం రాత్రి విజయవాడలో సీఎంపై దాడికి పురిగొల్పారు. వైఎస్ జగన్ ఎప్పుడూ చెబుతున్నట్లుగానే ఆ దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నుదిటి మీద బలమైన దెబ్బ తగిలినా కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో 50 రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా చేపడతారు. సీఎం జగన్ చెప్పిన మాటపై నిలబడతారు. ఓట్లు కోసం, పదవుల కోసం ఆయనతో ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పించలేం. ఐదేళ్లుగా ఆయన్ను చాలా దగ్గర నుంచి చూశాం. జగన్ కథ తేలుస్తానంటున్న చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఈ జన్మలో ఆయనకు అది సాధ్యం కాదు. ప్రజలంతా అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలి. పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు తన మీద ఒక రాయి విసిరినంత మాత్రాన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన గాయాలను పేదలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. ‘మీ బిడ్డ వైఎస్ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే విజయానికి మనం అత్యంత చేరువగా.. వాళ్లు చాలా దూరంగా ఉన్నారని అర్థం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘నా నుదిటి మీద వాళ్లు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ.. పేదలకు చంద్రబాబు చేసిన గాయాలను వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. గాయపర్చడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం చంద్రబాబు నైజమైతే.. మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పడానికి గర్వపడుతున్నా’ అంటూ సీఎం జగన్ మరో ట్వీట్ చేశారు. –సాక్షి, అమరావతి. -
‘ప్రజల ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం ఇది’
గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో స్కూల్కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తూ వచ్చారని, అందుకే సీఎం జగన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ రోజు(సోమవారం) గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన కొడాలి నాని.. మనందరి నమ్మకం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. ముందుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం జగన్కు స్వాగతం అంటూ కొడాలి నాని ప్రసంగం కొనసాగించారు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడింది అయినా కూడా ఇంత ఘనంగా సీఎం జగన్ దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరందరూ రావడం ఆనందంగా ఉంది ఐదేళ్లపాటు స్కూల్ వెళ్లేటువంటి పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్రెడ్డి. అదేవిధంగా స్కూల్ పిల్లలకు వాళ్లకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి సీఎం జగన్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయనకు కనుక చూపించినట్లైతే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్ మెంట్ జరుగుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలనే ఉద్దేశ్యంతో, అంత నమ్మకం పెట్టుకుని చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న నమ్మకం. అదేవిధంగా సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక కూటమి కట్టాడు మాయా కూటమి. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు, అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్త పుత్రుడ్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక చవటల్లాగా, దద్దమ్మల్లాగా వెనుక నుంచి జగన్ మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడ నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో మొన్న అర్థరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. అన్నా మీరు నమ్మే ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకు జరగలేదు, ఒక అంగుళం కిందకు జరగలేదు. మీకు బలమైనటువంటి నుదటిమీద తగిలినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం మీకు ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూశాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండన్నా అని బ్రతిమాలినా కూడా ఆయనతో అబద్ధం చెప్పించలేం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర్రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వ్యక్తి వైఎస్ జగన్. జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులను ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగైనటువంటి, 420 అయినటువంటి, ఛీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా.. జగన్మోహన్రెడ్డి నీ కథ తేలుస్తానని అంటున్నాడు చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్ అంతు తేల్చాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి సీఎం జగన్ను అందరూ దీవించాలని, మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడ్ని, శాసన సభ్యుడ్ని గెలిపించి.. జగనన్నకు మేమంతా ఉన్నాం.. మీ వెనుకే ఉన్నాం అనే మెసెజ్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాను. -
పెల్లుబికిన అభిమానం.. కదం తొక్కిన జనం (ఫోటోలు)
-
నా నుదుటి మీద ఉన్న గాయం 10 రోజులకు నయం అయిపోతుంది కానీ..!
-
ఇక్కడ ఉన్నది మీ జగన్ రాయితో దాడి చేస్తే మీ బిడ్డ అదరడు బెదరడు
-
గాయాన్ని మరచి జనం లోకి జగన్
-
ఇలాంటి దాడులతో నా సంకల్పం చెదరదు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ఎన్నికల సంగ్రామంలో తనపై చంద్రబాబు, బీజేపీ, దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని అన్నారు. వైఎస్ జగన్పై ఒకరాయి వేసినంత మాత్రన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ స్థాయికి వారు దిగజారారు అంటే మనం(వైఎస్సార్సీపీ) విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థమన్నారు. వీళ్ల కుట్రలకు మీ బిడ్డ అదరడు, బెదరడని..ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మంగళవారం కృష్ణా జిల్లాలో సాగుతోంది. గుడివాడ సమీపంలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గుడివాడలో మహా సముద్రం కనిపిస్తుందన్నారు. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇదని తెలిపారు. ఇంటింటి అభివృద్ధి కోసం 130సార్లు బటన్ నొక్కామన్న సీఎం జగన్..2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు. పేదల భవిష్యతు కోసం, పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్దమా? అని ప్రశ్నించారు. ఒక్క జగన్పై ఎంతమంది దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారని అన్నారు. అబద్దాలు, కుట్రలు, మోసాలతో ప్రతిపక్ష నేతలంతా ఒక్కటయ్యారు. సీఎం జగన్ కామెంట్స్ నా నుదుటి మీద వారు చేసిన గాయం. నా సంకల్పాన్ని మరింత పెంచింది. ఆ దేవుడు నాస్క్రిప్ట్ పెద్దగా రాశారు. పేదలకు ఏ మంచీ చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు ఫిలాసఫీ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొదన్ని చంద్రబాబు అన్నారు కిలో బియ్యం 2 రూ ఇవ్వొద్దని ఎన్టీఆర్ను గద్దె దింపింది చంద్రబాబే. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబే ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అన్నది చంద్రబాబే . ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి. అతనిపై చెప్పులు వేయించింది చంద్రబాబే ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది. దోచుకోవడం, దోచుకున్నది దాడుకోవడం ఇదీ చంద్రబాబుకు తెలిసిన నీతి. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు 3 వేల పెన్షన్ ఇస్తున్నాం. ఇంటి వద్దకే రేషన్ , 600 రకాల సేవలు ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా అందిస్తున్నాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీగ్రామంలో మనం ఏర్పాటు చేసిన 7 వ్యవస్థలు కనిపిస్తాయి. ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలనుదోచుకున్నారు. చంద్రబాబు మార్కు అంటే పచ్చ పాముల కాటు 58 నెలల్లో అనేక రంగాల్లో విప్లవాలు తీసుకొచ్చాం నాడు-నేడు ద్వారా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో 25 లక్షల మేర ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. ఆపరేషన్ అయ్యాక విశ్రాంతి సమయంలోనూ ఆదుకుంటున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం. చంద్రబాబు పేరు చెబితే శిథిమైన బడులు గుర్తుకొస్తాయి. మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది. వసతిదీవెన, విద్యా దీవెన, టోఫెల్ శిక్షణ అందిస్తున్నాం. 54 వేల నియామకాలు చేపట్టాం. 58 నెలల కాలంలో చదువుల విప్లవం తీసుకొచ్చాం. జగనన్న చేదోడు, వాహనమిత్ర అంటే మీ జగన్. లా నేస్తం అంటే మీ జగన్. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 80 శాతం ఉద్యోగాలు, బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చాం. 13 జిల్లాలను 25 జిలాలుచేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ముగ్గురి ఫొటోలతో ఉన్న హీమీల పత్రాలను ఇంటింటికి పంపారు. ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా? నా నుదుటిపై చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది. పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు మానవు మోసం చేయడం బాబు నైజం.. మంచి చేయడం మీ బిడ్డ నైజం -
నేరుగా ఎదుర్కోలేక చవట దద్దమ్మ..రఫ్ఫాడించిన కొడాలి నాని
-
జగన్ రియల్ హీరో..గుడివాడలో జనప్రభంజనం
-
జన సంద్రమైన గుడివాడ
-
Watch Live: గుడివాడలో మేమంతా సిద్ధం సభ
-
గుడివాడలో ఓటు బ్యాంకు గురించి కొడాలి నాని
-
కొడాలి నాని కి బ్రహ్మరథం పడుతున్న గుడివాడ ప్రజలు
-
జూన్ 4 తర్వాత బాబును తలుచుకునే వారెవరూ ఉండరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు. గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్ననని తెలిపారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా...గాడిద గుడ్డు.. అంటూ చంద్రబాబు సొల్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ‘నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్. చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలి. టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని...పూటకో వ్యక్తిని తెచ్చే బతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: Memantha Siddham Day-1: మేమంతా సిద్ధం డే-1 అప్డేట్స్ -
చంద్రబాబుపై కొడాలి నాని స్ట్రాంగ్ సెటైర్
-
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
-
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
సాక్షి, కృష్ణా: సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ‘మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు.. పవన్.. సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్. 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ...సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు. ఇలాంటి సైకోలందరూ కలిసి సీఎం జగన్ను వేధిస్తున్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా.. కరోనా ఇబ్బందులు వచ్చినా. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు’ అని కొడాలి నాని అన్నారు. -
గుడివాడలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు సుత్తి స్పీచ్..
-
చంద్రబాబు.. నువ్వెంత నీచుడివో చెబుతూనే ఉంటా : కొడాలి నాని
సాక్షి, గుడివాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం గుడివాడలో జరిగిన చంద్రబాబు సభపై నాని మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు టీడీపీ వర్దంతి సభ నిర్వహించడానికి గుడివాడ వచ్చాడు. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశాడు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 275 ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం మేం ఏర్పాటు చేశాం. చంద్రబాబుకు ఇదే నా సవాల్. చంద్రబాబు మగాడైతే నా సవాల్ స్వీకరించాలి. పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించాడా. నిరూపిస్తే గుడివాడలో పోటీ నుంచి తప్పుకుంటా. నేను గంజాయి మొక్కని కాదు. గుడివాడ ముద్దు బిడ్డని. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క. చంద్రబాబు సభకు 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. చంద్రబాబువి 420 మాటలు. గుడివాడలో టిడ్కో ఇళ్లు కట్టించింది మేమే. టీడీపీ హయాంలో కేవలం 1200 ఇళ్లకు పునాదులు మాత్రమే వేశారు. జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదా. చంద్రబాబు ఎందుకు పుట్టాడో తెలియదు చంద్రబాబువన్నీ అబద్దాలే. చంద్రబాబు ఎన్టీఆర్నే గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీఆర్ మంచివాడైతే చంద్రబాబు ఎన్టీఆర్ను ఎందుకు తొలగించారు. చంద్రబాబు ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్లో కాదా. చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేడు. తిరుపతి బస్టాండ్లో జేబులు కొట్టే వెదవలకు నేను భయపడను. చంద్రబాబు ఎంత నీచుడో అందరికీ చెప్తా. చావనైనా చస్తాను కానీ చంద్రబాబు ఉడత ఊపులకు బెదరను మరదల్ని చంపిన 420 చంద్రబాబు. మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చంద్రబాబు చెప్పాలి. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు. చంద్రబాబుకు ఏ కోటాలో పదవి వచ్చింది...నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడం కోసం పిచ్చిబాలయ్యను ఉసిగొల్పారు’అని చంద్రబాబుపై నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
గుడివాడలో చంద్రబాబు మీటింగ్.. కొడాలి నాని రియాక్షన్
-
గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది. కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
గుడివాడలో హై అలెర్ట్
-
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది. -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
గుడివాడ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: కొడాలి నాని
-
పదేళ్లు పార్టీ జెండా మోస్తే పవన్ నట్టేట ముంచాడు
-
గుడివాడలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వంశీలను చంపుతానన్న లోకేష్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావుపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం. దమ్ముంటే తండ్రీకొడుకులు గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి. టీడీపీ సైకోలందరినీ పెట్టుకుని సభలో చెలరేగారు.’’ అని గుడివాడ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. కాగా, నారా లోకేష్కి పోలీసులు షాకిచ్చారు. నిన్న(మంగళవారం) సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: లోకేష్కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు. -
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ
సాక్షి, కృష్ణా జిల్లా: తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని పేర్కొన్నారు. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులున్నారని, తనకు చిరంజీవికి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు. 60 శాతం మంది చిరంజీవి అభిమానులే గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను మెగాస్టార్ను విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనన్నారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని పేర్కొన్నారు. అభిమానుల ముసుగులో టీడీపీ కుట్రలు సీఎం జగన్ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని మండిపడ్డారు. ‘ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం. చిరంజీవిని విమర్శించినట్లు ఎలా అవుతుంది? తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పాను. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా?...ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది’ అని కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి -
గుడివాడ అసెంబ్లీ సీటు నాదే... వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘గుడివాడ అసెంబ్లీ సీటు నాదే. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా. ఇదే విషయాన్ని సార్కు నా మాటగా స్పష్టంగా చెప్పండి’ అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పేయడంతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు. తాము అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి అన్నరీతిలో పరిస్థితులు తల్లకిందులు అవుతుండటంతో చంద్రబాబు దీర్ఘాలోచనల్లో పడినట్లు తెలిసింది. కింకర్తవ్యం... తాత్కాలిక మౌనమే శ్రేయస్కరమనే ముఖ్యుల అభిప్రాయాలను అంగీకరించిన ఆయన గుడివాడలో కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపేయాలని, మళ్లీ చెప్పేవరకు అటువైపు వెళ్లవద్దని వెనిగండ్ల రాముకు సూచించారనేది సమాచారం. తానిక హైదరాబాద్కు పరిమితమవ్వాలా లేక అమెరికాకు పయనమవ్వాలా అనే మీమాంసలో ఉన్న రాము ఆఖరు ప్రయత్నంగా తనను ప్రోత్సహిస్తున్న లోకే‹Ùను కలిసి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో సోమవారం ఒంగోలుకు వెళ్లారు. పార్టీ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... సుమారు నెల రోజులుగా గుడివాడ టికెట్ అంశంపై టీడీపీలో అంతర్గత చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)పై బలమైన అభ్యరి్థని రంగంలోకి దింపి ఎలాగైనా జెండా ఎగరేయాలనే యోచనతో ప్రవాసాంధ్రుడైన వెనిగండ్లను కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేష్ లు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా లోకేష్ ఆశీస్సులే రాముకు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. తగ్గేదేలేదన్న రావి మాజీ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడాలని, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు పురమాయించడంతో మూడు వారాల కిందట అచ్చెన్నాయుడు రావిని విజయవాడకు ఆహ్వానించారు. బాబు అభిప్రాయాలను రావి వద్ద ప్రస్తావించడం.. అందుకు ససేమిరా అనడంతో పాటు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి ఈమారు తగ్గేదేలేదన్నారనేది సమాచారం. ‘డబ్బుల కట్టలతో వచ్చిన వారికి టికెట్ ఇచ్చేస్తాం. వారు పోటీచేస్తారు. మీరు పక్కకు తప్పుకోండి. ఇంకేదైనా పదవి ఇస్తామంటే కుదరదు’ గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈ పర్యాయం అంగీకరించేది లేదు. ఖర్చు పెట్టుకోలేరు అంటున్నారు. నా స్థాయిలో నేను ఖర్చుకు సిద్ధం. తక్కినది పార్టీ భరించాల్సిందే. ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలను కొనసాగించింది ఎవరు? ఇవన్నీ పార్టీ నాయకత్వానికి తెలియదా? అని నిలదీయడంతో కంగుతినడం పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడి వంతైందని పారీ్టవర్గాలు అంటున్నాయి. తన అభిప్రాయాలన్నింటినీ అధినేతకు స్పష్టంగా వివరించాలనడంతో అచ్చెన్నాయుడు అదే చేశారనేది సమాచారం. మరో ప్రయత్నంగా రెండు వారాల కిందట మాజీమంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు అయిన కొల్లు రవీంద్రను గుడివాడలోని రావి వద్దకు అధిష్టానం రాయబారానికి పంపింది. అచ్చెన్నాయుడు వద్ద కన్నా ఇంకాస్త ఘాటుగానే స్వరం పెంచడంతో కొల్లు వెళ్లి రావి వైనాన్ని బాబుకు వివరించారని తెలిసింది. వెనిగండ్లనే కావాలంటే.. మీరే చేసుకోండి గుడివాడ నుంచి వెనిగండ్లనే పోటీ చేయించాలనుకుంటే ఎన్నికలు కూడా మీరే చేసుకోండని, తాము దూరంగా ఉంటామని అధిష్టానానికి నియోజకవర్గంలోని పలువురు మండల ముఖ్య నాయకులు తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారితో పార్టీ మండల అధ్యక్షులు కూడా శ్రుతి కలపడం అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేసినట్లయ్యింది. రావికి దన్నుగా... విజయవాడ లోక్సభ స్థానంతో పాటు ఉమ్మడి కృష్ణాలోని పలు నియోజకవర్గాల సీనియర్లకు టికెట్ ఉంటుందో, ఊడుతుందో అంతుబట్టడంలేదు. వెనిగండ్లలాంటి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి వస్తున్నారని, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీచేస్తే ఎవరెవరి సీట్లకు ఎసరొస్తుందో దిక్కుతెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లుగా పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే ఎవరి స్థానాలను వారు కాపాడుకోవచ్చనే అంచనాకు వచ్చారని, ఆ దృష్ట్యానే రావి తన వాయిస్ను గట్టిగా వినిపించారంటున్నారు. ‘మాదగ్గర డబ్బులున్నాయి. మేం పోటీచేస్తాం. మీరు పక్కకు తప్పుకోండి’ అని వేషగాళ్ల మాదిరి ఎవరుపడితే వారొచ్చేస్తుంటే మనం ఎందుకు తప్పుకోవాలి. అవసరమైతే పిలువు గుడివాడకు వస్తా. నీకు అండగా నేను నిలుస్తా’ అని ఓ సీనియర్ నేత భుజం తట్టినందునే రావి అంత దన్నుగా ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. -
కొడాలి నాని ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ నాయకుల క్లారిటీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీమంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వస్తున్న వార్తలను గుడివాడ వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ స్టేడియం వైస్ ఛైర్మన్ పాలేటి చందు విమర్శించారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడానికే సోషల్ మీడియా, కొన్ని శాలిలైట్ ఛానల్స్లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి విడదల రజనీతోపాటు కొడాలి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. జులై 9న స్వర్గీయ అడపా బాబ్జి జయంతిలో పాల్గొన్నారు. కొండాలమ్మ అమ్మవారికి ఆషాడం సారెను కూడా సమర్పించారని పేర్కొన్నారు. కొడాలి నానిని రాజకీయంగా ఏమీ చేయలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానిని ఏదైనా చెయ్యాలంటే 2 లక్షల మంది గుడివాడ ప్రజలను దాటుకుని రావాలని తెలిపారు. కొడాలి నానిని ఓడించడానికి పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ చాలా కష్టపడుతోందని అన్నారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా గుడివాడ ప్రజలు ఆయనకు వలయంగా ఉంటారని చెప్పారు. రెండు దశాబ్ధాలుగా గుడివాడ ప్రజల గుండెల్లో కొడాలి నాని స్థానం సంపాదించుకున్నారని, ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చదవండి: బాబు నుంచి పవన్కు రిపోర్టు వచ్చిందేమో: కొట్టు సత్యనారాయణ సెటైర్లు -
వరుడి మొబైల్కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
సీఎం దృష్టికి వచ్చిన అర్జీల సమస్యలకు తక్షణ పరిష్కారం
-
మరోసారి మంచి మనసును చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
గుడివాడ బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు..!
-
గుడివాడ బహిరంగ సభ నుంచి చంద్రబాబుకు కొడాలి నాని ఓపెన్ ఛాలెంజ్..!
-
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు..!
-
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ (ఫొటోలు)
-
టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ
-
రాష్ట్రాన్ని దోచుకోవడానికే గజ దొంగల ముఠాకు అధికారం కావాలి
-
నానికి నేను హామీ ఇచ్చాను
-
మనం ఇళ్లు కాదు ఏకంగా ఊర్లు కడుతున్నాం
-
రాష్ట్రంలోనే అతి పెద్ద గృహ సముదాయం గుడివాడలో
-
ఏ మంచి చేయని మోసాల బాబు మళ్లీ వచ్చాడు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: పేదల ఇళ్ల కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుడివాడ టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పెత్తందారుల పార్టీ అని, పేదల వ్యతిరేకి కాబట్టే చంద్రబాబు ఏం చేయలేదని విమర్శించారు సీఎం జగన్. పేదవాడికి చంద్రబాబు నాయుడు ఏనాడూ సెంటు స్థలం ఇచ్చింది లేదు. మూడుసార్లు సీఎం అయినా టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు కావాలంటే డబ్బు కట్టాల్సిందే. ఇదే భారం పేదలపై పడి ఉంటే.. 20 ఏళ్ల పాటు నెలకు 3 వేల చొప్పున కట్టవల్సి వచ్చేది. కానీ, మన ప్రభుత్వం కట్టించడమే కాదు.. రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇస్తోంది. మంచి చేశాం కాబట్టే.. నాటి పాలనకు నేటి పాలనకు తేడా గమనించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలు నెరవేర్చాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామస్థాయ నుంచే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్ల కాలంలో రూ. 2.16 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. మంచి చేశాం కాబట్టే నేడు ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని అన్నారాయన. అందుకే కుప్పంలో ఇల్లు అంటున్నాడు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కులాల సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టుల కెక్కాడు. 14 ఏళ్లు సీఎంగా పేదలకు మేలు చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకో ఛాన్స్ ఇస్తే మంచి చేస్తానని బాబు చెబుతున్నాడు. మోసాల బాబు మళ్లీ వచ్చాడు ఇంకో ఛాన్స్ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి.. ఇంకా ఎక్కువే చేస్తా అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి.. మీ ప్రతీ ఇంటికి బంగారం ఇస్తా అంటున్నాడు. ఇంకో చాన్స్ ఇవ్వండి బెంజ్ కారు ఇస్తా అంటూ ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) మోసం చేయడానికి బయల్దేరాడు. ఇంకో చాన్స్ ఇవ్వండి.. ఇది చేస్తా అది చేస్తా అంటాడే తప్ప సీఎంగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని మాత్రం అడగలేడు. మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషికి లేనే లేదు కాబట్టి.. ఓటేయండి అని అడగలేకపోతున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను గమనించాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. ఫార్టీ ఇయర్స్.. నథింగ్ జిత్తులు, ఎత్తులు, పొత్తులనే చంద్రబాబు నమ్ముకున్నాడు. రెండు పక్కల కూడా రెండు పార్టీలు లేకుంటే చంద్రబాబు నిలబడలేడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోని టీడీపీ చెత్త బుట్టలో పడేస్తోంది. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ. దుష్టచతుష్టయాన్నే ఆయన నమ్ముకున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేసిన మంచిని చంద్రబాబు చూపించలేకపోయారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు కలిసి గజదొంగల ముఠా ఏర్పడ్డాయి. వీళ్లు ఓ దత్తపుత్రుడు తోడయ్యాడు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే దొంగల ముఠాకు అధికారం కావాలి. దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే వీళ్లకు అధికారం కావాలి. రెండు పక్కల రెండు పార్టీలు ఉంటేగానీ నిలబడలేని చంద్రబాబు.. 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి అంట. మరోవంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యి కూడా.. తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యాను చూసి మురిసిపోతూ.. తాను కూడా ఎమ్మెల్యే అవుతానంటూ , తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అనే ప్యాకేజీ స్టార్.. దత్తపుత్రుడు మరో వంక. వీళ్లు మన ప్రత్యర్థులంట. మీ బిడ్డ నమ్ముకుంది ప్రజలనే! గజదొంగల ముఠా.. తోడేళ్ల ముఠాతో ఒంటరిగానే మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలని చంద్రబాబుకు చురకలంటించారాయన. మీ బిడ్డ రాజకీయాల్లో ప్రజలనే నమ్ముకున్నాడు. అబద్ధాలను, అవాస్తవాలను నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్సార్సీపీకి అండగా నిలవండి యావత్ ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి కోరారాయన. -
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారు
-
ఇళ్ల స్థలాల కోసం 2007లో పాదయాత్ర చేశా: కొడాలి నాని
-
గుడివాడలో సీఎం వైఎస్ జగన్... ఇసకేస్తే రాలనంత జనం
-
ఇది మహాయజ్ఞం.. దేవుడు నాకిచ్చిన అవకాశం: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: రాష్ట్ర సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం. ప్రతీ లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 16,240 కుటుంబాలు.. ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే కాలనీలో నివాసం ఉండబోతోంది. రూ. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 178 ఎకరాల్లో 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. ► ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8వ తేదీన 8,859 ఇళ్ల పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం. ఇదే గుడివాడకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మనం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు 17,000.. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. ► అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల పట్టాల మీద 75,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం. ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు లక్ష ఖర్చు.స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 - 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ► దేవుడు నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా. కొంత మందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువయ్యాయి. నిరుపేదలకు నివాసం ఉండే 300 చ.అ. ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2వేలు. ఒక్కో ప్లాట్ కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో లక్ష. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం 1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోంది. మిగిలిన 3 లక్షల రూపాయలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. ► చంద్రబాబు హయాంలో.. నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు. అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు. వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నాం. ► 365 చదరపు అడుగలకి సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చ.అ. వాటికి 50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం లక్ష, మరో 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి 4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 430 చ.అ. తీసుకున్న ప్రతి పేద వాడికీ 3 లక్షలు కాకుండా, డిపాజిట్ లక్ష నుంచి 50 వేలకు తగ్గించాం. రూ. 4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. ► టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రభుత్వం 16,601 కోట్లు ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం. అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతున్నా. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి?. నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. ఆలోచన చేయాలి.మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ► అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు. అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్లు సంవత్సరాల కాలంలో 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా వెళ్తున్నాయి. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతు భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు ఇవ్వగలిగాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం 19,674 కోట్లు. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం. చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు రూ. 14,129 కోట్లు ఇవ్వగలిగాం. అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని విద్యాదీవె, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగాం. మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు? అని సీఎం జగన్ గుడివాడ బహిరంగ సభగా నిలదీశారు. -
CM Jagan Gudivada Tour Photos: గుడివాడలో గృహయజ్ఞం.. సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
గుడివాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
Live: గుడివాడలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
నేడు గుడివాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు బాబు సిద్ధమయ్యారని, చంద్రబాబు కుక్క బతుక్కి వచ్చే ఎన్నికల్లో చెప్పుదెబ్బ తప్పదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్కు దుమ్ముంటే గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘‘ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి.. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ -
కొడాలి నాని చాలా తెలివైనవాడు : పేర్ని నాని
-
గుడివాడ బస్టాండ్ డిపో గ్యారేజ్ ప్రారంభం
-
ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నాని
-
చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు?
కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా సైకిల్ జెండా ఎగరేయాలని పచ్చ పార్టీ అధినేత బోల్డన్ని ప్లాన్లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతను ఓడించేందుకు బాగా సంపాదించిన ఎన్ఆర్ఐని రంగంలోకి దించారు. అయితే అక్కడ ఎప్పటినుంచో ఉన్న నేతలు ఎన్ఆర్ఐని పట్టించుకోవడంలేదట. పాపం చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటనకు వెళితే రెండు వర్గాలు కొట్టుకుని జనాన్ని తేవడం మర్చిపోయారట. ఆ నియోజకవర్గం సంగతేంటో చూద్దాం. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద గెలవడం సంగతి తర్వాత.. ముందు అమెరికా నుంచి దించిన ఎన్ఆర్ఐ.. లోకల్ లీడర్లు కలిసి పని చేసేవిధంగా చూసుకోండని పచ్చ పార్టీ మీద సెటైర్లు పడుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కొరకరాని కొయ్యలా మారారు. తన పరువు తీస్తూ.. కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం గుడివాడ ఇన్చార్జ్గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నానిని ఎదుర్కొనడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న చంద్రబాబు అమెరికాలో బాగా సంపాదించిన వెనిగండ్ల రామును తీసుకువచ్చారు. ఆయన వచ్చీ రావడంతోనే నియోజకవర్గంలో రావికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది స్థానిక నేతలను తనవైపు తిప్పుకున్నారట. చంద్రబాబు మద్దతుతో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము దిగగానే అప్పటివరకు పార్టీకోసం పనిచేసిన రావి వెంకటేశ్వరరావు ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సీనియర్ టీడీపీ నేతలు పలువురు రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా నిలిచారు. ఇప్పడిదే గుడివాడలో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భంగా కూడా పార్టీలోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సీనియర్ల మద్దతుతో చంద్రబాబు టూర్ సందర్భంగా ఎన్ఆర్ఐ వర్గంతో తలపడ్డారు. దీంతో బాబు సభ పక్కకు పోగా రెండు వర్గాల మధ్య కొట్లాట హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి గొడవతో అసలే తక్కువగా వచ్చిన జనాల్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చంద్రబాబు రాకముందే అందరూ వెళ్ళిపోయారు. ఇస్తామన్న డబ్బలు ఇవ్వకపోవవడంతో టీడీపీ నేతలతో కిరాయికి వచ్చిన వారు గొడవ పడటం కూడా చర్చకు దారి తీసింది. చంద్రబాబు గుడివాడ పర్యటన ఖర్చంతా భరించడానికి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము రెడీ అయ్యారు. అయితే బాబు పర్యటన ఏర్పాట్లు సమీక్షించడానికి సమావేశమైన జిల్లా నేతలు వెనిగండ్లను పిలవలేదట. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు చెప్పినట్లు చేయాల్సిందేనంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరుతో విడుదలైన లేఖ తీసుకెళ్లి వెనిగండ్ల రాము చంద్రబాబు దగ్గరే పంచాయితీ పెట్టారట. చదవండి: ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? పార్టీ కోసం ఎంతో ఖర్చు చేస్తున్న తనకు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ కడిగేశారట. నియోజకవర్గంలోని పరిస్థితులు, తన పర్యటన కారణంగా సంభవించిన పరిణామాలు చంద్రబాబుకు శిరోభారంగా మారాయని టాక్. అయితే గుడివాడ సీటు వెనిగండ్ల రాముకే అనే సంకేతాలు చంద్రబాబు ఇవ్వడంతో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం సందర్భంగా నానా రచ్చ జరిగింది. మొత్తంగా మాంచి దూకుడుగా ఉపన్యాసం ఇద్దామని గుడివాడ వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించారు. ఒక వైపు పార్టీ నేతల మధ్య గొడవలు, సభకు జనం లేకపోవడంతో చంద్రబాబు అందరిమీద అసహనం వ్యక్తం చేశారని సమాచారం. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ -
గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు ?
-
ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన చంద్రబాబు సభ
-
టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. గుడివాడలో ఉద్రిక్తత
గుడివాడ: చంద్రబాబు ర్యాలీ సందర్భంగా గుడివాడలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు గుడివాడలో ర్యాలీ చేస్తున్న సమయంలో నెహ్రూ చౌక్ వద్దకు రాగానే టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పిన్నమనేని, వెనిగండ్ల వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అంతకుముందు వైఎస్సార్సీపీ కార్యక్తరలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.వైఎస్సార్సీపీ జెండాను బైక్కు పెట్టుకుని వెళ్తున్న యువకుడిపై టీడీపీ కార్యకర్తలు అడ్డగించి కవ్వింపు చర్యలకు దిగారు. దీన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీయడంతో వారిపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా పోలీసులు మోహరించారు. -
టీడీపీ నేత మాగంటి బాబు అనుచరుల ఓవరాక్షన్
గుడివాడ: టీడీపీ నేత మాగంటి బాబు అనుచరులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగి హల్చల్ చేశారు. ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్కు పెట్టుకున్న జెండాను పీకేసి టీడీపీ మూకలు..కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ జెండా కట్టుకుని బైక్పై వెళతున్న పార్టీ కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో బైక్కు కట్టిన జెండాను పీకేశారు. దీన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. శరత్ థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బందరు సభ అట్టర్ ప్లాప్తో డుడివాడలో అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. అల్లర్ల ద్వారా ఏదో జరుగుతున్నట్లు ప్రచారానికి తెరలేపింది టీడీపీ. -
గుడివాడ: పోలీసులను దర్భాషలాడిన రావి
సాక్షి, కృష్ణా: గుడివాడ టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో.. ఆవేశంతో పోలీసుల మీదకు దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. సీఐపై బెదిరింపులకు దిగాడు. శుక్రవారం అనుమతులు లేకుండా నెహ్రూ చౌక్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు నిర్వహించుకున్నారు టీడీపీ నేతలు. ఆ సమయంలో.. అనుమతులు తీసుకోవాలని సీఐ గోవిందరాజులు, వాళ్లకు సూచించారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతుండగానే.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆవేశంతో ఆయన మీదకు దూసుకెళ్లాడు. అంతేకాదు.. ఏం చేస్తారో చూస్తాం అంటూ పోలీసుల ముందే టపాసులు కాల్చారు వాళ్లంతా. ఇది పద్దతి కాదని సీఐ గోవిందరాజులు, రావిని ప్రశ్నించగా.. మీ సంగతి తేలుస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల గడ్డలూడదీసి కొడతానంటూ దర్భాషలాడాడు రావి వెంకటేశ్వరరావు. -
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన జీజీ కృష్ణారావు చెన్నై నుంచి సినీ ప్రయాణాన్నిప్రారంభించారు. ఎడిటర్గానే కాదు.. అసోసియేట్ డైరెక్టర్,ప్రొడక్షన్ డిజైనర్గానూ పని చేశారాయన. బాపు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ఎందరో ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్గా చేశారాయన. ‘శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ’ వంటి దాదాపు 300 సినిమాలకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణారావు. డైరెక్టర్ కె. విశ్వనాథ్తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పని చేశారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సప్తపది’కి కృష్ణారావు తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా నుంచే ఎడిటింగ్ విభాగంలో నంది అవార్డు ఇవ్వడంప్రారంభమైంది. అనంతరం ‘సాగర సంగమం, శుభ సంకల్పం’ చిత్రాలకు కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎడిటింగ్ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారిలో కృష్ణారావుగారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ ఒక పెద్ద దిక్కును కోల్పోయారు’’ అని తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఆర్టీసీ బస్సు నడిపిన మాజీ మంత్రి కొడాలి నాని.. వీడియో వైరల్
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్టీసీ డ్రైవర్గా మారారు. గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో అయిదు అద్దె బస్సులను కొడాలి నాని ప్రారంభించారు. ఈ నూతన పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. అనంతరం గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో మాజీ మంత్రి కొడాలి నాని పల్లె వెలుగు బస్సును స్వయంగా నడిపారు. ఏదో ఫోటోలు.. వీడియోల కోసం ఫోజులు ఇవ్వడం కాకుండా.. స్టీరింగ్ పట్టి సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును ట్రాఫిక్లో సునాయాసంగా నడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడివాడ బస్టాండ్లో నూతనంగా ప్రారంభించబడుతున్న బస్సులను పట్టణంలో ప్రధాన రహదారిపై నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని...👌👌👍@IamKodaliNani #FFF pic.twitter.com/Cz8I6Wyuym — వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@nenerajun) February 16, 2023 ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత వర్గాల శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద వారికి బస్సులు మంజూరు కావడంతో సంతోషంగా ఉందన్నారు. దళిత సోదరులు ఏర్పాటు చేసుకున్న బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దళితులతో పాటూ అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
ఆర్టీసీ డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని
-
నన్ను ఓడించడం కాదు.. దమ్ముంటే మెజారిటీని తగ్గించండి చూద్దాం: కొడాలి నాని
-
మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయిన ‘రావి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడరూరల్: హైకోర్టు ఆదేశాల మేరకు గుడివాడలో ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు రెచ్చిపోయారు. ఉద్యోగుల విధులకు అడ్డుతగిలి బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడివాడలోని నాగవరప్పాడు–లింగవరం చానల్ను ఆక్రమించుకుని ఏడుగురు ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో మురుగు నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతోందని అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ ఆ ప్రాంతంలో సొంత స్థలం కలిగిన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు... అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాలని సచివాలయ ఉద్యోగులు మూడు నెలల కిందట ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలో ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేసింది. నలుగురు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశారు. ముగ్గురు మాత్రం ఖాళీ చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించింది. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, టౌన్ప్లానింగ్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, సిటీ ప్లానర్ వై.రాంబాబు, మున్సిపల్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, పోలీసులతో కలసి సోమవారం ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా... రావి వెంకటేశ్వరరావు తమ పార్టీ నాయకులతో కలసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచగా, రూ.20వేలు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. -
బాలిక కడుపులో కిలో వెంట్రుకలు
గుడివాడటౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు కిలో వెంట్రుకలను తొలగించారు. ఈ శస్త్రచికిత్స వివరాలను డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన బాలిక (12) దీర్ఘకాలంగా కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఆమెను గుడివాడలోని శ్రీరామా నర్సింగ్హోంలో చేర్పించారు. వైద్యులు ఎండోస్కొపి, స్కానింగ్ల ద్వారా కడుపులో నల్లని గడ్డ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి దాన్ని వెలికితీశారు. దాన్ని వెంట్రుకల గడ్డగా గుర్తించారు. దీన్ని వైద్య విధానంలో ట్రైకోబీజోఆర్ అంటారని, చిన్న వయసు నుంచి కొందరికి వెంట్రుకలు తినే అలవాటు ఉంటుందని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. కొద్ది మొత్తంలో ఐతే బయటకు వస్తాయని, ఈ బాలిక ఎక్కువగా వెంట్రుకలు తినడానికి అలవాటుపడిందని, ఇవి కడుపులో పేరుకుపోయి జీర్ణకోశంలో పెద్ద గడ్డలా కట్టేశాయన్నారు. సుమారు కిలో బరువున్న వెంట్రుకలు జీర్ణాశయాన్ని నింపివేయడంతో తిన్న అన్నం ఇమడక బయటకు రావడం, మిగిలిన కొద్ది ఆహారం జీర్ణంగాక శక్తి కోల్పోవడం జరుగుతోందని చెప్పారు. దీంతో బాలిక అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. రక్తహీనత కలిగినవారు ఈ విధమైన తిండికి అలవాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. -
ఆ దొంగల్ని అభిమానులు మట్టికరిపించారు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు. బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'నేటికీ అనేకమంది ఎన్టీఆర్ పేరు, ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తమకు ఆదర్శమంటూ నేడు కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారు. పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శం. గుడివాడ నుంచి రెండుసార్లు అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం' అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. చదవండి: (నా ఆస్తి టీడీపీకి ఎందుకు ఇవ్వాలి?: శేషారత్నం) -
కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: వివి వినాయక్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్కు మాజీ మంత్రి కొడాలి నాని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ వివి వినాయక్ చెప్పారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు వివి వినాయక్ మాట్లాడుతూ.. 'అందరూ కళకళలాడుతున్నారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించాను. ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ఈ ఏడాది మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. కొడాలి నాకెంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధం' అని వివి వినాయక్ చెప్పారు. చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!) -
పవన్, లోకేష్ లపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
-
రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడిది మానసిక వైకల్యం: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో ఒకసారి కూడా గెలవలేని పవన్ కల్యాణ్, లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కేటాయించాడని మండిపడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని మంగళవారం గుడివాడలో నియోజకవర్గ సచివాలయ సమన్వయకర్తలు, వాలంటీర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ముస్లిం వర్గాలని అంతా తనవారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంభోదిస్తారు. ఎంతో గట్స్ ఉన్న నేత కాబట్టే అలా అందరినీ తన వారిగా పిలుచుకుంటున్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు పదవులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పిల్లలకి అందించాలని మేం ప్రయత్నిస్తుంటే వాళ్ల పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న దిశగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. మేం పేదలకు మేలు చేస్తుంటే ఎల్లో మీడియాలో పెన్షన్ దారులకు షాక్.. రైతులకు షాక్ అని డిబేట్లు పెడుతున్నారు. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడులది మానసిక వైకల్యం' అంటూ కొడాలి నాని మండిపడ్డారు. చదవండి: (పవన్ కల్యాణ్తో ఆ సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తా: మంత్రి అమర్నాథ్) -
గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కోస్తాంధ్రలోని గుడివాడ రాజకీయాలపై టీడీపీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. ప్రతి అంశంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం, తీవ్ర నిందారోపణలు మోపడం, బల ప్రదర్శనలకు దిగడం, దాడులకు పురమాయిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం, చివరకు పాలక పార్టీ నేత లపై నెట్టేయడం రివాజైందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ఆయన ముఖ్య అనుచరులపై టీడీపీ నాయకత్వం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని మరీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ అధిష్ఠానమే పార్టీలో గ్రూపులను ఎగదోస్తూ తగువులను ప్రోత్సహిస్తోందనే అనుమానాలు స్వపక్షం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో నిలకడలేక ప్రతి సాధారణ ఎన్నికల్లోనూ చతికిలపడుతున్న ‘సైకిల్’కు స్టాండ్ను అమర్చుకునే క్రమంలో ప్రతిపక్ష పార్టీపై బురద చల్లుతుందనే చర్చ లేకపోలేదు. వీటన్నింటినీ మించి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లోపాలను నిత్యం ఎత్తి చూపుతూ తూర్పార పడుతున్న కొడాలిపై ప్రత్యేకంగా రాజకీయ కక్ష తీర్చుకునేలా ఎన్నికలకు ముందస్తు ఎత్తుగడలు అధికమవుతున్నాయనేది పరిశీలకుల మాట. ప్రతి ఎన్నికకూ గుడివాడ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం, ఓటమిపాలై వెనుతిరగడం షరా మామూలైన నేపథ్యంలో తాజాగానూ కొత్త పేర్లను తెరపైకి తెచ్చే పనిలో తమ పార్టీ ఉందని టీడీపీ వర్గాలే బాహాటంగా అంటున్నాయి. టీడీపీకి గుడివాడ ప్రత్యేకం... టీడీపీకి గుడివాడ అన్ని కోణాల్లో ప్రత్యేకం. పార్టీ ఆవిర్భావ నేత ఎన్టీ రామారావుది ఈ ప్రాంతమే. నిత్యం జాకీలు పెట్టి టీడీపీని నిలబెట్టే ప్రయత్నాలు చేసే మీడియా ముఖ్యులూ ఇక్కడివారే. ఎలాగైనా పునర్వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో కొడాలిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారనడం బహిరంగ రహస్యం. ఎన్టీఆర్ గుడివాడ నుంచి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985లో టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో రావి శోభనాద్రీశ్వరరావు, 1999లో రావి హరిగోపాల్ గెలుపొందారు. 2004 నుంచి కొడాలిదే హవా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించిన కొడాలి నాని 2009లోనూ అదే పరంపర కొనసాగించారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడిన కొడాలిని గుడివాడ ఓటర్లు మాత్రం విస్మరించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. విశ్వసనీయతకే పెద్దపీట అంటూ... గుడివాడ ఓటర్లు విశ్వసనీయతకు, నాయకత్వానికీ పెద్దపీట వేస్తారని, వారి నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్నది కొడాలి మాట. తాను సీఎం జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీకి కట్టుబడి ఉన్నానని, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబానికీ విధేయుడినని చెప్పుకుంటుంటారు. ఇవే తనను నిలబెడుతున్నాయంటారు. ఎన్టీఆర్కు, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబును ఏవిధంగానూ వదిలేది లేదని పరుషంగా అంటుంటారు. ఈ పరిస్థితుల నుంచి కొడాలిని గిరాటు వేయాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది జవాబులేని ప్రశ్నే. కొడాలిపై కాలు దువ్వడమే.. 2014 నుంచి 2019 మ«ధ్య అధికారంలో ఉన్నంత కాలం కొడాలిని ఎలాగైనా దెబ్బ తీయాలని చంద్రబాబు శతథా ప్రయతి్నస్తున్నారు. ఆయనపైకి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో పాటు రౌడీలను విజయవాడ నుంచి పంపారు. ఇలా రెండు పర్యాయాలు విజయవాడ నుంచి మందీ మార్భలంతో కొడాలిపై కత్తులు దూస్తూ వెళ్లడం ఆయా సందర్భాల్లో ఉద్రిక్తతలకు దారి తీశాయి. జిల్లా పార్టీ అ«ధ్యక్షునిగా, మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావును నానిపైకి అధిష్ఠానం ఉసిగొల్పని సందర్భమంటూ లేదనేది ఆ పార్టీలోని అన్నిస్థాయిల నాయకులకూ తెలుసు. క్యాసినో పేరిట, గడ్డం గ్యాంగ్ అంటూ... వ్యక్తిత్వ హనన ప్రయత్నాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీవి విఫల ప్రయోగాలే.. కొడాలిని ఎలాగైనా ఓడించి తీరాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు రావి, పిన్నమనేని, దేవినేని కుటుంబ వారసులను రంగంలోకి దించినా ఫలితం లేదు సరికదా కొరకరాని కొయ్యలా మారారు. రానున్న ఎన్నికల్లోనూ కొత్త ప్రయోగం చేయపోతున్నారని, ఇప్పటికే ఎన్ఆర్ఐని రంగ ప్రవేశం చేయించారనే ప్రచారం ఊపందుకుంది. అంతర్గత కుమ్ము లాటలతో పార్టీ మరింతగా కకావికలమవుతుందా, నిలబడుతుందా కాలమే చెప్పాలి. కాగా 2004లో టీడీపీ అభ్యర్థిగా 8,864 ఓట్లు (8.06 శాతం), 2009లో 17,630 ఓట్లు (11.90 శాతం) ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన నాని వైఎస్సార్ సీపీ అభ్యరి్థగానూ అంతకన్నా ఆధిక్యతను కొనసాగించారు. 2014లో 11,537 ఓట్లు (7.29 శాతం) మెజార్టీతో రావి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. టీడీపీ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా చక్రం తిప్పిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కుమారుడు అప్పటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయిన దేవినేని అవినాష్ను ప్రత్యేకంగా గుడివాడకు పంపి కొడాలిపై పోటీ చేయించారు. చదవండి: ఏ ఎండకు ఆ గొడుగు.. బాబు ‘సానుభూతి’ రాజకీయం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రూ.కోట్లు కుమ్మరింపజేశారు. గత ఎన్నికలన్నింటికన్నా 19,479 ఓట్లు (9.6 శాతం) మెజార్టీని నాని సాధించారు. ఇదే ఎన్నికల్లో మరో విచిత్ర ప్రయోగమూ జరిగింది. కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరుగల వ్యక్తిని పోటీకి దింపడం గమనార్హం. అంతర్గత అవగాహనలో భాగంగా 2014లో కాంగ్రెస్ అభ్యరి్థగా అట్లూరి సుబ్బారావును నానిపై పోటీకి నిలపడం ద్వారా ఓట్లు చీలి తమకు అనుకూల ఫలితం వస్తుందనే బాబు బృందానికి నిరాశే మిగిలింది. 1985లో టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్కు 53.64 శాతం ఓట్లు రాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కొడాలి నానికి 2014లో 55.32 శాతం, 2019లో 53.50 శాతం ఓట్లు రావడం విశేషం. కాగా ఎన్టీఆర్కు ఇండిపెండెంట్గా 1983లోను, 2004లో తొలిసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నానికి 60 శాతానికి పైగా ఓట్లు దక్కడం పరిశీలనాంశం. కాగా 1999 ఎన్నికల్లో ‘అన్న తెలుగుదేశం పార్టీ’ అభ్యర్థిగా గుడివాడ నుంచి నందమూరి హరికృష్ణ పోటీ చేయగా 11,238 ఓట్లు దక్కాయి. కొడాలి అప్పటికి ఎన్నికల రంగంలో లేరు. -
పేదల కోసం పరితపించిన వ్యక్తి వంగవీటి రంగా: ఎంపీ బాలశౌరి
-
వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని
సాక్షి, గుంటూరు: వంగావీటి మోహనరంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆనాడు ఆయనను హత్య చేసిన వారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోమవారం గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని హాజరై రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. 'తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వంగావీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపింది. వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీది. వంగవీటి రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించుకున్నారు. రంగాను పొట్టనపెట్టుకున్న పార్టీలు కూడా నేడు దిగజారి మాట్లాడుతున్నాయి. రంగా చావుకు కారణమైన వ్యక్తులు కూడా ఈ రోజు ఆయన బూట్లు నాకుతున్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉంది. రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు. నేను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్ పీకాడు. ఇప్పుడు అదే టీడీపీ ఆయన కోసం పాకులాడుతోంది. వంగవీటి రంగా కుటుంబంతో నాకు అనుంబంధం ఉంది. వంగవీటి రాధా మా కుటుంబ సభ్యుడు. రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం. మరణించే వరకు రంగా ఆశయాలను కొనసాగిస్తాం. గుడివాడలో ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఇచ్చిన హామీలను అమలుచేశాం. గుడివాడలో నన్ను ఓడించడం కష్టం. గుడివాడ ఓటర్లు నా భవిష్యత్తుని నిర్దేశిస్తారు. మాకు ఏ పార్టీతో పొత్తు అక్కర్లేదు. ఎవరి బూట్లు నాకం. దటీజ్ వైఎస్సార్సీపీ.. దటీజ్ జగన్. ఇచ్చిన హామీలను చెప్పినట్టుగా అమలు చేశాం. మీకు ఇష్టం అయితే ఓట్లేయండి.. లేకుంటే పీకి పక్కనేయండని జగన్ చెబుతున్నారు. బాధ్యతతో లేకుంటే ఓడిపోతామనే భయం నాకు, జగన్ కు ఉంది. భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం. భయం.. భక్తితో నా బాధ్యతని నెరవేర్చే ప్రయత్నం చేస్తాను' అని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చదవండి: (రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ) -
TANA: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం
గుడివాడ (కృష్ణా జిల్లా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో కళ్లు, ఈఎన్టీ, కేన్సర్ క్యాంప్ చేపట్టారు. స్కూల్ విద్యార్దినిలకు తానా చేయూత ద్వారా 55 మందికి స్కాలర్షిప్లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ అందజేశారు. శశికాంత్ వల్లేపల్లి తన తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి వైకుంఠ రథం బహూకరించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టీఎన్ఐ లైవ్ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఈ సందర్భంగామాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలోని తెలుగువారికి ఆపద, విపత్కర సమయాల్లో ఏ విధంగా సహాయం చేస్తున్నామో తానా సెక్రెటరీ సతీష్ వేమూరి వివరించారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజా, గుడివాడ రోటరీ క్లబ్ పాలక సభ్యులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డాక్టర్ రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. (క్లిక్: హైదరాబాద్లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం) -
గుడివాడతో అమరజీవి అనుబంధం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు అంతిమ యాత్రకు నలుగురు మనుషులైనా లేని పరిస్థితుల్లో సాధుసుబ్రహ్మణ్యం గుడివాడకు చెందిన ఘంటసాలను పిలిచాడు. ఆయన వచ్చి శ్రీరాములు శవాన్ని చూసి ఆవేశంతో మద్రాసు వీధుల్లో ఎలుగెత్తి పాటందుకోగానే క్షణాల్లో వేలాది మంది పోగయ్యారు. సాక్షి, కృష్ణా: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఉద్యుక్తుడై బయలుదేరి వెళ్లింది కృష్ణాజిల్లా గుడివాడ నుంచే. మద్రాసులో తెలుగువారికి అవమానాలు చూసి భరించలేక గుంటూరుకు చెందిన గాంధేయవాది స్వామి సీతారాం(ఈయన అసలు పేరు గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రాజాజీ దానిని భగ్నం చేశాడు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని హేళన చేశారు. ఈ విషయం తెలిసి అప్పుడు గుడివాడలో తన మిత్రుడు యెర్నేని సాధుసుబ్రహ్మణ్యం(ఈయన గుడివాడ సమీపంలోని కొమరవోలు గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు) వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు వెంటనే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. అక్కడ బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాజాజీకి భయపడి కాంగ్రెస్ వారు ఎవరూ పొట్టి శ్రీరాములు దీక్షను పట్టించుకోలేదు. శ్రీరాములు వద్ద గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఎవరూ లేరు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తనను ఎవరూ పట్టించుకోకపోవడం గురించి పొట్టి శ్రీరాములు తన ఆవేదన అంతా తన మిత్రులైన గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం అల్లుడు ముసునూరి భాస్కరరావు, (ఈయన భార్య, సాధు సుబ్రహ్మణ్యం కుమార్తె ముసునూరి కస్తూరీదేవి 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.) మరో స్వాతంత్య్ర సమరయోధుడు కూరాళ్ల భుజంగ భూషణరావులకు లేఖల్లో రాశారు. వారాల తరబడి ఆహారం లేకుండా పోవడంతో పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట, కళ్ల వెంట, చెవుల వెంట వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోటి వెంట వచ్చేది. ఎట్టకేలకు దీక్ష 58వ రోజు అంటే 1952 డిసెంబరు 15 రాత్రి 11.30 గంటల సమయంలో పొట్టి శ్రీరాములు ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది. శవం దగ్గర సాధు సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉన్నాడు. కనీసం గుడివాడ వాళ్లనయినా నలుగురిని పోగేసుకువచ్చి ఎలాగోలా అంత్యక్రియలు ముగిద్దామనుకున్నాడు. మద్రాసులో ఉన్న గాయకుడు ఘంటసాలది గుడివాడ పక్కనే చౌటపల్లి కాబట్టి ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ సమయంలో ఆయన పక్కన గుడివాడ సమీపంలోని మోపర్రుకు చెందిన హరికథకుడు మోపర్రు దాసు ఉన్నాడు. ఆయన నేను కూడా గుడివాడ వాడినే కదా నేనూ వస్తాను అని బయలుదేరాడు. ఇద్దరూ కలసి సాధుసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ తాటాకులు కప్పి ఉన్న శ్రీరాములు శవాన్ని చూసి వారికి వాంతులు అయ్యాయి. తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు శవయాత్ర ఎవరికీ తెలియకుండా చేయడం సమంజసం కాదని, తెలుగు వాళ్ల కళ్లు తెరిపించేలా ఈ శవయాత్ర సాగాలని ఘంటసాల తలచాడు. అప్పటికప్పుడు అశువుగా ‘చీము, నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువులు బాసిన ఓ అమరజీవి పొట్టి శ్రీరాములూ....’ అంటూ తన గంభీర స్వరంతో ఎలుగెత్తి పాడడం ప్రారంభించాడు. ఒక ఎద్దుల బండి మాట్లాడి అందులో శవాన్ని ఉంచి శవయాత్ర ప్రారంభించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ముందుగా శవయాత్ర వెళుతుండగా కాలేజీలో తెలుగు విద్యార్థులు ఘంటసాల గద్గద స్వరంతో, ఆవేశంతో పాడుతున్న పాట విని బయటకు వచ్చి శవయాత్ర వెంట నడవడం ప్రారంభించారు. ఈలోగా పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెయిల్లో మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్కు చేరింది. శ్రీరాములు శవాన్ని చూసిన ప్రకాశం పంతులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనదైన భాషలో తెలుగుజాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడాడు. దాంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది పోగయ్యారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. తత్ఫలితంగా 1953 అక్టోబరు ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. -
BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర
నవభారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్ లోనూ, గుడివాడ మొయిన్ రోడ్లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అంబేడ్కర్ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ ఫ్లాగ్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్ హాల్లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తుని రైల్వేస్టేషన్ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్కు అక్కడి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!) - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం -
అక్కడ చంద్రబాబు పోటీ చేసినా నేను రెడీ.. కొడాలి నాని సవాల్
సాక్షి, కృష్ణా: సినిమా షూటింగ్స్ మాదిరిగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు జరగుతున్నాయి. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా ఇవే చివరి ఎన్నికలు. చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కాగా, కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల పర్యటనల్లో టీడీపీ కార్యకర్తలను ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నాడు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతా అని చంద్రబాబు అంటున్నాడు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం కర్మరా అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను జిల్లాలకు తరలిస్తున్నారు. చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముంది. బ్రతికున్నంతకాలం వైఎస్ జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారు. టీడీపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. గుడివాడలో ఎవరికీ భయపడేది లేదు. ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా నేను రెడీ. ఆఖరి రక్తపు బొట్టు వరకూ సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటాను అని స్పష్టం చేశారు. -
సాక్షి మీడియా ఆధ్వర్యంలో గుడివాడలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు
-
'ఆయన ఉన్నంతకాలం టీడీపీ గుడివాడలో గెలిచే ప్రసక్తే లేదు'
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. గుడివాడలో బలమైన వర్గాలైన బీసీ, కాపు వర్గాలకు టీడీపీలో రావి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రావి కుటుంబ హయాంలో కాపు వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో రావి పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలోని కాపు వర్గాల నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. కాపు వర్గాలకు అన్యాయం చేస్తున్న రావి కుటుంబం ఉన్నంతకాలం గుడివాడలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. చదవండి: (వైఎస్సార్ షాదీ తోఫాకు దూదేకులు అర్హులే) -
దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు, పవన్ ది : కొడాలి నాని
-
గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్
-
గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన మాగంటి బాబు
సాక్షి, కృష్ణా జిల్లా: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వాహనం నిలిపి పాటలు పాడే యత్నం చేశారు. పోలీసులు వారించినా వినకుండా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. కొడాలి నానికి చెందని శరత్ సినిమా థియేటర్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాగంటి బాబు చెప్పు చూపిస్తూ రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతల డైరెక్షన్ సాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చదవండి: (అచ్చెన్నకు లోకేష్తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?) -
పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోయావా.. ఎందుకిలా చేశావ్ మమత!
గుడివాడరూరల్: వివాహిత కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మందపాడుకు చెందిన తాడి మమత (26) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆ ఇబ్బందులు తాళలేక శుక్రవారం రాత్రి పామర్రు రోడ్డులోని పెదకాల్వలో దూకింది. స్థానికులు చూసి వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా 10 గంటల తర్వాత బాపూజీనగర్ లాకుల వద్ద మమత మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీ నేతల హంగామా
సాక్షి, మచిలీపట్నం/పామర్రు/గుడివాడ టౌన్/సాక్షి ప్రతినిధి, విజయవాడ : గొడవలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వ్యూహంలో భాగంగా టీడీపీ నేతలు ఆదివారం ప్రయాణికులను, పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ బాబు ఇటీవల తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ఆ విమర్శలు నచ్చకుంటే ప్రతి విమర్శలో లేక ఫిర్యాదో చేయకుండా పామర్రు, గుడివాడలో నానా హంగామా చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు కృష్ణా జిల్లా కేంద్రమైన బందరు నుంచి తమ అనుచరులుతో గుడివాడ వెళ్లేందుకు పామర్రు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడెప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు వారికి జత కలిసి హైడ్రామాకు తెరలేపారు. గూడూరు పోలీస్స్టేషన్కు తరలింపు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు టీడీపీ నేతలను పామర్రు వద్ద అడ్డుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ వారిని కోరారు. అయినా వారు ఒప్పుకోకుండా కార్లలో రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలకు టీడీపీ నేతలు అంతరాయం కలిగించారు. కార్ల వెలుపల ఉన్న వారు రహదారిపై నానా హంగామా చేశారు. మహిళా కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ రచ్చచేశారు. పోలీసులు వారందరినీ గూడూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా గుడివాడలో ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు, నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాదు, జయమంగళం వెంకటరమణ పోలీస్స్టేషన్కు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. పెయిడ్ ఆర్టిస్టులను తరిమికొడతాం పామర్రులో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అవాకులు, చవాకులు పేలితే టీడీపీ నాయకులు, పెయిడ్ అరిస్ట్లను తరిమి కొడతామని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. సీఎంను ఇష్టానుసారం దుర్భాషలాడటం తప్పని తెలియదా? అని ప్రశ్నించారు. గుడివాడకు వెళ్లడానికి దమ్ము లేక పామర్రులో ప్రజలను ఇబ్బంది పెట్టడం మీ చేతగానితనమని.. డ్రామాలు, నాటకాలు మానుకోవాలని హితవు పలికారు. -
కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు సవాల్ చేస్తారా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ 8వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. కుప్పానికే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను పిలిపించుకుని నానా అల్లరి చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో కూడా చంద్రబాబు పీడ విరగడ అవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఏ రకంగా సవాల్ విసురుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాక తప్పదన్నారు. ఎవరికోసమో, ఎవరో అడిగారనో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. చదవండి: (చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని) -
ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాం: కొడాలి నాని
-
Crime News: భర్త అనారోగ్యంతోనే.. ఆమె పక్కదారి పట్టింది
సాక్షి, హైదరాబాద్/గుడివాడ: వివాహ బంధాలు విలువ లేకుండా పోతున్నాయనే అభిప్రాయం పెరిగిపోవడానికి కారణం.. కొందరి చేష్టలే!. అలాంటి ఘటనే ఇది. భర్త అనారోగ్యం అనే కారణంతో.. ఎదురింట్లో ఉన్న ఓ మైనర్పై మనసు పారేసుకుంది నలుగురు పిల్లల తల్లి. అతనితో శారీరకంగా సంబంధం నడిపింది. ఆపై ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని ట్రాప్ చేసి.. ఊరు విడిచి పారిపోయింది కూడా. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ కేసు సంచలనం రేపింది. ఎదురింట్లో ఉండే మైనర్ను తీసుకొని పారిపోయిన వివాహిత స్వప్నను పొక్సో యాక్ట్ కింద ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆపై బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అలాగే మైనర్కు కౌన్సెలింగ్ ఇప్పించిన పోలీసులు.. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంతో కథ సుఖాంతం అయ్యింది. భర్త దూరంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. భర్త అనారోగ్యం కారణంగానే మైనర్తో స్వప్న వివాహేతర సంబంధం నడిపిందని పేర్కొన్నారాయన. గుడివాడ గుడ్మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30)కు నలుగురు పిల్లలు. భర్త అనారోగ్యంతో వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో తన ఎదురింటిలో ఉండే మైనర్(15)తో శారీరక సంబంధం పెట్టుకుంది. నెలరోజులు గుట్టుగా అతనితో వ్యవహారం నడిపించింది. ఈ నెల 19న అతనితో పరారయ్యింది. ఈ క్రమంలో మైనర్ తండ్రి గత సోమవారం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వప్న కూడా కనిపించపోయేసరికి.. అనుమానాలు మొదలయ్యాయి. స్వప్న, సదరు మైనర్ హైదరాబాద్ బాలానగర్లో ఓ గదిలో అద్దెకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసి.. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. స్వప్నను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాధితుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. అశ్లీల వీడియోలతో ట్రాప్ ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్.. ‘ఆంటీ’ అంటూ స్వప్న ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి అశ్లీల వీడియోలు చూపించి.. శారీరకంగా లోబర్చుకుంది ఆమె. ఆపై భర్త, పిల్లలను వదిలేసి.. ఇద్దరం కలిసి బతుకుదామని, తన వెంట వచ్చేయమని మైనర్ని బలవంతం చేసింది. ఈ క్రమంలో భయం భయంగానే ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చేశాడు బాలుడు. అయితే గుడివాడ టూటౌన్ పోలీసులు ఈ కేసు ఛేదించిన విషయం.. వారిద్దరినీ గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని బాలానగర్ సీఐ భాస్కర్ చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి: విశాఖ ఆర్కే బీచ్ నుంచి గాయబ్.. భర్తకు సాయిప్రియ సర్ప్రైజ్ -
ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి
గుడివాడ టౌన్: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. -
గుడివాడ టీడీపీలో తీవ్రస్థాయికి విభేదాలు.. మినీ మహానాడు సైతం రద్దు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో బుధవారం నిర్వహించాల్సిన మినీ మహానాడు సైతం రద్దయింది. నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేత శిష్లా లోహిత్ వర్గాలు ఫ్లెక్సీలు చించుకుని పార్టీ పరువును రోడ్డున పడేశారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయినా టీడీపీ అదిష్టానం కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య రాజీ చేసినా ఫలితం దక్కకపోవడం గమనార్హం. చదవండి: (చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు: కొడాలి నాని) -
చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నా చిన్నప్పటి నుంచి గుడివాడలో నన్ను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ కలిసొచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు సాక్షి టీవీతో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా?. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు.. ప్రజా నాయకుడు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది నేనే. విగ్రహం శిలాఫలకంపై నాపేరు వాళ్లకి కనిపించలేదా. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ రంగు ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగు లైనా వేసుకోవచ్చు' అని కొడాలి నాని పేర్కొన్నారు. చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ గుడివాడలో రేపటి టీడీపీ మినీ మహానాడు రద్దుపై కొడాలి నాని సెటైర్స్ వేశారు. 'చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయడం చంద్రబాబు తెలివి తక్కువ తనానికి నిదర్శనం. చంద్రబాబు సాంప్రదాయాలు పాటించడం తెలుసుకోవాలని కొడాలి నాని సూచించారు. చదవండి: (Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం) -
కొడాలి దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు
YSRCP Plenary Meeting 2022 సాక్షి, కృష్ణా జిల్లా: కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని.. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్నినాని పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న పేర్నినాని.. ‘‘కొడాలి నాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. నేను సీఎంని అవుతా.. సీఎం జగన్ను దించేస్తా అనే స్థాయి నుంచి.. ఇవాళ నానిని ఓడిస్తా అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. కానీ, ఇప్పుడు గుడివాడకు కొడాలి నాని ఒక బ్రాండ్ అంబాసిడర్. కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి.. ముందు పోటీకి ఎవరైనా అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి. కొడాలి నానికి భయపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. బాబే కాదు.. ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరు. పేదలకు ఇచ్చిన ఇంటిని నారా లోకేష్ బాత్రూమ్తో పోలుస్తున్నాడు. అక్రమ సంపాదనతో పెద్ద బాత్రూం కట్టించుకున్నావ్ కాబట్టే అలా మాట్లాడుతున్నావ్. పేదల సొంతింటి కల నెరవేర్చిన.. గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని పేర్ని నాని ప్రసంగించారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిందని.. మరో పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పారాయన. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా.. కొడాలి నానిని ఓడించలేరని పేర్కొన్నారు. -
నేను చంద్రబాబు టైపు కాదు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఒక సైనికుడిగా పనిచేయడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో కలిసి పాల్గొన్నారు.మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కొడాలి నానికి.. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఐతే ఈ సందర్భంగా తనను పార్టీ నాయకులు, శ్రేణులు మాజీ మంత్రి అని పిలవడంపై కొడాలి తన దైన శైలిలో స్పందించారు. తనను ఎవరూ మాజీ మంత్రి అని పిలవొద్దని కొడాలి నాని కోరారు. గుడివాడ ఎమ్మెల్యేగానే తాను ఉండటానికి ఇష్టపడతానని మంత్రి పదవి పోతే బాధపడనని తెలిపారు. కానీ ఎమ్మెల్యే పదవి పోతేనే బాధ పడతానని స్పష్టం చేశారు. తానేమీ చంద్రబాబు లాంటి వ్యక్తిని కానని.. బాబు లాంటి వారే పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారంటూ తీవ్రంగా విమర్శించారు. చదవండి: పోలవరం డయాఫ్రమ్ వాల్ నష్టం ఎవరి పాపం?: అంబటి ఏపీ శ్రీలంక అవుతుందని 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. దేవుడు లాంటి వైఎస్సార్ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని గుర్తుచేశారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తాని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడన్నారని మండిపడ్డారు. చదవండి: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్గా నేనే సంతకం చేసి స్టేట్హోమ్లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
మూడంతస్తుల మేడలో.. పావురాలతో 'ప్రేమలో'..
పావురం.. ప్రేమకు ప్రతిరూపం.. శాంతికి చిహ్నం. అటువంటి పావురాల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న ఆయన వాటి కోసం ఏకంగా ఓ ప్రేమ మందిరాన్నే నిర్మించాడు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా వాటిని చూసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మానికొండ గ్రామంలో పావురాలకు ఇల్లు కట్టిన ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు గురించి మీ కోసం ఈ కథనం. – సాక్షి, అమరావతి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గం అది. అక్కడ మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల నడుమ మూడంతస్తుల భవనం ఒకటి కనిసిస్తుంది. ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు. అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాలు సందడి చేస్తుంటాయి. పావురాల శత్రు ప్రాణులు కానీ, వాటి భక్షక ప్రాణులు కానీ ఆ భవనంలోకి ప్రవేశించలేవు. అంటే.. పిల్లి, డేగ వంటి జంతువులు బయటి నుంచి జొరబడకుండా ఇనుప కంచెతో కట్టుదిట్టమైన రక్షణ వలయం, ఆఖరికి దోమలు కూడా దూరకుండా దోమల మెష్ సైతం ఏర్పాటు చేసి ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నట్లే వాటికి కూడా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. 20 రకాల గింజలతో పావురాలకు వేళకు బలమైన ఆహారం, వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంటాయి. అంతేనా.. మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం తన ప్రేమ పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా వినిపిస్తున్నాడు పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావు. అరుదైన జాతులు.. 1,150కి పైగా పావురాలు పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన దాదాపు 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, బంగ్లాదేశ్, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. జెయింట్ హంగేరియన్, అమెరికన్ పాంకెయిన్స్, జాకోబిన్స్, షీల్డ్, వార్లెస్ హ్యుమర్స్, ఓరియంటల్ ఫెరల్, యూరోపియన్ లాహోర్, అమెరికన్ నన్స్, మాల్టీస్, సాండీల్ ముకీస్, చైనీస్ ఓవెల్స్, పెంచ్ మొడెనా, కింగ్స్, షేక్ షెర్లీ, అమెరికన్ ఎలిమెంట్స్, కాప్చినో, జర్మన్ బ్యూటీ హ్యుమర్, వాల్గట్ పౌటర్, హెన్నా పౌటర్, మూన్ మార్క్ పౌటర్, బోటెడ్ ఎల్మెంట్, పెషర్ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. పావురం.. ప్రేమకు ప్రతిరూపం ప్రపంచ వ్యాప్తంగా పావురాలను ప్రేమకు, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. రెండు పావురాలు జత కడితే ఇక జీవితాంతం ఆ రెండే కలిసి జీవిస్తాయి. జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో చనిపోతుంది లేదా చనిపోయే వరకు ఒంటరిగానే జీవిస్తుంది. అంతే తప్ప వేరొక పావురంతో ఎట్టి పరిస్థితిలోనూ జత కట్టదు. పావురం అంటే ప్రాణం ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, జంతువులతోనూ మనకు ప్రేమానుబంధం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పావురాలంటే ప్రాణం. తొలుత కొన్నింటిని ఇంటి వద్దే పెంచేవాడిని. 8 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా వాటి కోసమే ఇల్లు నిర్మించాను. ఉదయాన్నే లేచి వాటిని చూడందే ఆ రోజు మొదలవ్వదు. వాటితో ఉంటే నా వ్యయప్రయాసలు, సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. అన్ని వందల పావురాల్లో ప్రతి పావురం నాకు ప్రత్యేకమే. ఏ ఒక్క పావురాన్ని వేరు చేసినా నేను గుర్తించగలను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. – చెరుకువాడ శ్రీనివాసరావు, మానికొండ, కృష్ణా జిల్లా మా నాన్నకు అవి కూడా పిల్లలే.. మేము పుట్టక ముందు నుంచే మా నాన్న పావురాలను పెంచుకుంటున్నారు. నేను, నా సోదరుడు సుధీర్ చదువుకుని స్థిరపడ్డాం. మాకు ఉండటానికి ఇల్లు కట్టినట్టే.. పావురాలకూ ప్రత్యేకంగా ఇల్లు కట్టిన మా నాన్నకు అవి అంటే ప్రాణం. అందుకే నేను వివాహమై అత్తగారింటికి వెళ్లినా, మా నాన్న పెంచుకుంటున్న పావురాలను భవిష్యత్లోనూ మేము సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఇదే మా నాన్నకు మేమిచ్చే బహుమానం. – దాసరి రవళి, శ్రీనివాసరావు కుమార్తె -
గుడివాడ క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్కు ఫిర్యాదు..?
సాక్షి, కృష్ణా: గుడివాడ క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి. గుడివాడలో నన్ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి' అని మంత్రి కొడాలి నాని అన్నారు. చదవండి: (వారి తరపున సీఎం జగన్కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని) -
వారి తరపున సీఎం జగన్కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని
సాక్షి, గుడివాడ: పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చదవండి: (రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..) -
సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామా
గుడివాడ: సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామాకు తెరలేపింది. సంక్రాంతి ముగిసిన పదిరోజుల తర్వాత ముగింపు ఉత్సవాలంటూ గుడివాడలో హడావిడి చేసింది. గుడివాడలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా బీజేపీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుడివాడ వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను నందమూరు వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. -
కాసినో నిర్వహించినట్లు నిరూపించు.. లేదంటే ఆత్మాహుతికి సిద్ధమా?
సాక్షి,అమరావతి: ‘నా సవాల్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నా కల్యాణ మండపంలో కాసినోలు, జూదాలు జరిగాయని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటా. నిరూపించలేకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుం టావా’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కు మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మరో మారు సవాల్ విసిరారు. ‘చంద్రబాబు నిర్ణయం కోసం పది రోజులు వేచి చూస్తా. అప్పటిలోగా నిరూపించలేకపోతే అక్కడ కాసినోలు జరగలేదని అంగీకరించినట్టే. అబద్ధాలు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, ఆయన కుల మీడియా క్షమాపణలు చెప్పాలి. నా కల్యాణ మండపం దగ్గర సీసీ కెమెరాలున్నాయి. సీసీ ఫుటేజ్ని నేనే మీడియాకు విడుదల చేస్తా. కాసినో,జూదం జరగలేదని నిరూపిస్తా. చంద్రబాబు, ఆయన కుల మీడియా ఎన్ని కుట్రలు చేసినా నన్నేమీ చేయలేరు’ అని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘గుడివాడలో కాసినోలు, జూదాలు జరిగాయని చంద్రబాబు కుల మీడియాలో అబద్ధపు వార్తలు రాశారు. దానిపై నిజనిర్థారణ కమిటీ వేసి, బోండా ఉమాను పంపించారు. అక్కడి ప్రజలే వారిపై తిరగబడి ఏం శాస్తి చేశారో అనుభవపూర్వకంగా చూశారు. కాసినోలు జరిగాయని ఆరోపణలు చేసింది బాబు, ఆయన కుల మీడియా. కమిటీ వేసింది చంద్రబాబు. మా కులానికి, మా కుల మీడియాకు వ్యతిరేకంగా చంద్రబా బును కాదని, సీఎం వైఎస్ జగన్కు మద్దతు తెలుపుతున్నానని వీళ్లంతా ఏకమై నిందలు వే స్తున్నారు. ఎక్కడో తీసిన విజువల్స్, ఫొటోలను తీసుకొచ్చి నా కల్యాణ మండపంలో జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సంస్థ హెరిటేజ్ ఫ్రెష్లలో వ్యభిచారం జరుగుతున్నదని నేను ఆరోపించి, పదిమందితో నేనే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తే, వాటిలో ఏం జరుగుతోందో చంద్రబాబు చూపిస్తారా? హెరిటేజ్ ఫ్రెష్లలో తిరిగేందుకు అనుమతిస్తారా? ఎవరింట్లోకి వచ్చి నిర్థారణ చేస్తారు? మీ కుల మీడియాలో మీరే అడ్డగోలు రాతలు రాసుకుని, మీరే కమిటీలు వేసుకుని, మీరే వ చ్చి నిజ నిర్థారణ చేస్తారా? బోండా ఉమ, వర్ల రామయ్యకు ఏం సంబంధం? చేతనైతే చంద్రబాబు నిరూపించాలి’ అని అన్నారు. ‘సంక్రాంతి నాడే కాదు, చిన్న ఫంక్షన్లలో కూడా ఈ రోజుల్లో చాలా మంది సినిమా పాటలకు రికా ర్డింగ్ డ్యాన్సులు వేయిస్తున్నారు. టీడీపీ మీటింగుల్లో కూడా పాటలు పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్నారు. వాటన్నింటినీ చంద్రబాబు ఆపేయిస్తారా?’ అని నాని ప్రశ్నించారు. బాబు హయాంలో పేకాట క్లబ్బులు.. ‘చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పేకాట శిబిరాలు, వ్యభిచార వృత్తులు నడిపే వేల కోట్లు సంపాదించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో క్లబ్లు నడిపిన వ్యక్తి. వాటిని ఎమ్మెల్యేలకు అప్పగించి, తన కొడుకు లోకేశ్ ద్వారా డబ్బులు వసూలు చేసి బతికిన వ్యక్తి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక క్లబ్లన్నింటినీ మూసేయించారు. అటువంటి చంద్రబాబు, ఆయన తాబేదారులు, ఆయన కుల మీడియా కాసినోలు, జూదాల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అడ్డంగా దొరికిపోయి ఇక్కడకు పారిపోయి వచ్చిన దొంగ బాబే అటువంటి పనులు చేయగలరు. మరెవరూ చేయలేరు’ అని చెప్పారు. -
కవ్వించి కయ్యానికి.. టీడీపీ నిజ నిర్ధారణ ఆంతర్యం ఇదే
సాక్షి, అమరావతి: అధికారం పోయింది.. నాయకులు కరువైపోతున్నారు.. కేడర్ కనుమరుగైపోతోంది.. జనంలో పరపతి పోయింది.. దీంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ అధినాయకత్వం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలతో కవ్వించి మరీ కయ్యానికి కాలు దువ్వుతోంది. అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక అంశంపై వివాదం సృష్టించడం, రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న పల్లెలు, పట్టణాల్లో చిచ్చు రాజేయడం పనిగా పెట్టుకుంది. నిజ నిర్థారణ కమిటీల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాద్ధాంతాలకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలో కాసినో నిర్వహించినట్లు ఎల్లో మీడియా కథనాలు వండి వార్చగా, వెంటనే చంద్రబాబు దానిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించారు. వర్ల రామయ్య, నక్కా ఆనంద్బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్యను కమిటీ సభ్యులుగా గుడివాడ పంపారు. వీరు అక్కడకు వెళ్లక ముందే టీడీపీ నేతలు మంత్రి కొడాలి నాని కాసినో నిర్వహించారని మూకుమ్మడి దాడి మొదలు పెట్టారు. శుక్రవారం కమిటీ గుడివాడ వెళ్లింది. వాస్తవానికి కమిటీ సభ్యులే అక్కడికి వెళ్లి, నిజానిజాలు వెలికితీయాలి. కానీ, గుంటూరు, విజయవాడ నుంచి వందల మందిని పంపించారు. వారంతా గుడివాడ వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను కవ్వించారు. ఎల్లో, సోషల్ మీడియాల ద్వారా సవాళ్లు విసురుతూ, ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానీపై విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను నియంత్రించారు. లేకపోతే గుడివాడలో రణరంగాన్ని సృష్టించాలని టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఇంతకు ముందు కూడా అధికార వైఎస్సార్సీపీకి సంబంధం లేని పలు అంశాల్లో టీడీపీ ఇదే విధంగా వ్యవహరించింది. ► ఇటీవల గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేసి ఘర్షణలు సృష్టించడానికి టీడీపీ విఫలయత్నం చేసింది. ► గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయం చేసేందుకు చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లి అభాసుపాలయ్యారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వందలాది మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ పన్నాగం ఆడియో టేపులు బహిర్గతమవడంతో టీడీపీ బండారం బయటపడింది. టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న గతంలో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఉదంతాలున్నాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప తదితరులతో నిజ నిర్థారణ కమిటీని వేసి అక్కడ హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇలా ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దాన్ని రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చి, వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అంటగట్టి బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే, వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు. కనీసం ఆయన పార్టీ కేడర్ కూడా మద్దతివ్వడంలేదు. ఇందుకు శుక్రవారం గుడివాడలో కమిటీ పర్యటనే ఉదాహరణ. అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు స్థానిక కేడర్ అండ లేకుండా పోయింది. స్థానిక నేతలు కూడా దూరంగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో చంద్రబాబు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. -
గుడివాడలో టీడీపీకి భంగపాటు
గుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో విజయవాడ నుంచి తెచ్చిన నాయకులతో రచ్చ చేయాలని చూసిన తెలుగుదేశం పార్టీ భంగపాటుకు గురైంది. కాసినో సాకుగా మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేయాలన్న టీడీపీ ఎత్తుగడలు ఫలించలేదు. శుక్రవారం ఉదయం పట్టణంలోకి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు చేరుకున్నప్పటికీ స్థానిక క్యాడర్ రాకపోవడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ప్రధానంగా గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో నిజనిర్ధారణ కమిటీకి దూరంగా ఉన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు జాడ కనిపించలేదు. విజయవాడ నుంచి టీడీపీ నాయకులు వచ్చినట్లు తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. బెజవాడ రౌడీలు, టీడీపీ గూండాలు పట్టణం విడిచి పోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. రచ్చ చేసేందుకే.. సంక్రాంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి చెందిన కే కన్వెన్షన్ కల్యాణ మండపంలో కాసినో నిర్వహించినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. దీనిని నిర్ధారించే పేరుతో ఆ పార్టీ నాయకులు నక్కా ఆనంద్బాబు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి రాజేంద్ర, తంగిరాల సౌమ్యతో నిజనిర్ధారణ కమిటీని శుక్రవారం పట్టణానికి పంపింది. అయితే, అక్కడకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరూ రాకపోవడంతో కమిటీ సభ్యులు చాలా సేపు గుడివాడలోని పార్టీ ఆఫీసులో కూర్చొన్నారు. ఫోన్లు చేసి స్థానిక నాయకులు, కార్యకర్తలు రావాలని కోరారు. అయినా, పార్టీ కార్యకర్తల నుంచి స్పందన రాలేదు. నిజ నిర్ధారణ కమిటీ పేరిట పట్టణంలో అలజడి సృష్టించడానికే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కే కన్వెన్షన్లో ఏ విధమైన జూద క్రీడలు జరగలేదని, తమ నేతను అప్రతిష్ట పాల్జేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులను తక్షణమే పట్టణం నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మండలి హనుమంతరావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నాగవరప్పాడు వంతెన వద్ద లింగవరం రోడ్లో బైఠాయించారు. అనంతరం కొత్త మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెజవాడ రౌడీలు, టీడీపీ గూండాలు పట్టణం విడిచి పోవాలంటూ డిమాండ్ చేశారు. ఈలోగా బయటి నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొన్నారు. నిజనిర్ధారణ కమిటీని కల్యాణ మండపానికి వెళ్లనివ్వాలంటూ నినాదాలు చేస్తూ హైడ్రామాకు తెరలేపారు. ఇరువర్గాలు ఒకే చోటకు చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు టీడీపీ నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమిరా అనడంతో నాయకులను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను సైతం పోలీసులు అక్కడి నుండి పంపించివేశారు. బెజవాడ నుంచి వచ్చిన నేతలు కల్యాణ మండపం వరకు వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కుట్రపూరితంగా వ్యవహరించిన టీడీపీ : ఏలూరు రేంజి డీఐజీ ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు ఉన్న స్వేచ్ఛను రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్రావు చెప్పారు. శుక్రవారం రాత్రి ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరించారని అన్నారు. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆరుగురితో నిజనిర్ధారణ కమిటీగా గుడివాడ వెళ్తామని కోరితే అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ వారు ఇచ్చిన మాటకు కట్టుబడలేదని చెప్పారు. కార్యకర్తలను పిలిపించి, ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంలో కుట్ర ఉందని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వారిలా చేసినట్లు తమకు అర్థమైందన్నారు. స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా వ్యవహరించారని అభినందించారు. టీడీపీ నేత వర్ల రామయ్య తనను గృహ నిర్భంధం చేయాలని ముందుగానే ఎందుకు కోరారని ప్రశ్నించారు. మరి కొందరు టీడీపీ నేతలు కూడా ముందుగానే అరెస్ట్ చేయాలని కోరారని, పోలీసులను అపఖ్యాతిపాలు చేసేందుకే ఇలా చేశారని చెప్పారు. రాజకీయాల కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారంనాటి ఘటనలపై ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ పోలీసులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద సమస్య తలెత్తేదన్నారు. ఎక్కడా పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా, చాకచక్యంగా వ్యవహరించడంవల్లే ఈ సమస్యను పరిష్కరించగలిగామన్నారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన పోలీసు బృందం కాసినో నిర్వహించారన్న టీడీపీ నాయకుల ఆరోపణల మేరకు పోలీసు శాఖ నియమించిన ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. దిశ డీఎస్పీ రాజీవ్కుమార్ ఆధ్వర్యంలో నూజివీడు డీఎస్పీ, ట్రైనింగ్ ఏఎస్పీతో కూడిన బృందం కల్యాణ మండపం బయట, లోపల పరిశీలించింది. తమ నివేదికను ఎస్పీకి అందజేస్తామని ఆ బృందం తెలిపింది. -
బాబు, లోకేష్లకే కాసినో గురించి బాగా తెలుసు
సాక్షి, అమరావతి: కాసినోలు, అశ్లీల నృత్యాల గురించి చంద్రబాబు, లోకేష్లకు బాగా తెలుసని రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్లో మహిళలతో అర్ధ నగ్నంగా, చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని చేసిన వేషాలను అందరూ చూశారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కల్యాణ మండపంలో కాసినో, జూదం నిర్వహించినట్టు రుజువు చేస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో చంద్రబాబు చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది, చేస్తోంది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పటికీ మహిళలను అడ్డు పెట్టుకుని బతుకుతున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. గతంలో లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. మరో మహిళను అడ్డుపెట్టుకుని బ్రోకర్ పని చేసి సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని చెప్పారు. చివరికి కట్టుకున్న భార్యను కూడా రాజకీయాల కోసం రోడ్డుపైకి తెచ్చారన్నారు. రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడని వ్యాఖ్యానించారు. రెండు వారాలుగా గుడివాడలో లేను తాను గత రెండు వారాలుగా గుడివాడలో లేనని, కోవిడ్తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిæ కేబినెట్ మీటింగ్ కోసం వచ్చినట్టు తెలిపారు. అటువంటిది చంద్రబాబు పెట్టే పెడిగ్రీ తింటూ.. ఆయన ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, మొరిగే తొత్తులు గుడివాడలోని తన కల్యాణ మండపంలో ఏదో జరిగిపోతోందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూట్రల్ మీడియా గుడివాడ వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకుని ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారని, ఇంకా సిగ్గూ, శరం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ గుడివాడ వెళ్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయన్నారు. ఎక్కడో డ్యాన్సులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తే.. తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించానని చెప్పారు. చంద్రబాబు కాదు కదా.. ఎవరొచ్చినా గుడివాడలో ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. -
వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.1600 కోట్లతో శిథిలావస్థలోఉన్న ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవీ చదవండి: వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల బిగ్బాస్-13 విన్నర్, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
ఆయనకన్నా ఎక్కువ ధాన్యం సేకరించాం
-
Pedapalem: పచ్చని పల్లె.. కరోనాకు హడలే
గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు. ఊరి పట్టునే ఉంటే కరోనా సోకదని నిరూపిస్తున్నారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శివారు పెదపాలెంలో 125 కుటుంబాలుండగా.. గ్రామ జనాభా 300కు పైగానే ఉంది. ఆకు పచ్చ చీర కట్టినట్టుగా ఉండే ఆ పల్లె కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూ.. మహమ్మారిని దరిచేరకుండా గ్రామస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పొలం పనులు చేసే సమయంలోనూ కరోనా నియమావళిని బాధ్యతగా పాటిస్తోంది. కఠిన నిబంధనలే శ్రీరామరక్షగా.. ఎలాంటి అవసరం ఉన్నా ఎవరూ ఊరు దాటి వెళ్లకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకున్నారు. గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బంధుమిత్రులను కూడా ఊరిలోకి రానివ్వడం లేదు. తమ వారందరికీ ముందే ఈ విషయం తెలియజేశారు. తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లినా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. గ్రామంలో ఉన్న వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు. గ్రామస్తులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఎవర్నీ రానివ్వటం లేదు ఎవర్నీ ఊరిలోకి రానివ్వడం లేదు. మేం కూడా ఊరు దాటి వెళ్లకుండా లాక్డౌన్ పెట్టుకున్నాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లను వాడుతున్నాం. – గుమ్మడి నరసింహారావు, గ్రామస్తుడు బయట అవసరాలకు మాత్రమే మా గ్రామం నుంచి దాదాపుగా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. బయట అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరిద్దరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నారు. – విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ శానిటేషన్ ఒక కారణమే... కరోనా వచ్చిన నాటి నుంచి పెదపాలెంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాం. గ్రామస్తులు కట్టుబాట్లతోనే వైరస్కు దూరంగా ఉన్నారు. – కనుమూరి రామిరెడ్డి, కొండాలమ్మ ఆలయ చైర్మన్ ప్రజల సహకారంతోనే.. ప్రజలు ఇంటి పట్టునే ఉండటం వల్ల గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. చేతుల్ని శుభ్రం చేసుకోవటం, మాస్కులు ధరించటం, పారిశుధ్య పనులను చేపట్టడం ద్వారా కరోనాను కట్టడి చేస్తున్నాం. – ఓగిరాల వెంకటరత్నం, గ్రామ కార్యదర్శి -
వైఎస్సార్, జగనన్న స్మార్ట్ టౌన్ పథకం కింద ఇళ్ల స్థలాలు
-
ఆర్ఆర్ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం
గుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందన లేకుండా పోతోంది. కనీసం ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఇవి వెళ్లడం లేదని సమాచారం. ఇక్కడ పనిచేసే అధికారులే ఎక్కువ శాతం ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో ఎవరూ కిమ్మనడం లేదని తెలుస్తోంది. అందుకే దీనిపై ఫిర్యాదులు వెళ్లినా మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పందన నిల్.. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక గత నెల 25న ‘పరిశోధనం స్వాహా’ అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది వచ్చి పదిహేను రోజులు దాటినా ఇంతవరకు దీనిపై కనీస చర్యలకు పూనుకోలేదు. వాస్తవానికి దీనిపై విచారణకు ఆదేశించేందుకు ఏ అధికారి ముందుకు రావడం లేదని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి అధికారులు అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల నుంచి ఫలానా మెడికల్ షాపుల్లో మందులు కొనాలని ప్రిప్రస్కిప్షన్ రాయటం వరకు ఏదో ఒక మార్గంలో కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని చెబుతున్నారు. మంచి సక్సెస్ రేటు.. గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధనా స్థానం నుంచి గతంలో అనేక పరిశోధనలు విజయవంతం అయ్యాయి. హోమియో వైద్యం ద్వారా అనేక వంశపారంపర్య దీర్ఘ రోగాలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చిస్తుంటే, ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు మాత్రం సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాక ముందు.. ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి మరో హోమియో స్టోర్స్ యజమానుల భాగస్వామ్యంతో పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన మందుల కంపెనీకి చెందిన మందులనే ఇక్కడకు వచ్చిన తమకు అంటగట్టేవారని రోగులు చెబుతున్నారు. ఈ తంతు రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వచ్చే రోగులకు కనీసం రెండు మూడు రకాల ‘మందులు ఇక్కడ లేవు. ఫలానా మందుల షాపులో కొనుక్కోండి’ అని చెప్పి పంపేవారని రోగులు వివరిస్తున్నారు. అయితే సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమయ్యాక ఫలానా షాపులో కొనండి అని రాసే స్లిప్పులను తొలగించారు. రోగి తనకిష్టం వచ్చిన చోట మందులు కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడా అక్కడా తీసుకుంటున్నారు.. ఆర్ఆర్ఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వైద్యులు ఇళ్ల వద్ద ప్రైవేట్ వైద్య సేవలు నిర్వహించరాదు. అందుకు ప్రతిగా వారికి బేసిక్ పేలో 20 శాతం అదనంగా జీతం అందజేస్తారు. అంటే రూ.2 లక్షలు బేసిక్ ఉంటే రూ.40 వేలు నెలకు అదనపు జీతం అందుతుంది. అయినప్పటికీ ఆర్ఆర్ఐలో పనిచేస్తున్న వారు ఇంటి వద్ద వైద్య వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు ఇక్కడ పరి్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందరూ ఇక్కడా అక్కడా లాభం పొందుతూనే ఉన్నారు. ఇప్పటికైనా స్పందిస్తే.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఐలో అవినీతి ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలోనూ.. ఇక్కడ ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగాల నియామకంలో తన చేతివాటం చూపించి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో 2019 జూలై నెలలో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (177/2019) నమోదు చేశారు. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇందుకోసం ఇక్కడ పనిచేసిన విశ్రాంత ఉద్యోగి(యూడీసీ) కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయం తీసుకుని, నిరుద్యోగులను ప్రలోభపెట్టి ఈ వసూలు దందాకు పాల్పడ్డాడని చెబుతున్నారు. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా.. -
గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేరీ విజయ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా, పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి మంత్రి కొడాలి నాని.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆనాడు స్పందించని పవన్.. ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. పూర్తి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. ఆనాడు స్పందించని పవన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైంది. తండ్రి హత్య కేసుపై కుమార్తె సీబీఐని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ‘‘పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగ్లు, స్క్రిప్ట్ను చదువుతున్నాడు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. విపక్షాలు మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నాయి. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని’’ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చదవండి: దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్ -
శివయ్య సేవలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/గుడివాడ టౌన్ : కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక మహా శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు అరగంట సేపు శివుని సేవలో పాలు పంచుకున్నారు. నిలువెత్తు శివుని విగ్రహం ముందు ఏర్పాటు చేసిన తేజో(శివ) లింగానికి మహారుద్ర, చతుర్వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పవిత్ర జలాలతో స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం బిల్వ పత్రాలను శివ లింగానికి సమర్పించి నమస్కరించారు. పూలు, రుద్రాక్షల దండలతో శివలింగాన్ని స్వయంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ వేద పండితులు అందజేసిన హారతిని సీఎం జగన్ కూడా కళ్లకు అద్దుకున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చుట్టిన తలపాగాతో పట్టువస్త్రంలో వివిధ సుగంధ పరిమళాలతో కూడిన వస్తువులను నెత్తిన ఉంచుకొని భక్తి శ్రద్ధలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాటిని హోమంలో అగ్నిదేవునికి ఆహుతినిచ్చారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. శివుని కృపా కటాక్షాల కోసం మహా సంకల్పం పరమశివుని కృపాకటాక్షాలను సీఎం జగన్ మోహన్రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు సిద్ధింప చేయాలనే మహాసంకల్పంతో మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుండి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు మహారుద్ర పారాయణం, రుద్రహోమం, సహస్ర లింగార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, జాగరణ దీక్ష నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా, మహాదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘విశేష పూజలు, జాగరణతో ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. – శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్ -
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: విధుల్లో ఉన్న ఎస్ఐని నెట్టేసిన కొల్లు రవీంద్ర సీఎం జగన్ మహా శివరాత్రి శుభాకాంక్షలు -
నేడు గుడివాడకు సీఎం జగన్
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తారు. గుడివాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి 11.30–11.50 గంటల మధ్య గుడివాడ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. -
ఎస్సై ఆత్మహత్యను రాజకీయాలకు వాడుకుంటారా?
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గుడివాడ టూటౌన్ ఎస్సై విజయకుమార్ మరణాన్ని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం హేయమైన చర్య అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనుకుల శ్రీనివాసరావు, ఎండీ మస్తాన్ఖాన్ పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెండురోజుల కిందట ఎస్సై విజయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆయన మరణానికి గల కారణాలను వక్రీకరిస్తూ, అవాస్తవాలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. పేకాట శిబిరాలపై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించడం విచారకరమని చెప్పారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. ఎస్సై విజయ్కుమార్ కేసు ప్రాథమిక విచారణలో ఉందని, దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తులు ఏస్థాయిలో ఉన్నా వారిపై న్యాయ పోరాటం చేయడానికి తమ సంఘం వెనుకాడబోదన్నారు. ఎస్సై మరణంపై దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఎస్ఐ సూసైడ్: జైలుకు బ్యూటీషియన్) అచ్చెన్నాయుడు బెదిరింపులకు భయపడం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి బెదిరింపులకు భయపడమని శ్రీనివాసరావు చెప్పారు. అచ్చెన్నాయుడుపై చట్టపరమై న చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థపై వ్యాఖ్యలతో హీరోలవుదామని భావించేవారు ఎప్పటికీ జీరోలుగానే మిగిలిపోతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎం.సోమశేఖ రరెడ్డి, ఎం.కామరాజ్, జ్యోతినాథ్ పాల్గొన్నారు. -
ఎస్ఐ ఆత్మహత్య: ప్రియురాలు రిమాండ్
సాక్షి, విజయవాడ: గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు బ్యూటీషియన్ సురేఖను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా గుడివాడలో డీఎస్పీ సత్యానందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎస్ఐ విజయ్కుమార్ ఆత్మహత్య వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్ కుమార్ వ్యక్తి గత కారణాల వల్లే మరణించాడని తెలిపారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడిలకు తట్టుకోలేక మృతిచెందాడని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడం అవాస్తవమని స్పష్టం చేశారు. దేవినేని ఉమ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. పోలీసులను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. ఎస్ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పిల్లి విజయ్కుమార్(34)కు రెండున్నర నెలల క్రితం ఏలూరుకు చెందిన యువతితో వివాహమైంది. పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఎస్ఐ ఒక్కడే అద్దెకుంటున్నాడు. అతడికి హనుమాన్ జంక్షన్లో పని చేస్తున్న సమయంలో సురేఖ అనే బ్యూటీషియన్తో పరిచయం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సురేఖ భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం వీఆర్లో ఉంచారు. తిరిగి గుడ్లవల్లేరులో ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మండవల్లిలో పనిచేసిన ఆయన ఇటీవల గుడివాడకు బదిలీ అయ్యారు. కాగా, విజయ్ కుమార్ భార్యను కాపురానికి తీసుకురావద్దని, తనతోనే ఉండాలని సురేఖ తరచూ గొడవ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో సురేఖ.. విజయ్కుమార్ అపార్ట్మెంట్కు వెళ్లి అతనితో ఇదే అంశంపై గట్టిగా ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 'నీవు నీ భార్యకు విడాకులు ఇవ్వని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్లో నీవే కారణమని తెలుపుతాను' అనిహెచ్చరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎస్ఐ తన గదిలోని ఫ్యాన్ హుక్కు టవల్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (చదవండి: గుడివాడ టూ టౌన్ ఎస్సై బలవన్మరణం) -
గుడివాడ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని విజయ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. విజయ్కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడికి రెండు నెలల కిందటే వివాహమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్సై. హనుమాన్ జంక్షన్లో తొలి బాధ్యతలు చేపట్టాడు. అయితే నూజివీడుకు చెందిన బ్యూటీషియన్తో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల కిందట వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్తో కలిసి ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. బ్యూటిషన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్కుమార్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, ఏరియా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
జగన్ బాత్రూమ్ను లోకేశ్ కడిగాడా?
సాక్షి, గుడ్లవల్లేరు (గుడివాడ): పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్లను సీఎం వైఎస్ జగన్ ఇంటి బాత్రూమ్తో పోల్చిన లోకేశ్.. ఎప్పుడైనా ఆ బాత్రూమ్ను కడిగాడా? అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పేదలకు నిర్మించే ఇంటి ని బాత్రూమ్తో పోల్చటంతో పేదలంటే లోకేశ్కు ఎంత చులకనో అర్ధమవుతోందన్నారు. గుడ్లవల్లేరులో శనివారం ఇళ్ల పట్టాలను అందించి, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మంత్రి కొడాలితోపాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఎవరి బాత్రూమ్ ఎంత ఉందో కొలిచే దుస్థితిలో బాబు, లోకేశ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పేదలపై అంత కడుపు మంట ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్లో ఒక్కో ఇంటి వైశాల్యం 244 చదరపు అడుగులుంటే, జగన్ ఇచ్చే ఇంటి వైశాల్యం 340 చదరపు అడుగులుందన్నారు. వైఎస్సార్ భూసేకరణ.. పట్టాలిస్తున్న జగన్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12 ఏళ్ల కిందట గుడ్లవల్లేరులో 31 ఎకరాలను ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేస్తే.. ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్ వాటికి పట్టాలిచ్చి ఇళ్లను నిర్మిస్తున్నారని కొడాలి నాని అన్నారు. వైఎస్ మరణానంతరం, కిరణ్, రోశయ్య, చంద్రబాబు ఈ ప్రాంతానికి ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టడంగాని ఒక్క ఇంటి పట్టా ఇవ్వడంగాని చేయలేకపోయారన్నారు. -
వ్యవసాయ మార్కెట్లోని సభలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
-
అది చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు
సాక్షి, కృష్ణా : వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను చూసి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడం లేదని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు దోచుకున్నారని, కేంద్రం నుంచి వచ్చిన సబ్సీడీ డబ్బు కూడా దోచేశారని మండిపడ్డారు. ఆదివారం ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ( టీడీపీలో ‘రాజీనామా’ ప్రకంపనలు..) సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు కెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 కల్లా గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. -
త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
సాక్షి, విజయవాడ: ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానికంగా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కలగడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది సచివాలయ వ్యవస్థ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలలో అన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నాం. త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూమి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభిస్తాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం. ఇది రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుంది. (ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పటం, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ఆలోచన చెయ్యాలని చెప్పటం మనకు గర్వకారణం. గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి ప్రతి మూడు నెలలకు పరీక్ష పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చెయ్యనున్నట్లు మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (మహాత్ముని అడుగుజాడల్లోనే..) -
బాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటా: కొడాలి
సాక్షి, కృష్ణా : రాష్ట్రంలో పేదలకు అందించే ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గురువారం గుడివాడలో పర్యటించిన మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడారు. కొన్ని చోట్ల న్యాయస్థానం స్టే ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అడ్డంకుల కారణంగా ఇళ్ళ స్దలాల పంపిణీ వాయిదా వేశామన్నారు. ఎవరు ఎన్ని కేసులు వేసినా వాటన్నింటిని పరిష్కరించుకొని మహిళల పేరునే రిజష్ట్రేషన్ చేసి ఇళ్ల స్దలాలు అందిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిలేని వారే తనపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తనపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. (చదవండి : రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు) -
గుడివాడలో 'హౌస్ ఫర్ ఆల్' పథకం ప్రారంభం
సాక్షి, గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు. -
వివాహ వేడుకలో పీపీఈ కిట్లతో..
-
పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..) ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. (‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’ ) -
అన్న ఇంటికే కన్నం వేసిన సోదరి
సాక్షి, కృష్ణా : డబ్బు మైకం కమ్మేయటంతో సంబంధ బాంధవ్యాలను పక్కన పడేసింది ఓ మహిళ. క్రిమినల్స్తో చేతులు కలిపి సొంత అన్న ఇంటికే కన్నం వేయడానికి పక్కా స్కెచ్ గీసింది. మూడో కంటిన పడకుండా సినీ ఫక్కీలో దోపిడీ చేయించింది. పాపం పండటంతో ఖాకీల చేతికి చిక్కి కటకటాల పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటకు చెందిన పిల్లిమెట్ల నాగరాజు గతనెల 27న తనకు సంబంధించిన ఓ స్థలాన్ని విక్రయించారు. దానికి వచ్చిన పదిలక్షల డబ్బును ఇంటికి తెచ్చి భద్రపరిచారు. మొదటి నుంచీ నాగరాజు ఎదుగుదలను ద్వేషించే పిన్ని కూతురు కుమారి కన్ను ఆ డబ్బుపై పడింది. ఎలాగైనా డబ్బుకొట్టేసి నాగరాజును దెబ్బతీయాలని కుట్ర పన్నింది. (మద్యం అక్రమ రవాణా.. ఉపాధ్యాయుడి అరెస్ట్) తెలిసిన పాత నేరస్థులతో చేతులు కలిపి దోపిడికి పథకం రచించింది. ఆరుగురురితో ఓ ముఠాను తయారు చేసింది. ఈ క్రమంలోనే 29న తన స్కెచ్ను అమలు చేసింది. అర్థరాత్రి తానే వెళ్లి కాలింగ్ బెల్ కొట్టి.. ఆరుగురు దొంగలతో కలిసి కత్తులతో బెందిరించి ఇంట్లో ఉన్న పది లక్షలతో పాటు బంగారాన్ని సైతం ఊడ్చుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఐదురోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. కుమారీతో పాటు దోపిడికి పాల్పడ్డ అరడజను దొంగలను అదుపులోకి తీసుకున్నారు. (సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్) -
ఎన్నో కష్టాలు పడ్డా: జస్టిస్ బట్టు దేవానంద్
సాక్షి, గుడివాడ: గొప్ప న్యాయమూర్తిగా కన్నా.. మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంటానని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. వారు కష్టపడి చదివించారని.. 30 సంవత్సరాలుగా న్యాయవృత్తిలో ఉన్నానని చెప్పారు. ('గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు') వ్యక్తిగత, వృత్తిపరంగా ఎన్నో కష్టాలు పడ్డానని పేర్కొన్నారు. డాక్టర్ కన్నా ఒక్క న్యాయ మూర్తినే మై లాట్ అని.. భగవంతుని ప్రతినిధి అంటారని పేర్కొన్నారు. గుడివాడ నుంచి ఈ స్థాయికి చేరడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. తాను ఈ స్థాయికి రావడానికి తాన కుటుంబసభ్యులే కారణమని తెలిపారు. గుడివాడకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు. -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, గుడివాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) గుడివాడలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లింగవరం రోడ్ కే కన్వెన్షన్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. జాతీయ ఎడ్ల పోటీలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 5.30 గంటకలు తాడేపల్లిలోని నివాసానికి చేరకుంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు. -
అలా చెప్పడానికి ఆయనెవరూ..
సాక్షి, గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గుడివాడలో జరిగే సంక్రాంతి వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాయని చెప్పారు. కాటికి కాలు చాపిన వయసులో కూడా చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంక్రాంతి పండుగను చేసుకోవద్దని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ధ్వజమెత్తారు. ఆయన సంక్రాంతి చేసుకోకపోతే రాష్ట్ర ప్రజలు చేసుకోకూడదా అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. చదవండి: సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ -
సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు. గుడివాడకు వెళ్లనున్న సీఎం జగన్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో నేడు నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 3.45 గంటల నుంచి 4.45 వరకు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి 5.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. (చదవండి : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది) -
పవన్తో ఎలాంటి చర్చలు ఉండవు :రాపాక
-
పవన్తో అలాంటివేం ఉండవు : జనసేన ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ : ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు పవన్ కల్యాణ్కు నాకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు. ఇక్కడకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా అభిప్రాయాలను నేను కచ్చితంగా చెప్తాను. రాజధాని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేసే బదులు ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరుగుతుంది. ఎడ్ల పందేలంటే ఇష్టంతోనే గుడివాడ వచ్చాను. నన్ను ఈ పందేలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదాలు’అన్నారు. (చదవండి : మూడు రాజధానులు మంచిదే) గ్రాఫిక్స్ రాజధాని కాదు.. మూడు ప్రాంతాల అభివృద్ధి 23 సీట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఉద్యమాల పేరుతో బాబు రాజధాని రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాగా గ్రాఫిక్స్ రాజధాని కాకుండా మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత మందినైనా వాడుకుని వదిలివేయటం చంద్రబాబు కు అలవాటని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఆయనకు జోలె పట్టుకొని రాజకీయం చేయడం పెద్ద విషయం కాదని అన్నారు. బాబు మాటలు విని రాజధాని రైతులు మోసపోవద్దని కోరారు. రైతులకు ఏమి కావాలో చర్చిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. రాపాక వరప్రసాద్ నాకు మంచి మిత్రుడని మంత్రి చెప్పారు.