-
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్కు ఈ చిత్రం స్టార్డమ్ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్లో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. నేడు సెప్టెంబర్ 16న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం: సీతా రామం * ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) * ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) * ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) * ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) * ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR) * ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR) * ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం * ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం * ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) * ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) * సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2) * ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) * ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) * ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్ * ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్లో మంచి స్టార్గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్ను వరించిన అవార్డ్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్కుమార్) ఉత్తమ వెబ్ సిరీస్గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్కు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లోనూ కనిపించింది. సీతారామం చిత్రంలో చాలా పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్లో మరింత బోల్డ్గా కనిపించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సీతారామం మూవీ వీడియోను పంచుకుంది. సీతారామం విడుదలై ఈ రోజుకు ఏడాది పూర్తి కావడంతో మృణాల్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనను తెలుగు అమ్మాయిలా భావించి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మృణాల్ తన ఇన్స్టాలో రాస్తూ..'ప్రియమైన ప్రేక్షకులారా.. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ.. నా కలలకు మించిపోయింది. మీరు నన్ను మీ తెలుగు అమ్మాయిలా అంగీకరించారు. ఈ అందమైన ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్నీ విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని మాట ఇస్తున్నా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సీత ఉత్తమ వెర్షన్ని తీసుకురావడంలో నాకు సహాయం చేసినందుకు హను రాఘవపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొత్తం అనుభవాన్ని ఎంత చిరస్మరణీయం చేసినందుకు దుల్కర్ సల్మాన్కు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఎప్పటికీ మా సీత నువ్వే కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న 'రసవతి'..!) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో జంటగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో మరింత బోల్డ్గా కనిపించి ఫ్యాన్స్కు ఒక్కసారిగా షాకిచ్చింది. సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్తో ఐ యామ్ నాటీ అని నిరూపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఓపెన్గానే ఉంటానని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: హైదరాబాద్లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) మృణాల్ మాట్లాడుతూ.. 'ముందుగా దేవునికి ధన్యవాదాలు. నేను రిలేషన్స్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే జనరేషన్లో పుట్టా. గతంలో నా బ్రేకప్ల గురించి మాట్లాడా. దీనివల్ల నా అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకుంటున్నారని భావిస్తున్నా. ప్రస్తుత రోజుల్లో నా చుట్టూ భాగస్వామి లేదా ప్రేమికుడి గురించి మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నా.' అని అన్నారు. భాగస్వామిని గౌరవించాలి లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతూ.. 'ఎవరైనా సరే మన పార్ట్నర్ మనోభావాలను గౌరవించాలి. మనకు కాబోయే భాగస్వామి తన రిలేషన్ ప్రైవేట్గా ఉంచాలనుకుంటే అలాగే ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా.. కానీ నా భాగస్వామి ఈ పరిశ్రమకు చెందిన వారు కాకపోవచ్చు. అప్పుడు అతను తన రిలేషన్ను పబ్లిక్గా ఉంచకూడదనుకుంటే.. అతని గురించి నేను ఎక్కడా చర్చించను.' అని అన్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని అనుకోవడం లేదని అన్నారు మృణాల్.. ఎందుకంటే ప్రస్తుతం నేను చాలా మెరుగైనస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తమ రిలేషన్స్ గురించి ఒపెన్గా మాట్లాడిన నీనా గుప్తా , అంగద్ బేడీ, కరీనా కపూర్ ఖాన్, నేహా దుపియాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇది చాలా సాధారణమైన విషయమన్నారు. కాగా.. మృణాల్ విజయ్ దేవరకొండ సరసన ఒక చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..! ) -
హైదరాబాద్లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. ఈ సినిమా సక్సెస్ అనంతరం తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మృణాల్ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుందనే టాక్ వినిపించింది. అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని డిసైడ్ అయ్యిందని, అందుకే లగ్జరీ ఇల్లు కొన్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై స్పందించింది మృణాల్ ఠాకూర్. అడ్రస్ చెప్తే నేను కూడా వచ్చి నా ఇంటిని చూసొస్తా అంటూ ఫన్నీగా బదులిచ్చింది. అయితే హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఎవరికి మాత్రం సెటిల్ అవ్వాలని ఉండదు అంటూ తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఇల్లు తీసుకోకపోయినా భవిష్యత్తులో తప్పకుండా కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది మృణాల్. -
‘సీతారామం 2’ కోసం వెయిటింగ్: మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు సీతారామంకు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరి మనసును తాకిన ఈ అందమైన ప్రేమ కావ్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే అంతటి ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్కు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా సీతారామం టీంకు మూవీ స్వీకెల్పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ట్విటర్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటించిన మృణాల్కు సీతారామం సీక్వెల్పై ప్రశ్న ఎదురైంది. ఈ చిట్చాట్లో ఓ అభిమాని ‘సీతా రామంకు’ సీక్వెల్ ఉందా? అని మృణాల్ను అడిగారు. చదవండి: భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై మెగా డాటర్ క్లారిటీ? ఆ ప్రశ్నకు మృణాల్ స్పందిస్తూ.. ‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ఈ మూవీ సీక్వెల్ ఉంటే బాగుండు అనుకుంటున్నా. దానికి కోసం నేరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సమాధానం ఇచ్చింది. అలాగే మరో అభిమాని తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పాలని కోరగా.. ‘అదిగో మళ్లీ మొదలు..’ అని ‘సీతా రామం’ డైలాగ్ చెప్పింది. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ టీంను మిస్ అవుతున్నానంది. ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు గతంలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మృణాల్ ట్వీట్తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. -
ట్రెండింగ్లో సీతారామం బ్యూటీ.. న్యూ లుక్ ఫోటోలు వైరల్
-
మృణాల్ ఠాకూర్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్స్ ఫైర్!
సీతారామం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా.. సీతారామంతోనే క్రేజ్ తెచ్చుకుంది. మొదటి బుల్లితెరపై మెప్పించిన నటి ఆ తర్వాతే సినిమాల్లో అడుగుపెట్టింది. సీతారామం తర్వాత ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే తాజాగా మృణాల్ తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. బ్లూ బికినీలో ఉన్న పిక్స్ కుర్రకారు మతిపొగేట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం వేకేషన్లో ఉన్న స్టన్నింగ్ భామ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇన్స్టాగ్రామ్లో మృణాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తగా.. సీతా రామం చిత్రంలోని ఆమె సీత పాత్రను ప్రస్తావిస్తూ.. ఓ నెటిజెన్ "RIP సీతా మహాలక్ష్మి" అంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'సీతా మహాలక్ష్మి మరింత హీట్ పుట్టిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. మీరు బికినీలో కంటే చీరలోనే చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఏమైంది మేడమ్.. మీ నుంచి ఇలాంటివి మేం ఆశించడం లేదు. మా హృదయాలను విచ్ఛిన్నం చేశారంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్లు కాగా.. మృణాల్ ఇటీవల 'సెల్ఫీ'లో అక్షయ్ కుమార్ సరసన 'కుడియే నీ తేరి వైబ్' అనే ప్రత్యేక సాంగ్లో కనిపించారు. దుల్కర్ సల్మాన్ నటించిన పాన్-ఇండియా మూవీ 'సీతా రామం'లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మృణాల్ ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి 'గుమ్రా'లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న సినిమాల్లో విడుదల కానుంది. నటి ఇషాన్ ఖట్టర్తో 'పిప్పా' కూడా వరుసలో ఉంది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
మా పేరెంట్స్కి ఇష్టం లేదు.. అయినా ఇండస్ట్రీకి వచ్చా: మృణాల్
మృణాల్ ఠాకూర్ కెరీర్ సీతారామం సినిమాకి ముందు, ఆ తర్వాత అన్నట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం క్లాసిక్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లుగా చేసిన దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్లకు ఈ సినిమా మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మృణాల్కు అన్ని భాషల్లోనూ సూపర్క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ డ్యూటీ తాజాగా ఓ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె ఏమందంటే.. 'నిజానికి నేను సినిమాల్లోకి రావడం మా పేరెంట్స్కి అసలు ఇష్టం లేదు.మాది మరాఠీ ఫ్యామిలీ. వాళ్లకు ఇండస్ట్రీ గురించి అస్సలు తెలియదు. దీంతో ఏం జరుగుతుందో అని చాలా భయపడ్డారు. సీరియల్స్లో నటిస్తూ అక్కడ గుర్తింపుతో నేను సినిమాల్లోకి వచ్చాను. నేను ఎంచుకున్న పాత్రలు, సినిమాలు నాకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు నా ఎదుగుదలను చూసి నా తల్లిదండ్రులు గర్విస్తున్నారు. ఇంతకంటే సంతోషం ఏముంది' అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. -
ఆల్జీబ్రాకు బదులు ‘హంతకుడు’ స్టోరీ రాశా.. ‘సీతారామం’ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సీతారామం’తో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి మన బిడ్డే. కొత్తగూడెం గణేష్ టెంపుల్ గల్లీలో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అందాల రాక్షసితో ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో చోటు సాధించారు. తాను చదివిన కాలేజీలో ఏర్పాటు చేసిన ఫంక్షన్లో పాల్గొనేందుకు చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. కొత్తగూడెంతో తనకున్న అనుబంధం నెమరు వేసుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. అసలు సినిమా ఆలోచనే లేదు.. నాన్న సన్యాసిరావు సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ సూర్యకుమారి కోర్టులో ఎంప్లాయిగా ఉండేవారు. మా ఫ్యామిలీ గణేష్ టెంపుల్ వెనుక గల్లీలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏరియాలో ఉండేది. టెన్త్ వరకు రామవరం సింగరేణి స్కూల్లో, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజీలో, డిగ్రీ వివేకవర్థిని కళాశాలలో చదివాను. చిన్నప్పుడు అసలు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీదనే ధ్యాస ఉండేది. సినిమాలు చూడటం కూడా తక్కువే. స్వాతికిరణం చూశాక.. చిన్నతనంలో ఓసారి మా అమ్మ దుర్గా టాకీస్లో స్వాతికిరణం సినిమాకు తీసుకెళ్లింది. ఆ వయసులో ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని నాకు ఆ సినిమాతో ఒక్కసారిగా సినిమాకి దర్శకుడు అనే వ్యక్తి ఎవరు ? అతను ఎలా ఆలోచిస్తాడు అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. వెంటనే స్వాతికిరణం దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎంజీ రోడ్లో సంతోష్ వీడియో లైబ్రరీ నుంచి విశ్వనాథ్ గారి సినిమా క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్లి సినిమాలో ఇంకో కోణంలో చూడటం మొదలెట్టాను. శంకరాభరణం సినిమా లెక్కలేనన్ని సార్లు చూశాను. అలా సినిమాలపై ఇష్టం పెరుగుతూ పోయింది. అయినప్పటికీ బుద్ధిగా చదువుతూనే ఎంసీఏలో ఉండగా సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యాను. ఆల్జీబ్రాకు బదులు స్క్రిప్ట్ రైటింగ్.. శంకరాభరణం తర్వాత కథకుడు, దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. ఓ వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెబుతుంటే మరోవైపు నా మనసులో కథలు అందులోని పాత్రలు మెదిలేవి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఓ పత్రికలో కథల కాంపిటీషన్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఓ స్టోరీ రాసేసి ప్రైజ్ కొట్టేద్దామనుకున్నా. కాలేజీలో కోటేశ్వరరావు సార్ మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నారు. నేను పైకి ఊ కొడుతూనే ‘హంతకుడు’ పేరుతో మంచి క్రైం స్టోరీ రాసేస్తున్నా. కాసేపటికి సార్కి డౌట్ వచ్చి నా నోట్స్ చెక్ చేశారు. అక్కడ ఆల్జీబ్రా బదులు ‘హంతకుడు’ కనిపించింది. అంతే అక్కడే సార్ వాయించేశారు. ఆ తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఇప్పుడదొక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత వీపు వాయించేశారు.. ఇంటర్లోకి వచ్చాక సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయింది. పైగా కొత్తగూడెంలో సినిమా థియేటర్లు అన్నీ కృష్ణవేణి కాలేజీకి దగ్గర్లోనే ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి మా గ్యాంగ్ అంతా సినిమాలకు వెళ్లే వాళ్లం. క్లాసులో స్టూడెంట్స్ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తే, కోటేశ్వరరావు సార్ సీడీ 100 బైక్ వేసుకుని థియేటర్లకు వచ్చేవారు. ప్రొజెక్టర్ రూమ్లో నిల్చుని స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు ? ఎక్కడ ఉన్నారో గమనించేవారు. అలా ఓసారి మేం గులాబీ సినిమా చూసేందుకు పరమేశ్వరి థియేటర్లో ఉండగా సార్ మమ్మల్ని పట్టేసుకున్నారు. ఆ తర్వాత అందరి వీపులు వాయించేశారు. దీంతో ఎప్పుడైనా కాలేజ్ టైంలో సినిమాలకు వెళితే ‘సీడీ హండ్రెడ్ బైక్ ’ వచ్చిందా అంటూ మధ్యమధ్యలో చెక్ చేసుకునే వాళ్లం. నెక్ట్స్ సినిమాలో కొత్తగూడెం.. నేను ప్రేమకథలు బాగా తీస్తానని, నాకో బ్యూటీఫుల్ లవ్స్టోరీ ఉందనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవం కంటే ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. టీనేజ్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నాకు లవ్స్టోరీస్ ఏమీ లేవు. స్టడీస్, కథలు రాయడం మీదనే ఫోకస్ ఉండేది. కాకపోతే లవ్ చేస్తే ఎలా ఉండాలనే భావనలతోనే కథలు రాసుకున్న. వాటితోనే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి సినిమాలు తీశాను. ఇప్పటి వరకు చేసినవన్నీ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథలే. అందాల రాక్షసిలో పాత కారు, పగిలిన అద్దంలోని హీరోయిన్ కనిపించే దృశ్యం మాత్రం కొత్తగూడెం నుంచి తీసుకున్నా. నా చిన్నతనంలో గణేష్ టెంపుల్ గల్లీలో ఓ పాత కారు పార్క్ చేసి ఉండేది. కాలేజీకి, స్కూల్కు వెళ్లేప్పుడు ప్రతీ రోజు దాన్ని దాటుకుంటూ వెళ్లేవాణ్ని. ఆ ఒక్క సీన్ని సినిమాలో చూపించాను. త్వరలో మైత్రీ మూవీస్కి చేయబోయే సినిమాలో రియల్ లైఫ్లో కొత్తగూడెంలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల్లో కొన్నింటిని సెల్యూలాయిడ్ తెర మీద చూపించబోతున్నాను. బ్యాడ్ బాయ్ని కాదండోయ్... సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా చదువును ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి. డిగ్రీ ఫైనలియర్లో కొత్తగూడెం నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. అక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటూ కవిత డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లెక్కల ట్యూషన్ చెప్పేవాన్ని. ఇంటర్లో పడిన పునాది గట్టిగా ఉండటంతో అది సాధ్యమైంది. స్టూడెంట్గా ఇంగ్లిష్తో నాకు ఎప్పుడు తిప్పలే ఉండేవి. చాతకొండ మూర్తి సార్ అయితే ‘ఇంగి్లష్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ , సమాధానం సరిగా చెప్పలేదంటూ’ ఎన్నిసార్లు కొట్టారో. అప్పుడు చెప్పిన పాఠాలు, తిన్న దెబ్బలు, సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ అన్ని కలిపి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రం హిందీ వర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్కు లవ్ లెటర్స్) సీతారామం హిందీ వర్షన్ ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ రావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా బాలీవుడ్ అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ వర్షన్ కూడా ఓటీటీలోకి రానుండడంతో థియేటర్లలో చూడలేని వారికి ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. #Sitaramam (Hindi) Premieres on Disney+ Hotstar - November 18th. 🤩😍#SitaRamamHindi @dulQuer @mrunal0801 @iamRashmika https://t.co/uqC5GgRHtS — South Hindi Dubbed Movies (@SHDMOVIES) November 9, 2022 -
వేశ్య గృహంలో రెండు వారాలు గడిపిన సీతా రామం హీరోయిన్
-
'సీతారామం' డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ కూడా అద్భుతమే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్ సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్, సుమంత్ల మధ్య చిత్రీకరించిన సీన్ అది. ఫుట్బాల్ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్ చెప్పగా.. అతని కాలర్ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది.. నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయగా 1మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి. -
‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఏమన్నదంటే..
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న సీతారామం సినిమా చూసిన ఆమె సోషల్ మీడియా వేదికగా చిత్ర దర్శకుడు హాను రాఘవపూడి, మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు మూవీ చాలా అద్భుతంగా ఉందని, ఈ ఎపిక్ లవ్స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలిగిందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! స్క్రీన్ప్లే అయితే అత్యంత అద్భుతమంటూ కంగనా సీతారామం చిత్రాని కొనియాడింది. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్గా మరో పోస్ట్ పెట్టింది. ‘ఈ సినిమాలోని నటీనటులందరు చాలా అద్భుతంగా నటించారు. అందులో మృణాల్ నటన బాగా ఆకట్టుకుంది. భావోద్యేగ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు అత్యద్భుతం. తనలా మరేవరూ నటించలేరు అనేంతగా నటన కనబరించింది. మృణాల్ నిజంగానే రాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ మృణాల్పై ప్రశంసలు కురిపించి కంగనా. కాగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ‘సీతారామం’ మూవీ అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. మొత్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్స్ను దాటింది. ఇక ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్ విడుదల కాగా అక్కడ సైతం ఈ మూవీ విశేష ప్రేక్షాదర పొందుతుంది. ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన రివ్యూ ప్రకటిస్తూ మూవీ హీరోహీరోయిన్లపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా? -
‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్, మృణాల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. I watched @hanurpudi’s #SitaRamam last night. So refreshing to see @dulQuer… so impressive, his power comes from his genuineness. And what to say about young @mrunal0801 this is the first time I saw her performance… so fresh and original… she will be a big star. Wow. Congrats! — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022 చదవండి: బిగ్బాస్ హౌజ్లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్గుడ్ లవ్స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'సీతారామం'కు విదేశీ ప్రేమలేఖ.. ఎవరు రాశారంటే?
మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకుడిగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై తమ ప్రేమను చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అందరూ తమకు నచ్చిన రీతిలో అభిమానాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: గుర్తు పట్టలేనంతగా సీతారామం హీరోయిన్.. ఆమెకు ఏమైంది..!) అయితే తాజాగా ఈ చిత్రానికి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. పోలెండ్కు చెందిన మోనికా అనే అభిమాని.. ఈ సినిమాపై తన ప్రేమను పంచుకున్నారు. నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. " సీతారామం చిత్ర యూనిట్కు పోలాండ్ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" ట్వీట్ చేసింది. My letter to the #SitaRamam Team❤️sent all the way from Poland🇵🇱 to India🇮🇳. I don't know if someone will read it because it's really long😬but I really wanted to express my love and gratitude.🙏🥹 Love you forever.❤️ @VyjayanthiFilms @hanurpudi @dulQuer @mrunal0801 @iamRashmika pic.twitter.com/xAlXlouc30 — Monika from Poland🇵🇱 (@PolishMonika) September 15, 2022 -
‘సీతారామం’ సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ ఏమన్నారంటే..
ఒక సినిమా హిట్ అయితే చాలు.. దాని సిక్వెల్ తీస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత టాలీవుడ్లోనూ ఈ సీక్వెల్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హిట్ సినిమాల కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘సీతారామం’ మూవీకి కూడా సీక్వెల్ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ దుల్కర్ సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. సీక్వెల్పై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (చదవండి: మహేశ్-రాజమౌళి సినిమా: జక్కన్న భారీ స్కెచ్...హీరోయిన్ ఆమేనా?) ‘ఏదైనా ఒక సినిమాకి విశేష ప్రేక్షకాదారణ లభించి, క్లాసిక్గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందు నుంచే తెలుసుకున్నా. మేం కథను బాగా నమ్మాం. సీతారామం ఒక క్లాసిక్ మూవీగా నిలస్తుందని భావించాం. అనుకున్నట్లే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నా’అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. అలాగే రీమేక్ కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో మృణాళిక ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక,తరుణ్ భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. -
నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్
హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ తనదైన నటన, స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోలలో ఒక్కడిగా మారాడు. ఒకే బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్ని పలకరించిన దుల్కర్ ‘మహానటి’తో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇక రీసెంట్గా విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో రామ్గా ప్రేక్షకు హృదయాలను కొల్లకొట్టాడు. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ అనే ఆర్మీ యువకుడిగా కనిపించాడు. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఈ సినిమాతో తెలుగులో మరో కమర్షియల్ హిట్ అందుకున్నద దుల్కర్ త్వరలో ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ నెగిటివ్ రివ్యూస్, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంగ్లీష్ చానల్తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మొదట్లో తనపై కూడా చాలా నెగిటివ్ రివ్యూస్, విమర్శలు వచ్చాయని, అవి చదివి చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘‘కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని. అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. ‘నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కూడా కొరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్గా పనికి రాననన్నారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకుంటున్నాం’ అంటూ అంటూ నాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అది నన్ను చాలా బాధించింది’’ అంటూ దుల్కర్ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. -
పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్తో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి కాకపోయిన పిల్లల్ని కంటాను అంటూ చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా నిలిచాయి. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా? ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకపోతే పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది. చదవండి: టాలీవుడ్పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలుపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయిన నేను పిల్లల్ని కంటాను. అది టెస్ట్ట్యూబ్ బేబీ ద్వారా. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని మా అమ్మకి చెబితే తాను కూడా ఓకే చెప్పింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్టాక్ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ రాశివారికి నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి
అక్రమ రిజిస్ట్రేషన్పై కలెక్టర్ సీరియస్
‘వాగ్దేవి’ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు
మామిడికి మార్కెట్ కష్టాలు
No Headline
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
వైన్స్ ఘటనలో 8 మంది రిమాండ్
జడ్చర్లలో భారీ వర్షం
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై కేసు నమోదు
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement