-
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్కీపర్), ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
IPL 2024: హిట్టర్ పవర్ఫుల్ షాట్.. ఎంత పనైపాయే!
లియామ్ లివింగ్స్టోన్.. హిట్టింగ్కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు బాదడంలో దిట్ట. ఇంగ్లండ్ తరఫున ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 67 సిక్స్లు కొట్టాడు. ఐపీఎల్లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్కు ఆడుతున్న లివింగ్స్టోన్ తాజాగా మరో భారీ షాట్తో విరుచుకుపడ్డాడు. అతడి దెబ్బకు స్పైడర్క్యామ్ పగిలిపోయింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో 199 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్(70), జానీ బెయిర్ స్టో(42) శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరితో పాటు లివింగ్ స్టోన్(17 బంతుల్లో 28 నాటౌట్) తప్ప మిగతా వాళ్లు ఎవరూ రాణించకపోవడంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్లో లివింగ్స్టోన్ రెండు బౌండరీలు, రెండు సిక్స్లు బాదాడు. ఆఖరి ఓవర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో తొలి, మూడో బంతికి భారీ షాట్లతో అలరించాడు. అయితే, అతడి ఓవర్లోనే లివింగ్స్టోన్ డీప్ వికెట్ మీదుగా బాదిన బంతి స్టాండ్స్లో ల్యాండ్ అవుతుందనుకుంటే.. స్పైడర్క్యామ్ను పగులగొట్టింది. ఈ క్రమంలో దానిని అంపైర్ డెడ్ బాల్గా ప్రకటించాడు. Oh no, we lost the foota... ⚫#LSGvPBKS #IPLonJioCinema #TATAIPL #JioCinemaSport pic.twitter.com/hVa99qvIVO — JioCinema (@JioCinema) March 30, 2024 ఇక స్పైడర్క్యామ్ పగిలిన కారనంగా ఫుటేజ్ కొన్ని క్షణాల పాటు నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. ఊహించని పరిణామంతో కంగుతిన్న బౌండరీ గర్ల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా లక్ష్య ఛేదనలో ఆఖర్లో లివింగ్స్టోన్ మెరుపులు మెరిపించినా పంజాబ్ను మాత్రం గెలిపించలేకపోయాడు. కాగా లివింగ్స్టోన్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 65 సిక్సర్లు ఉండటం విశేషం. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్కు వార్నింగ్ ఇచ్చేశా! First Home Game 👌 First Season Win 👌@LucknowIPL's strong comeback with the ball helps them secure a win by 21 runs 🙌 Scorecard ▶️ https://t.co/HvctlP1bZb #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/YKofyh3Kt5 — IndianPremierLeague (@IPL) March 30, 2024 -
CWC 2023: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుంది..!
ప్రస్తుత ప్రపంచకప్లో వరుస పరాజయాలు (6 మ్యాచ్ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ల్లో కేవలం బంగ్లాదేశ్పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..?
భారత్-ఇంగ్లండ్ల మధ్య లక్నో వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న మ్యాచ్పై సోషల్మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మ్యాచ్ జరుగుతున్న వైనాన్ని పక్కన పెట్టి బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్కు వేదిక అయిన అటల్ బిహారీ స్టేడియం నిర్వహణ తీరు పంట పొలాల కంటే అధ్వానంగా ఉందంటూ దుయ్యబడుతున్నారు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా రోహిత్ శర్మ క్యాచ్ పడుతూ లివింగ్స్టోన్ గాయపడిన తీరును ట్రెండ్ చేస్తూ బీసీసీఐని ఎండగడుతున్నారు. ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కఠినమైన పిచ్పై అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆదిల్ రషీద్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ క్యాచ్ అందుకునే క్రమంలో లివింగ్స్టోన్ కిందపడి గాయపడ్డాడు. లివింగ్స్టోన్ ఆ రీతిలో గాయపడటానికి మైదానంలోని పచ్చిక కారణం కావడమే బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. లివింగ్స్టోన్ కిందపడ్డ సమయంలో మైదానంలోని ఆ ప్రాంత పరిస్థితి పంట పొలాలను తలపించడంతో మన క్రికెటర్లు అంతర్జాతీయ స్టేడియాల్లో ఆడుతున్నారా లేక పంట పొలాల్లో ఆడుతున్నారా..? అంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ధర్మశాల వేదికగా జరిగిన బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయని గుర్తు చేస్తున్నారు. ఆ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘన్ ఆటగాడు ముజీబ్ బౌండరీ ఆపే ప్రయత్నంలో మైదానంలోని పచ్చిక కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో ఆ గ్రౌండ్ నిర్వహణపై పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మశాల స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు పనికిరాదని బహిరంగ ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్స్టో (14), మలాన్ (16), రూట్ (0), స్టోక్స్ (0) ఔట్ కాగా.. బట్లర్ (5), మొయిన్ అలీ (4) క్రీజ్లో ఉన్నారు. బుమ్రా, షమీ తలో 2 వికెట్లు పడగొట్టారు. -
లివింగ్ స్టోన్ అద్భుత ఇన్నింగ్స్.. న్యూజిలాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 34 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను లైమ్ లివింగ్ స్టోన్(95 నాటౌట్), సామ్ కుర్రాన్(42) పరుగులతో అదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో పడగొట్టగా.. సౌథీ రెండు, హెన్రీ, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 147 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(57) మినహా మిగితా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, టోప్లీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ రెండు, అటిక్కిన్ సన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 13న లండన్ వేదికగా జరగనుంది. చదవండి: వాన వచ్చింది... ఆట ఆగింది -
ENG VS NZ 2nd ODI: లివింగ్స్టోన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్
4 మ్యాచ్లో వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లియామ్ లివింగ్స్టోన్ (78 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) సూపర్ ఇన్నింగ్స్తో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. లివింగ్స్టోన్కు బట్లర్ (30), మొయిన్ అలీ (33), సామ్ కర్రన్ (42) తోడ్పాటునందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సిరీస్లో లివింగ్స్టోన్ వరుసగా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్నప్పుడు (12.1 ఓవర్లలో 55/5) ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన లివింగ్స్టోన్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి రెండు బంతులు ఎదుర్కొనే అవకాశం లివింగ్స్టోన్కు వచ్చినప్పటికీ అతను 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో శతకానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్కు పంపి ఇంగ్లండ్ పతనాన్ని శాశించిన బౌల్ట్ మొత్తంగా ఈ మ్యాచ్లో 7 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డేవిడ్ విల్లే.. ఫిన్ అలెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విల్ యంగ్.. విల్లే వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి 3 బంతులను బౌండరీలుగా మలచి సత్తా చాటాడు. యంగ్ (17), కాన్వే (1) క్రీజ్లో ఉన్నారు. -
చెలరేగిన లివింగ్స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్లో భాగంగా డెర్బీషైర్తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్కు మరో ఎండ్లో లియామ్ లవింగ్స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి!
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్ స్టోన్ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో లివింగ్స్టోన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన లివింగ్స్టోన్ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్తో మ్యాచ్లో లివింగ్స్టోన్ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతి ఫుల్లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే లివింగ్స్టోన్ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్బౌల్డ్ అయ్యానన్న బాధ లివింగ్స్టోన్ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. Navdeep Saini doesn't miss 🎯#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/QosEBqIkrB — JioCinema (@JioCinema) May 19, 2023 Liam Livingstone cleaned up by Navdeep Saini! 😱#PBKSvsRR #IPL2023 #Cricket pic.twitter.com/jkNg3u1zGg — OneCricket (@OneCricketApp) May 19, 2023 చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది -
'యాంకర్ రోల్ నచ్చదు.. బంతిని బాదడమే ఇష్టం'
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ పయనం పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన పంజాబ్ ఐదు విజయాలు, ఆరు ఓటములతో పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్లాడిన లివింగ్స్టోన్ 172 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 437 పరుగులతో రాణించాడు. గతేడాది ఫామ్ను ఈసారి కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. తాజాగా ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివింగ్స్టోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు మద్దతు అందించే పాత్ర కన్నా బాదడమే ఎక్కువగా ఇష్టమని పేర్కొన్నాడు. లివింగ్స్టోన్ మాట్లాడుతూ.. ''ఒక బ్యాటర్ ఎలా ఆడాలనేది జట్టును బట్టి ఉంటుంది. మద్దతు అందించే పాత్రను పోషించడం నాకిష్టం ఉండదు. ప్రతి జట్టులో భిన్నమైన ఆటగాళ్లు.. వాళ్లకు భిన్నమైన పాత్రలు ఉంటాయి. నావరకైతే క్రికెట్ను ఆస్వాదిస్తా. భారీ షాట్లను కొట్టడాన్ని ఇష్టపడతా. పంజాబ్ తరపున విజయాల్లో నావంతు పాత్రను సమర్థంగా పోషించడంపైనే దృష్టి సారించా ''అని లివింగ్స్టోన్ తెలిపాడు. చదవండి: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..! -
'అమ్మ జడ్డూ.. ఒకేసారి రెండు వికెట్లు తీసిన మొనగాడు!'
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్, సీఎస్కే మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో గత మ్యాచ్ హీరో అథర్వ తైదేను జడేజా తెలివిగా బుట్టులో వేసుకున్నాడు. షార్ట్లెంగ్త్ బంతులు ఆడడం అథర్వ బలహీనత అని తెలుసుకున్న జడేజా అదే బంతి వేశాడు. దీంతో అథర్వ షాట్ ఆడే ప్రయత్నంలో కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఇంతవరకు బాగానే ఉంది. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న లివింగ్స్టోన్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన జడ్డూ అప్పటికే క్యాచ్గా తీసుకున్న బంతిని డ్రాప్ చేసినట్లుగా చేసి ఆ తర్వాత బంతిని తీసుకొని వికెట్లను ఎగురగొట్టాడు. అయితే ఇదంతా ఫన్నీవేలోనే కావడం విశేషం. జడ్డూ చర్యతో లివింగ్స్టోన్ సహా సీఎస్కే ఆటగాళ్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. '' అమ్మ జడ్డూ స్రైకింగ్, నాన్స్ట్రైకింగ్ ఎండ్ వికెట్లు ఒకేసారి తీద్దామనుకున్నావా.. జడ్డూ తెలివి మాములుగా లేదు.. ఒకటేసారి రెండు వికెట్లు తీయాలనుకున్నాడు..'' అంటూ కామెంట్ చేశారు. 2 wickets in 1 ball? Just Ravindra Jadeja things 😅#CSKvPBKS #IPL2023 #TATAIPL #IPLonJioCinema | @imjadeja @ChennaiIPL pic.twitter.com/sW0IJcUuOy— JioCinema (@JioCinema) April 30, 2023 Only Jadeja can dismiss both striker and Non striker 😎💛#CSKvPBKS #WhistlePodu #CSK — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) April 30, 2023 చదవండి: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు? -
అంత మంచి క్యాచ్ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్
మొహాలీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి చవిచూసింది. తొలుత చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్లో లివింగ్స్టోన్ చేసిన తప్పిదం పంజాబ్ కింగ్స్ కొంపముంచింది. ఏం జరిగిందంటే? లక్నో ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన రాహుల్ చాహర్ బౌలింగ్లో రెండో బంతికి స్టోయినిష్ భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న లివింగ్స్టోన్ చేతిలోకి బంతి వెళ్లింది. అయితే లివింగ్స్టోన్ క్యాచ్ అందుకున్నప్పటికీ.. బౌండరీ రోప్ను మాత్రం టచ్ చేశాడు. దీంతో అంపైర్ సిక్స్గా ప్రకటించాడు. ఇక 40 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోయినిష్ అనంతరం చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఒక వేళ స్టోయినిష్ క్యాచ్ను లివింగ్ స్టోన్ సరిగ్గా అందుకుని ఉండింటే లక్నో అంత భారీ స్కోర్ సాధించకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు తీవ్ర గాయం pic.twitter.com/zHZcgOt7x7 — IPLT20 Fan (@FanIplt20) April 28, 2023 -
Badoni-Livingstone: రెచ్చగొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు, ఆతర్వాత..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. లక్నో బ్యాటింగ్ సమయంలో ఆయూష్ బదోని, పంజాబ్ బౌలర్ లియామ్ లవింగ్స్టోన్ మధ్య చిన్నపాటి డ్రామా నడిచింది. ఇద్దరూ ఎత్తుకుపై ఎత్తులు వేశారు. అయితే అంతిమంగా లివింగ్స్టోనే విజయం సాధించాడు. Badoni vs Livingstone #PBKSvLSG pic.twitter.com/nwFtXgaXgy — Aakash Chopra (@Aakash_Vani_1) April 28, 2023 ఇంతకీ ఏం జరిగిందంటే.. లక్నో ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతి పడేందుకు అంతా సిద్ధంగా ఉంది. అయితే బ్యాటర్ బదోని రివర్స్ స్వీప్ ఆడతాడన్న విషయాన్ని ముందే పసిగట్టిన బౌలర్ లివింగ్స్టోన్ ఆఖరి క్షణంలో బంతి వేయకుండా ఆగిపోయాడు. దీంతో చిర్రెత్తిపోయిన బదోని.. ఆ తర్వాతి బంతికి లివింగ్స్టోన్కు టిట్ ఫర్ టాట్ చేసి చూపించాడు. అచ్చం లివింగ్స్టోన్ చేసిన లాగానే, ఆఖరి క్షణంలో బంతిని ఎదుర్కోకుండా పక్కకు తప్పుకున్నాడు. ICYMI - Six and a Wicket! Liam Livingstone with the last laugh as Ayush Badoni gets caught in the deep after scoring 43 runs. Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/gxUTK8vGDC — IndianPremierLeague (@IPL) April 28, 2023 ఈ డ్రామా ఇంతటితో అయిపోలేదు. ఎట్టకేలకు 14వ ఓవర్ రెండో బంతి పడింది. అప్పటికే లివింగ్స్టోన్పై కసితో రగిలిపోతున్న బదోని, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. సిక్సర్ కొట్టాక లివింగ్స్టోన్ ఊరికే ఉంటాడా.. మరోసారి అదే తరహా బంతి వేసి బదోనిని బోల్తా కొట్టాంచాడు. లివింగ్స్టోన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న బదోని.. అదే బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఉన్న రాహుల్ చాహర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లివింగ్స్టోన్.. బదోనిపై పైచేయి సాధించినట్లైంది. డ్రామా మొదలెట్టిన లివింగ్స్టోనే చివరికి విజయం సాధించాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో పంజాబ్పై లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడగా.. పంజాబ్ తరఫున అథర్వ టైడే (66), సికందర్ రజా (36), లివింగ్స్టోన్ (23), కర్రన్ (21), జితేశ్ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్ 2, స్టోయినిస్ ఓ వికెట్ సాధించారు. -
విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్..
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్లోనే లివింగ్స్టోన్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లివింగ్స్టోన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓ అద్భుత బంతికి వికెట్ల ముందు లివింగ్స్టోన్ దొరికిపోయాడు. అదే విధంగా బౌలింగ్ విషయానికి వస్తే.. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన లివింగ్స్టోన్ వికెట్ ఏమీ తీయకుండా 9 పరుగులిచ్చాడు. ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ జట్టుతో చేరి దాదాపు 10 రోజులు అవుతున్న అతడు పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో పంజాబ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. ఎట్టకేలకు ఫిట్నెస్ సాధించడంతో అద్భుత ఫామ్లో ఉన్న సికిందర్ రజాను పక్కన పెట్టి మరి లివింగ్స్టోన్కు పంజాబ్ మేనెజ్మెంట్ అవకాశం ఇచ్చింది. పంజాబ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని లివింగ్స్టోన్ నిలబెట్టుకో లేకపోయాడు. ఇక పంజాబ్ చివరి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన సికిందర్ రజా స్ధానంలో లివింగ్స్టోన్ను తీసుకురావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. రజా లాంటి అద్భుత ఆల్రౌండర్ జట్టులో ఉండి ఉంటే.. ఆర్సీబీపై పంజాబ్ కచ్చితంగా విజయం సాధించి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్కు కూడా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యాడు. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ ఎట్టకేలకు ఢిల్లీకి దక్కిన విజయం.. ఆరో మ్యాచ్లో అతికష్టమ్మీద -
పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్లో గెలిచిందనే కాని, ఓవరాల్గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్లలో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్స్టోన్ తుది జట్టులోకి రావచ్చు. తుది జట్లు (అంచనా).. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్కుమార్ వైశాఖ్, సిరాజ్ -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ రాకతో పంజాబ్లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్స్టోన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్తో మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్స్టోన్ను వన్డౌన్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్దీప్ సింగ్తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్రైజర్స్ చేతిలో పంజాబ్కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్కు సైతం గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా
IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్ కింగ్స్కు శుభవార్త. పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్స్టోన్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్ కింగ్స్’’ అని సోమవారం ట్వీట్ చేశాడు. కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్ కింగ్స్ లివింగ్స్టోన్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ (PC: IPL) ఇంజక్షన్లు తీసుకున్నా ఈ క్రమంలో కోలుకున్న లివింగ్స్టోన్ లంకాషైర్ క్రికెట్ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ‘‘గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా’’ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మరోసారి అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా లివింగ్స్టోన్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే. పవర్ హిట్టర్ వచ్చేస్తున్నాడు.. ఇక 29 ఏళ్ల లివింగ్స్టోన్ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్తో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్లో లివింగ్స్టోన్ ఆడే అవకాశం ఉంది. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు! It’s been a long couple months but it’s time to get back to work… see you soon @PunjabKingsIPL 🙏❤️ — Liam Livingstone (@liaml4893) April 9, 2023 -
పంజాబ్కు గుడ్న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్లో చికిత్స పొందుతున్న లివింగ్స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్బజ్తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్రైజర్స్తో మ్యాచ్లో తలపడనుంది. హైదరాబాద్కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్లో రాజస్తాన్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్స్టోన్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్ వచ్చాయి. గుడ్న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
ముంబై జట్టుకు స్టార్ ఆటగాడు దూరం.. విధ్వంసకర ఆల్రౌండర్ ఎంట్రీ!
ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో లివింగ్స్టోన్ను ఏంఐ కేప్టౌన్ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఆఖరిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో లివింగ్స్టోన్ చేతివేలికి గాయమైంది. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లివింగ్స్టోన్ స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ టిమ్ డేవిడ్తో ఏంఐ కేప్టౌన్ భర్తీ చేసింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ఏంఐ కేప్టౌన్ ఓ వీడియోను షేర్ చేసింది. "టిమ్ డేవిడ్ ఇప్పుడు ఏంఐ కేప్టౌన్ ఫ్యామిలీలో చేరాడు అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. కాగా డేవిడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బిగ్బాష్ లీగ్-(2022-23)లో హోబార్ట్ హారికేన్స్ తరపున డేవిడ్ అదరగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 8.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన డేవిడ్ 186 పరుగులు సాధించాడు. చదవండి: Murali Vijay: క్రికెట్కు గుడ్బై చెప్పిన మురళీ విజయ్.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే Tim in blue-and-gold in Cape Town - here we go! 😉💙#MICapeTown #OneFamily @timdavid8 pic.twitter.com/pizLgh2hiu — MI Cape Town (@MICapeTown) January 30, 2023 -
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్కు భారీ షాక్..
పాకిస్తాన్ పర్యటలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న పాకిస్తాన్తో తొలి టెస్టులో లివింగ్స్టోన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా లివింగ్స్టోన్ మోకాలికి గాయమైంది. ఈ క్రమంలోనే లివింగ్స్టోన్ దూరం కానున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ కూడా దృవీకరించింది. "లివింగ్ స్టోన్ మోకాలి గాయం కారణంగా మిగిలిన టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. కాగా అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసిన లివింగ్స్టోన్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఏడు పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక పాకిస్తాన్-ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ అఖరి రోజు ఆటకు చేరుకుంది. ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. పాకిస్తాన్ గెలుపొందాలంటే మరో 174 పరుగులు సాధించాలి. ఐదో రోజు లంచ్ విరామం సమయానికి పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. Get well soon, liaml4893. The all-rounder has been ruled out of the rest of our Test series in Pakistan. 🇵🇰 #PAKvENG 🏴 — England Cricket (@englandcricket) December 5, 2022 చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! -
17 ఏళ్ల తర్వాత పాక్తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన!
రావల్పిండి వేదికగా గురువారం పాకిస్తాన్తో తొలి టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. 17 ఏళ్ల తర్వాత తొలి సారి పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే తొలి టెస్టులో పాల్గోనే తమ తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఇక విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్తో తొలి టెస్టుకు లివింగ్స్టోన్కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు దక్కింది. అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. మరోవైపు గత కొన్నేళ్లగా ఇంగ్లండ్ టెస్టు జట్టుకు దూరంగా ఉన్న బెన్ డకెట్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు జాక్ క్రాలీతో కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. ఇక పాక్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్. -
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇదేనేమో.. బట్లర్, లివింగ్స్టోన్ కళ్లు చెదిరే క్యాచ్లు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానాడు క్రికెట్ సర్కిల్స్లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రుజువు చేసింది. టీ20 వరల్డ్కప్ గ్రూప్-1 సూపర్-12 మ్యాచ్ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్లు అందుకుని మ్యాచ్ను గెలిపించారు. క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్లు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ముందుగా లివింగ్స్టోన్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఆఫ్ఘన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కొట్టిన భారీ షాట్ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద లివింగ్స్టోన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్స్టోన్ ముందుకు పరిగెడుతూ సూపర్మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక జోస్ బట్లర్ పట్టిన క్యాచ్ విషయానికొస్తే.. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్లో ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ లెగ్ గ్లాన్స్ షాట్ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ బట్లర్ను క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షిలా తన లెఫ్ట్ సైడ్కు డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తప్పక క్యాచ్ ఆఫ్ టోర్నమెంట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్స్టోన్, బట్లర్ పట్టిన క్యాచ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) ఇవే కాక.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్లో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్ అనుకుంటే మరో రెండు క్యాచ్లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-1లో ఇవాళ జరిగిన మ్యాచ్ల్లో న్యూజిలాండ్.. ఆసీస్పై, ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: ఇంగ్లండ్ బ్యాటర్ల వీరవిహారం.. పాక్పై సునాయాస విజయం
టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లు సైతం రంజుగా సాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా (భారత్ విజేత).. ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. పాక్ నిర్ధేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ బ్యాటర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు పవర్ హిట్టింగ్ మజాను అందించారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటైనా, ఆతర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లియామ్ లివింగ్స్టోన్ (16 బంతుల్లో 28; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టయిల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని (163/4) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) పాక్కు ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్ తలో వికెట్ సాధించారు. -
జాసన్ రాయ్కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 2022-23 సీజన్కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్, బెన్ ఫోక్స్ తొలి సారి సెంట్రల్ కాంట్రాక్ట్(ఫుల్టైమ్)ను పొందారు. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ తొలిసారి తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్ చేయడం గమనార్హం. ఇక ఈ సీజన్కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్ టైమ్కాంట్రాక్ట్ , ఆరుగురికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్, మరో ఆరుగురుకి పేస్ బౌలింగ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించింది. కాగా జాసన్ రాయ్తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్ కూడా తమ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయారు. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్: మొయిన్ అలీ (వార్విక్షైర్), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్స్టో (యార్క్షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్హామ్షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్సెట్) లియామ్ లివింగ్స్టోన్ (లంకాషైర్) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) మార్క్ వుడ్ (డర్హామ్). ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు హ్యారీ బ్రూక్ (యార్క్షైర్), డేవిడ్ మలన్ (యార్క్షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్షైర్ 1 నవంబర్ 22 నుండి). ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్హామ్షైర్) చదవండి: T20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్ -
చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్స్టోన్
హండ్రెడ్ లీగ్ 2022లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. సోమవారం ట్రెంట్ రాకెట్స్తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బర్మింగ్హామ్ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మొయిన్ అలీ ఆల్రౌండ్ షోతో (1/3; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో బర్మింగ్హామ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. బర్మింగ్హామ్ కోల్పోయిన 3 వికెట్లు లూక్ వుడ్ ఖాతాలో చేరాయి. అంతకుముందు డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రెగరీ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో ట్రెంట్ రాకెట్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆ జట్టులోని భారీ హిట్టర్లు అలెక్స్ హేల్స్ (1), డేవిడ్ మలాన్ (9), మన్రో (11) దారుణంగా నిరాశపరిచారు. బర్మింగ్హామ్ బౌలర్ హోవెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బర్మింగ్హామ్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. ప్రస్తుత ఎడిషన్లో తొలి ఓటమి చవిచూసిన ట్రెంట్ రాకెట్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. 4 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన లండన్ స్పిరిట్ ఈ జాబితాలో టాప్ ప్లేస్లో ఉండగా.. ఓవల్ ఇన్విన్సిబుల్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఆతర్వాతి స్థానంలో నిలిచింది. నార్త్రన్ సూపర్ చార్జర్స్ (4 మ్యాచ్ల్లో ఒక్క విజయం), సథరన్ బ్రేవ్ (4 మ్యాచ్ల్లో ఒక్క విజయం), మాంచెస్టర్ ఒరిజినల్స్ (3 మ్యాచ్ల్లో 3 పరాజయాలు), వెల్ష్ ఫైర్ (3 మ్యాచ్ల్లో 3 పరాజయాలు) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
షుగర్ వచ్చిందా? పరగడుపున మెంతి నీళ్లు ట్రై చేశారా?
మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..
అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
‘మిరల్’ మూవీ రివ్యూ
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తప్పక చదవండి
- ట్విటర్ రీ బ్రాండింగ్పై మస్క్ ట్వీట్
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement