moinabad
-
కోడి పందేల నిర్వహణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణకు సంబంధించి మొయినాబాద్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఫామ్హౌస్లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్హౌస్పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్హౌస్ను శివ కుమార్ వర్మ లీజ్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండమొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్హౌస్పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. -
త్వరలో తెలంగాణ పోలీస్ లో చేరనున్న ఈగిల్ స్క్వాడ్
-
బీజేపీ నేతల లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
అర్ధరాత్రి ముజ్రా పార్టీ
-
మొయినాబాద్లో అర్ధరాత్రి ముజ్రా పార్టీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం సురంగల్లోని ఓ ఫామ్హౌస్లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది అబ్బాయిలతో పాటు నలుగురు అమ్మాయిలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా అమ్మాయిలు, అబ్బాయిలను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలను, అబ్బాయిలను అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. -
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నోడే వేధించాడు!
మొయినాబాద్: ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అదనపు కట్నం కోసం వేధించడంతో ఇంట్లోనే ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్కు చెందిన నర్లకంటి మల్లేశ్ కూతురు కల్పన(22) బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.నగరంలోని ఆసిఫ్నగర్కు చెందిన వారి బంధువు బైరంపల్లి శ్రీశైలం కొంత కాలంగా కల్పనను ప్రేమించాడు. గత ఏడాది అక్టోబర్ 29న ఇద్దరూ ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఒప్పందంతో ఈ ఏడాది ఫిబ్రవరి 11న హిందూ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి చేశారు. అప్పటి నుంచి శ్రీశైలం కుటుంబం మొయినాబాద్ మండలంలోని హిమాయత్నగర్లో నివాసం ఉంటోంది.కాగా కల్పన ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన శ్రీశైలం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు అదనపు కట్నంగా స్విఫ్ట్ కారు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అతనికి తల్లి స్వరూప, బాబాయి రాజు సైతం సహకరించి కల్పనను వేధించారు. వారి వేధింపులు భరించలేక శనివారం రాత్రి ఆమె ఇంట్లోనే చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొయినాబాద్ యువతి కేసులో ట్విస్ట్.. ఎస్సై సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్లో యువతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. బాకరం గ్రామ పరిధిలో సోమవారం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్గా (22) గుర్తించారు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. జనవరి 8వ తేదీని ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానంత తానుగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవపడి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. వెలుగులోకి కొత్త విషయాలు పోలీసుల విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన తరువాత సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులకు.. ఒక ఆటో అక్కడి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో పోలీసులు ఆటో నడిపిన వ్యక్తిని గుర్తించి విచారించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపమని యువతి కోరిందని.. తాను అలాగే అక్కడ దించేసి వెళ్లినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తరువాత ఎం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్యకు ఒక రోజు ముందే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్తోపాటు చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులతో కలిసి లో బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించాయి. పోలీసుల నిర్లక్ష్యం.. సీపీ ఆగ్రహం ఈ కేసులో హబీబ్ నగర్లో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్ కనిపించకుండా పోగా.. పదో తేదీనా యువతి సోదరుడు హబీబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో హైదరాబాద్ సీపీ స్వయంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హబీబ్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పారు. హబీబ్ నగర్ ఎస్సై సస్పెండ్ మొయినాబాద్ యువతి మృతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీరియస్ అయ్యారు. ఘటనలో మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మోమో జారీ చేసినట్లు తెలిపారు. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మొయినాబాద్ యువతి హత్య కేసు
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి హత్య కేసులో సస్పెన్స్ వీడటం లేదు. నాలుగు రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు జాగ్రత్తపడటంతో కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు .హత్య చేసి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరు, ఎందుకు చంపారు, అసలు చంపిదెవరు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలేం జరిగిందంటే..మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కు వెళ్ళే మార్గంలో సోమవారం పట్టపగలే యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టారు.మంటల్లో కాలిపోతున్న గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ లభించగా.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఏడు బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నా.. వివరాలు తెలియరావడం లేదు. బాధితురాలి ఫోన్ లభించినా.. అందులో సిమ్కార్డు తొలగించడం, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ ఫిర్యాదు అందకపోవడంతో కేసును ఛేదించడం కష్టతరంగా మారుతోంది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తులో ఆలస్యం అవుతుందని ఇటు పోలీసులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ జల్లెడపడుతోంది. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది.ఒక దారిలో వచ్చి మరో దారిలో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు. -
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్లోని బౌల్డర్హిల్స్లో గోల్ఫ్కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్షిప్లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
Police Dogs: బాంబులను పసిగట్టి.. నేరగాళ్ల పనిపట్టి...
సాక్షి, హైదరాబాద్: పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, నేరగాళ్ల జాడలను చిటికెలో పట్టేస్తాయి... కదులుతున్న వాహనాల్లోంచి సైతం దూకి ‘టార్గెట్’ను అడ్డుకుంటాయి... శిక్షకుడి కమాండ్స్ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతోపాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి... ఎన్నిసార్లు మొరగమంటే అన్నిసార్లే మొరుగుతాయి... ఇదీ మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైౖ నింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ పొందిన పోలీసు జాగిలాల సామర్థ్యం. ఎనిమిది నెలల సుదీర్ఘ శిక్షణ అనంతరం ఐదు జాతులకు చెందిన 48 జాగిలాలు, 64 మంది శిక్షకుల 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ తాజాగా ఐఐటీఏలో జరిగింది. వీటిలో 36 జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందినవి కాగా మిగిలిన 12 అరుణాచల్ప్రదేశ్వి. ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాలపై ప్రత్యేక కథనం. సగం సమయం మచ్చిక కోసమే... ప్రతి పోలీసు జాగిలానికీ ఇద్దరు వరకు హ్యాండ్లర్స్ ఉంటారు. జాగిలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడే వీరినీ ఎంపిక చేస్తారు. జాగిలంతో కలిపే వీరికి సైతం శిక్షణ ఉంటుంది. మొత్తం 8 నెలల శిక్షణా కాలంలో 2 నెలలు హ్యాండ్లర్కు జాగిలానికీ మధ్య సఖ్యత కలి్పంచడానికి, మరో 2 నెలలు జాగిలాన్ని హ్యాండ్లర్ మచి్చక చేసుకోవడానికి కేటాయిస్తారు. మిగిలిన నాలుగు నెలల్లోనే వివిధ రకాల శిక్షణ ఇస్తారు. శిక్షణలో 4 రకాలు.. లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మలినాయిస్, బీగల్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్మ్యాన్, కోకోర్ స్పానియల్ జాతి శునకాల్లోని సహజ లక్షణాలు, పనితీరు, సమకాలీన అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు విభాగాల్లో శిక్షణ ఇస్తుంటారు. ఒక రకమైన సేవలకు తర్ఫీదు పొందిన జాగిలం మరో పనికి ఉపకరించదు. పేలుడు పదార్థాలు/అనుమానిత వస్తువుల గుర్తింపు, నేర పరిశోధన, మాదకద్రవ్యాల గుర్తింపు, ముష్కరులపై దాడి చేసే సామర్థ్యంలో 4 నెలలపాటు శిక్షణ 48 జాగిలాలకు సాగింది. జాతీయ భాషలోనే కమాండ్స్... జాగిలాలకు ఇచ్చే కమాండ్స్లో 95 శాతం హిందీలోనే ఉంటాయి. కేవలం రెండు మాత్రం ఆంగ్లంలో ఉంటాయి. ఎదుటి వారికి నమస్కరించడానికి ‘సెల్యూట్’, పడుకొని గుండ్రంగా దొర్లడానికి ‘రోల్’పదాలు వినియోగిస్తారు. వీటితోపాటు అరుదుగా మాత్రమే సిట్, కమ్, స్టాండ్ వంటి ఆంగ్ల పదాలు వాడుతున్నారు. మరికొన్ని ప్రత్యేకతలు... ► ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్ని సైతం ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్ లేదా మాస్టర్ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా ఈ శిక్షణ ఇస్తారు. ► చైనా, పాకిస్తాన్ తదితర దేశాల పటాల మధ్య ఉన్న ఇండియా మ్యాప్ను స్పష్టంగా గుర్తించడంతోపాటు రెండు కాళ్లు పైకెత్తి నమస్కరిస్తాయి. వాటి జ్ఞాపక, సంగ్రహణ శక్తులకు ఉదాహరణ ఇది. ► పాకిస్తాన్ లోని అబోటాబాద్లో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనడంలో అమెరికా నేవీ సీల్స్కు దోహదపడ్డ బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగంలోనూ ఉన్నాయి. 2015 నుంచి అందుబాటులోకి వచి్చన వీటిని మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ ఇచ్చి, వినియోగిస్తున్నారు. ► మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు బీగల్ జాతి జాగిలాలను అందుబాటులోకి తీసుకువచి్చన తొలి పోలీసు విభాగంగా తెలంగాణ రికార్డులకెక్కింది. ► ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా విభాగమైన ఆక్టోపస్లో 2015 నుంచి బెల్జియం మలినాయిస్ జాగిలాలను వాడుతున్నారు. ఈ జాగిలాలకు పెట్టే పేర్లు, హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలు (కమాండ్స్/కాషన్స్) గరిష్టంగా మూడు అక్షరాలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో అత్యధికం రెండు అక్షరాలతో కూడినవే ఉంటాయి. జాగిలం గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు, తక్కువ సమయంలో ఆదేశం పూర్తి చేయడానికి ఈ ప్రమాణాలను నిర్దేశించుకున్నారు. చదవండి: మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్! -
ఫామ్హౌజ్ కేసు.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలో జరిగిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలు చేసిన వాళ్లు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదు. నేనంటే ఎవరికీ తెలియదు. కానీ, తెలంగాణలో ప్రతీ ఇంటికి నా పేరు తీసుకెళ్లారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా డబ్బులు పంపుతున్నారంటూ విమర్శించారాయన. -
ఫౌంహౌస్ కేసులో రామచంద్రభారతి, నందు విడుదలకు లైన్ క్లియర్
-
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్హౌస్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? -
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ). పిటిషనర్కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్లాన్తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు. ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు -
ఫామ్ హౌస్ లీక్స్..
-
ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాల కూల్చివేత చిన్న విషయం కాదు : కేసీఆర్
-
గన్ షాట్ : అమ్ముడు ..కొనుడు ..ఇదేనా నయా రాజకీయం..?
-
ఎడిటర్ కామెంట్ : ఫామ్ హౌస్ వ్యవహారం పై ఆశ్చర్యపోని ప్రజలు ..!
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో ట్విస్ట్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భిన్నమైన తీర్పులు
-
మొయినాబాద్ ఫామ్హౌస్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్హౌస్ కేసులో పోలీసుల పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతిచ్చింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఆ వెంటనే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేపట్టిన మరో బెంచ్.. దర్యాప్తుపై స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. చదవండి: (దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) -
ఫార్మ్ హౌస్ హైడ్రామాపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి రఘునందన్రావు ఫిర్యాదు
-
సైబరాబాద్ పోలీసుల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ
-
ఈడీ ఆఫీస్కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు! -
స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
-
ఎమ్మెల్యేల ఎపిసోడ్.. స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్ హాట్టాపిక్గా మారింది. రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్హౌజ్ మీటింగ్కు ముందు రామచంద్రభారతితో రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నమస్తే స్వామీజీ ఎలా ఉన్నారు. స్వామీజీ: బాగున్నాను. మీరెలా ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నేను బాగున్నాను. స్వామీజీ: నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్తో మాట్లాడతాను. ఇప్పటికే మాట్లాడాను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: హా స్వామిజీ స్వామీజీ: పేరు పంపితే బాగుంటుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి:పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం. ఇప్పటికి ఇద్దరు కర్ఫర్మేషన్ ఇచ్చారు. కలిసి మాట్లాడితే బాగుంటుంది స్వామిజీ. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం. స్వామీజీ: మీరు నెంబర్-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: నెంబర్ 2 ముందు పేర్లు చెబుతాను. ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు. స్వామీజీ: నెంబర్-1, నెంబర్-2.. బీఎల్ సంతోష్ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు. బీఎల్ సంతోష్ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ.. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా బీఎల్ సంతోషే తీసుకుంటారు. స్వామీజీ: సంతోష్తో కలిసి మనం నెంబర్-2 దగ్గరకు వెళదాం. ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది. స్వామీజీ: 24వ తేదీ వరకు నేను బెడ్ రెస్ట్లో ఉండాలి. తర్వాత నేను హైదరాబాద్ వస్తాను. వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం స్వామీజీ: 25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆ తర్వాత కలుద్దాం. స్వామీజీ: 26 తర్వాత ఎక్కడైనా కలుద్దాం.. హైదరాబాద్లో మాత్రం వద్దు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: సమస్య ఏంటంటే స్వామీజీ, ప్రస్తుతం ఎలక్షన్ ఉంది కదా వాళ్లు మమ్మల్ని గమనిస్తున్నారు. సో హైదరాబాదే మంచి ప్లేస్. స్వామీజీ: అలాగే, అలాగే హైదరాబాద్లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: స్వామిజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా.. స్వామీజీ: నేను డైరెక్టుగా బీఎల్ సంతోష్తోనే మాట్లాడతా.. మధ్యవర్తులు ఎవరూ లేరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి: దయచేసి ఇదంతా టాప్సీక్రెట్గా పెట్టండి.. లేకపోతే నాపనైపోతుంది. స్వామీజీ: ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము కవర్ చేస్తాం. మేం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. స్వామీజీ: ఈడీ నుంచి ఐటీ వరకు, మీ భద్రతను కూడా మేముచూసుకుంటాం స్వామీజీ: మీరంతా మా స్కానర్లో ఉన్నారు.. మీరేమి కంగారుపడొద్దు -
మా పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేశాం
-
నందకుమార్తో పరిచయాలు ఉన్నాయి.. కానీ: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారినైనా చేర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్తో తమకు పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి.. పోతే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. వేరే పార్టీ నుండి వచ్చిన వారిని మంత్రులు చేశారు. బీఎస్పీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదువులు ఇచ్చారు. కాంగ్రెస్కు చెందిన 12 మందిని టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కట్టుకథలు అల్లారు. ముందు రూ. 100 కోట్లు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు అన్నారు. ఆ నలుగురు మా పార్టీలో చేరితే ప్రభుత్వం పడిపోతుందా?. నందకుమార్ తెలుసు కానీ నా అనుచరుడు కాదు. ఆయన ఎంపీ సంతోష్కు సన్నిహితుడు. కేసీఆర్ ప్రెస్మీట్ ఢిల్లీలో కాకుంటే లండన్లో పెట్టుకోవచ్చు.’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్ -
యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్
-
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్
సాక్షి, యాదాద్రి భువనగిరి: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే తమకు ఆ అవసరం లేదని, మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటన కేసీఆర్ కుట్ర అని బీజేపీ వాదిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టాయి. తాజాగా టీఆర్ఎస్, బీజేపీ హైడ్రామా నేపథ్యంలో యాదాద్రిలో టెన్షన్ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాసేపట్లో యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. భారీ కాన్వాయ్తో బయల్దేరారు. ఫాంహౌజ్ వ్యవహారంపై ప్రమాణానికి సిద్ధమని ఆయన తెలిపారు. ప్రమాణం చేయడానికి కేసీఆర్ రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకున్నా యాదాద్రి వెళ్తానని బండి సంజయ్ తెగేసి చెబుతున్నారు. మరోవైపు యాదాద్రిలో టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి సంజయ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలతో మొత్తానికి యాదాద్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ -
MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది. దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో టీఆర్ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడం, దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను కూడా హైకమాండ్ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ విచారణ.. కోర్టుల్లో పోరాటం.. టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న అంశం గురువారం ఢిల్లీలో హాట్టాపిక్గా మారింది. టీఆర్ఎస్ ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని లాగుతోందని భావించిన పార్టీ పెద్దలు.. దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కుదరని పక్షంలో కోర్టుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా పోరాటం చేయాలని సూచించినట్టు వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ గురువారం హైకోర్టును ఆశ్రయించిందని అంటున్నాయి. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవాలని నేతలకు హైకమాండ్ సూచించినట్టు తెలిసింది. ‘తెలంగాణలో మరో ఎనిమిది, తొమ్మిది నెలలైతే సాధారణ ఎన్నికలున్న సమయంలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేస్తారా? అదీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా?’అన్న దానిపై విస్తృత చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ‘కొనుగోళ్ల వ్యవహారం అంతా బోగస్. కేసీఆర్ ఆడుతున్న డ్రామా. పోలీసులు దీనికి సహకరిస్తున్నారు. ఫామ్హౌస్ ఎవరిది? డబ్బు ఎక్కడిది? ఎవరు ఎవరితో మాట్లాడారనే ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్కు ఎలా తరలించారు? బేరసారాలపై ఎమ్మెల్యేలను ప్రగతిభవన్లో విచారిస్తున్నారా? లేక ప్రగతిభవన్ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారా?’’అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు వెల్లడించారు. నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయని.. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేశాక పార్టీ అంత సులువుగా దీనిని వదిలిపెట్టదని పేర్కొన్నారు. రంగంలోకి కేంద్ర హోం శాఖ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం, వందల కోట్ల డీల్ జరిగినట్టు కథనాలు వస్తుండటంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఐబీ, ఐటీ, ఈడీలనూ అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని ఇప్పటికే ఏజెన్సీలను కోరినట్టు నేతలు చెబుతున్నారు. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే అవి ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్టు పేర్కొంటున్నారు. కేంద్ర సంస్థలు ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్హౌజ్ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. టీఆర్ఎస్ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్హౌజ్లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తు న్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? నిందితులను రిమాండ్కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు వివరించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి. ప్రగతిభవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్హౌజ్ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్రెడ్డి(కొల్లాపూర్), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్హౌజ్లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి. చదవండి: ఫామ్హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్ ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తెలంగాణాలో ఫామ్ హౌస్ ట్రేడ్ ప్రకంపనలు
-
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టు తిరస్కరణ
-
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టులో బీజేపీ పిటిషన్
-
మొయినాబాద్ ఫామ్హౌజ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని కోరింది. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్లో బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురిచేసే క్రమంలో భారీ ఆపరేషన్ను చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్హెచ్వో, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పిటిషనర్ పేర్కొనగా.. ఈ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దర్యాప్తు ముమ్మరం మరోవైపు ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ కేసులో.. దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఫాంహౌజ్ లో క్లూస్ టీం తనిఖీలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ సీఐల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరన్న కోణంలో దర్యాప్తును సాగిస్తున్నారు. ఇప్పటికే ఆడియో, వీడియో సహా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
ఫామ్ హౌస్ డీల్ పై కేసు నమోదు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. తమ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుండగా.. తమకు అలాంటి అవసరమే లేదని బీజేపీ చెబుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్ దృశ్యాలు రికార్డయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఫామ్హౌజ్లో గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాడీవోర్న్ కెమెరాలో సంభాషణ దృశ్యాలు రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి చివరకు రంగంలోకి దిగారు. చదవండి: బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 8. సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్హౌజ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులను లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫామ్హౌజ్లోనే ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగధీశ్వర్ రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌజ్కు చేరుకున్నారు. పట్టుబడ్డ కారు, నగదు సైతం అక్కడే ఉంది. చదవండి: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనపై గురువారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసులో కీలకంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రగతిభవన్లోనే ఉన్నారు. బేరసారాల ఆడియో టేపులు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో.. వాటిని కూడా మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్కే.. కేసీఆర్తో ఆ నలుగురు భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఈ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు. అనంతరం రోహిత్రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్కు చేరుకుంది. రోహిత్రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్కు చేరుకున్నారు. కేసీఆర్తో ‘ఆ నలుగురు’ భేటీ.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు! టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో.. రోహిత్రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్హౌజ్ను నిర్మించారు. ఔటర్ రింగ్రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్హౌజ్ ఉంటుంది. రోహిత్రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పూజల కోసమే వచ్చాం: నందకుమార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్లోని సరూర్నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు. బ్యాగులు తెరవకుండానే.. మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్హౌస్ వద్ద హైడ్రామా సాగింది -
అదే బావి.. నాడు భర్త, నేడు భార్య
సాక్షి, మొయినాబాద్ (రంగారెడ్డి): రెండేళ్ల క్రితం భర్త.. ప్ర స్తుతం భార్యను ఒకే బావి బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి పంచాయతీ అనుబంధ గ్రామం చాకలిగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం చాకలిగూడకు చెందిన దగ్గుల వినోద (30) మంగళవారం పనిచేయంకోసం వ్యవ సాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు జారిపడింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను గమనించలేదు. మంగళవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం బావిలో వినోద మృతదేహం తేలి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండేళ్ల క్రితం వినోధ భర్త శ్రీనివాస్ కూడా అదే బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. చదవండి: (మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి) -
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర (ఫొటోలు)
-
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్హౌజ్లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్హౌజ్కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
అశ్రునయనాల మధ్య ముగిసిన రారాజు అంత్యక్రియలు
Krishnam Raju Last Rites At Moinabad Latest Updates: ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. ఆశ్రునయనాల మధ్య ఆయనకు కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు. ►ప్రారంభమైన అంత్యక్రియలు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రలను మాత్రమే ఫామ్హౌజ్లోకి అనుమతించారు. ఇక కృష్ణంరాజుకు ప్రభాస్తో పాటు మిగతాకుటుంబసభ్యులు కడసారి వీడ్కోలు పలికారు. . ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లిహిల్స్లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్ ఫామ్హౌజ్కు అంతిమ యాత్ర మొదలైంది. కడసారి చూపు కోసం ఆయన అభిమానులు దారిపొడవునా ఎదురుచూస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో కృష్ణంరాజు ఫామ్హౌజ్లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలివస్తున్నారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంసభ్యులు,బంధువులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తొలుత భావించినా, పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ► మొయినాబాద్ కనకమామిడిలో ఉన్న ఫాంహౌజ్లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ► ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. ► బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ► అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్కు అంతిమయాత్ర చేరుకుంటుంది. ► దారిపొడవునా ఉన్న రెబల్స్టార్ ఫ్యాన్స్.. పూలు జల్లుతూ నివాళులర్పిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.. -
హైదరాబాద్: ఫాంహౌస్పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఓ ఫాంహౌస్పై శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. పది మంది విదేశీయులు, నలుగురు నగరవాసులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన కీషబ్ డేవిడ్ హైదరాబాద్కు వచ్చి టోలిచౌకిలో నివాసం ఉంటోంది. ‘కూల్ బైదీ కూల్’ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆన్లైన్లో ఓ యాడ్ అప్లోడ్ చేసింది. రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లిస్తే బీరు ఫ్రీ అంటూ యాడ్లో పేర్కొంది. ఇందుకుగాను మొయినాబాద్ మండలం, శ్రీరాంనగర్ రెవెన్యూలో ఉన్న న్యూ గ్రీన్ ఫాంహౌస్ను అద్దెకు తీసుకుంది. పారీ్టకి వెళ్లేందుకు సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ మూసా ఉమర్, అబ్దుల్ బాసిత్ హమీద్ అలీ, అబ్దుల్ కరీంవాడి ఇస్మాయిల్, కెన్యాకు చెందిన ఖతీబ్, కాంగో దేశానికి చెందిన కింపలో మయిండో, చాంద్ దేశానికి చెందిన అబకాకా, కేమరూన్ దేశానికి చెందిన గంజి, టాంజానియా దేశానికి చెందిన సౌము మహ్మది, బత్రోమేవ్ విట్నెస్ విల్లి, హైదరాబాద్కు చెందిన వాసింఖాన్, సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ అమీద్, అనుగుల వంశీ బుక్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఫాంహౌస్కు చేరుకున్నారు. పార్టీ జరుగుతుండగా శనివారం తెల్లవారు జామున శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఫాంహౌస్పై మెరుపుదాడి చేశా రు. నిర్వాహకురాలితో పాటు పది మంది విదేశీయు లు, నలుగురు నగర యువకులను, ఫాంహౌస్ నిర్వాహకుడు నిహల్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. 120 బీరు బాటిళ్లు, నాలుగు ఓడ్కా బాటిళ్లు, ఐదు రకాల హుక్కా ఫ్లేవర్స్, సెల్ ఫోన్లు, స్విఫ్ట్ కారును స్వాదీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు -
రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజు లకే నూరేళ్లు నిండాయి. బైక్ను యూ టర్న్ను తీసుకుంటుండగా ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొయినాబాద్మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కుమ్మరి పరంధామ(23) ప్రగతి రిసార్ట్స్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి గతనెల 25న వివాహం జరిగింది. మొయినాబాద్ మండలం జీవన్గూడలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు ఆదివారం రాత్రి వచ్చాడు. ఫంక్షన్కు వచ్చిన బంధువులను హిమాయత్నగర్ చౌరస్తాలో దింపేందుకు సోమవారం సాయంత్రం బైక్పై వచ్చాడు. వారిని దింపి తిరిగి జీవన్గూడకు వెళ్లేందుకు చౌరస్తాలో బైక్ యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో మండల పరిధిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన బస్సు నగరం వైపు అతివేగంతో వెళ్తూ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడిపోవడంతో నడుము భాగం పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సుకు చెందిన ప్రైవేట్ కళాశాల ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: కేఏపాల్తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’ -
పెళ్లయిన 21 రోజులకే భర్త రెండో పెళ్లి.. మొదటి భార్యకు తెలియడంతో..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన ఇరవై రోజులకే ఓ ప్రబుద్ధుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి విషయం భార్యకు తెలియడంతో ఐదు నెలలుగా ఆమెను మభ్యపెడుతూ వచ్చాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను వేధిస్తుండడంతో తట్టుకోలేక గురువారం మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఎస్ఐ శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నమంగళారానికి చెందిన మురళీకి 2021 నవంబర్ 25న నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. మురళి అదే సంవత్సరం డిసెంబర్ 13న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం భార్య లావణ్యకు తెలియడంతో నిన్న బాగా చూసుకుంటానంటూ ఐదు నెలలుగా మభ్యపెడుతూ వచ్చాడు. ఇటీవల భర్త మురళీతోపాటు అత్త, ఆడపడుచులు వేధింపులు మొదలు పెట్టారు. తట్టుకోలేక లావణ్య గురువారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే.. -
జుట్టుపట్టి.. చితగ్గొట్టి.. మహిళపై విచక్షణారహిత దాడి
సాక్షి, మొయినాబాద్: ప్లాటు పక్కనుంచి వేస్తున్న సీసీ రోడ్డు విషయంలో గొడవపడి ఓ మహిళపై దాయాదులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆరు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మండల పరిధిలోని మేడిపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన కావలి భాగ్యమ్మకు చెందిన ప్లాటులో నుంచి వారి దాయాదులు కారోబార్గా పనిచేస్తున్న కావలి అశోక్, అతని భార్య వార్డు సభ్యురాలు కల్పన ఇంటికి పైప్లైన్ వేశారు. ఆ ప్లాటు పక్కనుంచి సీసీ రోడ్డు వేస్తున్నారు. ఈ నెల 10న సీసీ రోడ్డు పనులు జరుగుతుండగా తన ప్లాటులో నుంచి పైప్లైన్ వేయడంతో గుంత ఏర్పడిందని.. సిమెంటు వేసి దాన్ని పూడ్చాలని కోరింది. రోడ్డు పనులు చేస్తున్న కారోబార్ అశోక్, వార్డు సభ్యురాలు కల్పన, భాగ్యమ్మతో గొడవకు దిగారు. మాటామాట పెరిగి గొడవ పెద్దది కావడంతో అశోక్ ఆమెను తోసేశాడు. అశోక్, కల్పన, వారి కొడుకు భాగ్యమ్మను కింద పడేసి విచక్షణారహితంగా కొట్టారు. అదే రోజు బాధితురాలు మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం విచారణ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నుంచి ప్రతీ రోజు బాధితురాలు పోలీస్స్టేషన్కు తిరుగుతున్నా పోలీసులు స్పందించలేదు. దీంతో శుక్రవారం బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. పోలీసులు పట్టించుకోకుంటే పోలీస్స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపింది. అప్పుడు స్పందించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం కేసు నమోదు చేసి విచారణకు వెళ్లారు. ఇరువర్గాల వారు ఫిర్యాదు చేశారు మేడిపల్లిలో ప్లాటు పక్కన వేస్తున్న సీసీ రోడ్డు విషయంలో ఇరువర్గాలు గొడవపడ్డాయి. ఇరువర్గాలవారు ఫిర్యాదు ఇచ్చారు. గ్రామంలోనే మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారు. కానీ మేము కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటాం. – లక్ష్మీరెడ్డి, ఇన్స్పెక్టర్ మొయినాబాద్ -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్లు.. రెచ్చిపోతున్న పోకిరీలు
సాక్షి, రంగారెడ్డి: పగలు ప్రశాంతంగా ఉండే పల్లెలు చీకటైతే చాలు గానాబజానా.. డీజే చప్పుళ్లతో హోరెత్తుతున్నాయి. ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వేడుకల పేరుతో మద్యం, హుక్కా, గంజాయి మత్తులో తూలుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. నగరాల్లోనే కనిపించే పాడు కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. పేకాట, కోళ్ల పందేలు, రెయిన్ డాన్స్, ముజ్రా పార్టీలకు సైతం ఫాంహౌస్లు వేదికలవుతున్నాయి. పా ర్టీల పేరుతో నిర్వహించే ఈవెంట్లతో యువత పెడ దారి పడుతోంది. నగరానికి అతి చేరువలో ఉన్న శివారు ప్రాతాల్లో వేల సంఖ్యలో ఫాంహౌస్లు ఉ న్నాయి. నిత్యం ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నా రు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు. మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొత్తూరు, షాద్నగర్, మహేశ్వరం, కందుకూ రు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ఫాంహౌస్లలో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది. పోకిరీలతో ఇబ్బందులు.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫాంహౌస్లు గ్రామాలకు అతి చేరువలో ఉండడంతో గానా బజానాల్లో మునిగి తేలుతున్నాయి. పోకిరీలు మద్యం మత్తులో గ్రామాల్లోకి వచ్చి గొడవలకు దిగుతున్నారు. డీజే సౌండ్స్, గొడవలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మొయినాబాద్ మండలం చిన్నషాపూర్లోని ఓ ఫాంహౌస్లోకి వచ్చిన పోకిరీలు అర్థరాత్రి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారిపై దాడికి తెగబడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వారం రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అనుమతులు లేకుండా.. నగరానికి చేరువలో ఫాంహౌస్లు నిర్మించి వాటిని ఆన్లైన్ ద్వారా అద్దెకిస్తున్నారు. ఏదైనా వేడుక చేసుకోవాలనుకున్నవారు ఆన్లైన్లో బుక్చేసుకుంటారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మద్యం వినియోగం కొనసాగుతోంది. దీనికి తోడు హుక్కా, గంజాయిని సైతం వినియోగిస్తున్నారు.మూడు నెలల క్రితం ఓ ఫాంహౌస్లో జరిగిన జన్మదిన వేడుకల్లో గంజాయి వినియోగిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇటీవల షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లోనూ గంజాయి పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతున్నా ఎక్సైజ్, స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి తీసుకోవాలి.. ఫాంహౌస్లలో చిన్నచిన్న వేడుకలు, పార్టీలు జరిగితే యజమానులు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. పార్టీలు, ఈవెంట్లు జరిగినప్పుడు మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తే చర్యలు తప్పవు. – రాజు, ఇన్స్పెక్టర్, మొయినాబాద్ -
పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..
సాక్షి, మొయినాబాద్: ఓ దొంగ పోలీసులకే షాక్ ఇచ్చాడు. ఎక్కడో చాటుమాటున దొంగతనం చేస్తే కిక్ ఏముంటుందనుకున్నాడో ఏమో... ఏకంగా ఠాణా ఎదుట నిలిపి ఉంచిన స్కూటిని అపహరించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన మంగలి నర్సింలు ఓ కేసు విషయంలో మూడు రోజుల క్రితం మొయినాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీస్స్టేషన్ ఎదుట తన టీవీఎస్ స్కూటీని పార్కుచేసి లోపలికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చి చూడగా స్కూటీ కనిపించలేదు. కొద్దిదూరంలో మరో స్కూటీ పార్కుచేసి ఉంది. మళ్లీ.. మళ్లీ రావొద్దు తన స్కూటీ పోయిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి దానిని పోలీస్స్టేషన్ ఎదుట పార్కుచేసి నర్సింలు స్కూటీని తోసుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమరాల్లో రికార్డు అయింది. రెండు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను బాధితుడి చేతిలో పెట్టారు. తన స్కూటీ కోసం నర్సింలు రోజూ పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతుండడంతో మళ్లీమళ్లీ రావద్దని.. స్కూటీ దొరికినప్పుడు పిలుస్తామని పోలీసులు చెప్పి పంపడం గమనార్హం. పోలీస్స్టేషన్ ఎదుట వదిలేసి వెళ్లిన స్కూటీ ఎవరిదనే విషయమై ఆరా తీస్తే అది ఆంధ్రప్రదేశ్కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. పోలీస్స్టేషన్ ముందు నుంచి స్కూటీ చోరీకి గురవగా.. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి దొంగిలించారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయడం గమనార్హం. చదవండి: న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్ -
దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..
సాక్షి, రంగారెడ్డి(మొయినాబాద్): ‘దేవుడా ఎందుకీ కడుపుకోత.. ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్తావా..? నేనేం పాపం చేశా..’ అని ఓ మాృతమూర్తి గర్భశోకంతో తల్లడిల్లింది. వరుసగా రెండు రోజులు వారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయాలను కలచివేసింది. అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నాన్న కూతురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కడుపుకోతను చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) వివరాలు.. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన మోర వెంకటేశ్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్ మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా స్నేహితులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్ కూతుళ్లు ప్రేమిక (16), సౌమ్య (20), వారి చిన్నాన్న కూతురు అక్షయ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో అతివేగంతో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందగా, సౌమ్య, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా.. అక్షయ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. సౌమ్య మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..) వరుసగా రెండు రోజులు అంత్యక్రియలు ఒకే కుటుంబంలో వరుసగా రెండు రోజులు చెల్లి, అక్కా అంత్యక్రియలు జరిగాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ‘దేవుడా ఎందుకు కడుపుకోత మిగిల్చావ్.. ఇద్దరు బిడ్డలను ఒకేసారి తీసుకెళ్లావా..?’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. కాగా, నిందితుడు, అత్తాపూర్కు చెందిన సంపత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) మంత్రి సబిత, ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ సౌమ్య అంత్యక్రియలకు సోమవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. సౌమ్య మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
మొయినాబాద్ రోడ్డు ప్రమాదం.. మొన్న ప్రేమిక, నేడు సౌమ్య
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ హద్దు మీరుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు తాగి కార్లు బైకులు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా వీరి కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని తాజ్ హోటల్ సమీపంలో సౌమ్య, ప్రేమిక, అక్షయ ముగ్గురు యువతులు కనకమామిడి వైపు వెళుతున్నారు. అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నకారు, ఎదురుగా వచ్చిన వీరి స్కూటీని ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక(16) సంఘటన స్థలంలోనే చనిపోగా.. హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సౌమ్య(18) కూడా మృతి చెందింది. ప్రస్తుతం అక్షర(14) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. చదవండి: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ప్రమాదం కారణంగా బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు బోరున విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
మహిళ కడుపులో కాటన్ గుడ్డను పెట్టి మర్చిపోయి కుట్లు వేయడంతో..
సాక్షి, మొయినాబాద్: ఆపరేషన్ చేసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చారు డాక్టర్లు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు శస్త్రచికిత్స చేసి కడుపులో కాటన్ వస్త్రం పెట్టి కుట్లు వేశారు. పది రోజుల తర్వాత తమతో కాదని చేతులెత్తేశారు. చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్ చేసి కాటన్ గుడ్డను బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాలివీ.. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ డెలివరీ కోసం నవంబర్ 28న మండల పరిధిలోని భాస్కర ఆస్పత్రికి వెళ్లింది. 29న ఉదయం డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. పది రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. కుట్లు ఎంతకూ మానకపోవడంతోపాటు కడుపునొప్పి రావడంతో భర్త మాణిక్యం డాక్టర్లను ప్రశ్నించాడు. దీంతో ఎక్స్రేలు తీయిస్తూ, మందులు తెప్పిస్తూ కాలయాపన చేశారు. ఎంతకూ తగ్గకపోవడంతో చేసేదిలేక ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈనెల 8న అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు సైతం కాదని చెప్పడంతో అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు స్కానింగ్ చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి బయటికి తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. చదవండి: 50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’! డాక్టర్లను ప్రశ్నించిన భర్త మాణిక్యం మాణిక్యం, బంధువులతో కలిసి శనివారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశారు. పెద్ద డాక్టర్లు లేరని.. సోమవారం వచ్చి మాట్లాడండి అంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లగొట్టారని మాణిక్యం ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంచందర్రావు వివరణ కోరగా రెండు రోజులుగా సెలవులో ఉన్నానని.. సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపడతామన్నారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి
సాక్షి, మోమిన్పేట: బండ రాయితో మోది యువకుడిపై దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కేసును మోమిన్పేట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సీఐ వెంకటేశం కేసు వివరాలు వెల్లడించారు. నవాబ్పేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు శివశంకర్(30)కు వెల్దుర్తి గ్రామానికి చెందిన శివలీలతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కూమార్తె ఉన్నారు. శివశంకర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన శివలీల ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిగారింటి పక్కనే ఉన్న జహంగీర్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. చదవండి: కూకట్పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. ఇదిలా ఉండగా ఏడు నెలల క్రితం శివలీల భర్త శివశంకర్ వద్దకు వచ్చింది. అప్పుడప్పుడు జాహంగీర్ శివలీల వద్దకు వచ్చిళ్తుండేవాడు. ఇది గమనించిన శివశంకర్ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇది తట్టుకోలేక శిశలీల ప్రియుడు జాహంగీర్తో భర్తను హత్య చేసేందుకు పథకం పన్నారు. పథకం ప్రకారం ఈ నెల 26న జహింగీర్.. శివశంకర్ను తన స్కూటీపై తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అనంతరం నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి తలపై రాళ్లతో బాదాడు. ఈ విషయమై శివలీలకు చెప్పి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. కొన ఊపిరితో ఉన్న శివశంకర్ను మరుసటి ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదే రోజు చికిత్స పొందుతూ శివశంకర్ మృతి చెందాడు. మృతుడి అక్క సునంద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో భార్య శివలీల ఫోన్ తీసుకొని విచారణ చేపట్టగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఆమె వెల్లడించింది. ఈ మేరకు శివలీల, జహంగీరును ఆదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు. -
‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
-
మహిళా ఆర్ఎంపీ నెంబర్ తీసుకుని.. ఫోన్లు, మెసేజ్లు.. ఏకంగా క్లినిక్కు వెళ్లి..
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి): మహిళా ఆర్ఎంపీ డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్థించిన వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన దళిత మహిళ(28) ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ గ్రామంలోనే క్లినిక్ నడుపుతుంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం క్లినిక్కు వెళ్లి చూపించుకున్నాడు. అదే సమయంలో ఆమె సెల్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 17న మళ్లీ క్లినిక్కు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించి క్లినిక్ నుంచి వెళ్లగొట్టింది. రాత్రి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అతన్ని అడగడానికి ఇంటికి వెళ్లగాఅప్పటికే అతడు పరారయ్యాడు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్తో టీచర్పై.. కుటుంబం ఆత్మహత్య: తండ్రి వివాహేతర సంబంధమే కారణం! -
రెండు గంటల్లో వివాహం.. పోలీసులు, అధికారుల ఎంట్రీ
మొయినాబాద్/రంగారెడ్డి: మరో రెండు గంటల్లో వివాహం... ఇళ్లంతా పెళ్లి సందడి.. కుటుంబ సభ్యులు, బంధువులంతా ముస్తాబవుతున్నారు.. పెళ్లి కూతురును ముస్తాబు చేస్తున్నారు.. ముత్యాల పందిరి సిద్ధం చేశారు.. భోజనాలకోసం వంటలు సిద్ధమవుతున్నాయి... అంతలోనే పెళ్లివారి ఇంటి ముందుకు పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వచ్చి బాలిక పెళ్లిని అడ్డుకున్నారు. మండల పరిధిలోని సురంగల్లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక(14)కు పెళ్లి జరుగనుందని ఆదివారం ‘సాక్షి’ దిపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం ఉదయం 8గంటలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ భారతి, పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సురంగల్ గ్రామానికి వచ్చారు. స్థానిక సర్పంచ్ గడ్డం లావణ్య, అంగన్వాడీ టీచర్లతో కలిసి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లితోపాటు బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లి ఆపారు. బాలికతోపాటు ఆమె తల్లిని పోలీస్స్టేషన్కు తరలించి మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయవద్దని సూచించారు. బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ‘సఖి’ కేంద్రానికి తరలించారు. (చదవండి: ప్రియుడి కోసం.. ఆస్తమా మందులు మార్చేసి భర్తను దారుణంగా) -
క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్
మొయినాబాద్: క్రీడల్లో గెలుపు, ఓటమి సమానమేనని, క్రీడాకారులు పోరాట పటిమ, క్రీడా స్ఫూర్తిని చాటాలని శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి అన్నారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్, వీఐటీ–ఏపీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. నగర శివారులోని మొయినాబాద్ మండలం అజీజ్నగర్ సమీపంలో ఉన్న ఎస్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో మంగళవారం జూనియర్, సీనియర్ విభాగంలో రీజినల్ స్థాయి ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవానికి శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను గుర్తించేందుకు ‘సాక్షి’ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 676 జట్లతో ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం భేష్ అన్నారు. యువతను ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ ‘సాక్షి’ మీడియా గ్రూప్ విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు అనేక రకాల ఈవెంట్స్ నిర్వహిస్తోందని, అందులో ఎస్పీఎల్ ఒకటని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రాణిరెడ్డి అన్నారు. అనంతరం.. జిల్లా స్థాయి, రీజినల్ స్థాయిలో విన్నర్స్, రన్నర్స్ జట్టకు డీసీపీ ప్రకాష్రెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. జూనియర్ విభాగంలో జిల్లాస్థాయిలో విజయం సాధించిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ ఏ జట్టు, రన్నర్గా నిలిచిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజీ బి జట్లకు, సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి విజయం సాధించిన భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ జట్టు, రన్నర్గా నిలిచిన సర్దార్పటేల్ డిగ్రీ కాలేజ్ జట్లకు బహుమతులు అందించారు. రీజినల్ స్థాయిలో జూనియర్ విభాగంలో విజయం సాధించిన భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ జట్టు, రన్నర్గా నిలిచిన మహబూబ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుకు, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ జట్టు, రన్నర్గా నిలిచిన మహబూబ్నగర్ విద్యా సమితి(ఎంవీఎస్) డిగ్రీ కాలేజ్ జట్టుకు ట్రోఫీ, సరి్టఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. జూనియర్, సీనియర్లో భవన్స్ విజయం రీజినల్ స్థాయిలో మంగళవారం జరిగిన జూనియర్, సీనియర్ విభాగాల్లో భవన్స్ జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన జూనియర్ విభాగం మ్యాచ్లో మహబూ బ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు, భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 94 పరుగులు చేసింది. 95 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భవన్స్ జట్టు 97 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. సీనియర్ విభాగంలో.. రీజినల్ స్థాయిలో సీనియర్ విభాగం మ్యాచ్ భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్, మహబూబ్నగర్ విద్యా సమితి(ఎంవీఎస్) డిగ్రీ కాలేజట్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్కు దిగిన భవన్స్ జట్టు 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఎంవీఎస్ జట్టు 85 పరుగులే చేసింది. దీంతో భవన్స్ విజయాన్ని అందుకుని ట్రోఫీని గెలుచుకుంది. ( చదవండి: వామ్మో.. రోజుకు లక్ష కేసులు తాగేస్తున్నారు! ) -
కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని..
మొయినాబాద్: మూడు నెలల కిందట కెనడా నుంచి వచ్చిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన అత్తాపురం చంద్రారెడ్డి, ప్రమద దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా పెద్ద కొడుకు అత్తాపురం నవీన్కుమార్రెడ్డి(29) ఐదేళ్ల కిందట చదువుకోవడానికి కెనడా వెళ్లాడు. చిన్నకొడుకు అనుదీప్రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపడంతో తల్లిదండ్రులు మొయినాబాద్ మండల కేంద్రంలో అద్దెకు ఉంటూ కొత్త ఇళ్లు నిర్మిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు నవీన్కుమార్రెడ్డి మూడు నెలల క్రితం కెనడా నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతోపాటే మొయినాబాద్ ఉంటున్నాడు. మూడు నెలలుగా ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం తల్లిదండ్రులు బందువుల వద్దకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. బెడ్రూం తలుపులు పెట్టుకుని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా నవీన్కుమార్రెడ్డి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిచూశారు. అప్పటికే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మందిర నిర్మాణానికి మహమ్మద్ విరాళం
మొయినాబాద్ (చేవెళ్ల): అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం యువకుడు విరాళం అందజేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజగూడలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీమ్ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేలు విరాళం అందజేశాడు. దీనిపై బీజేపీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విరాళాల సేకరణలో కులమతాలకు అతీతంగా స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్) ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. -
జీవో 111: సారూ.. మాకేది మోక్షం!
మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన బొల్లించెరువు వీరారెడ్డి రైతు. ఏడాది క్రితం మొయినాబాద్ సమీపంలోని విజయనగర్ కాలనీలో 300 గజాల స్థలాన్ని ఖరీదు చేశాడు. ఇల్లు నిర్మించుకుందామని యత్నిస్తే 111 జీవో పరిధిలో కొత్త నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనతో అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్లాటు కొనుగోలు చేసిన లేఅవుట్కు సైతం అనుమతులు లేవు. ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమ లేఅవుట్లు, పాట్లను క్రమబద్ధీక రించుకోవడానికి 131 జీవో తీసుకొచ్చింది. కానీ 111 జీవో పరిధిలో రెగ్యులరైజేషన్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. ఇది వీరారెడ్డి ఒక్కడి పరిస్థితీ కాదు. దాదాపు లక్ష మంది సమస్య. సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం లేక.. మరోపక్క జీవో 111 ఎత్తివేతకు అడుగులు పడకపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో చిక్కుకున్నారు. అనధికారికంగా వెలిసిన దాదాపు 3 వేల లేఅవుట్లలో లక్ష మందికిపైగా సామాన్యులు ఇళ్ల స్థలాలు ఖరీదు చేశారు. (చదవండి: ఎల్ఆర్‘ఎస్’.. అనూహ్య స్పందన) ఈ గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేస్తామని.. గత సాధారణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టి 21 నెలలు దాటిపోయినా... 111 జీవో ఎత్తివేతపై ఎటువంటి కదలికా లేదు. ఈ జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించడం లేదు. దాంతో ప్లాట్ల యజమానులు లబోదిబో మంటున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారంతా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే కావడం గమనార్హం. వీడని పీటముడి.. జీవో 111 పరిధిలో ఏర్పాటైన వెంచర్లు, లేఅవుట్లపై ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది తెలియడం లేదు. సీఎం ఇచ్చిన హామీకి కట్టుబడి సర్కారు జీవో 111ను ఎత్తివేస్తేనే... లేఅవుట్లకు, ప్లాట్లకు మోక్షం లభిస్తుంది. ఎల్ఆర్ఎస్కు వీలు చిక్కుతుంది. మరోపక్క జీఓ 111ను ఎత్తివేయాలని ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మరోపక్క ఈ జీవోను సడలిస్తే జంట జలాశయాల మనుగుడ ప్రశ్నార్థకంగా మారనుందని పర్యావరణ వేత్తలు సైతం ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దీనికితోడు ఈ జీవో ప్రభావిత గ్రామాల నుంచి ప్రభుత్వం తీర్మానాలను తీసుకుంటోంది. మహా నగరానికి ఆనుకుని ఉన్నా.. తమ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కాబట్టి ఈ జీవోని ఎత్తివేయాలని సర్పంచ్లు తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. మొత్తంమీద ఈ అంశం సంక్లిష్టంగా మారడంతో ఎప్పటికి మోక్షం కలుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏమిటీ 111 జీవో? హైదరాబాద్ మహానగరానికి తాగునీరందించే ఉస్మాన్సాగర్ (గండి పేట), హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణతోపాటు నీటి కాలుష్యాన్ని నివారించేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఈ జంట జలాశయాల ఎగువన ఉన్న, క్యాచ్మెంట్ ఏరియాలోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, రాజేంద్రనగర్, శంషా బాద్, షాబాద్ మండలాల పరిధిలోని 84 గ్రామాలను జీవో పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. సహజ నీటి ప్రవా హాలకు ఆటంకాలు ఏర్పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రియల్ వ్యాపారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 3 వేల వెంచర్లు చేసి సామాన్యులకు ప్లాట్లు కట్టబెట్టారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్లాట్లన్నింటినీ వ్యాపారులు విక్రయించాక.. ఇటీవల అధికారులు అనధికార వెంచర్లంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, వ్యతిరేకత రావడంతో చివరకు వెనకడుగు వేశారు. ఈక్రమంలో ఎల్ఆర్ఎస్.. ఆశాదీపంలా కనిపించినా అందుకు అవకాశం లేకపోవడంతో ప్లాట్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎప్పటి నుంచో కోరుతున్నాం జీవో 111తో మా గ్రామాల్లో అభివృద్ధి చాలా వెనకబడింది. దీనిని తొలగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. భూములు అమ్ముకునేందుకు చూస్తున్న రైతులకు ధరలు తక్కువ వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవోను తొలగిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఊరట కలిగిస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే ఈ జీవోపై సడలింపులు కాని, ఎత్తివేతగాని వస్తుందని విశ్వసిస్తున్నాం. అప్పుడే మా గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తాయి. – శేరి శివారెడ్డి, మల్కాపురం సర్పంచ్, చేవెళ్ల మండలం -
ఠాణా ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మొయినాబాద్ (చేవెళ్ల): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఠాణా ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెండి పట్టాలు పోయాయని తాను ఇచ్చిన ఫిర్యాదు విషయం తెలుసుకునేందుకు బుధవారం స్టేషన్కు వెళ్లిన ఆమెను పోలీసులు బెదిరించి వెళ్లగొట్టడంతో మనస్తాపంతో ఒంటికి నిప్పంటించుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తూజగూడలో నివాసముంటున్న సంపంగి బాల్రాజ్, సుగుణ(32) దంపతులు వడ్డెర పని చేసి జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సుగుణకు చెందిన 20 తులాల వెండి పట్టాలు ఇంట్లోంచి పోయాయి. ఈ విషయమై ఆమె అదే రోజు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. తన తండ్రి రెండో భార్య ఎల్లమ్మపై అనుమానం ఉందని పేర్కొంది. పోలీసులు ఎల్లమ్మను పిలిపించి విచారించగా తాను పట్టాలు తీయలేదని చెప్పింది. అయితే, ఈ విషయంలో సుగుణ, ఎల్లమ్మ గొడవపడ్డారు. గొడవలు వద్దని, చోరీపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పి ఇద్దరినీ పంపించారు. కాగా బుధవారం కేసు విషయం ఎంత వరకు వచ్చిం దని తెలుసుకునేందుకు సుగుణ ఠాణాకు వెళ్లిం ది. పోలీసులు ఆమెను లోపలికి రానివ్వకుండా బెదిరించి బయటి నుంచే వెళ్లగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బయటకొచ్చి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు, పోలీసులు మం టలను ఆర్పారు. తీవ్ర గాయాలైన సుగుణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తల్లి వెంటే ముగ్గురు పిల్లలు... కేసు విషయం తెలుసుకునేందుకు ఠాణాకు వచ్చిన సుగుణ తన ఇద్దరు కొడుకులు, ఓ కూతురును తీసుకొచ్చింది. పిల్లల ముందే ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో వారు పెద్దగా కేకలు పెడుతూ రోదించారు. అనం తరం తల్లిని ఆస్పత్రికి తరలించడంతో పిల్లలు పోలీస్స్టేషన్ ఆవరణలోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం స్థానికులను కలిచివేచింది. డీజిల్ ఎక్కడిది..? సుగుణ డీజిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుందనే విష యం అంతు చిక్కడం లేదు. పోలీసులు బెదిరిం చిన తర్వాత బయటకు వెళ్లిన ఆమె డీజిల్ తెచ్చు కుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుందా...? లేక ముందుగానే తనతో డీజిల్ తెచ్చుకుందా.. అనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. ఠాణా ఎదుటున్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణ చేస్తున్నామని చెప్పాం.. వెండి పట్టాలు పోయాయని నాలుగు రోజుల క్రితం సుగుణ ఫిర్యాదు ఇచ్చింది. సవతి తల్లి ఎల్లమ్మపై అనుమానం ఉందని చెప్పడంతో ఆమెనూ విచారిం చాం. బుధవారం సుగుణ మళ్లీ ఠాణాకు వచ్చింది. కేసు విచారణ జరుపుతున్నామని చెప్పి పంపించాం. బయటకు వెళ్లిన కొంతసేపటికి ఠాణా పక్కన తహసీల్దార్ కార్యాలయం గేటు సమీపంలో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించాం. – జానయ్య,మొయినాబాద్ ఇన్స్పెక్టర్ -
బిజినెస్కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని..
సాక్షి, మొయినాబాద్ : సొంతంగా బిజినెస్ ఏర్పాటుకోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగితే ఇవ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీరన్నపేట సమీపంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ గ్రామానికి చెందిన కంఠం వెంకట్రెడ్డి కుమారుడు భరత్రెడ్డి (28) గత 8 సంవత్సరాలుగా నగరంలోని లంగర్హౌస్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేసేవాడు. సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో భరత్రెడ్డి నెల రోజుల క్రితం జాబ్ మానేశాడు. బిజినెస్ ఏర్పాటుకు అవసరమైన డబ్బులు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం రేగడి ఘనాపూర్కు వెళ్లి తల్లిదండ్రులను అడిగాడు. ఇప్పుడు డబ్బులు లేవని.. పంటలు అమ్మిన తరువాత డబ్బులు ఇస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడే అత్యవసరంగా డబ్బులు కావాలని గట్టిగా అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భరత్రెడ్డి ఇంటి నుంచి లంగర్హౌస్ రూంకు వెళ్లిపోయాడు. (నాడు అన్న.. నేడు తమ్ముడు ) స్నేహితులకు మెసేజ్ పంపి.. భరత్రెడ్డి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తీసుకుని లంగర్హౌస్ నుంచి మొయినాబాద్ మండలం వీరన్నపేట సమీపంలోకి బైక్పై వచ్చాడు. అక్కడి నుంచి లంగర్హౌస్లో ఉన్న తన స్నేహితులకు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మెసేజ్ పంపాడు. బిజినెస్ ప్రారంభించేందుకు తనకు ఎవరూ డబ్బులు ఇవ్వడంలేదని.. అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో స్నేహితులు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. డయల్ 100 నుంచి లంగర్హౌస్ పోలీసులకు సమాచారం వచ్చింది. భరత్రెడ్డి మొబైల్ నంబర్ లొకేషన్ను పరిశీలించిన పోలీసులు మొబైల్ లొకేషన్ మొయినాబాద్ మండలం వీరన్నపేట సమీపంలో ఉన్నట్లు చూపించడంతో లంగర్హౌస్, మొయినాబాద్ పోలీసులు ఆ ప్రాంతంలో వెతికారు. అప్పటికే చీకటి పడటంతో భరత్రెడ్డి ఆచూకీ లభించలేదు.(ప్రియురాలిపై సామూహిక లైంగికదాడికి యత్నందొరకలేదు.) బుధవారం ఉదయం వీరన్నపేట సమీపంలో గ్రామస్తులకు భరత్రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా పడి ఉండటాన్ని గమనించారు. సంఘటనా స్థలంలో వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బీటెక్ చదివి ఖాళీగా తిరిగితే ఎలా? అనడంతో ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ‘బీటెక్ చదివి ఖాళీగా తిరిగితే ఎలా..? ఏదైనా పనిచేయొచ్చు కదా’ అని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గండిపేట చెరువులో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల తర్వాత చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో మృతదేహం నీళ్లపై తేలడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని నార్సింగికి చెందిన పులకల నరేష్కుమార్(24) బీటెక్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఖాళీగా తిరుగుతున్నాడు. ఏదైనా పని చేసుకుని కుటుంబానికి తోడుగా ఉండాలని తల్లిదండ్రుల ఇటీవల మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నరేష్కుమార్ గతనెల 30న స్కూటీ తీసుకుని ఇంట్లోంచి బయలుదేరాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువులో ఓ యువకుడి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ స్థానికులు కనిపించింది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన నరేష్కుమార్గా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ దేవాలయానికి వచ్చి.. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో గత నెల 30న స్కూటీ తీసుకుని బయలు దేరిన నరేష్కుమార్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చాడు. ఆలయం వద్ద పార్కింగ్లో స్కూటీ పెట్టి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. ఈనేపథ్యంలో అతడు నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నరేష్కుమార్ ఇంట్లో రాసిపెట్టిన సూసైట్నోట్ను నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియాంక హత్య: చిలుకూరు ఆలయం మూసివేత
మొయినాబాద్ (చేవెళ్ల): వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణహత్యకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాలపాటు ప్రదక్షణలు, దర్శనాలు పూర్తిగా నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణ చేయించారు. ‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు. స్త్రీలకు రక్షణ కల్పించాలంటూ మొక్కతున్న భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
మొయినాబాద్ ఎంపీఓపై వేటు
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఉషాకిరణ్పై వేటు పడింది. ఆమె గతంలో పనిచేసిన చోట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఇంచార్జి కలెక్టర్ హరీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందడానికి ముందు ఉషాకిరణ్.. ఇబ్రహీంపట్నం మండలం పోచారం పంచాయతీ సెక్రటరీగా 2018–19లో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో పంచాయతీ పరిధిలో పన్నుల రూపంలో వసూలైన రూ.7.72 లక్షలను ప్రభుత్వ ఖజానాలో జమచేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన ఇంచార్జి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. అసలు కారణం ఇదేనా..? మొయినాబాద్లో మండల పంచాయతీ అధికారిగా తన బాధ్యతలను విస్మరించి అనధికార వెంచర్ల యాజమానులకు సహకరించారనే ఆరోపణలు సైతం ఉషాకిరణ్పై వెల్లువెత్తాయి. అనుమతి లేని వెంచర్ల ఏర్పాటుపై చూసీచూడనట్లు వ్యవహరించేందుకు యజమానుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల పేర్లను, హోదాను కూడా ఆమె వాడుకున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజులుగా మొయినాబాద్ మండల పరిధిలో అనధికార లేఅవుట్లను అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ఆరోపణలు, అనధికార వెంచర్ల ఏర్పాటులో తన పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ విషయం యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో ఆమె తొలుత పనిచేసిన చోటు నుంచి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోచారంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో ఆ వెంటనే సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ
సాక్షి, చేవెళ్ల: అనాథ పిల్లలకు అన్నం పెట్టి కడుపు నింపాలనే గొప్ప ఆశయంతో ఆ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం అందరూ పిడికెడు బియ్యం తీసుకొచ్చి జమ చేశారు. పదిరోజుల్లో 500 కిలోలు జమ కావడంతో అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో అనాథ పిల్లలకు తమవంతు సహకారం అందించాలని ఆలోచించారు. ఎవరూ లేని చిన్నారులకు అన్నం పెట్టి కడుపు నింపాలని భావించారు. అందుకోసం బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు ఒక్కో విద్యార్థి పిడికెడు చొప్పున బియ్యాన్ని తీసుకొచ్చి జమచేశారు. గురువారానికి 500 కేజీల బియ్యం కావడంతో వాటిని అనాథ ఆశ్రమాలు నడుపుతున్న నాలుగు సంస్థలకు అందజేశారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. -
మత ప్రచారకుడికి వల
మొయినాబాద్ (చేవెళ్ల): హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు డబ్బుకోసం ఓ మత ప్రచారకుడికి వలవేశారు. అతడిని నమ్మించి డబ్బులు తీసుకున్నారు. భోజనం కోసం అంటూ పిలిచి జూస్లో మత్తుమందు కలిపారు. అనంతరం అసభ్యకరంగా ఉన్న ఫొటోలు తీసి రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్లోని ఓ మత ప్రచారకుడి వద్దకు గత ఆగస్టు 11న ఓ మహిళ(23) వచ్చింది. తన ఆరోగ్యం బాగలేదని తనకోసం ప్రార్థనలు చేయాలని అతడిని కోరింది. అలా పరిచయం ఏర్పరచుకుని తాను ఓ అనాథాశ్రమం నడుపుతున్నట్లు చెప్పింది. ఆయన ఫోన్నంబర్ తీసుకుని వాట్సప్ చాటింగ్ చేసేది. కొన్నాళ్ల తర్వాత శంషాబాద్లో ఓ రెస్టారెంట్కు, మరోసారి వండర్లాకు పిలిచి అతనితో సెల్ఫీలు దిగింది. తన భర్త విజయవాడలో ఓ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, పెట్టుబడిగా సాయం కావాలని రూ.10 లక్షలు తీసుకుంది. వ్యాపారం పేరుతో బాధితుడిని పిలిచి తమ పథకం అమలుచేసి అతడిని బ్లాక్మెయిల్ చేసి రూ.కోటికి ఒప్పందం రాయించుకొని రూ.10 లక్షలు గుంజారు. వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె ఎయిర్హోస్టెస్గా పనిచేసిందని, ఆమె భర్త హైదరాబాద్లో హోటల్ వ్యాపారం నడిపి నష్టపోయారని పోలీసులు గుర్తించారు. వారిని సోమవారం రిమాండ్కు తరలించనున్నారు. -
అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంతలోకాలకు
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి) : అన్నా చెల్లిలి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష అంటూ చెల్లెలు రాఖీ కట్టింది. అన్నకు రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళ్తూ ఆ చెల్లెలుతో సహా ఆమె భర్త, కూతురు దుర్మరణం చెందిన సంఘటన చేవెళ్ల–శంషాబాద్ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం సుభాన్పూర్ గ్రామానికి చెందిన పోచారం బాల్రెడ్డి(40), అతని భార్య జ్యోతి(35), కూతురు సిరి(11), కుమారుడు సాయిచరణ్ గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా చేవెళ్లకు బైక్పై వెళ్లారు. జ్యోతి తన అన్నయ్య శ్రీనివాస్రెడ్డికి రాఖీ కట్టింది. సాయంత్రం 6 గంటలకు సుభాన్పూర్ వెళ్లేందుకు చేవెళ్ల నుంచి నలుగురు బైక్పై బయలుదేరారు. 6:30 గంటలకు చేవెళ్ల–శంషాబాద్ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన జేసీబీ బైక్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్తో సహా నలుగురిని తోసుకుంటూ జేసీబీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. జేసీబీ కింద నలిగిపోయిన భార్యభర్తలు బాల్రెడ్డి, జ్యోతి, వారి కూతురు సిరి అక్కడికక్కడే మృతిచెందారు. జేసీబీ కింద ఇరుక్కుని ఉన్న సాయిచరణ్ కాపాడండి అంటూ కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్తున్న వారు గమనించారు. అప్పటికే జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాలుడిని జేసీబీ కింది నుంచి బయటకు తీసి చికిత్స కోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జేసీబీ అతివేగంతోనే... కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి జేసీబీ అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తే కారణంగా తెలుస్తుంది. జేసీబీని గంటకు 20 కిలోమీటర్ల స్పీడ్తో నడపాలి. కానీ జేసీబీ డ్రైవర్ అతివేగంతో వెళ్తుండగా ఎదురుగా బైక్ వస్తున్నా అదుపు చేయలేకపోయాడు. బైక్ను ఢీకొట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లడంతో వారు జేసీబీ కింద నలిగిపోయి మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. రెండు గ్రామాలో విషాదం... అన్నకు రాఖీ కట్టి తిరిగి వెళ్తూ ముగ్గురు మృతిచెందిన సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. మృతుల స్వగ్రామం మహేశ్వరం మండలం సుభాన్పూర్తోపాటు జ్యోతి తల్లిగారు గ్రామం చేవెళ్లలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. రాఖీ పండుగరోజు ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
ఎన్ఎంసీ బిల్లు రద్దు చేయాలి
సాక్షి, మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాస్కర ఆసుపత్రికి చెందిన జూనియర్ వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం మొయినాబాద్ మండలంలోని భాస్కర ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇన్టెన్స్(హౌజ్ సర్జరీ) డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు కలిసి భాస్కర ఆసుపత్రి నుంచి హిమయత్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్తూ ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని నినదించారు. హిమయత్ నగర్ చౌరస్తాలో దాదాపు అరగంట సేపు రాస్తారోకో నిర్వహించి వాహనాలను నిలిపివేశారు. ఎన్ఎంసీ బిల్లును తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వారికి వైద్య విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల ధర్నాతో హిమయత్నగర్ చౌరస్తాలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్, జగదీశ్వర్లు సిబ్బందితో కలిసి ధర్నా చేస్తున్నవారిని పక్కకు పంపించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. వైద్యులు, విద్యార్థులు తిరిగి ర్యాలీగా భాస్కర ఆసుపత్రికి వెళ్లారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: ఐఎంఏ అనంతగిరి: కేంద్రం ఎన్ఎంసీ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐఎంఏ వికారాబాద్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు డాక్టర్ పవన్కుమార్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్పత్రుల బంద్లో భాగంగా గురువారం వికారాబాద్లో బంద్ పాటించారు. ఈ సందర్భంగా పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు ఆస్పత్రులను బంద్ (అత్యవసర సేవలు మినహాయించి) నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం ఎన్ఎంసీ బిల్లును తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 నెలల బ్రిడ్జి కోర్సు పెట్టి వైద్య విద్యార్థుల పొట్ట కొట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం వెంటనే 32, 51, 15 సెక్షన్లను తొలగించాలన్నారు. ఈ సెక్షన్లు అమలైతే 6 సంవత్సరాలు యంబీబీఎస్ చదివిన మెడిసిన్ విద్యార్థుల చదువుకు విలువ లేకుండా పోతుందన్నారు. ఎలాంటి అర్హతలు లేని వారు 6 నెలల కోర్సుతో ఎలాంటి విధులు నిర్వర్తిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ ప్రధాన కార్యదర్శి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు పవన్కుమార్, కోశాధికారి హర్షవర్ధన్రెడ్డి, ప్రతినిధులు సబితాఆనంద్, భరత్కుమార్, రమ్య, దీపా భక్త వత్సలం, సందీప్ తదితరులు పాల్గొళన్నారు. -
బాలిక కిడ్నాప్ కలకలం
మొయినాబాద్(చేవెళ్ల): ‘మీ నానమ్మ దగ్గరకు తీసుకెళ్తాను’ అంటూ బాలికకు నమ్మించిన ఓ దుండగుడు కిడ్నాప్కు యత్నించాడు. స్కూటీపై తీసుకెళ్తుండగా చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకుని స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం చిలుకూరులో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కార్వాన్ ప్రాంతానికి చెందిన సమృద్దీన్(45) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలిక(13)ను ‘మీ నానమ్మ వద్దకు తీసుకెళ్తాను’ అంటూ నమ్మబలికి తన స్కూటీపై ఎక్కించుకుని బయలుదేరాడు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్నగర్–తంగడపల్లి రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా.. కార్వాన్కు చెందిన నజీమ్ అనే వ్యక్తి పని నిమిత్తం చిలుకూరు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో చిలుకూరు మహిళా ప్రాంగణం వద్ద అతడు బాలికను గుర్తించాడు. ఆమెను ఎక్కడి తీసుకెళ్తున్నావంటూ నజీమ్ ప్రశ్నించగా దుండగుడు తప్పించుకోవడానికి స్కూటీ వేగం పెంచాడు. నజీమ్ వెంబడించి అతడిని పట్టుకున్నాడు. స్థానికులంతా గుమ్మికూడి నిలదీశారు. బాలికను అడిగి విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడిని వారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు ఠాణాకు రావడంతో వారికి ఆమెను అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ సంబంధం; భర్త తలకు తుపాకీతో గురి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో ఓ అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపింది. అక్రమ సంబంధంపై నిలదీసిన భర్తను కాల్చిపడేస్తానంటూ నిందితుడు బెదిరింపులకు దిగడంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన శైలజ, రాజు భార్యాభర్తలు. అయితే, గత కొంతకాలంగా రాచకొండ ఏడీసీపీ శిల్పవల్లి వద్ద గన్మెన్గా పనిచేసే రమేష్, శైలజ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న రాత్రి (సోమవారం) 7 గంటల సమయంలో శైలజ, రమేష్ ఇంట్లో ఉండగా గమనించిన రాజు వారిని నిలదీశాడు. దీంతో రమేష్, రాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమేశ్ తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని రాజు మొయినాబాద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తుపాకీతో గురిపెట్టి కాల్చిపడేస్తానంటూ రమేష్ తనను హెచ్చరించాడని రాజు కంప్లెయింట్లో పేర్కొన్నాడు. ఇదిలాఉండగా.. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా రమేష్ తన రివాల్వర్ ఎలా తీసుకెళ్లాడని ఆరోపణలు చేస్తున్నారు. -
భార్య కాపురానికి రాలేదని.. బావమరిది కొడుకును..!
సాక్షి, హైదరాబాద్ : భార్య కాపురానికి రావడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా బావమరిది కొడుకును ఎత్తుకెళ్లాడు. 20 నెలల చిన్నారిని అపహరించి.. తన భార్యను కాపురానికి పంపిస్తేనే బాలుడిని తల్లిదండ్రులకు ఇస్తానని బెదిరింపులకు దిగాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీజ్ నగర్ గేట్ సమీపంలోని గోల్డెన్ ఫామ్లో ఉంటూ కూలి చేసుకునే యాలాల మండలానికి చెందిన కృష్ణకు, భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భాగ్యలక్ష్మికి కృష్ణ గతంలో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి తన అన్న దగ్గర ఉంటున్నారు. భాగ్యలక్ష్మికి ఆమె అన్న దగ్గర ఉండటంతో ఆగ్రహించిన కృష్ణ.. 20 నెలల అన్న కొడుకును ఎత్తుకెళ్లాడు. ‘మీ చెల్లెల్ని నాతో కాపురానికి పంపిస్తేనే.. కొడుకును ఇస్తాను’ అంటూ అతను భాగ్యలక్ష్మి అన్నకు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కృష్ణ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భాగ్యలక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాకారం అభివృద్ధిపై గుజరాత్ బృందం ప్రశంస
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం గ్రామాన్ని గుజరాత్కు చెందిన సర్పంచ్లు, అధికారులు, మహిళ సంఘాల అధ్యక్షులతో కూడిన 20 మంది సభ్యుల బృందం ఎన్ఐఆర్డీ అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. బాకారం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి గురించి సాక్షర భారత్ జాతీయ అవార్డు పొందిన గ్రామ సర్పంచ్ బద్దుల సుధాకర్ యాదవ్ వివరించారు. ముందుగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న టిష్యూ పేపర్ తయారీ, అంగన్వాడీ కేంద్రం పరిశీలన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సకాలంలో ఇంటి పన్ను, నల్లా బిల్లు ప్రజలు చెల్లిస్తున్నారని తెలుసుకుని గుజరాత్ బృందం అభినందించింది. గ్రామంలో మురుగు కాలువలు, రోడ్లు, వీధిదీపాలు, పాఠశాల అభివృద్ధి, లైబ్రరీ ఏర్పాటు చేయడం చూసి.. గ్రామాభివృద్ధిలో బాకారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కితాబిచ్చారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారులు డాక్టర్ జీవీ క్రిష్ణ, లోహిదాస్, డాక్టర్ హేమంత్ కుమార్, బాకారం గ్రామ వార్డు సభ్యులు కొత్తపల్లి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
వెలుగు చూసిన సుపారీ కుట్ర
మొయినాబాద్(చేవెళ్ల) : ఓ హార్డ్వేర్ షాపు నిర్వాహకుడిని హత్య చేసేందుకు మరో షాపు నిర్వాహకుడు కుట్ర పన్నాడు. అతన్ని హత్య చేస్తే డబ్బులు ఇస్తానని నలుగురు యువకులతో డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులకు ఆశపడి హత్య చేయడానికి సిద్ధమైన యువకులు ఇనుప రాడ్డుతో హార్డ్వేర్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అతడు చనిపోయాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. మొయినాబాద్ మండల కేంద్రంలో తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. కానీ అప్పటి సీఐ కేసు పక్కన పెట్టారు. ఇటీవల మొయినాబాద్లో జరిగిన ఓ గొడవతో అప్పటి దాడి విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దాడికి కారణమైనవారితోపాటు దాడికి పాల్పడినవారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అశోక్(32) తన కుటుంబంతో పదేళ్ల క్రితం మొయినాబాద్కు వచ్చి హార్డ్వేర్షాపు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 1న రాత్రి షాపు మూసే సమయంలో బైకుపై ముఖాలకు ముసుగులతో ఇద్దరు దుండగులు వచ్చి అతడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దీంతో అశోక్ స్పృహ కోల్పోయి కిందపడిపోగానే చనిపోయాడని భావించి పారిపోయారు. అయితే, మరో హార్డ్వేర్ షాపు నిర్వాహకులు అచలరాం, గణేష్పై అనుమానం ఉందని అశోక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ కేసును దర్యాప్తు చేయకుండా పెండింగ్లో పెట్టారు. దాడికి అసలు కారణం ఇదీ.. మొయినాబాద్లో మాతాజీ హార్డ్వేర్ షాపు నిర్వహిస్తున్న అశోక్కు బంధువులైన అచలరాం, గణేష్ సైతం పదేళ్ల క్రితం మొయినాబాద్కు వచ్చి హార్డ్వేర్ దుకాణం పెట్టారు. వీరి మధ్య వ్యాపార గొడవలు ఉన్నాయి. దీంతో అచలరాం, గణేష్ అశోక్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అందుకోసం మొయినాబాద్కు చెందిన రియాజ్, ముస్తాక్, ముజ్జు, ఇమ్రొజ్తో రూ.4 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్గా రూ.1 లక్ష ఇచ్చారు. సమయం కోసం వేచి చూస్తున్న వీరు గతేడాది ఏప్రిల్ 1న రాత్రి దాడి చేశారు. 20 రోజుల క్రితం మొయినాబాద్లో గ్యార్మీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో యువకుల మధ్య గొడవ జరిగింది. గొడవలో మాటామాటా పెరిగి గతంలో ఒకరిపై దాడి చేస్తే ఏం జరిగిం ది. ఇప్పుడు దాడి చేస్తే ఏం జరుగుతుందని కొందరు యువకు లు దాడిచేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అశోక్ను చం పేందుకు డీల్ కుదుర్చుకున్నామని.. దాని ప్రకారమే రాడ్డుతో కొట్టామని నిందితులు అంగీకరించారు. దీంతో దాడికి కారణమైన అచలరాం, గణేష్తోపాటు నలుగురు నిందితులను పోలీసులు జనవరి 29న రిమాండ్కు తరలించారు. ఏసీపీని కలిసిన బాధితుడు.. బాధితుడు అశోక్ శనివారం రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్కుమార్ను కలిసి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను చంపేందుకు కుట్ర పన్నారని, నిందితులు జైలు నుంచి వచ్చిన తర్వాత తనను ఏమైనా చేస్తారేమోనని భయాందోళన వ్యక్తంచేశాడు. భయపడాల్సిన అవసరం లేదని, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండని ఏసీపీ ధైర్యం చెప్పారు. -
మొయినాబాద్లో ‘ట్రాఫిక్ జాం’జాటం
మొయినాబాద్(చేవెళ్ల): అసలే సోమవారం... దానికి తోడు అర్ధంతరంగా నిలిచిన రోడ్డు పనులు.. వెరసి మొయినాబాద్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మండల కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం సంత ఉంటుంది. దీనికి తోడు మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డివైడర్కు ఒకవైపు ఉన్న రోడ్డుపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సోమవారం సంత సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతోపాటు సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద హైదరాబాద్–బీజాపూర్ రోడ్డుకు పెద్ద మంగళారం, సురంగల్ రోడ్లు కలుస్తాయి. నాలుగు వైపుల నుంచి వచ్చిన వాహనాలు ఒకేసారి చౌరస్తాలో నిలవడంతో అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కేడే ఆగిపోయి పూర్తిగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై రెండు వైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో వాహనాదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మొయినాబాద్లో ‘ట్రాఫిక్ జాం’
మొయినాబాద్(చేవెళ్ల): అసలే సోమవారం... దానికి తోడు అర్ధంతరంగా నిలిచిన రోడ్డు పనులు.. వెరసి మొయినాబాద్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మండల కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం సంత ఉంటుంది. దీనికి తోడు మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డివైడర్కు ఒకవైపు ఉన్న రోడ్డుపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సోమవారం సంత సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతోపాటు సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుకు పెద్ద మంగళారం, సురంగల్ రోడ్లు కలుస్తాయి. నాలుగు వైపుల నుంచి వచ్చిన వాహనాలు ఒకేసారి చౌరస్తాలో నిలవడంతో అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కేడే ఆగిపోయి పూర్తిగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై రెండు వైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో వాహనాదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.