Sahara Group
-
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్.. రిఫండ్ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్సీఎస్ (సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్)–సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు సహారా గ్రూప్ నాలుగు మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి సీఆర్సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.వీటిలో స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్)సహా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో) సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్కతా) ఉన్నాయి.2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్ ఖాతా నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్ఐఆర్ఈసీఎల్, ఎస్హెచ్ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
Subrata Roy : వేల కోట్ల ‘సహారా గ్రూప్’ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!
కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్లో ఉన్న అన్క్లయిమ్డ్ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్కు (Consolidated Fund of India) ట్రాన్స్ఫర్ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్లను సెబీకి (ప్రత్యేక వెబ్ పోర్టల్లో) అప్లయ్ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. సెబీ నుంచి కేంద్ర బ్యాంక్ అకౌంట్కు ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. అన్క్లయిమ్డ్ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే అయితే, సెబీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్కు నిధులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది. ప్రత్యేక పోర్టల్ నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్ను ప్రారంభించారు. సహారా గ్రూప్నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లిస్తున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
డొక్కు స్కూటర్పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా
సహారా అంటే సహాయం, సహారా అంటే సముద్రం. సహారా అంటే ఓ ఎడారి. కానీ మన దేశంలో సహారా అంటే ఓ కంపెనీ. ఆ సంస్థని స్థాపించింది సుబ్రతా రాయ్. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే స్థాయి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అపర కుబేరుడిగా అవతరించిన రాయ్.. చివరికి అందరూ ఉన్న అనాధలా తలకొరివి పెట్టించుకోలేని దుస్థితికి ఎలా దిగజారారు. సహారాలో పనిచేస్తూ జీతం తీసుకునే ఉద్యోగులు, సహారా నుంచి కమీషన్ తీసుకునే కమీషన్ ఏంజెంట్లు, సహారా కస్టమర్లు సైతం దేవుడు, సహారా శ్రీగా పిలిచే సుబ్రతా రాయ్ 1948 బీహార్లోని అరారియాలో బెంగాలీ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఛబీ, సుధీర్ చంద్ర రాయ్లు తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని ఢాకా, బిక్రంపూర్లో సంపన్న భాగ్యకుల్ జమీందార్ భూస్వామి కుటుంబానికి చెందినవారు. మిర్చి బజ్జీలు అమ్ముతూ అయితే, షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే తండ్రి సుధీర్ చంద్ర రాయ్ మరణంతో కుటుంబ పోషణ భారం సుబ్రతారాయ్ మీద పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం ‘జయ ప్రొడక్ట్’ పేరుతో మిర్చి బజ్జీలు, పునుగులు, ఇతర తినుబండరాలను భార్య సప్నారాయ్ తయారు చేస్తే.. డొక్కు లాంబ్రెట్టా స్కూటర్ మీద ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. ఇలా తినుబండారాలే కాకుండా భార్య సప్నారాయ్తో మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. కానీ ఆ రెండు బిజినెస్లు ఫెయిల్ అయ్యాయి. రెండు బిజినెస్లు ఫెయిల్ ప్రతి రోజు చెమట చిందిస్తేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస్థితి మరింత దిగజారడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు సుబ్రతా రాయ్. అప్పుడే తన మాటే మంత్రంలా పనిచేసేలా రాయ్ మరో బిజినెస్లోకి అడుగు పెట్టాడు. ఈసారి గురి కుదిరింది. బిజినెస్ నిలబడింది. 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా సాగింది. చివరికి సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జైలు జీవితం ఎలా ఉంటుందో నేర్పింది. ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఇప్పుడంటే ఎటు చూసినా బ్యాంకులే దర్శనమిస్తున్నాయి. కానీ 1970లలో బ్యాంకులు ఉండేవి కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ గురించి, సేవింగ్స్ గురించి పెద్దగా తెలిసేదికాదు. ఇక్కడే సుబ్రతరాయ్ మాస్టర్ మైండ్కి ఓ బిజినెస్ ఐడియా తట్టింది. అదేంటంటే? స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ స్కూటర్ మీద తినుబండరాలు అమ్మే సుబ్రతా రాయ్ స్థానికంగా ఉండే టీ స్టాల్ నిర్వాహకులు, రిక్షా నడపుతూ జీవనం కొనసాగించేవారు, తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు నిర్వహించే నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మీరు ఏ పని చేస్తున్నా. వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంతుంటే అంత బ్యాంక్లకు వెళ్లే అవసరం లేకుండా నా దగ్గర దాచండి. దాచిన మొత్తానికి కొంత కాలం తర్వాత అధిక మొత్తం వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. ఇలా ఒక రూపాయి నుంచి పదులు, వందలు ఇలా కొద్ది మొత్తాన్ని దాచుకోవచ్చని చెప్పడంతో వారికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. ఈ ప్రచారంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లోని ప్రజలు సహారాలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. సహారాతో కనెక్టైనా ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా కట్టి పడేయడం రాయ్కి కొట్టిన పింది. కస్టమర్లను, ఏజెంట్లను, ఉద్యోగులను సహారాపరివార్ అంటూ తన మాటే మంత్రంలా పనిచేసేలా కట్టిపడేస్తుండేవారు. పైగా పేదలకు పెళ్లిళ్లు చేసి వారు ఆర్ధికంగా నిలబడేలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సహారా పరివార్ పేరుతో దేశం మొత్తం ప్రచారం చేసేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యమైనట్లే? సహారా సంస్థమీద, సుబ్రతా రాయ్ మీద నమ్మకాన్ని పెంచేందుకు క్రికెట్లోకి అడుగుపెట్టారు. క్రికెట్ను మతంలా భావించే ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్ చేశారు. దీంతో సహారా మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. డిపాజిట్లు సైతం భారీగా పెరిగాయి. హాస్పిటల్ ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లలకు సహారాలో డిపాజిట్ చేసిన డబ్బులు, వాటి నుంచి వచ్చే వడ్డీ ఉపయోగపడడంతో చాలా మంది సుబ్రతా రాయ్ని దేవుడిలా భావించారు. సంస్థ ఉద్యోగులు, కమిషన్ ఏంజెట్ల కష్టానికి ప్రతిఫలంగా వేతనాలు ఇవ్వడంతో సుబ్రతారాయ్ని సహారా శ్రీగా పిలిచేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యం అనేలా ఫిలయ్యేవారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలా 1978లో రూ.2వేల రూపాయల పెట్టుబడి, ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సహారా 1.13 మిలియన్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. 1997కి సహారా సంస్థ 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్ సహారా, న్యూయార్క్లో లగ్జరీ హోటల్స్ కొనుగోలు, భారత్లో యాంబీ వ్యాలీ పేరుతో రిసార్ట్... ఇలా వాట్ నాట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ను నిర్మించారు. క్రికెట్, ఏవియేషన్ రంగంలో సైతం అడుగు పెట్టారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. రూ.550కోట్లతో ఇద్దరు కుమారుల పెళ్లి సుబ్రాతా రాయ్కి సుశాంతో, సీమంతో రాయ్ ఇద్దరు కుమారులు. 2004 ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో వాళ్లిద్దరి పెళ్లిని రూ. 550 కోట్లతో నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ముఖ్య అతిధుల కోసం ప్రైవేట్ జెట్లను ఏర్పాటు చేశాడు సుబ్రతారాయ్. కొద్ది మందిని కొంత కాలమే మోసం చేయొచ్చు. ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకుల పెళ్లితో సుబ్రతా రాయ్ జీవనశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరుపేదల సొమ్మును దోచుకునేలా ఇలా నిరుపేదలు దాచుకున్న మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అప్పటి వరకు ప్రజలు డిపాజిట్ చేసిన అసలు, వడ్డీని సహారా ఇచ్చేది. రోజులు గడిచే కొద్ది ఆ మొత్తాన్ని ఇవ్వకుండా సహారా గ్రూప్లోని ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వారిని మోటివేట్ చేసేవారు. అంతేకాదు అప్పటి వరకు ఏజెంట్లు ఇంటికి వెళ్లి డిపాజిట్లను వసూలు చేసేవారు. కానీ ఇకపై ఏజెంట్లకు ఇంటింటికి తిరగరని మీరే వచ్చి డిపాజిట్ చేయాలని హుకుం జారీ చేశారు. అలా డిపాజిట్ చేసేందుకు వీలు లేక కట్టని వారిని స్కీమ్ల నుంచి వారి పేర్లను తొలగించేవారు. తొలగించిన వారి డిపాజిట్లను తిరిగి ఇచ్చేది కాదు సహారా గ్రూప్. సహారా మోసం వెలుగులోకి వచ్చింది అప్పుడే అయితే సుదీర్ఘ విరామం తర్వాత 2009లో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సహారా ఇండియా గ్రూప్ తన రియల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్ (ఎస్పీసీఎల్) ఐపీవోకి వెళుతున్నట్లు సుబ్రతారాయ్ ప్రకటించారు. ఆ ప్రకటన సహారాని ఊహించని మలుపు తిప్పింది. ఐపీవోకి వెళ్లాలంటే కంపెనీల వివరాలు లాభాలు, నష్టాలు, వివాదాలన్నింటిని వివరిస్తూ ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ను సెబీకి దాఖలు చేయాలి. ఇక్కడే సహారా గ్రూప్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా రూ.24,000 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. సుబ్రతా రాయ్ని ఇరికించిన రోషన్లాల్ ఆ తర్వాత కొద్ది రోజులకు డిసెంబర్ 25, 2009న, జనవరి 4, 2010న సెబీకి రెండు ఫిర్యాదులు అందాయి. సహారాకు చెందిన ఈ రెండు (పైన పేర్కొన్న) సంస్థలు కొన్ని బాండ్ల జారీలో చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించాయని ఆరోపించాయి. ఆ ఫిర్యాదు చేసింది మరోవరో కాదు. ఒకరు పెట్టుబడిదారులు సభ్యులు చేస్తే, జనవరి 4, 2010న ఆడిటర్ రోషన్లాల్ చేశారు. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. రోషన్ లాల్ ఫిర్యాదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా సెబీకి చేరింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా, సెబీ.. సహారా గ్రూప్ నుండి వివరణలు కోరడం ప్రారంభించింది. సంచలనం సెబీ ప్రశ్నల పరంపరపై రాయ్ స్పందిస్తూ ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,669 బాక్సుల్లో 3 కోట్ల మంది మదుపర్ల ధరఖాస్తులు, రెండు కోట్ల రిడెంప్షన్ వోచర్లను సెబీకి పంపారు. దీంతో సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబై శివార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కుల్లో వచ్చిన ఆధారాల్ని సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్ చేసి, ఒక సర్వర్లో దాచింది. నన్ను ఉరితీసుకోవచ్చు పలు దఫాలుగా సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అంతేకాదు తన 32 వ్యాపారం రంగంలో ఎన్నడూ న్యాయ నిబంధనలకు వ్యవహరించలేదని, అలా చేస్తే నన్ను ఉరి తీయొచ్చని సుబ్రతారాయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నుంచి బయట పడేలా లలిత్ మోడీ సాయం ఇలా 2010 నుంచి ప్రారంభమైన సుబ్రతారాయ్ కేసు 2014 మార్చి 4 వరకు కొనసాగింది. మార్చి 4 పోలీసు కస్టడీలో ఉన్న సుబ్రతారాయ్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి కేసు నుంచి బయటపడేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాడు రాయ్. ఇందు కోసం జైలులో వైఫైని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక తన ఆస్తుల్ని అమ్మి కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, కార్పొరేట్ క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీని కోరాడు. ఇలా 2014 నుంచి 2016 వరకు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. చివరికి 2014 మార్చి 4 బెయిల్పై విడుదలయ్యారు. కడసారి చూపుకు నోచుకోని తాజాగా, సుబ్రతారాయ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించగా.. గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసులు కారణంగా ఇద్దరు కుమారులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన రాయ్ని కడసారి చూపుకు ఆయన ఇద్దరు కుమారులు సుశాంతో, శ్రీమంతోలు నోచుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా లండన్లో చదువుకుంటున్న సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
సహారా ఇష్యూ కొనసాగుతుంది
ముంబై: గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్ ఈ విషయాలు వెల్లడించారు. సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్ మరణించిన నేపథ్యంలో బుచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్లో భాగమైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్ఐఆర్ఈసీఏ), సహారా హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు .. ఓఎఫ్సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది. దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్ను అరెస్ట్ చేశారు. గ్రూప్ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్ అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయ్ బెయిల్ పొందినప్పటి కీ గ్రూప్ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్ రూ. 24,000 కోట్లు జమ చేసింది. -
సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ
సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు. కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది. వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్ఐఆర్ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్హెచ్ఐసీఎల్) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్ చేసేశామని సహారా గ్రూప్ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది. చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సహారా కస్టమర్లకు గుడ్న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
పల్లెల్లో ‘సహారా’ కలకలం.. నాలుగేళ్లలో రెండింతలిస్తామంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘సహారా’డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేసే ఓ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఇంటి నష్ట పరిహారం పైసలు డిపాజిట్ చేశా.. మిడ్మానేరు కింద అనుపురంలో ముంపునకు గురైన ఇంటి నష్ట పరిహారం కింద వచ్చిన రూ.4.70 లక్షలను సహారాలో డిపాజిట్ చేశాను. ఏజెంట్లు 5 ఏళ్ల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్నారు. గడువు ముగిసి 16 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించాలి. – తాండ్ర రజిత, అనుపురం, సిరిసిల్ల జిల్లా అప్పుచేసి బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చింది మాది బిహార్. 30 ఏళ్ల కింద సిరిసిల్లకు వచ్చి స్థిరపడ్డాం. వేములవాడ, సిరిసిల్లలోని సులభ్ కాంప్లెక్స్లను కాంట్రాక్టు తీసుకొని పనిచేయిస్తున్నాను. ఏడేళ్ల కింద సహారా ఏజెంట్లు వచ్చి రూ.4.40 లక్షలు ఎఫ్డీ చేస్తే 5 ఏళ్ల 4 నెలలకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి డిపాజిట్ చేయించుకున్నారు. గడువు దాటి 17 నెలలు అయినా డబ్బివ్వలేదు. నా బిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. – సునీల్ మిశ్రా, సిరిసిల్ల దాదాపు ఏడాదిన్నర నుంచి.. ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్నిరోజులుగా డిపాజిట్లు మరింత పెంచేందుకు నాలుగేళ్లలోనే సొమ్ము డబుల్ అవుతుందని చెప్తున్నట్టు తెలిసింది. అయితే దాదాపు ఏడాదిన్నరగా డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని.. గత ఏప్రిల్ నుంచి మొత్తంగా రావడం లేదని డిపాజిటర్లు చెప్తున్నారు. దీనితోపాటు డిపాజిటర్లు నెలనెలా చెల్లించే మొత్తానికి వారి పేరున కాకుండా ఏజెంట్ పేరుతో రశీదులు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఏజెంట్లను నిలదీయగా.. సంస్థకు సంబంధించిన పలు కారణాలతో ఇలా జరుగుతోందని పై అధికారులు చెప్పారని వివరిస్తున్నారు. సంస్థ అధికారులు ప్రతి శనివారం ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న జూమ్ మీటింగ్కు హాజరైన అనంతరం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన సహారా మేనేజర్ కందాల సంపత్ (55) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్ సహారా బ్రాంచికి మేనేజర్గా పనిచేస్తున్నారు. డిపాజిటర్లకు మెచ్యూరిటీ తీరినా సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఉందని, పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు వినయ్ హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఘటన ఏజెంట్లలో ఆందోళన పెంచింది. సొమ్ము వస్తుంది.. ఆందోళన వద్దు! కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక చిక్కుల వల్ల మెచ్యూరిటీ పూర్తయినా డిపాజిట్లు చెల్లించలేకపోతున్న మాట వాస్తవమే. అయితే అత్యవసరమున్న వారికి సర్దుబాటు చేస్తున్నాం. డిపాజిటర్లు, ఏజెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రశీదులు ఏజెంట్ పేరు మీద రావడమంటే అవన్నీ ముందస్తు చెల్లింపులే. దానిపై కంగారు వద్దు. డిపాజిటర్లకు భరోసా కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేనేజర్ సంపత్ ఆత్మహత్యకు ఇతర ఆర్థిక కారణాలే తప్ప.. సహారాకు సంబంధం లేదు. శ్రీనివాస్, సహారా సంస్థ రీజినల్ మేనేజర్, కరీంనగర్ సిరిసిల్లలో చీటింగ్ కేసులు సహారా సంస్థలో డిపాజిట్ చేసివారిలో ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం తదితర అవసరాల కోసం.. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు సొమ్ము అందకపోవడంతో సంస్థపై, ఏజెంట్లపై చీటింగ్ కేసులు పెడుతున్నారు. ఇలా సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఒకటి, వేములవాడ పోలీస్స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కరీంనగర్లో ఉన్న సహారా రీజనల్ మేనేజర్, ఇతర అధికారులను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పిలిపించి వివరణ కూడా తీసుకున్నారు. చదవండి: కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం -
రూ.67,228 కోట్లు ఇక రానట్టే!.. వసూలు కావడం కష్టమేనన్న సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, తనకు రావాల్సిన బకాయిలు రూ.96,609 కోట్లలో రెండొంతులు అయిన రూ.67,228 కోట్లను (2022 మార్చి నాటికి) ఇక ‘వసూళ్లు కావడం కష్టమే’ అనే విభాగం కింద చేర్చింది. వివిధ కంపెనీలపై విధించిన జరిమానాలు చెల్లించకపోవడం, ఫీజుల చెల్లింపుల్లో వైఫల్యం, తన ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవవడం వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం బకాయిల్లో రూ.63,206 కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పీఏసీఎల్, సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించినవి కావడం గమనార్హం. అలాగే, మొత్తం వసూలు కావాల్సిన బకాయిల్లో 70 శాతానికి సమానమైన రూ.68,109 కోట్లు వివిధ కోర్టులు, కోర్టులు నియమించిన కమిటీల విచారణ పరిధిలో ఉన్నట్టు 2021–22 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. అన్ని మార్గాల్లో ప్రయత్నించినా కానీ, రూ.67,228 కోట్లు వసూలయ్యే అవకాశాల్లేవని సెబీ తేల్చింది. -
సహారాకి షాక్ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయండి!
న్యూఢిల్లీ: రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లంఘించి దాదాపు రూ.14,000 కోట్ల వసూలు కేసులో సహారా గ్రూప్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాట్లోనూ పూర్తి ఊరట లభించలేదు. మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఎస్క్రో అకౌంట్లో రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్ సంస్థ– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ (ఎస్ఐసీసీఎల్), ఆ సంస్థ మాజీ డైరెక్టర్లను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. ఇందుకు నాలుగువారాల గడువు మంజూరు చేసింది. ఈ నిధుల డిపాజిట్ తర్వాతే గ్రూప్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా సెబీ రికవరీ ఆఫీసర్ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. శాట్ ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లలో గ్రూప్ చైర్మన్ సుబ్రతారాయ్ కూడా ఉన్నారు. ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ ఆస్తులు, తదితర వివరాలు కూడా సెబీకి సుబ్రతారాయ్ అఫిడవిట్ రూపంలో అందజేయాలని శాట్ ఆదేశించింది. ‘‘భారతదేశం, అలాగే విదేశాలలో ఉన్న అన్ని ఆస్తులు, అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల పూర్తి జాబితాను, మ్యూచువల్ ఫండ్స్/షేర్లు/సెక్యూరిటీలను (భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో) సెబీకి నాలుగు వారాల్లోగా అందజేయాలని మేము మొదటి అప్పీలుదారు– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్, రెండవ అప్పీలుదారు– సహారా ఇండియాలను ఆదేశిస్తున్నాము’’అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. ఇరువురికి ఊరట... కాగా, వృద్ధాప్యం, అత్యవసర వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అప్పటి డైరెక్టర్లు ఇరువురు– ఏఎస్ రావు, రనోజ్ దాస్ గుప్తాలకు వ్యతిరేకంగా జారీ అయిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని సెబీ రికవరీ ఆఫీసర్ను శాట్ ఆదేశించింది. కేసు వివరాలు ఇవీ... ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు పాటించకుండా దాదాపు 2 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి ఐచ్ఛిక పూర్తి కన్వర్టబుల్ డిబెంచర్ల (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లు) ద్వారా 1998 నుంచి 2009 మధ్య ఎస్ఐసీసీఎల్ ఈ నిధులు సమీకరించిందన్నది ఈ కేసులో సహారా గ్రూప్ సంస్థ, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై ఆరోపణ. కంపెనీ వసూలు చేసిన రూ.14,000 కోట్లను 15 శాతం వార్షిక వడ్డీతోసహా రిఫండ్ చేయాలని ఎస్ఐసీసీఎల్, ఆ కంపెనీ ఒకప్పటి డైరెక్టర్లను 2018 అక్టోబర్లో సెబీ ఆదేశించింది. అలాగే ఇతర సంస్థలతో భాగస్వామ్యాల నుంచి కూడా ఎస్ఐసీసీఎల్ను, ఆ సంస్థ డైరెక్టర్లను సెబీ నిషేధించింది. ఈ కేసుకు సంబంధించి 2021 ఏప్రిల్లో సెబీ రికవరీ ఆఫీసర్ ఎస్ఐసీసీఎల్కు, కంపెనీ అప్పటి డైరెక్టర్లకు డిమాండ్ నోటీస్ జారీ చేశారు. రూ.14,106 కోట్లు 15 రోజుల్లో డిపాజిట్ చేయకపోతే రికవరీ ప్రక్రియ తప్పదని స్పష్టం చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్ 2021న జప్తు ఉత్తర్వులుజారీ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తదితర వారి ఆస్తుల అన్నింటి జప్తునకు బ్యాంకులు తత్సబంధ అధికారులకు జప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సహారా శాట్ను ఆశ్రయించింది. చదవండి: రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ! -
రూ. 62,603 కోట్లు కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం గత ఆదేశాలకు అనుగుణంగా రెండు సహారా సంస్థలు... ఎస్ఐఆర్ఈసీఎల్ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎస్హెచ్ఐసీఎల్ (సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లు రూ.62,602.90 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 30 నాటికి జరపాల్సిన ఈ మొత్తాలను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయడంలో విఫలమైతే, సహారా గ్రూప్ సుబ్రతారాయ్ని తిరిగి కస్టడీలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నెల 18న సెబీ దాఖలు చేసిన పిటిషిన్లో ముఖ్యాంశాలు, కేసు పూర్వాపరాలను చూస్తే... ► సహారా గ్రూప్ సంస్థలు రెండు ఎస్ఐఆర్ఈసీఎల్ , ఎస్హెచ్ఐసీఎల్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి భారీ నిధులు సమీకరించాయన్నది ప్రధాన ఆరోపణ. ► 2012, జూన్ 14న సహారా దాఖలు చేసిన స్టేట్మెంట్ల ప్రకారం, 2012 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎస్ఐఆర్ఈసీఎల్ చెల్లించాల్సిన అసలు రూ.16,997 కోట్లు. ఎస్హెచ్ఐసీఎల్ విషయంలో ఈ మొత్తం రూ. 6,352 కోట్లు. అసలుతోపాటు అప్పటికి చెల్లించాల్సిన వడ్డీసహా ఈ మొత్తాలను రూ.25,781.32 కోట్లుగా లెక్కతేల్చారు. ► సెబీ దాఖలు ఒక పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం 2012 ఆగస్టు 31న ఒక రూలింగ్ ఇస్తూ, వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకున్న నాటి నుంచీ 15 శాతం చొప్పున వడ్డీతోసహా మూడు నెలల్లోపు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. చెల్లింపులు జరిపిన విషయాన్ని డాక్యుమెంట్లుసహా సెబీకి సమర్పించాలని కూడా సహారాకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ► అయితే డబ్బు చెల్లింపు ప్రక్రియలో ఇన్వెస్టర్ల చిరునామాలు, బ్యాంక్ అకౌంట్ల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల నేపథ్యంలో జమ మొత్తాలను ప్రత్యేక సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ► అయితే 2012 ఉత్తర్వుల తర్వాత సహారా సంస్థలు ఇప్పటి వరకూ రూ.15,455.70 కోట్ల్ల మొత్తాలనే డిపాజిట్ చేశాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ తా జాగా పేర్కొంది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఈ మొత్తాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. 2020, సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వడ్డీ తోసహా సెబీ–సహారా రిఫండ్ అకౌంట్ ఆర్జన రూ.22,589.01 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ► చెల్లించాల్సింది రూ.రూ.25,781.32 కోట్లయితే, చెల్లించింది రూ.15,455.70 కోట్లు. వెరసి చెల్లించాల్సిన అసలు రూ.10,325.62 కోట్లని సెబీ పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15% వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2020 సెప్టెబర్ 30వ తేదీ నాటికి సహారా చెల్లించాల్సిన మొత్తాలు రూ.62,602.90 కోట్లకు చేరినట్లు సెబీ తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. ► బకాయిల చెల్లింపులకు సుప్రీం ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని వినియోగించుకోకుండా, సహారా గ్రూప్ సంస్థలు, ఆ సంస్థల చీఫ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శించింది. ► ఈ కేసులో 2014 మార్చి 4వ తేదీ నుంచీ 2016 మే 6వ తేదీ వరకూ (డైరెక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్రాయ్ చౌదరిసహా) తీహార్ జైలులో ఉన్న సుబ్రతా రాయ్ తల్లి మరణం నేపథ్యంలో అంతిమ సంస్కారాల కోసం విడుదలయ్యారు. సహారా ఆస్తులు అమ్మి అయినా, చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చిన రాయ్, ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కోర్టు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తాజాగా సెబీ ఆరోపించింది. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు ప్రకటిస్తుంటే సహారా గ్రూప్ తమ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్లను ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని కంపెనీ సోమవారం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు యూపీకి తిరిగివెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో స్ధానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని సహారా గ్రూప్ పేర్కొంది. మహమ్మారి విజృంభణ తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఈ కారణంతో గ్రూపు సంస్ధల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని గట్టి నిర్ణయం తీసుకున్నామని సహారా గ్రూప్ తెలిపింది. పూర్తి భద్రతతో ఉద్యోగులందరూ తమ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. క్షేత్రస్ధాయిలో పనిచేసే 4,05,874 మంది ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించామని, 4808 మంది కార్యాలయ ఉద్యోగులకు వేతన పెంపుతో ప్రమోషన్లు కల్పించామని పేర్కొంది. తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాథికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్ధలకు విజ్ఞప్తి చేసింది. చదవండి : ఇప్పట్లో ఆఫీస్ లేనట్టే! -
న్యూయార్క్ ప్లాజా అమ్మకానికి భారీ డీల్!
న్యూయార్క్ : సహారా గ్రూప్కి చెందిన ప్రఖ్యాత ప్లాజా హోటల్ను ఎట్టకేలకు ఇద్దరు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. న్యూయార్క్లోని ప్లాజా హోటల్లో సుబ్రతా రాయ్కి చెందిన సహారా గ్రూప్కు 70 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా సహారా సంస్థ ఈ హోటల్ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దుబాయ్కు చెందిన వ్యాపార వేత్తలు దీన్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న వైట్ సిటీ వెంచర్స్ యజమాని షాహల్ ఖాన్, హకీమ్ సంస్థ యజమాని కమ్రాన్ హకీమ్ 70 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ జూన్ 25తో ముగుస్తుంది. 1907లో ఈ హోటల్ ప్రారంభమైంది. అమెరికాలో ఈ ఒక్క హోటల్కే ‘నేషనల్ రిజిస్టార్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్’లో చోటు దక్కింది. 70 శాతం వాటాను సహారా గ్రూప్ కార్పొరేట్ పైనాన్స్ హెడ్ సందీప్ వాద్వావ, 5 శాతం వాటాను ఛత్వల్లు 2012లో కొనుగోలు చేశారు. అయితే సహారా చాలా కాలంగా ఈ హోటల్ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మిగతా 25 శాతం వాటాను కలిగి ఉన్న దుబాయ్ యువరాజు అల్వలీద్ బిన్ తాలీల్ వల్ల కుదరలేదు. అయితే గత ఏడాది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జానిస్ లాంగ్ లాసల్లే హోటల్ను వేలం వేసే బాధ్యతను తీసుకుంది. దాంతో 75 శాతం వాటాను విక్రయించినట్లు సందీప్, ఛత్వల్లు ప్రకటించారు. ఈ విక్రయ ఒప్పంద వ్యవహారం చాలా రహాస్యంగా సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హోటల్ను 2005లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసి దివాలా తీశారు. మొత్తానికి భారీ ఒప్పందంతో సహారా గ్రూప్ ఊపిరి పీల్చుకుంది. -
యాంబీ వ్యాలీ వేలాన్ని అడ్డుకుంటే జైలుకే...
-
యాంబీ వ్యాలీ వేలాన్ని అడ్డుకుంటే జైలుకే...
న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ వేలానికి అడ్డు పడుతున్న సహారా గ్రూపును సుప్రీంకోర్టు గురువారం గట్టిగా హెచ్చరించింది. వేలానికి ఎవరు అడ్డంకులు కల్పించినా కోర్టు ధిక్కారం కింద పరిగణించి జైలుకు పంపుతామని కఠిన స్వరంతో స్పష్టం చేసింది. యాంబీ వ్యాలీ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ సహారా గ్రూపు పుణె పోలీసులకు లేఖ రాయడం ద్వారా వేలానికి ఆటంకాలు కల్పించిందని సెబీ తరఫు న్యాయవాది గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 28న ఇందుకు సంబంధించి సహారా గ్రూపు రాసిన లేఖతో పోలీసులు యాంబీ వ్యాలీని తమ అధీనంలోకి తీసుకోవడంతో వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని, దాంతో అది నిలిచిపోయినట్టు తెలియజేశారు. దీన్ని జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. యాంబీ వ్యాలీని అధికారిక లిక్విడేటర్(బాంబే హైకోర్టు)కు 48 గంటల్లోనే స్వాధీనం చేయాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించింది. వేలానికి ఎవరు ఆటంకం కల్పించినా కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామని, 6 నెలల వరకు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. వేలాన్ని నిర్వహించుకోవచ్చని సెబీకి స్పష్టం చేసింది. చెల్లింపులు చేశాం... సెబీ ఆరోపణలను సహారా తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఖండించారు. వేలంలో పాల్గొనకుండా సహారా గ్రూపు అడ్డుకోలేదని చెప్పారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకు సెబీ ఖాతాలో ఇప్పటికే రూ.19,000 కోట్లు జమ చేశాం. సెబీ మాత్రం ఇన్వెస్టర్లకు రూ.60 కోట్లు మాత్రమే చెల్లించింది. సహారా భూములకు సంబంధించిన ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేశాం. వీటి విలువ రూ.20,000 కోట్లు ఉంటుంది. డిపాజిటర్లకు సహారా 95% వరకు తిరిగి చెల్లింపులు చేసింది’ అని సహారా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది. -
సహారా యాంబీ వేలీ వేలం ప్రక్రియ షురూ
రిజర్వ్ ధర రూ. 37,000 కోట్లు ముంబై: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్నకు చెందిన యాంబీ వేలీ రిసార్ట్ టౌన్ వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. రిజర్వ్ ధర రూ. 37,392 కోట్లుగా నిర్ణయిస్తూ అధికారిక లిక్విడేటర్ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రాజెక్ట్ మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని సహారా గ్రూప్ పేర్కొంది. బిడ్లను ఆహ్వానించడం, నో యువర్ క్లయింట్స్ మార్గదర్శకాలు ధృవీకరించుకునే రెండు ప్రక్రియలను మాత్రమే లిక్విడేటర్ ప్రారంభించారని తెలిపింది. తదుపరి విచారణ తేదీకి ముందే రూ. 1,500 కోట్లు డిపాజిట్ చేసిన పక్షంలో వేలం ప్రక్రియను ఉపసంహరిస్తారని సహారా వివరించింది. ఆధునిక విల్లాలు, గోల్ఫ్ కోర్స్, పాఠశాల, విమానాశ్రయం మొదలైన సదుపాయాలన్నీ ఉన్న అల్ట్రా ఎక్స్క్లూజివ్ నగరంగా ప్రకటనలో లిక్విడేటర్ పేర్కొన్నారు. పుణెలోని లోనావాలా దగ్గర దాదాపు 6,761.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్షిప్ ఉంది. మారిషస్కి చెందిన రాయల్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెట్ ఫండ్ సుమారు 1.67 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 10,700 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామంటూ గతవారం ముందుకొచ్చినా.. వేలం ప్రక్రియ యథాప్రకారం ప్రారంభం కావడం గమనార్హం. వేలం పూర్తి కావడానికి ముందు అనేక దశలు ఉంటాయని సహారా గ్రూప్ తరఫు న్యాయవాది గౌతమ్ అవస్తి తెలిపారు. యాంబీ వేలీ ప్రాజెక్టులోకి 1.67 బిలియన్ డాలర్లు సమకూర్చుకునే దిశగా ఆర్పీఐఎఫ్, విక్టర్ కోనిగ్ యూకేతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు. ఇన్వెస్టర్లతో చర్చలు జరిపేందుకు అనుమతించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ తేదిలోగా రూ. 1,500 కోట్లు కడితే వేలం ప్రక్రియను ఉపసంహరిస్తామని పేర్కొంది. గ్రూప్ సంస్థలు అక్రమంగా సమీకరించిన నిధులను వాపస్ చేయాల్సిన కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. -
వేలానికి సహారా యాంబి వ్యాలీ
-
యాంబీ వ్యాలీ వేలానికి సిద్ధం కండి!
న్యూఢిల్లీ : సహారా గ్రూప్కు చెందిన అత్యంత విలువైన ఆస్తి యాంబీ వ్యాలీ వేలం వేసే ప్రక్రియను చేపట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం, బొంబై హైకోర్టును ఆదేశించింది. యాంబీ వ్యాలీ ప్రాపర్టీస్కు సంబంధించిన విక్రయ నోటీసు ప్రచురించాలని పేర్కొంది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని అంతకముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే దీనిలో రూ.247 కోట్లను మాత్రమే సహారా చీఫ్ సెబీ అకౌంట్లో జమచేశారు. మిగతా మొత్తం రూ.305.21 కోట్లను ఆగస్టు 21 వరకు డిపాజిట్ చేస్తామని సుబ్రతారాయ్ తరుఫున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు. బ్యాలెన్స్ మొత్తంతో పాటు రూ.1500 కోట్లను సెప్టెంబర్ 7 వరకు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సుబ్రతారాయ్ను ఆదేశించింది. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. అంతేకాక సుబ్రతారాయ్ పెరోల్ గడువును అక్టోబర్ 10 వరకు కోర్టు పొడగించింది. తుదపరి విచారణను సెప్టెంబర్11న చేపట్టనునున్నట్టు కోర్టు చెప్పింది. -
విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు
దేశీయంగా 30 అసెట్స్ విక్రయంపైనా చర్చలు న్యూఢిల్లీ/న్యూయార్క్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్ .. విదేశాల్లో తమకున్న మూడు హోటల్స్ విక్రయంపై కసరత్తు చేస్తోంది. అలాగే దేశీయంగా 30 ప్రాపర్టీల అమ్మకానికి సంబంధించి రూ. 7,500 కోట్ల మేర వచ్చిన తుది బిడ్స్పై మదింపు జరుపుతోంది. 30 అసెట్స్ కోసం 250 పైగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) రాగా.. సుమారు 25–26 సంస్థలు తుది బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన సంస్థల్లో టాటా సంస్థలు, గోద్రెజ్, అదాని, పతంజలితో పాటు ఒమాక్సీ, ఎల్డెకో వంటి పలు రియల్ ఎస్టేట్ డెవలపింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరోవైపు, న్యూయార్క్లోని ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్.. లండన్లోని గ్రాస్వీనర్ హౌస్ హోటల్స్ విక్రయానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్లాజా హోటల్లో సహారా వాటాలు కొనేందుకు యాష్కెన్జీ అక్విజిషన్ కార్పొరేషన్తో సౌదీ ప్రిన్స్ అల్–వలీద్ బిన్ తలాల్ చేతులు కలిపారు. సహారా గ్రూప్ సంస్థలు చట్టవిరుద్ధంగా రూ. 24,030 కోట్లు సమీకరించడం, వాటిని తిరిగి చెల్లించలేకపోయినందువల్ల గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ సహారాను సుప్రీం కోర్టు జైలుకు పంపడం తెలిసిందే. ప్రస్తుతం పెరోల్ మీద బైటికొచ్చిన రాయ్.. జూన్ 15లోగా రూ. 1,500 కోట్లు కట్టకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి రానుంది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై సహారా మరింతగా కసరత్తు చేస్తోంది. -
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
-
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 కల్లా 2500 కోట్ల రూపాయలు సెబీ-సహారా అకౌంట్లో జమచేయాలని ఆదేశించింది. లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. జూన్ 15 వరకు సెబీ అకౌంట్లో డబ్బులు జమచేసేందుకు రెండు చెక్ లను ఇస్తానని సుప్రీంకోర్టుకు హాజరైన సుబ్రతారాయ్ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది. చెక్ లు క్లియర్ కాకపోతే, మళ్లీ తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా 25వేల కోట్ల మేర వసూలు చేసి, వాటిని తిరిగి ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడంతో అధినేత సుబ్రతారామ్ 2014 లో తీహార్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తన తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చిన సుబ్రతారాయ్, అప్పటినుంచి తన పెరోల్ ను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. సహారాకు చెందిన మహారాష్ట్రలోని లగ్జరీ అంబీ వ్యాలీ టైన్ షిప్ ను వేలం వేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలపై సుబ్రతారాయ్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబాల్ వాదించారు. ఇది 10వేల ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందని, దీని విలువ 34వేల కోట్ల మేర ఉంటుందని తెలిపారు. సెబీకి బాకీ పడిన దానికంటే దీని విలువే ఎక్కువని చెప్పారు. అయితే ఈ వేలాన్ని మరోసారి సమీక్షించాలనే కపిల్ సిబాల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా జూన్ 19న తమ ముందు హాజరుకావాలని సుబ్రతారాయ్ ను సుప్రీం ఆదేశించింది. సహారా ఇప్పటికే దేశీయంగా, విదేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తోంది. -
యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన యాంబీ వ్యాలీ లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.24,647 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ అకౌంట్ల ప్రత్యేక ఆడిట్ అనంతరం కొద్ది నెలల క్రితం ఈ నోటీసులు జారీ ఆయ్యాయి. సహారా గ్రూప్ ప్రతినిధి తాజాగా ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. 2012–13 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి రూ.48,086 కోట్ల ఆదాయం సంస్థ రికార్డ్ బుక్స్లో ప్రతిబింబించలేదని సంబంధిత ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. దీనితో పన్ను, జరిమానాగా ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సహారాకు చెందిన రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో (వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్లు) వైఫల్యం కేసులో యాంబీ వ్యాలీ అమ్మకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 28న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ సుప్రీంకోర్టు ముందు స్వయంగా హాజరుకావాల్సి ఉంది. -
డిపాజిట్ కట్టకుంటే ఆంబీ వేలం తప్పదు
సహారా గ్రూప్నకు సుప్రీంకోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ: ఈ నెల 17లోగా సెబీ–సహారా రీఫండ్ అకౌంట్లో రూ. 5,092.6 కోట్లు జమ చేయాల్సిందేనని, ఇందుకు సంబం ధించి గడువు పొడిగించే ప్రసక్తే లేదని సహారా గ్రూప్నకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో దాదాపు రూ. 39,000 కోట్లు విలువ చేసే సహారా గ్రూప్ ప్రాజెక్టు ‘ఆంబీ వ్యాలీ’ని వేలం వేయాలంటూ ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించింది. సెబీ–సహారా రీఫండ్ ఖాతాలో నగదు జమ చేసేందుకు గడువు పొడిగించాలని అభ్యర్ధిస్తూ సహారా గ్రూప్ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. సహారా గ్రూప్లో భాగమైన రెండు సంస్థలు ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లు తిరిగివ్వాల్సిన కేసుపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
సహారా రాయ్కి షాక్
• యాంబీ వ్యాలీ జప్తు • సుప్రీం కోర్టు ఆదేశం • ఫిబ్రవరి 20కి కేసు వాయిదా న్యూఢిల్లీ: రెండు సహారా గ్రూప్ సంస్థలు మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ, ఆ నిధుల పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పుణేలో సహారాకు చెందిన ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీని జప్తు చేయాలని సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ప్రఖ్యాత యాంబీ వ్యాలీ విలువ దాదాపు రూ.39,000 కోట్లు. యాంబీ తిరిగి ఇచ్చేయాలంటే!? యాంబీ వ్యాలీని సహారాకు వదిలివేయడానికి సైతం సుప్రీం కీలక సూచన చేసింది. వేలం వేయడానికి, నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడానికి ఉద్దేశించి ‘తాకట్టు, న్యాయ చిక్కుల్లోలేని’ అన్ని ఆస్తుల జాబితాను రెండు వారాల్లో అందించాలని సహారా గ్రూప్కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. చెల్లించాల్సిన అసలుకు సంబంధించి యాంబీ వ్యాలీని తిరిగి సహారాకు వదిలేస్తామని సూచించింది. ఫిబ్రవరి 20వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును తిరిగి విచారిస్తుంది. చెల్లించాల్సిన అసలులో గ్రూప్ దాదాపు రూ.11,000 చెల్లించిందనీ, ఇంకా రూ.14,000 కోట్లు సెబీ–సహారా అకౌంట్కు జమచేయాల్సి ఉందని బెంచ్ స్పష్టం చేసింది. తాజా ఆదేశాలు ఈ మొత్తాల సమీకరణకు దోహదపడతాయని సూచించింది. జస్టిస్ రాజన్ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 27 వరకూ పెరోల్ పొడిగింపు కాగా ఇంతక్రితం ఆదేశాలకు అనుగుణంగా సహారాగ్రూప్ అంతకుముందు రూ.600 కోట్లు సెబీ–సహారా అకౌంట్లో డిపాజిట్ చేసింది. దీనితో రాయ్ తాత్కాలిక పెరోల్ గడువును సుప్రీం ఫిబ్రవరి 27 వరకూ పొడిగించింది. ఫిబ్రవరి 6 నాటికి ఈ మొత్తం చెల్లించకుంటే, సహారా చీఫ్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని జనవరి 12న కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. జూలై 2019 నాటికి మొత్తం డబ్బు చెల్లించడానికి సంబంధించిన రోడ్మ్యాప్ను ఆమోదించాలని అంతక్రితం సహారా చీఫ్ కపిల్ సిబల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ‘‘చిన్న మొత్తాల్లో డబ్బు చెల్లింపులు కుదరవు’’ అని స్పష్టం చేసింది. తనఖా, న్యాయపరమైన చిక్కుల్లో లేని ఆస్తుల వేలం ద్వారా రూ.14,000 కోట్ల సమీకరణ సాధ్యమవుతుందని పేర్కొంది. వడ్డీసహా రూ.47,669 కోట్లు! ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తంపై 2016 అక్టోబర్ 31 వరకూ సహారా గ్రూప్ వడ్డీసహా రూ.47,669 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసు వాదనల సందర్భంగా సెబీ న్యాయవాది ప్రతాప్ వేణుగోపాల్ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. అసలు తర్వాత వడ్డీ విషయం! నిబంధనలకు వ్యతిరేకంగా గ్రూప్ డబ్బు సమీకరించిన విషయం సుస్పష్టమైందని, ఇది ఈ కేసులో కీలక అంశమని సుప్రీం పేర్కొంది. సహారాకు వ్యతిరేకంగా 2012 ఆగస్టులో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలు చేసిన పిటిషన్ పెండింగులో ఉన్నందున, ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఏవీ ఇవ్వరాదన్న సహారా న్యాయవాది వాదనను బెంచ్ తోసిపుచ్చింది. ‘‘ఆస్తుల జప్తు గురించి మీరు మాట్లాడండి. మాకు మరో ప్రత్యామ్నాయం లేదు. తనఖాలోని ఆస్తుల జాబితాను అందించండి. రూ.14,000 కోట్లు సమీకరించడానికి ఈ ఆస్తుల వేలం సరిపోతుంది. తదుపరి యాంబీ వ్యాలీని వెనక్కు తీసుకోడానికి అనుమతి స్తాం. మీరు చెప్పింది వింటాం’’ అని బెంచ్ తేల్చిచెప్పింది. అసలు వచ్చాక వడ్డీ గురించి పరిశీలిద్దామని బెంచ్ పేర్కొంది. డబ్బు చెల్లించడానికి సిబల్ సమయం అడుగుతూ.. నోట్ల రద్దు, ద్రవ్య లభ్యత సమస్యలను సైతం ప్రస్తావించారు. -
‘మోదీ ముడుపుల’ పిటిషన్ కొట్టివేత
-
‘మోదీ ముడుపుల’ పిటిషన్ కొట్టివేత
బిర్లా, సహారా గ్రూపుల నుంచి మోదీ ముడుపులు స్వీకరించారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ముడుపులు స్వీకరించారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్దారు సమర్పించిన సాక్ష్యాధారాలకు విచారణార్హత లేదంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘కామన్ కాజ్ ’ సంస్థ తరఫున వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ‘మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్ ప్రింటవుట్లు, సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదుకు, విచారణకు ఆదేశించలేం. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని బుధవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. సహారా గ్రూప్నకు సంబంధించి పిటిషన్ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో న్యాయప్రక్రియ దుర్వినియోగమయ్యే వీలుందని వ్యాఖ్యానించింది. -
సుబ్రతారాయ్కు పెరోల్ పొడిగింపు
• ఫిబ్రవరి 6లోపు రూ.600 కోట్లు డిపాజిట్ చేయాలి • లేకుంటే జైలుకేనని సుప్రీంకోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్కు సుప్రీంకోర్టు మరోసారి పెరోల్ పొడిగించింది. వచ్చే ఫిబ్రవరి 7 వరకు పొడిగించిన ధర్మాసనం ఆ తర్వాత కూడా జైలు బయటే ఉండాలంటే రూ.600 కోట్లను సెబీ-సహారా రిఫండ్ ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విఫలమైతే జైలుకు వెళ్లాల్సి ఉం టుందని హెచ్చరించింది. అదే సమయంలో జైల్లోనే ఉంచాలని తాము కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించగా... ఆస్తులను అమ్మి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయడం చేతకాకపోతే ఆ పని చేసేందుకు ప్రాపర్టీ రిసీవర్ నియామకాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. తొలుత రూ,1000 కోట్లను డిపాజిట్ చేయాలని సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ను ఆదేశించిన కోర్టు లేదంటే ప్రాపర్టీ రిసీవర్ను నియమిస్తామని పేర్కొంది. తర్వాత దాన్ని రూ.600 కోట్లకు తగ్గించింది. రూ.1.87 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్న గ్రూపు ఇప్పుడు బకారుులు చెల్లించలేకపోవడం ఏంటన్న ధర్మాసనం.. జైలు నుంచి విముక్తి పొందిన తర్వాత రాయ్ ఎంత డిపాజిట్ చేశారని కోర్టు ప్రశ్నించింది. రూ.11,000 కోట్లను డిపాజిట్ చేసినట్టు, ఇంకా రూ.11,136 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబల్ తెలిపారు. సెబీ లెక్క ప్రకారం బకారుులు రూ.14,000 కోట్లు ఉన్నాయన్నారు. 21 వారుుదాల్లో బకారుులన్నీ చెల్లించేస్తాం... సెబీకి రూ.11,136 కోట్ల బకారుులు చెల్లించే విషయంలో కార్యాచరణ ప్రణాళికను సహారా గ్రూపు సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. రెండున్నరేళ్ల కాల వ్యవధిలో మొత్తం బకారుులను 21 వారుుదాల్లో చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు అనుమతించాలని, మొత్తం బకారుులను చెల్లించాక సుబ్రతారాయ్తోపాటు గ్రూపు డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవిశంకర్ దూబేలను పూర్తి స్థారుులో విడుదల చేయాలని కోర్టుకు విన్నవించింది. చెల్లింపుల్లో విఫలమైతే ఈ ముగ్గురూ లొంగిపోతారని పేర్కొంది. -
మరోసారి సహారా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: సహారాగ్రూపు ఆస్తులను స్వాధీనం చేసుకునే లక్ష్యంలో భాగంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహారా కుచెందిన 5 భూముల (ల్యాండ్ పార్సిల్స్) వేలానికి రంగం సిద్ధం చేసింది. వీటి రిజర్వు ధర రూ.130కోట్లుగా సెబీ అంచనా వేసింది. ఎస్బిఐ క్యాప్స్ ఆధ్వర్యంలో డిశెంబర్ 28న మూడు ఆస్తులను వేలం నిర్వహించనుంది. వీటి రిజర్వు ధర రూ. 102 కోట్లు. అలాగే డిశెంబర్ 27న హెచ్డిఎఫ్సి రియాల్టీ రూ.29 కోట్లకు రిజర్వ్ ధరకు గాను మరో రెండు ప్రాపర్టీలను వేలం వేయనుంది. ఈ విషయాలను మార్కెట్ రెగ్యులేటరీ స్టాక్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సెబీ వేర్వేరు నోటీసుల్లో వెల్లడించింది. ఈ వేలానికి తేదీలను ప్రకటించింది. ఈ ప్రక్రియను ఎస్బిఐ క్యాప్, హెచ్డిఎఫ్సి రియాల్టీకి అప్పగించింది. నిబంధనలకు విరుద్దంగా రూ.25,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన సహారా గ్రూపు వాటిని చెల్లించడంలో విఫలైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 61 సహారా ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.6,500 కోట్ల నిధులను సేకరించనుంది. ఈ నిధుల రికవరీకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా ఆస్తులను సెబీ వేలం వేస్తోంది. ఇందుకుగాను ఎస్బిఐ కాపిటల్ మార్కెట్స్, హెచ్డిఎఫ్సి రియాల్టీలకు ఈ బాధ్యతలను అప్పగించింది. గత జులైలో ప్రకటించిన 58 ఆస్తులకు, అక్టోబర్ లో 13 ఆస్తుల వేలానికి ఇవి అదనం. కాగా ఈ కేసులో సహారా చీఫ్ సుబ్రతో రాయ్ జైలు కెళ్లారు. అయితే ఇటీవల ఆయన తల్లి మరణంతో పెరోల్పై విడుదలయ్యారు. వివిధ షరతుల మీద సుప్రీం ఆయన పెరోల్ ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. -
నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ శుక్రవారం సెబీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేయనుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరో ఇరువురు డెరైక్టర్లుఅశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే పెరోల్ గడువు పొడిగింపునకు సంబంధించి ఈ మొత్తాన్ని శుక్రవారం చెల్లించడం జరుగుతుందని రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు. -
మీపై నమ్మకం కోల్పోయాం
♦ రూ.12వేల కోట్లను ఎప్పటిలోగా చెల్లిస్తారు? ♦ రోడ్మ్యాప్ ప్రకటించండి సహారాకు సుప్రీం ఆదేశం ♦ రాయ్, మరో ఇద్దరి బెయిల్ పొడిగింపు న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్, గ్రూపు డెరైక్టర్లు అశోక్రాయ్ చౌదరి, రవిశంకర్దూబే పెరోల్ను సుప్రీంకోర్టు అక్టోబర్ 24 వరకు పొడిగించింది. రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వచ్చే విచారణ తేదీలోగా చెల్లించడంలో విఫలమైతే రాయ్తోపాటు మరో ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు బుధవారం సహారా కేసు విచారణకు వచ్చింది. సహారా తరఫున కపిల్ సిబల్, సెబీ తరఫున అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. మిగిలిన నగదు మొత్తాన్ని సెబీకి చెల్లించేందుకు రాయ్కు ఏడాదిన్నర సమయం ఇవ్వాలని కపిల్ సిబల్ వాదించారు. ఎలాంటి షరతులు విధించవద్దని కోరారు. షరతుల మధ్య ఆస్తుల విక్రయం సాధ్యం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం రాయ్ను ఆస్తులు విక్రయించకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించింది. సెబీ సైతం ఈ విషయంలో స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ‘సహారా సెబీకి గతంలో సమర్పించిన 60 ఆస్తుల చిట్టాలో 47 ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసిన విషయాన్ని వెల్లడించలేదు. మీపై నమ్మకం కోల్పోయాం. రూ.12 వేల కోట్ల మిగతా బకాయిలను ఏ విధంగా, ఎప్పటిలోగా చెల్లిస్తారన్న దానిపై నిర్మాణాత్మక ప్రతిపాదన/రోడ్మ్యాప్ను అఫిడవిట్ రూపంలో ఇవ్వండి’ అని ధర్మాసనం సహారాను ఆదేశించింది. అంతకు ముందు సెబీ తరఫున దత్తార్ వాదిస్తూ వడ్డీతో కలుపుకుని సహారా సెబీకి రూ.37వేల కోట్లను చెల్లించాల్సి ఉందని, ఇందులో అసలు మొత్తం రూ.24వేల కోట్లు అని తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి రూ.24,029 కోట్లను సహారా సేకరించగా... ఇప్పటి వరకు రూ.10,918 కోట్లు చెల్లించినట్టు వివరించారు. -
సహారా ఆస్తుల వేలానికి సెబీ నోటీసులు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన మరో 13 ఆస్తుల వేలానికి సెబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ పక్రియ కోసం ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్), హెచ్డీఎఫ్సీ రియల్టీ సేవలను సెబీ వినియోగించుకుంటోంది. వచ్చే నెలలో తాజాగా జరగనున్న13 ఆస్తుల వేలానికి సంబంధించి రిజర్వ్ ధరను దాదాపు రూ.1,400 కోట్లుగా సెబీ నిర్ణయించింది. అక్టోబర్ 27న ఏడు ఆస్తులకు హెచ్డీఎఫ్సీ రియల్టీ వేలం నిర్వహిస్తుందని సెబీ తెలిపింది. వీటి రిజర్వ్ ధర రూ.710 కోట్లు. ఇక ఎస్బీఐ క్యాప్స్ ఆరు ఆస్తులకు అక్టోబర్ 25న వేలం నిర్వహిస్తుందని పేర్కొన్న సెబీ, దీని రిజర్వ్ ధరను రూ.672 కోట్లుగా తెలిపింది. -
విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా మరోసారి వెనుకంజ
లండన్/న్యూఢిల్లీ: విదేశాల్లోని మూడు హోటళ్ల విక్రయాలకు సంబంధించి మరో తాజా ఆఫర్నూ సహారా గ్రూప్ తిరస్కరించింది. ఇందుకు సంబంధించి బ్రిటన్ ఇతర పశ్చిమాసియా దేశాలకు చెందిన- 3 అసోసియేట్స్ కన్సార్షియం చేసిన 1.3 బిలియన్ డాలర్ల ఆఫర్ను తిరస్కరించినట్లు పేర్కొంది. మూడు హోటళ్లలో ఒకటి లండన్లో (గ్రాస్వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ (న్యూయార్క్)లో ఉన్నాయి. తాజా ఆఫర్ను ‘హోటళ్ల రేటు తగ్గించే ప్రయత్నంగా’’గా సహారా పేర్కొంది. అయితే తాము చేసిన ధర ప్రతిపాదన పూర్తి సమంజసమైనదేనని 3 అసోసియేట్స్ మేనేజింగ్ డెరైక్టర్ సాగర్ పేర్కొన్నారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద హోటల్ బిడ్ అని, తాము తగిన ఆఫర్ను ఇచ్చామని తెలిపారు. -
కతార్ ఇన్వెస్ట్మెంట్కు సహారా విదేశీ హోటళ్లు!
నేడు సుప్రీం అనుమతికి పిటిషన్.. న్యూఢిల్లీ : విదేశాల్లోని మూడు హోటళ్లలో వాటాల విక్రయానికి సహారా గ్రూప్కు లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హోటళ్లను 1.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10,720 కోట్లు) కతార్ ఇన్వెస్ట్మెంట్కు విక్రయించడానికి ఒక అవగాహన కుదిరినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మూడు హోటళ్లలో ఒకటి లండన్లో (గ్రాస్వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ (న్యూయార్క్)లో ఉన్నాయి. అమ్మకం ద్వారా వచ్చే మొత్తం నిధుల్లో తన ప్రధాన రుణ దాత రూబిన్ బ్రదర్స్కు 995 మిలియన్ డాలర్లను కంపెనీ చెల్లించే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అమ్మకం ప్రక్రియకు ఆమోదం కోసం సహారా శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆమోదం లభిస్తే, అమ్మకం ప్రక్రియ పూర్తికి దాదాపు 2 నెలలు పడుతుంది. రెండు గ్రూప్ సంస్థలు- ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి చెల్లించలేని కేసులో... రెండేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ ప్రస్తుతం పెరోల్పై ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పొందడానికి సహారా చీఫ్ రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
సహారా ఆస్తులు అమ్మండి..
సెబీకి సుప్రీం ఆదేశం ఇందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచన న్యూఢిల్లీ: చిన్న మదుపుదారులకు సహారా గ్రూప్ సంస్థలు చెల్లించాల్సిన రూ.30,000 కోట్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. డబ్బు చెల్లింపులకు గాను ఆ సంస్థ ఆస్తులను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విక్రయించడానికి వీలు కల్పించింది. ఇందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. తాను ఆస్తులను విక్రయించలేకపోతున్నట్లు సహారా ఇచ్చిన వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తాజా ఆదేశాలు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల నుంచీ సహారా గ్రూప్ చీఫ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో ఆయనకు ఎటువంటి అదనపు సదుపాయాలూ కల్పించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తనఖాలోలేని దాదాపు 89 ఆస్తులను అమ్మడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. విక్రయించేందుకు గుర్తించిన ఆస్తుల్లో ఆంబే వ్యాలీ, విదేశాల్లోని సహారా ఆస్తులు లేవు. వచ్చే వారంలోగా ఆస్తుల అమ్మకపు ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. ఈ కేసులో సహారా చీఫ్ను ఎలా జైలుకు పంపుతారని ప్రశ్నించిన సంస్థ న్యాయవాది కపిల్ సిబల్పై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు అంశాలపై వాదించాలితప్ప, అనవసర అంశాలపై వద్దని స్పష్టంచేసింది. -
సహారా ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ వేలం?
న్యూయార్క్: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహారా గ్రూప్.. అమెరికాలో తనకున్న ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటల్స్ను వేలం వేసే సూచనలున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలం ఏప్రిల్ 26న జరిగే అవకాశముందని, దీని విలువ దాదాపుగా 1 బిలియన్ డాలర్లు ఉంటుందని ఒక అంచనా. కాగా ఈ విషయమై సహారా గ్రూప్ స్పందించలేదు. గత రెండేళ్లుగా జైలులో ఉన్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ను బయటకు తీసుకురావడం కోసం విశ్వప్రయత్నాలు జరుగుతున్న విషయం విదితమే. -
సహారా ఆంబీ వ్యాలీకి కొద్దిసేపుతాళాలు
పూనే: పన్ను చెల్లింపుల్లో వైఫల్యం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సహారా గ్రూప్కు చెందిన ప్రతిష్టాత్మక ఆంబీ వ్యాలీ రిసార్ట్కు తాళం వేసింది. అయితే కొద్ది గంటల తరువాత బకాయి పన్నులు చెల్లించడంతో టౌన్షిప్కు వేసిన సీల్ను తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు రూ.4.50 కోట్ల వ్యవసాయేతర పన్నుల చెల్లింపులకు గాను ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంబే వ్యాలీ ధనికులు, ప్రముఖులకు సంబంధించి ‘హిల్ సిటీ ప్యారడైజ్’గా ప్రసిద్ధి. -
జైల్లో రాజభోగాలకు రూ 1.23 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైల్లోనూ రాజభోగాలు అనుభవించారు. ఏడాదికిపైగా ప్రత్యేక సెల్లో ఉన్న రాయ్ ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడిపారు. ప్రత్యేక వసతులు కల్పించినందుకుగాను తీహార్ జైలు అధికారులకు ఆయన చెల్లించిన మొత్తం 1.23 కోట్ల రూపాయలు. భద్రత, విద్యుత్, కాన్ఫరెన్స్ రూమ్ అద్దె, భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించినందుకు జైలు అధికారులు ఈ మొత్తాన్ని వసూలు చేశారు. ఆయనకు వీడియో కాన్ఫరెన్స్, వైఫై, ఏసీ గదులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ల్యాప్టాప్లు, ల్యాండ్ ఫోన్లు, ఓ సెల్ఫోన్, సహాయ సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించారు. సహారా గ్రూప్ జైలు అధికారులకు ఇంకా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు చెప్పారు. కాగా గత నెలలో రాయ్ను సాధారణ సెల్కు మార్చారు. డిపాజిటర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైనందుకు రాయ్తో పాటు సహారా గ్రూపు డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబెలను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తీహార్ జైలుకు తరలించారు. రాయ్కు బెయిల్ మంజూరు చేయడానికి 10వేల కోట్ల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 5 వేల కోట్లు రూపాయల నగదు, మరో ఐదు వేల కోట్లకు చెక్ రూపంలో సమర్పించాలని సూచించింది. అయితే ఈ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆయన విడుదల కాలేదు. తీహార్ జైల్లో రాయ్కు అత్యంత భద్రత ఉండే వార్డును కేటాయించారు. బెయిల్ కోసం డబ్బులు సమకూర్చుకునేందు కోసం న్యూయార్క్, లండన్లో ఉన్న రాయ్ హోటళ్లను అమ్ముకునేందుకు వీలుగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు. -
గతవారం బిజినెస్
సహారా ఇండియాకు చుక్కెదురు సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్లో భాగమైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. రికార్డు స్థాయికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం మైనస్ 4.95%కి పడిపోయింది. ఇది రికార్డ్ స్థాయి కనిష్టం. ఈ ఏడాది జూలైలో ఇది మై నస్ 4.05గా ఉంది. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా 10వ నెల. ద్రవ్యోల్బణం తగ్గడం కొనసాగుతుండటంతో ఈ నెల 29న జరిగే పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగిపోయాయి. ఈ-కామర్స్లోకి మహీంద్రా గ్రూప్ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన మహీంద్రా టీయూవీ 300కి సం బంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్వో వీఎస్ పార్థసారథి తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్! దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. మొబైల్ పేమెంట్స్ వృద్ధి వల్ల ఐటీ, టెలికం, బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ కంపెనీలు బాగా ప్రయోజనం పొందే అవకాశమున్నట్లు పేర్కొంది. ఉక్కు దిగుమతులపై 20 శాతం సుంకం విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని కేటగిరీల ఉక్కు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం రక్షణాత్మక సుంకం విధించింది. చౌక ధరల్లో ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు వెల్లువెత్తుతుండటంతో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సుంకం 200 రోజుల పాటు అమల్లో ఉంటుందని వివరించారు. తగ్గిన ఎగుమతులు ఎగుమతుల క్షీణ పరిస్థితి కొనసాగుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. 2014 ఆగస్టు నెల ఎగుమతుల విలువతో పోల్చిచూస్తే, 2015 ఆగస్టులో విలువ అసలు పెరక్కపోగా 21 శాతం క్షీణించింది. 21.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఆగస్టు నెలలోనూ 10 శాతం క్షీణించి, 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇండిగో ఐపీఓకు సెబీ ఆమోదం చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. పసిడి, వెండి టారిఫ్ విలువ తగ్గింపు పసిడి, వెండి దిగుమతుల టారిఫ్ విలువలు తగ్గాయి. 10 గ్రాముల పసిడి టారిఫ్ విలువ 369 డాలర్ల నుంచి 359కి, వెండి కేజీ విలువ 471 డాలర్ల నుంచి స్వల్పంగా 470 డాలర్లకు దిగింది. అంతర్జాతీయంగా ఈ మెటల్స్ ధర తగ్గడంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. చెక్కు బౌన్స్ కేసుల్లో చట్ట సవరణకు ఓకే చెక్కు బౌన్స్ కేసుల్లో లక్షలాది మందికి ప్రయోజనం కలిగే చర్యల కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై చెక్కు బౌన్స్లకు సంబంధించి.. చెల్లింపు జరగాల్సిన బ్యాంక్ బ్రాంచ్(ప్రెజెంట్ చేసిన చో టు) పరిధిలోని కోర్టుల్లో మాత్రమే కేసులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి వీలుకల్పించే విధంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్డినెన్స్-2015కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంటనూనెల దిగుమతి సుంకం పెంపు రైతు ప్రయోజనాలను పరిరక్షించడానికి, దే శీ ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం.. ముడి వంటనూనెల దిగుమతి సుంకం 7.5% నుంచి 12.5%కి, రిఫైన్డ్ వంటనూనెల దిగుమతి సుంకం 15% నుంచి 20%కి పెరిగింది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వస్తున్నాయి.. సూక్ష్మ పరిశ్రమలు, సన్నకారు రైతులకు ప్రాథమిక బ్యాంకింగ్ సే వల్ని అందించే లక్ష్యంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 10 సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ మొదలైన సంస్థలు ఉన్నాయి. బంగారం దిగుమతులు 5 శాతం తగ్గొచ్చు! బంగారపు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ను అరికట్టడానికి, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన గోల్డ్ బాండ్ (జీబీఎస్), గోల్డ్ మానిటైజేషన్ (జీఎంఎస్) పథకాల వల్ల బంగారం దిగుమతులు వచ్చే 12-18 నెలల కాలంలో 3-5 శాతం తగ్గుతాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఐఎంఎఫ్ వైఫల్యాలతోనే బ్రిక్స్ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో సంస్కరణల అమల్లో వైఫల్యమే బ్రిక్స్ బ్యాంక్ తదితర బహుళ ఆర్థిక సంస్థల ఆవిర్భావానికి కారణమని అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నాథన్ షీట్స్ పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే పలు సంస్కరణలు 2010లో ప్రతిపాదించినా.. అమెరికా వీటో అధికారాల వల్ల చోటు చేసుకోలేదని ఆయన వివరించారు. ఆస్ట్రేలియా కంపెనీతో డా.రెడ్డీస్ ఒప్పందం ఆస్ట్రేలియా కంపెనీ హాచ్టెక్కు చెందిన తలలో పేల నివారణకు వినియోగించే ‘ఎక్సిగ్లైజ్’ లోషన్పై ముందస్తు వాణిజ్య హక్కుల ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దక్కిం చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్ ముందుగా రూ. 66 కోట్లను (10 మిలియన్ డాలర్లు) చెల్లిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ వాణిజ్యపరంగా విజయవంతం అయితే దశల వారీగా రూ. 330 కోట్ల (50 మిలియన్ డాలర్లు) వరకు చెల్లిస్తుంది. భారత్లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల ప్లాంటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్లో రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీశ్ శర్మ తెలిపారు. ఆన్లైన్ షాపింగ్కు ఎస్బీఐ కార్డు ‘సింప్లీక్లిక్’ ఆన్లైన్ షాపింగ్ అవసరాల కోసం సింప్లీక్లిక్ పేరిట ఎస్బీఐ కార్డ్ సంస్థ ప్రత్యేక క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. అమెజాన్ ఇండియా, బుక్మైషో, క్లియర్ట్రిప్, ఓలా క్యాబ్స్, లెన్స్కార్ట్, ఫుడ్ పాండా, ఫ్యాబ్ ఫర్నిష్ వంటి ఏడు సంస్థల భాగస్వామ్యంతో దీన్ని రూపొందించింది. దీన్ని వినియోగించిన వారికి సాధారణ కార్డులతో పోలిస్తే అయిదు రెట్లు రివార్డ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయని ఎస్బీఐ కార్డ్ సీఈవో విజయ్ జసూజా తెలిపారు. -
అమెరికా కోర్టులో సహారా గ్రూప్కు ఊరట
న్యూయార్క్: చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్కి నిధులు సమీకరించడంలో తలమునకలైన సహారా గ్రూప్కి అమెరికా కోర్టులో ఊరట లభించింది. అమెరికాలో అమ్మకానికి పెట్టిన సహారా గ్రూప్ రెండు హోటల్స్ను తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ అమెరికా కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్లోని రెండు హోటల్స్తో పాటు లండన్లోని గ్రాస్వీనర్ హోటల్ రీఫైనాన్సింగ్కి డీల్ కుదర్చాల్సిన టీమ్లో దుబాయ్కి చెందిన ట్రినిటీ వైట్ సిటీ వెంచర్స్తో తాము జతకట్టినట్లు జేటీఎస్ పేర్కొంది. అయితే, సహారా గ్రూప్, ట్రినిటీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్ కలిసి మధ్యలోనే తమ సంస్థను పక్కన పెట్టేశాయని, దీనివల్ల తమకు భారీగా నష్టం జరిగిందని తెలియజేసింది. ఇందుకు పరిహారంగా మూడు సంస్థలూ కలిసి 350 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జేటీఎస్ దావా వేసింది. మరోవైపు, ట్రినిటీ వైట్ సిటీకి జేటీఎస్కి మధ్య లావాదేవీల విషయం తమకు తెలియదని, తమకి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి అన వసరంగా లాగుతున్నారని సహారా గ్రూప్ తెలిపింది. దీనిపై విచారించిన అమెరికా ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ వేసిన దావాను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
సహారా ఇండియా ఫైనాన్షియల్ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్లో భాగమైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. సెప్టెంబర్ 3 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది. వ్యాపార నిర్వహణ సమర్ధత కోల్పోయిందనే కారణంతో జులైలోనే సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్ను కూడా ఆర్బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లకు వేల కోట్ల రూపాయలు తిరిగివ్వాల్సిన కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ గతేడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు. -
సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు
సెబీ కీలక నిర్ణయం ఫండ్ వ్యాపారానికి సంస్థ తగదని వ్యాఖ్య {పస్తుత ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ముంబై : సహారా గ్రూప్కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్కు సహారా మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్ను (కార్యకలాపాలను) బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు 22 పేజీల ఉత్తర్వును వెలువరించింది. సహారా పోర్టిఫోలియో మేనేజ్మెంట్ లెసైన్స్ను కూడా ఇటీవల సెబీ రద్దు చేసింది. సహారాకు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.24,000 కోట్లు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించడంలో వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ కేసుల్లో ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో రూలింగ్ ఇవ్వగా దాన్ని సంస్థ ఇప్పటికీ చెల్లించలేకపోతోంది. సేవల తక్షణ నిలుపుదల... తన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. ఇప్పటినుంచీ సహారా మ్యూచువల్ ఫండ్, సహారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రస్తుత లేదా తాజా మదుపరుల నుంచి ఫండ్కు సంబంధించి డబ్బులు తీసుకోరాదని పేర్కొంది. దీనితోపాటు సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ (సహారా స్పాన్సర్), సహారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల (సహారా ఏఎంసీ) కార్యకలాపాలను వీలైనంత త్వరలో కొత్త స్పాన్సర్కూ, సెబీ ఆమోదిత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి బదలాయించాలని సహారా ఎం ఎఫ్ను సెబీ ఆదేశించింది. వచ్చే ఆరు నెలల్లో సహారా లెసైన్స్ పూర్తిగా స్తంభించిపోతుందని పేర్కొంటూ... ఈ లోగా యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలన్నీ తీసుకోవాలని సహారా ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఆదేశించింది. రానున్న ఐదు నెలల్లో ఫండ్ బదలాయింపు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేదంటే మరో 30 రోజుల్లో సంస్థే ఇన్వెస్టర్లకు కేటాయించిన యూని ట్లను తప్పనిసరిగా అమ్మేసి, ఎటువంటి అదనపు వ్యయం లేకుండా ఆయా ఫండ్ విలువను ఇన్వెస్టర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది. -
సహారా మ్యూచువల్ ఫండ్ లైసెన్సు రద్దు
సహారా గ్రూపునకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్ను సెబి రద్దుచేసింది. ఈ వ్యాపారం చేయడానికి ఇక అది ఏమాత్రం పనికిరాదని తేల్చేసి, దాని ఆపరేషన్లను మరో ఫండ్ హౌస్కు బదిలీ చేయాలని ఆదేశించింది. సహారా గ్రూపునకు చెందిన రెండు కంపెనీలు రూ. 24 వేల కోట్లు చెల్లించాలంటూ సెబి ఆదేశించిన తర్వాతి నుంచి సహారా గ్రూపునకు, సెబికి మధ్య చాలా కాలంగా రెగ్యులేటరీ, చట్టపరమైన వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవలే ఓ సహారా కంపెనీకి చెందిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లైసెన్సును కూడా సెబి రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా సహారా మ్యూచువల్ ఫండ్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. సహారా మ్యూచువల్ ఫండ్, సహారా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రస్తుత, కొత్త మదుపుదారుల నుంచి సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం వెంటనే ఆపేయాలని కూడా సెబి ఆదేశించింది. -
సహారాపై అమెరికా కోర్టులో దావా
న్యూఢిల్లీ : చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్కి నిధులు సమీకరించడంలో తలమునకలైన సహారా గ్రూప్కి రోజుకో సమస్య వచ్చి పడుతోంది. అమెరికాలో అమ్మకానికి పెట్టిన సహారా గ్రూప్ రెండు హోటల్స్ను తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా హాంకాంగ్కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ అమెరికా కోర్టులో దావా వేసింది. న్యూయార్క్లోని రెండు హోటల్స్తో పాటు లండన్లోని గ్రాస్వీనర్ హోటల్ రీఫైనాన్సింగ్కి డీల్ కుదర్చాల్సిన టీమ్లో దుబాయ్కి చెందిన ట్రినిటీ వైట్ సిటీ వెంచర్స్తో తాము జతకట్టినట్లు జేటీఎస్ పేర్కొంది. అయితే, సహారా గ్రూప్, ట్రినిటీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్ కలిసి మధ్యలోనే తమ సంస్థను పక్కన పెట్టేశాయని, దీనివల్ల తమకు భారీగా నష్టం జరిగిందని తెలియజేసింది. ఇందుకు పరిహారంగా మూడు సంస్థలూ కలిసి 350 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జేటీఎస్ దావా వేసింది. మరోవైపు, ట్రినిటీ వైట్ సిటీకి జేటీఎస్కి మధ్య లావాదేవీల విషయం తమకు తెలియదని, తమకి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి అన వసరంగా లాగుతున్నారని సహారా గ్రూప్ తెలిపింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది. -
గ్రాస్వీనర్ హోటల్ కొనుగోలు రేసులో సహారా!
లండన్/న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్ తాజాగా సొంత గ్రాస్వీనర్ హోటల్ వేలంలో చేజారిపోకుండా మళ్లీ కొనుక్కునేందుకు పోటీపడుతోంది. లండన్లోని ఈ హోటల్తో పాటు మరో రెండు విదేశీ హోటల్స్ కొనుగోలు కోసం సహారా గ్రూప్కి గతంలో బ్యాంక్ ఆఫ్ చైనా రుణం ఇచ్చింది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో సహారా గ్రూప్ సాంకేతికంగా డిఫాల్ట్ కావడంతో దీన్ని వేలానికి ఉంచింది. దీంతో బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి తీసుకున్న రుణాలను మరో ఆర్థిక సంస్థకు బదలాయించే ప్రక్రియ ఒకవైపు కొనసాగిస్తూనేమరో ఫైనాన్షియర్ ఊతంతో గ్రాస్వీనర్ హోటల్కు బిడ్డింగ్ కూడా వేస్తోంది సహారా గ్రూప్. ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్ల చెల్లింపులు జరపాల్సిన కేసులో ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉన్న గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ విడుదల కోసం నిధులు సమీకరించుకోవడంతోపాటు గ్రాస్వీనర్ హోటల్ కూడా చేజారిపోకుండా చూడాలన్నది కూడా కంపెనీ లక్ష్యం కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2010-2012 మధ్య కాలంలో 1.55 బిలియన్ డాలర్లు పెట్టి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన మూడు ప్రాపర్టీల విలువ ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా. -
సహారాకు కాస్త ఊరట..
-
సహారాకు కాస్త ఊరట..
బెయిల్ నిధుల సమీకరణకు మరో 3 నెలల గడువు న్యూఢిల్లీ: డిపాజిటర్లకు నిధుల చెల్లింపు కేసులో సహారా గ్రూప్నకు కాస్త ఊరట లభించింది. గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్ కోసం అవసరమైన రూ. 10,000 కోట్ల సమీకరణకు సుప్రీం కోర్టు మరో 3 నెలల గడువునిచ్చింది. ఈలోగా విదేశాల్లో ఉన్న ప్రాపర్టీల విక్రయానికి సంబంధించిన చర్చలు పూర్తి చేసుకోవాలని సోమవారం సూచించింది. లేని పక్షంలో కోర్టు రిసీవరును నియమించి వీటిని వేలం వేయాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కొనుగోలుదారులతో చర్చల కోసం తీహార్ జైలు కాంప్లెక్స్లోని కాన్ఫరెన్స్ రూమ్ను సుబ్రతా రాయ్ ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తూ గతేడాది ఆగస్టు 1న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. బెయిల్ నిధుల సమీకరణ కోసం సహారా గ్రూప్ ప్రతిపాదించిన ప్రణాళికపై ఒకింత సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. అవసరమైతే దేశీయంగా 10 ప్రాపర్టీలను కూడా విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది. అప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు సమకూరకపోతే యాంబీ వ్యాలీ ప్రాపర్టీలో కొంత భాగం అమ్మకానికి అనుమతి ఇచ్చింది. డిపాజిటర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసులో సుబ్రతా రాయ్ ఏడాది కాలంగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం రూ. 10,000 కోట్లు (రూ. 5,000 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్ గ్యారంటీ రూపంలో) కట్టాల్సి ఉంది. ఈ నిధుల కోసమే లండన్లోని గ్రాస్వీనర్ హౌస్, న్యూయార్క్లోని డ్రీమ్ డౌన్టౌన్, ది ప్లాజా హోటల్స్ను సహారా గ్రూప్ విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా హాంకాంగ్కు చెందిన నువామ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఈ నిధుల సమీకరణ యత్నాల్లో తోడ్పడుతున్నట్లు సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. 30 వేల కోట్లు ఎలా తెస్తారో చెప్పండి.. బెయిల్కి అవసరమైన రూ. 10,000 కోట్లను సమకూర్చుకునేందుకే సతమతమవుతున్న సుబ్రతా రాయ్.. విడుదలైన తర్వాత డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ. 30,000 కోట్లను ఏ విధంగా తేగలరంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి కూడా నిధుల సమీకరణ ప్రణాళిక ఇవ్వాలంటూ సహారా గ్రూప్ తరఫు నాయవాది కపిల్ సిబల్కు సూచించింది. అయితే, ముందుగా బెయిల్ అడ్డంకిని అధిగమించిన తర్వాత దాని గురించీ తెలియజేయగలమని సిబల్ పేర్కొన్నారు. -
సహారా రాయ్కు మరో సంకటం
మిరాచ్ 40 కోట్ల డాలర్ల పరువునష్టం దావా! న్యూయార్క్: సహారా గ్రూప్పై మిరాచ్ కేపిటల్ 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,500 కోట్లు) పరువునష్టం దావా వేయనుంది. ఇందుకు సంసిద్ధం అవుతున్నట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సహారాతో ఒప్పందం బెడిసికొట్టిన నేపథ్యం- తమ సంస్థ పేరు ప్రతిష్టలను, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మిరాచ్ కేపిటల్ ఆరోపించింది. వివరాల్లోకి వెళితే... తమ చీఫ్ సుబ్రతోరాయ్ బెయిల్ వ్యవహారంలో రూ.10,000 కోట్ల నిధులను సమకూర్చుకోడానికి ప్రయత్నిస్తున్న సహారా- విదేశాల్లో ఉన్న తమ మూడు హోటళ్ల విక్రయానికి మిరాచ్ కేపిటల్తో 2.05 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో బ్యాంకర్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉన్నట్లు మిరాచ్ కేపిటల్ తమకు తెలిపిందని సుప్రీంకోర్టుకు సహారా గ్రూప్ తెలిపింది. అయితే ఈ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంక్ ప్రకటించడంతో సహారా-మిరాచ్ మధ్య వివాదం ప్రారంభమైంది. తమను మిరాచ్ తీవ్రంగా మోసపుచ్చిందనీ, దీనికిగాను క్రిమినల్ కేసును దాఖలు చేసినట్లు సహారా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిరాచ్ కేపిటల్ కూడా తాజాగా సహారా గ్రూప్పై న్యాయ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. -
సహారాకు సుప్రీం చివరి చాన్స్
- బెయిల్ నిధుల సమీకరణకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టీకరణ - ఆస్తుల విక్రయానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్కు రూ.10,000 కోట్ల సమీకరణ యత్నాల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం చివరి అవకాశం ఇచ్చింది. విదేశాల్లోని గ్రూప్ ఆస్తుల విక్రయం, తద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదిత పార్టీలతో చర్చలకు ఇప్పటికి రెండు సార్లు అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో ఇక చివరి వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. నిజానికి గ్రూప్ ఆస్తుల అమ్మకానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం తొలుత హెచ్చరించింది. సహారా నుంచి కొత్తగా వకాల్తా పుచ్చుకున్న కపిల్ సిబల్ విన్నపం మేరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ఆస్తుల అమ్మకం విషయంలో గ్రూప్కు చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రతిపాదిత డీల్ పురోగతి అంశాలను వారం లోపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి, అలాగే ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానానికి సలహాలను అందిస్తున్న న్యాయవాదికి తెలియజేయాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. డీల్ ప్రతిపాదన తుది రూపునకు 2-3 నెలలే తీసుకోవాలని కూడా సూచించింది. ప్రతిపాదిత డీల్పై చర్చలకు తీహార్ జైలు పరిధిలో రాయ్కు కొన్ని ప్రత్యేక సదుపాయాలను పొడిగించాలన్న విన్నపాన్ని ఆమోదించడానికి కోర్టు నిరాకరించింది. అయితే కేవలం చర్చలకు (మార్చి 23 వరకు) మాత్రం ఇంతకుముందు 2 గంటల సమయాన్ని మరో 3 గంటలు పొడిగించింది. -
అమ్మకానికి సహారా గ్రాస్వీనర్ హౌస్
లండన్: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్ల క్రితం సహారా గ్రూప్ లండన్లో కొనుగోలు చేసిన గ్రాస్వీనర్ హౌస్ హోటల్ను రుణదాతలు అమ్మకానికి పెట్టారు. దీని విలువ దాదాపు 500 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఉంటుందని అంచనా. సహారా గ్రూప్నకు విదేశాల్లో గ్రాస్వీనర్ హౌస్తో పాటు ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ పేరిట మరో రెండు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టర్లకు చెల్లింపుల కేసుకు సంబంధించి అరెస్టయిన గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. బెయిల్ కోసం కావాల్సిన నిధులను ఈ హోటల్స్పై రుణం కింద తెచ్చుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రాస్వీనర్ హౌస్పై తీసుకున్న రుణాలను సహారా సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో దీని విక్రయ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ను రుణదాతలు ఎంపిక చేసినట్లు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రియల్టీ కన్సల్టెన్సీ దిగ్గజం జోన్స్ లాంగ్ లాసల్ (జేఎల్ఎల్) దీనికి కొనుగోలుదారును అన్వేషించనుంది. 2010-2012 మధ్య కాలంలో సహారా గ్రూప్.. గ్రాస్వీనర్ హౌస్, ప్లాజా, డ్రీమ్ డౌన్టౌన్ హోటళ్లను 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం రియల్టీ రేట్లు పెరిగిన నేపథ్యంలో వీటి విలువ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. వీటి కొనుగోలు కోసం బ్యాంక్ ఆఫ్ చైనా వద్ద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ దగ్గర్నుంచి కొత్తగా రుణం తీసుకునేందుకు సహారా ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. గ్రాస్వీనర్ హౌస్ కథ ఇదీ.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సర్ ఎడ్వర్డ్ ల్యుటెన్స్ డిజైన్ చేసిన లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ గ్రాస్వీనర్ హౌస్ను 1929లో నిర్మించారు. అంతర్గతంగా 56,700 చ.మీ. మేర విస్తరించిన ఈ హోటల్లో 74 సూట్స్ సహా మొత్తం 494 రూమ్స్ ఉన్నాయి. యూరప్లోనే అతి పెద్ద ఫైవ్స్టార్ బాల్రూమ్ ఇందులో ఉంది. అలాగే పేరొందిన పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2008లో దాదాపు రూ. 1,300 కోట్లతో దీనికి కొత్త హంగులు అద్దారు. దీన్ని ప్రస్తుతం జేడబ్ల్యూ మారియట్ నిర్వహిస్తోంది. 2010లో దీని కొనుగోలుకు సహారా గ్రూప్ 470 మిలియన్ పౌండ్లు వెచ్చించింది. అప్పట్లో ఇది అత్యంత భారీ డీల్. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ చైనా రుణాలను తిరిగి చెల్లించగలమని సహారా గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. సాంకేతికాంశాలే సమస్యకు కారణమని పేర్కొంది. -
సహారా గ్రూప్కు మరో ఎదురుదెబ్బ
సహారా ఏఎంసీ రిజిస్ట్రేషన్ రద్దు ముంబై: సంక్షోభంలో ఉన్న సహారా గ్రూప్ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా స్టాక్మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. పోర్ట్ఫోలియో మేనేజరుగా సహారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్తో పాటు కొన్ని గ్రూప్ సంస్థల గత చరిత్ర, వ్యవహార శైలి .. సహారా ఏఎంసీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో లెసైన్సు రెన్యువల్ కోసం సహారా ఏఎంసీ చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థకు దేశీ సెక్యూరిటీస్ మార్కెట్లో పోర్ట్ఫోలియో మేనేజరుగా కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు లేవంటూ 12 పేజీల ఆర్డరులో వ్యాఖ్యానించింది. సహారా ఏఎంసీ తన వ్యాపార కార్యకలాపాలను మరో పోర్ట్ఫోలియో మేనేజరుకైనా బదలాయించాలని లేదా ఇన్వెస్టర్లు తమ నిధులు, సెక్యూరిటీస్ను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించాలని ఆదేశించింది. సహారా గ్రూప్లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 24,000 కోట్ల నిధులను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన కేసులో చైర్మన్ సుబ్రతా రాయ్ గతేడాది నుంచి జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. సహారా ఏఎంసీ లెసైన్సు విషయంలో సెబీ ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఎదుర్కొంటున్న రాయ్కి.. సహారా ఏఎంసీ ప్రమోటింగ్ సంస్థల్లో ఒకటైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్లో గణనీయంగా వాటాలు ఉన్నాయి. తద్వారా ఆయనతో పాటు ఇతర ప్రమోటింగ్ సంస్థలు కూడా సహారా ఏఎంసీ కార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశముందని సెబీ పేర్కొంది. గతేడాది డిసెంబర్ నాటికి కంపెనీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 147 కోట్లు. -
రూ.10కోట్లే లేనప్పుడు 30 కోట్లు ఎలా చెల్లిస్తారు?
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణకు సహారా ముప్పతిప్పలు పడుతోంది. ఈ డబ్బులు చెల్లించేందుకు న్యాయస్థానాన్ని మరో ఆరువారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 10,000 కోట్ల రూపాయలు చెల్లించడానికే ఇబ్బంది పడుతున్న మీరు ఇన్వెస్టర్లకు 30,000 వేల కోట్లు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుండి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో సుబ్రతా రాయ్ జైలు పాలయ్యారు. జైలులోనే ఉండి ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు ధర్మాసనం అనుమతినిచ్చింది. -
జరిగినదంతా సుప్రీంకు చెబుతాం: మిరాచ్
న్యూయార్క్: విదేశాల్లోని హోటళ్ల వాటాల కొనుగోలు విషయంలో(న్యూయార్క్లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్లోని గ్రాస్వీనర్) తమను ఘోరంగా మోసం చేశారంటూ సహారా గ్రూప్ చేసిన వాదనలను, చట్టపరంగా తీసుకుంటున్న చర్యలను ఎదుర్కొనడానికి అమెరికా సంస్థ మిరాచ్ క్యాపిటల్ సిద్ధమవుతోంది. ఈ అంశంలో చోటుచేసుకున్న పరిణామాలను అన్నింటినీ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా విన్నవిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, పరువునష్టం వంటి అంశాలకు సంబంధించి సహారాపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా మిరాచ్ సీఈఓ సారాంశ్ శర్మ తెలిపారు. -
సహారాకు 2 బిలియన్ డాలర్ల రుణం: మిరాచ్ క్యాపిటల్
న్యూఢిల్లీ: దాదాపు 10 నెలలుగా జైల్లో ఉన్న సహారా గ్రూపు అధిపతి సుబ్రతోరాయ్కి బెయిలు లభించేందుకు మార్గం సుగమమవుతోంది. బెయిలు కోసం ఆయన దాదాపు 10వేల కోట్ల పూచీకత్తు సమర్పించాల్సి ఉండగా... ఆయన గ్రూపునకు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12000 కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ అంగీకరించింది. బాగా అవసరమైనపుడు అతి తక్కువ ధరలకు అమ్మేసే ఆస్తుల్ని కొనుగోలు చేయటంలో ఈ డెట్ ఫండ్కు మంచి పేరుంది. ఏడాదిలో తిరిగి చెల్లించాల్సిన ఈ రుణానికి 11 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. కాగా ఈ 2 బిలియన్ డాలర్ల రుణంలో బ్యాంక్ ఆఫ్ చైనాకు సహారా గ్రూపు చెల్లించాల్సిన 88.2 కోట్ల డాలర్ల రుణాన్ని టేకోవర్ చేయటం కూడా ఉంది. అంటే మిరాచ్ క్యాపిటల్ ఈ రుణాన్ని చెల్లించేసి మిగిలిన మొత్తాన్ని సహారా గ్రూపునకు అందజేస్తుంది. ఒకవేళ సహారా సంస్థ రుణాన్ని తిరిగి తీర్చలేని పక్షంలో సహారాకు చెందిన లండన్లోని గ్రాస్వెనర్ హౌస్ను, న్యూయార్క్లోని మరో రెండు ఖరీదైన ఆస్తుల్ని ఈ డెట్ఫండ్ తన వశం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు తీహార్ జైల్లో సుబ్రతో రాయ్కి వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాన్ని మంగళవారం నుంచి ప్రారంభించారు. కాగా హర్యానా రాష్ర్టంలోని గుర్గావ్లో 185 ఎకరాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రూ.1,211 కోట్ల చెల్లింపుల్లో భాగంగా సహారా గ్రూప్కు రూ.300 కోట్లు చెల్లించినట్లు రియల్టీ సంస్థ ఎం3ఎం తెలిపింది. -
ఎం3ఎంకు సహారా భూముల విక్రయం
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్న సహారా గ్రూప్ తాజాగా గుడ్గావ్లోని 185 ఎకరాల భూమిని విక్రయించింది. గుడ్గావ్ కే చెందిన రియల్టీ సంస్థ ఎం3ఎంకు రూ. 1,211 కోట్లకు ఈ భూమిని విక్ర యించింది. ఈ బాటలో ముంబైలోని వసాయ్, రాజస్తాన్లోని జోధ్పూర్లలో గల భూములను సైతం అమ్మివేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో వసాయ్ భూమి విలువ రూ. 1111 కోట్లుకాగా, జోధ్పూర్ భూమి విలువ రూ. 140 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విధంగా పుణేలోని భూమిని సైతం విక్రయించే చర్చల్లో ఉన్నట్లు వెల్లడించాయి. -
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ దేశీయంగా నాలుగు ప్రాపర్టీలను విక్రయించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. జైల్లో ఉన్న సంస్థ చైర్మన్ సుబ్రతో రాయ్ బెయిల్కు కావాల్సిన రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు సహారా గ్రూప్ ఈ విక్రయాలు తలపెట్టింది. పుణే, జోధ్పూర్, చౌమా (గుడ్గావ్), వసై (ముంబై)లలోని ప్రాపర్టీలను అమ్మడం ద్వారా కంపెనీ రూ. 2,710 కోట్లు సమీకరించవచ్చని అంచనా. ఈ ఆస్తుల విక్రయ లావాదేవీలు వచ్చే ఏడాది మేలోగా పూర్తి కావాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని బెంచ్ ఆదేశించింది. కొనుగోలుదారులు ఈలోగా సెబీ-సహారా రీఫండ్ అకౌంటు పేరిట పోస్ట్ డేటెడ్ చెక్కులను డిపాజిట్ చేయాలని సూచించింది. విక్రయ ప్రక్రియ గురించి సహారా తరఫు న్యాయవాదులు సుప్రీంకు వివరించారు. ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్ల రీఫండ్ కేసుకు సంబంధించి సుబ్రతో రాయ్ ఈ ఏడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు. -
రాయ్ విడుదలకు మళ్లీ సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు ఆ సంస్థ తాజాగా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ. 25,000 కోట్లు సమీకరించిన కేసులో రాయ్ మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు సంబంధించి రూ.10,000 కోట్ల చెల్లించాలన్న అత్యున్నత న్యాయస్థానం షరతు వ్యవహారంలో విదేశాల్లోని మూడు హోటెల్స్ అమ్మకాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు సహారా గ్రూప్ను ఆదేశించింది. రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియను రాయ్ న్యాయవాది ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు వివరించారు. ఇటీవల సహారా గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల గురించి కూడా న్యాయమూర్తులు ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న రూ.143 కోట్లు ఉద్యోగుల మూడు నెలల వేతనాలకు ఉద్దేశించినవని సహారా న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. -
డీఎల్ఎఫ్ పై కొరడా!
సంవత్సరాల తరబడి కాగితం పులిగా అపవాదు మూటగట్టుకున్న మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఈ మధ్యకాలంలో పంజా విసురుతున్నది. సహారా గ్రూప్ అధిపతి సుబ్రోతోరాయ్, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజులపై కొరడా ఝుళిపించిన సెబి... తాజాగా రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్పై విరుచుకుపడింది. నిబంధనల ఉల్లంఘనల కేసుల్లో గతంలో చిన్నపాటి జరిమానాలతో సరిపెట్టే నియంత్రణా సంస్థ డీఎల్ఎఫ్ ప్రమోటర్లు, ఇతర అధికారులను మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న డీఎల్ఎఫ్కు ఇది అశనిపాతమే. ఐదు దశాబ్దాలకుపైగా రియల్ ఎస్టేట్ కార్యకాలాపాలు నిర్వహిస్తున్న ఈ ఉత్తరాది కంపెనీ 2007లో తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసిన సమయంలో కొంత సమాచారాన్ని దాచిపెట్టిందన్న కేసులో సెబి తాజా ఆదేశాలు జారీచేసింది. డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీ సుదీప్తి ఎస్టేట్స్తో జరిగిన భూ లావాదేవీలో 35 కోట్ల రూపాయల నష్టపోయినట్లు ఒక వ్యక్తిచేసిన ఫిర్యాదు ఫలితంగా సుదీర్ఘకాలం దర్యాప్తు జరిపింది. సుదీప్తితో పాటు మరో రెండు అనుబంధ కంపెనీల ద్వారా భూలావాదేవీలు జరిపిన డీఎల్ఎఫ్ పబ్లిక్ ఇష్యూ జారీ ప్రాస్పెక్టస్లో ఆ మూడు అనుబంధ కంపెనీల సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియపర్చలేదన్నది ప్రధాన అరోపణ. పన్ను ఎగవేత లావాదేవీల రూపంలో ఆ అనుబంధ కంపెనీల్లో వున్న వాటాలను బదిలీచేసి, వాటితో డీఎల్ఎఫ్ సంబంధం తెంపుకొందన్నది సెబి మరో ఆరోపణ. తాజా నిషేధంపై డీఎల్ఎఫ్ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లొచ్చుగానీ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జరిగిన షేరు పతనం నుంచి ఆ కంపెనీ లేదా ఆ ప్రమోటర్లు కోలుకోవడం అంత తేలికకాదు. దేశంలో రియల్టీ వ్యాపారం ఎప్పటినుంచో వున్నా, ఈ రంగానికి చెందిన కంపెనీలు కార్పొరేటైజ్ కావడం, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్కావడం మాత్రం 2000వ దశకంలోనే. డీఎల్ఎఫ్ దేశంలో పెద్ద రియల్టీ కంపెనీ మాత్రమే కాదు.... భారత్ స్టాక్ సూచీల్లో భాగంగా వున్న ఏకైక రియల్టీ కంపెనీ. బీఎస్ఈ సెన్సెక్స్-30, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50ల్లో ఐటీ, ఫార్మా, ఆయిల్, మెటల్, టెలికాం, పవర్ తదితర రంగాలకు చెందిన షేర్లు ఒకటికి మించి వున్నా, రియల్టీ రంగానికి చెందిన షేరు డీఎల్ఎఫ్ మాత్రమే ఈ సూచీల్లో భాగం. సూచీలు దాదాపు రికార్డు గరిష్టస్థాయిల్లో ట్రేడవుతుండగా, డీఎల్ఎఫ్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని కనిష్టస్థాయికి పడిపోయింది. డీఎల్ఎఫ్కు దేశవ్యాప్తంగా 10,000 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటితో పాటు ప్రముఖ నగరాలన్నింటిలోనూ డజన్ల కొద్దీ ఆఫీస్, షాపింగ్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ. 105 ప్రకారం లెక్కగడితే కంపెనీ మార్కెట్ విలువ రూ. 18,700 కోట్లకు క్షీణించింది. మంగళవారంనాటి పతనం కారణంగానే కంపెనీ రూ. 6,000 కోట్ల విలువను కోల్పోయింది. కంపెనీ లిస్టయిన సంవత్సరం ఒకదశలో మార్కెట్ విలువ రూ. 2,00,000 కోట్లు దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీతో సహా దేశంలో ఎంతోమంది ప్రముఖులు ఈ షేరు పబ్లిక్ ఇష్యూలో దరఖాస్తుచేశారు. ఇప్పుడా కంపెనీ మార్కెట్ విలువను మించి రూ. 19,800 కోట్ల రుణం వుంది. రుణం తగ్గించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్లో కొత్తగా వాటాలు విక్రయించడం, రుణ పత్రాల జారీద్వారా నగదు సమీకరించడం వంటి ద్వారాలన్నీ తాజా నిషేధంతో డీఎల్ఎఫ్ ప్రమోటర్లకు మూసుకుపోతాయి. డీఎల్ఎఫ్కున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను లిస్ట్చేయడం ద్వారా నగదు సమీకరించే అవకాశం కూడా పోతుంది. షేరు పతనం కారణంగా కంపెనీ మార్కెట్ విలువ పడిపోయినందున, గతంలో అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర రుణదాతలు కంపెనీని ఇకపైన ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని తప్పించుకునేందుకు డీఎల్ఎఫ్ ఆస్తుల్ని తక్కువ విలువకైనా తెగనమ్మాల్సివుంటుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి అల్లుడైన రాబర్ట్ వాధ్రాతో జరిపిన లావాదేవీల ఫలితంగా డీఎల్ఎఫ్పై రాజకీయ రంగు కూడా పడింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎల్ఎఫ్ ప్రభ క్రమేపీ మసకబారుతూ వచ్చింది. సకాలంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పూర్తిచేయనందుకు కొనుగోలుదార్ల నుంచి కేసుల్ని, కాంపిటీషన్ కమిషన్ నుంచి రూ. 630 కోట్ల పెనాల్టీని కంపెనీ ఎదుర్కొంటున్నది. పంజాబ్, హర్యానా కోర్టు గుర్గావ్లో డీఎల్ఎఫ్కు చెందిన 350 ఎకరాల భూ కేటాయింపును ఇటీవల రద్దుచేసింది. గుర్గావ్ను అతిపెద్ద కార్పొరేట్ హబ్గా మార్చివేసిన డీఎల్ఎఫ్ బుధవారంనాటి ఎన్నికల తర్వాత హర్యానాలో హుడా ప్రభుత్వం అధికారం కోల్పోతే మరింత ఇబ్బందులు పాలుకావొచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా 60వ దశకంలో చౌదరి రాఘవేంద్ర సింగ్ నెలకొల్పిన డీఎల్ఎఫ్ను ఇప్పుడు రెండు, మూడవతరం కుటుంబాలు నడుపుతున్నాయి. ప్రస్తుతం ఆయన అల్లుడు కుషాల్ పాల్ సింగ్ (కే పీ సింగ్) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కే పీ సింగ్ కుమారుడు రాజీవ్ వైస్ ఛైర్మన్గానూ, కుమార్తె పియా సింగ్ పూర్తికాలపు డెరైక్టరుగానూ వున్నారు. వీరు ముగ్గుర్నీ క్యాపిటల్ మార్కెట్ నుంచి సెబి నిషేధించింది. డీఎల్ఎఫ్ ప్రమోటర్ల సంగతెలా వున్నా, ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని పరిరక్షించడానికి సెబికి వున్న సంపూర్ణ అధికారాల్ని ప్రయోగిస్తూ తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల తాత్కాలికంగా కొన్ని షేర్ల ధరలు పతనం కావొచ్చుకాక. వారసత్వ కంపెనీలు రాజ్యమేలుతున్న భారత్ కార్పొరేట్ ప్రపంచంలో ఈక్విటీ సంస్కృతి పెరగాలన్నా, తద్వారా దేశాభివృద్ధి జరగాలన్నా సెబి ఒక కాగితం పులిగా వ్యవహరించకూడదు. నిబంధనల ఉల్లంఘనకు తగిన శిక్ష ప్రమోటర్లకు పడాల్సిందే. -
ఆస్తుల విక్రయానికి హెడ్జ్ ఫండ్స్తో సహారా ఒప్పందం!
లండన్: రుణ రీఫైనాన్సింగ్ కోసం సహారా గ్రూప్ రెండు అమెరికన్ హెడ్జ్ ఫండ్స్తో ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 6,100 కోట్లు)ను సమకూర్చుకోనున్నట్లు లండన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భారత్లోని తీహార్ జైలులో ఉన్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ విడుదలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సండే టైమ్స్ వివరించింది. సహారాకు న్యూయార్క్, లండన్లలోగల మూడు హోటళ్ల ఆధారంగా హెడ్జ్ ఫండ్స్ ఈ నిధులు అందిస్తాయని నెలల చర్చల తరువాత ఇందుకు గతవారమే డీల్ కుదిరినట్లు సండే టైమ్స్ పేర్కొన్నప్పటికీ, ఈ వార్త వాస్తవం కాదంటూ సహారా కంపెనీ ప్రతినిధి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపారు. బాండ్ల విక్రయం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన పెట్టుబడులను తిరిగి చెల్లించే విషయంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి, సహారా చీఫ్ సుబ్రతా రాయ్కూ మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు రాయ్ను మార్చిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం షరతులకు అనుగుణంగా ఆస్తుల విక్రయం ద్వారా రాయ్ బెయిలు కోసం ప్రయత్నిస్తున్నారు. -
సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ తుది యత్నాలు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్లో ఇన్వెస్ట్ చేసి... రిఫండ్లకు అర్హులైన ఇన్వెస్టర్లను గుర్తించేందుకు నియంత్రణ సంస్థ సెబీ ఆఖరి ప్రయత్నాలు మొదలు పెట్టింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు జారీ చేసిన బాండ్లలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు తగిన ధ్రువపత్రాలతో సొమ్ము రిఫండ్ దరఖాస్తులను వచ్చే నెల 30 లోగా తమకు సమర్పించాలని పేర్కొంది. రూ.24 వేల కోట్లమేర నిధుల సమీకరణ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును సహారా వెనక్కివ్వాలని.. ఇందుకు సెబీ తగిన చర్యలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. గతేడాది మే నెలలోనే రిఫండ్ ప్రక్రియను సెబీ మొదలుపెట్టింది. అయితే,చాలా నామామాత్రంగా రిఫండ్స్ జరగడంతో మరోసారి ఇన్వెస్టర్లకు సెబీ ప్రకటనను విడుదల చేసింది. ఒరిజినల్ బాండ్ సర్టిఫికెట్/పాస్బుక్, గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా వివరాలను ఇన్వెస్టర్లు దరఖాస్తులో వెల్లడించాలని సెబీ పేర్కొంది. -
జైలు నుంచి బయటకు వచ్చేందుకు...
-
జైలు నుంచి బయటకు వచ్చేందుకు...
ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పడు రాజాలా బతికిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు. బెయిల్ ఇవ్వాలంటే రూ. 10 వేల కోట్లు కట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆయన విదేశాల్లోని ఆస్తులను అమ్మకానికి పెట్టారు. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన న్యూయార్క్ ప్లాజా హోటల్, లండన్ లోని గ్రోస్వెనర్ హౌస్ ను అమ్మేందుకు సిద్దమయ్యారు. బెయిల్ కోసం నిధులు సమీకరించుకునేందుకు జైలు నుంచే ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. -
తీహార్ జైల్లో సహారా సుబ్రతాకి ‘ఆఫీస్’
న్యూఢిల్లీ: బెయిల్ కోసం నిధులు సమీకరించుకోవడంలో భాగంగా హోటల్స్ను విక్రయిస్తున్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. కొనుగోలుదారులతో తీహార్ జైల్లో నేటి నుంచి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం జైల్లోని కాన్ఫరెన్స్ రూమ్ను అధికారులు కేటాయించారు. మంగళవారం (నేడు) నుంచి పది రోజుల పాటు చర్చల కోసం ఆయన దీన్ని వినియోగించుకోనున్నారు. సాధారణంగా జైలు అధికారులు అంతర్గత సమావేశాల కోసం ఉపయోగించుకునే ఈ రూమ్ను సుబ్రతా రాయ్కి సంబంధించి.. ప్రస్తుతం స్పెషల్ జైలుగా వ్యవహరిస్తారు. సుబ్రతాతో పాటు తీహార్లోనే ఉన్న ఇద్దరు సహారా డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దూబే.. కొనుగోలుదారులతో చర్చల్లో పాల్గొంటారు. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేసేందుకు రూ. 10,000 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో తాజాగా ఆయన న్యూయార్క్, లండన్లోని లగ్జరీ హోటల్స్ను అమ్మకానికి పెట్టారు. ఇందుకోసమే ఆయన బిడ్డర్లతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. రూమ్లో సదుపాయాలివీ.. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఏసీ కాన్ఫరెన్స్ రూమ్లో 52 అంగుళాల టీవీ, వై-ఫై కనెక్టివిటీ ఉంటుంది. రాయ్కి, డెరైక్టర్లకు రెండు ల్యాప్టాప్లు, రెండు డెస్క్టాప్ కంప్యూటర్లు, ఒక మొబైల్ ఫోన్ ఇస్తారు. వీటికి సంబంధించిన చార్జీలను సహారా భరించాల్సి ఉంటుంది. ఉదయం 6 గం. నుంచి రాత్రి 8 గం.దాకా స్టెనో, సహాయకులు, ఒక సాంకేతిక సహాయక ఉద్యోగి ఆయనకు అందుబాటులో ఉంటారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో చర్చలు జరుగుతాయి. -
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ పొందేందుకు వీలుగా మూడు విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకానికి రుణదాత బ్యాంక్ ఆఫ్ చైనాను ఆశ్రయించేందుకు సహారా గ్రూప్ను సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. బెయిల్ కోసం రూ.5 వేల కోట్ల నగదు డిపాజిట్, అంతే మొత్తానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాలన్న ఉత్తర్వులను సవరించాలంటూ రాయ్ చేసిన అభ్యర్థనపై కోర్టు తన ఆదేశాలను రిజర్వులో ఉంచింది. బెయిల్ కోసం రూ.3 వేల కోట్లను ఐదు రోజుల్లో, మరో రూ.2 వేల కోట్లను 30 రోజుల్లో డిపాజిట్ చేస్తామనీ, మిగిలిన రూ.5 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీని విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకం ద్వారా 60 రోజుల్లో సమర్పిస్తామనీ సహారా గ్రూప్ తాజాగా ప్రతిపాదించింది. లండన్లోని ఒక హోటల్, న్యూయార్క్లోని రెండు హోటళ్లలోని వాటాలను విక్రయిస్తామని తెలిపింది. ఆ హోటళ్లలో వాటాల కొనుగోలుకు భారీగా నిధులు సమకూర్చిన బ్యాంక్ ఆఫ్ చైనాను సంప్రదించడానికి సహారా గ్రూప్నకు కోర్టు అనుమతి ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ చైనాతో సంప్రదింపుల సారాంశాన్ని తెలుపుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ‘సహారా గ్రూప్ పేర్కొన్న 9 ఆస్తుల అమ్మకానికి అనుమతించడానికి మేం సుముఖంగా ఉన్నాం. నిధుల సమీకరణకు ఆంబీ వ్యాలీని తాకట్టు పెట్టడానికి కూడా ఆనుమతించడానికి సిద్ధం’ అని టి.ఎస్.ఠాకూర్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
సుబ్రతారాయ్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్ని విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. సుబ్రతోరాయ్ ను బెయిల్ పై విడుదల చేయాలని తాజాగా ప్రతిపాదనలు సహారా గ్రూప్ చేసింది. పదివేల కోట్ల రూపాయల చెల్లింపుపై అమోదకరమైన ప్రతిపాదనతో రావాలని మే 19 తేదిన జరిగిన విచారణలో సహారా గ్రూప్ నిర్వాహకులను సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్ బెయిల్ పై విడుదల కోసం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సహారా గ్రూప్ తాజాగా ఓ ప్రతిపాదనను సమర్పించింది. -
తీహార్ జైల్లోనే సుబ్రత రాయ్
సహారా గ్రూపు అధినేత సుబ్రత రాయ్ని తీహార్ జైల్లోనే ఉంచుతాం తప్ప.. గృహ నిర్బంధానికి పంపేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాయ్ తమ కస్టడీలో ఉన్నారు తప్ప ఆయనను తాము పౌర ఖైదుకు పంపలేదని వ్యాఖ్యానించింది. సుబ్రత రాయ్ జైల్లో ఉన్నందున సుప్రీంకోర్టు చెప్పినంత మొత్తం సేకరించడం కష్టంగా ఉందని, అందువల్ల ఆయనను గృహ నిర్బంధానికి పంపాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ కోరినప్పుడు సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ వ్యాపార వేత్తలు ఎవరూ జైలుకు వచ్చి బేరాలు చేయడానికి ఇష్టపడరని, అందువల్ల ఇంటికి పంపితే అక్కడ బేరసారాలు కుదుర్చుకుని, కట్టాల్సిన సొమ్ము సేకరించడానికి ప్రయత్నం చేస్తారని రాం జెఠ్మలానీ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆయన వాదనను తిరస్కరించింది. -
సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసిన సహారా గ్రూప్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రూ.10వేల కోట్లు చెల్లించలేమని ఆ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. తక్షణమే రూ.2.500 కోట్లు మాత్రమే చెల్లించగలమని ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మూడు వారాల తర్వాత మరో రూ.2.500 కోట్లు చెల్లిస్తామని సహారా గ్రూప్ గురువారం విన్నవించింది. మార్చి 4వ తేదీ నుంచీ సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ద్విసభ్య ధర్మాసనం గతనెలలో ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్,రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు మరికొద్దిరోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
రాయ్ విడుదలకు సహారా సిబ్బంది చొరవ
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు సహారా గ్రూప్ సిబ్బంది వినూత్న ఆఫర్ను తెరముందుకు తెస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం సహారా ఉద్యోగులు, శ్రేయోభిలాషుల నుంచీ కనీసం లక్షకు తక్కువకాకుండా... రూ.2 లక్షలు, రూ. 3 లక్షలు, ఇలా వారివారి సామర్థ్యాన్ని బట్టి డబ్బును సమీకరిస్తారు. కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం. గ్రూప్లో ఎంటర్టైన్మెంట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకూ దాదాపు 11 లక్షల మంది వేతన, ఫీల్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సహారా చెబుతోంది. ఇలా డబ్బు చెల్లించిన వారికి ప్రతిగా సహార్యన్ ఇ-మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్లో షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఒకపేజీ లెటర్పై గ్రూప్ ‘అనుబంధ’ సంస్థలు, సహార్యన్ సొసైటీ డెరైక్టర్లు ఈ మేరకు సంతకం చేస్తూ, సంబంధిత తోడ్పాటు ‘అభ్యర్థన’ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఒక సీనియర్ సహారా అధికారిని వివరణ అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, ‘సుబ్రతా రాయ్గానీ, లేదా యాజమాన్యం కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి లేఖనూ జారీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితికి ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన భావోద్వేగ స్పందన మాత్రమే ఇది’ అని అన్నారు. సహారాశ్రీ(గ్రూప్లో రాయ్ని ఇలా పిలుస్తారు) సంస్థను ఒక పరివార్గా లేదా కుటుంబంగా నిర్మించారని, ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రతిపాదన లేఖలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా 2 గ్రూప్ కంపెనీలు మదుపరుల నుంచి రూ.25 వేల కోట్లు సమీకరించాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. ఈ డబ్బు పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్నందుకుగాను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు రాయ్సహా రెండు కంపెనీల డెరైక్టర్లు ఇరువురు మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. వీరి తాత్కాలిక బెయిల్కుగాను రూ.5 వేల కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ. 5వేల కోట్లు సెబీ పేరుతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇంత మొత్తం చెల్లించలేమని సహారా గురువారం ధర్మాసనానికి విన్నవించింది. ఇలాంటి రూలింగ్ తప్పని, రాయ్ని జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని గ్రూప్ దాఖలు చేసిన రిట్పై వాదనలు ఏప్రిల్ 3కు వాయిదా పడ్డాయి. -
జ్యుడీషియల్ కస్టడీలోనే సహారా చీఫ్ సుబ్రతారాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. రాయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. 10 వేలకోట్ల రూపాయలు డిపాజిట్ చేయలేమని సహారా గ్రూప్ తెలియజేయడంతో ఆయన కస్టడీలోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుబ్రతారాయ్తోపాటు సహారా గ్రూప్ ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సహారా గ్రూప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు సమీకరణ - సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం - ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం - సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. -
బెయిల్ @ రూ.10 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే రూ.10,000 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్ను ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే- తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.25,000 కోట్ల సమీకరణ, సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం, ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విధానమిది... చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో రూ.5,000 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేయాలని, మిగిలిన రూ.5,000 కోట్లను ఒక జాతీయ బ్యాంక్ గ్యారంటీ ద్వారా (సెబీ పేరుతో) సమర్పించాలని కోర్టు నిర్దేశించింది. సెబీ వద్ద డిపాజిట్ చేయడానికి సంబంధించి మొత్తం నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పించే ప్రక్రియలో భాగమే తాత్కాలిక బెయిల్ మంజూరన్న విషయాన్ని గ్రూప్ గమనంలో ఉంచుకోవాలని కోర్టు పేర్కొంది. సహారా గ్రూప్ వడ్డీతో సహా రూ. 34,000 కోట్లు చెల్లించాలని సెబీ వాదిస్తోంది. రాయ్ జైలులో ఉండగా ఈ మొత్తాలనుసైతం సమీకరించడం కష్టమని సహారా గ్రూప్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం అంతక్రితం అంగీకరించలేదు. రూ.2,500 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేసి, రూ. 10,000 కోట్లలో మిగిలిన మొత్తాన్ని సమర్పించడానికి నెలరోజుల సమయం ఇవ్వాలని, ఈ ప్రతిపాదనపై రాయ్ని జైలు నుంచి విడుదల చేయాలని సహారా న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమ తాజా రూలింగ్పై స్పందనను తెలియజేయాలని సుప్రీం సహారాను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నేటికి (గురువారానికి) వాయిదా వేసింది. కాగా బెయిల్కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఒక సంచలనమేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్ అకౌంట్ల డీఫ్రీజ్కూ ఓకే... కోర్టు తాజా నిర్దేశాల ప్రకారం నిధుల సమీకరణకు వీలుగా ‘ఫ్రీజ్’(స్తంభింప) చేసిన సంస్థ బ్యాంక్ అకౌంట్లను ‘డీఫ్రీజ్’ చేసేందుకు సైతం కోర్టు అంగీకరించింది. డీఫ్రీజ్ చేయాల్సిఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ల వివరాలను గురువారం అందజేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సహారాకు సూచించింది. తదుపరి ఇందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో సహారా గ్రూప్ షేర్లు డీలాపడ్డాయి. బీఎస్ఈలో సహారా వన్ మీడియా 5% పతనమై రూ. 60 వద్ద ముగియగా, సహారా హౌసింగ్ ఫైనాన్స్ 10% దిగజారి రూ. 42.50 వద్ద నిలిచింది. -
సుబ్రతారాయ్ దేశభక్తుడు: కపిల్ దేవ్
సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ అరెస్ట్ పై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. సుబ్రతా దేశభక్తుడు అని కపిల్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడుతారని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుబ్రతాను పోలీస్ కస్టడీకి తరలించారనే వార్తలను టెలివిజన్ చూశానని ఆయన అన్నారు. దేశభక్తి మెండుగా ఉన్న వ్యక్తుల్లో సుబ్రతా ఒకరని కపిల్ తెలిపారు. ఇన్వెస్టర్లకు 20 వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై నమోదైన కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సుబ్రతాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రతాను ఉత్త్రరప్రదేశ్ పోలీసులు లక్నో న్యాయస్థానంలో హాజరుపరుచగా, ఆయనను మార్చి 4 తేది వరకు పోలీస్ కస్టడి విధించారు. -
మా నాన్న సహకరిస్తారు: సీమాంతో
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ తనకు తానుగా లక్నో పోలీసుల ముందు లొంగిపోయారని ఆయన తనయుడు సీమాంతో రాయ్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు తన తండ్రి పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. సుబ్రతారాయ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో సీమాంతో ఢిల్లీలో హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 26నే సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావాలని భావించి సుబ్రతారాయ్ 24న ఢిల్లీ వచ్చారని తెలిపారు. అయితే నాన్నమ్మ అనారోగ్యానికి గురవడంతో లక్నోకు తిరిగివెళ్లారని వివరించారు. సుప్రీంకోర్టులో తన తండ్రికి ఊరట లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుబ్రతారాయ్ కనిపించకుండాపోయారని మీడియాలో వార్తలు రావడం తమకు బాధ కలిగించిందని సీమాంతో పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలన్నీ త్వరలో వీగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నాటకీయ పరిణామాల మధ్య సుబ్రతారాయ్ను ఈ ఉదయం లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సహారా అధినేత సుబ్రతా రాయ్ అరెస్ట్
-
క్షమించండి... 4న హాజరవుతా
న్యూఢిల్లీ: నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ను రద్దు చేయాలని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాయ్ని అరెస్ట్చేసి మార్చి 4వ తేదీన తన ముందు హాజరుపరచాలని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం బుధవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా రూ.25 వేల కోట్ల సమీకరణ, మదుపరులకు పునః చెల్లింపుల్లో వైఫల్యం కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లను విచారిస్తున్న సుప్రీం ఈ అంశంపై రాయ్ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. తాను స్వయంగా సమన్లు జారీ చేసినా రాయ్ పట్టించుకోకపోవడంతో బుధవారం అరెస్ట్ వారంట్ ఇచ్చింది. దీనిపై గురువారం రాయ్ రికాల్ పిటిషన్ను దాఖలు చేశారు. ధర్మాసనం ముందు హాజరుకాకపోవడంపట్ల బేషరతు క్షమాపణలు చెప్పిన ఆయన, అరెస్ట్ వారంట్ రద్దు కోరారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా ఎప్పుడైనా హాజరుకావడానికి తాను సిద్ధమని రాయ్ విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రాయ్ అరెస్ట్కు సుప్రీం వారంట్తో ఢిల్లీ పోలీసులు లక్నో చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రాయ్ రికాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎటువంటి రూలింగ్ ఇస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. -
సుబ్రతారాయ్ అరెస్ట్ కు రంగం సిద్ధం
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ అరెస్ట్కు సుప్రీంకోర్టు బుధవారం నాన్బెయిల్బుల్ అరెస్ట వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో బుధవారం జరగనున్న విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ధిక్కార నేరంగా సుప్రీం కోర్టు పరిగణించింది. దాంతో సుబ్రతారాయ్ అరెస్ట్కు నాన్బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో రాయ్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మదుపరులకు చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్లు చెల్లించాలని సహారా గ్రూప్ను గతంలో సుప్రీం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సహారా గ్రూప్ పెడచెవిన పెట్టింది. దాంతో బుధవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాయ్ బుధవారం కూడా హాజరుకాకపోవడంతో సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులోభాగంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది. -
నగదులో అన్ని కోట్ల లావాదేవీలు ఎలా?
న్యూఢిల్లీ: నగదు రూపంలో అన్ని కోట్ల లావాదేవీలు ఎలా సాధ్యమని సహారా గ్రూప్ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం సందేహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నియమ నిబంధనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం... తిరిగి చెల్లించడంపై వైఫల్యం తత్సంబంధ అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్లతో కూడిన ధర్మాసనం తాజా సూచనలు చేసింది. కేసు విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. -
రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు: సహారా
న్యూఢిల్లీ: సెబీతో సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న సహారా గ్రూప్ ఆశ్చర్యకరంగా 56 వేల కొత్త ఉద్యోగాలిస్తున్నట్లు పేర్కొం ది. రూ.32,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించింది. దేశ, విదేశాల్లో ఈ ఏడాదిలోనే ఎఫ్ఎంసీజీ, రిటైల్, డెయిరీ, పౌల్ట్రీ, లగ్జరీ రియల్టీ, లైఫ్స్టైల్, ఫుడ్ ఫ్యాక్టరీ, లో కాస్ట్ హౌజింగ్, విద్యా, నౌకాయానం తదితర రంగాల్లో 56 వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ ప్రకటనల్లో సహారా పేర్కొంది. మూడేళ్లలో 4 లక్షల ఉద్యోగాలిస్తామని సహారా వివరించింది. ఇన్వెస్టర్లకు రూ.20,000 కోట్ల రీఫండ్ విషయమై సెబీ, సహారాల మధ్య న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. -
రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అప్పటివరకూ గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం (జనవరి 9) ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పకపోతే ఈ విషయం దర్యాప్తునకు తాము తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని అంశాలనూ సెబీకి సమర్పించాలని స్పష్టం చేసింది.