Huzurnagar Bye-Election 2019
-
ఉత్తమ్కు కేసీఆర్ దెబ్బ రుచి చూపించాం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయన సొంత గడ్డపైనే కేసీఆర్ దెబ్బ ఏంటో రుచి చూపించాం. హుజూర్నగర్ అంటే గతంలో ఉత్తమ్ గడ్డ అనే వారు. కానీ ఇప్పుడు ఆ గడ్డపైనే టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది’అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటో తేదీన మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గం పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచిన సైదిరెడ్డి బుధవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో పాటు పలువురు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతోపాటు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సైదిరెడ్డి నివాళి అరి్పంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్గా జీవన్రెడ్డి శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా ఆర్మూరు శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీవన్రెడ్డిని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, జగదీశ్రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు అభినందించారు. జీవన్రెడ్డి అనుచరులు ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. -
హుజూర్నగర్కు కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్నగర్కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి : కారుకే జై హుజూర్!) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేస్తాం. హుజూర్నగర్లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్నగర్లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్ సారొస్తుండు!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్లో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజూర్నగర్ రావాల్సి ఉండగా వర్షంతో సభ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంతో కృతజ్ఞత సభ నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇవ్వాలని ముఖ్యనేతలు కోరడంతో ముఖ్యమంత్రి ఈ సభకు హాజరవుతున్నారు. అయితే ఈ సభలో సీఎం నియోజకవర్గానికి ఏం వరాలు ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. భారీగా నిర్వహించేందుకు.... ఇటీవల సభ రద్దయిన ప్రాంతంలోనే వేదికను సిద్ధం చేశారు. ఫణిగిరి గుట్టకు వెళ్లే దారిలో సభ నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ నలు మూలల నుంచి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని మండలాల నుంచి జనసమీకరణకు వాహనాలను కేటాయించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేగా విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై నియోకవర్గ నేతలతో శుక్రవారం సమీక్షించారు. కృతజ్ఞత సభ నియోజకవర్గ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చేయాలని ముఖ్యనేతలు నిర్ణయించినట్లు సమాచారం. సభ ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో పాటు కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్లు పరిశీలించారు. సిద్ధమవుతున్న సభా వేదిక ఈ సమస్యలపై సీఎం ప్రకటన చేస్తారని... నియోజకవర్గంలోని పలు సమస్యలపై సీఎం ఈ సభా వేదికగా ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టణ పరిధిలోని ఫణిగిరి గుట్ట సమీపంలో 4వేల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటికి కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పనులు పూర్తి కానున్నాయి. హుజూర్నగర్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా చేయడం, హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా చేయడం, రింగ్రోడ్డు పూర్తి చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలను కోదాడ కోర్టు నుంచి హుజూర్నగర్ కోర్టు పరిధిలోకి తేవడం, చింతలపాలెం, మఠంపల్లి మండలంలో టేలాండ్ భూములకు కృష్ణానది నుంచి ఎత్తిపోతలతో నీళ్లు తేవాలన్న డిమాండ్లు ఎన్నికల ప్రచారంలో కూడా బాగా జరిగాయి. ఇవన్నింటిపై ముఖ్యమంత్రి సభావేదికపై వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం టూర్ ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి మధ్యాహ్నం 11 గంటలకు రోడ్డు మార్గంలో బయలు దేరి 1.30 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటారు. ఇక్కడ త్రివేణి ఫంక్షన్హాల్లో ముఖ్యనేతలతో కలిసి భోజనం ముగించుకుని సాయంత్రం 3 గంటలకు హుజూర్నగర్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. 4 గంటలకు హుజూర్నగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై కేసీఆర్ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. -
‘ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు గెలవగానే సరిపోదని ప్రజా సమస్యలను పరిష్కారించాలన్నారు. ధనం, మద్యం, అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఉప ఎన్నికలో రూ. యాభై కోట్లు ఖర్చు చేసి గెలిచినందువల్లే.. నిన్న ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీని మూసివేస్తానంటే ఉరుకునేది లేదన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టపోతుంటే.. ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టేలే ప్రజారవాణా వ్యవస్థ నష్టాల్లో ఉంటే.. లాభాల్లోకి తీసుకు రావడానికి రివ్యూ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే రివ్యూ చేయని సీఎం కేసీఆర్, ఎన్నికలకు మాత్రం రివ్యూ చేస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరాలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే రివ్యూ చేయని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో డెంగ్యూ జ్వరంతో మహిళా జడ్జీ చనిపోయిందని, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని స్వయంగా కోర్టు చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం మోదీకి 'బీ' టీమ్: గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి హరియాణా, మహారాష్ట్రలో మంచి ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుందని ఆనందం వెల్లిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాలు వస్తాయని ఆశించారు. మహారాష్ట్రలో 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ కేవలం 2 సీట్లే గెలిచి, మిగతా సీట్లలో బీజేపీ, శివసేనను గెలిపించిందన్నారు. ఎంఐఎం మోదీకి బీ టీమ్ అని, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఓట్లు చీల్చి.. మతతత్వ పార్టీని ఎంఐఎం గెలిపించిందన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడానికే ఎంఐఎం అభ్యర్థులను నిలపెట్టిందన్నారు. బీజేపీ మాదిరిగానే ఎంఐఎం కూడా మతతత్వ పార్టీనే. హైదరాబాద్లో పుట్టిన ఎంఐఎం పార్టీ, రాష్ట్రంలో ఎన్నడూ 44 సీట్లలో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం 44 సీట్లు పోటీ చేయడం వెనుక ఉన్న అంతార్యం ఏమిటని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని హిందు, ముస్లిం ఓట్లను చీల్చుతుందని ఆరోపించారు. -
టానిక్ లాంటి విజయం
సాక్షి, హైదరాబాద్: ‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతికూల వాతావరణంలో హుజూర్నగర్ సభకు వెళ్లలేకపోయినా అద్భుత విజయం అందించారు. ప్రజలు ఆషామాషీగా కాకుండా ఆచితూచి, ఆలోచించి టీఆర్ఎస్కు ఓటు వేశారు. ఈ తీర్పు ప్రభుత్వానికి టానిక్ లాంటిది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ నేతలతో కలసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా 43 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు మా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. హుజూర్నగర్ ప్రజలు ఏ అభివృధ్ధి కోసం ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరుస్తాం. శనివారం హుజూర్నగర్లో జరిగే కృతజ్ఞత సభకు ఎన్నికల సంఘం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ సభకు హాజరై వారి ఆశలను నెరవేరుస్తా’అని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు నేతలందరూ మొక్కవోని కృషి చేయడం వల్లే హుజూర్నగర్లో విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు అహంకారం వీడాలి ‘ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని కోరుతున్నా. ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. వాళ్లు రోజూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సద్విమర్శ చేసే ప్రతిపక్షం అవసరం. కేసీఆర్ను తిడితే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వంద శాతం అన్ని అంశాలను గమనిస్తున్నారు. విమర్శలు హుందాగా, విమర్శనాత్మకంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే కానీ ఏది పడితే అది మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. కొన్ని పార్టీలు ఉప ఎన్నిక వాయిదా వేయించాలని చూశాయి. కేసీఆర్ హెలికాప్టర్ను తనిఖీ చేయాలని చెప్పాయి. కేసీఆర్ హెలికాప్టర్లో డబ్బులు తీసుకుపోతాడా? ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి. అహంభావం, అహంకారం లేకుండా వ్యవహరించాలి. బాధ్యతగా ప్రవర్తిస్తే రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఈ విజయంతో గర్వం తలకెక్కించుకోకుండా మరింత బాధ్యతతో, సంస్కారవంతంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరుతున్నా. రాష్ట్రాన్ని గాడిన పెట్టడమే మా ముందున్న సవాల్. ఓవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా అమలు చేస్తున్నాం’అని కేసీఆర్ తెలిపారు. నవంబర్లోగా మున్సిపల్ ఎన్నికలు ‘వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇదివరకే రెండు చట్టాలు తెచ్చింది. నియమిత విధానంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ది జరిగేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ చట్టాలు రూపొందించాం. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 330 కోట్లు కేటాయించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. అదే తరహాలో మున్సిపాలిటీలకు కూడా రూ. 1,030 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించి నూతన పాలక మండళ్ల ద్వారా పట్టణ ప్రగతికి ప్రణాళిక అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ. 1,030 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2,060 కోట్లతో 141 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు అనుకున్న దానికంటే రెండు నెలలు ఆలస్యమయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో మున్సిపల్ ఎన్నికలపై 99 శాతం స్పష్టత వచ్చింది. 2, 3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదన ప్రభు త్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత గల్ఫ్ దేశాలకు ‘గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాసులను స్వదేశానికి రప్పించేందుకు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. కేరళ అనుసరిస్తున్న ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెళ్లి తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే 4–5 గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తాం. ఇక్కడ న్యాక్ ద్వారా వారికి భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇప్పిస్తాం. మన వాళ్లు ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్తుంటే యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారు’అని కేసీఆర్ వివరించారు. మహారాష్ట్రలో పోటీపై ఆసక్తి లేదు ‘నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మహారాష్ట్రవాసులు టీఆర్ఎస్ తరపున అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలోనే దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతో మేము ఆసక్తి చూపలేదు. భివండీ, షోలాపూర్ వంటి ప్రాంతాల్లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆశ పడటంలో తప్పులేదు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమించింది. ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు. అదేమీ దురాశ కాదు. అయితే లక్ష్యాన్ని చేరుకునే పద్ధతి సరిగా ఉండాలనేది టీఆర్ఎస్ భావన’అని కేసీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు ‘జర్నలిస్టులకు వంద శాతం ఇళ్ల స్థలాలు ఇస్తాం. సుప్రీంకోర్టులో ఉన్న కేసు త్వరలో కొలిక్కివచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టుల సంక్షేమ నిధి సత్ఫలితాలిస్తోంది. జర్నలి స్టులు, రాజకీయ నాయకులు వ్యవస్థకు పరస్పరం అవసరం. ప్రెస్ అకాడమీ బాగా పనిచేస్తోంది’అని సీఎం కితాబిచ్చారు. కాగా, గవర్నర్ కార్యాలయానికి సందర్శకులు పెరగడం గురించి విలేకరులు అడగ్గా కొత్త గవర్నర్ వచ్చారు కాబట్టి సందర్శకులు పెరిగారంటూ కేసీఆర్ తనదైన శైలిలో బదులిచ్చారు. రెవెన్యూ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు ‘కొత్త రెవెన్యూ చట్టంతో ఉద్యోగాలు పోతాయనే అపోహలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి పరిస్థితే వస్తే వారిని వేరే చోట సర్దుబాటు చేస్తాం. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దయితేనే వీఆర్వో వ్యవస్థ వచ్చింది. అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సమస్యలు లేకుండా ఉంటే జీడీపీ కూడా పెరుగుతుందని ఇతర దేశాల అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ఎవరూ డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా భూ రికార్డుల నిర్వహణ జరగాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్కుమార్రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్కుమార్రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి -
పొలిటికల్ కారిడర్ 24th Oct 2019
-
రివ్యూ టైం
-
భావోద్వేగానికి లోనైన పద్మావతి
సాక్షి, సూర్యాపేట: ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని హుజుర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్నగర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికినా ఓడిపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మొదటి రౌండ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థికి 2 వేల ఆధిక్యం అనగానే తనకు అనుమానం వచ్చిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తమ బంధువులు వేసిన ఓట్లు కూడా పడలేదని స్వతంత్ర అభ్యర్థులు తనదో చెప్పారని, దీనిబట్టి చూస్తే ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈవీఎంలను మేనేజ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, ఈ ఫలితం కరెక్ట్ కాదని పద్మావతి అన్నారు. (చదవండి: హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...) -
మొదటి రౌండ్లోనే డౌట్ వచ్చింది
-
ఆర్టీసీని ఎవరూ రక్షించలేరు
-
‘బెదిరింపులు ఎక్కువకాలం పనిచేయవ్’
సాక్షి, హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధైర్యపడరని తెలిపారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయనప్పటికీ సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమైందని వివరించారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవిపై మాట్లడటానికి పొన్నాల నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘హుజూరు నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడరు. ఉపఎన్నికల్లో అధికారపార్టీకి వెసులబాటు ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సర్వసాధారణమే. కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటోంది. మహారాష్ట్ర ,హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా గతంతో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల అస్త్రంగా వాడుకొని ప్రచారం చేసిన బీజేపీ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు రాలేదు. సెంటిమెంట్, బెదిరింపులు శాశ్వతంగా పనిచేయవు. ప్రజలు మార్పు కోరుకుంటారు’ అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? ఆర్టీసీ కార్మికుల ఎత్తుకున్నది పిచ్చిపంథా. అనవరమైన, అర్థపర్థంలేనటు వంటి పద్దతిని అవలంభించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై నాకంటే ఎక్కువ అనుభవం లేదు. గతంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశా. అప్పుడు ఆ సంస్థ 13కోట్ల 80లక్షల నష్టంలో ఉంది. నేనే కష్టపడి ఆ సంస్థను 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. నేను ముఖ్యమంత్రి అయ్యాక వైస్రాయి హోటల్లో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించాను. వారికి సలహాలు ఇచ్చా. 44శాతం జీతాలు పెంచాం. ఎన్నికలకు కొద్దిరోజు ముందు 14 శాతం ఐఆర్ ఇచ్చా. మొత్తంగా 67శాతం జీతాం పెంచాం. చరిత్రంలోనే ఇలా ఎవరూ పెంచలేదు. ఇంత పెంచిన తర్వాత కూడా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? వారి తర్వాత మిగతా 57 సంస్థలు కూడా ప్రభుత్వంలో కలపమంటే ఎలా? ఇదే కోర్టులు అప్పుడు మళ్లి మమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ఇదేనా రాజకీయం. బాధ్యతమైన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా? సమ్మె ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తోంది ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో లేదు. 35 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఆర్టీసీని మూయలేదా? అక్కడ 200 బస్సులు మాత్రమే ప్రభుత్వానివి ఉన్నాయి. మధ్యప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్ ఆర్టీసీని మూయలేదా? వీళ్ల సమ్మె ఏం సమ్మె? అర్థం, ఆలోచన ఉండి చేసిన సమ్మెనా? ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె చేస్తారు. దిక్కుమాలిన యూనియన్ ఎన్నికల కోసం ఇలాంటి సమ్మెలు చేస్తారు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తుంది. ఈ రోజుకి 5వేల కోట్లు అప్పు ఉంది. ఒక నెల కిస్తీ కట్టకుంటే ఆర్టీసీ ముగుస్తుంది. ఫీఎఫ్ డబ్బులు కార్మికులకు ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. నెలకు 100 కోట్ల నష్టం. ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఎందుకు అలా? ఇదేనా యూనియన్లు చేసే పని. అద్దెబస్సులు తొలగించండి అంటారు.. టైం ప్రకారం బస్సులు నడిపించాలి. ఆర్టీసీ ని ఎలా కాపాడుతారు. సందర్భం వస్తే ఓ గంట పనిచేస్తే ఏమవుతుంది. టైంప్రకారం పని దిగిపోతా అంటే ఎలా? ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. గత ప్రభుత్వాలు 712 కోట్లు ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 4250కోట్లు విడుదల చేశాం. అది కాక ఓ చట్టం తీసుకొచ్చాం. దానిద్వారా 330 కోట్లు వచ్చాయి. ఏడాదికి 900 కోట్లుకు పైగా ఇచ్చాం. ఇంకేం ఇస్తారు? ఈ ఏడాది 550 కోట్లు పెట్టాం. 425 కోట్లు విడుదల చేశాం. ఇంకెన్ని ఇవ్వాలి? హైకోర్టు ఏం చేస్తది? సాధారణంగా పండగల సమయంలో డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఆర్టీసీకి బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం. అటువంటి సమయంలో సమ్మెకు పోయారు. ఇదేనా పద్దతి. పలికిమాలిన డిమాండ్లను పెట్టారు. వారి డిమాండ్లపై కమిటీ వేశాం. సీఎస్ అధ్యక్షతన చర్చలు జరిపాం. అయినా వినలేదు. ఆర్టీసీ ప్రభుత్వం కలపాలన్నారు. కమిటీ కాదని సమ్మెకు పోయారు. ఇప్పుడు ఏమైంది. ఏం ఫలితం? సమ్మెకు ముందు ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేశారు. వాటిలో 7 కోట్లు మాత్రమే ఇప్పుడు ఆర్టీసీ దగ్గర ఉన్నాయి. సమ్మె కారణంగా ప్రస్తుతం కూడా నష్టమే వస్తున్నాయి.సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేసులు వేశారు. ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. డబ్బులు లేవని చెప్పాం. హైకోర్టు ఏం చేస్తది కొడుతదా? బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి ఆర్టీసీ యూనియన్లు మహానేరం చేస్తున్నారు. అమాయక కార్మికలు గొంతు కోస్తున్నారు. వారిని ఎవరూ కాపాడలేరు. వందశాతం ఆర్టీసీ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాని సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. ఆర్టీసీలో పోటీని పెంచాలని సూచించారు. ఆర్టీసీకి పోటీదారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తాం. హైకోర్టుకు తీర్పు చెప్పే హక్కు లేదు. లేబర్ కోర్టుకు వెళితే ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వమంటారు. అప్పుడు బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వదు. బుద్దిఉన్న ఏ వ్యక్తి ఇలాంటి సమ్మె చేయరు. నా దృష్టింలో ఆర్టీసీ పని అయిపోయింది. వారిపై ఎస్మా ఉన్నా కూడా సమ్మెకు పోయారు. ఇది చట్టవిరుద్ధ చర్య. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బుల్లేవు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదు. ఈ యూనియన్లే ఆర్టీసీని ముంచాయి. ఇకపై కూడా ఇలాంటి యూనియన్లు ఉండి ఇదే గొంతెమ్మ కోరికలు కోరితే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. కార్మికులతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పనిచేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఆర్టీసీ సమ్మెకు ముంగింపు ఆర్టీసీ ముగింపే జవాబు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులే కాదు అందరూ పనిచేశారు. కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటాం. ఆర్టీసీ సంఘాలు తక్షణం దిగిరావాలి లేదంటే ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిషన్లు ఇస్తాం’ కేసీఆర్ హెచ్చరించారు. -
హుజూర్నగర్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు
-
రోజూ పెడబొబ్బలు.. ఆ పార్టీకి డిపాజిటే గల్లంతైంది : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలకు ఆ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగే కీలక తీర్పు కాకపోయినా.. పనిచేసే ప్రభుత్వానికి ఇదొక టానిక్లా పనిచేస్తుందని అన్నారు. ఇదొక కీలక ఉప ఎన్నిక అని, ఈ ఎన్నికలో అద్భుతమైన ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని కొనియాడారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైడిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోవాలి హుజూర్నగర్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు చాలా దుష్ప్రచారం చేశాయని, తమపై నీలాపనిందలు వేశారని కేసీఆర్ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పచ్చి అబద్ధాలతో ప్రజలను గోల్మాల్ చేసే రాజకీయాలు చేయడం మంచిది కాదని కేసీఆర్ ప్రతిపక్షాలకు సూచించారు. తలాతోక లేని ఆరోపణలు చేస్తే బూమరాంగ్ అవుతుందని హెచ్చరించారు. ఏదిపడితే అది మాట్లాడితే.. ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ప్రజలు ఆమోదించబోరని హుజుర్నగర్ ఫలితాలు చాటుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకుంటే మంచిదన్నారు. ప్రతిపక్షం ఉంటేనే మంచిదని, అది నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు. బీజేపీకి డిపాజిట్ కూడా గల్లంతయినట్టు తెలుస్తోందని, రోజూ ఆ పార్టీ పెట్టే పెడబొబ్బలకు, అరుపులకు.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య పోలిక చూసుకుంటే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వ్యక్తిగతంగా, చీప్ విమర్శలు చేయడం, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో సహనం మంచిదని, అహంభావం, అహంకారం మంచిది కాదని అన్నారు. హుజూర్నగర్లో గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరూ అహంభావానికి లోనుకాకుండా మరింతగా కష్టపడాలని సూచించారు. ఎల్లుండి థ్యాంక్స్ సభ ఇప్పుడు హుజూర్నగర్లో సుమారు 43వేల మెజారిటీతో సైదిరెడ్డి విజయం సాధించారని, గతంలో ఏడువేల ఓట్ల తేడాతో ఈ సీటులో తాము ఓడిపోయామని అన్నారు. తాజా ఫలితాలతో దాదాపు 50వేల ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారని తేలిందని, హుజూర్నగర్ ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు. హుజూర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎల్లుండి (శనివారం) సాయంత్రం టీఆర్ఎస్ సభ నిర్వహిస్తోందని, ఈ సభలో తాను పాల్గొని ప్రజలకు థ్యాంక్స్ చెప్తానని తెలిపారు. -
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయి. హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్ సింబల్.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది. -
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం
-
ఉత్తమ్ పని అయిపోయినట్టేనా ?
సాక్షి, హైదరాబాద్ : హూజూర్నగర్లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హూజూర్నగర్ ఓటమితో పీసీసీ మార్పు తప్పనిసరి అంటూ కాంగ్రెస్ మరో వర్గం ప్రచారం చేస్తోంది. హూజర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉన్నట్లు బయట ప్రచారం చేసినా.. లోపల మాత్రం ఓడిపోవాలన్న భావనతోనే ఉన్నారనే కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా అధిష్టానానికి హూజూర్నగర్ గెలిపించుకుంటాననే భరోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచినా.. ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకునే అవకాశముంది. హూజర్నగర్ ఓటమితో ఉత్తమ్ సెల్ఫ్గోల్ చేసుకున్నారని కాంగ్రెస్లోని మరోవర్గం ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పట్ల ఉత్తమ్కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ భవిష్యత్ ను కూడా దెబ్బకొట్టారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ పగ్గాలపై ఆశలుపెట్టుకున్న నేతలే.. ఉత్తమ్ కొంపముంచారనే ప్రచారముంది. పీసీసీ చీఫ్ ఉండి ఎమ్మెల్యేల వలసలను ఆపలేకపోయారని కాంగ్రెస్ సభాపక్ష నేత బట్టి విక్రమార్క కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ పగ్గాలు అందిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నల్గొండలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దళిత కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్లు పీసీసీ పగ్గాల కోసం పోటీపడుతున్నారు. ఇక సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీధర్బాబు పీసీసీ పగ్గాల కోసం నేను సైతం అంటున్నారు. టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యంలో అందుకు తగ్గరీతిలో పార్టీని నడిపే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీసీసీ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం మరికొన్ని రోజుల్లోనే కీలకనిర్ణయం తీసుకునే అవకాశం స్సష్టంగా కనిపిస్తోంది. -
హుజుర్నగర్ ఓటర్లు పట్టించుకోలేదా?
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆర్టీసీ సమ్మె ప్రభావం పడలేదని ఫలితాన్ని బట్టి తెలుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కార్మికులు ఈనెల 5 నుంచి సమ్మె బాట పట్టారు. 6వ తేదీ సాయంత్రానికి విధుల్లో చేరని కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ మొండి వైఖరిని ప్రతిపక్షాల సహా వివిధ సంఘాలు తప్పుబట్టాయి. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వ్యవహారశైలి ప్రభావం హుజుర్నగర్ ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఓటర్లు అధికార టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. సొంత నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఆర్టీసీ సమ్మె కలిసివస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ కూడా అనుకున్నారు. అయితే ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో హుజుర్నగర్ ప్రజలు గెలిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల పోరాట కార్యచరణ ఎలా ఉండబోతుందో చూడాలి. ఆర్టీసీ సమ్మెపై మున్ముందు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. తాజా ఓటమి నుంచి కాంగ్రెస్ ఎలాంటి గుణపాఠాలు నేర్చకుంటుందో చూడాలి. (చదవండి: మాది న్యాయ పోరాటం!) -
కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆదిపత్యంలో దూసుకుపోయింది. రౌండ్ రౌండ్కు మొజార్టీ పెంచుకుంటూ.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇదిలా ఉంటే.. హుజూర్నగర్లో గెలిచి సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు.ఆయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్నగర్ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్నగర్లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి ఉత్తమ్రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. -
ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
షాక్ తిన్న కాంగ్రెస్..
-
కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ రెపరెపలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే 20వేలకు పైచిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్నగర్లో టీఆర్ఎస్ జెండా పాతడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి. హుజూర్నగర్లో గులాబీ శ్రేణులు గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు. తీవ్ర ఉత్కంఠను రేపిన హుజూర్.. హుజూర్నగర్ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి కనిపిస్తోంది. అటు, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్నగర్లో పోటీచేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. టీపీసీసీ చీఫ్ నియోజకవర్గం అయిన హుజూర్నగర్ పూర్తిస్థాయిలో టీఆర్ఎస్కు పట్టం కట్టినట్టు కనిపిస్తోంది. హస్తం పార్టీకి గట్టి పట్టున్న మండలాల్లోనూ గులాబీకి ఆధిక్యం దక్కడం ఇక్కడ టీఆర్ఎస్ జోరును చాటుతోంది. బెట్టింగ్రాయుళ్ల జోరు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరిగాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పందాలు కాశారు. వేయి నుంచి లక్షల రూపాయల వరకు పందాలు సాగాయి. ఎగ్జిట్పోల్ ఫలితాలతోపాటు పోలింగ్ సరళిలోనూ టీఆర్ఎస్కు సానుకూలత ఉండటంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పందాలు కాసిన వారికి భారీ ఆఫర్లు ఊరించాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడిచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే పెద్ద ఎత్తున పందాలు సాగాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్ఎస్కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బెట్టింగ్చేసిన వాళ్లు పెద్ద ఎత్తున నష్టపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక, టీఆర్ఎస్ గెలుపు, మెజారిటీలపై బెట్టింగ్ కాసినవాళ్లు లాభపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగులు సాగాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్నగర్ ఫలితంపై పందాలు జోరుగా సాగాయి. -
సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
-
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యం
-
హుజూర్నగర్ అప్డేట్స్ : కేటీఆర్ ట్వీట్
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ కంచుకోట హుజూర్నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624 రికార్డు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్రెడ్డిపై రికార్డు విజయం సాధించారు. తొలి నుంచి చివరి వరకు అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మారెడ్డి ఒక్క రౌండ్లోనూ ఆధిక్యం సాధించకపోవడం విశేషం. ఇక టీడీపీ, బీజేపీల డిపాజిట్లు గల్లంతయ్యాయి. హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, కవిత టీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాల తెలిపారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లుండి(శనివారం) హుజూర్నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఓ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ గెలుపుకు సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ‘కేసీఆర్పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్ఎస్కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు’అంటూ కవిత ట్వీట్ చేశారు. హుజూర్నగర్ అప్డేట్స్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ బంపర్ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 16వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగతున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్నగర్ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్లోనే ఆ మెజారిటీని అధిగమించాడు. అయితే ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండటంతో.. ఆయన మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 16వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డి 32,256 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా 6 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. టీడీపీ డిపాజిట్ గల్లంతైంది.జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఓట్ల పరంగా ఆరో స్థానంలో కొనసాగుతోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించనున్నారు. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్లడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలకు హుజూర్నగర్ ఫలితం చెంపపెట్టలాంటిదని విమర్శించారు. ప్రతిపక్షాలకు టీవీల్లో తప్ప ప్రజల్లో పట్టులేదన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ భారీ మెజరిటీతో దూసుకుపోతుండటంతో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ భవన్కు చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే.. టీడీపీ, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. రౌండ్ రౌండ్కు పెరుగుతున్న టీఆర్ఎస్ మెజారిటీ రాష్ట్రం మొత్తం కేసీఆర్ను నమ్ముతుందని అనడానికి హుజూర్నగర్ ఉప ఎన్నికే నిదర్శమని సైదిరెడ్డి తెలిపారు. సైదిరెడ్డి భారీ ఆధిక్యంతో దూసుకుపోవడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు.. మొదటి రౌండ్- టీఆర్ఎస్ -5583, కాంగ్రెస్-3107, బీజేపీ-128, టీడీపీ-113, టీఆర్ఎస్ లీడ్- 2476 రెండో రౌండ్- టీఆర్ఎస్ -4723, కాంగ్రెస్-2851, బీజేపీ-170, టీడీపీ-69, టీఆర్ఎస్ లీడ్- 1872, రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-4348 మూడో రౌండ్- టీఆర్ఎస్ -5089, కాంగ్రెస్-2540, బీజేపీ-114, టీడీపీ-86, టీఆర్ఎస్ లీడ్- 2549, మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-6897 నాల్గో రౌండ్- టీఆర్ఎస్ -5144, కాంగ్రెస్-3961, బీజేపీ-102, టీడీపీ-127, టీఆర్ఎస్ లీడ్- 1183, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-8080 ఐదవ రౌండ్- టీఆర్ఎస్ -5041, కాంగ్రెస్-3032, బీజేపీ-105, టీడీపీ-57, టీఆర్ఎస్ లీడ్- 2009, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-10089 అరో రౌండ్- టీఆర్ఎస్ -5308, కాంగ్రెస్-3478, బీజేపీ-72, టీడీపీ-46, టీఆర్ఎస్ లీడ్- 1830, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-11919 ఎడో రౌండ్- టీఆర్ఎస్- 4900, కాంగ్రెస్-3796, బీజేపీ-45, టీడీపీ-46, టీఆర్ఎస్ లీడ్- 1104, నాల్గో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్-13023 -
జడ్జిమెంట్ డే
-
నేడు హుజూర్నగర్ ఓట్ల లెక్కింపు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో గురువారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. బుధవారం కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు సచీంద్రప్రతాప్ సింగ్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దుగ్యాల అమయ్కుమార్ పరిశీలించారు. నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభం.. నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు. 302 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేస్తారు. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్ బూత్లోని వీవీప్యాట్ స్లిప్పులు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో లెక్కిస్తారు. ఈ స్లిప్పులను.. ఇదే పోలింగ్ బూత్లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు వెల్లడించాయి. ఇక ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎక్కువగా మెజార్టీపైనే బెట్టింగ్లు పెట్టినట్లు సమాచారం. -
బెట్టింగ్ హు‘జోర్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నిక జరగ్గా, గురువారం రానున్న ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొనడంతో పందాలు మొదలయ్యాయి. ఎన్నిక జరగడానికి ఒకట్రెండు రోజుల ముందే ప్రారంభమైన ఈ బెట్టింగులు బుధవారం రాత్రికి తారస్థాయికి చేరాయి. రెండు రాష్ట్రాల్లోని బెట్టింగు రాయుళ్లు వేయి నుంచి లక్షల రూపాయల వరకు బెట్టింగులు కాస్తున్నారు. ఎగ్జిట్పోల్ ఫలితాలతో పాటు పోలింగ్ జరిగిన సరళి అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న పందాలపై భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. సరిహద్దుల్లోనూ ఎక్కువే హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండతోపాటు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఫలితంపై పందాలు కాస్తున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్నగర్ ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నాయి. బుకీలు కూడా రంగ ప్రవేశం చేయడంతో గత రెండు రోజులుగా జోరందుకున్న ఈ పందాల్లో స్థానిక బెట్టింగ్ రాయుళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలుపే కాదు...మెజార్టీలపై కూడా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై పందాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్ఎస్కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, ఇలాంటి బెట్టింగ్లలో పాల్గొనడం చట్టవిరుద్ధమని, ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. సీసీ కెమెరాలతో లైవ్ కౌంటింగ్
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాముల్లో ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా, కేంద్ర పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. అలాగే వీటి పరిసరాలన్నీ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ ఫుటేజీ మొత్తం అభ్యర్థులు లైవ్లో 24 గంటలు చూసుకునేలా సౌకర్యం కల్పించారు. సీసీ కెమెరాల ద్వారా ప్రసారం రేపు(గురువారం) జరగబోయే కౌంటింగ్లో మైక్రో అబ్జార్వర్, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు మరో ముగ్గురు సహాయకులు ఉండనున్నారు. అలాగే రిటర్నింగ్ అధికారితోపాటు జిల్లా కలెక్టర్, కేంద్రం నుంచి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ సాగనుంది. ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల ద్వారా ప్రసారం చేసే వెసులుబాటును ఎన్నికల అధికారులు కల్పించారు. రేపు ఉదయం 6 గంటలలోపు అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియను పూర్తి చేసుకొని 8 గంటల నుంచి కౌంటింగ్ను ప్రారంభించనున్నారు. ఈ రోజు అభ్యర్థులు, ఏజెంట్ల సమావేశంలో మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ప్రత్యేకంగా జారీ చేసిన పాస్లు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. పోలైన 2 లక్షల 754 ఓట్లను, అదే విధంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్లో ఉన్న ఓట్లను కూడా అధికారులు లెక్కించనున్నారు. ఈ కౌంటింగ్ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తోపాటు పోలీసు యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
84.75 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 84.45 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,36,842 ఓట్లు ఉండగా.. 2,00,726 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషుల ఓట్లు 99,023, మహిళల ఓట్లు 1,01,703 ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.18%, 2018 ఎన్నికల్లో 86.38% పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 78.85% పోలింగ్ నమోదైంది. 50 శాతం పైగా నమోదు.. ఉప ఎన్నిక జరిగిన సోమవారం ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటల వరకు 31.34 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 52.89 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 69.95 శాతం, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికే 50 శాతం పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం లోపలికి వచి్చన వారంతా ఓటేశారు. గరిడేపల్లి మండలం కల్మల చెరువలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. హుజూర్నగర్ అంబేడ్కర్నగర్ పోలింగ్ కేంద్రంలో, మేళ్లచెరువు మండలం కప్పలకుంట తండా, గరిడేపల్లి మండలం వెల్దండలో సాయంత్రం 6 గంటల వరకు ఓటేశారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని 252 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో 40 నిమిషాల పాటు పోలింగ్ నిలిచింది. ఆ తర్వాత సాంకేతిక నిపుణులు దాన్ని సరిచేయడంతో మళ్లీ యథావిధిగా ఓట్లు వేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు జీకే.గొక్లానీ, సచింద్రప్రతాప్సింగ్, కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్, జేసీ సంజీవరెడ్డిలు పరిశీలించారు. నియోజకవర్గంలోని 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. కృష్ణపట్టె ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ భాస్కరన్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఓటేసిన అభ్యర్థులు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. మఠంపల్లి మండలం గుండ్లపల్లి, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్నగర్లోని ఎన్ఎస్పీ క్యాంపు పాఠశాలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ హుజూర్నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్ హుజూర్నగర్ మండ లం బూరుగడ్డలోని పోలింగ్ కేంద్రంలో ఓటే శారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓటు నియోజకవర్గంలో లేకపోవడంతో ఆమె ఓటేయలేదు. 24న ఓట్ల లెక్కింపు.. ఈ నెల 24న సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ గోదాం నుంచి ఈవీఎంలను సూర్యాపేట మార్కెట్ గోదాంలోకి చేర్చి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. మెజారిటీతో గెలుస్తున్నాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గౌరవప్రదమైన మెజారిటీతో వి జయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. -
‘హుజూర్’లో గెలుపు ధీమాతో అధికార పార్టీ
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో విజయంపై టీఆర్ఎస్లో ధీమా వ్యక్తమవు తోంది. విజయం తమదేనని సోమవారం పోలింగ్ ముగిశాక ఆ పార్టీ నేతలు కుండ బద్దలు కొడు తున్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్పోల్ సర్వేలు ఇదే చెబుతుండటంతో గులాబీ విజయం సాధిస్తుందనే అభి ప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవు తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహ రచన, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే సోపానాలుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట బద్దలవు తుందనే అంచనాలు పోలింగ్ ముగిశాక వెల్లడయ్యాయి. అయితే కాంగ్రెస్ శిబిరం కూడా తామే గెలుస్తామని చెబుతోంది. సంప్రదాయ ఓటు బ్యాంకు తమను గట్టెక్కిస్తుందనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు పోటీలో ఉన్న బీజేపీ, టీడీపీలు ఎన్ని కల బరిలో నామమాత్రపు పోటీ ఇవ్వగా, ఈ రెండు పార్టీలకు ఎన్ని ఓట్లు పోలవుతా యన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బరాబర్ బరిలో..! హుజూర్నగర్ ఉప ఎన్నికలో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డాయి. టీఆర్ఎస్ బలగమంతా హుజూర్నగర్లోనే మకాం వేసి గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న కసితో పనిచేసింది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్రెడ్డిల పర్యవేక్షణలో పార్టీ నేతలు, కార్యకర్తలు దాదాపు 20 రోజుల పాటు శ్రమించారు. మండలాలు, గ్రామాల వారీగా ఇంచార్జులను నియమించి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ రోడ్షో ఈసారి ఎన్నికల ప్రచా రంలో హైలెట్ కాగా, సీఎం కేసీఆర్ సభ వర్షం కారణంగా రద్దయినా నిరాశ చెందకుండా గులాబీ దళం ప్రచార పర్వాన్ని శాయశక్తులా ఉపయోగిం చుకుంది. రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా నిలిచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, పోలింగ్ జరిగిన సోమవారమంతా నియోజకవర్గంలో టీఆర్ఎస్ మాటే వినిపించడంతో ఈసారి హుజూర్నగర్ అధికార పార్టీ ఖాతాలో పడనుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మా ఓట్లు మాకే..! ప్రతిపక్ష కాంగ్రెస్ శిబిరంలో కూడా పోలింగ్ సరళిపై తీవ్రంగానే అంచనాలు, లెక్కలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు పటిష్ట కేడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో తమ ఓటు బ్యాంకుకు గండి పడలేదని, టీఆర్ఎస్ ఎన్ని చెప్పినా తమ ఓట్లు తమకే పడ్డాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సంప్రదాయంగా పట్టున్న కాంగ్రెస్కు విజయానికి కావాల్సిన ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ చేసిన అభివృద్ధే మళ్లీ ఇక్కడ విజయాన్ని చేకూరుస్తుందని వారంటున్నారు. పోలింగ్ సరళి కొంత అనుకూలంగా లేకపోయినా సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదు కావడమే ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తమ్మీద రెండు శిబిరాల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతున్నా ఓటరు రాజు కారువైపే మొగ్గు చూపినట్లు పోలింగ్ డే పరిస్థితులు చెబుతున్నాయి. ఆ పార్టీలు ఏం చేస్తాయో? టీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు నియోజకవర్గంలో తమ సత్తా చాటేందుకు పోటీలో ఉన్న బీజేపీ, టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి 1,555 ఓట్లు మాత్రమే రాగా, టీడీపీ కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈసారి టీడీపీ ఒంటరిపోరు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. బీజేపీ మంత్రం కూడా పెద్దగా పనిచేయలేదని, ఈ సారి కూడా ఆ పార్టీ నామమాత్రపు పోటీకే పరిమితం అవుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై ఓ అంచనాకు రావడం కూడా కష్టంగానే ఉందని పోలింగ్ సరళి చెబుతోంది. మొత్తమ్మీద ఈ రెండు పార్టీలకు ఎన్నెన్ని ఓట్లు వస్తాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్లలో ఎవరిని నష్టపరుస్తాయి.. ఎవరికి మేలు చేస్తాయన్నది ఈనెల 24న తేలనుంది. -
ఎగ్జిట్పోల్స్: హుజూర్నగర్లో టీఆర్ఎస్దే హవా
-
హుజూర్నగర్ ఎగ్జిట్పోల్స్
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. పోలింగ్ అనంతరం విడుదైన ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. హుజూర్నగర్లో టీఆర్ఎస్దే విజయమని ఆరా సర్వే సంస్థ ప్రకటించింది. టీఆర్ఎస్కు 50.48 శాతం, కాంగ్రెస్కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. హుజూర్నగర్లోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్టు ఆరా తెలిపింది. టీఆర్ఎస్ 15 వేల మెజారిటీతో విజయం సాధిస్తుందని నాగన్న సర్వే ప్రకటించింది. టీఆర్ఎస్ 52-52 శాతం, కాంగ్రెస్ 42-45శాతం, బీజేపీ 4-6 విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిది. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ : కేటీఆర్ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ గెలవబోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ విజయం కోసం కృషిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘పార్టీ విజయం కోసం గత నెల రోజులుగా కష్టపడిన కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. నాకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతోంది. భారీ మెజారిటీతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, హుజూర్నగర్ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు. -
ముగిసిన హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్
-
అధికారులపై ఉత్తమ్ పద్మావతి ఆగ్రం
-
కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్
-
హుజూర్నగర్ ఉప ఎన్నిక: ఓటు వేసిన సైదిరెడ్డి
-
హుజూర్నగర్ ఉప ఎన్నిక : ముగిసిన పోలింగ్
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించనున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. కాగా, పోలింగ్ ముగిసేందుకు సమయం దగ్గరపడుతుంటడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడ 88 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో ఎన్నికల అధికారుల సమన్వయ లోపం ఇబ్బందులు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పద్మావతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీ వర్గాలను చెదరగొట్టారు. ఇక పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనంతో వెనుదిరుగుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హుజూర్ నగర్లో 52 శాతం పోలింగ్ నమోదైంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక గతంలో ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ గరిడేపల్లి మండలం పోనుగొడు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి పోలింగ్ సరళిని పరిశీలిస్తూ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఓటు కోదాడలో ఉండటంతో ఇక్కడ ఓటు వేయలేకపోతున్నందుకు బాధగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పోలింగ్ పూర్తయ్యేలా చూడాలని ఆమె ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం పోలింగ్ నమోదైంది. మొరాయించిన ఈవీఎంలు.. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. మరోవైపు చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ గుర్తులు గుర్తించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉదయం తొమ్మిది గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. కాగా హుజూర్నగర్ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికపోరు రసవత్తరంగా మారింది. పోలీస్ పహారాలో.. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి. -
హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
ఉత్తమ్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్/ హుజూర్నగర్ రూరల్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి లిఖితపూర్వకంగా రెండు ఫిర్యాదులు చేశారు. ‘టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కోదాడవాసి. అతనికి ఓటుహక్కు కోదాడలోనే ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం ముగిశాక స్థానికేతరులు ఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధిలో ఉండకూడదు. కానీ, ఈ విషయంలో హుజూర్నగర్లోనే మకాం వేసిన ఉత్తమ్.. నిబంధనలను ఉల్లంఘించారని మొదటి ఫిర్యాదులో ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రచారం 19వ తేదీ సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. కానీ, ఉత్తమ్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు’ అని రెండో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై సీఈసీ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రెస్మీట్ పెట్టారని ఉత్తమ్పై కేసు నమోదు చేసినట్లు హుజూర్నగర్ ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన హుజూర్నగర్లో తన ఇంట్లో ప్రెస్మీట్ పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి డాక్టర్ పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నేడే హుజూర్నగర్ ఉప ఎన్నిక
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ శాసనసభ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 1,16,508 మంది పురుషులు, 1,20,435 మంది మహిళలు కలిపి మొత్తం 2,36,943 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొననున్నారు. పోలింగ్ను దృష్టిలో పెట్టుకుని సోమవారం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం స్థానిక సెలవు దినంగా ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి లోక్సభకు ఎంపిక కావడంతో హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి(టీఆర్ఎస్), నలమాద పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ కోటా రామారావు(బీజేపీ), చావ కిరణ్మయి (టీడీపీ)తో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. మొత్తం 1,497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. పోలీస్ పహారాలో.. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి. -
హుజూర్నగర్లో ఎవరి బలమెంత..!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్నగర్పై నెలకొంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గెలుపెవరిదని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 21) రోజున పోలింగ్ జరుగనుంది. 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్నగర్ ముఖచిత్రం నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలతో పాటు హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలుగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 3,21,142 మంది జనాభా ఉండగా 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,20,427 మంది కాగా పురుష ఓటర్ల సంఖ్య 1,16,415 మందిగా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లదే ఆధిక్యం. ఇక్కడ పురుషులకంటే మహిళా ఓటర్లు 4012 మంది ఎక్కువగా ఉన్నారు. 2009, 2014, 2018 వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్కుమార్రెడ్డి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి పై 7466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తంకుమార్ రెడ్డి కి 92,996 ఓట్లు రాగా టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి 85,530, సీపీఎం కు 2121, బీజేపీ కి 1555, స్వతంత్ర టక్కు గుర్తు అభ్యర్థికి 4944 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 85.96గా నమోదు కాగా కాంగ్రెస్ కు 48%, టీఆర్ఎస్ 43.56 %, సీపీఎం 1%, బీజేపీకి 0.83% ఓట్లు వచ్చాయి. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఉత్తమ్ ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నియోజవర్గంలో ఎస్టీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా 29వేలు ఉండగా తర్వాత స్థానంలో రెడ్లు 27వేల మంది ఉన్నారు. ఎస్సీలు 21 వేలు, మాల 16వేలు, మున్నూరు కాపు 14వేలు, యాదవులు 16వేలు, గౌడ్లు 16వేలు, ముదిరాజ్ లు 13వేలు, పెరిక 7000, వైశ్యులు 8వేలు, కమ్మ 6వేలు, వెలమలు 2000, బ్రాహ్మణులు, రజకులు, నాయి బ్రాహ్మణ కమ్మరి, కుమ్మరి మంగలి అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 76 మంది నామినేషన్లు వేయగా చివరికి 28 మంది అభ్యర్థులు మిగిలారు. ఉప ఎన్నికల్లో అత్యధికంగా 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తమ అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో సీపీఎం స్వతంత్ర అభ్యర్థి సాంబశివ గౌడ్కు మద్దతు ప్రకటించింది. సీపీఐ తొలుత టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకుంది. పోటీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, టీడీపీ, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్-టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో ఉన్నారు. హుజూర్నగరగ్ కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా ఉత్తమ్ తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. హుజూర్నగర్లో అభ్యర్థుల బలాబలాలు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలాలు: పార్టీకి బలమైన క్యాడర్ ఉండటం, ఉత్తత్కుమార్ రెడ్డి గతంలో మంత్రిగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం. బలహీనతలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు హుజూర్నగర్లో ఖాతా తెరవని టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి బలాలు: అధికారంలో ఉండటం, అభ్యర్థి గతంలో ఓడిపోయాడనే సానుభూతి. బలహీనత: అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హుజూర్నగర్ను అభివృద్ధి చేయలేదనే అప్రతిష్ట. బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్లో 1555 ఓట్లు సాధించగా, ఎంపీ ఎన్నికల్లో 3 వేల ఓట్ల సాధించింది. బీసీ మంత్రంతో ఉపఎన్నికలో బరిలో దిగిన బీజేపీ ఎన్ని ఓట్లు సాధిస్తుందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈసారి 5 నుండి 10 వేల ఓట్లు సాధింస్తామని బీజేపీ అంచనాలు వేసుకుంది. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండగా తన ఓట్లు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. 5 నుంచి 10 వేల ఓట్లు సాధించే దిశగా ప్రయత్నం చేస్తుంది. -
ఉత్తమ్, రేవంత్ తోడు దొంగలు
సాక్షి, హుజూర్నగర్ రూరల్ : ఉత్తమ్, రేవంత్రెడ్డి ఇద్దరు తోడుదొంగలని, వారు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. శనివారం హుజూర్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలతో రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఒకరని, గత ఎన్నికల్లో రూ.3 కోట్లు కారులో కాలబెట్టుకున్న దొంగ మ రొకరని రేవంత్, ఉత్తమ్నుద్దేశించి ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలని.. వారిద్దరూ కలిసి హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలు చెప్పడం, విమర్శలు చేయడమే తప్ప ని యోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి హామీలూ ఇ వ్వలేదన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి గతంలో మా యమాటలు చెప్పి ప్రజలను తనవైపు తిప్పుకున్నారని, ఇప్పుడే జరిగే ఉపఎన్నికల్లో చెప్పడానికి ఏమీ లేక ఆధికారులు, ప్రభుత్వం, ఆభ్యర్థిపై విమర్శలకు దిగాడని విమర్శించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మా పార్టీ అభ్యర్థి ఇక్కడ లేడంటూ, భూకజ్జాలు చేశాడం టూ ఉత్తమ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సైదిరెడ్డి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో ఎవరి వెంట రౌడీలు ఉన్నారో ప్రజలుకు తెలుసన్నారు. 20 ఏళ్లుగా పెంచి పోషించిన ఆ రౌడీలే ప్రజల అస్తులను దోచుకొని, భూములను ఆక్రమించి శాంతిభద్రతలను నాశనం చేశారని ఆరోపించారు. వారి ఆగడాలను భరించలేక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టులో నిజంగా ముం పునకు గురయ్యే వ్యవసాయ భూములను వది లిపెట్టి ముంపునకు గురికాని, 20 ఫీట్లలోతు నీ రు వచ్చిన మునిగిపోని పీక్లానాయక్తండాను తన అనుచరుల కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలను దోచిపెట్టారని విమర్శించారు. డబ్బు, భూ మాఫియాకు పాల్పడేది నువ్వేనని ఉత్తమ్ నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు ఎంతో మంది కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని ఆరోపించారు. ఉత్తమ్ బీజేపీతో మిలాఖత్ అయ్యాడని విమర్శించారు. పద్మావతికి టికెట్ వద్దని, కుటుంబపాలన చేస్తున్నావని విమర్శించిన వ్యక్తితో నేడు ఇక్కడ ప్రచారం చేయిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, మీ దివాళా కోరుతనమే మీ ఓటమి కారణం కాబోతుందని ఎద్దేవా చేశారు. ఈసారి మోసపోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని పే ర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకా రం ప్రచారం పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తీసుకువచ్చి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను ఆపి తనిఖీ చేయించినా బాధ్యత గల పౌరులుగా తాము అధికారులకు సహకరించామని పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదులను తీసుకోకపోయినా చాలా ఓపికగా ఉన్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ తమ వైపే ఉన్నారని అన్నారు. 20 రోజులుగా చేసిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరించిన సమస్యలపై ఆలోచించి టీఅర్ఎస్ ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్య యాద వ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైకులు కట్.. ప్రచార బృందాల తిరుగుముఖం
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం గడువు శనివారం సాయంత్రం ముగిసింది. సుమారు 20 రోజులుగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు తిరుగుముఖం పట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, టీడీపీతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండటంతో.. ప్రచార పర్వంలో ఆయనే అంతా తానై వ్యవహరించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు జీవన్రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నేతృత్వంలోని 70 మంది ఇన్చార్జీలు శానంపూడి సైదిరెడ్డి పక్షాన ప్రచార, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగించినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 17న హుజూర్నగర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్షో నిర్వహించారు. బీజేపీ తరఫున కిషన్రెడ్డి, లక్ష్మణ్.. రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు శ్రమిస్తున్న బీజేపీ కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు మూలంగా పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం కూడా ప్రస్తుత ఉప ఎన్నికలో పోటీ చేస్తుండగా,నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు.28 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో..ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇదిలాఉంటే సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. -
ఉత్తమ్కు మంత్రి జగదీష్ సవాల్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు తోడు దొంగలుని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పద్మావతికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్ను ప్రచారానికి దింపి, ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయాలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే.. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్కు సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తమ్కు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. సమయం, స్థలం తాను చెప్పినా లేదా.. తనని చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. అది హుజూర్నగర్ సెంటరా.. సూర్యాపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్కుమార్ రెడ్డినే అని వ్యాఖ్యానించారు. శాసన సభ్యుడిగా తన ఐదేళ్ల కాలంలో సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి ఉత్తమ్ తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి 20 ఏళ్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా అధికారంలో ఉండి చేసిందేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం ఎలానో తెలియదనే.. కోదాడ ప్రజలు ఇంటికి పంపారని ఘాటుగా విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని, ఉత్తమ్, రేవంత్రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరచిపోరన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్
సాక్షి, హుజూర్నగర్ : హుజూర్నగర్లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. ప్రచార రథాలు నిలిచిపోయాయి. శనివారం సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్నగర్తో పాతో దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా ఉంచింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచారు. లైసెన్స్డ్ వెపన్స్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. మహారాష్ట్రాలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబర్ 21 న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 24 న ఫలితాలు వెల్లడిస్తారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన చూస్తున్నాం: కిషన్రెడ్డి
సాక్షి, సూర్యాపేట : ఎప్పుడు చూడని తుగ్లక్ పాలన ఇప్పుడు చూస్తున్నామని.. కేసీఆర్ ఓ పిచ్చి తుగ్లక్ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మఠంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అభ్యర్ధి కోట రామారావును గెలిపించాలని కోరారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని.. కేసీఆర్ నియంతలా మారి నిరంకుశ పాలన చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో హక్కుల గురించి అడిగే హక్కు ఏ సంఘాలకు లేకుండా కేసీఆర్ చేశారన్నారు. హుజూర్నగర్ నియోజక వర్గంలో ఉన్న 14 సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఏడాదికి వచ్చే రూ. 300 కోట్లు.. ఈ ప్రాంతానికి ఖర్చు చేయట్లేదని మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ నిజాం పాలన చేస్తున్నారని, 50 వేల ఆర్టీసీ ఉద్యోగులను తొలిగించింన ఘనత కేసీఆర్కే చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాలు లేవని.. ఉన్న ఉద్యోగాలను కేసీఆర్ తొలగిస్తున్నారని మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ ఇస్తానన్న.. డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ ఎక్కడా అని ప్రశ్నించారు. మహిళ సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని కేసీఆర్ తీరును ఎండగట్టారు. ఉప ఎన్నికతో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని మంత్రి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. 2023లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మునిగిన నావ ఉత్తమ్ హుజూర్నగర్కు చేసిందేమి లేదని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్లో గెలిచినా.. ప్రయోజనం ఉండబోదనీ, కాంగ్రెస్ మునిగిన నావ అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నాయకత్వంలో 19 సీట్లు గెలిస్తే.. అందులో 13 మంది టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ, దేశంలో.. ఉత్తమ్, రాహుల్ గాంధీ కాలం చెల్లిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’
సాక్షి, హుజూర్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఊడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్నగర్ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్, ప్రభుత్వ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి.. ‘ఇది టీఆర్ఎస్ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నరు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నరు. పద్మావతి రెడ్డికి ఘోర పరాజయం తప్పదు. హుజూర్నగర్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు హుజూర్నగర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నరు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. -
‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’
సాక్షి, సూర్యాపేట: ఆర్టీసీ సమ్మెతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనల నేపథ్యంలో భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది హుజూర్నగర్ ఉప ఎన్నికే అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్ వసూలు చేస్తోన్న కేసీఆర్.. ఎయిర్ బస్కు మాత్రం 1శాతం ట్యాక్స్ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.85 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ అనే అధికారం కేసీఆర్కు లేదని స్పష్టం చేశారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల బాధ్యతారహితమైన మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కోర్టులతో ఆటలాడితే.. కేసీఆర్కు మొట్టికాయలు తప్పవన్నారు. ఉద్యమ నాయకులేవరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. మా అక్కను గెలిపించుకుంటాను కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్టల నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నియంతృత్వాన్ని, నిర్భంధాన్ని అణచివేయాలంటే.. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే అని స్పష్టం చేశారు. కేటీఆర్ నిజామాబాద్లో తన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ తాను మాత్రం హుజూర్నగర్లో తన అక్కను గెలిపించుకుంటానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవన్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అభిప్రాయ బేధాలు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలి కేసీఆర్ పాలనలో మద్యం అమ్మకాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడమే కాక రూ. 2.5లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డు వెడల్పు కోసం స్వచ్ఛందంగా సహకరించిన వారిని మరో 5 ఫీట్లు వెనక్కి జరగాలంటూ బెదిరించడం అన్యాయమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పాలన లోపం వల్లే మూసీ గేట్లు దెబ్బతిన్న సంఘటన చోటు చేసుకుందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని సాండ్ మాఫియా మొదలు.. ల్యాండ్ మాఫియా వరకు అన్ని జగదీశ్ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మూసీ నీళ్లు వృథాగా పోవడం వల్ల నష్టపోయిన రైతులకు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
నేటితో ప్రచారానికి తెర
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచార యుద్ధానికి నేటితో తెర పడనుంది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, ఆ యా పార్టీల ప్రజాప్రతినిధులు హోరా హోరీగా ప్రచారం చేశారు. శనివారం సాయంత్రం 5 గం టలతో ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారాన్ని మార్మోగించాలని షెడ్యూల్ పెట్టుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దసరా తర్వాతనుంచి జోరుగా ప్రచారం.. గత నెల 21న ఉప ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ విడులైంది. ఆతర్వాత 23న నోటిఫికేషన్ విలువడినప్పటి నుంచే నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణతో 28మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా 15మంది ఇండిపెండెంట్లు. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తమ సత్తా చాటాలని బీజేపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఆపార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం కోసం జోరుగా ప్రచారం చేశారు. ముఖ్య నేతలంతా రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకు కదిలారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి విజయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఆపార్టీ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, ఇతర నేతలు ప్రచారం చేశారు. టీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. బీజేపీ కూడా తమ బలమేంటో నిరూపించుకోవాలని ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున ప్రచారం కోసం ముఖ్య నేతలను దింపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా నేతలు జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.. పార్టీ అభ్యర్థి చావా కిరణ్మయి విజయం కోసం మూడుసార్లు నియోజకర్గంలో ప్రచారం చేశారు. ఒక్కరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. ప్రచారానికి ఈ రోజే మిగలడంతో తమకు బలమున్న ప్రాంతాల్లో చివరిగా ప్రచారానికి అభ్యర్థులు వెళ్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ఎత్తుకు పైఎత్తుల్లో మునిగారు. గత ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచ్చిన ప్రాంతాల్లో.. ‘తాము గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం’ అంటూ హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చివరి రోజు ముఖ్య నేతలు ప్రచారానికి వస్తుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ అన్ని మండలాల్లో చివరి రెండు రోజులు ముఖ్య నేతలతో సుడిగాలి పర్యటనలు పెట్టించాయి. ప్రచారం ముగుస్తుండడంతో ఇక ప్రధాన పార్టీలు పోలింగ్పై నజర్ పెట్టాయి. గ్రామాల్లో ఓటరు జాబితాలతో పార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. వార్డుల వారీగా ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఓట్లు తమ అభ్యర్థికి పడతా యోనని అంచనా వేస్తున్నారు. తమ అభ్యర్థికి పడవనుకునే ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ఎలా ముందుకు వేయాలన్న దానిపై రహస్య చర్చల్లో మునిగారు. పోలింగ్ ఈ నెల 21న జరగనుండడంతో ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేసిన స్థానిక నేతలంతా ఈ రోజు సాయంత్రానికి తమ గ్రామాల్లో మకాం వేయనున్నారు. రోడ్డు షోల జోరు.. టీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి కేటీఆర్ ఈ నెల 4న హుజూర్నగర్లో రోడ్డు షో నిర్వహించారు. ఆతర్వాత చివరిగా మిగతా పార్టీలు ముఖ్యనేతల రోడ్డు షోలు పెట్టాయి. రాష్ట్ర, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు గ్రామాలు, మండలాల్లో అభ్యర్థుల వెంట ఉండి ప్రచారం చేశారు. ఎంపీ రేవంత్రెడ్డి శుక్రవారం పాలకీడు, నేరడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్రూరల్, మఠంపల్లి మండలాల్లో రోడ్డు షో నిర్వహించారు. చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్నగర్లో చివరగా ఆయన రోడ్డు షో జరగనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి కూడా శనివారం ప్రచారంలో పాల్గొంటారని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మఠంపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు వేపలసింగారం, 12.30 గంటలకు మేళ్లచెరువు, మధ్యాహ్నం 1.30 గంటలకు చింతలపాలెంలో ప్రచారం నిర్వహిస్తారని ఆపార్టీ నేతలు తెలిపారు. రోడ్డు షోల్లో ఏ పార్టీకి ఎంత మంది తరలివచ్చారన్న చర్చ జోరుగా సాగుతోంది. -
కారుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోదీ దోస్తులని, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డితో కలసి నియోజవర్గంలోని పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, కేసీఆర్ ముస్లింల వ్యతిరేకి అని, వారికి వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈనెల 21న జరిగే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ను ఓడించాలన్నారు. హుజూర్నగర్లో చిన్న తుంపర వర్షానికే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేదని, ఇక్కడి ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక, మొఖం చూపించలేక సభకు రాలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ మంత్రి షబ్బీర్అలీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్యాదవ్, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గెలిచేదెవరు హుజూర్?
సూర్యాపేట: కృష్ణమ్మ పాదాల చెంతన కొలువు దీరిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల 21న జరిగే ఉప ఎన్నిక కోసం యావత్ రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నల్లగొండ ఎంపీగా గెలిచినందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోననే అంశం రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో ప్రచార బరిలోకి దిగిన అధికార టీఆర్ఎస్ ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తుండగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ మరో విజయం కోసం చెమటోడుస్తున్నది. మరోవైపు ఉప పోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుండటం, ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంచడంతో ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్ నేతృత్వంలోని అధికార యంత్రాగం డేగకన్నుతో కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఉప ఎన్నిక ప్రచార సరళిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జోరుగా ప్రచారం... ఉప ఎన్నికలో గెలిచేందుకు గులాబీదళం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించిన సంక్షేమ పథకాలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ప్రధానంగా తమ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ల వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతిని గెలిపిస్తే వారి కుటుంబానికి తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తన ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోంది. లింకు రోడ్లు, లిఫ్టులు, సబ్స్టేషన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తమ హయాంలోనే జరిగిందని ఓటర్లకు గుర్తుచేస్తోంది. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా హుజూర్నగర్ ఎమ్మెల్యేగా తన భర్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు తప్ప ప్రస్తుత ప్రభుత్వం కాదని పద్మావతి చెప్పుకొస్తున్నారు. ఇక బీజేపీ నేతలు సైతం తమ పార్టీని గెలిపిస్తే కేంద్ర నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి నేతలు, ఇన్చార్జులు నియోజకవర్గంలోనే పాగా వేయడంతో గ్రామాల్లో ప్రతిరోజూ రాజకీయ హడావిడి కనిపిస్తోంది. హుజూర్నగర్, నేరేడుచర్ల పట్టణాల్లోని లాడ్జీలు, కల్యాణ మండపాల్లో గదులకు ఎక్కడాలేని గిరాకీ ఏర్పడింది. ఆ పార్టీల ఓట్లతో ఎవరికి దెబ్బ..? ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపోటములను పక్కనపెడితే వారికి వచ్చే ఓట్ల వల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికి నష్టమన్న అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా పెరిక సామాజికవర్గానికి చెందిన డాక్టర్ కోట రామారావు, టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన చావా కిరణ్మయి బరిలో ఉండగా వారిద్దరికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వస్తాయనే అంచనా ఉంది. రామారావు తరఫున బీజేపీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి మరీ ప్రచారంలో తీసిపోకుండా ప్రయత్నిస్తున్నారు. కిరణ్మయి కూడా తన వంతు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలకు వచ్చే ఓట్ల వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధాన పార్టీల బలాబలాలు... టీఆర్ఎస్ బలాలు: స్థానిక సంస్థల ఎన్నికలతో బలోపేతం కావడం, అధికార పార్టీగా సానుకూలత, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు. బలహీనతలు: పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థి అందరినీ కలుపుకొని వెళ్లరనే ప్రచారం. కాంగ్రెస్కు సానుకూలాంశాలు: ఉత్తమ్ గతంలో చేసిన అభివృద్ధి, మహిళా అభ్యర్థి కావడం ప్రతికూలతలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ, పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు గెలుపోటములను ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్న అంశాలివే: కేసీఆర్ చరిష్మా, ఉత్తమ్ పలుకుబడి, ఆర్టీసీ సమ్మె, రైతుబంధు, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ, బీజేపీలకు వచ్చే ఓట్లు, నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం. నియోజకవర్గ స్వరూపం ఇదీ.. మండలాలు: నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, హుజూర్నగర్ (రూరల్), మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మున్సిపాలిటీలు: హుజూర్నగర్, నేరేడుచర్ల ప్రధాన సామాజిక వర్గాలు: రెడ్డి, ఎస్టీ (లంబాడ), మాదిగ, మాల, యాదవ, గౌడ, మున్నూరు కాపు, కమ్మ, పెరిక, వైశ్య మొత్తం ఓటర్లు.. 2,36,646 స్త్రీలు.. 1,20,320 పురుషులు.. 1,20,320 ప్రచారం ముగిసేది: రేపు (శనివారం) పోలింగ్: ఈ నెల 21న, ఫలితం: 24న -
సీఎం కేసీఆర్ హుజూర్నగర్ సభ రద్దు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఏవియేషన్ అనుమతి లేకపోవడంతో చివరి నిమిషంలో రద్దయింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే గురువారం హుజూర్నగర్లో భారీ వర్షం కురుస్తుండటంతో..హెలిక్యాప్టర్కు ఏవియేషన్ విభాగం అనుమతివ్వలేదు. సీఎం భద్రతను దృష్టిలో పెట్టుకుని హెలిక్యాప్టర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ విభాగం డైరెక్టర్ వీఎన్ భరత్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. హెలిక్యాప్టర్కు అనుమతి లేకపోవడంతో సీఎం పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ నెల 19తో హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండటంతో.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘కేసీఆర్పై ప్రకృతి కూడా పగ పట్టింది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గురువారం బహిరంగసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు ప్రకృతి కూడా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కుండపోతగా వర్షం కురవడం ద్వారా దేవుడు హుజూర్నగర్కు కేసీఆర్ను రావద్దని ఆదేశించాడని వ్యాఖ్యానించారు. హుజూర్నగర్లో గురువారం శ్రవణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ తీరు పట్ల ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని, అందుకే హుజూర్నగర్ బహిరంగసభకు కేసీఆర్ హెలికాఫ్టర్ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందన్నారు. దీని ఫలితంగాకే కేసీఆర్ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఈ విధంగా దేవుడే వాతావరణం రూపంలో వచ్చి కేసీఆర్ను అడ్డుకున్నాడని వ్యాఖ్యానించారు. అసత్యాలతో చేయని వాటిని కూడా చేశామంటూ తప్పుడు హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ వస్తున్నాడని తెలుసుకునే దేవుడు అతి భారీ వర్షం రూపంలో అడ్డుకున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. భారీ వర్షాల ద్వారా దేవుడు ఇక్కడి ప్రజల్ని రక్షించాడని, రెండు సార్లు భారీ వర్షం కురవడంతో ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ను రానీయకుండా చేసిన వరుణదేవుడిన్ని జనం సైతం కొనియాడుతున్నారని దాసోజు శ్రవణ్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేశారని, అందుకే కేసీఆర్ను హుజూర్నగర్ రాకుండా కుండపోత వర్షం ద్వారా దేవుడు మోకాలడ్డాడని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ పట్టనట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని ఆయన విమర్శించారు. పని చేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఆరీస్టీ ఉద్యోగులను దసరా పండుగ సమయంలో ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికేపోదని వ్యాఖ్యానించారు. కే సీఆర్ పతనానికి ఇదే నాంధి అని, కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని, ప్రజలు అన్నీ మరిచిపోయి ఎప్పుడూ తమ వెంటే ఉంటారని భావించవద్దని హెచ్చరించారు. ప్రజల నుంచి గుణపాఠం కేసీఆర్కు ఉంటుదని శాపాలు పెట్టారు. -
కేసీఆర్ సభ రద్దు.. నేతల ప్రత్యేక సమావేశం
సాక్షి, హుజూర్నగర్: రాష్ట్ర రాజకీయాల్లో హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ బహిరంగసభ రద్దు కావటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. కేసీఆర్ సభతో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లలో కొత్త జోష్ తేవాలని భావించిన టీఆర్ఎస్ నేతలు సభ రద్దుతో నిరుత్సహపడ్డారు. ముఖ్యమంత్రి సభ రద్దైనప్పటికీ ప్రచార జోరును ప్రతి పక్షాలకు దీటుగా కొనసాగించాలనే వ్యూహంతో టీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. సభ రద్దు అయిందని ప్రకటించిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి, జిల్లా ఎమ్యెల్యేలంతా ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు కావటంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. సీఎం సభ అనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత కలవరపాటు నెలకొంది. నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారో.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎటువంటి ప్రకటన చేసి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతారోనని అనుకున్నారు. కానీ, సభ రద్దు కావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎంసభ రద్దు కావటం టీఆర్ఎస్ పార్టీకి, శ్రేణులకు ఎదురుదెబ్బ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
‘మేము తినే బుక్క మీకు పెట్టి కాపాడుకుంటాం’
సాక్షి, రంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. హయత్ నగర్ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కార్మికులు ఎవరు అధైర్యపడవద్దని, తమ వెంట నాలుగు కోట్ల ప్రజలున్నారని ధైర్యం చెప్పారు. మేము తినే బుక్క మీకు పెట్టి మరి కాపాడుకుంటామని అభయమిచ్చారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెడుతోందని, అయినా ఓటమి తప్పదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కుర్చి పోయే కాలం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కిరాయి డ్రైవర్స్తో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ సూచించారు. -
వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ రద్దు
-
కేసీఆర్ సభ: భారీవర్షంతో అనూహ్య పరిణామం
సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం హుజూర్నగర్ పట్టణంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వరుణుడు అడ్డు తగిలాడు. హుజూర్నగర్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో సీఎం కేసీఆర్ సభ రద్దయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్ వస్తుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున జనసమీకరణను చేపట్టింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. గంటసేపటి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. సభా ప్రాంగణంలో నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. దీంతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతూ.. సభ నిర్వహించడం కుదరదని గ్రహించిన టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సభను రద్దు చేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికే ఇక్కడ ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ సభకు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్లాన్లు వేసింది. వారం రోజులుగా ఈ సభపైనే టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు దగ్గరుండి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయి.. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా హుజూర్నగర్ చేరుకుంటారనే తరుణంలో వరుణుడి రాకతో సభకు బ్రేక్ పడింది. -
సభపై ‘గులాబీ’ నజర్!
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలింది. ప్రచారం చివరి అంకానికి చేరడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. గురువారం హుజూర్నగర్కు సీఎం కేసీఆర్ వస్తుండడంతో టీఆర్ఎస్ భారీగా జన సమీకరణ చేస్తోంది. వారం రోజు లుగా ఈ సభపైనే టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు బుధవారం సాయంత్రం పరిశీలించారు. సీఎం కేసీఆర్ వస్తారని .. మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా హుజూర్నగర్ చేరుకుంటారు. పట్టణ సమీపంలో రామస్వామిగుట్టకు వెళ్లే దారిలో సభాస్థలి పక్కనే హెలిపాడ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ సభలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పొల్గొననున్నారు. ఉప ఎన్నికల ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డిలు సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ముఖ్య నేతలతో జనసమీకరణపై పలుమార్లు సమీక్షించారు. ఇతర జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ ప్రచార ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఆయా మండలాల కేడర్తో సభకు భారీగా తరలిరానున్నారు. సాధారణ ఎన్నికల్లో ఇక్కడే సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అప్పుడు, ఇప్పుడు శానంపూడి అభ్యర్థిగా ఉన్నారు. సభలో ముఖ్యమంత్రి చేసే ప్రసంగంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, కొన్ని చోట్ల ఎత్తిపోతలు, ఇళ్ల నిర్మాణంతో పాటు హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్లపై సీఎం హామీల ఇస్తారని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సభతో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ ఇప్పటికే అంచనా వేసింది. అయితే సీఎం ప్రసంగం ఎలా ఉంటుందోనని ఆ పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీల నేతల ఎదురుచూస్తున్నారు. హుజుర్నగర్లో రణగోల.. ఉప ఎన్నికల ప్రచార గడువు మూడు రోజులే ఉండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రచారంతో హుజూర్నగర్ రాజకీయ రణగోలగా మారింది. ఎక్కడ చూసినా ఉదయం నుంచే ‘పలానా పార్టీ అభ్యర్థి గుర్తుకే ఓటేయాలి’ అన్న మైకుల మోత మోగుతోంది. పల్లెలు, పట్టణాల్లో ఆటోలు, ట్రాలీలు, డీసీఎంలల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి ప్రచారాన్ని కదం తొక్కిస్తున్నారు. ఎవరో తెలవని నేతలు, ఎప్పుడు రాని విధంగా గడపగడపకూ వచ్చి తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లను అభ్యరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇతర జిల్లాల నుంచి నేతలు, రాష్ట్ర ముఖ్య నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రప్పించి ప్రచారం చేయిస్తున్నారు. దీంతో ఈ స్థాయిలో ఏ ఎన్నికకు హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం జరగలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నిక కావడంతో ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. అలాగే తమ సత్తాఏంటో నిరూపించుకోవాలని బీజేపీ కూడా ఈ ఎన్నికలను చాలెంజ్గా తీసుకుంది. ఈ పరిస్థితితో చివరి మూడు రోజులు ముఖ్య నేతల ప్రచారంతో ప్రజాభిప్రాయం ఏమేరకు మారుతుంది ..?, ఏ పార్టీ వైపు కొంత మొగ్గుచూపే అవకాశం ఉందన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. -
‘కేసీఆర్కు భయం పట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్లో గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎన్నికల సంఘం సీఈఓ రజత్కుమర్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ చానల్, ఇంగ్లీష్ పత్రికలో భారీగా టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఈ ఉపఎన్నికలో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా జరుగుతోందన్న విషయాన్ని రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్రెడ్డిలు కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చెయాలని కోరామని వెల్లడించారు. కేసీఆర్ హుజూర్నగర్ సభలో ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సీఈఓకు విజ్ఞప్తి చేశామని శశిధర్రెడ్డి తెలిపారు. హుజుర్ నగర్ ఉపఎన్నికలపై కేసీఆర్కు భయం పట్టుకుందని అందుకే తానే స్వయంగా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చెయాలంటే హుజూర్నగర్లో కాంగ్రెస్పార్టీని గెలిపించాలని కోరారు. -
హుజూర్నగర్లో రేపు సీఎం కేసీఆర్ ప్రచారం
సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగే బహిరంగ సభకు తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో అందరి దృష్టి హుజూర్నగర్ వైపే ఉంది. ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలు కూడా వారికి మద్దతు తెలపడంతో రేపు జరగబోయే సభలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన ప్రకటన ఏమైనా ఉంటుందా? అనే అంశం ఆసక్తిగా మారింది. బహిరంగ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడబోతున్నారని.. ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి. హుజూర్నగర్కు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్న తరుణంలో.. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులను ముందస్తు అరెస్టులు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చని టీఆర్ఎస్ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. మరో వైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ నేపథ్యం, టీఆర్ఎస్పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అన్నింటికి రేపు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక ఉపఎన్నిక ప్రచార గడువు సమీపిస్తుండడంతో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తుతున్నాయి. ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో.. 70 మంది నేతలతో టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే కేటీఆర్ రోడ్ షో ముగిసింది. ఎంత మంది బలమైన నేతలు ప్రచారం చేసినా.. కేసీఆర్ ప్రచారంపైనే టీఆర్ఎస్ నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. -
నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచా రానికి ఈ నెల 19 సాయంత్రంతో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. చివరగా ముఖ్యనేతలను ప్రచారానికి దింపుతున్నాయి. గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్ హుజూర్నగర్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు. 18, 19 తేదీల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి రోడ్డు షో ఖరారైంది. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు సుడిగాలి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. హుజూర్నగర్లో 17న టీఆర్ఎస్ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్.. ఈనెల 17న హుజూర్నగర్ సమీపంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు సీఎం ఈ సభలో పొల్గొం టారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పా ట్లు చకచకా సాగుతున్నాయి. మం త్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పార్టీ నేతలు సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. చివరి ప్రచార అంకంలో కేసీఆర్ సభకు భారీ జనసమీకరణకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు తరలిరావాలని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఆ పార్టీ కేడర్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించేం దుకు కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తూ సభకు తరలిరావాలని మరోవైపు చెబుతున్నారు. ఈ సభ పై టీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ప్రచారం జరుగుతున్న తీరుతో తమ విజయం ఖాయమని, కేసీఆర్ సభ సక్సెస్తో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సభలో నియోజకవర్గానికి సంబంధించి సీఎం ఇచ్చే హామీలు, ప్రసంగమే కీలకమని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు ఉన్నది ఒకటైతే ఈ సభ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, గెలుపు తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభ విజయవంతం చేసేందుకు ఏ మండలాల నుంచి ఎంత మందిని తరలించాలని పార్టీ ముఖ్య నేతలు.. మండల స్థాయి నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలిచ్చారు. హుజూర్నగర్ పట్టణం నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రేవంత్రెడ్డి రోడ్డు షో ఖరారు.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎంపీ రేవంత్రెడ్డి రోడ్డు షో షెడ్యూల్ ఖరారైంది. ఈ ఎన్నికల సందర్భంగా తొలసారి ఆయన నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయన రోడ్డు షో పెట్టారు. 18న ఉదయం 10గంటలకు పాలకీడు మండంల జానపహాడ్దర్గా, 11గంటలకు పాలకీడు, మధ్యాహ్నం ఒంటి గంటకు దిర్శించర్ల, 2గంటలకు నేరడుచర్ల, సాయంత్రం 4గంటలకు గరిడేపల్లి, సాయంత్రం 6గంటలకు హుజూర్నగర్ మండలం బూరుగడ్డ, రాత్రి 8గంటలకు వేపలసింగారంంలో రోడ్డు షో నిర్వహిస్తారు. 19న ఉదయం 8గంటలకు మఠంపల్లి, 10గంటలకు చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం, మధ్యాహ్నం 12 గంటలకు మేళ్లచెరువు, 1.30గంటలకు రోడ్డు షోతో హుజుర్నగర్ పట్టణానికి చేరుకోనున్నారు. ఇప్పటివరకు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్యెల్యేలు, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రేవంత్రెడ్డి ప్రచారంతో పార్టీ పరంగా మరింత ఊపు వస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు షో జరిగే ప్రాంతాల్లో జన సమీకరణపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. రేవంత్రెడ్డితో పాటు ఉత్తమ్, పద్మావతి, ఇతర ముఖ్య నేతలు రోడ్డు షోలో పాల్గొననున్నారు. అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం.. ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి విజయరామారావు, ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నేరడుచర్ల, గరిడేపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 18 లేదా 19న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ప్రచారానికి రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. టీడీపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. సీపీఎం మద్దతు ఇచ్చిన అభ్యర్థి కోసం ఆ పార్టీకి బలమున్న గ్రామాల్లో ఉమ్మడి జిల్లా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ కుల సంఘాల సమావేశాలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒక్కో గ్రామంలో.. అక్కడి నేతలను కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు పల్లెలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం చేస్తుండడంతో ఉప ఎన్నికల రాజకీయం మరింతగా వేడెక్కింది. పోలింగ్కు ఇక ఐదు రోజుల సమయమే ఉండడంతో అన్ని గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చుట్టివస్తున్నారు. -
టీఆర్ఎస్ ‘గెలుపు’ లెక్కలు
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా అధికార టీఆర్ఎస్ విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటోంది. సంస్థాగతంగా ఇతర పార్టీలతో పోలిస్తే బలంగా ఉన్నామని, కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు చేరడం కలసి వస్తుందని భావిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా బరిలో ఉండటం తమకే లాభిస్తుందని అంచనా వేస్తోంది. ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తమ వ్యతిరేక ఓట్లను కమలం పార్టీ చీల్చుతుందని విశ్లేషిస్తోంది. అలాగే సీపీఎం బరిలో లేకపోవడం, సీపీఐ ఊగిసలాట ధోరణి తదితరాల ప్రభావం పెద్దగా ఉండదని కొట్టిపారేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయిన టీఆర్ఎస్ను ఈసారి ఉప ఎన్నికలో అలాంటివే మరో రెండు గుర్తులు ఉండటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి మూడు పర్యాయాలు గట్టి పోటీ ఇచ్చినా హుజూర్నగర్ సీటును కైవసం చేసుకోలేకపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్... ఈ నెల 17న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టింది. రోజువారీ ప్రచారంపై ‘వార్ రూమ్’.. హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహం అమలు, సమన్వయం కోసం టీఆర్ఎస్ సుమారు 70 మంది ఇన్చార్జీలను నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు పలువురు పార్టీ నేతలకు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించింది. ఉప ఎన్నిక ఇన్చార్జిగా పనిచేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నేతృత్వంలో ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసి రోజువారీ ప్రచార తీరుతెన్నులను సమన్వయం చేస్తోంది. ఇప్పటికే సామాజికవర్గాలవారీగా ప్రచార సభలు నిర్వహించింది. మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటుండగా మరో మంత్రి పువ్వాడ అజయ్ అడపాదడపా పర్యటించి వెళ్లారు. -
‘ఆయన.. మంత్రి జగదీశ్వర్రెడ్డి బినామీ’
సాక్షి, హుజూర్నగర్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులెవరు గెలిచినా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బినామీ అని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు అమ్మారని ఆరోపించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిస్తే ఉత్తమ్కు తప్ప హుజూర్నగర్ ప్రజలకెలాంటి ప్రయోజనం ఉండదని, ఉత్తమ్కుఎ ఆమె జీ హుజూర్ అంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణ్ గరిడేపల్లి మండలంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైదిరెడ్డి గెలిస్తే 107వ ఎమ్మెల్యే అవుతాడు తప్ప ప్రయోజనం లేదు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ కొలువుల ఊసే లేదు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుమారు 25 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాకూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్ ఉదయం తిట్టుకుంటారు. రాత్రి వేళల్లో మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో 50 వేల మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ అగ్గితో గోక్కున్నావు. నీ చేతులు, ఒళ్లు కాలడం పక్క’అని లక్ష్మణ్ అన్నారు. -
కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతోంది!
సాక్షి, హుజూర్నగర్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న (గురువారం) హుజూర్ నగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాజేశ్వర్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. సబ్బండ వర్గాల ప్రజలు ఎవరికీ వారు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతున్నదని అన్నారు. హుజూర్నగర్ ప్రజల అదృష్టం బాగుందని, వారు ఈ ఉప ఎన్నికలో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు, రెవెన్యూ డివిజన్ సమస్యకు టీఆర్శ్రీస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని చెప్పారు. -
జై ‘హుజూర్’ ఎవరికో..?
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల యుద్ధంలో నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రాష్ట్ర స్థాయిలో ఆసక్తికర చర్చసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ తామేంటో తేల్చుకునేందుకు ఈ ఎన్నికల్లో మోహరించాయి. పార్టీ అగ్రనేతలను బరిలోకి దింపి జోరుగా ప్రచారం చేయిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్లు తమ సత్తా చాటుతామని ఉప బరిలో నిలబడ్డాయి. ఎవరికివారు ప్రచారంలో హామీలు, విమర్శలు గుప్పిస్తుండడంతో ఈ ఎన్నికల్లో విజేత.. పరాజితులు ఎవరోనని ఉమ్మడి నల్ల గొండ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఐక్యతారాగం.. ఉప ఎన్నికలతో కాంగ్రెస్లో ముఖ్య నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి, పార్టీ అభ్యర్థి పద్మావతిలు ఇద్దరు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికతో ఆపార్టీ నేతలంతా ఒక్కటయ్యారు. ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థి విజయం కోసం సర్వ శక్తులొడ్డుతున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ముఖ్య నేతలంతా ప్రచారంలో ఉన్నారు. వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు పెంచింది. అయితే రాష్ట్ర స్థాయి నేతలంతా ప్రచారంలో ఉండడంతో ఇక విజయం తమదేనని ఆపార్టీ ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది వచ్చే మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందన్న ఆలోచనలో ఆపార్టీ నేతలున్నారు. టీఆర్ఎస్కు దీటుగా నేతలంతా ఐక్యంగా ప్రచారం చేస్తుండడంతో కేడర్లో కూడా నూతనోత్తేజం వచ్చిందని ఆపార్టీ భావిస్తోంది. గతంలో ఉత్తమ్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాకు పాల్పడుతుందని, నియోజకవర్గం అ«భివద్ధి కాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆపార్టీ నేతలు అంతటా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్టీసీ సమ్మె, ప్రజల ఇబ్బందులు ఇవన్నీ తమకు కలిసి వచ్చి భారీ మెజార్టీ వస్తుందని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గులాబీ దండులా ప్రచారం.. గులాబీ దండులా టీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్లు, ఇతర ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే ఉండి ముఖ్య నేతలకు ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఇతర జిల్లా ముఖ్య నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. గ్రామ, మండల నేతలతో ఈ నేతలు సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గతంలో ట్రక్కు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని, ఈ సారి అభ్యర్థి పేరు, గుర్తులను.. డమ్మీ బ్యాలెట్తో ఓటర్లకు చూపిస్తున్నారు. కేటీఆర్ రోడ్ షో భారీగా సక్సెస్ అయిందని, సీఎం కేసీఆర్ సభ కూడా ఇంతకన్నా ఎక్కువగా విజయంవంతం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి భారీగా జన సమీకరణలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్న నేతలు కేసీఆర్ సభకు జనసమీకరణకు కసరత్తులో ఉన్నారు. కేసీఆర్ సభ ముగియడం, ఇతర జిల్లాల నేతలు మండలాల నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామాలు, మండలాల్లోని ముఖ్యనేతలకు పోల్మేనేజ్మెంట్పై పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్నగర్ అభివద్ధి చెందుతుందని, ఉత్తమ్ ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని .. టీఆర్ఎస్ ప్రచారంలో విమర్శలు సంధిస్తోంది. . మమ్ముల్ని ఆదరించండి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, ఉత్తమ్తో అభివద్ధి జరగలేదని.. బీజేపీ, టీడీపీలు ప్రచార అస్త్రాలుగా చే సుకున్నాయి. పార్టీ అభ్యర్థి ప్రచారానికి బీజేపీ ఆపార్టీ ఎంపీలు, ముఖ్య నేతలను రంగంలోకి దింపింది. ఉమ్మడి జిల్లా నేతలతో సమన్వ యం చేసుకుంటూ పార్టీ రాష్ట్ర నేతలు కాం గ్రెస్, టీఆర్ఎస్కు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులతో నియోజకవర్గం అభివద్ధి చేస్తామని ఆపార్టీ నేతలు ప్రచారంలో హామీల వర్షం కురి పిస్తున్నారు. ఇక టీడీపీ కూడా తమకు కేడర్ బలంగానే ఉందని, ఏ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుతో సత్తా చాటుతామని ముఖ్య నేతలతో హోరాహోరీగా ప్రచారం చేయిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ల పైన ఉన్న వ్యతిరేకతతోనే తమకు ఓట్లు రాలుతాయన్న ధీమాలో ఆపార్టీ ఉంది. ఇండిపెండెంట్లు కూడా ప్రచార జోరు తగ్గనివ్వడం లేదు. మొత్తంగా ప్రచారం ఈనెల 19 ముగియనుండడంతో ఓటర్లు జై హుజూర్ అని ఏ అభ్యర్థికి అంటారో ఈనెల 24న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. -
టీఆర్ఎస్కు సీపీఐ షాక్ ...
-
టీఆర్ఎస్కు మద్దతు వెనక్కి..
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రకటిం చిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీని సంప్రదించి రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయించింది. సోమ వారం మఖ్దూం భవన్లో పార్టీ సీనియర్ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, కె.నారాయణ సమక్షంలో తొలుత రాష్ట్ర కార్యదర్శి వర్గం, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపసంహరణ నిర్ణయంపై సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని మొదట తీసుకున్న నిర్ణయం వల్లే పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సురవరం అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య నేపథ్యంలో మద్దతు ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. సమ్మె హక్కును నిరాకరించి, కార్మిక సంఘాలతో చర్చించకుండా 48 వేల మందిని డిస్మిస్ చేసి, సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకుని, కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి ఘర్షణ వాతావరణం కల్పించడాన్ని మానుకోవాలని సీపీఐ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు దిగుతున్నా, పరిష్కారానికి బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక, శ్రామికవర్గ పార్టీగా టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించినట్టు తెలిపారు. -
టీఆర్ఎస్కు మద్దతుపై సీపీఐ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది రేపు (మంగళవారం) హుజూర్నగర్లో జరిగే కార్యకర్తల సమావేశంలో వెల్లడిస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరి వారు కాదని, వారి సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలు సరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఐ విఙ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు.. ‘తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో హుజూర్నగర్ ఉప ఎన్నికలో సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని గతంలో నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, డిమాండ్లపై గత పది రోజులుగా చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉంది. సమ్మె కార్మికుల చట్టబద్దమైన హక్కు, దానిని నిరాకరించడం కార్మికవర్గ వ్యతిరేక వైఖరి. పైగా వారితో చర్చించేందుకు నిరాకరిస్తూ.. దాదాపు 48 వేల మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రైవేటికరణ చేయడానికి పూనుకుంది. (చదవండి : డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత) సమ్మె విచ్ఛిన్నానికి పూనుకుని ప్రభుత్వం విఫలమైంది. కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి నిరుద్యోగ యువకులను మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. ఈవైఖరి మార్చుకొమ్మని సీపీఐ చేసిన విఙ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికులు ఆత్మాహుతి చేసుకుంటున్నారు. మానసిక వ్యధతో మరికొంతమంది గుండెపోటుతో మరణించారు. పరిష్కారం బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీపీఐ కార్మికవర్గ పార్టీగా, శ్రామికవర్గ పార్టీగా స్పందించింది. హూజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరిస్తోంది’అన్నారు. -
హూజూర్నగర్ ఉపఎన్నికలు సీపీఐ అత్యవసర సమావేశం
-
కాంగ్రెస్, బీజేపీలే.. టీఆర్ఎస్ టార్గెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం బాగా వేడెక్కింది. తొలిసారి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తున్న అధికార టీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలను ఉమ్మడిగా టార్గెట్ చేస్తోంది. ప్రచార పర్వం మరో వారం రోజుల్లో ముగియనుండగా.. ఆ పార్టీ నేతలు పూర్తిగా ఈ రెండు పార్టీల రహస్య మైత్రిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వారి ప్రచార శైలి, ప్రసంగాలు, ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) ప్రకటనలు కానీ, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీశ్రెడ్డి వరసగా చేస్తున్న ప్రచార ప్రసంగాలు దీనికి అద్దం పడుతున్నాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కోల్పోయిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఆ పార్టీకి చెం దిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నా యకులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన బీజేపీకి కేవలం 15వందల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా, ఈ సారి కూడా ఆ పార్టీ పోటీ చేయడం కేవలం పరోక్షంగా కాంగ్రెస్కు ప్రయోజనం చేకూర్చేందుకే అన్న అంశాన్ని ప్రజల్లోగా బాగా తీసుకువెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు ఇక్కడ మాత్రం ఒక్కటయ్యాయని మంత్రి జగదీశ్రెడ్డి సందర్భం వచ్చిన ప్రతీ సారి ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. మరో వారం రోజులే ప్రచారానికి గడువు మిగిలి ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలూ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. గెలుపు ధీమాలో పార్టీలు.. మరో వైపు హుజూర్నగర్లో పోటీ చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు.. పోటీలో ఉన్న ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్నారు. కాగా, ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేక చతికిల పడిన టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి తదితర నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ సారి ఎలాగైనా తమ ఓటు శాతాన్ని పెంచుకోవాలని, దానిని పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఈ స్థానం నుంచి మూడు పర్యాయాలు విజయం సాధించింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో ఖాళీ అయిన ఈ స్థానంతో ఉత్తమ్ భార్య పద్మావతిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్కు హ్యాట్రిక్ విజయాలు అందించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా తమ వెంటే ఉంటుందన్న ధీమా కాంగ్రెస్ది. ఇప్పటికి మూడు పర్యాయాలు హుజూర్నగర్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయినా.. ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పంచాయతీలు, మండలాలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని బలం పెంచుకుంది. మరో వైపు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి జరిగిన చేరికలు, 2014 ఎన్నికల్లో దాదాపు 30వేల ఓట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వంటి అనుకూల అంశాలపైనా టీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. పార్టీ నాయకత్వం విడతల వారీగా చేయిస్తున్న అంతర్గత సర్వేల ద్వారా మండలాలు, గ్రామాల వారీగా, కులాలు, వయస్సుల వారీగా ఎక్కడ ఎలాంటి పట్టు ఉందో అంచనాకు వస్తూ.. దాని ప్రకారమే ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ తమ గెలుపుపై ధీమాతో పనిచేస్తున్నాయి. -
మద్యం, డబ్బు సంచులతో వస్తున్నారు జాగ్రత్త..
సాక్షి, హుజుర్నగర్ : ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు మద్యం, డబ్బు సంచులతో గ్రామాల్లోకి వస్తున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మట్టపల్లి, రాంచంద్రాపురంతండా, బీమ్లాతండా, బోజ్యాతండా, క్రిష్ణాతండా, గుర్రంబోడు తండా, పెదవీడు, చింతలమ్మగూడెం, సుల్తాన్పూర్తండా, మఠంపల్లిల్లో, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ హయాంలో తాను ఎంతో కృషిచేశానని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజల నుంచి విడదీయలేక అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యం సంచులతో వస్తున్నారని.. దానిలో భాగంగా లక్షల విలువచేసే మద్యం నిల్వలతో పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికే లాభమని కొంతమంది విష ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మాకు పిల్లలులేని విషయం లోకమంతా తెలుసని అవసరంలేని సంపాదనను పక్కన పెట్టి ఈ ప్రాంతంలో రూ.వేలకోట్లతో చేపట్టిన పనులతో ప్రజాభిమానం చూరగొన్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఇటీవల ఒక రైల్వే కాంట్రాక్టర్ను బెదిరిస్తే సదరు కాంట్రాక్టర్ తనకు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. ఈ ఉపఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కెనడాకు తిరుగు ప్రయాణం తప్పదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు మండలాలను కలుపుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య ప్యాసింజర్ రైలు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. హుజూర్నగర్లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా హుజూర్నగర్ను స్మార్ట్ పట్టణంగా గుర్తించేందుకు కృషి చేస్తాన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెల్ల శారద, టీపీసీసీ కార్యదర్శలు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్, కుంభం అనిల్కుమార్రెడ్డి, మాధవి, అనిత, సాముల శివారెడ్డి, మంజీనాయక్, రాజారెడ్డి, కిషోర్రెడ్డి, నవీన్నాయక్, అప్పారావు, శ్రీనివాస్, భీముడు తదితరులున్నారు. -
'కాంగ్రెస్కు బ్రేకులు వేస్తున్నాం'
సాక్షి, సూర్యాపేట : ‘హూజూర్నగర్లో కాంగ్రెస్కు బ్రేక్లు వేస్తున్నాం. 2018 ఎన్నికల్లోనే టీఆర్ఎస్ గెలుపునకు దగ్గరగా వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా కేసీఆర్ వెంటనే నడవాలని నాడు ఫలితాలు వచ్చాయి. మా పార్టీ గుర్తుకు సమీపంలో ఉండే గుర్తుతో అభ్యర్థిని బరిలోకి దింపి నాడు ఉత్తమ్ గెలిచాడు. అప్పుడు సీఎం అయితానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో ప్రజలు కొంత టర్న్ అయ్యారు. గుర్తుల కన్ఫ్యూషన్ కొంత దెబ్బతీసింది. టెక్నికల్గా గెలిచాడు తప్పా.. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు ఆయన ప్రజలను మోసగించడానికి ఏమీ లేవు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయం’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. నియోజకవర్గ అభివృద్ధిని ఉత్తమ్ కోరలేదు.. ఉత్తమ్ గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఏ పనులు చేయకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఆరేళ్లలో ఏ ఒక్క రోజు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించలేదు. హుజూర్నగర్లో ఈ సమస్య ఉంది.. పరిష్కారం చేయండని ముఖ్యమంత్రికి ఏనాడూ విజ్ఞాపన పత్రం ఇవ్వలేదు. జిల్లా మంత్రిగా నా దృష్టికి తీసుకురాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏనాడు జెడ్పీ సమావేశాలు, అధికారుల సమీక్షలకు హాజరుకాలేదు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ లేదు. ప్రజలంటే ఆయనకు నిర్లక్ష్యం. ఇవన్నీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అభివృద్ధి జరగలేదని అతను ఒప్పుకుంటే అతనే చేయలేదన్న భావన ప్రజలకు చెప్పనట్లయింది. ఇవన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. సైదిరెడ్డి పుట్టింది.. పెరిగింది హుజూర్నగర్ నియోజవర్గంలోనే. వాళ్ల ఊరికి వాళ్ల నాన్న, అమ్మ సర్పంచ్గా చేశారన్నది అందరికి తెలుసు. వాళ్ల నాన్న పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. దీనిపై ఉత్తమ్ పొరపాటున మాట్లాడి నాలుక కరుచుకున్నాడు. సైదిరెడ్డిది ఏ ఊరంటే మఠంపల్లి మండలం గుండ్లపల్లి అన్ని ఎవరైనా చెబుతారు. అదే ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతిలది ఏ ఊరు అం టే చెప్పగలిగిన వారు వేళ్లమీద లెక్కపెట్టే వారు లేరు. ఇప్పుడు సైదిరెడ్డి రెండోసారి బరిలోకి దిగడంతో ఉత్తమ్కు నిద్ర పట్టడం లేదు. మేం బలోపేతమయ్యాం.. 2018 ముందు మాకు బూత్ స్థాయిలో పటిష్ట యంత్రాంగం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వా త జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము హుజూర్నగర్లో మెజార్టీ స్థానాలు సాధించుకున్నాం. 143 సర్పంచ్ల్లో 100 పైగా సర్పంచ్ల్లో మేమే ఉన్నాం. మెజార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు మేమే. బూత్ కమిటీలతో సహా నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఉత్తమ్ ఏదో రెండు రోజుల ముందు జిమ్మిక్కులు చేస్తాడన్నది ఇప్పుడు పారవు. కాంగ్రెస్ పార్టీ కన్నా సంస్థాగత నిర్మాణంలో మేమే బలంగా ఉన్నాం. బూత్ల దగ్గర ఉత్తమ్ ఆటలు సాగవు. బీజేపీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు సహకరిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్కుమార్రెడ్డి రోజు మాట్లాడుకుంటున్నారు. మా అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబు పాలనలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కిం ద వరుసగా ఏడేళ్లు ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టినా ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు వరి నాట్లు వేస్తే దాన్ని రక్షించడానికి డెడ్ స్టోరేజీలో కూడా నీళ్లను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల పంటను కాపాడాం. రైతులు ఈ మార్పును స్పష్టంగా గమనించారు. సైదిరెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారు.. హుజూర్నగర్ చైతన్యవంతమైన ప్రాంతం. ఉత్తమ్ గతంలో వరుసగా గెలుస్తుండడానికి ప్రధాన కారణం ఉంది. అక్కడ ఒక్కసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేయలేదు. సైదిరెడ్డి.. ఇప్పుడు రెండోసారి పోటీలో ఉన్నారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత సైదిరెడ్డి నిత్యం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండి ఒక్కో గ్రామాన్ని ఐదారుసార్లు సందర్శించారు. స మస్యలను మంత్రిగా నాదృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చి పరిష్కా రానికి కృషిచేశారు. ఈ మార్పు ను ప్రజలు గమనిస్తున్నారు. -
హుజూర్నగర్ ఉప ఎన్నికపై అంతర్గత సర్వే
సాక్షి, హైదరాబాద్: ప్రజల స్పందన టీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పార్టీ ఇంచార్జీలతో పాటు, పలువురు సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపఎన్నికలు సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ కన్నా చాలా ముందు వరుసలో ఉందని కేటీఆర్ అన్నారు. 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కే.. కనీసం 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కే వస్తాయని తమ అంతర్గత సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంతృప్తిగా ఉందని, రానున్న వారం రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టీఆర్ఎస్ ఓడిపోయిందని, ఈసారి కూడా అలాంటి కొన్ని వాహనాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని.. కారు గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని కోరారు. టీఆర్ఎస్కు వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు అద్భుతంగా వస్తుందన్నారు. ఏం చెప్పాల్లో కాంగ్రెస్కు తెలియడం లేదు.. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్కు తెలియడం లేదన్నారు. మరోవైపు ‘టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ కి లాభం.. కారు గుర్తుకు ఓటేస్తే హుజూర్ నగర్ అభివృద్ధి బాట’ పడుతుందంటూ తాము చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్నగర్ను అభివృద్ధి చేస్తామంటూ ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ ఉప ఎన్నికలతో బీజేపీ బలం ఎంతో తేలిపోతుందని, ఇన్నాళ్లుగా వారి మాటలు, వట్టి మూటలని తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటే అదే వారికి గొప్ప ఉపశమనం అన్నారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్తో కలిసి పరోక్షంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీల దొంగచాటు బంధాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇంచార్జీలకు సూచించారు. -
హుజూర్నగర్: భారీగా మద్యం పట్టివేత
సాక్షి, మఠంపల్లి(హుజూర్నగర్): మండలకేంద్రం లోని ప్రధానరహదారి పక్కనగల హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుకగల ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.11లక్షల 52వేల విలువగల 9,600 మద్యం బాటిళ్లను శుక్రవారం సాయంత్రం అధికారులు దాడులు నిర్వహించి స్వాధీ నం చేసుకుని సీజ్ చేశారు. ఈవిషయమై ఎక్సైజ్ సీఐ శ్రీనివాసు స్థానికంగా మాట్లాడారు. అక్రమంగా మద్యం బాటిళ్లను నిల్వ ఉచిన పక్కా సమాచారం మేరకు ఫ్లయింగ్స్వా్కడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఈదాడుల్లో ఎంసీ, ఐబీబ్లూ కంపెనీలకు చెందిన 200ల కాటన్లలో 9వేల 600ల బాటిళ్లను కనుగొని స్వాధీనం చేసుకుని సంబంధిత గృహ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఫ్లయింగ్స్క్వాడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బంది తదితరులున్నారు. కల్తీమద్యం స్థావరంపై పోలీసుల దాడులు మేళ్లచెర్వు(హుజూర్నగర్): కల్తీ మద్యం తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే నర్సిరెడ్డి అనే వ్యక్తి మండలంలోని హేమ్లా తండా పరిధిలో ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లుగా గుర్తించి శుక్రవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 2 లీటర్ల స్పిరిట్, 100 క్వాటర్ బాటిళ్లు, 30 ఫుల్ బాటిళ్లు, 30 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించి 4 బెల్టు షాపులు సీజ్ చేయడంతో పాటు ఐదుగురిపై ఎక్సైజ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, అనంతగిరి ఎస్ఐ రామంజనేయులు, మేళ్లచెర్వు ఎస్ఐ ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. రూ.రెండు లక్షల నగదు స్వాధీనం మోతె(కోదాడ): హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం చెక్పోస్టు వద్ద పోలీ సులు, ఎన్నికల సిబ్బంది వాహనాల తనిఖీల్లో రూ. రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోతె మండల పరిధిలో ఖమ్మం– సూర్యాపేట రహదారిలో మామిళ్లగూడెం చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ టీం వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి సూర్యాపేటకు స్కూ టీపై వెళ్తున్న వసంతరావు స్కూటీని తనిఖీ చేయగా రెండు లక్షల ఇరువై వేల రూపాయల నగదును ఎస్ఎస్టీ టీం లీడర్ బాలునాయక్, సీఐ శివశంకర్,ఎస్ఐ గోవర్ధన్ స్వాధీనం చేసుకొని స్థానిక తహసీల్దార్ సరస్వతికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకన్న, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
హోరాహోరీగా హూజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం
-
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెన్షన్
సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున వకల్తా పుచ్చుకుని ప్రచారం చేసిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు సీఐ సైదానాయక్ పై సస్పెన్షన్ వేటుపడింది. అతను గద్వాల్ జోగులాంబ జిల్లా డీసీఆర్బీలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు అతను విధులకు హాజరుకాకుండా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. -
‘నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారు’
సాక్షి, హైదరాబాద్ : సీపీఐకి చిత్తశుద్ధి ఉంటే హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించుకొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై హరీశ్రావు, ఈటెల రాజేందర్ నోరు విప్పాలని, వారు నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారని మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రానికి కేంద్రం కావాల్సిన యూరియాను సరఫరా చేసిందని, స్పీకర్ పోచారం, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సొంత జిల్లాల్లో యారియా కొరతను సృష్టించారని ఆరోపించారు. యూరియా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిపాలన స్తంభించిదని, ఈఎస్ఐ స్కాం, విస్తరిస్తున్న వ్యాధులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభాకర్ విమర్శించారు. -
హుజూర్నగర్లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల సమరంలో ప్రచారం హోరెత్తుతోంది. దసరా రోజు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మండలాల్లో జోరుగా ప్రచారం చేశాయి. పోలింగ్కు ఇక పది రోజుల సమయమే ఉండడంతో ఆయా పార్టీ అగ్రనేతలను ప్రచారానికి దింపే షెడ్యూల్ ఖరారు చేసుకున్నాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే 18న సీఎం కేసీఆర్ హుజూర్నగర్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ నేతలు, బీజేపీ నుంచి ఆపార్టీ జాతీయ నేతలు ప్రచారానికి రానున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తెలంగాణ జనసమితి, టీఆర్ఎస్కు సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చాయి. అలాగే సీపీఎం అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించడంతో తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్కు ఆపార్టీ మద్దతు తెలిపింది. ఇక బీజేపీ, టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. మొత్తం 28 మంది పోటీలో ఉంటే 13 మంది పార్టీల అభ్యర్థులు కాగా 15 మంది ఇండిపెండెంట్లు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కొంత మంది ఇండిపెండెంట్లు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 21న పోలింగ్ కావడంతో ప్రచారం ఈ నెల 19న సాయంత్రంతో ముగియనుంది. ‘మేము అదిచేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ అభ్యర్థుల ప్రచా రం, కళా బృందాల సందడితో ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలు మార్మోగుతున్నాయి. మళ్లీ వస్తున్న గులాబీ బాస్లు.. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 4న హుజుర్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం భారీగా విజయవంతం అయిందని, గెలుపు తమదేనని టీఆర్ఎస్ కేడర్ ధీమాగా ఉంది. ఈనెల 11 నుంచి 13 వరకు మూ డు రోజులు నియోజకవర్గంలోని అన్ని మం డాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహిం చనున్నారు. 11న సాయంత్రం 4 గంటలకు పాలకవీడు మం డలం జాన్పహాడ్, 5 గంటలకు నేరేడుచర్ల మం డలం, పట్టణం, 12న సాయంత్రం 5 గంటలకు చింతలపాలెం, 6 గంటలకు మేళ్లచెరువు, 13న సాయంత్రం 4 గంటలకు మఠంపల్లి, 6 గంటలకు గరిడేపల్లి మండలాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో చివరిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ హుజూర్నగర్లో పెట్టేం దుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలు, కేసీఆర్ సభలతో పార్టీ కేడర్ జోష్తో ఎన్నికలకు సమాయత్తం కానుందని... నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం.. తమ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని దూకుడుగా చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ అభ్యర్థి పద్మావతి రోజుకు రెండు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచే ఇరువురు నేతలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దసరా పండుగకు ముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేరేడుచర్ల మండలం, బుధవారం గరిడేపల్లి మండలంలో మాజీ మంత్రి దామోదర్రెడ్డి ప్రచారం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. వీరితో పాటు ఏఐసీసీ నుంచి ముఖ్య నేతలు ఈ వారం రోజులు హుజూర్నగర్లోనే ఉండి ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఏఐసీసీ నేతలను ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెట్టనన్నట్లు సమాచారం. గత నెల 30న నామినేషన్ వేసిన సందర్భంగా హుజూర్నగర్లో పెట్టిన సభ సక్సెస్ అయిందని, మరో సభతో తమ సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీ..టీడీపీ.. ఇండిపెండెంట్లు సై.. ఈ ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారాన్ని కదంతొక్కిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. ప్రచారం ముగిసే లోపు బహిరంగ సభ పెడతామని, ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి రానునున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. అలాగే టీడీపీ అభ్యర్థి తరఫున పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్.రమణ ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, దేశగాని సాంబశివగౌడ్లు రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారం చేసుకుంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులను హడెలెత్తిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పా టు.. బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్లు నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారంలో మరింత దూకుడు పెంచారు.