manager
-
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్లు రిసెప్షనిస్ట్ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్ను ఆస్పత్రిలో చేర్పించారు. -
గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలను వినియోగదారులందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలకపాత్ర పోషిస్తారని గూగుల్ సోమవారం ప్రకటించింది. ‘జీ–టెక్ కస్టమర్ ఎక్స్పీరియెన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాపాల వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారు. ‘ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబద్ధతను పెంచుతుంది’ అని తెలిపింది. గూగుల్కు ముందు ఆమె నాట్వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్లలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. -
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్గౌడ్ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్మెంట్కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్గౌడ్ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్గౌడ్కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
Nizamabad: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్?
ఖలీల్వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక పోలీసు బృందం హైదరాబాద్లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్హౌస్లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్వుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్కు చెందిన బెంగళూరు ఫామ్హౌస్ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
ఎస్బీఐలో రూ.4.50 కోట్లు కాజేసిన మేనేజర్
సూర్యాపేట: తను పనిచేస్తున్న ఎన్బీఐ బ్యాంకులోని సొమ్మునే ఓ మేనేజర్ కాజేశారు. 2022 నుంచి 2023 వరకు 24 మంది ఉద్యోగుల పేరుతో రుణాలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ సైదులు సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బ్యాంక్ రుణం తీసుకునేందుకు అర్హత కలిగిన వారిని ఎంచుకొని కుంభకోణానికి శ్రీకారం చుట్టాడు. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉన్నా, సాంకేతిక కారణాలు చూపి, అవసరమైన అదనపు పత్రాలు లేవంటూ రుణ దరఖాస్తును మొదటగా తిరస్కరించేవాడు. ఆపై అదే దరఖాస్తు ఆధారంగా, దరఖాస్తుదారుడి పేరు, వివరాలతో నకిలీ పత్రాలు సృష్టించి, వారి పేర్లతో మరోసారి రుణం కోసం దరఖాస్తు చేసేవాడు. దీనికి రుణం మంజూరు చేసినట్టు బ్యాంకు రికార్డుల్లో పొందుపర్చేవాడు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడి పేరుతో కనిష్టంగా రూ.15 లక్షలు కాజేశాడు. ఈ మొత్తాన్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. ఉద్యోగుల పేరుతో రుణం తీసుకొని తన ఖాతాల్లోకి మళ్లించుకున్న సైదులు గత సంవత్సరం హైదరాబాద్లోని సీసీసీ (కమర్షియల్ క్లయింట్గ్రూప్) మేనేజర్గా బదిలీ అయ్యాడు. అయితే తాను తీసుకున్న ఈ రుణాలకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించేవాడు. 2024 ఫిబ్రవరి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇతను రామంతాపూర్ ఎస్బీఐ మేనేజర్తో కలిసి ఇదే తరహా మోసం చేసి రూ. 2.84 కోట్లు, సికింద్రాబాద్లో వెస్ట్ మారేడ్పల్లి బ్రాంచ్ నుంచి రూ. 9.50 కోట్లు కాజేసినట్టు సమాచారం. కొందరు ఉద్యోగులకు తెలిసే చేశారా ? పోలీస్శాఖలో 11 మంది ఉద్యోగులు, వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్లో ఇద్దరు, కలెక్టరేట్లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఇలా మొత్తం 24 మంది ఉద్యోగుల పేరుతో బ్యాంక్ మేనేజర్ రుణం తీసుకున్నాడు. అయితే తమ పేరున రుణాలు తీసుకున్నట్టు కొందరు ఉద్యోగులకు ముందుగానే తెలిసినట్టు సమాచారం. మేనేజర్తో ఉద్యోగులు పర్సెంటేజీ మాట్లాడుకొని రుణం తీసుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది ఉద్యోగులు మేనేజర్ మాయమాటలకు మోసపోయినట్టు సమాచారం. -
ఎన్ఆర్ఐ మహిళకు రూ.16 కోట్లు టోకరా ఇచ్చిన బ్యాంకు మేనేజర్
ఐసీఐసీఐ బ్యాంకు అధికారి బారిన పడి ఎన్ఆర్ఐ మహిళ పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా మేనేజర్ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలను కొట్టేశాడు. మరొక బ్యాంక్ ఉద్యోగి తన డబ్బులపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడంతో, తన సొమ్ముకోసం ఆరా తీసిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది. బీబీసీ కథనంప్రకారం ఎన్ఆర్ఐ శ్వేతా శర్మ 2016లో భారత్కు తిరిగి వచ్చింది. అమెరికాలో డిపాజిట్లపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇండియాలో సొమ్మును డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంది. పాత గురుగ్రామ్లోని బ్యాంకు బ్రాంచ్ని సందర్శించిన తర్వాత బ్యాంక్ అధికారి సలహా మేరకు శ్వేతా శర్మ 2019లో ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన NRE ఖాతాను తెరిచింది. 5.5-6 శాతం వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది 2019,సెప్టెంబర్-2023 డిసెంబర్ 2023 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో తమ సేవింగ్స్ దాదాపు రూ13.5 కోట్లను డిపాజిట్ చేసింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని శ్వేతా చెబుతున్నారు. స్నేహితురాలి ద్వారా తనకు పరిచయమైన బ్యాంకు అధికారి మోసపూరితంగా తనకు ఫేక్ స్టేట్మెంట్లు ఇచ్చాడని పేర్కొంది. ఫేక్ ఈమెయిల్ ఐడీని సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో తనమొబైల్ నంబర్ను మార్చేసి, మెసానికి పాల్పడ్డాడని వాపోయింది. భారత్లో ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టమని మోసపూరితంగానే ఒప్పించాడని, నకిలీ ఖాతాలు సృష్టించి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, డెబిట్ కార్డులు, చెక్ బుక్లను తన (బ్యాంకు అధికారి) పేరు మీద తీసుకున్నాడని ఆరోపించింది. అందుకే బ్యాంకు నుంచి తనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ఒకదానిపై రూ.2.5 కోట్ల ఓవర్డ్రాఫ్ట్ తీసుకున్నాడని తన దృష్టికి వచ్చిందని కూడా వెల్లడించింది. బ్యాంక్ ప్రతినిధి కూడా మోసాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంకు గత మూడేళ్లు బాధితురాలి ఖాతాలో జరిగిన ఈ లావాదేవీలు బ్యాలెన్స్ల గురించి కస్టమర్ తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది.ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేసేటప్పుడు అయినా ఆమె ఈ వ్యత్యాసాన్ని గమనించి ఉండాల్సిందని పేర్కొంది. అయినా దర్యాప్తు ఫలితాలను బట్టి, తాత్కాలికంగా ఆమె ఖాతాలో రూ.9.27 కోట్లు జమ చేశామని బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు హామీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు చేసి ఆరు వారాలకు పైగా గడిచిపోవడం గమనార్హం. -
అతను మా కుమారుడి లాంటి వ్యక్తి.. జగపతిబాబు పోస్ట్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. విభిన్నమైన పాత్రలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులనతో టచ్లో ఉంటారు. తాజాగా తన మేనేజర్ బర్త్ డే సందర్భంగా ఇన్స్టాలో ఫోటోను షేర్ చేశారు. జగపతిబాబు తన ఇన్స్టాలో రాస్తూ..' మా మేనేజర్ మహేష్. మా కొడుకు లాంటి వ్యక్తి పుట్టిన రోజు సందర్బంగా ఎప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే.. మా ఫ్యామిలీ మెంబర్స్తో మా ఇంట్లో భోజనాల పండగ…. నాకు ఒక్కడికే రోజంత మజ్జిగా... పాపం నేను.' అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్ల మేజేజర్ల హవా మాములుగా ఉండదు. నిర్మాతకు హీరో,హీరోయిన్లకు మధ్య వారధిలా వాళ్లు పని చేస్తుంటారు. నిర్మాతకు డేట్స్ కావాలంటే.. సదరు హీరో, హీరోయిన్ల మేనేజర్లను సంప్రదించాల్సిందే. రెమ్యునరేషన్ మొదలు.. డేట్స్ వరకు ప్రతీది మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా.. మేనేజర్లు చెప్పేదే విని ఓకే చెబుతారు. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన మేనేజర్ని ఇంటి మనిషిలా భావించి, అన్నీ అతని చెప్పినట్లుగానే చేసేది. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి.. సామ్ని ఆర్థిక మోసం చేశాడనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకు తెలియకుండా రూ. కోటిని కాజేసేందుకు ప్రయత్నించాడట. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోయిందట. తొలుగ నమ్మకపోయినా.. ముఖ్యమైన వ్యక్తి చెప్పడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం. త్వరలోనే మరో కొత్తవ్యక్తిని తన మేనేజర్గా నియమించుకునే పనిలో ఉన్నారట. అసలు విషయం ఇదేనా? మయో సైటిస్ బారిన పడడంతో సామ్ ఒప్పుకున్న ఓ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలకు తన వల్ల నష్టం జరిగిందని, తన రెమ్యునరేషన్ తగ్గించాలని సామ్ భావించారట. ఈ విషయాన్ని తన మేనేజర్తో చెప్పి, రూ. కోటి వరకు తగ్గించి తీసుకోమని చెప్పిందట. అయితే మేనేజర్ మాత్రం నిర్మాతల దగ్గర ఆ కోటి కూడా తీసుకోవాలనుకున్నాడట. సదరు నిర్మాతల దగ్గరకు వెళ్లి బ్యాలెన్స్ గా ఉన్న రూ. కోటిని క్యాష్ రూపంలో ఇవ్వమని అడిగారట. అంత డబ్బు క్యాష్గా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. తన స్నేహితుడి అకౌంట్కి పంపమని చెప్పాడట. వారికి అనుమానం కలగడంతో ఈ విషయాన్ని సామ్ దగ్గర వరకు తీసుకెళ్లారు. ఇలా మేనేజర్ అసలు రూపం బయటపడింది. ఇక సినిమా విషయాలకొస్తే.. సమంత- విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో వరుణ్ ధావణ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీమింగ్ కానుంది. -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్ప్రీత్ గిల్ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్ప్రీత్ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్తో కలిసి సుభాష్ విహార్లోని ఇరుకైన సందులో బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్తో పాటు సర్వర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
భారత క్రికెట్లో విషాదం.. సునీల్ దేవ్ కన్ను మూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్గా పనిచేసిన సునీల్ దేవ్(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్గా కూడా తన సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచారు! ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా? -
చంద్రయాన్–3లో ఖమ్మం వాసి!
ఖమ్మంఅర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగంలో కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ ప్రయోగంలో ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త ఆపరేషన్ మేనేజర్గా వ్యవహరించారు. ఖమ్మం శ్రీనగర్కాలనీకి చెందిన రిటైర్డ్ పీఆర్ డీఈ వల్లూరి కోటేశ్వరరావు కుమారుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013లో ఇస్రో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ స్థాయిల్లో పదేళ్ల నుంచి ప్రయోగాల్లో పాలు పంచుకుంటున్న ఆయనకు చంద్రయాన్–3లో ఆపరేషన్ మేనేజర్గా అవకాశం దక్కింది. బెంగళూరు కేంద్రంగా ఇస్రోలో ఆపరేషన్ డిజైనింగ్ విభాగంలో 1,500 మందికి పైగా పనిచేస్తుండగా... ఆపరేషన్ మేనేజర్లుగా 30మందిని ఎంపిక చేశారు. ఇందులో ఉమామహేశ్వరరావు కూడా ఉండడం విశేషం. ఈసందర్భంగా ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశ సాంకేతిక రంగంలో కీలకమైన ప్రయోగంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
మేనేజర్తో విబేధాలు.. స్పందించిన రష్మిక
టాలీవుడ్లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్లో ఫుల్ క్రేజ్. అయితే తన మేనేజర్ చేతిలో సుమారు రూ.80 లక్షల వరకు మోసపోయిందని, దీంతో అతన్ని తొలగించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక ఈ విషయంపై తొలిసారి స్పందించింది. తాము విడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం నిజమేనని తెలిపింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) కానీ ఈ నిర్ణయం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. తామిద్దరూ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామని చెప్పుకొచ్చింది. పరస్పర ఒప్పందంతో విడిగా తమ కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రొఫెషనల్గా వ్యవహరించే పనిలో ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి ఇంతవరకు వర్క్ చేశామని పేర్కొంది. ఇప్పుడు కూడా అంతే హుందాగా తామిద్దరం విడిగా పనిచేయాలని అనుకుంటున్నట్లు రష్మికతో పాటు ఆమె మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
రష్మికను మోసం చేసిన మేనేజర్!
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్లో రష్మిక మందన చోటు సంపాదించుకుంది . ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఫిదా చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకుంది. తాజాగా మీడియా కథనాల ప్రకారం రష్మిక గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: శ్రీజతో విడాకులు.. కల్యాణ్ దేవ్ కన్ఫర్మ్ చేసినట్లేనా?) తన వద్ద చాలా రోజులుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ మోసం చేశాడని తెలుస్తోంది. ఆమె నుంచి దాదాపు రూ. 80 లక్షలు దొంగలించాడని సమాచారం. దీంతో రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వ్యవహారంపై ఆమె మౌనంగానే ఉంది. మరోవైపు రష్మిక ఈ ఏడాది ‘పుష్ప2’ తో పాటు, రణ్బీర్కపూర్, సందీప్ వంగా కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ చిత్రంలోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
బంఫర్ ఆఫర్ అంటే ఇదే! జాబ్ నుంచి తీసేసినందుకు రూ.210 కోట్లు వచ్చాయ్
వాషింగ్టన్: జాతివివక్ష నెపంతో తనను జాబ్ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్బక్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ సంస్థను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్స్ అనే మహిళ పని చేస్తున్న దుకాణంలో ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటి తర్వాత వారిలో ఒకరు దుకాణంలోని వాష్రూంని వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్లో ఏమి కొనుగోలు చేయన కారణంగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. అయితే తాము వ్యాపారం పని మీద ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని వాళ్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్ సిబ్బంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా.. అందుకు వారిద్దరూ నిరాకరించారు. చివరికి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం.. అది కాస్త వైరల్ కావడంతో తీవ్ర నిరసనకు దారితీసింది. ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రీజినల్ మేనేజర్ షానన్ ఫిలిప్స్ను ఉద్యోగం నుంచి తొలగించి.. దుకాణ మేనేజర్ను మాత్రం విధుల్లోనే ఉంచింది. రీజినల్ మేనేజర్ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి శిక్షించారంటూ ఆమె 2019లో స్టార్బక్స్పై దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్ జ్యూరీ.. స్టార్బక్స్ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది. చదవండి: ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం! -
ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!
వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురీకి మేనేజర్గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తేలింది. సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్మన్ స్కాట్లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్రినా మసాచుసెట్స్లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్బీఐ.. సెడ్రిక్ లాడ్జ్ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్పై వేటు కూడా వేసింది. చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి! -
Hyderabad: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఓయో హోటల్లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ కుషమ్కాష్ గ్రామానికి చెందిన అనుర«ద్సింగ్, సచిన్సింగ్(30) ఇద్దరూ నాచారం మల్లాపూర్లో ఉంటూ ఓయో హోటల్లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్లోని సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు. 16వ తేదీ రాత్రి తన రూమ్లోకి వెళ్లిన సచిన్సింగ్ తలుపు తీయలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి
అన్నానగర్(చెన్నై): నకిలీ పత్రాలతో బ్యాంకులో రూ.1.28 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన ప్రైవేట్ కంపెనీ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి రుణం ఇస్తున్నారు. 2019–20 వరకు కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్గా ఉన్న మార్టిన్ సాకో, విజయకుమార్ కంపెనీలో పని చేస్తున్నట్లు 44 మందికి నకిలీ పత్రాలు సిద్ధం చేసి రూ.1.28 కోట్ల రుణం పొందారు. బ్యాంకు ఆడిట్లో నకిలీ పత్రాలతో రుణం తీసుకున్నట్టు తేలింది. దీంతో మండల మేనేజర్ సెంథిల్కుమార్ కొబయాషి మునిసిపల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ దండపాణి, జయప్రకాష్ నారాయణన్, అసిస్టెంట్ మేనేజర్ రాధిక, ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్గా పని చేసిన మార్టిన్ సాకో, విజయకుమార్పై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్ తదితరులను అరెస్టు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను ఊటీలో ఉన్నట్లు సమాచారం అందగా అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
గౌరీ ఖాన్ పనికి షారూఖ్ మేనేజర్ పూజా ఫిదా! ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..!
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు? షారుఖ్ ఖాన్ మేనేజర్గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) బాలీవుడ్ టాప్ హీరో షారూక్కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది. -
కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు. -
సినీ నటి జీవిత టార్గెట్గా.. జియో పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: సినీ నటి జీవితను టార్గెట్గా చేసుకుని, ఆమె మేనేజర్ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ విషయం చెప్తున్నానన్నాడు. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్లైన్లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య) నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గానూ పని చేశాడు. -
అప్పులు ఇవ్వడమే అతడికి శాపమైందా? అందమైన కుటుంబం చివరికి ఇలా?
తూర్పు గోదావరి: కొంతమంది రూ.లక్షల్లో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో అదికాస్తా బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుని ఉరితాడయ్యింది.. హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య, ఇద్దరు కుమార్తెల భవితవ్యం అగమ్యగోచరమయ్యింది. యానాం పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన విస్పాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) గతంలో మచిలీపట్టణంలో యూకో బ్యాంకు మేనేజర్గా పనిచేశారు. రొయ్యల చెరువుల సేద్యానికి అక్కడ కొంతమందికి లక్షలాది రూపాయలు రుణాలు ఇచ్చారు. తీసుకున్న రుణాలను సంబంధిత వ్యక్తులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మేనేజర్ శ్రీకాంత్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమేర రుణాలను శ్రీకాంత్ వ్యక్తిగతంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం శ్రీకాంత్ యానాం శాఖకు బదిలీ అయ్యారు. స్థానిక గోపాల్నగర్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు భార్య కావ్యను పిల్లల్ని స్కూల్ వద్ద దింపేసి రావాలని శ్రీకాంత్ చెప్పడంతో.. ఆమె మూడవ తరగతి చదువుతున్న స్వరాగ, ఎల్కేజీ చదువుతున్న స్వరి్ణతను స్కూల్కు తీసుకువెళ్లారు. ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో మరోమార్గంలో వెళ్లి చూడగా ఫ్యాన్కు శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. స్థానికులు, భార్య కలిసి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అయినవారు కన్నీరుమున్నీరు యానాం జీజీహెచ్లో కుమారుడి మృతదేహం వద్ద శ్రీకాంత్ భార్య, తల్లి బోరున విలపించారు. బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏదోలా తామే చెల్లిస్తామని చెబుతూ ఉన్నామని, అయిన్పప్పటికీ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ఒడిగడితే తాము నివారించామని, కాని ప్రస్తుతం విధి కాటేసిందని శ్రీకాంత్ మావయ్య చెప్పారు. తమను భుజాలపై ఎక్కించుకుని ఆడించిన నాన్న తమను శాశ్వతంగా విడిచి అందనిలోకాలకు వెళ్లిపోయాడని తెలియని శ్రీకాంత్ కుమార్తెల అమాయక చూపులు అందరిని కలిచివేశాయి. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. -
సింగపూర్లో అంబానీ ఎంట్రీ: ఈ ఏడాదిలోనే ఫ్యామిలీ ఆఫీసు!
సాక్షి,ముంబై: ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్కు విస్తరించనున్నారా? తాజా నివేదికలను ఈ ఊహలకు బలాన్నిస్తున్నాయి. ముఖేశ్ అంబానీ సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక మేనేజర్ను కూడా నియమించారని సమాచారం. అయితే దీన్ని ప్రైవేట్ వ్యవహారంగా పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అంబానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించనున్నారని టాక్. అయితే తాజా నివేదికలపై రిలయన్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. రిలయన్స్ఆయిల్ రిఫైనింగ్ పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి ఇ-కామర్స్, గ్రీన్ ఎనర్జీ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే క్రమంలో భారతదేశం వెలుపల కూడా విస్తరించే లక్క్ష్యంతోనే సింగపూర్లో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 2021లో రిలయన్స్ బోర్డ్లో ఆరామ్కో చైర్మన్ నియామకాన్ని ప్రకటించినప్పుడు, తన వాటాదారులతో మాట్లాడుతూ, రిలయన్స్ "అంతర్జాతీయీకరణకు నాంది" అని, రానున్న కాలంలో తమ అంతర్జాతీయ ప్రణాళికలపై అంబానీ సంకేతాలివ్వాడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్లూమ్బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు అంబానీ, సింగపూర్ ఫ్యామిలీ ఆఫీస్ను ఈ ఏడాదిలోగా ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ వ్యవహారంలో ఆయన సతీమణి నీతా అంబానీ కూడా సహకరిస్తున్నారట. కాగా తక్కువ పన్నులు, భద్రతా కారణాల రీత్యా గ్లోబల్ బిలియనీర్లంతా సింగపూర్ బాటపడుతున్నారు. తాజా పరిణామంతో అంబానీ, హెడ్జ్ ఫండ్ బిలియనీర్ రే డాలియో ,గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సరసన నిలిచారు.మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అంచనా ప్రకారం 2021 చివరి నాటికి 700 మంది. ఇది ఒక సంవత్సరం ఈ సంఖ్య 400 మాత్రమే. -
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
వివాహేతర సంబంధం: ఆఫీస్లో పరిచయం.. భార్యకి తరచూ ఫోన్ చేస్తున్నాడని..
తిరువొత్తియూరు: కోవైలోని ఓ వివాహితతో సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఓ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ను ఆమె భర్త, అతడి స్నేహితులు కిడ్నాప్ చేసి దాడి చేశారు. కత్తితో పొడిచిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై అలంగానల్లూర్కు చెందిన సోన ముత్తు (37). ఇతనికి వివాహమై భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. సోనముత్తు కోవై అవినాశి రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే బ్యాంకులో సేల్స్ విభాగంలో పని చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత సోనముత్తు రామనాథపురం నంజుండాపురం శ్రీపతినగర్లో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆ యువతికి వివాహమైంది. అయినప్పటికీ సోనముత్తు ఆ యువతికి తరచూ ఫోన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోనముత్తును కారులో కిడ్నాప్ చేసిన ఆ యువతి భర్త సాల్మన్ పారిస్ (23), అతని మిత్రులు అక్బర్ సాధిక్ (24), ముహ్మద్ అన్సర్ (24) తర్వాత కత్తితో పొడిచారు. దీంతో సోనముత్తును స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి రేస్కోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి సాల్మన్ పారిస్, అక్బర్ సాధిక్, మహమ్మద్ అన్సర్ను అరెస్టు చేశారు. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. -
ఆమెకు వివక్షత వేధింపులే వరంగా మారాయి...ఏకంగా రూ. 72 లక్షలు గెలుపొందింది
కంపెనీల్లో కొంతమంది సహోద్యోగులతో తొందరగా కలవలేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే సహోద్యోగులు కొంతమంది తమ తోటి ఉద్యోగులు అనే భావం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందులోనూ మహిళలైతే ఇలాంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. కొంతమంది తమ కంటే బాగా పనిచేస్తుందన్న అక్కసుతో లేక తమ కంటే తక్కువ కులం అనో తమతో కలవనీకుండా దూరం పెడతూ ఆవేదనకు గురయ్యేలా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ఆమె ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఐతే ఆమె పోరాడి అందుకు ప్రతిగా పరిహారాన్ని కూడా అందుకుంది. వివరాల్లోకెళ్తే....లండన్లోని స్ట్రాట్ఫోర్డ్లో ఆస్పర్స్ క్యాసినో అనే గేమింగ్ కంపెని ఉంది. 51 ఏళ్ల రీటా లెహెర్ అనే అమె ఆ కంపెనీ క్వాషియర్గా పనిచేస్తోంది. ఐతే ఆమె ఆఫ్రికన జాతికి చెందని మహిళ. దీంతో ఆకంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆమెను దూరం పెట్టేవారు. ఆఫీసులో జరిగే ఎలాంటి ఫంక్షన్లకి, పార్టీలకి ఆమెని పిలిచేవారు కాదు. రీటాకి గేమింగ్ కంపెనీలో 22 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఆ కంపెనీలో హై-ఎండ్ డీలర్గా, షాప్ మేనేజర్గా కూడా విధులు నిర్వర్తించింది. కానీ ఆమెకు కంపెనీలో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి తగిన గుర్తింపు గానీ గౌరవం గానీ లేదు. అంతేకాదు ఆమె ప్రమోషన్ కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా పదేపదే తిరస్కరింపబడేవి. దీంతో ఆమె చాలా ఏళ్లు విసిగిపోయి ఒక దశలో కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవాలనుకుంది కూడా. ఇక ఈ జాతి వివక్షతకు చెక్పెట్టాని నిర్ణయించుకుని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ ప్యానెల్ ఈ విషయమై పూర్తిగా విచారణ జరిపింది. రీట్ జాతి వివక్షతకు గురిఅవ్వడమే కాకుండా సహోద్యోగులు ఆమె పట్ల నడుచుకున్న తీరు, ఆమె పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుంది. సహోద్యోగులు, అధికారులు ఒక ఉద్యోగిని వివక్షతకు గురిచేస్తే ఆ ఉద్యోగి పనిపై తీవ్రప్రభావం పడుతుందని, తన చుట్టు ఉన్న వాతావరణం బాగుంటేనే ఆ ఉద్యోగి నూతనోత్సహంతో పనిచేయగలుగుతుందని ఇది సహించలేనిదని తెలిపింది. రీటా ఎదుర్కొన్న వివక్ష వేధింపులకు పరిహారంగా ఆమెకు సుమారు రూ 72 లక్షలు అందజేయనున్నట్లు కూడా ప్రకటించింది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో విషాదం
ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్లో విషాదం చోటుచేసుకుంది. క్లబ్ మాజీ మేనేజర్ ఫ్రాంక్ ఓఫారెల్(94) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో మార్చి 6న మృతి చెందారని క్లబ్ సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫ్రాంక్ ఓ ఫారెల్ మృతికి నివాళి అర్పిస్తూ ట్విటర్లో సందేశాన్ని రాసుకొచ్చింది. ''ఫ్రాంక్ ఓ ఫారెల్ ఇక లేరన్న వార్త మమ్మల్ని కలిచివేసింది. ఆయన మా క్లబ్కు అందించిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అతని కుటుంబసభ్యలుకు ఇవే మా ప్రగాడ సానభూతి'' అని పేర్కొంది. 1969లో ఎఫ్కప్ను మాంచెస్టర్ సిటీకి కోల్పోయినప్పుడు ఫ్రాంక్ గైడ్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 1971లో మాట్ బస్బీ నుంచి మేనేజర్గా బాధ్యతలు తీసుకున్న ఫ్రాంక్ ఓరెల్.. మూడేళ్ల పాటు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ను విజయవంతగా నడిపించాడు. చదవండి: Dean Elgar: 'దేశం వైపా... ఐపీఎల్ వైపా?'.. విధేయత చూపించాల్సిన సమయం We are deeply saddened to learn that our former manager, Frank O'Farrell, has passed away aged 94. Sending thoughts and prayers to his family and friends at this difficult time ❤️ — Manchester United (@ManUtd) March 7, 2022 -
మేనేజర్ కూతుళ్ల హాఫ్ సారీ ఫంక్షన్లో రవితేజ సందడి
Ravi Teja Attend His Manager Srinivas Raju Daughters Half Saree Function: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ ఫుల్ జోష్తో షూటింగ్ పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వ్యక్తులతో ఎంతో ఉదారంగా ఉంటాడు రవితేజ. వారికి సంబంధించిన వేడుకలకు హాజరవుతూ ఇంట్లో మనిషిలా చూసుకుంటాడు. రవితేజ వద్ద శ్రీనివాస రాజు మేనేజర్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రాజుకు అనన్య, నిత్య ఇద్దరు కుమార్తెలు. వారికి హాఫ్ సారీ ఫంక్షన్ను ఆదివారం (ఫిబ్రవరి 27) రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ హాజరై సందడి చేశారు. అనంతరం అనన్య, నిత్యలను ఆశీర్వదించాడు. అలాగే ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్, యంగ్ హీరో తేజ సజ్జా, నటుడు బ్రహ్మాజీ ఫైట్మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేనేజర్ ఇంట ఫంక్షన్లో మాస్ మహారాజ సందడి (ఫోటోలు)
-
మస్తాన్ వలీని కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్ వలీ పాత్రపై హైదరాబాద్ సెంట్రల్ క్రెమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆయ న పాత్రను పక్కాగా నిర్ధారించడంతో పాటు సూత్రధారులను గుర్తించేందుకు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో జైల్లో ఉన్న మస్తాన్ వలీని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ విచారణ తర్వాతే ‘తెలుగు అకాడమీ’ సూత్రధారులు సాయి తదితరులకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
రెండేళ్ల క్రితం సాదాసీదాగా వచ్చి.. ఇప్పుడు ఆ శాఖలో పెత్తనమంతా అతనిదే..!
ఎవ్రిథింగ్ ఈజ్ పాజిబుల్.. ఏపీ పర్యాటక శాఖ ట్యాగ్లైన్. ఇక్కడ జరిగే వింతలు చూస్తే.. నిజంగా ఈ శాఖకు ఈ ట్యాగ్లైన్ కరెక్ట్ అనిపిస్తుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సీనియర్ మేనేజర్ హోదాని కట్టబెట్టేశారు. గైడ్గా మొదలైన సదరు ఉద్యోగి ప్రస్థానం.. జిల్లా టూరిజం మేనేజర్గానూ.. ఇప్పుడు ఐటీడీఏ టూరిజం ఎస్ఎం వరకూ చేరింది. ఆరోపణలు, వివాదాలతో నిత్యం సావాసం చేసే ఉద్యోగికి ఇలా ఏకంగా పెద్ద బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: సుందరి నగరి విశాఖ రాష్ట్రంలో ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా భాసిల్లుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ రూ.కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కీలకమైన జిల్లా పర్యాటక శాఖలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలన్నింటినీ ఓ గైడ్ చేతుల్లోనే కొనసాగుతున్నాయి. పైగా.. సదరు గైడ్ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. టూరిజం డిగ్రీ లేకపోయినా.. కేవలం గైడ్గా పనిచేయడం మొదలు పెట్టారు. గైడ్కి పోస్ట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నా.. అప్పటి అధికారుల అండదండలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిపోయాడు. ఇటీవలే అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరస్కరించడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. తాజాగా ఐటీడీఏ సీనియర్ మేనేజర్ కమ్ కోఆర్డినేటర్గా రెగ్యులర్ అధికారిగా కొనసాగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసేశారు. డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్కు కూడా వెహికల్ ప్రోవిజన్ లేదు. కానీ.. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మాత్రం వాహన సౌకర్యం కల్పించేశారు. అడ్మిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏపీటీఏ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సీఈవో మాత్రం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించడం విశేషం. దీనికి తోడు మూడు రోజులు జిల్లా టూరిజం కార్యాలయంలోనూ, మూడు రోజులు ఐటీడీఏ సీనియర్ మేనేజర్గా వ్యవహరించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా పర్యాటకశాఖ కార్యాలయంలోనూ అన్నీ తానై కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగికి జిల్లా టూరిజం ఆఫీసర్గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపైనా పెద్ద వివాదమే చెలరేగింది. ఆది నుంచీ ఆరోపణలే.. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న అతన్ని ఇక్కడి అవసరాల నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఈ గైడ్.. క్రమంగా అసిస్టెంట్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గానూ, తర్వాత టూరిజం మేనేజర్గానూ కొనసాగుతున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న అతనిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ రాయలసీమ జోన్కు బదిలీ చేశారు. అయితే ఆ బదిలీని సైతం ఆపేసుకొని.. ఇక్కడే కొనసాగుతూ చక్రం తిప్పేశాడు. గతంలో తొట్లకొండ పర్యాటక క్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట ఓ నిర్మాణం చేపట్టాడు. దీనిపై అప్పటి కలెక్టర్ యువరాజ్కు ఫిర్యాదులు రావడంతో వెంటనే జేసీబీతో కూల్చివేయించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఐటీడీఏ సెల్ సీనియర్ మేనేజర్ కమ్ కోర్డినేటర్గా బాధ్యతలు కట్టబెట్టడం పర్యాటశాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ బాధ్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు. నిబంధనలను అనుసరించాల్సిన ఉన్నతాధికారులు సదరు గైడ్కు ‘దాసో’హం అవడం టూరిజం ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతుండటం కొసమెరుపు. చదవండి: వేల కిలోమిటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది
ఇటీవల కాలంలో కొన్ని అనూహ్య ప్రమాదాల్లో చాలా మంది వెట్రుక వాసిలో తప్పించుకుంటున్న ఉదంతాలను చాలా చూశాం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తికి ఉన్న చెడ్డ అలవాటే అతని ప్రాణాన్ని కాపాడింది. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) అసలు విషయంలోకెళ్లితే... అర్వెన్ తుఫాను యూకేలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో ముగ్గురు వ్యక్తుల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాన్ వస్తున్న సమయంలో బ్రిడ్జెండ్లోని ఒక పబ్ మేనేజర్ చెరిల్ పౌండ్ అనే 55 ఏళ్ల మహిళ పబ్ని మూసి వేసేద్దామనకుని అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిని శుభ్రం చేస్తూ ఉంది. అయితే కాసేపు విరామం తీసుకుని సిగరెట్ కాల్చుకున్నాక మిగతా టేబుల్స్ని శుభ్రం చేద్దామనుకుంది. దీంతో ఆమె ఆ పబ్లో ఉన్న టేబుల్స్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి సిగరెట్ కాల్చుకుంటుంది. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిపై ఒక పెద్ద వృక్షం పడింది. ఆమె గనుక విరామం తీసుకోకుండా అక్కడ క్లీన్ చేస్తూ ఉండి ఉంటే ఆమె చనిపోయి ఉండేది. అంతేకాదు ఆ చెట్టు ఆమెకు అంగుళం దూరంలోనే పడటం గమనార్హం. (చదవండి: ఐఏఎస్ ఆఫీసర్నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్కి టోకరా) -
సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!
టెక్సాస్: రెస్టారెంట్లలో సర్వ్ చేసేవాళ్లతో కొంతమంది కస్టమర్లు ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంటారో చూసే ఉంటాం. అంతేకాదు మరికొంతమంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చాడంటూ సర్వ్ చేసేవాళ్లను చేయి చేసుకుడమే కాక అక్కడ ఉన్న ఫర్నేచర్ను పాడు చేసిన వార్తలు కూడా విన్నాం. కానీ ఇక్కడొక రెస్టారెంట్లోని మహిళా ఆ కస్టమర్లందరీ కంటే ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణంగా ప్రవర్తించింది. (చదవండి: విమానాలకు రన్వేగా....) అసలేం జరిగిందంటే.. టెక్సాస్లోని రెస్టరెంట్లో ఒక కస్టమర్ స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయిత ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆమె కోపంతో రెస్టారెంట్ మేనేజర్ జన్నెల్లే బ్రోలాండ్ వద్దకు వచ్చి జరిగిన విషయం వివరిస్తుంది. అంతేకాదు ఏవిధంగా ఆ సూప్ కంటైనర్ మూత కరిగిపోయిందో చూపిస్తూ మేనేజర్పై కోపంగా అరుస్తూంది. కాసేపటికి ఉన్నటుండి ఆ వేడివేడి సూప్ను మేనేజర్ బ్రోలాండ్ ముఖంపైన విసిరేసి హడావిడిగా పరుగెత్తుతూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు బ్రోలాండ్ షాక్కి గురవుతోంది. ఈ మేరకు బ్రోలాండ్ వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆమె వెళ్లిపోతున్న కారుని ఫోటోలు తీసి టెక్సాస్లో పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ప్రస్తుతం సదరు కస్టమర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు కస్టమర్ తీరుని విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) -
ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో 23 పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: మేనేజర్లు(ఫైనాన్స్)–09, డిప్యూటీ మేనేజర్లు(ఫైనాన్స్)–03, అసిస్టెంట్ మేనేజర్లు(ఫైనాన్స్)–11. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ/బీటెక్తోపాటు ఎంబీఏ/పీజీడీఎం, బ్యాచిలర్/పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లా ఇన్ బిజినెస్/కమర్షియల్ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షని ఇంగ్లిష్లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021 ► వెబ్సైట్: https://esfc.ap.gov.in సీఎఫ్డబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్లో 44 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం(సీఎఫ్డబ్ల్యూ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 44 ► అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి, విజయవాడ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://cfw.ap.nic.in -
కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, చిత్తూరు: కలికిరి బ్యాంకు కుంభకోణంలో కొత్త విషయాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో బ్యాంకు మెసెంజర్ అలీ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భార్య ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. ఆమె బంగారు నగల కోసం తరచూ తనపై ఒత్తిడి తెచ్చేదన్నారు. వాటిని తట్టుకోలేకే బ్యాంకు నుంచి కోటి రూపాయలు స్వాహా చేసినట్లు చెప్పారు. కాజేసిన సొమ్ముతో రూ. 30 లక్షల విలువచేసే బంగారు నగలు, మరో 70 లక్షలు బంధువుల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ నాగార్జున్ రెడ్డి నేతృత్వంలో మరింత లోతైన విచారణ జరుగుతోంది. చదవండి: ఫొటోషూట్కు వెళ్లిన ప్రముఖ మోడల్పై చిరుతల దాడి! -
Bank Fraud: మూడుకోట్ల కుంభకోణంపై విచారణ
చిత్తూరు: చిత్తూరు జిల్లా కనిగిరి బరోడా బ్యాంకులో మూడు కోట్ల కుంభకోణంపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మేనేజర్ వెంకట మద్దిలేటి తోపాటు మరో ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.బ్యాంకు సిబ్బందిపై బాధిత మహిళలు దాడి చేస్తారన్న అనుమానంతో బ్యాంకు వద్ద.. భద్రతను పెంచారు. కాగా, బ్యాంకు సిబ్బంది మా కొంప ముంచారంటూ బాధిత మహిళలు తీవ్రంగా రోదిస్తున్నారు. చదవండి: Madanapalle: మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్ -
మహిళ విషయంలో గొడవ.. హోటల్ నిర్వాహకుడిని చితకొట్టిన సీఐ
సాక్షి, గుత్తి (అనంతపురం): గుత్తి సీఐ రాము రెచ్చిపోయారు. అకారణంగా ఓ హోటల్ నిర్వాహకుడిని దుర్భాషలాడడమే కాకుండా విచక్షణరహితంగా చితకబాదారు. ఈ ఘటనతో గుత్తిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్ రోడ్డులో లోకేష్ అనే వ్యక్తి డార్లింగ్ కేఫ్ (హోటల్) నిర్వహిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన కొందరు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో హోటల్లో ఓ మహిళ విషయంగా వారు గొడవపడ్డారు. అదే సమయంలో సీఐ రాము, కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అక్కడ జరుగుతున్న గొడవను గమనించి సీఐ రాము వెంటనే వాహనాన్ని ఆపి గొడవ పడుతున్న వారిని చెదరగొట్టారు. విచక్షణారహిత దాడి.. ఈ క్రమంలోనే కేఫ్ నిర్వాహకుడు లోకేష్పై సీఐ రాము అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీతో చితకబాదడంతో తొడలపై, కాలి పిక్కలపై, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్ దెబ్బలకు లోకేష్ నడవలేని స్థితిలో ఉన్న చోటునే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న లోకేష్ కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే కేఫ్ వద్దకు చేరుకున్నారు. జడ్జి దృష్టికి దురాగతం.. లోకేష్ పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు చలించిపోయారు. ఇందుకు కారకుడైన సీఐ రాముకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేఫ్ ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకుని ధర్నాకు దిగారు. అనంతరం క్షతగాత్రుడిని తీసుకుని జడ్జి బంగ్లా వద్దకు చేరుకుని న్యాయమూర్తి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. నడవలేని స్థితిలో చతికిలబడిన లోకేష్కు వెంటనే చికిత్స అందజేయాలంటూ స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారికి న్యాయమూర్తి ఫోన్ చేసి ఆదేశించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారి సూచించారు. బాధితులతో పోలీసుల వాగ్వాదం.. ఆస్పత్రి నుంచి అనంతపురానికి తరలిస్తూ మార్గమధ్యంలో ఉన్న పోలీస్స్టేషన్ వద్ద కాసేపు ధర్నా చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బాధితుడి బంధువులకు, కానిస్టేబుళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్ పరిస్థితి విషమిస్తుండడంతో క్షతగాత్రుడిని తీసుకుని కుటుంబసభ్యులు అనంతపురానికి ఆగమేఘాలపై తరలిపోయారు. ఈ సందర్భంగా విలేకరులతో బాథితుడు లోకేష్ మాట్లాడుతూ... తనను అకారణంగా సీఐ రాము దుర్భాషలాడుతూ శరీరమంతా చితక బాదాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
వామ్మో.. బ్యాంక్ మేనేజర్ .. నకిలీ శాలరీ స్లిప్పులు సృష్టించి..
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నకిలీ శాలరీ స్లిప్పులు సృష్టించి హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్ సిబ్బందితో బ్యాంక్ మేనేజర్ కుమ్మక్కై ధార్వాడ ఎస్బీఐ శాఖకు రూ. కోట్లలో వంచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్పొరేషన్ డివిజన్ నెంబర్ వన్లో కార్మికుల నకిలీ శాలరీ స్లిప్ సృష్టించి వంచనకు పాల్పడ్డారు. ఇద్దరు కార్పొరేషన్ సిబ్బంది ధార్వాడ ఎస్బీఐ గాంధీనగర శాఖ మేనేజర్ సంధ్యా సహకారంతో రుణాలు మంజూరు చేయించారు. బ్యాంక్ ఆడిట్ వేళ ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు ఈ కేసులకు సంబంధించి నలుగురిపై ధార్వాడ విద్యాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దాఖలైన తక్షణమే బ్యాంక్ మేనేజర్ సంధ్యా ముందస్తూ బెయిల్ పొందారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా విద్యాగిరి పోలీసులు రవికుమార దొడ్డమని, హనుమంత మదారను అరెస్ట్ చేశారు. వీరితో పాటు నకిలీ శాలరీ స్లిప్ సృష్టించిన జిరాక్స్ దుకాణం సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. 42 మందికి రుణాలు పొందగా ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. కోట్ల రూపాయలు బ్యాంక్కు వంచన చేసినట్లుగా విద్యాగిరి పోలీసులు తెలిపారు. -
ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే. అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది. 1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు. గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని. ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో. -
దీపికా మేనేజర్కు మరోసారి ఎన్సీబీ సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కేసు దర్యాప్తు భాగంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్(ఎన్సీబీ) మరోసారి సమన్లులు జారీ చేసింది. గత నెలలో ఎన్సీబీ ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్) అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో పలువురు బాలీవుడ్ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్, సారా, రకుల్లకు కూడా ఎన్బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్కు డ్రగ్ పెడ్లర్తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్
సాక్షి, ముంబై : సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్ అధికారులకు తెలిపాడు. ఇక ఈ కేసులో వచ్చిన మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ల పర్వం ప్రారంభమయ్యింది. శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేశారు. అతడితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ పరిహార్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంజాయి అమ్మకంలో భాగస్వాములని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎన్సీబీ అధికారులు షోవిక్తో పాటు శ్యాముల్ మిరాండాల ఇళ్లలో ఏక కాలంలో దాడులు చేశారు. (చదవండి: ‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) ఇక ఇప్పటికే డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్ పరిహార్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి పంపారు. జైద్ విలాత్రా విచారణ ఆధారంగా బాసిత్ పరిహార్ను దర్యాప్తులో చేర్చిన సంగతి తెలిసిందే. బాసిత్, జైద్ ఇద్దరూ డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పాల్గొన్నట్లు చెప్పారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించాడని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆత్మహత్యకు ముందు దిశ డాన్స్ వీడియో!
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల ముందు తన మేనేజర్ దిశ సాలియన్ కూడా ఓ అపార్టుమెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్, దిశ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైన సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జూన్ 9 రాత్రి ముంబైలోని మలద్ ప్రాంతంలో దిశ ప్రియుడు రోహాన్ నివాసంలో పార్టీ జరిగింది. ఆ పార్టీలో దిశ తన బాయ్ ఫ్రెండ్తో పాటు, మరికొంత మందితో కలిసి పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఆమె పార్టీ జరిగిన అపార్టుమెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పార్టీలో దిశ తన స్నేహితులతో సంతోషంగా డాన్స్ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. (తనపై అత్యాచారం జరుగలేదు, గర్భవతి కాదు) అందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దిశ ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా ఆమెను హత్య చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక దిశ సలియన్ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూ.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసినా తమకు ఆ వివరాలు అందించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (చనిపోయే ముందు దిశ ఎందుకు ఏడ్చింది?) -
సుశాంత్ కేసు : ‘ఆ విషయాన్ని ప్రస్తావించలేదు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తులో భాగంగా అతడి మాజీ మేనేజర్ దిశ సలియన్ పోస్ట్మార్టం నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇందులో దిశ మృతికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టులో తన తలకు బలమైన గాయాలయ్యాయని, శరీరంపై అనేక చోట్ల సహజ గాయాలైనట్లు పోస్టుమార్టంలో వైద్యులు వెల్లడించారు. అవి 14 అంతస్తుపై నుంచి దూకడం వల్లే గాయలైనట్లు వైద్యులు రిపోర్టులో వెల్లడించారు. కానీ తన ప్రైవేటు భాగాలపై కూడా గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో మాత్రం దీనిపై వైద్యులు ప్రస్తావించకపోవడం గమనార్హం. వివరాలు.. దిశ ముంబైలోని ఓ అపార్టుమెంటులో14వ అంతస్తులో నివసించేదని, ఈ క్రమంలో జూన్ 9న(సుశాంత్ ఆత్మహత్య నాలుగు రోజుల ముందు) రాత్రి 2 గంటల సమయంలో తన అపార్టుమెంటు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మృతి : దర్యాప్తు ముమ్మరం) అయితే ఆ సమయంలో దిశ తన బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ఇంట్లో ఉన్నట్లు ఓ ఇంగ్లీష్ ఛానల్ పేర్కొంది. మహరాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నారాయణ్ రాణే దిశ మరణంపై ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. దిశది ముమ్మాటికి అత్యాచారం, హత్యేనని ఆయన ఆరోపించారు. తన తలకు తీవ్రమైన గాయమైందని, ఇతర శరీర భాగాలపై సహజ గాయాలైనట్లు మాత్రమే వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో ధృవికరించారన్నారు. కానీ ఆమె ప్రైవేటు భాగాలపై కూడా గాయాలు ఉన్నాయని వాటిపై రిపోర్టులో వైద్యులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక దిశ జూన్ 9న ఆత్మహత్య చేసుకుని మరణిస్తే జూన్ 11న తన మృతదేహానికి పోస్టుమార్టం జరిపారని, రెండు రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్ కేసు: ప్రెస్ నోట్ విడుదల) సుశాంత్ ఆత్మహత్య అనంతరం తన మాజీ మేనేజరైన దిశ ఆత్మహత్యపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దిశ మరణించిన వారం వ్యవధిలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో వీరిద్దరి మృతి ముడిపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా సుశాంత్ కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశించడంతో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దిశ మృతిపై కూడా ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దిషా ఆత్మహత్యపై ఆధారాలు తెలిసిన వారు తమని సంప్రదించాలని పోలీసులు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. -
మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్!
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రెండేళ్ల విరామం తర్వాత ఆదివారం తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటుచేసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీపాలతో ముస్తాబైన బిగ్బీ నివాసం జల్సాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ మేనేజర్ అర్చన సదానంద లెహెంగాకు అనుకోకుండా నిప్పంటుకుంది. దీనిని గుర్తించిన షారుఖ్ ఖాన్ వెంటనే స్పందించి.. ఆమెకు పెద్దప్రమాదం కాకుండా కాపాడారు. ఐశ్వర్యకు అర్చన సదానంద్కు చాలా కాలంగా మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆమె లెహంగాకు దీపం అంటుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన షారుక్ ఖాన్ వెంటనే తన జాకెట్తో ఆమె లెహెంగాకు అంటుకున్నమంటలను ఆర్పాడు. ఈ ప్రమాదంలో అర్చనకు చేతులకు, కుడి కాలికు 15శాతం గాయాలయ్యాయి. షారుక్కు కూడా స్వల్ఫ గాయాలయ్యాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్లు దారి చేరకుండా ఉండేందుకు ఆమెను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బిగ్ బీ ఇంట్లో అతికొద్ది గెస్ట్లు మాత్రమే ఉన్నారు. పార్టీ సుమారుగా ముగియడంతో మేనేజర్ అర్చన తన కుమార్తెతో కలిసి బయట ప్రాంగణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంతో పార్టీలోని వారు ఒక్కసారి షాక్కు గురయ్యారు. అయితే, అక్కడే ఉన్న షారుఖ్ రియల్ హీరోగా స్పందించి అర్చనను కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. — Farah Khan (@TheFarahKhan) October 30, 2019 చదవండి: బిగ్ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్ హంగామా -
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్ చేశాడు. దీంతో వలపన్నిన సీబీఐ అధికారులు పీఎన్బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్ సింగ్. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
కూలీ నుంచి మేనేజర్గా..
ఒకప్పుడు మారుమూల పల్లెలో కూరగాయలమ్మిన ఆ యువకుడు.. ఇప్పుడు అబుదాబీ మాల్స్లో రెస్టారెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గల్ఫ్లో భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి పట్టుదలతో మెరుగైన జీవనానికి బాటలు వేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేటకు చెందిన హబీబ్కు చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. అతని తండ్రి దుబాయిలో అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ పోషణ హబీబ్ చూసుకోవాల్సి వచ్చింది. స్కూల్కు వెళ్తూనే.. గ్రామంలో కూరగాయలు అమ్మాడు. ఇలా ఆరేళ్లు గడిచిన తర్వాత హబీబ్ గల్ఫ్కు వెళ్లాడు. 1998లో భవన నిర్మాణ కూలీగా అబుదాబీలో అడుగుపెట్టాడు. పదకొండు నెలల తరువాత యజమాని పనిలేదని చెప్పి పంపించాడు. ఆ తర్వాత హబీబ్ అక్కడే ఓ రెస్టారెంట్లో డిష్ వాషర్గా పనిలో కుదిరాడు. ఇంగ్లిష్ నేర్చుకుంటే జీతం ఎక్కువ వస్తుందని తెలుసుకుని ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించాడు. వెయిటర్గా.. తరువాత క్యాషియర్గా పనిచేశాడు. చైనీస్ డిషెస్ నేర్చుకుని కుక్గా ఎదిగాడు. తన చొచ్చుకుపోయే స్వభావం వల్ల మార్కెటింగ్ స్థాయికి ఎదిగాడు. తరువాత పీఆర్వోగా సైతం పనిచేశాడు. తాను పనిచేసే రెస్టారెంట్ కొత్త బ్రాంచ్లకు ఉద్యోగులు అవసరం ఉంటుండడంతో తన గ్రామం వారిని, స్నేహితులకు ఉపాధి చూపించాడు. 40 మందికి ఉచితంగా వీసాలిప్పించాడు. కొంత కాలం తర్వాత స్వస్థలానికి వచ్చిన ఆయన.. వివిధ వ్యాపారాలు నిర్వహించాడు. అవి కలిసిరాకపోవడంతో ఆర్థికంగా కొంత నష్టపోయాడు. దీంతో మళ్లీ గల్ఫ్ బాట పట్టాడు. అబుదాబీలో మూడు సంవత్సరాలుగా కౌలూన్ చైనీస్ రెస్టారెంట్ బ్రాంచ్కు మేనేజర్గా పనిచేస్తున్నాడు. పడి లేచిన కెరటంలా హబీబ్ జీవన ప్రస్తానం కొనసాగింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, మలయాళం, నేపాలీ, అరబ్బీ భాషలపై ఆయనకు పట్టుంది. కాగా, హబీబ్ ప్రస్తుతం స్వగ్రామానికి కోఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యాడు.-తోకల ప్రవీణ్, మల్లాపూర్ -
58 కిలోల బంగారం నొక్కేసి..
ముంబై : తాను పనిచేసే సంస్ధలోనే 58 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ జ్యూవెలరీ స్టోర్ మేనేజర్ అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమర్ద్నగర్లోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణం వమన్హరి పెథే బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు గురువారం వెల్లడించారు. స్టోర్లో పనిచేసే లోకేష్ జైన్, రాజేంద్ర జైన్ల సహకారంతో బ్రాంచ్ మేనేజర్ అంకుర్ రాణే బంగారం చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్టోర్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
సిండి‘కేటు’కు సంకెళ్లు
బ్యాంకు రుణం తీసుకోవాలంటే సామాన్యుడికి కష్టమే. ఒకవేళ ఒప్పుకున్నా రుణం మంజూరుకు సవాలక్ష నిబంధనలతో కాలయాపన చేస్తారు. మరి బ్యాంకు మేనేజర్ స్వయంగా తలచుకుంటే .. రూల్స్ గీల్స్ ఏవీ అడ్డురావు. అనుకున్న వారికి అనుకున్నంతా ఇస్తారు. డాక్యుమెంట్లు, కీలక పత్రాలు ఎలాంటివైనా ఓకే అంటారు. ఖాజీపేట సిండికేట్ బ్యాంకు మేనేజర్ అచ్చం అలాగే చేశారు. చేతివాటం ప్రదర్శించి రుణాలు మంజూరు చేశారు. తరువాత వచ్చిన మేనేజర్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. రెండేళ్లుగా దీనిపై సాగుతున్న విచారణ తాజాగా కొలిక్కివచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సాక్షి, ఖాజీపేట: ఖాజీపేట సిండికేట్ బ్యాంకులో గతంలో జరిగిన రుణాల గోల్మాల్పై విచారణ కొలిక్కి వచ్చింది. ఇక్కడ మేనేజర్గా జయంత్ బాబు 2014 జూన్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకును దళారీలకు కేంద్రంగా మార్చారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు ఇలా ఒకటేమిటి అన్నీ దళారుల మధ్యవర్తిత్వంతోనే జరిగాయి. రుణం మంజూరుకు బేరం కుదర్చుకుని డబ్బు ముట్టిన తరువాత దళారీలు చెప్పినట్లు రుణాలు ఇచ్చేవారనే అభియోగముంది. అలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయి. తరువాత అక్కడ నుంచి ఆయన బదిలీపై వెళ్లిపోయారు. సిక్ గ్రూపులకు రుణాలు చివరకు డ్వాక్రా గ్రూపు సంఘాలను బ్యాంకు మేనేజరు వదలలేదు. 7నుంచి 9సంవత్సరాలుగా సిక్ అయిన గ్రూపులపై ఆయన దృష్టి సారించారు. పూర్తి వివరాలు సంబంధిత యానిమేటర్ ద్వారా తెలుసుకున్నారు. డిఎల్, లక్ష్మిప్రసన్న, యువదర్శిని, గణేష్గ్రూపులు సిండికేట్ బ్యాంకులో ఏడేళ్లుగా రుణాలు చెల్లించక సిక్ గ్రూపులుగా ఉన్నాయి. ఈ గ్రూపుల యానిమేటర్, మేనేజర్ ఒక ఒప్పందానికి వచ్చి బకాయి రుణాన్ని చెల్లించి గ్రూపు సభ్యులకు తెలియకుండానే క్షణాల్లో వారికి రుణం మంజూరు చేశారు. మంజూరైన గ్రూపులకు పొదుపు డబ్బు లేక పోయినా కొత్తగా మంజూరు చేసిన రుణం పొదుపు గ్రూపు అకౌంట్లో ఉంచి మిగిలిన సొమ్ము డ్రా చేశారు. ఆ విధంగా నాలుగు గ్రూపులకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. డీఎల్ గ్రూపులో కొందరు సభ్యులు చనిపోయారు. మిగిలిన చాలా మంది సభ్యులు స్థానికంగా లేరు. వారిపేరున బినామీలను పెట్టి ఫోర్జరీ సంతాలు చేసి తప్పుడు డ్యాక్యుమెంట్లు ఇచ్చి రుణాలు మంజూరు చేసి స్వాహా చేశారు. లక్ష్మి ప్రసన్న గ్రూపులో కూడా రూ.5 లక్షలు రుణం మంజూరు చేసి డ్రా చేశారు. అలా డ్రా చేశారని తెలియడంతో తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించారు. తనకు మట్టి అంటకూడదని గూపు సభ్యుల సహకారం తీసుకున్నారు. వ్యక్తిగత రుణాలు ఇస్తానని చెప్పి కొత్తగా గ్రూపు సభ్యులు రుణం తీసుకున్నట్లు సంతకాలు చేయించి రుణాలను మంజూరు చేసినట్లు తెసింది. గణేష్ గ్రూపు సభ్యులు ఈ వ్యవహరంపై అప్పట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఫిర్యాదు డ్వాక్రా గ్రూపుల రుణాల్లో అక్రమాలు జరిగిన మాట నిజమేనని గతంలోనే వెలుగు అధికారులు గుర్తించారు. అప్పటి వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ధనుంజయ్ బ్యాంకు మేనేజర్పై ఫిర్యాదు చేశారు. రుణాల మంజూరులో యానిమేటర్ కాంతమ్మకు సంబంధముందని తొలగించారు. తరువాత టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్యాదవ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి ఆమెను యానిమేటర్గా కొనసాగించారు. డ్వాక్రా గ్రూపు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ 2017మార్చిలో సిండికేట్ బ్యాంకులో స్వాహా పర్వం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. అప్పటి లీడ్ బ్యాంక్ మేనేజర్ రాఘనాధరెడ్డి ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ఆయన గుర్తించారు. అప్పడు స్థానిక టీడీపీ నాయకుల జోక్యంతో కేసు బయటకు రాకుండా తొక్కిపట్టారు. తరువాత వచ్చిన బ్యాంకు మేనేజర్లు ఈ అక్రమాల జోలికి వెళ్లకుండా మిన్నకుండి పోయారు. దీంతో విచారణ రెండేళ్లుగా సాగుతూనే వచ్చింది. మేనేజరుపై ఫిర్యాదు మేనేజరు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిన బ్యాంకు ఉన్నతాధికారులు కేసు నమోదుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటి బ్యాంకు మేనేజర్ లీలాప్రతాప్ పోలీసులకు ఫిబ్రవరి 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.22 కోట్ల రుణాల మంజూరులో మేనేజరు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేశారని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రుణాలు ఇచ్చారని, అధికారాలను దుర్విని యోగం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సీఐ కంబగిరి రాముడు వేగవంతం చేశారు. ఎన్నికల సందర్భంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఆయన విచారణను వేగవంతం చేశారు. వెంకటసుబ్బయ్య, కాంతమ్మ, బ్యాంకు మాజీ మేనేజర్ జయంత్ బాబులను విచారించారు. ముగ్గురు అరెస్టు ఖాజీపేట : సిండికేట్ బ్యాంక్లో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ మాజీ మేనేజర్ జయంత్ బాబు శనివారం అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లయ్య అనే కీలక నిందుతుడు పరారీలో ఉన్నాడని మైదుకూరు రూరల్ సిఐ కంబగిరాముడు, ఖాజీపేట ఎస్ఐ రోషన్లు తెలిపారు. జయంత్ మేనేజర్గా పనిచేసిన కాలంలో దళారులను పెట్టుకుని బ్యాంకును అడ్డంగా దోచాడని తేలిందన్నారు. విచారించి ఖాజీపేట యానిమేటర్ కాంతమ్మ.. మీసాల వెంకటసుబ్బయ్యలను కూడా అరెస్టు చేశామన్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు దొంగ వెబ్ల్యాండ్, డాక్యుమెంట్లను సృష్టించిన ఎల్లయ్య పరారీలో ఉన్నాడు. త్వరలో పూర్తి విచారణ జరిపి రూ.2.22 కోట్లు రుణాల రికవరీ చేయాల్సి ఉందని తెల్పారు. మరికొందరిని విచారిస్తున్నామన్నారు. -
ఏపీ రాజధానిలో టీడీపీ నేతల రౌడీయిజం
-
మీ బాస్ మూడీనా..?
సాక్షి, న్యూఢిల్లీ : పని ప్రదేశంలో తరచూ ఆందోళనకు గురవుతూ..అలిసిపోతుంటే అందుకు మూడీగా ఉండే మీ బాసే కారణమంటున్నాయి తాజా అథ్యయనాలు. నిత్యం రుసరుసలాడే బాస్ ఎదురైతే ఉద్యోగులకు టెన్షన్ తప్పదని భారత్, బ్రిటన్లో నిర్వహించిన ఓ అథ్యయనం వెల్లడించింది. ఉత్పాదకత పైనా మూడీ బాస్ ప్రభావం ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు క్షణానికో రకంగా వ్యవహరించే బాస్ల కంటే ఎప్పుడూ మూడీగా ఉండే బాస్ కొంత మేలని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. కఠినంగా ఉండే బాస్తో కుదురైన సంబంధాలు నిర్వహించే ఉద్యోగులు సాఫీగానే నెట్టుకురాగలరని, గంటకో రకంగా వ్యవహరించే బాస్లతోనే సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్ట్సర్ పరిశోధక బృందం తేల్చింది. సహోద్యోగుల మధ్య మెరుగైన సంబంధాలు లేకుంటే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని పేర్కొంది. సిబ్బంది, మేనేజర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటం అత్యంత కీలకమని..సంస్థల్లో ఎలాంటి వాతావరణం ఉందనేది ప్రధానాంశమని అథ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ అలన్ లీ చెప్పారు. అస్తవ్యస్త మూడ్తో వ్యవహరించే బాస్లతో ఉద్యోగులు సతమతమవుతారని..ఏ అంశంలో మేనేజర్ ఎలా రియాక్ట్ అవుతారనే కంగారుతో ప్రతికూల భావోద్వేగాలకు లోనయి పనిలో సరైన సామర్థ్యం కనబరచలేకపోతారని ఆయన విశ్లేషించారు. -
సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
-
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ అరెస్ట్
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐమ్యాక్స్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ వెంకట్(44)ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఐమ్యాక్స్లో పని చేస్తున్న నందినగర్కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకట్ ఆమెను మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా వెంకట్ బాహుబలి సినిమాలో ప్రభాస్కు తండ్రిగా నటించారు. ఇప్పటివరకు 40 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సినీ నటుడిగా చెప్పుకుంటూ వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని లోబర్చుకునేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమ్మాయిలను సరఫరా చేసేవాడని తెలిపింది. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
బాహుబలి నటుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ, పెళ్లి పేరిట ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో ఐమ్యాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదుతో వెంకట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ మనస్పర్థల కారణంగా భర్తతో విడిగా ఉంటోంది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా.. ఐమ్యాక్స్ మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి దగ్గరయి ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. విడాకులు రాగానే ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశారు. ఏడేళ్ల సహజీవనంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మహిళతోపాటు చాలా మంది యువతులను వెంకట్ మోసం చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, బాహుబలిలో ప్రభాస్ శివుడు పాత్ర పెంపుడు తండ్రి పాత్ర (అశ్వని భర్త) పాత్రలో నటించింది ఇతనే. తాజాగా రాజేశేఖర్ 'గురుడవేగ' సీఎం పీఏ పాత్రలో ఓ చిన్న పాత్రను కూడా వెంకట్ పోషించాడు. -
పెట్రోల్ బంక్ మేనేజర్పై చీటింగ్ కేసు
కవిటి: మండలంలోని జాడుపుడి ఆర్ఎస్ సమీపంలోని భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన శాంతి ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ కోళ్ల దూర్వాసులు అలియాస్ దేవరాజు రూ.25.43 లక్షల నిధులు అక్రమంగా దారిమళ్లించాడని కవిటి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 8న పెట్రోల్ బంక్ యాజమాన్య ప్రతినిధి శేషగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.పారినాయుడు కేసు దర్యాప్తు చేసి నిందితున్ని శనివారం ఇచ్ఛాపురం కోర్టుకు తరలించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. దేవరాజు మేనేజర్ హోదాలో పెట్రోల్బంక్లో ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, బ్యాంక్ లావాదేవీలు చూస్తుండేవాడు. కొన్నాళ్లుగా బంక్ యజమానుల కళ్లుగప్పి భారీ మొత్తంలో నిధులు అవకతవకలకు పాల్పడినట్టు యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాస్తవం వెలుగుచూసింది. బ్యాంక్ లావాదేవీలు, పెట్రోల్బంక్ రికార్డులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవకతవకలు గుర్తించి దేవరాజును కోర్టులో హాజరుపర్చినట్టు ఎస్ఐ పారినాయుడు విలేకరులకు తెలిపారు. -
‘జయ జానకీ నాయక’ మేనేజర్పై కేసు నమోదు
బంజారాహిల్స్: ‘జయజానకీ నాయక’ సినిమా షూటింగ్ కోసం వినియోగించిన లైట్లకు సంబంధించిన బకాయిలను అడిగేందుకు వెళ్లిన తనను దుర్భాషలాడడమే కాకుండా డబ్బులు ఎగ్గొట్టారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా క్రియేషన్స్ మేనేజర్ కిషోర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణానగర్కు చెందిన పెద్దిరెడ్డి అశోక్రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ నుంచి గత జనవరి 2వ తేదీ వరకు అన్నపూర్ణస్టూడియోలో జరిగిన జయజానకీ నాయక సినిమా పాట చిత్రీకరణ కోసం 250 ఎల్ఈడీ ట్యూబులు, 250 కాయిన్లైట్లు సరఫరా చేశారు. ఇందుకుగాను రూ.10.75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తనకు ఇవ్వాల్సిన బిల్లును ఇవ్వడం లేదని, అడగడానికి వెళ్తే బెదిరింపులకు దిగారని, నిర్మాత బెల్లం కొండ సురేష్తో పాటు ఈ సినిమా నిర్మాత రవీందర్రెడ్డితో మాట్లాడితే తర్వాత ఇస్తామంటూ చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు వెళ్లగా మేనేజర్ కిషోర్ తనను చంపేస్తానంటూ బెదిరించారని, తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిషోర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టాప్ హీరోయిన్ కీలక నిర్ణయం
చెన్నై: ఇకపై తనకు తానే మేనేజర్ అంటోంది కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో క్రేజీ కథానాయికిగా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలిగిపోతున్న ఈ బ్యూటీ తన కాల్షీట్స్, పారితోషికం వ్యవహారాలను సరిదిద్దడానికి ఒక మేనేజర్ను నియమించుకున్న విషయం తెలిసిందే. రోనీ అనే అతడు కాజల్తో పాటు మరి కొందరు హీరోయిన్లకు కాల్షీట్స్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. టాలీవుడ్ను డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ పోలీసులు రోనీ నివాసంలో జరిపిన సోదాల్లో మత్తుపదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాజల్ అతను తనకు మేనేజర్ మాత్రమేననీ, రోనీ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని చెప్పారు. అలాంటి చట్ట విరోధక కార్యాలను తాను ఎప్పటికీ పోత్సహించనని అంటున్నా కాజల్ ఇకపై తానెవరినీ మేనేజర్గా నియమించుకోనని స్పష్టం చేశారు. ఇక సహాయకుడిని మాత్రం నియమించుకుని తనకు తానే మేనేజర్గా మారనున్నట్లు చెప్పారు. ఇకపై కథలు, పారితోషికం వంటి విషయాలను తానే చూసుకుంటానని కాజల్ స్పష్టం చేశారు. -
డబ్బు కోసమే హత్య
ఏఎస్పీ దామోదర్ వెల్లడి విశ్రాంత బ్యాంకు మేనేజర్ హత్యకేసు నిందితుల అరెస్ట్ కాకినాడ క్రైం : జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువకులు డబ్బు కోసం నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. డబ్బు కోసం కాకినాడ అశోక్నగర్కు చెందిన ఓ విశ్రాంత బ్యాంకు మేనేజర్ను హత్య చేసిన సంఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులను కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం స్థానిక త్రీటౌన్ క్రైం పోలీస్స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ హత్యకేసు వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం వెల్లరోడ్డు కాలువగట్టుకు చెందిన బల్లిపాటి వరప్రసాద్ (19) కాకినాడలో ఓ మెడికల్ షాపులో సేల్స్బాయ్గా, ఇదే గ్రామం కమ్మవారివీధి గుబ్బలవారిపేటకు చెందిన ఖండవల్లి సత్యప్రభుకిరణ్ (20) స్థానికంగా ఓ హొటల్లో పనిచేస్తున్నారు. అలాగే కోటవీధి రామకృష్ణనగర్కు చెందిన పూళ్ల కామేష్ (19) పనిలేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. వీరిలో ఏ1 ముద్దాయి బల్లిపాటి వరప్రసాద్ కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ ఫార్మసీలో ట్రయినర్గా పని చేస్తూంటాడు. కాకినాడ అశోక్నగర్కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ బులుసు సూరయ్య (75) అనారోగ్యంతో మెడికల్ షాపులో మందులు కొంటుండేవారు. ఒకట్రెండుసార్లు ఫోన్ చేసి మందులు పంపించాలని ఆర్డర్ ఇవ్వగా వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లి మందులు ఇచ్చేవాడు. ఆ సమయంలో ఇంటి వాతావరణాన్ని, ఇంట్లో ఉండేవారని, వారి ఆస్తులను పరిశీలించిన ప్రసాద్ డబ్బు కోసం వీరిని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. వారు ఒక ప్రణాళిక వేసుకుని ఏప్రియల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లగా, నాలుగో వ్యక్తి భయపడి వెనక్కివెళ్లిపోవడంతో 24వ తేదీ రాత్రి 7.45 గంటల సమయంలో ముగ్గురూ వెళ్లారు. ఇంటి ముందున్న టూలెట్ బోర్డును చూచి వచ్చామని, ఇల్లు చూపించాలంటూ వరప్రసాద్ మేడపైకి వెళ్లి విజయలక్ష్మిని కోరాడు. తనతో పాటూ తన స్నేహితులు వచ్చారని చెప్పాడు. ఇల్లు చూపించడానికి కింద ఇంటి తాళం తీసి గదులు చూపిస్తుండగా సూరయ్యను పేపర్ కట్టర్తో గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోర్షన్ గదికి తాళం వేసి మేడపైకి వెళ్లి భార్య విజయలక్ష్మిని కూడా హతమార్చి వంటిపై ఉన్న బంగారం, నగదును అపహరించాలని భావించారు. ఈ లోగా విజయలక్ష్మి భర్త ఎక్కడికెళ్లారంటూ ప్రశ్నించడం, బయటకు వెళ్లారని చెప్పడం, కాలనీ అంతా తిరగడం జరిగాయి. మళ్లీ వారు మేడపైకి వెళ్లి మంచినీరు కావాలని అడిగారు. ఈ లోగా వారు సెల్ఫోన్, ల్యాప్టాప్, కొడాక్ కెమేరా, రెండు బంగారు గాజులు తస్కరించారు. సెల్ఫోన్ కోసం వెతికిన విజయలక్ష్మి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి దొంగా దొంగా అని కేకలేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి మోటార్బైక్పై పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆదివారం ఈ ముగ్గురినీ రామచంద్రపురం పూళ్ల కామేష్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు గాజులు, కొడక్ కెమెరా, సెల్ఫోన్, మోటార్బైక్, బ్యాంకు పుస్తకం, ఐడీకార్డు, హత్యకు ఉపయోగించిన పేపర్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో పూళ్ల కామేష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి సొంత పెద్దమ్మ గుండు గంగాలక్ష్మికి మిరపకాయ బజ్జీలో మత్తు మందు పొడి కలిపి, ఆమె మెడలోని 3 కాసుల బంగారు తాడును దొంగిలించినట్లు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, క్రైం ఎస్సైలు రామారావు, హరీష్రావు, ఎంఎస్ పాషా, సత్తిరాజు, హెచ్సీ గోవిందరావు, పీసీలు చిన్న శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాము, మారుతిలను అభినందించారు. -
రూ.10 నాణాలను తీసుకోని బ్యాంక్
హైదరాబాద్ సిటీ: శాలిగౌరారం ఎస్బీఐలో 10 రూపాయల నాణాలు మేనేజర్ తీసుకోకపోవడంతో బ్యాంకు గేటు వద్ద పడాల నారాయణ అనే వ్యక్తి నిరసనకు దిగాడు. రిజర్వ్ బ్యాంకు నాణాలు చెల్లుతాయి అని చెప్పినా ఎందుకు తీసుకోవడం లేదని బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నించారు. అయినా తీసుకోకుండా బ్యాంక్ మేనేజర్ తీవ్రంగా హెచ్చరించడంతో బ్యాంకు గేటు వద్ద ఆందోళనకు దిగాడు. బ్యాంకులే పది రూపాయల నాణేలను తీసుకోకపోతే సామాన్య జనం ఎలా తీసుకుంటారని పలువురు అలోచనలో పడ్డారు. -
బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ దారుణ హత్య
ఇల్లు అద్దె కోసం వచ్చి హత్యకు పాల్పడిన యువకులు ∙ కాకినాడలో కలకలం రేపిన ఘటన కాకినాడ క్రైం : విశ్రాంత ఉద్యోగుల స్వర్గధామంగా పిలుచుకునే అశోక్నగర్–ఎస్బీఐ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హాయిగా భార్యతో జీవిస్తూ.. తన ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడటంతో.. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకిచ్చేందుకు ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డు కారణంగా తన ప్రాణం పోతుందని ఊహించలేక పోయాడా పెద్దాయన. అద్దె ఇల్లు కోసమంటూ వచ్చిన యువకులు బ్లేడ్ కట్టర్తో రిటైర్డు ఉద్యోగి గొంతు కోసి హతమార్చిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులో కొచి్చంది. టూలెట్ బోర్డు చూసి.. కాకినాడ అశోక్నగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన రిటైర్డ్ స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ బులుసు సూరయ్య (72) తన భార్య విజయలక్షి్మతో కలసి జీప్లస్ వ¯ŒS ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులిద్దరూ ఆదిత్యదత్, సత్యవెంకట చంద్రమౌళిదత్లు అమెరికాలో స్థిరపడ్డారు. కనకవల్లి రాధిక, శ్రీపద్మలకు వివా హం కావడంతో పెద్ద కుమార్తె బెంగళూరు, చిన్నకుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. జీప్లస్ వ¯ŒS గృహం పై అంతస్తులో భార్యా భర్తలిద్దరూ నివసిస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్ గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో అద్దెకిచ్చేందుకు టూలెట్ బోర్డు పెట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గేటు దూకి ముగ్గురు యువకులుపై అంతస్తులోకి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టి ఇల్లు అద్దెకు కావాలని కోరారు. విజయలక్ష్మి భర్త సూరయ్యకు కింద పోర్ష¯ŒS తాళాలిచ్చి పంపించింది. కిందక వెళ్లిన భర్త పైకిరాకపోవడంతో ఆమె కిందకు వచ్చింది. అప్పటికే సూరయ్యను గొంతు కోసేసి హత్యకు పాల్పడి, గదిలో పడేసి తాళాలు వేసేసి బయట నిలుచున్నారు. మా ఆయన ఎక్కడకు వెళ్లారని ఆమె ప్రశ్నించగా బయటకెళ్లారని సమాధానమిచ్చారు. కంగారుగా బయటకు వచ్చిన ఆమె ఆటో ఎక్కి పరిసరాలు గాలించింది. ఆ ముగ్గరు యువకులు ఆటో వెనుకే బైక్లపై వెళ్లి, తిరిగి ఆటోతో పాటు ఇంటికి వచ్చేశారు. దాహం వేస్తోంది. మంచినీళ్లు కావాలంటూ కోరడంతో ఆమె మేడపైకి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అనంతరం ఆ యువకులు టీపాయ్పై ఉన్న సెల్ఫోన్, పక్కనే ఉన్న ల్యాప్టాప్ను దొంగిలించారు. భర్త ఆచూకీ కోసం కాకినాడ శ్రీనగర్లో ఉంటున్న సోదరుడు వారణాసి హనుమంతుకి సమాచారం ఇచ్చేందుకు సెల్ఫో¯ŒS వెతకగా కనిపించలేదు. ల్యాప్ టాప్ కూడా కనిపించకపోయేసరికి ఆగంతకులపై అనుమా నం వచ్చింది. వెంటనే ఆమె దొంగ..దొంగా అంటూ బిగ్గరగా అరవడంతో వారు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. షాక్కు గురైన విజయలక్షి్మని చూసేందుకు స్థానికులు వచ్చి పరా మర్శించారు. సెల్ఫో¯ŒS సమాచారంతో సోదరి ఇంటికి చేరుకున్న హనుమంతు బావ కోసం చుట్టుపక్కల పరిసరాలను గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న టూటౌ¯ŒS సీఐ ఉమర్ వచ్చి తాళం తీసి పరిశీలించారు. పోర్ష¯ŒS ముందు గదిలో రక్తం మరకలు ఉండటం, రక్తం మరకల్లో పాదం గుర్తులు, అవి వంట గది వరకు ఉండడం గమనించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సూరయ్యను గమనించారు. సీఐ మహ్మద్ ఉమర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ ఏఆర్ దామోదర్, కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావులు మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం, డాగ్స్కా్వడ్లను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, క్రైం డీఎస్పీ పల్లపురాజుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్ట్మార్టం కోసం సూరయ్య మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించినట్టు తెలిపారు. హత్యపై పలు అనుమానాలు డబ్బు, బంగారం కోసం ఆశపడి వచ్చిన దొంగలు అవేమి పట్టు కెళ్లకుండా కేవలం సెల్ఫోన్, ల్యాప్టాప్ తీసుకెళ్లడం, అకారణంగా ఇంటి యాజమానిని గొంతు కోసి హత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాప్టాప్ను ఎత్తుకెళ్లిన నిందితులు దానిని డ్రైనేజీ వద్ద పారేసి వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు నిందితుల్లో ఒకరిని విజయలక్ష్మి గుర్తించింది. ఇతను కరణంగారి సెంటర్లోని ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడని, రెండు నెలల క్రితం మందులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినట్టు తెలిపింది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా భర్తను చంపేసి మంచినీళ్లు అడిగారు నాభర్తను హత్య చేసి ఏమీ తెలియనట్టు నిందితులు పైకి వచ్చి మంచినీళ్లు కావాలని కోరారు. రెండు గ్లాసుల్లో మంచినీరు తీసుకొచ్చి ఇచ్చాను. మంచినీరు తాగేసి సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించారు. బంగారం, నగదు అడిగితే వెంటనే తీసి ఇచ్చేదాన్ని. నా భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ విజయలక్ష్మి కన్నీటిపర్యంతమైంది. -
కాల్పులు జరిపి దోపిడీ.. వైరల్ వీడియో
-
ఓఎన్జీసీ భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) : భద్రత విషయంలో ఓఎన్జీసీ రాజీ లేకుండా పనిచేస్తోందని ఆ సంస్థ రాజమహేంద్రవరం ఎసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ పేర్కొన్నారు. 46వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఆయన ఓఎన్జీసీ రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్లో సోమవారం ప్రారంభించారు. భద్రత నియమాలు ప్రాణాలను కాపాడతాయనే నినాదంతో జాతీయ భద్రతా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సన్యాల్ మాట్లాడుతూ ఆయిల్ , గ్యాస్ నిక్షేపాలను కనుగొనడం, వెలికితీసే పరిశ్రమ హైరిస్క్తో కూడుకుందన్నారు. అయినప్పటికీ భద్రతా నియమాలను నిబద్ధతతో పాటిస్తున్నందునే ఓఎన్జీసీలో ప్రమాదాల సంఖ్య తక్కువన్నారు. ఓఎన్జీసీ ఎంతో అనుభవజ్ఞులైన మానవ వనరులను కలిగి అత్యంత సమగ్రమైన మౌలిక సదుపాయాలతో కూడి తమ ఆపరేషన్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రతే మొదటి ప్రాముఖ్యతగా పరిగణించే సంస్థగా ఓఎన్జీసీ నిరంతరం తన వద్ద పనిచేసే ఉద్యోగులకు భద్రతా సంబంధిత విషయాలలో శిక్షణ ఇస్తోందన్నారు. దేబశీష్ సన్యాల్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగులందరూ తమ కుటుంబ, తమ చుట్టూ ఉన్న సొసైటీ, సంస్థే కాకుండా జాతీయ అవసరాల దృష్ట్యా ప్రమాదాలను నివారించడంతో పాటు వ్యాధులు రాకుండా , పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఏడాది థీమ్ను దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఉద్యోగులు, సాధారణ ప్రజలతో పాటు స్కూలు పిల్లల్లో కూడా అవగాహన కలిగించడానికి వారం పాటూ సాగే పలు కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తోందన్నారు. ఈ నెల పదో తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. -
మరో బ్యాంకు మేనేజర్ చిక్కాడు!
ఢిల్లీ: నోట్ల మార్పిడి ప్రారంభమైన దగ్గర నుంచి బ్యాంకు అధికారుల అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఓ వైపు సామాన్యులు ఒక్క నోటు కోసం గంటల కొద్ది బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే.. కొదరు బ్యాంకు అధికారులు మాత్రం కట్టల కొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు. తాజాగా ఢిల్లీలో మరో బ్యాంకు అధికారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చిక్కాడు. ఢిల్లీ కేజీ మార్గ్లోని కొటక్ మహింద్రా బ్యాంకు బ్రాంచిలో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. డీమానిటైజేషన్ నేపథ్యంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అతడిపై అరోపణలు ఉన్నాయి. అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు
లబోదిబోమంటున్న బాధితురాలు అలహాబాద్ బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు హిందూపురం అర్బన్ : బ్యాంకు మేనేజర్నంటూ ఫోన్ చేసిన అపరిచితుడు ఖాతాదారురాలి ఏటీఎం కార్డుపై నంబర్ తెలుసుకుని, కాసేపటి తర్వాత రూ.9999 నగదు డ్రా చేసిన సంఘటన సోమవారం చూసింది. హిందూపురం పట్టణంలోని ఎంఎఫ్ రోడ్డులో నివాసముంటున్న రాజాబాయికి అలహాబాద్ బ్యాంకులో 50275179945 నంబరుతో అకౌంట్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో 73610 20259 నంబరు నుంచి ఫోన్కాల్ వచ్చింది. ‘నేను బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నా. మీ ఏటిఎం బ్లాక్ అయ్యింది. అది రిలీజ్ చేయడానికి కార్డుపై ఉన్న నంబరు చెప్పండి’ అని కోరడంతో ఆమె చెప్పేసింది. అదే రోజు సాయంత్రం కార్డు పనిచేస్తోందో లేదో చూద్దామని ఏటీఎం కేంద్రానికి వెళ్లింది. మినీ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోంచి రూ.9999 నగదు డ్రాయినట్లు స్లిప్ వచ్చింది. తిరిగి తనకు వచ్చిన సెల్నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని సమాధానం వచ్చింది. ఆందోళన చెందిన బాధితురాలు సోమవారం అలహాబాద్ బ్యాంకు మేనేజర్ను కలిసి తనకు జరిగిన మోసం గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పాస్బుక్ ఎంట్రీ చేయించుకోగా పీఓఎస్ మెషిన్ నుంచి పై మొత్తం డ్రా అయినట్లు కనిపించింది. ఏ ప్రాంతం నుంచి డ్రా అయ్యిందో విచారణ చేస్తామని మేనేజర్ తెలిపినట్లుబబాధితురాలు తెలిపింది. -
కట్టలు తెగిన ఆగ్రహం
- ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్ మేనేజర్పై ఉద్యోగుల దాడి - మూడు రోజుల సెలవుల తర్వాత కూడా నో క్యాష్ బోర్డు - మేనేజర్తో సహా సిబ్బందిని బయటికి లాగి బ్యాంక్ మూత - పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ కర్నూలు (అగ్రికల్చర్): వరుసగా మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకున్నా నగదు లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఖాతాల్లో డబ్బులున్నా చేతికందని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళవారం ఉదయం నగదు విత్డ్రాకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్కు తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే బ్యాంకు ఎదుట బారులుదీరారు. కాగా బ్యాంక్ తెరిచిన వెంటనే నో క్యాష్ అంటూ బోర్డు పెట్టడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎస్బీఐ చెస్ట్ నుంచి రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో వెనుక్కు వచ్చానని బ్యాంక్ మేనేజర్ కళ్యాణ్ కుమార్ చెబుతున్నా సహనం నశించిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యోగులు దాడికి యత్నించడంతో మేనేజర్ పరుగులు తీశారు. అయినా ఉద్యోగులు వదలలేదు.బ్యాంకులోకి మూకుమ్మడిగా ప్రవేశించి మేనేజర్తో వాగ్వాదానికి దిగారు. మేనేజర్తో సహా బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్దారు. మేనేజర్ను చొక్కా పట్టుకొని లాగి చేయి చేసుకున్నారు. అద్దాలను పగుల కొట్టారు. బ్యాంకు ఉద్యోగులను బయటికి లాగి బ్యాంకులో నగదు లేనపుడు తెరవడం ఎందుకు అంటూ బ్యాంకును మూసివేశారు. చివరికి పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అన్నీ అనుమానాలే: ఎస్బీఐ కరెన్సీ చెస్ట్కు మూడు రోజలు క్రితమే రూ.26 కోట్లు వచ్చాయి. అప్పటి నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెలవుల తర్వాత బ్యాంకు తెరిచినా నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కరెన్సీ చెస్ట్కు వచ్చిన రూ.26 కోట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న ఉత్పన్నఽమవుతోంది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎటీఎంతో పాటు మరో రెండు ఏటీఎంల్లోనే నగదు ఉంచారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలు వచ్చినా నో క్యాష్ బోర్డు పెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూపాయి కూడా తీసుకోని ఉద్యోగులు 400 మంది: ట్రెజరీ బ్రాంచ్లో 2500 మంది ఉద్యోగులకు ఖాతాలు ఉన్నాయి. నవంబరు నెల జీతాలు డిసెంబరు 1నే ఖాతాల్లో జమచేసినా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు ఉద్యోగులకు రూ.20వేల ప్రకారం పంపిణీ చేసినా మరుసటి రోజు నుంచి నగదు లభ్యతను బట్టి రూ.10వేల వరకు ఇస్తున్నారు. ఈనెల 13వ తేదీ నాటికి జీతంలో ఒక్క రూపాయి తీసుకోని వారు 400 మంది ఉన్నారు. వీరితో పాటు అనేక మంది బ్యాంకుకు భారీగా తరలివచ్చారు. అయితే నగదు లేదని బోర్డు పెట్టడంతో దాడికి కారణమైంది. పూర్తి స్థాయి నగదు వచ్చే వరకు బ్యాంక్ మూత: కళ్యాణ్కుమార్ మేనేజర్ ఉద్యోగుల కోసం బ్యాంక్ సిబ్బంది శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఉన్నంతలో బ్యాంకు ఎక్కువ మొత్తం తెచ్చి పంపిణీ చేస్తున్నాం. నగదు లభ్యతను బట్టి ప్రతి రోజు ఉదయమే బోర్డు పెడుతున్నాం. బ్యాంకు ఉద్యోగుల పట్ల దౌర్జన్యానికి పాల్పడటం ఆందోళన కలిగించింది. బ్యాంకుకు పూర్తి స్థాయిలో నగదు వచ్చే వరకు బ్యాంకు తెరిచేది లేదు. -
గిరిజనులపై దుందుడుకు వైఖరి తగదు
రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్పై అఖిల పక్ష నాయకుల నిరసన, రాస్తారోకో పరిష్కారానికి డీజీఎం హామీతో పరిస్థితి ప్రశాంతం రాజవొమ్మంగి : రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ జనార్థన్ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ ఖాతాదారులు, అఖిలపక్ష నేతలు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలకు రాస్తారోకో చేశారు. గిరిజనులను విసుక్కోవడం, పాస్ పుస్తకాలను విసిరికొట్టడం వంటి చర్యలతో రెండేళ్లుగా వేధిస్తున్నాడని ధ్వజమెత్తారు. తొలుత ఖాతాదారులు మేనేజర్ను కలసి మీ పద్ధతిని మార్చుకోవాలని కోరారు. ఇప్పటికే పెద్దనోట్లు చెల్లక ఖాతాదారులు, స్థానిక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు మీ తీరు మరింత బాధిస్తున్నదని వివరించారు. దీనితో మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తనకు రక్షణ కోరారు. పోలీసులు ఆప్రాంతానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో మేనేజర్ తీరును నాయుకులు, స్థానికులు సీఐ కేఎన్. మోహనరెడ్డి, తహశీల్దార్ పద్మావతి, ఎస్సై రవికుమార్లకు వివరించారు. అలాగే మేనేజర్ జనార్దన్ను కలసి అధికారులు సమస్య అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆంధ్రాబ్యాంకు డీజీఎంను ఫోన్లో సంప్రదించి ఆందోళన వివరించారు. దీనితో శుక్రవారం తాను స్వయంగా రాజవొమ్మంగి వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దాట్ల వేంకటేష్రాజు, చప్పా నూకరాజు, పార్టీ నేతలు శాంతకుమారి, చీడిపల్లి అప్పారావు, ముప్పన మోహన్ కుమార్, చప్పా నూకరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు చింతలపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ పేరిట కుచ్చుటోపి !
రూ. 20 లక్షలకు ఎసరు బీర్కూర్ : చిట్టీలు, ఫైనాన్సు పేరిట మోసాలు జరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది వ్యాపారులు, ఉద్యోగులు తమ డబ్బు వీలైనంత త్వరగా రెట్టింపు కావాలనే ఆశతో ప్రయివేటు ఫైనాన్సుల్లో భాగస్వాములుగా ఉంటూ మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే బీర్కూర్లో చోటుచేసుకుంది. బీర్కూర్లో 11 మంది స్నేహితులు కలిసి ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున 11 లక్షలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫైనాన్స్ను ప్రారంభించారు. నిర్వాహణ బాధ్యతను కొన్నేళ్లు బాగానే చూసుకున్న ఓ భాగస్వామి డబ్బుపై దురాశతో లెక్కలు బుట్టదాఖలు చేశాడు. అసలు, లాభం కలుపుకుని సుమారు రూ. 20 లక్షలకు కుచ్చుటోపి పెట్టాడు. భాగస్వాముల వాటా చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో వారు శుక్రవారం బీర్కూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తన రెండెకరాల పొలం అమ్మి భాగస్వాములకు బాకీ చెల్లిస్తానని సదరు వ్యక్తి కులపెద్దలతో రాయబారం పంపించాడు. ఈవిషయమై ఎస్సై రాజ్భరత్రెడ్డిని సంప్రదించగా సివిల్ కేసు పరిధిలోకి వస్తుందని, బాధితులు ఎలాంటి ఫిర్యాదు చే యలేదని పేర్కొన్నారు. బాధిత భాగస్వాముల్లో ఒకరిద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉండడం కొసమెరుపు. -
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
మిర్యాలగూడ అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ భాద్యత అని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కృష్ణహరి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్ఓఎం స్కీం కింద బస్టాండ్లో రూ. 6లక్షలతో నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో 11 బస్టాండ్లలో మరుగుదొడ్ల అవసరాన్ని గుర్తించామని మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, దేవరకొండలో ఇప్పటికే పూర్తయినట్లు పేర్కొన్నారు. నార్కట్పల్లి, భువనగిరి బస్టాండ్లలో నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 17 మినీ బస్సులను నడిపించాలని నిర్ణయించామని, అందులో డ్రైవర్ కం కండక్టర్గా ఒక్కరే ఉంటారని తెలిపారు. కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసీకి రూ.4.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు. అనంతరం అవరణలో పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్రావు, సీఐ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మునిసిపల్ తిమింగలాలు
పాలకొల్లు టౌన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం రూ.30 వేలు డిమాండ్ చేసిన మునిసిపల్ మేనేజర్ ఇందుకు సహకరించిన మునిసిపల్ గుమస్తాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెండ్గా పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన పాలకొల్లు పురపాలక సంఘంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు మునిసిపల్ కార్యాలయంలో శిలార ఆంజనేయ దుర్గాప్రసాద్ అటెండర్గా పనిచేస్తూ గత ఏప్రిల్ 13న గుండెపోటుతో మృతిచెందారు. అతని కుమారుడు హరీష్కు మునిసిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాలని మృతుని భార్య రమామణి మునిసిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా దీనికి సంబంధించిన ఫైల్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్ కాలయాపన చేస్తున్నారు. రూ.30 వేలు ఇస్తేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేశారు. దీనిపై మతుడు బావమరిది మునిసిపల్ లై్ర» రీలో అటెండర్గా పనిచేస్తున్న కటికిరెడ్డి చక్రధరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని రూ.30 వేలను చక్రధరరావుకు ఇచ్చి పంపారు. చక్రధరరావు ఈ మొత్తాన్ని తీసుకుని మునిసిపల్ కార్యాలయానికి రాగా గుమస్తా సి.గోపాలకృష్ణకు ఇవ్వాలని మేనేజర్ తారకనాథ్ సూచించారు. దీంతో సొమ్మును గోపాలకష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర మునిసిపాలిటీలో ఫైళ్లను పరిశీలించి కమిషనర్ కోనేరు సాయిరామ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంచం అడిగిన మునిసిపల్ మేనేజర్ ఎ.తారకనాథ్ను, సొమ్ము తీసుకున్న గుమస్తా గోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తారకనాథ్ గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లి మునిసిపల్ కమిషనర్గా పనిచేస్తుండగా ఓ వ్యవహారంలో లంచం తీసుకుంటూ దొరికిపోయాని ఏసీబీ అధికారులు తెలిపారు. పాలకొల్లు మునిసిపాలిటీ చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు ఇదే మొదటిది కావడం మునిసిపల్ ఉద్యోగుల్లో కలకలం రేపింది. -
భారత యువతిని పాక్ మేనేజర్ ఏం చేశాడంటే..
దుబాయి: తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఓ 19ఏళ్ల భారతీయ యువతి (గృహిణి)పై పాకిస్థాన్కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. దుబాయ్లోని రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్థాన్ మేనేజర్ ఉన్నాడు. గృహిణిగా పనిచేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ జాబ్ కోసం గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఓ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన పాకిస్థాన్ మేనేజర్.. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అక్కడే కంప్యూటర్కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడు చెప్పిన అడ్రస్కు వెళ్లాక అది కార్యాలయం కాదని, అతడి ఇళ్లు అని తెలిసింది. ఆ వెంటనే ఏవో మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను తన బెడ్ రూంలోకి తీసుకెళ్లిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై మే 26న తీర్పు వెలువరించనున్నారు. -
కార్మికుల దాడిలో మేనేజర్కు తీవ్రగాయాలు
నార్కట్పల్లి: మేనేజర్ తమపై ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడని భావించిన కార్మికులు అతడిపై దాడికి దిగిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కట్ పల్లి సమీపంలోని ఓసీటీఎల్ సంస్థలో జరిగిన ఈ ఘటనలో మేనేజర్కు తీవ్ర గాయాలయ్యాయి. టూల్ జెంట్ విభాగంలో పరికరం పాడు చేశారని కొంతమంది కార్మికుల పేర్లను మేనేజర్ యాజమాన్యానికి పంపాడు. దీంతో ఆగ్రహించిన కార్మికులు మధ్యాహ్నం విధులకు వచ్చిన సమయంలో మేనేజర్పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మేనేజర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సీసీఐ మేనేజర్ బదిలీ
గుంటూరు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆంధ్రప్రదేశ్ కార్యాలయ మేనేజర్ ఆర్.జయకుమార్ బదిలీ అయ్యారు. ఆయన్ని కోయంబత్తూరు కార్యాలయానికి బదిలీ చేస్తూ ముంబైలోని సీసీఐ ప్రధాన కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. గుజరాత్లోని రాజ్కోట్లో పనిచేస్తున్న మోహిత్శర్మను ఇక్కడికి బదిలీ చేశారు. గతేడాది సీసీఐ పత్తి కొనుగోళ్లులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నేపథ్యంలో జయకుమార్ను, విజిలెన్స్ అధికారి నాయర్ను, ముగ్గురు సీసీఐ బయ్యర్లను బదిలీ చేశారు. నాయర్ను ముంబైకి, అక్కడ పనిచేస్తున్న భట్ను ఇక్కడికి మార్చారు. కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న బయ్యర్లు రాజశేఖరరెడ్డి, వరుణ్రఘువీర్లను తెలంగాణలోని అదిలాబాద్, వరంగల్లకు, గుంటూరు జిల్లాలోని క్రోసూరు మార్కెట్ యార్డుల్లో బయ్యరుగా పనిచేస్తున్న రాయపాటి పూర్ణచంద్రరావును ఒడిశాలోని రాయఘడ్కు బదిలీ చేశారు. మేనేజరు మోహిత్శర్మ రెండు, మూడు రోజుల్లో గుంటూరులో బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం
-
ఆంధ్రా బ్యాంకులో చోరీకి యత్నం
- కిటికీ, సీసీ కెమెరాల ధ్వంసం - సైరన్ మోగడంతో పరారైన దొంగలు - పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్ పిట్లం : మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు ఒంటిగంట ప్రాంతంలో దొంగలు కిటికీ ఊచలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. అనంతరం లాకర్ తలుపులను తెరవడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు సైరన్ మోగింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దొంగలు పారిపోయూరు. బ్యాంకులోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ సంఘటనలో ఇద్దరు దొంగలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందురోజు బ్యాంకు కిటికీ తలుపులను సిబ్బంది పెట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. చోరీ జరగకపోవడంతో ఖాతాదారులు, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఆది వారం మేనేజర్ ఎన్వీ.సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో డబ్బు చోరీకి గురికాలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమెదర్ కోన వెంకట్రెడ్డి పేర్కొన్నారు.