Tarun Tejpal
-
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్పాల్కు ఊరట
-
దానవ మానవుల పాతాళ్ లోక్
ఆకాశ హర్మ్యాలలో ఉంటారు కొందరు. నేల మీద ఉంటారు కొందరు. నేలకు దిగువన పాతాళలోకంలో వసిస్తారు కొందరు. పాతాళం అంటే చీకటి. నలుపు. చెడు. హింస. ప్రాణాలకు తెగించి చేసే బతుకు సమరం. కాని పాతాళంలోని బతుకులు ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేల మీద ఉన్నవారు, ఐశ్వర్యపు అంచుల్లో బతికేవారు... వీరు తయారు చేసిన వ్యవస్థేనా దీనికి కారణం. ‘అమెజాన్ ఒరిజినల్స్’లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ చూడ్డానికి పైకి ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది. నిజానికి ఇది మూసి ఉంచిన భారతీయ సమాజం. తెలిసీ చీకటిలో ఉంచేసే గుగుర్పాటు సమాజం. ఢిల్లీలో యుమునా నది అందరికీ తెలుసు. కాని ‘యమునా పార్’ (యమునకు ఆవల) ఒక ప్రపంచం ఉంది. అది దిగువ స్థాయి ప్రజల ప్రపంచం. స్లమ్స్ ప్రపంచం. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండే ప్రపంచం. ఆ యమునా పార్లో ‘ఔటర్ యమునా పార్’ పోలీస్ స్టేషనే మన కథాస్థలం. అందులో పని చేసే ఒక సాదాసీదా సర్కిల్ ఇన్స్పెక్టరే మన కథా నాయకుడు. అతని పేరు హాతీరామ్ చౌదరీ. కథ ఏమిటి? ఢిల్లీలో ఉన్న ఒక ప్రఖ్యాత న్యూస్ చానల్ హెడ్ మీద హత్యాయత్నం జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. హత్య చేయడానికి పక్క ఊర్ల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు యమునా పార్ లాడ్జ్లో దిగి ఉన్నారు. ఆ లాడ్జ్ నుంచి బయట పడి హత్యకు బయలుదేరుతుండగా ఒక్క ఉదుటున వెంబడించి అరెస్ట్ చేస్తారు. జరిగిన హత్యాయత్నం ప్రఖ్యాత జర్నలిస్ట్ మీద. అతనికి ఏదైనా అయి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అసలు ఈ చానల్హెడ్ను చంపడానికి ప్లాన్ చేసిందెవరు? అందుకు సిద్ధమైన ఈ నలుగురు ఎవరు? కేసు హాతీరామ్ చౌదరికి అప్పచెప్పబడుతుంది. అతనికి తోడుగా ఒక కుర్ర ఎస్.ఐని ఇస్తారు. వీరిద్దరూ అంత పెద్ద కేసును సాల్వ్ చేయాలి. చేయగలరా? చేయకూడదనే కొందరి ప్లాన్. అందుకే హాతీరామ్కు అప్పజెప్పారు. ఇప్పుడు హాతీరామ్ ఏం చేయాలి? ఒక్క అవకాశం హాతీరామ్ ఒక సగటు మధ్యతరగతి వాడు. జీవితంలో ఏమీ సాధించలేదు. ఇంట్లో భార్య అతడి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుంది. హైస్కూలుకు వచ్చిన కొడుకు తన తండ్రి ఒక హీరోలా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఒక పోలీస్ వ్యాన్ వేసుకొని, చిరుబొజ్జ పెంచుకుని చిల్లర తగాదాలు, మొగుడూ పెళ్లాల పంచాయితీలు తీరుస్తూ వచ్చిన హాతీరామ్కు ఇది తన జీవితంలో దొరికిన అత్యంత ముఖ్యమైన అవకాశం అనుకుంటాడు. దీనిని ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎలా? నలుగురు నిందితులు దొరికారు కాబట్టి వీరి నుంచే ఆధారాలు దొరకాలి. వారిని ఇంటరాగేట్ చేయడం మొదలుపెడతాడు. వారిలో ఒకడిది మధ్యప్రదేశ్లోని చిత్రకూట్. ఇంకొకడిది పంజాబ్. ఒకడిది మీరట్. ఒకరిది ఢిల్లీ. ఈ నలుగురినీ కలిపింది ఎవరు? హాతీరామ్ తీగలాగుతూ వెళతాడు. మెల్లగా డొంక కదులుతుంది. కథ చివరకు తాను కేసు సాల్వ్ చేసి తీరుతాడు. అంతా మంచే ఉండదు.. ప్రతిదీ చెడే కాదు ఒక హత్యాయత్నం, దాన్ని ప్లాన్ చేసినవారిని పట్టుకోవడం ఇదే కథైతే ఈ సిరీస్ ఇంతమందిని ఆకట్టుకునేది కాదు. కాని ఇది జీవితాలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సమాజ భ్రష్టత్వాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మేడిపండులా కనిపించే వ్యవస్థ కడుపులో ఎంత కుళ్లు ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కులం, మతం, ఆర్థిక అంతరాలు, స్వార్థం... ఇవన్నీ మనిషిని ఎలా మారుస్తాయి ఈ సిరీస్ చెబుతుంది. నేరస్తులు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు, అవడానికి మూలం ఏమిటి ఇది చెబుతుంది. కొందరి పట్ల ఈ దేశంలో ఉన్న వివక్షను, ఛీత్కారాన్ని, అవమానాన్ని చాలా శక్తిమంతంగా చూపిస్తుంది. పోలీసుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మేడల్లో ఉండేవారిలో కూడా మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. మంచి చెడు అనేది మనుషుల్లో ఉంటూ మారుతూ ఉండే లక్షణంగా ఈ సిరీస్లో కనిపించి ప్రేక్షకుడు తనను తాను చూసుకుంటాడు. కథ గడిచే కొద్దీ ప్రతి పాత్ర మీద ప్రేక్షకుడి అంచనా మారిపోతూ ఉంటుంది. ప్రతి పాత్రను నలుపు తెలుపుల్లో విడగొట్టలేమని తెలుస్తుంది. తరుణ్ తేజ్పాల్ పుస్తకంతో ‘తహెల్కాడాట్కామ్’తో తరుణ్ తేజ్పాల్ సంచలనం సృష్టించడం అందరికీ తెలుసు. జర్నలిస్టుగా అతను రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ పుస్తకం ఈ సిరీస్ తీయడానికి ఇన్స్పిరేషన్. పాతాళ్లోక్లో చానెల్ హెడ్ చాలా పేరున్నవాడు. పాలకుల మీద చాలా స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఉంటాడు. ఒక సంభాషణలో అతను లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాడని చెబుతారు. కాని అతను కూడా తన ఉనికి కోసం పతనమవడం ఈ సిరీస్ లో మనం చూస్తాం. మీడియా ఎలాంటి తప్పుడు పనులకు తెగబడుతుందో, తన టి.ఆర్.పిల కోసం ఎవరినైనా ఎలా బలి చేయడానికి సిద్ధపడుతుందో ఇందులో చూపిస్తారు. ఈ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల భార్యలు ఎలాంటి వొత్తిడికి గురవుతారో, ఎంత యాంగ్జయిటీ ఫీలవుతుంటారో ఇందులో చానెల్ హెడ్ భార్య పాత్ర ద్వారా చూపిస్తారు. ఇందులో డి.సి.పి చెప్పే డైలాగ్ ఒకటి ఉంది– ‘చూడటానికి ఈ వ్యవస్థ ఒక చెత్త కుప్పలా కనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్లి చూస్తే ఒక మిషన్ అని అర్థమవుతుంది. ఈ మిషన్లో ప్రతి నట్టూ బోల్టు తాము ఏం చేయాలో తెలుసుకొని పని చేస్తుంటాయి. అలా తెలుసుకోని వాటి స్థానంలో కొత్త నట్లూ బోల్టులు వస్తుంటాయి. వ్యవస్థ మాత్రం అలానే నడుస్తుంటుంది’ అని అంటాడతడు. రాజకీయ నాయకులు, పోలీసులు, పెద్ద మనుషులు వీరు ఆడే ఆటలకు పాతాళలోకంలోని సగటు మనుషులు శలభాల్లా నాశనం కావడమే ‘పాతాళ్లోక్’ మూల కథాంశం. ఉత్కంఠ రేపే కథనం దాదాపు 40 నిమిషాలు ఉండే ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథ నడిచే కొద్దీ తర్వాత ఏం జరుగుతుందా అని కుతూహలం పెరుగుతుంది. కథనం ముందు వెనుకలుగా, పారలల్గా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్లో వాస్తవిక ప్రవర్తనతో తీయడం వల్ల ప్రేక్షకుడు తాను ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా భావిస్తాడు. ఇందులో ముఖ్యపాత్ర ధారి, హాతీరామ్గా వేసిన నటుడు జైదీప్ అహ్లావత్ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్లో నటించాడు. ఈ సిరీస్ అతనికి చాలా పేరు తెచ్చింది. సిరీస్లో చేసిన వారందరూ పాత్రలు కారేమో అసలు మనుషులే నటిస్తున్నారేమో అనిపించేలా చేశారు. గతంలో నెట్ఫ్లిక్స్లో ‘సేక్రెడ్ గేమ్స్’ క్రైమ్ థ్రిల్లర్గా చాలా పెద్ద హిట్ అయ్యింది. అమేజాన్లో ‘పాతాళ్ లోక్’ అంతకన్నా ఎక్కువ ప్రశంసలు పొందుతోంది. రచయిత సుదీప్ శర్మ రెండేళ్లు కష్టపడి రాసిన ఈ సిరీస్ను హిందీ అర్థమయ్యేవారు తప్పక చూడొచ్చు. ఇంగ్లిష్ సబ్టైటిల్స్ ఫాలో అవుతూ చూడాలనుకునేవారూ చూడొచ్చు. పాతాళ్ లోక్ (అమెజాన్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్) ఎపిసోడ్ల సంఖ్య: 9 మొత్తం నిడివి: 6 గం.30 నిమిషాలు రచన: సుదీప్ శర్మ దర్శకత్వం: అవినాష్– ప్రొసిత్ రాయ్ నిర్మాత: అనుష్కా శర్మ – సాక్షి ఫ్యామిలీ -
‘తేజ్పాల్’ విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తనపై మోపిన అభియోగాలను తొలగించాలంటూ తేజ్పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బాబ్డేల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించి ఉండాల్సిందని తేజ్పాల్ తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇంతలోనే విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు. -
జర్నలిస్ట్పై రేప్.. తరుణ్ తేజ్పాల్కు కోర్టు షాక్!
సాక్షి, గోవా: తెహల్కా మ్యాగజిన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు గోవా కోర్టు షాక్ ఇచ్చింది. తోటి మహిళా జర్నలిస్ట్పై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న తేజ్పాల్పై గోవా కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. ఈ కేసులో బుధవారం కోర్టుకు హాజరైన తేజ్పాల్ .. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని, విచారణపై స్టే విధించాలని తేజ్పాల్ కోరారు. అయితే, ఆయనపై ప్రాసిక్యూషన్ నమోదుచేసిన అభియోగాలను ఖరారు చేసిన కోర్టు.. విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు తేజ్పాల్కు ఎదురుదెబ్బగా మారాయి. గతంలో తేజ్పాల్ ఈ కేసు విచారణపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కానీ కోర్టు నిరాకరించింది. 2013 నవంబర్లో గోవాలో జరిపిన పార్టీలో తేజ్పాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెహల్కా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తేజ్పాల్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వం తనపై కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతొందన్నారు. -
రాయని డైరీ
‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’.. షెల్ఫ్ లోంచి ఎప్పుడు నా చేతిలోకి వచ్చిందో తెలీదు. అది నా పుస్తకమే. పదేళ్ల క్రిందట రాసింది! ఊరికే చూస్తూ కూర్చున్నాను, పేజీలు తిప్పకుండా. అట్ట మీద ఆరోగ్యవంతమైన స్త్రీ నగ్నదేహం. లోపల స్త్రీ గురించి ఏం ఉండదు. అంతా మగాళ్ల ఏడుపు. ఆ ఏడుపుకి ఘనీభవ రూపమే.. అట్ట మీద ఉన్న స్త్రీ దేహం. లోపల ఏం రాశానో నాకు తెలుసు కాబట్టి, లోపల ఏం రాసి ఉందో తెలుసుకునే ఉత్సాహం నాకు లేదు. పైన స్త్రీ దేహంలోనే.. ఏళ్లుగా చూస్తూ ఉన్నా, తెలియంది ఇంకా ఏదో ఉన్నట్లనిపిస్తుంటుంది. ఆ ఉందనుకున్నది స్త్రీలో లేనిది కావచ్చు. ‘ఉందీ’ అని పురుషుడు అనుకోవడంలో ఉన్నదీ కావచ్చు. ఏది నిజం? ఏది అబద్ధం? స్త్రీ దేహంలో ఈ రెండూ ఒకటేనా? ‘‘తరుణ్.. మొత్తం తొమ్మిది చార్జిషీట్లు మన మీద వేయబోతున్నారు’’ అన్నాడు ప్రమోద్ కుమార్ దూబే.. ఆయాసపడుతూ వచ్చి. నా లాయర్ అతడు. ముఖం చిన్నబోయి ఉంది. ‘ఇట్స్ ఓకే’ అన్నాను. సో.. తొమ్మిది చార్జిషీట్లు, తొమ్మిది విచారణలు, తొమ్మిది శిక్షలు! ‘‘పదేళ్లకు తగ్గకుండా మనకు శిక్ష పడే అవకాశం ఉంది తరుణ్’’ అన్నాడు దూబే. నవ్వాను. ‘‘మిస్టర్ దూబే, మీరలా మాటిమాటికీ ‘మన మీద’, ‘మనకు’.. అంటూ మిమ్మల్ని నాతో కలుపుకోకండి. నేను నిందితుడిని. మీరు నా లాయర్’’ అన్నాను. ‘‘కానీ తరుణ్.. అన్యాయం అనిపిస్తోంది. ఒక మగవాడి మీద ఇన్ని కేసులు! రాంగ్ఫుల్ కన్స్ట్రెయింట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఫోర్స్, సెక్సువల్లీ కలర్డ్ రిమార్క్స్, హెరాస్మెంట్, అస్సాల్ట్ అండ్ రేప్.. లిఫ్ట్లో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఉన్న పద్నాలుగు సెకన్లలోనే ఇవన్నీ ఎలా జరిగిపోతాయో నాకైతే అర్థం కావడం లేదు. మగవాడికి వ్యతిరేకంగా ఇండియన్ పీనల్ కోడ్లో ఇన్ని సెక్షన్లు ఉన్నాయా అనిపిస్తోంది’’ అన్నాడు దూబే. ‘‘మగవాడికి వ్యతిరేకంగా కాదు మిస్టర్ దూబే.. స్త్రీ దేహానికి అనుకూలంగా.. ’’ అని పెద్దగా నవ్వాను. భయంగా చూశాడు దూబే. ఒక మగవాడిలో కనిపించే భయం అది! ‘‘పెద్దగా నవ్వితే నవ్వారు. చిన్నగా మాట్లాడండి తరుణ్’’ అని చెప్పి, వెళ్లిపోయాడు. ‘ది ఆల్కెమీ ఆఫ్ డిజైర్’ ఇంకా నా చేతుల్లోనే ఉంది. అట్టమీది బొమ్మను చూస్తుంటే నా మీద కేసు పెట్టిన నా జూనియర్ మోస్ట్ గుర్తుకొచ్చింది. ఐ లవ్ హర్! తన దేహానికి ఏదో అయిందని, అవబోయిందనీ తను కేసు పెట్టలేదు. ఒక ఎంప్లాయర్గా నాపై తను ఉంచిన నమ్మకానికి దెబ్బ తగిలిందని కేసు పెట్టింది. గ్రేట్ గర్ల్. మాధవ్ శింగరాజు -
తెహల్కా ఎడిటర్ తేజ్పాల్కు ఎదురుదెబ్బ
గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై తరుణ్ తేజ్పాల్ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసు ఫైనల్ ఛార్జ్షీటులో 376 సెక్షన్ లేదని అన్నారు. కాగా తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
తేజ్పాల్కు బెయిల్ మంజూరు
-
ఎట్టకేలకు తరుణ్ తేజ్పాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడు నెలలుగా తరుణ్ తేజ్పాల్ గోవా జైల్లో ఉన్నారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందటంతో సుప్రీంకోర్టు ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడుతుంది. -
తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 1వ తేదీ వరకూ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తేజ్పాల్ తల్లి శకుంతల తేజ్పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నెల 27 వరకు తేజ్పాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అతనికి ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో తేజ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం బెయిల్ ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తేజ్పాల్కు మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్పాల్కు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 27 వరకు తేజ్పాల్ మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తేజ్పాల్ తల్లి శకుంతల తేజ్పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. గతేడాది నవంబర్లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తరుణ్ తేజ్పాల్కు మధ్యంతర బెయిలు
పనాజి: అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) నేడు కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది నవంబర్లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది. -
తరుణ్ తేజ్ పాల్ తల్లి కన్నుమూత
పానాజీ: లైంగిక వేధింపుల కేసులో గోవా జైల్లో రిమాండ్ లో ఉన్న హల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ తల్లి శకుంతల తేజ్ పాల్ కన్నుముశారు. 87 ఏళ్ల శకుంతల గత కొద్దికాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని.. గోవాలోని తేజ్ పాల్ నివాసంలో కన్నుమూశారని ఆయన తరపు న్యాయవాది సందీప్ కపూర్ మీడియాకు తెలిపారు. అంత్యక్రియలకు తేజ్ పాల్ హాజరయ్యేందుకు అనుమతించాలని పానాజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు తేజ్ పాల్ కు రెండుసార్లు కోర్టు అనుమతించింది. శకుంతల అంత్యక్రియలు గోవా లేదా ఢిల్లీలో నిర్వహించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సందీప్ అన్నారు. సహచర ఉద్యోగిపై అత్యాచారం జరిపారనే ఆరోపణలపై గత సంవత్సరం నవంబర్ 30 తేది నుంచి రిమాండ్ లో ఉన్నారు. -
తేజ్పాల్ కేసులో బదులిచ్చిన డినీరో
పణజీ: తెహల్కా పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్పై నమోదైన అత్యాచారం కేసులో గోవా పోలీసులు తనకు పంపిన ప్రశ్నావళికి ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో సమాధానాలు అందజేశారు. ఆయన న్యూయార్క్లోని తన న్యాయవాదుల ద్వారా ఇటీవల వీటిని గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించారు. తేజ్పాల్, ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు గత ఏడాది నవంబర్లో థింక్ఫెస్ట్ సదస్సు కోసం గోవా హోటల్లో ఉన్నట్లు డినీరో న్యాయవాదులు ధ్రువీకరించారని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. అయితే ఆయన డినీరో సమాధానాలను పూర్తిగా వెల్లడించలేదు. హోటల్లో బసచేసిన డినీరోను, ఆయన కూతురిని వారి గదిలోకి తీసుకెళ్లే క్రమంలో తేజ్పాల్ లిఫ్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. -
తల్లిని చూసేందుకు తేజ్పాల్కు అనుమతి
పనాజీ: సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుపాలైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ తాత్కాలిక ఊరట లభించింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి శంకుతలను చూసేందుకు ఆయనకు గోవా కోర్టు అనుమతినిచ్చింది. మాపుసా పట్టణంలోని ఆస్పత్రిలో ఉన్న తన తల్లిని రేపు ఉదయం ఆయన కలుసుకోనున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శకుంతల ఐసీయూలో ఉన్నారు. కాగా, తేజ్పాల్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ తిరస్కరించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతేడాది నవంబర్లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
జైలు నుంచే తేజ్పాల్ మహిళతో ఫోన్ మంతనాలు
పనాజీ: లైంగిక ఆరోపణల కేసులో జైలు పాలైన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్.. జైలు నుంచే ప్రతి రోజూ ఓ మహిళా వ్యాపర భాగస్వామితో ఫోన్లో సంభాషించేవారని విచారణలో తేలింది. జైలు అధికారులు ఈ నివేదికన మర్గావో జిల్లా, సెషన్స్ కోర్టుకు బుధవారం సమర్పించారు. తేజ్పాల్ జైలు గది నుంచి సిమ్ను సీజ్ చేసినట్టు అధికారులు చెప్పారు. ఈ సిమ్ పనాజీకి చెందిన ఓ మహిళ పేరుతో తీసుకున్నారు. తేజ్పాల్ ఢిల్లీకి చెందిన షీలా లుంకడ్ అనే మహిళతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు. షీలాతో పాటు ఢిల్లీకే చెందిన మంజరితో సంభాషించేవారని, ఆయన సిమ్లో ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నట్టు చెప్పారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేజ్పాల్, ఆయన భార్య గీతన బత్రా, షీలా, రాజీవ్ లుకండ్ భాగస్వాములు. జైల్లోకి ఫోన్ను ఎలా అనుమతించారే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ
పనాజి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటీషన్ పై మంగళవారం బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 18 వ తేదీన వాదనలు విన్న కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని అందించాలని కోర్టు క్రైంబ్రాంచ్ ను కోరింది. బెయిల్ పిటీషన్ పై తేజ్ పాల్ ను నేడు కోర్టులో హాజరు పరుచనునున్నారు. అంతకుముందు తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలులుగా తేజ్ పాల్ జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.అతనిపై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354, 354-ఏ సెక్షన్లు, దురద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసినందకు 341 ,342 సెక్షన్లు, అత్యాచార అభియోగాల క్రింద 376,376(2)(ఎఫ్), 376(2)(కె) సెక్షన్ల ను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు
పానాజీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో గోవాలోని రిసార్డులో జరిగిన కాన్పరెన్స్ సందర్భంగా సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై తేజ్ పాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలలుగా ఆయన పోలీసు, జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం బాంబే హైకోర్టును తేజ్ పాల్ ఆశ్రయించారు. ప్రస్తుతం వాస్కో కు 35 కిలో మీటర్ల దూరంలోని సదా సబ్ జైలులో ఉన్నారు. -
ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్షీట్
పనాజి : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యిందని... ఫిబ్రవరి 5న ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తరుణ్ తేజ్పాల్ ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. మరోవైపు కటకటాల్లో ఉన్న తేజ్పాల్ బెయిల్ పిటిషన్ను గోవా కోర్టు విచారించింది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. -
తేజ్పాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించింది. కటకటాల్లో ఉన్న తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం నాడు గోవా కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తేజ్ పాల్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
లైంగిక వేధింపుల ఆరోపణలతో కటకటాల్లో ఉన్న తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం నాడు గోవా కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
‘స్టింగ్ కింగ్’ తేజ్పాల్ పతనం
క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, రక్షణ కొనుగోళ్లలో ముడుపులు వంటి అక్రమాలను స్టింగ్ ఆపరేషన్లతో బట్టబయలు చేసిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ప్రతిష్ట మట్టిగొట్టుకుపోయింది ఈ ఏడాదే. తన కుమార్తె స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నవంబర్లో గోవాలోని ఓ హోటల్ లిఫ్టులో ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా జర్నలిస్టు ఆరోపించడంతో తేజ్పాల్ను అరెస్టు చేశారు. -
లైంగిక వేధింపుల వార్త షాకిచ్చింది: అమీర్ ఖాన్
మహిళా జర్నలిస్ట్ పై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త షాక్ కు గురి చేసింది అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఓ మహిళ జర్నలిస్ట్ తో తేజ్ పాల్ అలా ప్రవర్థించడం నమ్మలేకపోయాను అని అన్నారు. ఈ కేసులో తరుణ్ తేజ్ పాల్ ప్రవర్తన తనను నిరుత్సాహపరిచిందని అన్నాడు. ఈ ఘటన అత్యంత విషాదకరమైంది అని అమీర్ అన్నారు. ఈ ఘటనలో మహిళా జర్నలిస్టుకు మనమంతా బాసటగా నిలువాలని అమీర్ సూచించారు. ఇలాంటి పరిస్తితిని ఎదుర్కొనడం ఏ మహిళకైనా చాలా కష్టమైన పనియే అని అన్నారు. భౌతిక, లైంగిక వేధింపులు, అత్యాచార సంఘటనలు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించలేనివని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులు తమ విధులను పకడ్భందీగా నిర్వహించాలని అమీర్ సూచించారు. అత్యాచారం అనేది ఓ హింసాత్మక సంఘటన అని అమీర్ వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే రెండవ భాగంలో కొన్ని కీలక సమస్యలను, సీరియస్ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నానని అమీర్ తెలిపారు. -
తేజ్పాల్ పోలీస్ కస్టడీ పొడగింపు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగించారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తేజ్పాల్కు తొలుత ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన న్యాయస్థానం తాజాగా ఈ నెల 10 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్పాల్ను శనివారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు ఆయనకు ఇటీవల లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. పలువురు సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. -
పెద్దల పాడు పనులు!
సమాజంలో బాధ్యయుత స్థానాల్లో ఉన్నవారు హుందాగా మెలగాలి. మరీ ముఖ్యంగా గౌరవ ప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మరింత హుందాగా నడుకోవాల్సివుంటుంది. తమ కింద పనిచేసే వారి పట్ల మర్యాదగా వ్యహరించాల్సిన పెద్దలు దారి తప్పుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఉన్నత స్థానాల్లో వ్యక్తులు స్త్రీల పట్ల చులకగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు అధికమడం సాధారణంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన తరుణ్ తేజ్పాల్, జస్టిస్ ఏకే గంగూలీ వివాదాలే ఇందుకు ఉదాహరణ. సంచలనాత్మక ‘స్టింగ్’ ఆపరేషన్లతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రిక ఇప్పుడు కష్టాల్లో పడింది. దానికి కారణం ఆ ప్రతిక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్. అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా పేరు గాంచిన తేజ్పాల్ తన కూతురి స్నేహితురాలిపై వికృతచేష్టలతో జైలుపాలయ్యారు. ‘స్టింగ్’ జర్నలిజానికి చిరునామాగా మారిన తేజ్పాల్ దారి తప్పి ఊచలు లెక్కిస్తున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరోను కలుద్దామని ఆశ పెట్టి గోవా స్టార్ హోటల్లో బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో తేజ్పాల్ ఆట కట్టించారు. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్న జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసి రిటైరైన గంగూలీపై న్యాయవిద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. నిర్భయ ఉదంతంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో తన పట్ల జడ్జిగారు అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు వెల్లడించడంలో కలకలం రేగింది. న్యూఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య తనను వేధించారని తెలిపింది. మద్యం తాగాలని కోరారని, కామపేక్షతో కనబరచారని బాధితురాలు వాపోయింది. అయితే తాను వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారని చెప్పింది. తాను బయటకు వెళ్లిన తర్వాత తన వెనకకే వచ్చి లోపల జరిగిన దానికి సారీ కూడా చెప్పారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతంపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ కూడా దీన్ని నిర్ధారించింది. అయితే ఘటన జరిగిన నాటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోబోమని తెలిపింది. మహిళా భద్రత ప్రశ్నార్థకమైన తరుణంలో ఉన్నత స్థానాల్లో వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమను ఏమీ చేయరన్న దీమాతో లేదా బాధితులు ఎవరికీ చెప్పుకోలేరన్న ధైర్యంతో 'పెద్దోళ్లు' పాడు పనులకు దిగుతున్నారు. వయసుపైబడిన వారు తమ కూతురి వయసున్న యువతులపై అకృత్యాలకు తెగబడుతుండడం ప్రమాదకర పరిణామం. తరుణ్ తేజ్పాల్(50), ఏకే గంగూలీ(66) ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారే కాదు వయసులోనే పెద్దవారే కావడం గమనార్హం. వికృత చేష్టలతో తమ పెద్దరికానికే కాదు, తమ పదవులకు కళంకం తెచ్చారు. చేసిన పనులకు సిగ్గుపడడం పోయి సమర్థించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళ భద్రతకు ఢోకా లేని సమాజంగా అవతరించాలంటే తక్షణ సామాజిక విలువల సంస్కరణ జరగాలి. -
ఫాస్ట్ట్రాక్ కోర్టుకు తేజ్పాల్ కేసు
న్యూఢిల్లీ/పణజీ: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడి కేసు విచారణను ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అప్పగించే అవకాశాలున్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తాము సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, మహిళా జడ్జిని నియమిస్తామని చెప్పారు. బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
షోమా చౌదరికి సమన్లు
పణజి: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడి కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. ఈ విషయాన్ని డీఐజీ ఓపీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే వారి వాంగ్మూలాన్ని ఎప్పుడు రికార్డు చేస్తారనే దానిని మాత్రం వెల్లడించలేదు. కానీ, శుక్రవారం లేదా శనివారం రికార్డు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఉద్యోగానికి రాజీనామా చేయకముందు గోవా పోలీసు బృందం షోమా వాంగ్మూలాన్ని ఢిల్లీలో రికార్డు చేశారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న తేజ్పాల్కు బుధవారం ఉదయం రెండో దశ వైద్య పరీక్షలు చేశారు. ఇదంతా విచారణలో భాగంగానే జరుగుతోందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, మరో నెల, నెలన్నరలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని గోవా సీఎం మనోహర్ పారికర్ తెలిపారు. ఫ్యాన్కు అనుమతి నిరాకరణ తేజ్పాల్ ఉన్న లాకప్ గదికి ఫ్యాన్ సదుపాయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జుడీషియల్ మెజిస్ట్రేట్ కృష్ణ జోషి తోసిపుచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఫ్యాన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తేజ్పాల్ తరఫు న్యాయవాది సోమవారం ఆ పిటిషన్ దాఖలు చేశారు. -
తేజ్ పాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
పోలీస్ లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చేసిన విజ్క్షప్తిని గోవా కోర్టు తిరస్కరించింది. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జుడిషియల్ మేజిస్ట్రేట్ క్షమా జోషి తిరస్కరించారు. లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్ ను పానాజీ పోలీస్ కస్టడీలో ఉంచారు. మానవత దృక్పథంతో తన క్లయింట్ కు లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయాలని తేజ్ పాల్ లాయర్ డిసెంబర్ 2 తేదిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్ పాల్ కు బుధవారం రెండవసారి వైద్య పరీక్షలు జరిపించారు. డిసెంబర్ 2 తేదిన గోవా మెడికల్ కాలేజి, హస్పిటల్ లో వైదపరీక్షలతోపాటు, లైంగిక పటుత్వ పరీక్షలు జరిపిన సంగతి జరిపారు. శనివారం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో తేజ్ పాల్ కు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించారు. గోవాలో ఓ కార్యక్రమం సందర్భంగా సహ ఉద్యోగి, మహిళా జర్నలిస్ట్ ను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది. -
తేజ్పాల్కు పుంసత్వ పరీక్షలు
పనాజీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు పోలీసులు సోమవారం గోవా మెడికల్ కాలేజీలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పుంసత్వ పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలినట్లు జైలు అధికారులు తెలిపారు. లైంగిక దాడుల కేసులో ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి కావడంతో పోలీసులు ఉదయమే ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు వివిధ పరీక్షలు చేయించి తీసుకువెళ్లారు. మళ్లీ మధ్యాహ్నం 3.15 గంటలకు మరికొన్ని పరీక్షల కోసం తీసుకువచ్చారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, హ్యూమన్ బిహేవియర్(ఐపీహెచ్బీ)కి తీసుకువెళ్లి మానసిక ప్రవర్తనకు సంబంధించిన టెస్టులు కూడా పూర్తిచేశారు. తేజ్పాల్ను ఫైవ్స్టార్ హోటల్కు కూడా తీసుకువెళ్లిన పోలీసులు... సహోద్యోగినిపై అనుచితంగా ప్రవర్తించిన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు గోవా మెడికల్ కాలేజీ డీన్ వీఎన్ జిందాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో శనివారం తేజ్పాల్ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం స్థానిక కోర్టు ఆయనకు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించడంతో పోలీసు అధికారులు ఏకధాటిగా ఐదు గంటలపాటు విచారించారు. ప్రస్తుతం పనాజీలోని జైల్లో ఉన్న తేజ్పాల్.. మానవతావాద దృక్పథంతో తన గదిలో ఫ్యాన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. లాకప్లో అక్రమ వేటగాళ్ల మధ్య.. హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులతో మొదటిరోజు లాకప్ పంచుకున్న తేజ్పాల్... రెండోరోజు కప్పలు, తాబేళ్లను అక్రమంగా వేటాడే నలుగురు నిందితుల మధ్య గడిపారు. పోర్చుగీస్ కాలం నాటి ఓ పురాతన భవనంలో ఉన్న ఈ జైల్లో మొత్తం మూడు సెల్స్ ఉన్నాయి. ఇందులో తేజ్పాల్ను ఐదు మీటర్ల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న ఓ గదిలో ఉంచారు. రాత్రంతా నిద్ర కరువవడంతో తేజ్పాల్ అలసటగా కనిపించారని, ముఖం ఉబ్బి, కళ్లు ఎర్రగా మారాయని పోలీసు వర్గాలు చెప్పాయి. -
తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్ష
లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించేందుకు సోమవారం గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించడం తప్పనిసరని పోలీసులు తెలిపారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగిక వేధించాడనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం కోర్టులో హాజరు పరచగా ఆయనను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. విచారణలో భాగంగా 50 ఏళ్ల తేజ్పాల్ను పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. -
తేజ్పాల్కు 6 రోజుల కస్టడీ
పణజీ: తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను పణజీ కోర్టు ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు ఆదివారం జుడీషియల్ మేజిస్ట్రేట్ షామా జోషీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్సెస్ తవేరా విజ్ఞప్తితోపాటు కేసు విచారణలో తేజ్పాల్ పోలీసులకు సహకరిస్తున్నందున కస్టడీ అవసరంలేదన్న డిఫెన్స్ న్యాయవాదుల వాదననూ తోసిపుచ్చారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను శనివారం రాత్రి అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు తేజ్పాల్ను క్రైం బ్రాంచి హెడ్క్వార్టర్స్కు తరలించి ఐదు గంటలకుపైగా ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు ఆయన్ను తిరిగి లాకప్కు తరలించారు. సోమవారం తిరిగి విచారణ కొనసాగించనున్నారు. శనివారం రాత్రి తేజ్పాల్ను అరెస్టు చేశాక పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం అర్ధరాత్రి 12.30 గంటలకు గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. పరీక్షలు ముగిశాక బయటకు వచ్చిన తేజ్పాల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో తేజ్పాల్ను పోలీసు హెడ్క్వార్టర్స్ వద్దకు తీసుకొచ్చాక ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. అనంతరం పోలీసులు తేజ్పాల్ను ఇద్దరు హత్య కేసు నిందితులు సహా ముగ్గురిని ఉంచిన లాకప్లోకి పంపారు. కాగా, బాధితురాలు తనపై అత్యాచార అభియోగాలు మోపడం వెనక రాజకీయ కుట్ర ఉందంటూ అరెస్టుకు ముందు వరకూ ఆరోపించిన తేజ్పాల్... ముందస్తు బెయిల్ దరఖాస్తులో మాత్రం ఆ ఆరోపణలను ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసులో జోక్యం చేసుకోం: షిండే తేజ్పాల్పై నమోదైన కేసులో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేశారు. దోషులెవరినీ తమ ప్రభుత్వం రక్షించదని...అదే సమయంలో వేరే రాష్ట్రానికి (గోవా) సంబంధించిన కేసులో జోక్యం చేసుకోబోదని ముంబై లో వ్యాఖ్యానించారు. మరోవైపు తెహెల్కా గ్రూపు డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ. 26 లక్షల సర్వీసు ట్యాక్స్ను తెహెల్కా చెల్లించలేదని ఆడిటర్ల తనిఖీల్లో తేలింది. -
తేజ్పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే
ముంబై: తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడట్టు ఆరోపణలు రావడంతో తేజ్పాల్కు గోవా కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. తేజ్పాల్ అరెస్టు, కేసు విషయాల్లో కాంగ్రెస్ సంబంధం లేదని షిండే తెలిపారు. ఈ అంశంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అత్యాచార ఆరోపణల అనంతరం తేజ్పాల్ అరెస్టు ఆలస్యం కావడంతో కాంగ్రెస్పై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. తేజ్పాల్ను కాంగ్రెస్ కాపాడుతుందంటూ బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో స్పందించిన షిండే.. అటువంటి ఘటనలకు కాంగ్రెస్ ఎప్పుడూ వంతపాడదని తెలిపారు. తేజ్ పాల్ అంశం వేరే రాష్ట్రానికి సంబంధించింది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదన్నారు. -
తరుణ్ తేజ్పాల్కు 6 రోజుల పోలీస్ కస్టడీ
లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపారు. గోవా పోలీసులు ఆదివారం తేజ్పాల్ను ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచారు. కేసుకు సంబంధించి విచారించేందుకు తేజ్పాల్ను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపాలని అంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కాగా తేజ్పాల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు సహకరిస్తున్నారని, పోలీస్ కస్టడీ అవసరం లేదని అతని తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి శామా జోషీ ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో తేజ్పాల్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అప్పుల ఊబిలో తెహల్కా
సంచలన కథనాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రికకు అదే రీతిలో కష్టాలు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపులకు కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ జైలుపాలు కాగా, యాజమాన్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తెహల్కా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. తమ ఆస్తుల విలువ కంటే ఆస్తిఅప్పుల చిట్టా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెహల్కా హోల్డింగ్ కంపెనీ ఆడిటింగ్ నివేదికలో పేర్కొంది. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు రాగానే తెహల్కా యాజమాన్యం ఇతర కంపెనీల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. పన్నులు చెల్లించలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణ జరిపే అవకాశముంది. కాగా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అనంత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో తెహల్కా పబ్లికేషన్ గ్రూప్ నడుస్తోంది. ఈ కంపెనీ దాదాపు 13 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు సమాచారం. గతేడాది చివరకు అనంత్ మీడియాలో తరుణ్ తేజ్పాల్, అతని సోదరి నీనా తేజ్పాల్, సతీష్ మెహతా, ప్రవీణ్ కుమార్ డైరెక్టర్లుగా ఉన్నారు. -
తేజ్పాల్ నన్ను లైంగికంగా వేధించేవాడు
-
ఉత్థాన పతనాలు సంచలనమే!
‘స్టింగ్’ పోటుతో అనూహ్యంగా ఎదిగిన తేజ్పాల్ లైంగిక దాడి కేసుతో దారుణంగా దిగజారిన ప్రతిష్ట ‘తెహెల్కా’ అంటే సంచలనం అని అర్థం. సంచలనమే ఊపిరిగా మొదలైన ‘తెహెల్కా’ మీడియా సంస్థ దేశంలో పెను సంచలనాలనే సృష్టించింది. మీడియా ‘స్టింగ్’పోటు ఎలా ఉంటుందో దేశంలోని పెద్దతలకాయలకు రుచి చూపింది ‘తెహెల్కా’నే. రహస్య కెమెరాల సాయంతో రికార్డు చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా 1997లో క్రికెట్లో సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ బాగోతాన్ని బయటపెట్టింది. దీనిపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఉదంతంతో ‘తెహెల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పేరు మీడియాలో మార్మోగింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2001లో రక్షణ కొనుగోళ్ల వ్యవహారంలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని కూడా ‘స్టింగ్’ ఆపరేషన్ ద్వారా ‘తెహెల్కా’ బట్టబయలు చేసింది. ఆ దెబ్బకు అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వ్యవహారంలో పలువురు రక్షణ శాఖ అధికారులు దోషులుగానూ తేలారు. ‘తెహెల్కా’ జర్నలిస్టు నుంచి నగదు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2012 ఏప్రిల్లో వెలువడిన తీర్పులో బంగారు లక్ష్మణ్ ఆ కేసులో దోషిగా తేలారు. కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రక్షణ కొనుగోళ్లలో అవినీతి బాగోతం వెలుగులోకి తేవడంతో తేజ్పాల్ మీడియా ప్రపంచంలో మేరునగ ధీరుడి స్థాయికి ఎదిగారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఆయనను అత్యంత ప్రభావవంతుల జాబితాల్లో చేర్చాయి. ‘స్టింగ్’ జర్నలిజంలో తేజ్పాల్ను ఒక బ్రాండ్గా అభివర్ణించాయి. చివరకు, తన కూతురి స్నేహితురాలు, తన పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో చిక్కుకోవడంతో ఆయన ప్రతిష్ట దారుణంగా దిగజారింది. పతన పరిణామం...: అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా తనకు లభించిన ప్రచారాన్ని తేజ్పాల్ తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. తన ప్రచురణలు, వెబ్సైట్ల నిర్వహణ కోసం పలువురు రాజకీయ నాయకుల నుంచి ఆర్థిక సాయం పొందారు. అలాగే, గోవాలో ఇటీవల నిర్వహించిన సదస్సు మాదిరి కార్యక్రమాల నిర్వహణ కోసం బడా కార్పొరేట్ సంస్థల స్పాన్సర్షిప్ను కూడా పొందారు. తన సంస్థలో పనిచేసే జర్నలిస్టులెవరైనా కొన్ని కార్పొరేట్ స్పాన్సర్లకు వ్యతిరేకంగా కథనాలు తెచ్చిస్తే, వాటిని చెత్తబుట్టపాలు చేసేవారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రచారంలో తప్ప ఆచరణలో తేజ్పాల్ నైతిక విలువలకు కట్టుబడని కారణంగా పలువురు ఉద్యోగులు ‘తెహెల్కా’ను విడిచిపెట్టేశారు. అయితే, గోవాలో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి సంఘటనపై గగ్గోలు మొదలయ్యేంత వరకు ఈ ఆరోపణలేవీ పెద్దగా వెలుగులోకి రాలేదు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
తరుణ్ తేజ్పాల్ అరెస్టు
లైంగిక దాడి కేసులో కస్టడీకి తీసుకున్న క్రైం బ్రాంచ్ ముందస్తు బెయిల్ను తిరస్కరించిన పణజీ కోర్టు ఉదంతంలో తేజ్పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని కోర్టు స్పష్టీకరణ భిన్న ప్రకటనలతో ఊసరవెల్లిలా తేజ్పాల్: పీపీ పణజీ: తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడి కేసులో ‘తెహెల్కా’ పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను శనివారం రాత్రి గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల నిమిత్తం తేజ్పాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో గోవా, ఢిల్లీ పోలీసుల బృందం తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున తేజ్పాల్ శుక్రవారం పణజీ జిల్లా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... తేజ్పాల్ పిటిషన్ను తిరస్కరిస్తూ రాత్రి 8 గంటలకు తీర్పు ఇచ్చారు. ఉదంతంలో తేజ్పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని స్పష్టీకరించారు. గోవాలోని ఒక హోటల్లో తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు శనివారం 10.30 గంటల వరకు అరెస్టు చేయకుండా పణజీ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తేజ్పాల్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై శనివారం ఉదయం 10 గంటలకు జడ్జి అనుజా ప్రభుదేశాయ్ మళ్లీ విచారణ ప్రారంభించారు. తేజ్పాల్ కోర్టులో హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాది గీతా లూథ్రా తన వాదనలు కొనసాగించారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు కోరినంత కాలం గోవాలో ఉండటానికి తేజ్పాల్ సిద్ధంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయనే వాదనలనూ తోసిపుచ్చారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరేష్ లొట్లికార్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ప్రాసంగిక సాక్ష్యాలు తేజ్పాల్కు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల విచారించేందుకు అతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నట్లు నివేదించారు. గోవాలోని హోటల్లో సీసీటీవీ ఫుటేజ్లోని చిత్రాలు అత్యాచారం ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా నిందితుడు తేజ్పాల్ పూటకో రకంగా భిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని వాదించారు. బాధితురాలు తన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారని పీపీ స్పష్టం చేశారు. తేజ్పాల్ గోవా పోలీసులకు అందుబాటులో లేరని, కోర్టు నుంచి తాత్కాలిక బెయిల్ పొందిన తర్వాత మాత్రమే ప్రత్యక్షమయ్యారని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా జరగాలంటే నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో దాఖలైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిర్యాదురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చేందుకు తేజ్పాల్ ఇంతకుముందు ప్రయత్నించారని ఆరోపించారు. తేజ్పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్పై పీపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. తేజ్పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 25 పేజీల తీర్పు ఇచ్చారు. తేజ్పాల్ బెయిల్కు అనర్హుడు... మహిళపై నిర్బంధ అత్యాచారం(ఐపీసీ 376 (2)కె), ఆమె గౌరవానికి భంగం కలిగించడం (ఐపీసీ 354ఏ) కేసుల్లో నిందితుడు తరుణ్ తేజ్పాల్ ప్రమేయం ఉన్నట్లు నమ్మదగిన సాక్ష్యం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. నేర తీవ్రత దృష్ట్యా తేజ్పాల్కు బెయిల్ పొందే అర్హత లేదని తేల్చి చెప్పారు. ‘‘పిటిషనర్ ఆమె (పాత్రికేయురాలు)కు గురువు, తండ్రి వంటివారు. అయితే ఆ స్థానాన్ని అతను దుర్వినియోగం చేశారు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలికి శారీరకంగానే కాకుండా మానసికంగా దెబ్బ తగులుతుంది. వారి ప్రతిష్ట, గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ప్రమాదంలో పడతాయి. బాధితులు, వారి కుటుంబసభ్యులు సామాజికంగా పరిహాసానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు ఆలస్యం కావొచ్చు. అంతమాత్రాన బాధితురాలి ఫిర్యాదును సందేహించాల్సిన అవసరంలేదు. బాధితురాలి సహోద్యోగి ప్రకటనలను పరిశీలిస్తే అత్యాచారం ఉదంతం గురించి అదేరోజు బాధితురాలు సమాచారమిచ్చారు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తనపై కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా కొంతమంది వ్యక్తుల స్వప్రయోజనాలు ఉన్నాయన్న పిటిషనర్ తేజ్పాల్ వాదనను తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు రుజువైతే తేజ్పాల్కు కనీసం పదేళ్ల జైలుశిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. తీర్పు అనంతరం న్యాయవాది గీతా లూథ్రా మాట్లాడుతూ, సెషన్స్ కోర్డు తీర్పును తాము సవాల్ చేయబోవట్లేదని చెప్పారు. కోర్టుకు హాజరైన తేజ్పాల్ సాయంత్రం తిరిగివెళ్తుండగా మంగళ్ చౌధరి అనే ఓ నిరసనకారుడు నల్లజెండాను విసిరాడు. తేజ్పాల్ కారులోకి వెళ్లిపోవడంతో అది ఆయనపై పడలేదు. రాజస్థాన్ నుంచి వచ్చి గోవాలో ఉంటున్న మంగళ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వివరాల లీక్పై వివరణివ్వండి: జాతీయ మహిళా కమిషన్ ఆదేశం తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలైన మహిళా పాత్రికేయురాలి ఇంటిపేరును ట్విట్టర్లో బహిర్గతం చేయడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖిని శనివారం ఆదేశించింది. అలాగే బీజేపీ నేత విజయ్ జోలీకి షోకాజ్ నోటీసు, సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. జోలీ సోమవారం కమిషన్ ముందు హాజరుకానున్నట్లు సమాచారమిచ్చారని వెల్లడించారు. -
తరుణ్ తేజ్ పాల్ కు బెయిలు నిరాకరించిన గోవా కోర్టు
-
తరుణ్ తేజ్పాల్కు బెయిల్ నిరాకరణ
మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గోవా కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన్ను ఆరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇస్తారని, ముంబై కూడా వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ముందుగా శనివారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే తాత్కాలికంగా బెయిల్ ఇచ్చిన కోర్టు, శనివారం నాడు ఆయన దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. విచారణ ముగిసిన అనంతరం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తరుణ్ తేజ్పాల్ను విచారించేందుకు గోవా పోలీసులకు మార్గం సుగమమైంది. అంతకుముందు చాలా రోజుల నుంచి ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. -
తేజ్పాల్ బెయిల్పై విచారణ సాయంత్రానికి వాయిదా
-
తేజ్పాల్ బెయిల్పై విచారణ సాయంత్రానికి వాయిదా
లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ శనివారం గోవా సెషన్ కోర్టులో హాజరయ్యారు. వాదనలు సాయంత్రం 4.30కి వాయిదా పడ్డాయి. తేజ్పాల్ తరపున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టును తేజ్పాల్ బెదిరించే ప్రయత్నం చేయలేదన్నారు. తేజ్పాల్ దేశం విడిచిపెట్టి వెళ్లే ఆలోచన లేదని.. కనీసం ముంబై కూడా వెళ్లరని చెప్పారు. తేజ్పాల్పై అత్యాచారం కేసు పెట్టడం అన్యాయమని.. అది కూడా ఘటన జరిగిన 10 రోజులకు ఫిర్యాదు చేశారని.. గుర్తు చేశారు. మరోవైపు తేజ్పాల్ నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరపు లాయర్ వాదించారు. బాధితురాలి స్టేట్మెంట్లలో నిలకడ ఉందన్న ఆయన.. రేప్కు యత్నించారన్న విషయాన్ని సీసీటీవీ దృశ్యాలు బలపరుస్తున్నాయన్నారు. గోవా పోలీసులకు తేజ్పాల్ అందుబాటులో లేరని... మధ్యంతర బెయిల్ రాగానే ఆయన బయటపడ్డారని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పారు. తేజ్పాల్ను కచ్చితంగా పోలీస్ కస్టడీకి అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. -
తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం
-
తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం
పణజీ : తెహెల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై శనివారం గోవా కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. తెహెల్కా మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయనను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన విషయం తెలిసిందే. కాగా వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెయిల్బుల్ వారంట్లు జారీ చేశారు. అయితే ఆయన తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా వేశారు. ఉదయం నుంచి హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో ఎట్టకేలకు తరుణ్ తేజ్పాల్కు గోవా కోర్టులో ఊరట లభించింది. ఆయన్ని ఈరోజు ఉదయం పది గంటల వరకూ అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు తేజ్పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో గోవా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ విచారణ నిమిత్తం గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఎదుట హాజరయ్యారు. -
లైంగిక వేధింపుల కేసులో మాజీ జడ్జి పేరు వెలుగులోకి
న్యూఢిల్లీ: న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో గోప్యంగా ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పేరు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సుప్రీం కోర్టులో ఎన్నో కీలక కేసులు పరిష్కరించి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న జస్టిస్ ఏకే గంగూలీ అని వెల్లడైంది. బాధితురాలితో పాటు జస్టిస్ గంగూలీ వాంగ్మూలాన్ని రికార్డు చేయడం పూర్తవడంతో సుప్రీం కోర్టు అధికారి ఒకరు ఆయన పేరు బయటపెట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ గంగూలీ ఖండించారు. ఆ ఆరోపణలు తనను షాక్నకు గురిచేశాయని చెప్పారు. విచారణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఆ ఆరోపణలు అసత్యమని తేల్చిచెప్పానని, అసలు తనపై అలాంటి నిందలను ఆమె ఎందుకు వేసిందో అర్థం కావడం లేదని తెలిపారు. అంతకుముందు ఆయన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెహెల్కా’ తరుణ్ తేజ్పాల్ కేసుతో తన కేసును పోల్చవద్దని చెప్పారు. ఆ న్యాయ విద్యార్థిని తన కుమార్తె లాంటిదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానే బాధితుడిగా మిగిలానన్నారు. అయితే పేరు బయటపడిన విషయంపైతానేమీ సిగ్గుపడడంలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆమెను శారీరకంగా హింసించలేదని స్పష్టంచేశారు. ఆమె తన దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి అధికారికంగా అనుమతి తీసుకురాలేదని చెప్పారు. వేరే విద్యార్థిని స్థానంలో ఆరోపణలు చేసిన విద్యార్థిని స్వతంత్రంగా వచ్చిందని తెలిపారు. అంతేగాక పనుల నిమిత్తం తన ఇంటికి చాలా సార్లు వచ్చిందని వెల్లడించారు. -
తేజ్పాల్ చేష్ట అత్యాచారమే!
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ గోవాలో తనపై జరిపిన లైంగిక దాడి చట్ట ప్రకారం అత్యాచార నిర్వచనం పరిధిలోకే వస్తుందని బాధిత యువ జర్నలిస్టు పేర్కొంది. తేజ్పాల్పై తన ఫిర్యాదు ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన రాజకీయ కుట్రలో భాగమన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు తనను తీవ్ర కలతకు గురిచేశాయని తెలిపింది. ఈ మేరకు ఆమె శుక్రవారం రెండు పేజీల ప్రకటన విడుదల చేసింది. ‘తేజ్పాల్ తన ఆస్తిని, పలుకుబడిని, హోదాను కాపాడుకునేందుకు పోరాడుతుంటే నేను మాత్రం నా చిత్తశుద్ధిని చాటుకునేందుకు, నా శరీరం నా సొంతమనే హక్కును చాటిచెప్పేందుకు...అది యజమానులు ఆడుకునే ఆటవస్తువు కాదని నొక్కిచెప్పేందుకే పోరాడుతున్నా’ అని స్పష్టం చేసింది. అదే సమయంలో గత పదిహేను రోజులుగా అన్ని వర్గాల నుంచి తనకు లభిస్తున్న మద్దతు తనను కదిలించిందని బాధితురాలు పేర్కొంది. ‘కానీ అన్నీ బాగా తెలియూల్సిన టీవీ వ్యాఖ్యాతలు కూడా నేను ఫిర్యాదు చేసేందుకు సమయం తీసుకోవడాన్ని ప్రశ్నించారు. మరికొందరు వ్యాఖ్యాతలు రేప్ వంటి పదాలకు బదులుగా లైంగిక దాడి (సెక్సువల్ మోలెస్టేషన్) పదం వాడటాన్ని ప్రశ్నించారు. లైంగిక దాడి బాధితురాలిగా నన్ను నేను పరిగణించుకోవడానికి, నా సహచరులు, స్నేహితులు, మద్దతుదారులు విమర్శకులు నన్ను ఆ విధంగా చూడటానికి.. నేను సిద్ధంగా ఉన్నానో లేదో తెలియదు. నేరాలను వర్గీకరించేది బాధితులు కాదు..చట్టం. ఈ కేసులో చట్టం స్పష్టంగా ఉంది. నా విషయంలో తేజ్పాల్ చేసింది అత్యాచారానికి ఉన్న చట్టబద్ధమైన నిర్వచనం పరిధిలోకే వస్తుంది’ అని ఆ ప్రకటనలో బాధితురాలు వివరించింది. ‘అత్యాచారానికి ఉన్న నిర్వచనాన్ని విస్తృతం చేసే కొత్త చట్టం ఇప్పుడు మనకుంది. కొత్త చట్టం కేవలం అనామకులకే కాదు ధనికులకు, శక్తిమంతులకు, ప్రముఖులకు అందరికీ వర్తించాలి. తేజ్పాల్ మాదిరి నేను సంపద ఉన్న వ్యక్తిని కాదు. మా అమ్మ నన్ను ఒంటి చేత్తో ఒకే ఒక్క ఆదాయంతో పెంచింది. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. నేను చేసిన ఫిర్యాదు వల్ల నేను ఎంతగానో ప్రేమించిన ఉద్యోగంతోపాటు ఆర్థిక భద్రతను, వేతన స్వాతంత్య్రాన్ని కోల్పోయూను. ఇది ఏమాత్రం సులభమైన యుద్ధం కాబోదు’ అని ఆమె పేర్కొంది. కాగా, తన కుమార్తెపై లైంగిక దాడి ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని బాధితురాలి తల్లి పేర్కొంది. ఈ ఘటనపై తొలుత క్షమాపణ చెప్పిన తేజ్పాల్ ఆ తర్వాత తన కుమార్తె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాడని, ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పారిపోతున్నాడని ఆమె మాటలను ఉటంకిస్తూ బెంగాలీ పత్రిక ఎయిబేలా ప్రచురించింది. -
జోలీ అత్యుత్సాహంపై జర్నలిస్టుల ఆగ్రహం
న్యూఢిల్లీ: తహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు జోడీ హల్చల్ చేయడాన్ని ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ తప్పుబట్టింది. జోలీ వ్యహరించిన తీరును ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(డీయూజే)కు చెందిన జెండర్ అండ్ ఎథిక్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. చౌదరీ నేమ్ ప్లేట్పై ‘నిందితురాలు’ అని రాసి, ప్రదర్శించడాన్ని డీయూజే తప్పుబట్టింది. తహెల్కా యజమాని తరుణ్ తేజ్పాల్పై నమోదైన కేసులో షోమా నిందితురాలు కాదనే విషయాన్ని జోలీ గుర్తించాని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు కలుగజేసుకోకపోతే షోమాపై విజయ్ జోలీ అనూయాయులు దాడి కూడా చేసుండేవారని ఆరోపించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, జోలీ తీరును ఖండిస్తారని ఆశిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. జోలీని విచారించిన పోలీసులు... గురువారం చోటుచేసుకున్న ఘటనపై విచారించేందుకు ఢిల్లీ పోలీసులు బీజేపీ నేత విజయ్ జోలీని సాకేత్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్కు వచ్చిన జోలీని సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. శనివారం కూడా స్టేషన్కు రావాల్సిందిగా చెప్పారు. ఆయన నుంచి వాంగ్మూలం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. జోలీని అరెస్టు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఆయనపై కేసు నమోదు చేశాం. అందుకే విచారించాం. అవసరమైతే అరెస్టు చేస్తామ’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ సంస్కృతికి అద్దం పట్టింది: కాంగ్రెస్ షోమా చౌదరి ఇంటిముందు జోలీ వ్యవహరించిన తీరు బీజేపీ సంస్కృతికి అద్దం పట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. జోలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. -
తేజ్పాల్కు ఊరట
-
తేజ్పాల్ అరెస్టు.. అంతలోనే కోర్టు నుంచి ఊరట
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్కు వెంటవెంటనే రెండు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. గోవాలో అడుగు పెట్టగానే ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, రేపు ఉదయం 10 గంటలకు తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని, ఆ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో తేజ్పాల్కు ఒక్క రోజుకు మాత్రం ఊరట దొరికినట్లు అయ్యింది. బెయిల్ ఇచ్చేదీ లేనిదీ తేలిపోతుంది కాబట్టి ఆ తర్వాత అరెస్టు విషయాన్ని కూడా చూసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. అంతకుముందు వీలైనంత వరకు అరెస్టును తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నించిన తేజ్పాల్.. చివరకు గోవాకు విమానంలో బయల్దేరక తప్పలేదు. దాంతో ఆయన విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే అప్పటికే సిద్ధంగా ఉన్న గోవా పోలీసులు అరెస్టు చేశారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించడంతో తేజ్పాల్ మీద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, విచారణ సమయంలో తేజ్పాల్ తరఫున వాదిస్తున్న న్యాయవాది బాధితురాలి పేరును ఉదహరించారు. వెంటనే దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నువ్వు న్యాయవాది ఎలా అయ్యావంటూ జడ్జి చీవాట్లు పెట్టారు. -
గోవాకు బయలుదేరిన తేజ్పాల్
-
రాజకీయం చేయొద్దు: 'తెహల్కా' బాధితురాలు
న్యూఢిల్లీ: తనను రాజకీయాల్లోకి లాగొద్దని తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తెహల్కా మాజీ మహిళా జర్నలిస్టు అభ్యర్థించింది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని రాజకీయ పార్టీలను ఆమె కోరింది. లింగ, అధికారం, హింస వంటి అంశాలపై స్పందించేటపుడు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. తరుణ్ తేజ్పాల్పై తాను ఫిర్యాదు చేయడాన్ని 'ఎన్నికల ముందు కుట్ర'గా అభివర్ణించడాన్ని తనను కలచివేసిందని వాపోయింది. తాను ఫిర్యాదు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తనపై వేసిన నిందలను తిరస్కరిస్తున్నట్టు 'కాఫిలా' అనే వెబ్సైట్లో పోస్ట్ చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా గోవా పోలీసుల ముందు లొంగిపోయేందుకు తరుణ్ తేజ్ పాల్ తన భార్య, కూతురు, సోదరుడితో కలిసి ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. -
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్పాల్
-
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్పాల్
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ ను అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఢిల్లీలోని తరుణ్ తేజ్పాల్ ఇంటిలో సోదాలు చేశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తేజ్పాల్ రాత్రి తన ఇంట్లో కాకుండా మరో చోటు మకాం వేశారు. తేజ్పాల్ను పట్టుకునేందుకు గోవా పోలీసులు తేజ్పాల్ బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆయన అక్కడ లేకపోవటంతో వారు వెనుదిరిగారు. గోవా క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా సౌత్ ఢిల్లీలోని తరుణ్ తేజ్ పాల్ నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం పోలీసులు మాట్లాడుతు తమ విచారణకు తరుణ్ తేజ్ పాల్ కుటుంబీకులు సహకరించటం లేదని, ఆయన ఎక్కడున్నారనే వివరాలు చెప్పేందుకు తరుణ్ తేజ్ పాల్ సతీమణి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ముందు విచారణకు హాజరుకావాలని గోవా పోలీసులు తేజ్పాల్కు విధించిన గడువు నిన్నటితో ముగిసింది. అయితే తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తరుణ్ తేజ్పాల్ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టులో తరుణ్ తేజ్పాల్ పెట్టుకున్న పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. కోర్టు బెయిల్ ఇవ్వడాని కంటే ముందే అరెస్టు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో గోవా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశ్యంతోనే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గోవా పోలీసుల రాకను పసిగట్టిన తేజ్పాల్ వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈరోజు బెయిల్ రాకపోతే పోలీసులు ముందు తేజ్ పాల్ లొంగిపోయే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. చేతిలో నాన్బెయిలబుల్ వారెంట్తో గోవా పోలీసులు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే.... ఈరోజు ఎలాగైనా బెయిల్ వస్తుందన్న గంపెడు ఆశతో తేజ్పాల్ తప్పించుకు తిరుగుతున్నారు. -
ఏ క్షణమైనా అరెస్టు!
-
తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ రాజీనామా
న్యూఢిల్లీ: తరుణ్ తేజ్పాల్ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి గురువారం రాజీనామా చేశారు. లైంగిక వే ధింపుల వ్యవహారంలో ఒక స్త్రీవాదిగా తన మనస్సాక్షి మేరకు వ్యవహరించానని, అయినా తనపై ఆరోపణలు రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. అందుకే తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ వేధింపుల కేసులో మరింత సమర్థంగా వ్యవహరించాల్సిందన్న సూచనలను నేను అంగీకరిస్తున్నా. అయితే నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడం లేదు. నా నిజాయతీని సహోద్యోగులతోపాటు చాలా మంది ప్రశ్నించారు. నన్ను అడ్డం పెట్టుకొని తెహెల్కాపై బురద చల్లాలనుకునే వారికి నేను అవకాశం ఇవ్వదల్చుకోలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. తేజ్పాల్ లైంగిక వేధింపుల అంశాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు, కేవలం బాధితురాలికి క్షమాపణ చెప్పించి రాజీ కుదిర్చేందుకు యత్నించారని షోమాపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. బాధితురాలికి షోమా న్యాయం చేయ డం లేదని ఆరోపిస్తూ తెహెల్కాలోని పలువిభాగాల ఎడిటర్లు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించినందుకు షోమా పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షోమా ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల హంగామా బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీలోని షోమా ఇంటి ముందు ధర్నాకు దిగారు. లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి అన్యాయం చేయాలని చూసినందుకు ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. షోమాకు, తేజ్పాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలసి షోమా నివాసానికి చేరుకున్న పార్టీ నేత విజయ్ జోలీ.. నానా హంగామా చేశారు. షోమా చౌదరి ఇంటి ముందున్న నేమ్ప్లేట్పై అక్యూస్డ్ (నిందితురాలు) అని రాశారు. ఇంటిముందు నల్ల పెయింట్ వేశారు. ఈ నిరసన మధ్యే షోమా తన ఇంటినుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి ముఖంపై సిరా చల్లడానికి ప్రయత్నించారు. కొందరు కార్యకర్తలు షోమా కారుపైకి ఎక్కారు. పోలీసుల సాయంతో ఆమె జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. తాము వారించినప్పటికీ జోలీ నిరసన ప్రదర్శన నిర్వహించారని ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. మహిళా కమిషన్కు షోమా క్షమాపణలు లైంగిక వేధింపుల కేసులో సరైన చర్యలు తీసుకోనందుకు షోమా చౌదరి గురువారం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు క్షమాపణలు చెప్పారు. కమిషన్ గోవా ఇన్చార్జి షమీనా షఫీక్ను కలసి ఈ మేరకు క్షమాపణలు కోరారు. సంస్థలో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయకపోవడం తప్పిదమేనని చెప్పారు. -
ఏ క్షణమైనా తేజ్పాల్ అరెస్టు!
ఉచ్చుబిగిస్తున్న గోవా పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ల కోసం కోర్టులో పిటిషన్ శనివారం పోలీసుల ముందు హాజరవుతానని కోరిన తేజ్పాల్ నిరాకరించిన ఖాకీలు.. అరెస్టుకు సన్నాహాలు దీంతో శుక్రవారమే హాజరవుతానని పోలీసులకు మళ్లీ ఫ్యాక్స్ స్టార్ హోటల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన తేజ్పాల్ చేష్టలు వాటన్నింటినీ సేకరించిన పోలీసు అధికారులు పణజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చుట్టూ గోవా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఏ క్షణాన్నైనా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేసేందుకు వీలుగా నాన్-బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలని కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు కేసు దర్యాప్తు అధికారి(ఐవో) ముందు హాజరయ్యేందుకు తేజ్పాల్ పోలీసుల అనుమతి కోరారు. శనివారం లోపు హాజరవుతానని తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారి ముందు గురువారం మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలని గోవా పోలీసులు తరుణ్ తేజ్పాల్కు ఇంతకుముందే నోటీసులు జారీ చేశారు. అయితే గడువు ముగియడానికి సరిగ్గా రెండు గంటల ముందు తాను ఇప్పుడు హాజరు కాలేనని, శనివారం లోపు ఐవో ముందుకు వస్తానని తేజ్పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు చకచకా చర్యలు మొదలు పెట్టారు. తేజ్పాల్ వినతిని తిరస్కరిస్తూ... వెంటనే కోర్టు తలుపు తట్టారు. దీంతో తేజ్పాల్ అంతకుముందు చెప్పినట్టు శనివారం కాకుండా శుక్రవారమే దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని, కేసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు అరెస్టు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పణజి డీఐజీ ఓపీ మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. దర్యాప్తు అధికారి చట్టప్రకారం ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు తెచ్చుకున్నారా అని ప్రశ్నించగా.. ‘‘చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నాం.. దర్యాప్తులో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని చెప్పదలుచుకోలేదు’’ అని అన్నారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీపై పణజిలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఉదయం తన నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిసింది. సీసీ టీవీల్లో తేజ్పాల్ చేష్టలు! తరుణ్ తేజ్పాల్ మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేందుకు గోవా పోలీసులు తిరుగులేని ఆధారాలను సేకరించారు. ఈనెల 7, 8 తేదీల్లో గోవాలో తేజ్పాల్ బస చేసిన స్టార్ హోటల్ సీసీటీవీ కెమెరాల నుంచి వీటిని సేకరించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తుంటే తేజ్పాల్ సదరు మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. బాధిత మహిళ, తేజ్పాల్ రాత్రి 9 గంటల సమయంలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో గదికి వెళ్తున్నట్లు కెమెరాల్లో నమోదైంది. బాధితురాలి భుజంపై చేయి వేసి తేజ్పాల్ నడుస్తున్నట్లు అందులో ఉంది. తర్వాత 10.30 గంటల సమయంలో గ్రౌండ్ఫ్లోర్లో ఆ మహిళ చేయి పట్టుకొని లాగుతున్నట్టు రికార్డయింది. రెండు నిమిషాల తర్వాత రెండో ఫ్లోర్లో లిఫ్ట్ తెరుచుకోగానే అందులోంచి మహిళా జర్నలిస్టు తన దుస్తులను సర్దుకుంటూ వడివడిగా బయటకు వచ్చారు. ఆమె వెనకాలే తేజ్పాల్ రావడం కెమెరాల్లో నమోదైంది. బెయిల్ పిటిషన్ వెనక్కి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తేజ్పాల్ గురువారం వెనక్కితీసుకున్నారు. ఈ పిటిషన్పై శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తేజ్పాల్ లాయర్ సందీప్ కపూర్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. బెయిల్పై తగిన కోర్టుకు వెళ్తామని సందీప్ చెప్పారు. -
షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన
ఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ మాజీ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు గురువారం బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఆమె మహిళ అయ్యి కూడా సాటి మహిళలకు అండగా నిలవకపోవడం చాలా బాధాకరమని ఆందోళనలో పాల్గొన్నబీజేపీ నేత విజయ్ జోలీ తెలిపారు. ఇది యావత్తు మహిళా లోకమే తలదించుకునేలా ఉందని జోలీ తెలిపారు. తేజ్ పాల్ కు అండగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తేజ్ పాల్ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
రెండు రోజుల గడువు కోరిన తరుణ్ తేజ్పాల్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్... గోవా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గోవా పోలీసులకు లేఖ రాశారు తరుణ్ తేజ్పాల్ తనకు రెండు రోజుల సమయం కావాలని ఓ లేఖ పంపినట్లు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇనస్పెక్టర్ సునీతా సావంత్ వెల్లడించారు. ఆయన శనివారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కాగా తరుణ్ తేజ్పాల్ ఈరోజు మధ్యాహ్నం లొంగిపోవాలని గోవా పోలీసులు ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టును తేజ్పాల్ కోరారని ... ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తరుణ్ తేజ్పాల్ గోవా పోలీసులకు లేఖ రాశారు. అలాగే పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తాము సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తరుణ్ తేజ్పాల్ తరపు న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. మరోవైపు హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీ టీవీ పుటేజ్ కీలకంగా మారింది. మహిళతో కలిసి తేజ్పాల్ వెళ్లినట్లు సీసీ టీవీలో నమోదు అయినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ భుజాలపై తేజ్పాల్ చేతులు వేసి వెళ్తున్నట్లు అందులో ఉందని పోలీసులు తెలిపారు. దుస్తులు సవరించుకుంటూ ఓ మహిళ లిఫ్ట్ నుంచి బయటకొచ్చారని వారు చెబుతున్నారు. మరోవైపు... తేజ్పాల్ను రక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమాచౌదరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
-
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
న్యూఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమా చౌదరి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తరుణ్ తేజ్పాల్కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్లో మహిళా జర్నలిస్టును తేజ్పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తేజ్పాల్కు గోవా పోలీసుల పిలుపు
పనజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు బుధవారం గోవా పోలీసుల నుంచి పిలుపొచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి ముందు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళా జర్నలిస్టు కూడా బుధవారం గోవా రాజధాని పనజికి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు అంటున్న తేజ్పాల్ ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. కాగా, తనను 4 వారాల పాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న తేజ్పాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. -
మాపై మైండ్ గేమ్ ఆడుతున్నారు : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పొత్తులు, ఎత్తులంటూ తమను మానసికంగా దెబ్బతీసేందుకు (మైండ్గేమ్ ఆడేం దుకు) వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న స్థితిలో పొత్తులపై ఎవరైనా చర్చిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీతో తమకు పొత్తులేదని స్పష్టంచేశారు. క్యాడర్ను కాపాడుకునేకునేందుకే టీడీపీ నేతలు పొత్తులంటూ లీకులిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదని, రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలున్న చరిత్రలేదన్నారు. రాష్ట్రంలోని తుపాను బాధిత ప్రాంతాలను ఆదుకునే అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. నిర్భయ చట్టం కింద తేజ్పాల్ను అరెస్టు చేయాలి తెహల్కా సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి డిమాండ్ చేశారు. తోటి ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడిన తేజ్పాల్ను క్షమించకూడదన్నారు. తేజ్పాల్ అరెస్టు కోరుతూ బుధవారం ఇక్కడ ధర్నా నిర్వహించారు. -
'తేజ్ పాల్, తెహల్కాతో సంబంధాలు లేవు'
తరుణ్ తేజ్ పాల్ తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. తెహల్కా మ్యాగజైన్ లో తనకు వాటాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణల్ని సిబాల్ ఖండించారు. తేజ్ పాల్ తల్లి సిబాల్ చెల్లెలు అనే సందేశాలు సోషల్ మీడియా వెబ్ సైట్ లో విహారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తనపై దుష్ఫ్రచారం మానుకోవాలని సిబాల్ విజ్క్షప్తి చేశారు. రాజకీయంగా తనపై దాడి చేసుకోవచ్చు. కాని తన కుటుంబాన్ని తేజ్ పాల్ వ్యవహారంలోకి లాగకూడదు. తేజ్ పాల్ తల్లి తనకు చెల్లెలు కాదు అని సిబాల్ అన్నారు. తెహల్కా వ్యవస్థాకులు, వాటాదారుడైన ఓ కేంద్ర మంత్రి తరుణ్ తేజ్ పాల్ ను రక్షిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీలపై తాను విమర్శిస్తున్నందునే తనపై దుష్ర్షచారాన్ని చేస్తున్నాయి అని ఆయన అన్నారు. తనకు తేజ్ పాల్ కు మధ్య ఉన్న సంబంధాలను బహిరంగపర్చాలని సిబాల్ సవాల్ విసిరారు. అంతేకాక కోట్లాది రూపాయల మైనింగ్ కుంభకోణానికి కారణమైన రెడ్డి బ్రదర్స్ ( గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర రెడ్డి)లను సుష్మా స్వరాజ్ కాపాడుతోంది అని సిబాల్ ఆరోపించారు. -
తరుణ్ తేజ్పాల్కు సమన్లు
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చని గోవా సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే సమన్లు జారీ కావడం విశేషం. రేపు తేజ్పాల్ ను అరెస్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు. ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్లో మహిళా జర్నలిస్టును తేజ్పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తరుణ్ తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చు: గోవా సీఎం
న్యూఢిల్లీ : తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. మహిళా జర్నలిస్ట్ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను అరెస్టు తప్పకపోవచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అన్నారు. తేజ్పాల్ను ఇరికించేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందన్న వాదనలో వాస్తవం లేదని పారీకర్ స్పష్టం చేశారు. కేసులో జోక్యం చేసుకునేంత సమయం తనకు లేదని ఆయన అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి తాము అన్ని విధాల కృషి చేస్తామని పారీకర్ తేల్చి చెప్పారు. కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు పాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు తరుణ్ తేజ్పాల్పై మంగళవారం గోవా పోలీసులు ‘ఇమ్మిగ్రేషన్ చెక్పోస్ట్ అలర్ట్’ను జారీ చేశారు. తేజ్పాల్ దేశం విడిచి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. నిందితుడు దేశం విడిచి వెళ్లే యత్నాలు చేయకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని డీఐజీ ఓపీ మిశ్రా వెల్లడించారు. బాధితురాలు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని, అయితే ఆమె చెప్పే విషయాలను వెల్లడించలేనని తెలిపారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం, ఒత్తిడి లేవన్నారు. మరోవైపు, తేజ్పాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న నిరాకరించిన విషయం తెలిసిందే. -
తరుణ్ తేజ్పాల్ను తక్షణమే అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ : తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను తక్షణం అరెస్ట్ చేయాల్సిందేనంటూ మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తేజ్పాల్పై నిరసనలు మిన్నంటుతున్నాయి. తేజ్పాల్ను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మంగళవారం మహిళా సంఘాలు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధితురాలికి సంపూర్ణ న్యాయం దక్కేలా.. తేజ్పాల్పై దర్యాప్తు సాగాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. రెండురోజుల క్రితం బాధితురాలు తెహల్కాలో ఉద్యోగానికి రాజీనామా చేయగా.. తెహల్కా యాజమాన్యం వైఖరిపై.. కన్సల్టింగ్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, లిటరరీ ఎడిటర్ రాజీనామాలు చేశారంటూ వార్తలు పొక్కుతున్నాయి. మరోవైపు.. గోవా పోలీసుల పనితీరుపై తరుణ్ తేజ్పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లైగింక వేధింపులు ఎదుర్కొన్న మహిళ జర్నలిస్ట్ నుంచి గోవా పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
మహిళ జర్నలిస్ట్ నుంచి స్టేట్మెంట్ రికార్డు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు నుంచి గోవా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు , కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఉద్యోగుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా అసోసియేట్ ఎడిటర్ రాణా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెహల్కా యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని నియమించింది. అయితే పోలీసుల తీరుపై తేజ్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే సిసి ఫుటేజ్ను పోలీసులు చూడటం లేదని ఆయన ఆరోపించారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు తేజ్పాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
సహచర ఉద్యోగిపై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని నమోదైన కేసు హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డి నీరో మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో రాబర్డ్ డి నీరోకు ఎలాంటి ప్రమేయం లేకున్నా మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ ను గోవా డీఐజీ ఓపి మిశ్రా ప్రశ్నించే అవకాశం ఉంది. తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తున్నామని మిశ్రా మీడియాకు తెలిపారు. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరీ ఫిర్యాదు మేరకే రాబర్డ్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాబర్డ్ డీ నిరోతో సమావేశమవ్వాలనే కారణంతో సహచర ఉద్యోగిని పిలిచి... లిఫ్ట్ లో లైంగికంగా వేధించినట్టు షోమా ఫిర్యాదు తెలిపింది. గోవాలో నవంబర్ 8, 9 తేదిల్లో తెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్డ్ డి నీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు. -
ఢిల్లీ హైకోర్టుకు తరుణ్ తేజ్పాల్
ముందస్తు బెయిల్కు పిటిషన్ తెహల్కాకు రాజీనామా చేసిన బాధితురాలు బాధితురాలితో మాట్లాడిన గోవా పోలీసులు న్యూఢిల్లీ/పణజి: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఈ ఉదంతం పై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి కోర్టును ఆశ్రయించే వరకు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను జస్టిస్ జీఎస్ సిస్టానీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్లో మహిళా జర్నలిస్టును తేజ్పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. ఆమెతో మాట్లాడాం: గోవా డీఐజీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోవా పోలీసులు బాధిత జర్నలిస్టుతో మాట్లాడారని గోవా పోలీస్ డీఐజీ ఓపీ మిశ్రా పణజిలో సోమవారం వెల్లడించారు. కేసును విచారిస్తున్న అధికారి ఒకరు ఆమెతో మాట్లాడారన్నారు. అయితే, ఏం మాట్లాడారనే వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. బాధితురాలు రాజీనామా.. బాసటగా మరికొందరు లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరితో నిరాశ చెందిన సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటన తన హృదయాన్ని ఛిద్రం చేసిందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. -
మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్ పాల్ సోమవారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. -
ఢిల్లీ కోర్టులో తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లో తెహల్కా గ్రూప్ నిర్వహించిన థింక్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తేజ్ పాల్ పై సహ ఉద్యోగి కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనపై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం తేజ్ పాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. -
హాలీవుడ్ నటుడిని కలుద్దామంటూ కీచకం!
తేజ్పాల్పై మహిళా జర్నలిస్టు ఆరోపణ న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగికదాడికి పాల్పడినట్లు తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై గోవా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో పేరు ప్రస్తావనకు వచ్చింది. డినీరోను కలుద్దామని ప్రలోభపెట్టి తేజ్పాల్ బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసినట్లు అందులో ఉంది. తెహెల్కాలోనే పనిచేస్తున్న బాధితురాలు ఆ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరికి చేసిన ఫిర్యాదులో ఈమేరకు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7, 8న గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్లో తేజ్పాల్ లిప్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. ఈ నెల 8, 9న ఆ హోటల్లో జరిగిన ‘తెహెల్కా థింక్ఫెస్ట్’లో డినీరో ప్రధాన వక్త. బాధితురాలు చౌదరికి చేసిన ఫిర్యాదులోని వివరాలు ఆమె మాటల్లోనే..‘‘తేజ్పాల్ లిఫ్టు ఎక్కడా ఆగకుండా బటన్లు నొక్కారు. కాసేపయ్యాక డినీరో ఉన్న రెండో అంతస్తులో లిఫ్టు డోర్ తెరుచుకుంది. ‘విశ్వం మనకో సంగతి చెబుతోంది’ అని తేజ్పాల్ చెప్పారు. నేను మెట్లగుండా వెళ్తానని లిఫ్టులోంచి బయటకు రాబోయాను. దీంతో ఆయన నన్ను లిఫ్టులోకి లాగారు. నాపై భౌతికదాడి చేశారు.’’ ప్రశ్నించకుండానే... ఈ కేసు దర్యాప్తు కోసం ఆదివారం ఢిల్లీ వచ్చిన గోవా పోలీసులు తేజ్పాల్ను ప్రశ్నించకుండానే వెళ్లిపోయారు. వారు తేజ్పాల్ను ప్రశ్నించడానికి కానీ, అరెస్టు చేయడానికి కానీ రాలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. వారు బాధితురాలిని కలుసుకుని అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరారని, ఫిర్యాదు చేశాక తేజ్పాల్ను అరెస్టు చేసే అవకాశముం దని అన్నాయి. గోవా పోలీసులు.. మహిళా జర్నలిస్టు, చౌదరి, తేజ్పాల్ల ఈ-మెయిళ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చే సుకున్నారు. బాధితురాలి సహోద్యోగులైన ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఆమెకు రక్షణ కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ ముంబై పోలీసులను కోరింది. తనపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టు అబద్ధాలాడుతోందని తేజ్పాల్ ఆరోపించినట్లు సమాచారం. -
కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్పాల్
తనపై విచారణ జరుగుతున్న కేసు విచారణ అంశంపై తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఈ కేసు విచారణను ఏదైనా స్వతంత్ర వ్యవస్థకు బదిలీ చేయాలని ఆయన కోరనున్నారు. గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు గోవా పోలీసులు ఎవరూ తమను ఇంతవరకు సంప్రదించనే లేదని, ఇలాగైతే నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని ఎలా నమ్మగలమని తేజ్పాల్ తరఫు న్యాయవాది తెలిపారు. అందుకే తాము కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. -
తేజ్పాల్ను కాపాడేందుకు ఒత్తిళ్లు
బాధితురాలి తల్లిని కలుసుకున్న తేజ్పాల్ కుటుంబ సభ్యుడు ఆయనను ఈ కేసు నుంచి కాపాడాలంటూ ఒత్తిడి... ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్ను విచారించిన గోవా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోవాలి: లోక్సభ స్పీకర్ పణజి/న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై గోవా హోటల్లో లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘తెహెల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను త్వరలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, తేజ్పాల్ను కాపాడేందుకు తనపైన, తన కుటుంబంపైన ఒత్తిళ్లు వస్తున్నాయని బాధితురాలైన మహిళా జర్నలిస్టు శనివారం ఆరోపించారు. తేజ్పాల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు శుక్రవారం రాత్రి తన తల్లి ఇంటికి వచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయ సలహాల కోసం ఎవరిని సంప్రదిస్తున్నారని అడిగారని, ఈ కేసు నుంచి తేజ్పాల్ను కాపాడాల్సిందిగా తన తల్లిని కోరారని ఆరోపించారు. మరోవైపు, గోవా నుంచి డీఎస్పీ సామీ టవారెస్ నేతృత్వంలో శనివారం ఢిల్లీ చేరుకున్న క్రైమ్బ్రాంచి బృందం ఈ సంఘటనలో తేజ్పాల్ను వెనకేసుకు వచ్చిన ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు ఆ పత్రికకు చెందిన మరో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను విచారించారు. బాధితురాలిని కలుసుకుని, ఆమె వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అలాగే ఈ సంఘటనకు సంబంధించి తేజ్పాల్ ఈ-మెయిల్స్ సేకరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని గోవా పోలీసు అధికారులు చెప్పారు. త్వరలోనే తేజ్పాల్ అరెస్టు తప్పకపోవచ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తానని, దర్యాప్తునకు సహకరిస్తానని ‘తెహెల్కా’ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి మీడియాకు చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. కాగా, పణజిలో గోవా డీఐజీ ఓపీ మిశ్రా మాట్లాడుతూ, హోటల్లోని ఎలివేటర్లు ఉన్న ప్రాం తంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవని తెలిపారు. అయితే, హోటల్ నుంచి సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను సేకరించామని, తగిన సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో లేనందున వెంటనే వాటిని విశ్లేషించలేకపోయామని చెప్పారు. పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితురాలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇది మంచి పరిణామమని డీఐజీ మిశ్రా అన్నారు. ఇదిలా ఉండగా, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ కోల్కతాలో ఈ సంఘటనపై మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల్లో చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నారు. -
తేజ్పాల్ను క్షమించవద్దంటున్న మహిళలు
-
తెహల్కా తేజ్పాల్ అరెస్ట్కు రంగం సిద్ధం
-
తేజ్ పాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
పణజి/న్యూఢిల్లీ: సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గోవా పోలీసులు తేజ్పాల్పై సుమోటోగా అత్యాచార కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 376 (2) (అధికార హోదాను అడ్డంపెట్టుకొని ఓ మహిళను అధీనంలోకి తెచ్చుకొని అత్యాచారం చేయడం), 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం) కింద తేజ్పాల్పై కేసు నమోదు చేసిన గోవా క్రైం బ్రాంచి పోలీసులు ఆయన్ను ప్రశ్నించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఢిల్లీ పంపనున్నారు. ఆపై ఆయన్ను అరెస్టు చేసే అంశాన్ని కూడా తోసిపుచ్చడంలేదు. ఇటువంటి హైప్రొఫైల్ నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు కోరినా తెహెల్కా యాజమాన్యం ఇంకా స్పందించలేదని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా గోవా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని తేజ్పాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు చెబుతున్న గోవాలోని హోటల్లో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించి వాటిని విడుదల చేయాలన్నారు. పోలీసులను ఆశ్రయించం: షోమా లైంగిక దాడి ఉదంతాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఇప్పటికే విమర్శలపాలైన తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురి శుక్రవారం కూడా అదే ధోరణిలో స్పందించారు. ఈ వ్యవహారంలో తమకు తాముగా పోలీసులను ఆశ్రయించబోమని...దీనిపై బాధితురాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మీడియాకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ తాను నిలదీయడం వల్లే తేజ్పాల్ బాధితురాలికి క్షమాపణ చెప్పడంతోపాటు ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నారని గుర్తుచేశారు. ఈ ఘటనపై అంతర్గత విచారణకు తేజ్పాల్కు స్నేహితురాలైన ప్రముఖ ప్రచురణకర్త ఊర్వశి బుటాలియా నేతృత్వంలో కమిటీ వేయడంపై ప్రశ్నించగా మీడియా ముందుగానే తీర్పు ఇచ్చేస్తోందని మండిపడ్డారు. -
ద్వంద్వ ప్రమాణాలు
చెప్పే మాటలకూ, చేసే చేష్టలకూ పొంతన లేనప్పుడు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నవారినైనా సమాజం సహించదు. తీర్పరి స్థానంలో ఉన్నవారు తుంటరులని తేలితే ఊరుకోదు. కనుకనే తెహెల్కా పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ ప్రజలముందు దోషిగా నిలబడవలసివచ్చింది. ఒకప్పుడు రాజకీయ నాయకుల అవినీతిని, వారిలో కొందరి హంతకస్వభావాన్ని ‘స్టింగ్ ఆపరేషన్’లద్వారా బయటపెట్టి పెనుసంచలనం కలిగించిన పాత్రికేయుడు తరుణ్ తేజ్పాల్. ప్రగతిశీల భావాలున్న వ్యక్తిగా పేరున్నవాడు. కానీ, నైతిక విలువలకు సంబంధించి తనకు వేరే ప్రమాణాలున్నాయని తన ప్రవర్తనతో ఆయన నిరూపించాడు. పక్షం రోజుల క్రితం తెహెల్కా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన ‘థింక్ఫెస్ట్’ సమయంలో తనపై ఆయన లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఈ విషయమై ఆ యువతి పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదుచేశాక తన ప్రవర్తన ‘దురదృష్టకరమైనద’ని, అందుకు ప్రాయశ్చిత్తంగా ఆరునెలలపాటు పత్రికలో తనకున్న పదవినుంచి తప్పుకుంటున్నానని తరుణ్ ప్రకటించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. బహుశా ఆమె ధైర్యంగా ముందుకు రానట్టయితే ఆ ‘పశ్చాత్తాప’ ప్రకటనతో, ఆ బేషరతు క్షమాపణతో అంతా ముగిసి పోయేదేమో! ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నిత్యం కొనసాగే వేధింపుల జాబితాలో చేరిపోయేదేమో! కానీ, ఆమె అందరిలాంటి యువతి కాదు...జరిగిన ఘటనను కేవలం ‘పరిస్థితులను సరిగా బేరీజు వేసుకోలేని స్థితి’లో ఉన్న వ్యక్తి వల్ల సంభవించిన దురదృష్టకర ఘటనగా ఆమె భావించలేదు. సదస్సు సందర్భంగా బసచేసిన హోటల్లో తనను లిఫ్ట్లోకి నెట్టడమేకాక... ప్రతిఘటించినందుకు లిఫ్టును మధ్యలోనే కాసేపు నిలిచిపోయేలా చేశారని, మరుసటిరోజునా ఈ తంతు కొనసాగిందని ఆమె చెప్పారు. తరుణ్ తేజ్పాల్ క్షమాపణతో తాను సంతృప్తిచెందానన్న షోమా చౌధురి వాదనను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన వ్యక్తి ఆ పదవిలో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని మహిళా న్యాయవాది ఒకరు తెహెల్కా ఘటనకు కొద్ది రోజులముందే వెల్లడించారు. ఆయనవద్ద తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని అటుతర్వాత మరో మహిళా న్యాయవాది చెప్పారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనదగ్గ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పదవిలో ఉంటూ ఆయన ప్రవర్తించిన తీరుపై చర్చ జరుగుతున్నప్పుడే తేజ్పాల్ వ్యవహారం వెల్లడైంది. వీరిలో ఒకరు న్యాయమూర్తి స్థానంలో ఉండగా, రెండోవారు అలాంటి పనినే మీడియా ద్వారా చేస్తున్న వ్యక్తి. స్త్రీ-పురుష సమానత్వం విషయంలో భారత్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని ఈమధ్యే ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదిక వెల్లడించింది. సమానత్వం విషయంలో అఫ్ఘానిస్థాన్ మినహా మన సమీప దేశాలన్నిటితో పోల్చినా మనం చాలా వెనకబడి ఉన్నామని ఆ నివేదిక హెచ్చరించింది. విద్య, ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఇక్కడ ఎంతగానో వెనకబడి ఉన్నారని నివేదిక చెబుతోంది. జాబితాలో మన స్థానం 132 కాగా... శ్రీలంక నుంచి పాకిస్థాన్ వరకూ ఇంతకన్నా మెరుగైన స్థానాల్లో ఉండి మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్లకు అమ్మ కడుపులో ఉన్నప్పటినుంచి మొదలయ్యే వివక్ష ఎదిగేకొద్దీ రకరకాల రూపాల్లో తారసపడుతోంది. నిత్యం వెల్లడవుతున్న అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలు ఈ వివక్ష వికృతరూపం తీసుకుంటున్న వైనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి అటు న్యాయవ్యవస్థ, ఇటు మీడియా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ పని సాగుతున్నది కూడా. కానీ, అందులో భాగంగా ఉండేవారే ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఏమిటన్న ఆందోళన కలుగుతుంది. నిరుడు డిసెంబర్లో నిర్భయ ఉదంతం జరిగాక దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనలు, అనంతరం అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టం మహిళల్లో ఎంతగానో చైతన్యాన్ని కలిగించాయి. కనుకనే మొన్న మహిళా న్యాయవాదులైనా, ఇప్పుడు మహిళా జర్నలిస్టు అయినా ధైర్యాన్ని ప్రదర్శించగలిగారు. అయితే, షోమా చౌధురి స్పందనే పేలవంగా ఉంది. ఆమె సుప్రసిద్ధ పాత్రికేయురాలు. స్వయంగా స్త్రీవాద భావాలు కలిగిన వ్యక్తి. కానీ, ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చూపడానికి ఆమె మొదట చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేర పూరిత చర్యల్లో బాధితురాలు క్షమించినంత మాత్రాన జరిగిన నేరం సమసి పోదన్న ప్రాథమిక అంశాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోలేదు. గత వారం రోజులుగా బీజేపీ ఈ తరహా వాదననే వినిపించింది. గుజరాత్లో ఒక యువతిపై చట్టవిరుద్ధంగా పోలీసు బలగాలతో నిఘా పెట్టి, వెన్నాడారని వెల్లడైనప్పుడు ఆమె తండ్రే అలా చేయమన్నాడని చెప్పి చేతులు దులుపుకునేందుకు చూసింది. ఇప్పుడు బీజేపీ వాదనకూ, షోమా చెప్పినదానికీ తేడా ఏముంది? మహిళను గౌరవిస్తున్నామని, ఆరాధిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా వారిని న్యూనత పరచడం, వారి శక్తిసామర్ధ్యాలను తక్కువచేసి చూడటమనే అధమ సంస్కృతి సమాజంలోని అన్ని పొరల్లోనూ అలుముకుంది. కనబడే వివక్షనూ, హింసనూ ఎదుర్కోవడం ఒక ఎత్తయితే, ప్రచ్ఛన్నంగా అల్లుకుపోయిన ఇలాంటి ధోరణులను రూపుమాపడం మరో ఎత్తు. ఇందుకు కృషి చేయాల్సినవారే ఆ ధోరణులకు బానిసలు కావడం, రక్షకులే రాకాసుల్లా మారడం మన దేశంలో నెలకొన్న దురదృష్టకరమైన స్థితి. తెహెల్కా ఘటన తర్వాతనైనా అందరూ మేల్కొనాలి. పనిచేసే స్థలాల్లో మహిళలను మనుషులుగా గుర్తించే సంస్కృతిని, వారు ఆత్మగౌరవంతో మసిలే పరిస్థితులను కల్పించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
పోలీసులకు పూర్తిగా సహకరిస్తా: తేజ్పాల్
తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చెప్పారు. వాస్తవాలను పోలీసులకు తెలియజేస్తానని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి నివేదిక పంపాల్సిందిగా కేంద్ర హోం శాఖ గోవా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని శుక్రవారం ఆదేశించింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. -
తరుణ్ తేజ్పాల్పై బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ : తెహల్కా మేగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్పై లైంగిక దాడి జరిపిన అంశంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం ఆదేశించింది. గోవా పోలీసులకు లేఖ రాసిన మహిళా కమిషన్... వెంటనే తేజ్పాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని కోరింది. కేసును సుమెటోగా స్వీకరించాలని సూచించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ...ఈరోజు ఉదయం బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. కాగా గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అటు గోవా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించి వివరాలు సేకరించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్పాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ప్రాధమిక విచారణలో తేజ్పాల్ లీలలు వెలుగుచూస్తుండటంతో ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. -
తెహెల్కా ఎడిటర్ వికృత చేష్ట!
సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి తరుణ్ తేజ్పాల్పై యాజమాన్యానికి బాధితురాలి ఫిర్యాదు ప్రాథమిక దర్యాప్తునకు గోవా సర్కారు ఆదేశం పణజి/న్యూఢిల్లీ: పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ చిక్కు ల్లో పడ్డారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని ఓ మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపాయి. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్పాల్ బేషరతు క్షమాపణ చెప్పారని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా గురువారం మీడియాకు చెప్పారు. బాధితురాలు కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్పాల్ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రూ. లక్ష ముడుపులు తీసుకోవడాన్ని తేజ్పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై గోవాలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు తేజ్పాల్ను మంగళవారం ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. -
గోవా పోలీసుల అతిథిగా తెహల్కా ఎడిటర్!
లైంగిక ఆరోపణలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన తెహల్కా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు విచారించనున్నారు. తమ పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుకు తాను పంపిన ఈమెయిల్ సందేశం బయటపడటంతో ఆరు నెలల పాటు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తేజ్పాల్ గత రాత్రే ప్రకటించారు. పది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లిఫ్టులోకి తేజ్పాల్ తనను లాగారంటూ ఆ మహిళా జర్నలిస్టు తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై చౌధురి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ సంఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండు చేశారు. కానీ, దాన్ని సరిచేసుకోడానికి తనకు సమయం అవసరమని ఆమె చెప్పారు. ఈ మొత్తం సంఘటనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ సంఘటన జరిగిందని చెబుతున్న ఫైవ్స్టార్ హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని పోలీసులు యాజమాన్యాన్ని అడిగారు. ఈ సంఘటనపై సుమోటోగా విచారణ జరిపే అవకాశం కూడా లేకపోలేదు. బాధితురాలైన మహిళా జర్నలిస్టు నుంచి కూడా వాంగ్మూలం తీసుకునే యోచనలో గోవా పోలీసులు ఉన్నారు. తేజ్పాల్పై ప్రాథమిక విచారణ జరుగుతోందని, ఏదైనా విషయం బయటపడితే మాత్రం సుమోటోగా కేసు నమోదు చేస్తామని పారికర్ చెప్పారు.