welcome
-
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
ఖతార్లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!
భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. #WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR — ANI (@ANI) February 12, 2024 దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన కాప్-28 కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్తో మాట్లాడారు. #WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "We are very happy that we are back in India, safely. Definitely, we would like to thank PM Modi, as this was only possible because of his personal intervention..." pic.twitter.com/iICC1p7YZr — ANI (@ANI) February 12, 2024 ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది. -
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్లో ఒలింపిక్స్ 2024లో పారిస్లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్లో జరిగే ఒలింపిక్స్కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్గౌస్పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది. మహ్మద్గౌస్పల్లిలో గజమాలతో స్వాగతం గట్టమ్మకు చీర సారె.. గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు. మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు. సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్స్తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్పై గ్లోబల్గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్బైజాన్లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. -
ప్రపంచమంతా ఆ కుతూహలంతో ఉంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఇది బుద్ధుడు, గాంధీ లాంటి మహానుభావులు నడయాడిన నేల. శత్రువుల్ని సైతం చేరదీసే తత్వం మనది. అందుకే ‘భారత్ అసలు ఏమనుకుంటుందో?’ అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది అని అన్నారు ప్రధాన మంత్రి నరేద్ర మోదీ. గురువారం ఉదయం ఢిల్లీ పాలం(ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. మూడు రోజల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేటి(గురువారం) ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పాలం విమానాశ్రయం(దేశీయ) వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో మోదీని సత్కరించాయి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించారు. ప్రధాని మోదీ ఏమన్నారంటే.. తమిళం మన భాష. ప్రతీ భారతీయుడి భాష. ప్రపంచంలోనే పురాతనమైంది తమిళం. అలాంటిది పాపువా న్యూ గినియాలో టోక్ పిసిన్ తర్జుమా పుస్తకం ‘తిరుక్కురల్’ను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. నేను నా దేశ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, నేను ప్రపంచం కళ్ళలోకి చూస్తాను. మీరు దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున ఈ విశ్వాసం వచ్చింది. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు మోదీ మీద అభిమానంతో రావట్లేదు.. భారత్ మీద ప్రేమతో వస్తున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లను ఎందుకు పంచాలో చెప్పాలంటూ కొందరు నిలదీస్తున్నారు. ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల. శత్రువులను సైతం చేరదీసే తత్వం మనది. భారత్ అసలు ఏమనుకుంటుందో? అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది. #WATCH | Tamil language is our language. It is the language of every Indian. It is the oldest language in the world. I had the opportunity to release the Tok Pisin translation of the book 'Thirukkural' in Papua New Guinea: PM Modi pic.twitter.com/GqyyHWBZEs — ANI (@ANI) May 25, 2023 మనదేశ సంస్కృతి, సంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు, బానిస మనస్తత్వంలో ఎప్పుడూ మునిగిపోవద్దు. ధైర్యంగా మాట్లాడాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచం ఆ గొప్ప విషయాలను వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మా పుణ్యక్షేత్రాలపై దాడి ఆమోదయోగ్యం కాదని నేను చెప్పిన సమయంలో.. ప్రపంచం నాతో ఏకీభవిస్తూ వస్తోంది. సిడ్నీలో జరిగిన భారతీయ ప్రవాసుల కార్యక్రమానికి.. ఆస్ట్రేలియా ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, అధికార పక్షం కూడా హాజరైంది. ఇదే ప్రజాస్వామ్య బలం. వాళ్లంతా మన కమ్యూనిటీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదీ మనకు దక్కిన గౌరవం. జేపీ నడ్డా ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని మీ పాదాలను తాకిన తీరు.. మీకు అక్కడ ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. మన ప్రధానికి ఇలా స్వాగతం దక్కడంపై ఇక్కడి ప్రజలు గర్వపడుతున్నారు. మీ పాలనా నమూనాను ప్రపంచం మెచ్చుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీ ఆటోగ్రాఫ్ అడిగారు. మీ నాయకత్వంలో భారత్ను ప్రపంచం ఎలా చూస్తుందో ఇక్కడే తెలిసిపోతోంది. "The way the PM of Papua New Guinea touched your feet, it shows how much respect you have there. People of India feel proud when they see that our PM is being welcomed like this," says BJP national president JP Nadda as he welcomes PM Modi at Palam airport pic.twitter.com/6eVFWKRzee — ANI (@ANI) May 25, 2023 జైశంకర్ ఏమన్నారంటే.. పాపువా న్యూ గినియా ప్రధాని, మన ప్రధాని మోదీని ‘విశ్వ గురువు’గా భావిస్తున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే ఏకంగా మన ప్రధానిని ‘ది బాస్’ అని సంబోధించారు. ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈరోజు ప్రపంచం కొత్త భారతదేశాన్ని చూస్తోంది. -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని
ఫసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్ను పక్కనపెట్టారు. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్టర్ వేదికగా..నేను పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాప్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్ ఆఫ్ హానర్ తోసహా ప్రధాని జేమ్స్ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో భేటీ కానున్నారు మోదీ. అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
రామ్ చరణ్కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
నాడు బహిష్కరణ.. నేడు కాళ్లు కడిగి.. పూలు చల్లి.. బ్రహ్మరథం
కావలి(నెల్లూరు జిల్లా): అది 2019 ఎన్నికల ప్రచార సమయం. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు మండలం ఆదినారాయణపురం గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు. అయితే గ్రామస్తులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్కుమార్రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని భీష్మించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలయ్యాయి.. ప్రతాప్కుమార్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలు గ్రామస్తులకు అందుతున్నాయి. ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్రెడ్డి సొంత మండలంలోని ఆదినారాయణపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన సేవలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చూపించారు. మత్స్యకార గ్రామమైన ఆదినారాయణపురం గ్రామస్తులంతా ఒక కట్టుబాటుతో ఉంటారు. దశాబ్దాలుగా తరతరాలుగా ఎన్నికల సమయంలో తమకు మేలు చేకూర్చిన వారికే మద్దతుగా ఉండడం వారి కుల కట్టుబాటు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఊరిలోకి రాన్వికపోయినా.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అందించడం, తమకు అండగా నిలబడడంతో గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు. ఎమ్మెల్యే ఇవన్నీ వద్దని వారించినా గ్రామస్తులు తాము చేయాలనుకున్న సత్కారం చేసి తీరుతామని మొండికేసి.. పూలు చల్లి పసుపు నీళ్లతో కాళ్లు కడిగి, హారతులు ఇచ్చారు. ఆదివారం ఆ గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డికి గ్రామంలో పురుషులు ఈలలు, కేరింతలతో స్వాగతం చెప్పి అక్కున చేర్చుకున్నారు. మహిళలు అయితే పసుపు నీళ్లతో ఎమ్మెల్యే కాళ్లు కడిగి, పూలు చల్లి హారతులు ఇచ్చారు. నాడు బహిష్కరించిన గ్రామస్తులే.. నేడు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్ను కూడా స్టేషన్కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
వెల్కం బ్యాక్ ఇండియన్ ట్రావెలర్స్.. ఆకట్టుకుంటున్న ఎస్ఎఫ్వో వీడియో
కరోనా దుర్దినాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయాయి. ఎప్పుడైనా పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు ప్రారంభమైనా కొత్తగా కోవిడ్ వేవ్ వచ్చి పడటంతో పూర్తి స్థాయిలో ప్రయాణాలు సాధ్యం కాలేదు. అయితే రెండేళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ఎస్ఎఫ్వో) ఇండియన్ ట్రావెలర్స్కి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. భారతీయ అమెరికన్ సంస్కృతులను ప్రతిబింబించేలా ఎస్ఎఫ్వో ప్రత్యేకంగా వీడియో రూపొందించింది. ఇందులో నటులందరూ భారతీయ మువ్వెల జెండాతో స్వాగతం పలుకుతూ కనిపించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచప్కి బదులు సమోసా పూదీన చట్నీ, బేస్ బాల్ బదులు క్రికెట్, పీట్స్ కాఫీ బదులు ఛాయ్ ఇలా అన్నింటా భారతీయులకు అనుగుణంగా మార్పులు చేశామంటూ హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ వీడియోను రూపొందించింది ఎస్ఎఫ్వో. After 2 years, India has resumed regular international flights. As a major gateway for travelers to and from India, SFO can't wait to welcome back Indian travelers!#WelcomeBack#flySFO ✈️#travel#sanfranciscotravel 🌉#sfowagbrigade pic.twitter.com/hq2nHPZjBM — San Francisco International Airport (SFO) ✈️😷 (@flySFO) April 6, 2022 -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: AP: మిడిల్క్లాస్కి జాక్'ప్లాట్' -
అడుగులేద్దాం... ఆశే ఊపిరిగా
తుది మొదలు లేని నిరంతర ప్రవాహమైన కాలం అగణితం. కానీ, మానవ జిజ్ఞాస, ప్రయత్నం దేన్నీ ఊరకే వదలదు! అందుకే, ఊహా విభజన రేఖలు గీసి... సెకండ్లని, నిమిషాలని, రోజులని, వారాలని, నెలలని, సంవత్సరాలని కాలానికి కొలతలు వేస్తాడు. యుగాల పరిణామాలకు మౌన సాక్షీభూతమైన కాలాన్ని తానేదో ఒడిసిపట్టినట్టు మనిషి భ్రమిస్తాడు. ఓ యేడు సుఖం, సంతోషం ఎక్కువైతే ఆనందిస్తాడు, కష్టం, బాధ అధికమైతే దుఃఖించి, శపిస్తాడు. కాలపు తునకలన్నీ మనిషి గీసుకున్న ఊహా రేఖలని గ్రహించడు. అదే విభజన గడుల సంధి కాలంలో నిలుచున్న మనం పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతమంటున్నాం. సరే, అందులో తప్పేమీ లేదు. మంచి చెడుల గతాన్ని వదిలి, ఆశాజనక భవిష్యత్తులోకి అడుగిడే ప్రతి మలుపులో మనకో బుల్లి సమీక్ష, సత్సంకల్పం ఉండాలి. అలా ఉంటేనే ఒకింత జాగ్రత్తగా, కాస్త పద్ధతిగా, కొంచెం వ్యూహాత్మకంగా.... వీటన్నింటికీ మించి ఆనందంగా–ఆహ్లాదంగా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. గడచిన ఏడాదిలో ఏమేమి అనుకొని ఏమేర సాధించాం? ఇంకేమి మిగిలాయి? అని ఆత్మావలోకనంతో సమీక్షించుకుంటే నష్టమేమీ లేదు. ఆశల అల్లికతో భవిష్యత్ ప్రణాళికా రచన నేరమేమి కాదు. అది ప్రతి 365 రోజులకొకమారు అయితే తప్పేంటి అన్నది హేతుబద్ధ యోచనే! 2021కి వీడ్కోలు చెబుతూ 2022 లోకి అడుగిడుతున్న శుభవేళ ఇది! కొత్త సంకల్పాలు తీసుకొని, వాటి సాధనకోసం పురోగమించాలి. దేశం యావత్తు ఓ ఆశావహ భావనతో భవితను చూస్తోంది. ప్రతి జనవరి ఒకటికీ చేసేది ఇదే అయినా.... మంచి–చెడుల గడుల పరిధి ఒక్కోమారు భిన్నంగా ఉండొచ్చు. ఏదీ తెలిసి జరుగదు. అన్నీ అధిగమించి ముందుకు సాగడం మానవనైజం. మానవేతి హాసంలోనే పెద్ద మహమ్మారిగా చెబుతున్న కరోనా సృష్టించిన విలయానికి గడచిన రెండు సంవత్సరాలు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ఎన్నెన్ని కుటుంబాల్లో అది తీరని విషాదం నింపిందో, మరెన్ని మానవ హృదయాలను భయంతో కల్లోలపరిచిందో లెక్కే లేదు. మూడో సంవత్సరం ముంగిట్లోకి వచ్చిన మనకు... కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అనిపించే సమాచారం అందుతోంది. వైరస్ కొత్త వైవిధ్యమైన ‘ఒమిక్రాన్’ వేగం వల్ల, గతవారం (22–29 డిసెంబరు) సగటున రోజూ 9 లక్షల కొత్త కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరోవైపు చిగురుటాశ ఏమంటే, పలు పరివర్తనాల వల్ల కొత్త వైవిధ్యమై వచ్చిన ఒమిక్రాన్ అంతగా ప్రమాదకారి కాదూ అని! భయంకర ‘మహమ్మారి’ కాస్తా ఆయా కాలాల్లో తరచూ వచ్చే సాంక్రమిక అంటు వ్యాధిలా పలుచబారిందని శాస్త్ర, వైద్యవర్గం చెప్పడం ఉన్నంతలో ఊరటనిచ్చే పరిణామం. ప్రపంచంలో ఒక బలీయ ఆర్థిక, మార్కెట్ శక్తిగా ఎదుగుతున్న భారత్ వివిధ విభాగాల్లో సాధిస్తున్న ప్రగతి, తాజా లక్ష్యాలు కొంత ఆశావహ వాతావరణం కల్పిస్తున్నాయి. పలు రంగాల్లో విజయాల సరళి కొత్త ఆశలు రేపుతోంది. విపత్తులూ కొన్ని అవకాశాలు కల్పిస్తాయనడానికి కోవిడ్–19 నిదర్శనం. టీకాల తయారీ నుంచి వైద్యారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం వరకు స్వావలంబనకు అరుదైన అవకాశం లభించింది. ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. స్వాతంత్రానంతరం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన వైద్యం, విద్య వంటి కీలకాంశాలను తగిన బడ్జెట్ కేటాయింపులతో, ప్రణాళికాబద్ధంగా తీసుకువెళితే మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. వైద్యం విషయంలో సర్కార్లు ఇపుడైనా, కరోనా దెబ్బతో ‘కాలికి తట్టుతగిలింది ఇక బట్టకట్టడం ఖాయం’ అనుకోవాలి. కేరళ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యం, కొత్తగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రామసచివాలయ స్థాయి వరకు వైద్యారోగ్య వ్యవస్థ విస్తరిస్తూ భరోసా కల్పిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. విద్యకు సంబంధించి ఎన్నో లోపాలు, వైఫల్యాల్ని నేడు క్షీణించిన క్షేత్ర పరిస్థితులు అడుగడుగునా ఎత్తి చూపిస్తున్నాయి. ప్రాథమిక, సెంకడరీ విద్య నుంచి ఉన్నత, సాంకేతిక విద్య వరకు... తాజా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరచిన అంశాలతో కొత్త ఆశలు పల్లవి స్తున్నాయి. ప్రభుత్వ రంగంలో అలవిమాలిన అలక్ష్యంతో, ప్రయివేటు రంగంలో ఫక్తు వ్యాపారమై కునారిల్లిన భారత విద్యారంగం పూర్వపు వైభవోజ్వల దశను పుణికి పుచ్చుకుంటుందని ఆశిద్దాం. ఏపీలో ‘నాడు–నేడు’తో సర్కారు బడుల స్వరూప స్వభావాల్నే మారుస్తున్న తీరొక వేగుచుక్క! క్రీడా రంగంలో... ఇటీవలి టోక్యో ఒలింపిక్స్లో భారత్ సాధించిన ఏడు అథ్లెటిక్స్ పతకాలొక కొత్త ఆశారేఖ! క్రికెటొకటే క్రీడ కాదు, భారత్ కీర్తికిరీటాన్ని ధగధగలాడించే మట్టిలో మాణిక్యాలు ఆట ఆటలో ఉన్నాయని తేల్చి చెప్పే భవిష్యత్తు వైపు భారత యువతరం పరుగులు తీయాలి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మనది. తగిన శిక్షణ, ఉద్యోగ, ఉపాధి, మేధోపరిణతి అవకాశాలు కల్పిస్తూ యువశక్తిని ఓ బలీయమైన మానవ వనరుగా తీర్చిదిద్దాలి. ప్రపంచం దృష్టి మనవైపు మళ్లేలా తగిన వ్యూహాలు, విధానాలు, కార్యాచరణ ఉంటే మనకిక తిరుగుండదు. ప్రపంచమంతా ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిణామాలతో పురోగమిస్తున్న ఈ తరుణంలో విలువలు, నైతికత ప్రశ్నార్థకమౌతున్నాయి. గొప్ప సనాతన, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం ఉన్న దేశంగా ఆధునిక శాస్త్ర–సాంకేతిక పురోగతిని మేళ విస్తూ ముందుకు వెళితే భారత్ ఒక ప్రపంచ చోదక శక్తిగా నిలిచే అవకాశాలు పుష్కలం. ఈ క్రమంలో 2022 ఓ గొప్ప మేలుమలుపు కావాలని మనమంతా ఆశిద్దాం. ఆశే మనిషికి దిక్సూచి! -
ఎయిర్పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్ వీడియో..
ఇస్లామాబాద్: సాధారణంగా ఎవరైన మనవారు విదేశాల నుంచి వస్తే.. ఎయిర్పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. కొందరు పూల బోకేలు ఇచ్చి స్వాగతం పలికితే.. మరికొందరు సర్ప్రైజ్ గిఫ్ట్లు, ఫ్లెక్సీలు, బ్యాండ్లను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొందరైతే తమ వారిని చూడగానే.. ఎమోషనల్గా ఫీలై వారిని ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన.. ఒక తల్లి ఎయిర్పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన పాక్లోని ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. కాగా, అన్వర్ జలాని అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో తన తల్లికోసం బోకే పట్లుకోని, మిస్యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతని తల్లి బయటకు వచ్చింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత.. ఎమోషనల్తో అతడిని హత్తుకుంది. దీన్ని అన్వర్ జిలానీ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ వావ్.. ఎంతలా మిస్ అయ్యిందో..’,‘ భలే.. కొట్టింది.. ఆ తల్లి..’, ‘నవ్వు ఆపుకోలేక పోతున్నాం..’, ‘నిన్ను ఇలా ఆశీర్వదించింది..’, ‘నీకు వెరైటీగా థైంక్స్ చెప్పిందంటూ..’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anwar Jibawi (@anwar) -
మోదీకి ఘనస్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా
-
PV Sindhu: ఢిల్లీ ఎయిర్పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
-
మోదీకా దమ్.. నమస్తే ట్రంప్!
-
250 కేజీల యాపిల్ దండతో..
సాక్షి, బెంగళూరు: తిహార్ జైలు నుంచి విడుదలై సొంత గడ్డకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డీకే శివకుమార్కు ఘనస్వాగతం లభించింది. శనివారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కార్యకర్తలు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 250 కేజీల యాపిల్ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి హల్చల్ చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్ ప్రసంగించారు. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సెప్టెంబర్ 3న ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అదేరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. 57 ఏళ్ల శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుపొందారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బెంగళూరు రూరల్, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు. కర్ణాటక స్పెషల్ యాపిల్ దండ యాపిల్స్ స్వాగతం పలకడం కర్ణాటకలో ట్రెండ్గా మారింది. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు పలువురు అగ్రనేతలు భారీ యాపిల్ దండలతో స్వాగతాలు అందుకున్నారు. బాదం పప్పు దండలతో కూడా రాజకీయ నాయకులను స్వాగతించడం కన్నడిగులు మొదలుపెట్టారు. ఇదంతా చూసినవారు ఇదేం పిచ్చి అంటూ కామెంట్లు చేస్తుంటారు. -
బెయిల్పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
ట్రంప్కు చైనా ఘన స్వాగతం
బీజింగ్: ఆసియా పర్యటనలో భాగంగా చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘన స్వాగతం లభించింది. బుధవారం బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు చైనా అధికార పార్టీ నాయకులు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలకగా, చైనా ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. ఆ తరువాత చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ట్రంప్ దంపతులకు చారిత్రక ‘ఫర్బిడెన్ సిటీ’ ప్యాలెస్లో ఆతిథ్యమిచ్చారు. అక్కడికి చేరుకున్న ట్రంప్ దంపతులకు జిన్పింగ్ దంపతులు స్వాగతం పలికారు. ట్రంప్ దంపతుల గౌరవార్థం చైనా సాంస్కృతిక కార్యక్రమం పెకింగ్ ఒపేరా నిర్వహించారు. చైనా గణతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి ఏ విదేశీ అధ్యక్షుడికి కూడా ఈ చారిత్రక ప్యాలెస్లో ఇలాంటి గౌరవం దక్కలేదని సీఎన్ఎన్ పేర్కొంది. గురువారం ట్రంప్ జిన్పింగ్తో అధికారికంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా వారు ఉ.కొరియా అణు ముప్పు, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపే అవకాశముంది. చైనా అధికారిక భాష మాండరిన్లో ప్రావీణ్యం సంపాదించిన ఇవాంకా, కుష్నర్ల ఆరేళ్ల కూతురు అరబెల్లాకు జిన్పింగ్ ఏ గ్రేడ్ ఇచ్చారు. తన మనవరాలు అరబెల్లా మాండరిన్లో పాట పాడుతున్న ఓ వీడియోను ట్రంప్ జిన్పింగ్కు చూపారు. తమ భాషపై పట్టు సాధించిన అరబెల్లాను చైనా అధ్యక్షుడు ప్రశంసించారు. -
బీఎస్ఎన్ఎల్ ‘వెల్కమ్’ ఆఫర్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేసే వినియోగదారులకు సంస్థ వెల్కమ్ ఆఫర్ కింద 350 ఎంబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ మంగళవారం నుంచి ఆగస్టు 28 వరకు వర్తిస్తుందన్నారు. అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
గవర్నర్కు ఘన స్వాగతం
అనంతపురం న్యూసిటీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అనంతపురం చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, మేయర్ స్వరూప, కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్లు గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్కు మేయర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. కాసేపటికి మంత్రి పరిటాల సునీత గవర్నర్కు పుష్పగుచ్చానందించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నేటి పర్యటనిలా.. గవర్నర్ నరసింహన్ మంగళవారం గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 నుంచి ‘పంట సంజీవని’ ఫారంపాండ్ పనులను పరిశీలిస్తారు. 10 నుంచి 10.30 గంటల వరకు మల్చింగ్ పద్ధతిలో సాగుచేసిన పంటలను పరిశీలిస్తారు. 10.30 నుంచి 11 గంటల వరకు బిందు, తుంపర సేద్యం ద్వారా వినూత్నంగా సాగు చేసిన పండ్ల తోటలను సందర్శిస్తారు. 11 నుంచి 11.45 గంటల వరకు గార్లదిన్నెలో భూగర్భ జలాలను కొలిచే ఫిజో మీటర్లను పరిశీలిస్తారు. 11.45 గంటలకు గార్లదిన్నె నుంచి అనంతపురం బయలుదేరుతారు. 12 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్కు బయలుదేరుతారు. -
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల
కోరుకొండ : అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం – దత్తత దేవాలయమైన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నవరం దేవస్థానం పీఆర్ఓ తులారాము, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, సూపరింటెండెంట్ పీవీ రమణ, ఇన్చార్జ్ టీఎన్ రామ్జీ అన్నారు. ఆదివారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 12 వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త వీవీ రోహిత్, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ సారధ్యంలో జరుగుతుందన్నారు. అన్నవరం దేవస్థానం నిధులతో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుపుతామన్నారు. సుమారు రూ.14 లక్షలతో తీర్థం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి మెట్ల సమీపంలో అన్నవరం దేవస్థానం రూ.30 లక్షల నిధులతో భక్తులకు విశ్రాంతి గదులను నిర్మిస్తామన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నవరం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అర్జన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సారధ్యంలో డీఎస్పీ ఏవీఎల్. ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్సైలు బంధోబస్తు నిర్వహిస్తారన్నారు. కొండ దిగువున, కొండ పైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం 2010లో దత్తత తీసుకుందని, అప్పుడు రూ.మూడు లక్షల ఎఫ్డీఆర్తో దేవస్థానాన్ని దత్తత తీసుకున్నామని, ప్రస్తుతం రూ. 31 లక్షలు స్వామి వారి పేరున ఎఫ్డీఆర్ వేశామన్నారు. -
శరణార్థులకు స్వాగతం!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ మంగళవారం ఓ బ్యానర్ వెలిసింది. బ్యానర్ను గమనించిన వెంటనే నేషనల్ పార్క్ రేంజర్స్ దానిని తొలగించారు. అయితే.. అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. కనిపించిన ఈ బ్యానర్పై నెటీజన్లు పాజిటీవ్గా స్పందించారు. ఈ బ్యానర్ను తామే ఏర్పాటు చేశామని ఆల్ట్ లేడీ లిబర్టీ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. 'దాదాపు అమెరికన్లందరి పూర్వికులు వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వలసదారులు, శరణార్థులే ఈ దేశాన్ని గొప్పగా మార్చారు. అంతేగానీ వలస వ్యతిరేక విధానాలు ఈ దేశాన్ని గొప్పగా చేయవు. ముస్లింలు, శరణార్థులు, వలసదారులు అందరూ దేశంలోకి ఆహ్వానితులే' అని ఆల్ట్ లేడీ లిబర్టీ గ్రూప్ వెల్లడించింది. అలాగే..దేశాల మధ్య గోడలు, మత ప్రాతిపదికన నిషేధం విధించడం లాంటివి మన విలువలకు వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొన్నారు. -
జననేతకు ఘన స్వాగతం
‘పశ్చిమ’ వెళ్లేందుకు విమానంలో వచ్చిన జగన్ మధురపూడికి పోటెత్తిన జనసందోహం మధురపూడి (రాజానగరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధురపూడి విమానాశ్రయంలో ఆదివారం ఘనస్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం ఆయన ఆదివారం మ«ధ్యాహ్నం 2.30 గంటలకు జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. జననేతకు స్వాగతం పలికేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. జగ¯ŒSకు స్వాగతం పలికినవారిలో ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కొల్లి నిర్మలకుమారి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్, కో ఆర్డినేటర్లు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రఘురామ్, కర్రి పాపారాయుడు, గుత్తుల సాయి, మిండగుదిటి మోహన్, గుర్రం గౌతమ్, చెల్లుబోయిన శ్రీను, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్మోహ¯ŒSరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజుబాబు, కాకినాడ నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, పార్టీ నాయకులు అడపా శ్రీహరి, సుంకర చిన్ని, వాసిరెడ్డి జమీలు, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు సాయిబాల పద్మ, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, పొట్టు సత్యనారాయణ, బండి అబ్బులు, కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. అడ్డుకున్న పోలీసులు జగ¯ŒSను చూసేందుకు వచ్చిన జనసందోహానికి పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. టెర్మినల్ భవనం లోపలికి వెళ్లేందుకు తమకు అనుమతివ్వకపోవడంపై, రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్జో¯ŒS డీఎస్పీ ప్రసన్నకుమార్ను కురసాల కన్నబాబు నిలదీశారు. దీంతో ప్రధాన నాయకులకు అనుమతులు ఇచ్చారు. తరువాత కొల్లి నిర్మలాకుమారి తదితరులను అనుమతించకపోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ నిర్మలాకుమారిని అనుమతించలేదు. మెయి¯ŒSగేటు వద్దనే వాహనాలను నిలిపేశారు. దీంతో, అక్కడినుంచే అందరూ నడుచుకుంటూ టెర్మినల్కు చేరుకున్నారు. జగ¯ŒSను చూసేందుకు వచ్చిన అభిమానులు మెయి¯ŒS గేటు వద్దనే ఉండిపోయారు. -
2016కు వీడ్కోలు..2017కు స్వాగతం
హ్యాపీ న్యూ ఇయర్.. హ్యాపీ న్యూ ఇయర్.. అంటూ యువత కేరింతల మధ్య కొత్త సంవత్సర వేడుకలు ఆరంభమయ్యాయి.. శనివారం రాత్రి 12.01 గంటలకు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు..!గత జ్ఞాపకాలను నెమరువేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. ఈ ఏడాది అందరి జీవితాల్లో శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.. -
ప్రభుత్వ కార్యక్రమమా...పార్టీ కరపత్రమా?
* దుర్గి మిర్చి యార్డు ఆహ్వాన పత్రికకు పార్టీ రంగు * ప్రొటోకాల్నూ పక్కన పెట్టిన టీడీపీ నాయకులు * వెల్లువెత్తుతున్న విమర్శలు మాచర్ల : ప్రొటోకాల్ను తుంగలో తొక్కడం, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ రంగు పులమడం లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారపార్టీ నాయకుల చర్యలతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మాచర్ల మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన దుర్గి మినీ మిర్చియార్డు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాచర్ల పేరుతో కరపత్రాలను ప్రచురించి ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. వీటిని తమ పార్టీ రంగు అయిన పసుపు రంగులో ముద్రించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి పి. పుల్లారావు ఫొటోలను పెట్టి, 22వ తేదీ గురువారం మధ్యాహ్నం 2గంటలకు జరిగే భూమిపూజకు హాజరు కావాలని యార్డు చైర్మన్ మల్లికార్జున రావు పేరుతో కరపత్రాలు ప్రచురించారు. ఈ కరపత్రంలో ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే పేరును ప్రస్తావించలేదు. గతంలో వేసిన శిలాఫలకంలో కూడా ఎమ్మెల్యే పేరుకు ప్రాధాన్యత ఇవ్వని విషయం తెలిసిందే. యార్డు డబ్బులు ఖర్చు పెట్టి ప్రచురించిన కరపత్రాలకు పార్టీ రంగు పులమడం, పార్టీ కార్యక్రమంలాగా ప్రచారం నిర్వహించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా ఆదాయం పొందే యార్డు అధికారులు సైతం అదేదో తెలుగుదేశం పార్టీ ఫండ్లాగా భావించి ప్రొటోకాల్ ఉల్లంఘించి కరపత్రాలు ప్రచురించడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ప్రొటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ నగదు దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరును వివిధ శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. -
జననేతకు ఘన స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: ఏజెన్సీలో రెండు రోజుల పర్యటన కోసం బుధవారం జిల్లాకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పార్టీ ముఖ్యనేతలతోపాటు, శ్రేణులు, అభిమానులు అడుగడుగునా ఎదురేగి సాదరంగా తమ ప్రాంతాలలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉరకలు వేశాయి. జిల్లాలోని ముఖ్యనేతలు జగన్ వెంట ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్ర బోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరరావు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాస్, జిన్నూరి వెంకటేశ్వరరావు, సిరిపురం శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, జక్కంపూడి కిరణ్, దాసరి శేషగిరి, రాష్ట్ర కార్యదర్శులు మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, చెల్లిబోయిన శ్రీనివాస్, మిండగుదుటి మోహన్, రావు చిన్నారావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, లింగం రవి, ఎస్వీవీ సత్యనారాయణ చౌదరి, అడ్డగర్ల సాయిరామ్, సుంకర చిన్ని, జిన్నూరి బాబి, దంగేటి వీరబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, పోలు కిరణ్కుమార్రెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, అడపా శ్రీహరి, వాసిరెడ్డి జమీలు, దాసరి శేషగిరి, మురళీకృష్ణంరాజు, రాజమహేంద్రవరం ఫ్లోర్ లీడర్ మేడపాటి అనిల్ షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, విప్ మింది నాగేంద్ర, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణి, నేతలు జక్కంపూడి గణేష్ తదితరులు జగన్ వెంట ఉన్నారు. నేడు జగన్ పర్యటన సాగేదిలా ఏజెన్సీలో రెండో రోజు పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం రాత్రి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మారేడుమిల్లి నుంచి బయలు దేరి చింతూరు మీదుగా కూనవరం చేరుకుంటారు. రేఖపల్లిలో పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖి, అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అన్నవరంలో కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. -
వైఎస్ జగన్కు ఘన స్వాగతం
-
వైఎస్ జగన్కు ఘన స్వాగతం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్.. బుధవారం ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ జగన్కు ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. గురువారం కూనవరం మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని వైఎస్ జగన్ సందర్శిస్తారు. అక్కడ కూడా ఆయన పోలవరం బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి గిరిజనుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసు కుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. అలాగే.. ఈ నెల 9న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
జగన్కు ఘన స్వాగతం
గుంటూరు రూరల్ : విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి నగర వైఎస్సార్ సీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు ఏలికా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ అంటే నేడు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా నేటికీ కనీసం మూడు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదన్నారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని.. ఎంతమందికి జాబులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 500 బైక్లతో ఇన్నర్ రింగ్రోడ్డులో భారీ ర్యాలీతో జగన్కు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో నేతలు డి. కిశోర్, ఇంటూరి బాబ్జి, మొగిలి ప్రసాద్, విఠల్, వినోద్, రవి, వెంకట్, గురుమూర్తి, దుర్గ, మోహన్, శ్రీను, మహేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్కు ఆత్మీయ స్వాగతం
కదిరి : బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా పొలిమేరల్లో అడుగుపెట్టగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. కొడికొండ చెక్పోస్టు వద్ద వైఎస్సార్సీపీ చిలమత్తూరు మండల కన్వీనర్ సదాశివరెడ్డి ఆయనను కలిసి జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఈసారి ఖరీఫ్లో సాగుచేసిన వేరుశనగ పూర్తిగా ఎండిపోయిందని, కనీసం పెట్టుబడులు కూడా చేతికందలేదని చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ వివరాలన్నీ పక్కాగా పంపాలని చెప్పిన జగన్ అక్కడ సెలవు తీసుకుని గోరంట్ల చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనతో కరచాలం చేయడానికి అమితాసక్తి చూపించారు. వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగిపోయారు. ఓడి చెరువు చేరుకోగానే ముందుగానే అక్కడికి చేరుకున్న జనం ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ గట్టిగా అరిచారు. వారిని ఆప్యాయంగా చూస్తూ అభివాదం చేశారు. తర్వాత కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలికి చేరుకోగానే జనమంతా ఒక్కసారిగా ‘కాబోయే సీఎం వైఎస్ జగన్ జిందాబాద్’ అంటూ నినదిస్తూ ఈలలు, కేకలు వేశారు. అభిమానులతో కరచాలనం చేసిన జగన్ జనం ఎక్కువగా ఉండటంతో వాహనమెక్కి అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అభివాదం చేస్తూ నవ్వుతూ వారి వద్ద సెలవు తీసుకుని బయల్దేరారు. వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని తన వాహనంలో పులివెందుల వరకు తీసుకెళ్లారు. హర్తాళ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల చేత భగ్నం చేయించారని సిద్ధారెడ్డి జగన్కు తెలిపారు. 10 రోజులుగా ప్రజలు తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానిక్కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏ బ్యాంకుకెళ్లినా డబ్బు లేదనే సమాధానమే ఎదురవుతోందన్నారు. ఈ సందర్భంగా హంద్రీ-నీవాపై ఆరా తీసిన జగన్ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని సిద్ధారెడ్డికి సూచించారు. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి స్వాగతం
అన్నవరం : కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ శనివారం రాత్రి అన్నవరం విచ్చేశారు. ఉత్తరాధికారి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి వచ్చిన జయేంద్ర సరస్వతికి దేవస్థానం ఘాట్ రోడ్ ముఖద్వారంలో వందలాది మంది పండితులు, అర్చకస్వాములు, పురోహితులు, సిబ్బందితో కలిసి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. కారులో ఉన్న స్వామీజీకి పండితులు మం త్రోచ్ఛారణతో హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సత్యగిరి మీద ఉన్న అతిథి గృహా నికి రాత్రి బసకు వెళ్లారు. ఉదయం ఆరు గంటలకు స్వామీజీ సత్యదేవుని ఆలయానికి విచ్చేసి గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు, శంకరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సుమారు గంటసేపు ఈ పూజలు కొనసాగుతాయి. అనంతరం ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొండ దిగువన పంపా సత్రంలో స్వామీజీ శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ కోసం వంద బిందెల పరిశుద్ధ జలం సిద్ధం చేస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు జరిగే ఈ పూజను భక్తులంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామీజీ విశాఖపట్నం బయల్దేరి వెడతారు. స్వామీజీని దర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రానున్నారు. శనివారం రాత్రి 11 గంటలు దాటాక ఆయన రత్నగిరి చేరుకుని బస చేస్తారు. ఆదివారం ఉదయం స్వామీజీతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవస్థానంలో నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో కూడా మంత్రి పాల్గొంటారు. -
పెద్దాపురం విద్యార్థులకు పతకాల పంట
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీం, మహేష్లు పెద్దాపురం : క్రీడారంగంలో పెద్దాపురం పట్టణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి వన్నె తెచ్చిన పెద్దాపురం విద్యార్థులు బంగారుపతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 11న మీరట్లో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ షటిల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో పట్టణానికి చెందిన తీగిరెడ్డి జ్ఞాన మహేష్, షేక్ కరీంముల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న బ్యాడ్మింట¯ŒS పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులిద్దరికీ మన పెద్దాపురం ఫేస్బుక్ టీం ఘన స్వాగతం పలికి స్థానిక మెయి¯ŒSరోడ్డులో కేక్ను కట్ చేసి క్రీడాకారులను అభినందించారు. నాన్న ప్రోత్సాహంతోనే.. వృత్తి రీత్యా నాన్న మెకానిక్. ఆయన ప్రోత్సాహంతోనే నేనింతగా ఆడగలుతున్నాను. క్రీడల పట్ల ఉన్న మక్కువ, ప్రజల్లో వచ్చిన స్పందన మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఎప్పటికైనా క్రీడారంగం నుంచే ఉద్యోగం సాధించాలినే నా ఆకాంక్ష. – జ్ఞాన మహేష్ అందరి సహకారంతో.. అమ్మ, నాన్న, గురువు, స్నేహితుడు అందరి సహకారంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అవరోధించాలనేది నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువర్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించాను. – కరీముల్లా -
నృసింహుని సన్నిధిలో సత్యాత్మ తీర్ధానందస్వామి
మంగళగిరి: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని కర్నాటక ఉత్తరపీఠాధిపతి సత్యాత్మ తీర్ధానందస్వామి శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వామివారికి స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్ర ప్రిన్స్పల్ సెక్రటరీ ఏకె ఫరీదా అశ్వినికుమార్ శనివారం నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు పాలకవర్గసభ్యులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. -
అపూర్వ స్వాగతం
ఐదేళ్ల అనంతరం బళ్లారికి గాలి జనార్దనరెడ్డి దారి పొడవునా కిక్కిరిసిన జనం బళ్లారి : రాష్ర్ట మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి బళ్లారి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఐదేళ్ల తర్వాత ఆయన మంగళవారం బళ్లారికి విచ్చేయడంతో జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వచ్చిన ఆయనకు హగరి వద్ద వేలాదిగా తరలివచ్చిన జనం భారీ పూలమాలలు వేస్తూ స్వాగతం పలికారు. హగరి నుంచి అమరాపురం, కక్కబేవినహళ్లి, బేవినహళ్లి, బిసిలహళ్లి మీదుగా బళ్లారి వరకు దారి పొడవునా ప్రజలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ తమ అభిమాన నాయకుడికి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో హగరి-బళ్లారి మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాప్ లేని వాహనంపై జనార్దన్రెడ్డి నిలబడి దాడి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. నగరంలోని శ్రీకనకదుర్గమ్మ దేవాలయంలో గాలి పూజలు నిర్వహించిన అనంతరం వాల్మీకి, భువనేశ్వరి దేవి విగ్రహాలకు పూజలు నిర్వహించిన అనంతరం హవంబావిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... తన ఊపిరి ఉన్నంత వరకు బళ్లారి జిల్లా ప్రజల సేవకే అం కితమవుతాయని అన్నారు. ఎంపీ బీ.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, మాజీ ఉప మేయర్ శశికళ, పలువురు కార్పొరేటర్లు, జిల్లా పంచాయతీ మెంబర్లు, బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బళ్లారి జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. -
నగరానికి చేరుకున్న స్వరూపానంద సరస్వతి
విజయవాడ కల్చరల్: ఆది శంకరులు స్థాపించిన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి బుధవారం నగరానికి చేరుకున్నారు. ఆయనకు భక్తులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయ యాత్రలో భాగంగా గురువారం నుంచి నాలుగురోజులపాటు నగరంలో విడిదిచేయనున్నారు. ప్రతి రోజూ అనుగ్రహ భాషణ, చంద్రమౌళీశ్వరస్వామి పూజలు, భిక్షావందనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో మాగంటి సూర్యనారాయణ, మాచవరం హనమత్ దేవాలయం కార్యనిర్వహణ అధికారి నూతక్తి వెంకటసుబ్బారావు, మాగంటి సూర్యనారాయణ, సీతారామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిక్షావందనం వివరాలకు 7013585807లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
సచివాలయ ఉద్యోగులకు ఘన స్వాగతం
నగరంపాలెం( గుంటూరు): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన విధులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. సికింద్రాబాద్–విజయవాడ రైలులో ఉదయం 10.35 గంటలకు వారంతా గుంటూరు రైల్వేస్టేషన్కు చేరుకోగా స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గులబీ పూలతో స్వాగతం పలికారు. ‘రాజధానికి తరలివస్తున్న ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు స్వాగతం.. అవినీతి రహితమైన పరిపాలనను అందించాలని కోరుతున్నాం..’ అంటూ అవగాహన సంస్థ బ్యానర్లు ప్రదర్శించింది. సచివాలయ మహిళాlఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది బ్యానర్లు ప్రదర్శించుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయంకు వెళ్లేందుకు ఆర్టీసీ పది బస్సులను రైల్వేస్టేషన్ వద్ద సిద్ధంగా ఉంచింది. వారంతా ఆ బస్సుల్లో సచివాలయానికి చేరుకున్నారు. చిన్నచిన్న సమస్యలున్నా స్వంతరాష్ట్ర అభివద్ధి దష్ట్యా సర్దుకుపోయి పనిచేసుకుంటామని ఈ సందర్భంగా వారు విలేకరులకు తెలిపారు. -
నూతన జిల్లాలను స్వాగతిస్తున్నాం
కరీంనగర్ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థ రద్దును సమర్థిస్తూ, నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎ.నర్సింహస్వామి పేర్కోన్నారు. గురువారం నగరంలో యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివద్దికి ఆటంకంగా ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఆశనిపాతంలా ఉన్న జోనల్ వ్యవస్థ రద్దును సమర్థిస్తున్నామని, నూతన జిల్లాల ఏర్పాటు పూర్తిగా శాస్త్రీయంగా ఉందని వీటిని స్వాగతిస్తున్నామని అన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్, నాయకులు జి.వేణుగోపాలస్వామి, సాదిక్మస్రత్ అలీ, నూనవత్ రాజు, వెంకటస్వామి, వేణుగోపాల్, సంతోష్కుమార్, మన్సూర్, గణేష్, అశోక్కుమార్, లక్ష్మయ్య, రాంమూర్తి, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్ పాల్గొన్నారు. -
మంత్రికి ఘన స్వాగతం
సికింద్రాబాద్: రియో ఒలింపిక్స్ సందర్భంగా బ్రెజిల్ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావుగౌడ్కు శంషాబాద్ విమానాశ్రయంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు పతకం సాధించడం దేశానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరికొందరు సమర్థులైన క్రీడాకారులను జాతికి అందించేందుకు కృషి చేస్తామన్నారు. శంషాబాద్ నుంచి మంత్రి నివాసం వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, బైరగోని ధనంజన, రాజీవ్గుప్తా, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు, ఆకుల నాగభూషణం, ధరమ్రాజ్ చౌదరి, కిరణ్గౌడ్, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, సత్యనారాయణగౌడ్, స్మితాగౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చందుగంగపుత్ర, కాలేరు సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలల రైలు కదిలొచ్చిన వేళ..
సాక్షి, కడప: నంద్యాల నుంచి ప్రారంభమైన డెమూ రైలు కర్నూల్ జిల్లా నొస్సం రైల్వేస్టేషన్ను దాటుకోని సాయంత్రం 6.15 గంటలకు జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని ఉప్పలపాడు రైల్వేస్టేషన్కు చేరుకుంది. రైలును చూసేందుకు భారీగా గ్రామస్తులు, విద్యార్థులు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ స్టేషన్లో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రైలు టిక్కెట్ కొని జమ్మలమడుగు వరకు రైలులో ప్రయాణించారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న కల సాకారం కావడంతో జమ్మలమడుగు ప్రజలు భారీగా రైల్వేస్టేషన్కు తరలివచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి, నేతలు ప్రజలు స్టేషన్కు చేరుకుని రైలుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డెమూ ప్రొద్దుటూరుకు కదిలింది. ప్రొద్దుటూరులో రైలు పండగ తొట్టతొలిమారు ప్రొద్దుటూరుకు రైలు వస్తోందని తెలుసుకున్న పట్టణవాసులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే మహిళలతోపాటు జనమంతా రైల్వేస్టేషన్ కిక్కిరిసింది. రాత్రి 7.07 ప్రాంతంలో రైలు ప్రొద్దుటూరు స్టేషన్కు చేరుకోగా 20 నిమిషాలపాటు ఇక్కడ ఆపారు. ప్రోటోకాల్ ప్రకారం రైల్వే అధికారులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేత జెండా ఊపించి రైలును కదిలించారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న స్వప్నం నెరవేరడంతో అనేక మంది ఈ సందర్భాన్ని ఉత్సవంలా నిర్వహించారు. దొరసానిపల్లె సర్పంచ్ తరఫున వైఎస్సార్సీపీ నాయకుడు యాకోబ్ లడ్లు పంచిపెట్టగా, టౌన్బ్యాంక్ చైర్మన్ యల్లాల కుమార్రెడ్డి కూల్డ్రింక్స్ అందించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లుతోపాటు గులాబి పూలతో స్టేషన్కు వచ్చే వారికి స్వాగతం పలికారు. అలాగే కొంత మంది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎల్ఐసీ వారి ఆధ్వర్యంలో డెమూ డ్రైవర్ను పూలమాలలతో సన్మానించారు. మొదటి ప్రయాణం టికెట్ అమ్మకాల ద్వారా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్కు రూ.3,501 ఆదాయం వచ్చింది. కర్పూర హారతి రాత్రి 8 గంటలకు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు డెమో రైలు స్టేషన్కు చేరుకుంది. అప్పటికి వేలాదిసంఖ్యలో స్టేషన్కు చేరుకున్న ప్రజలు హర్షధ్వానాలతో రైలుకు స్వాగతం పలికారు. ఎర్రగుంట్ల– నంద్యాల రైలు కల నేటి తీరిందని వారు హర్షం వ్యక్తుం చేశారు. జనాలతో స్టేషన్ ఆవరణంతా కిక్కరిసింది. రైలు స్టేషన్కు రాగనే ఎస్టీయూ నాయకులు రైలుకు పూలమాల వేసిన స్వాగతం పలికి కాయకర్పంతో హరితి ఇచ్చి స్వీట్లును పంపిణీ చేశారు. రైలును చూసేందుకు ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మండల చుట్టుపక్కల గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అనంతరం కమలాపురం మీదుగా కడపకు చేరుకుంది. కడపకు రాత్రి 8:45కు చేరుకుంది. కడప రైల్వే స్టేషన్కు చేరుకోగానే స్టేషన్ మేనేజర్ నాసీరుద్దీన్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రైల్వేఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి సిబ్బంది అధికారికంగా స్వాగతం పలికారు. అలాగే బీజేపీ నాయకులు కూడా భారీ స్వాగతం పలికారు. తిరిగి కడప– నంద్యాల (77402) రాత్రే బయలుదేరి వెళ్లింది. నా హయాంలో రైలు వచ్చినందుకు సంతోషంగా ఉంది నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నంద్యాల – ఎర్రగుంట్ల రైలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడో రైల్వే లైన్ ప్రారంభించాల్సి ఉండగా నాటి నుంచి నేటి వరకు పాలకుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ కల సాకారమైనందుకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను. – ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు
సాక్షి, సిటీబ్యూరో: అరవై ఏళ్ల వలస పాలనలో ఎండిన పొలాలకు నీళ్లిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తున్న కాంగ్రెస్,టీడీపీ పార్టీలకు పుట్టగతులుండవని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో మంగళవారం తెలంగాణా ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం చారిత్రాత్మకమైనదన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ గ్రేటర్ విభాగం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని నగరానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈనెల 24న బేగంపేట్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకు భారీ జనసమీకరణ చేయాలన్నారు. మల్లన్న ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తున్నామన్నారు. నగరంలో పార్టీ బలోపేతం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని, ప్రతి సమావేశానికి విధిగా హాజరుకావాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..నూతన ఒప్పందంతో ఐదు జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణాలో ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. ప్రాజెక్టుల ఆవశ్యకతపై అదేరోజు విమానాశ్రయం ఆవరణలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారన్నారు. పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రతినెలా తొలి ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి అందరికీ సౌలభ్యంగా ఉండేందుకు 27 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలో ఆలయ కమిటీల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యనేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
గోదావరిఖని : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్జీ–1 పరిధిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ గార్డులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమంలో ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. స్టేడియంలో జరుగుతున్న పనులను ఎస్ఓటూ సీజీఎం సుధాకర్రెడ్డి, సివిల్ డీజీఎం సూర్యనారాయణ, ఎస్ఎస్ఓ జాకీర్ హుస్సేన్ శనివారం పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ సెక్యూరిటీగార్డులు మార్చ్ఫాస్ట్ రిహార్సల్ చేయగా అధికారులు పరిశీలించారు. గతేడాది కన్నా భిన్నంగా ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. -
ఎంపీ కవితకు ఘనస్వాగతం
చిట్యాల నల్లగొండలో తెలంగాణ జాగృతి దశమ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఆ సంఘం అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవితకు చిట్యాలకు చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకులు కూనూరు సంజయ్దాస్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం నల్లగొండలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బైరు శివ, చింతకాయల మహేష్, అమరోజు మధు, నీల మణికంఠ, పుల్లెంల శ్రీకాంత్, అనిల్ పాల్గొన్నారు. -
విజయవాడలో రాష్ట్ర పశుసంవర్ధక కార్యాలయం
విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయం పూర్తిస్థాయిలో నగరానికి తరలివచ్చింది. నెల రోజుల కిందట లబ్బీపేటలోని సూపర్స్పెషాలిటీ పశుశుల ఆస్పత్రిలో వెటర్నరీ డైరెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ, హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించారు. గురువారం అక్కడి నుంచి ఫైళ్లతో సహా పూర్తిస్థాయిలో ఉద్యోగులు నగరానికి తరలివచ్చారు. వారిని ఏపీ ఎన్జీవో సంఘ నాయకుడు ఎ.విద్యాసాగర్తో పాటు, ఏపీ పశువైద్యుల సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి పూలు ఇస్తూ, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ జి.సోమశేఖరమ్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి కార్యాలయం తరలిరావడం సంతోషకంగా ఉందన్నారు. రాష్ట్రంలో పశు సంవర్ధకశాఖలో సేవలు మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు సంచాలకుడు డాక్టర్ కె.కృష్ణమూర్తి సహా సుమారు 50 మందికిపైగా ఉద్యోగులు తరలివచ్చారు. వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తుమ్మల సాయిగోపాల్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ ప్రతినిధి డాక్టర్కె నగేష్బాబు, డాక్టర్ పద్మ పాల్గొన్నారు. -
అందరూ ఆతిథ్యం ఇవ్వాలి
రామవరప్పాడు : రాబోయే కృష్ణా పుష్కరాల్లో నగరంలోని ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను సందరంగా తీర్చిదిద్దామన్నారు. కృష్ణా, గోదావరి నధుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమం ఏర్పాటు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పరిశీలన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు ఆ రోడ్డుపై కాన్వాయ్లో ప్రయాణించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముస్లింల సంక్షేమానికి కృషి : మంత్రి పల్లె విజయవాడ (వన్టౌన్) : ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వించిపేటలోని ముసాఫిర్ఖానా ప్రాంగణంలో నూతనంగా చేపట్టిన షాదీఖానా భవన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తొలుగ జరిగిన సభలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేస్తోందని చెప్పారు. రంజాన్ తోఫా పేరుతో ప్రతి పేద ముస్లిం ఇంట పండుగ వాతావరణం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే జలీల్ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు 12 శాతం మంది ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. సభకు ముస్లిం మహిళలు అంతగా హాజరుకాకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించారు. -
కక్కుర్తిపడి.. అడ్డంగా బుక్కయింది!
నలుగురికి తమ ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఇంటిముందుభాగంలో రకరకాల అలంకారాలు చేస్తారు. కానీ, అలాంటి అందమైన అలంకారాలను కూడా దొంగలించే దొంగలు కూడా ఉంటారు. తాజాగా అమెరికాలో ఓ 30 ఏళ్ల మహిళ ఇలాంటి కక్కూర్తి పనే చేసింది. ఓ ఇంటి ముందుభాగంలో ఉన్న 'వెల్ కమ్' బోర్డును, అమెరికా జెండా వస్త్రంతో చేసిన పూలడిజైన్ ను దొంగలించింది. తెలివిగా ఎవరికంట పడకుండా వాటిని దొంగిలించానని ఆమె మురిసిపోయింది. కానీ, నిఘా కోసం పెట్టిన రహస్య కెమెరాల్లో ఆమె అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన టెక్సాస్ లోని హారిస్ కౌంటీలో జరిగింది. నిందితులరాని కార్లే విలియమ్స్ గా గుర్తించారు. ఆమె ఓ ఇంటి ముందున్న 'వెల్ కమ్' బోర్డును, పూల డిజైన్ ను దొంగలించడం.. సీసీకెమెరాల్లో రికార్డయింది. దీంతో నిందితురాలని గుర్తించిన పోలీసులు ఆమె చిల్లర దొంగతనానికి పాల్పడిందని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. ఆమె ఇంట్లో నుంచి దొంగలించిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంటి ముందు ఆవరణలో ఉంచే పలు వస్తువులను ఆమె దొంగలించిందని పోలీసులు గుర్తించారు. ఎవరూలేని సమయం చూసి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం ఆమె అలవాటు అని పోలీసులు తెలిపారు. సీసీకెమెరా వీడియో ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి సహకరించిన సోషల మీడియా, మీడియాకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. -
కలెక్టర్కు కళాత్మక స్వాగతం
నెల్లూరు(వేదాయపాళెం) : జిల్లా కలెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ముత్యాలరాజుకు నెల్లూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు షేక్.ముసవీర్ కళాత్మక స్వాగతం పలుకుతున్నాడు. 200 మిల్లీ గ్రాముల బంగారుతో స్వాగత కళా రూపాన్ని తీర్చిదిద్దాడు. కంట్లో ఇమిడి పోయే ఈ సూక్ష్మనమూనాలో కలెక్టర్, ముత్యాలరాజు అనే అక్షరాలు, ఇరువైపులా సూక్ష్మరూప జాతీయ జెండాలు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తున్నాయి. 1 సెంటీ మీటర్ ఎత్తు, 1/2 సెం.మీ ఎత్తు ఉన్న నమూనా తయారీకి ఒక రోజు పట్టిందని ముసవీర్ తెలిపారు. -
జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్
హైదరాబాద్: జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులకు స్వాగతం పలికేందుకు తమ షోరూమ్లలో బంగారు, వజ్రాభరణాల్లో సరికొత్త కలెక్షన్ అందుబాటులో ఉందని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపిం ది. ప్రతి కొనుగోలుపై బహుమతులు, వజ్రాభరణాల కొనుగోళ్లపై డిస్కౌంట్, పాత బంగారాన్ని కొత్త బంగారు ఆభరణాలతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం తదితర పలు ఆఫర్లున్నాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. -
రంజాన్ కు వినూత్న స్వాగతం!
జెడ్డాః రంజాన్ పర్వదినాల్లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, మసీదుల్లో ప్రార్థనలతో నెల రోజులపాటు పండుగ వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యోదయానికి పూర్వం నుంచీ సూర్యాస్తమయం వరకూ కఠిన ఉపవాస దీక్ష (రోజా) ను చేపట్టి, రాత్రి సమయంలో ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విడుస్తారు. నెల రోజులపాటు ఉపవాసాలు ముగిసిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి నెల్లాళ్ళ పాటు దాన ధర్మాలతో, భక్తిమార్గంలో జరుపుకునే ఈ రంజాన్ పండుగకు ముగ్గురు పాకిస్తానీ యువకులు వినూత్నంగా స్వాగతం పలికారు. అందరికీ ఆసక్తికరంగా ఉండేట్టు నీటి అడుగు భాగంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఎర్ర సముద్రం దిగువ భాగాన లాంతర్ల వెలుగులో పండుగను కొత్త రకంగా ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న యహేయా అష్ఫాక్, ఉమర్ జాన్, ఖాజీ అజ్మా లు ఎర్ర సముద్రం దిగువ భాగాన నూతన మార్గంలో రంజాన్ వేడుకలను ప్రారంభించారు. జెడ్డా తీర ప్రాంతంలోని ఎర్ర సముద్రం లోపలికి వెళ్ళి, నీటి అడుగు భాగంనుంచీ రంజాన్ కు స్వాగతం పలికారు. వారితోపాటు తీసుకెళ్ళిన లాంతర్ల వెలుగులోనే నీటికింద వేడుకలను నిర్వహించినట్లు కార్యక్రమం మొత్తాన్ని చిత్రీకరించిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యహేయా...స్థానిక వార్తా పత్రికకు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్ లను హైలెట్ చేసేందుకు, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యతను తెలపడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. రంజాన్ సందర్భంగా నీటి అడుగు భాగాన వేడుకలు నిర్వహించడానికి అదే ముఖ్య కారణమంటున్నారు. అండర్ వాటర్ జీవితం ఎలా ఉంటుందో ఇప్పటివరకూ కనిపెట్టలేదని, ఇది పర్యాటకాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే యహేయా దుబాయ్, యాన్బులలో నీటి అడుగు భాగంలో డైవింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల బృందం రంజాన్ సందర్భంగా సముద్రానికి 140 అడుగుల కింది భాగంలో జెండాలు ఊపుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు వారు చిత్రీకరించిన వీడియోలను బట్టి తెలుస్తోంది. జెడ్డా పరిసర ప్రాంతాల్లో డైవింగ్ కు వెళ్ళేందుకు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య సమయం ఉత్తమమైనదని, సంవత్సరం మొత్తంలో ఆ రెండు నెలల సమయంలోనూ నీటి అడుగు భాగం ప్రత్యక్షంగా కనిపిస్తుందని, అలాగే నీటి ఉష్ణ్రోగ్రత కూడ సరిపడేట్లు ఉంటుందని యహేయా చెప్తున్నారు. భూమ్మీద, ఆకాశంలోనే కాక, నీటి అడుగు భాగాన కూడ విహరించి ఆనందించవచ్చని చెప్పడమే లక్ష్యంగా ఈ బృదం రంజాన్ వేడుకలను సముద్రానికి అడుగు భాగాన నిర్వహించింది. -
అనుపమ్ రేకు ఐఏఎఫ్సీ స్వాగతం
హూస్టన్:అమెరికాలో భారత కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్. అనుపమ్ రే ను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్(ఐఎఎఫ్ సీ) ఘనంగా స్వాగతించింది. ఐఏఎఫ్సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ గురించి అనుపమ్ రే కు వివరించారు. భారతీయ అమెరికన్లు మాతృభూమి అభివృద్ధికి తోడ్పడడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో డాల్లస్ లో నిర్వహించబోతున్న కార్యక్రమానికి అనుపమ్ రే ను ఆహ్వానించారు. -
కదిరిలో వైఎస్ జగన్కు అభిమాన స్వాగతం
కదిరి: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరారు. కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్లో ఆయన కాన్వాయ్ను చూసిన అభిమానులు అభివాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా టీడీపీలో చేరడం వల్ల పార్టీకి స్థానికంగా వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. -
'పనామా పేపర్స్' పై స్పందించిన జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రాజేసిన పనామా పేపర్స్ పత్రాల వెల్లడిని ఆయన స్వాగతించారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సింది కోరారని తెలిపారు. ఇది స్వాగతించాల్సిన, ఆరోగ్యకరమైన పరిణామమని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు ఉదంతంలో విచారణ మొదలైందని గుర్తు చేశారు. హెచ్ఎస్బిసి ఖాతాదారుల సంబంధించి 2011 లో 569 ఖాతాదారులను గుర్తించామని, వీటిలో 390 అక్రమ ఖాతాలుగా తేలాయని వివరించారు. ఇప్పటికే 154 సెట్ల ఫిర్యాదులను నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమ ఖతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులను పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను రూపిందించనట్టు ఆర్థకి మంత్రి తెలిపారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు. కాగా నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి 11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు పూనుకున్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు గుట్టు ఈ పత్రాల్లో రట్టైన సంగతి తెలిసిందే. -
బతుకు బడిలో చేదు గుణపాఠం!
జ్ఞాపకం బస్టాప్కి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. గబగబా వెళ్లి ఎక్కబోయాను. ఆ కంగారులో చీర కాలికి అడ్డుపడింది. గభాలున ముందుకు పడబోతే ఎవరో చేయి పట్టుకుని ఆపారు. థాంక్యూ అన్నాను. ‘వెల్కమ్’ అని బదులు వచ్చింది. ఎక్కడో విన్న గొంతు. చప్పున చూశాను... రవీందర్. విస్తుపోయాను. అతను చిన్నగా నవ్వి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. నా మనసు అదోలా అయిపోయింది. ఒక్కసారి గతంలోకి పరుగెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టాను నేను. నాన్న రైతు. అమ్మ గృహిణి. ఒక్కదాన్నే సంతానం. పెద్దగా సంపద లేకపోయినా అమ్మానాన్నలు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. కానీ నాకు మాత్రం సంతోషంగా ఉండేది కాదు. మా ఊళ్లో మంచి స్కూల్ లేదని నన్ను పక్కనున్న టౌను స్కూల్లో వేశారు నాన్న. రోజూ సైకిల్ మీద తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. నాకోసం అంత కష్టపడుతున్నందుకు నేనెప్పుడూ సంతోష పడలేదు. నా స్నేహితురాళ్ల నాన్నలు వాళ్లను బైకుల మీద తీసుకొస్తున్నారని బాధగా ఉండేది. ఉన్నదాంట్లోనే అన్నీ అమర్చేవారు అమ్మానాన్నలు. కానీ నా స్నేహితురాళ్ల దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు నాకు లేవనే బాధ. ఎప్పుడూ ఇలా ఏదో వెలితి. ఏవేవో కావాలని మనసు ఉర్రూతలూగుతూనే ఉండేది. ఆ వెర్రే నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ అయ్యాక హైదరాబాద్లోని ఓ కాలేజీలో పీజీ చేయడానికి పంపారు నన్ను. ఒక్కసారిగా అంత పెద్ద సిటీలో అడుగు పెట్టగానే మనసు పక్షిలా ఎగరసాగింది. కాలేజీలో సాటి అమ్మాయిల ఆధునికత, ఖరీదైన జీవితాలు నన్ను అయస్కాంతంలా లాగేవి. నాకూ అలా బతకాలనే తహతహ. అదే నన్ను విక్రమ్కి అట్రాక్ట్ అయ్యేలా చేసింది. తను డబ్బున్నవాడు. కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల్లా చూసేవాడు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టేవాడు. మొదటిసారి నన్ను చూసినప్పట్నుంచే నా వెంట పడటం మొదలెట్టాడు. నేను లేకుండా బతకలేనన్నాడు. అలాంటివాణ్ని చేసుకుంటే నా కలలన్నీ తీరతాయనుకున్నాను. అతని మోజులో పడ్డాను. సరిగ్గా అదే సమయంలో రవీందర్ నాకు ప్రపోజ్ చేశాడు. కానీ అతడు నా కంటికి ఆనలేదు. విక్రమ్ని ప్రేమిస్తున్నానని ముఖమ్మీదే చెప్పాను. ఇంకోసారి నాకు కనిపించకు అన్నాను. అతను వెళ్లిపోయాను. నా జీవితం నుంచే కాదు, కాలేజీ నుంచే వెళ్లిపోయాడు. అందరూ అయ్యోపాపం అన్నాను. నేను మాత్రం వాడి ఖర్మనుకున్నాను. కాలం గిర్రున తిరిగింది. పీజీ ముగిసింది. నేను ఊరెళ్లిపోయాను. అప్పుడే నా కళ్లు తెరచుకున్నాయి. విక్రమ్ ఫోన్ ఎంతకీ కనెక్ట్ కాలేదు. మెయిల్కి రిప్లై లేదు. ఫ్రెండ్స్ని అడిగితే తెలియదన్నారు. తన కోసం చాలా వెతికాను. చాన్నాళ్లు గాలించాను. కనిపించలేదు. తను నన్ను మోసం చేశాడని అప్పుడుగానీ అర్థం కాలేదు. మనసు విరిగిపోయింది. డబ్బు వ్యామోహంలో పడి ఏం పోగొట్టుకున్నానో అర్థమైంది. బాధను అణచుకుని హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాను. అమ్మానాన్నలు పెళ్లి చేస్తామన్నా వద్దన్నాను. వాళ్లను బాగా చూసుకుంటే చాలనుకున్నాను. కానీ ఆరేళ్ల తర్వాత రవీం దర్ని చూడగానే ఏవేవో ఆలోచనలు. ఏవో కొత్త ఆశలు. దగ్గరకు వెళ్దామని అడుగు ముందుకేయబోయి చప్పున ఆగిపోయాను. ఎందుకంటే... పక్కనే అతని భార్య, పిల్లలు! బతుకు పాఠశాల ఎన్ని పాఠాలు, చేదు గుణపాఠాలు నేర్పుతుందో కదా! - డి.యస్, హైదరాబాద్ -
వీడియోతో వెల్కమ్
లండన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్ లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అధికారిక సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. మోదీ పర్యటనను స్వాగతించిన వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతోషంగా ఆహ్వానిస్తున్న వీడియోనొక దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. మోదీ పర్యటనను స్వాగతించిన వివిధ రంగాలకు చెందిన పలువురు, ప్రముఖులు, విద్యార్థులు ఈ వీడియోలో మోదీకి స్వాగతం చెప్పారు. 'ప్రధాని మోదీకి స్వాగతం... మా దేశానికి రావడం....మాకు చాలా సంతోషంగా ఉంది.. భారత దేశంతో సన్నిహిత సంబంధాలు ఎంత ముఖ్యమో మీకే తెలుస్తుంది' అంటూ ఈ వీడియో మొదలవుతుంది. Welcome to the UK @narendramodi from Britain's Indian community #ModiInUK https://t.co/5hrlplmx4Q — UK Prime Minister (@Number10gov) November 12, 2015 -
పీలేకు ఘనస్వాగతం
కోల్కతా: ఫుట్బాల్ దిగ్గజం పీలేకు భారత్లో ఘనస్వాగతం లభించింది. 38 ఏళ్ల అనంతరం ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చిన ఆయనకు స్థానిక అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ‘పీలే.. పీలే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయన్ని స్వాగతించారు. దీనికి పులకించిన 74 ఏళ్ల పీలే తన వాహనం నుంచి అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి పీలేను వాహనం దగ్గరికి తీసుకెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం, నిర్వాహకులు పీలేకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆదివారం ఆయన ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా పూర్తిగా హోటల్కే పరిమితమయ్యారు. 1977లో మోహన్ బగాన్తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడేందుకు పీలే తొలిసారి కోల్కతాకు వచ్చారు. -
కేసీఆర్కు గంగదేవిపల్లి స్వాగతం
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి గ్రామజ్యోతి కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం గీసుకొండ :సీఎం కేసీఆర్కు మండలంలోని గంగదేవిపల్లి స్వాగతం పలుకుతోంది. ప్రతీ గడప, కుటుంబం ఆయన రాకకోసం ఎదురు చూస్తోంది. తమ గ్రామానికి దేశవిదేశీయులు అనేకమంది వచ్చినా సీఎం కేసీఆర్ తొలిసారి ఇక్కడ పర్యటించడం వారిలో నూతనోత్తేజం నింపుతోంది. గ్రామజ్యోతి పథకాన్ని ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించనుండడంతో జిల్లానేకాదు.. రాష్ర్టం దృష్టి మొత్తం ఇక్కడే ఉంది. గ్రామస్తులతో ముఖాముఖి సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు గ్రామానికి చేరుతారు. ఆయనకు స్వాగ తం పలకడానికి సర్వం సిద్ధం చేశామని గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూ సం రాజమౌళి తెలిపారు. తొలుత సీఎం ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల అ నుభవాలు అడిగి తెలుసుకుంటారు. జెడ్పీ పాఠశాలలో మొక్కలు నాటుతా రు. గ్రామపంచాయతీ కార్యాలయం వ ద్ద గ్రామసభ చేపట్టి గంగదేవిపల్లి ఆదర్శాల గురించి గ్రామస్తులతో చర్చిస్తారు. ఒకవేళ వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో రేకులతో పెద్దకప్పు, వేదిక ఏర్పాటు చేశారు. ఏర్పాట్లలో అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధాన శాఖల అధికారులు ఇక్కడే మకాం వేసి అవసరమైన చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ పాటిల్ ఆదివారం రాత్రి వరకూ ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. కట్టుదిట్టంగా భద్రత.. గంగదేవిపల్లిలో సీఎం సెక్యూరిటీ ఫో ర్స్ మకాం వేసింది. వీరే కాకుండా సు మారు వెయ్యి మంది పోలీసులను ని యమించారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, ఏసీపీ మహేందర్ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రా మం మీదుగా హెలికాప్టర్ చక్కర్లు కొ ట్టింది. అయితే సీఎం ఎలా వస్తారనే వి షయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. -
డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నా
-
దీపం పెడదాం వస్తారా...?
మళ్ళీ పండగొచ్చింది. అదే.. జనవరి ఒకటి. క్యాలెండర్ మారింది. పార్టీ ఫ్యాషన్స్ మారాయి. ఈ ఏడు అర్ధరాత్రి పార్టీల రూల్స్ మారాయి. అన్నీ మారినా.... మారనిది కొంతమంది జీవితాలు. ఇటీవల సరూర్నగర్లోని ఓ మురికివాడకి వెళ్ళాను. వృత్తిపరంగా విలేకరిని, ఆర్.జె.ని కావడం వల్ల ఆ బస్తీ వాసులతో కొంతసేపు గడిపి, వాళ్ళ సంగతులను రేడియోలో వినిపిద్దామని వెళ్ళాను. సాయంత్రం ఐదున్నర కావొస్తోంది. బండి దిగి యధేచ్చగా పారుతున్న చిన్న చిన్న మురికి కాలవలని దాటుకుంటూ బస్తీలోకి అడుగుపెట్టాను. పది అడుగులు వేయగానే పాకలు మొదలయ్యాయి. అవి వాళ్ళ ఇళ్ళట! ఇది గతంలో ఎప్పుడూ మురికివాడలని చూడని అమాయకత్వం కాదు సుమా! మరోసారి మనతో కలిసి జనజీవన స్రవంతిలో నివసిస్తున్న వారిని గమనించిన నిట్టూర్పు! రెండు మూడు ఇలాంటి ‘ఇళ్ళు’ దాటాక, అక్కడే కాలువల సరసన ఓ ముప్ఫైమంది చిన్నారులు అమాయకపు చిరునవ్వుతో స్వాగతం చెప్పారు. ఒంటరి కరెంటుతీగకి వేలాడుతున్న బల్బు వెలుతురులో పుస్తకాల్లో మొహాలని దూర్చి చదువుకుంటున్నారు. చీకటి పడింది కనుక దోమల స్వైరవిహారం మొదలైంది. ఓడోమాస్లూ, గుడ్నైట్లూ లేవు. నేను తప్ప అందరూ దోమలతో దోస్తీ చేసినట్టున్నారు. కాబట్టి ఎవరికీ ఇబ్బంది కాలేదు. అక్కడే వారికి పాఠాలు నేర్పుతూ ఇంకొంచెం పెద్దపిల్లలు, వాలంటీర్లు కలిసారు. ఈ పెద్ద పిల్లలు అదే వాడలో పెరిగి ఇంటర్ వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి వంతు కృషిగా చిన్నపిల్లలకి పాఠాలు చెప్తుంటే, ఈ వాలంటీర్లు నడిపే స్వచ్ఛంద సంస్థ- ‘‘అక్షయ విద్య’’ద్వారా వారి ఇంటర్ ఫీజులు భర్తీ అవుతున్నాయి. ఈ వాలంటీర్లేమో రోజంతా ఉద్యోగాలు చేసి సాయంత్రాలు అక్కడి పిల్లతో గడుపుతారు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా మిస్కారు. ‘‘పక్క క్లాసుకి వెళ్దామా’’ అని మధు అనే వాలంటీర్ అన్నది. అతుక్కున్న రెండు గుడిసెల మధ్య నుండి కట్టెపుల్లలు వీపుకి గీస్కుంటూ ఆ క్లాసుకి వెళ్తుండగా ఎన్నో జీవరాసులు దర్శనమిచ్చాయి. బల్లులు, తేళ్ళు ఇంకా ఏవేవో! ‘‘ఇక్కడా వాళ్ళు రోజు నిద్రపోతున్నది’’ అని అడిగాను. ‘‘ఇది చాలా మేలు. కొన్ని మురికివాడల్లో అయితే దుర్గంధం మధ్యలో వాళ్ళు ఆడతారు, తింటారు, ఉంటారు. మనం రెండు నిమిషాలు కూడా నిలబడలేని పరిసరాల్లో వారి జీవితాలే గడిచిపోతాయి’’ అని వాస్తవాన్ని వివరించింది - మధు. కూర్చున్న చోటి నుండి లేచి రెండడుగులు వేస్తే - మరికొన్ని ఇళ్ళు. ఈ పిల్లలకి అమ్మానాన్నలు నామ్కేవాస్తే ఉన్నారు. కానీ చాలా వరకూ అమ్మ పనికి వెళ్ళిపోతుంది. నాన్న సాయంత్రాలు తాగొస్తాడు. మరి బడి తరువాత వాళ్ళేం చేయాలి? సాయంత్రాలు దిక్కు తోచకుండా, దిక్కులేకుండా గడిచిపోతున్నాయి. నాన్నొకవేళ ముందే ఇంటికొస్తే - పిల్లలకి తాగుడు అలవాటు చేస్తాడు. అలా కాకపోతే, వీధిలో పెద్ద పిల్లల పక్కన చేరి చిన్నపిల్లలు బూతులు నేర్చుకుంటారు. అవసరం కొద్దీ దొంగతనాలు మొదలుపెడతారు. ఆడపిల్లలు పన్నెండేళ్ళకే ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు లోనవుతారు. ఇది - వారి ఫ్యామిలీ! ఇది వారి స్టోరీ. ఇక్కడ హైదరాబాదులోనే ఇటువంటి మురికివాడలు 1400 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఏంటి? మన హైటెక్ స్మార్ట్సిటీ గురించే చెబుతున్నాను. ఇంతకీ నేను వెళ్ళిన పని - అక్కడ పిల్లలకి సోలార్ దీపాలు పంచిపెట్టడానికి. చీకటి పడ్డాక అమ్మ లేటుగా వచ్చి, నాన్న రాలేని పరిస్థితిలో ఉంటే - కనీసం ఈ దీపం మాటున, కళ్ళనిండా వాళ్ళ స్వప్న లోకాన్ని చూస్కుంటూ - ఓ పుస్తకం పట్టుకుని వాళ్ళ సాయంత్రం గడిచిపోతుందన్న చిన్న ఆశ. మనసు పీకుతోంది. మళ్ళీ వెళ్ళాలని - ఆ బంగారు తల్లులు, తండ్రులతో పండగవేళ గడపాలని. మీరూ వస్తారా? -
విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం
గన్నవరం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఉదయం 11.45 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ ఆర్.రఘునందన్రావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి, నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ హరికిరణ్, ఆర్డీవో చెరుకూరి రంగయ్య, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం, డెప్యూటీ సీఎం హెలికాప్టర్లో సత్తెనపల్లి వెళ్లారు. -
రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ రేణిగుంట చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి స్వాగతం పలికారు. వైఎస్ జగన్ రేణిగుంట నుంచి తిరుపతి వెళతారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతారు. తిరుపతిలో జరిగే ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని.. పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. -
జగన్కు అపూర్వ స్వాగతం
గన్నవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి స్పైస్జెట్ విమానంలో ఉదయం 8.50కి గన్నవరం చేరుకున్నారు. పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, గొట్టిపాటి రవికుమార్, మహమ్మద్ ముస్తాఫా, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పోతుల రామారావు, పాలర్తి డేవిడ్రాజు, ముత్తుముల అశోక్రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, గుంటూరు జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పుష్పగుచ్ఛాలతో ఘనంగా ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు ఉప్పాల రాంప్రసాద్, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్కుమార్, గుంటూరు జెడ్పీ ఫ్లోర్లీడర్ దేవెళ్ల రేవతి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కాసర్నేని గోపాలరావు, ఆరుమాళ్ల సాంబిరెడ్డి, ఎండీ గౌసాని, విజయవాడ 40వ డివిజన్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచులు నీలం ప్రవీణ్కుమార్, సాతులూరి శివనాగ రాజకుమారి, నాయకులు దేవభక్తుని సుబ్బారావు, కాజ రాజ్కుమార్, సూరం విజయ కుమార్, కైలే లక్ష్మణకుమార్, లుక్కా ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నాయకులను పేరుపేరునా పలకరించిన జగన్, వారి గురించి అడిగి తెలుసుకున్నారు. -
నీరాజనం
సాక్షి కడప/పులివెందుల/కమలాపురం/వీఎన్ పల్లె: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పులివెందుల నుంచి మైదుకూరు వరకు గ్రామగ్రామాన అఖండ స్వాగతం లభించింది. పులివెందుల నుంచి బయలు దేరిన వైఎస్ జగన్రెడ్డిని ప్రతి గ్రామం వద్ద అభిమానులు కాన్వాయ్ని ఆపి కరచాలనం చేస్తూ వచ్చారు. ఎర్రిపల్లి, గోటూరు, ముతుకూరు, రామిరెడ్డిపల్లె, పాలగిరి, వీఎన్పల్లె, గంగిరెడ్డిపల్లె, అయ్యవారిపల్లె, కీర్తిపల్లె, పాయసంపల్లె, బయనపల్లె, చిన్నచెప్పలి, పెద్దచెప్పలి, కొండాయపల్లె, జంగంపల్లె, కమలాపురం వరకు ప్రతిచోటా జనాలు రోడ్డుపైకి వచ్చి జగన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. వైఎస్ జగన్రెడ్డితో కరచాలనం చేసిన తరవాతనే సాగనంపుతూ వచ్చారు. ఏమమ్మా... పంటలు ఎలా ఉన్నాయి పులివెందుల-కొండ్రెడ్డిపల్లె రహదారి మధ్యలో ఒక చోట కాన్వాయ్ని ఆపి వైఎస్ జగన్రెడ్డి పంటను పరిశీలించారు. సాగులో ఉన్న పత్తి పంటను తిలకించారు. మహిళా రైతు ఈశ్వరమ్మతో మాట్లాడారు. ఏమమ్మా.. పంటలు ఎలా ఉన్నాయి. పెట్టుబడి ఎంత.. అని వైఎస్ జగన్ ప్రశ్నించగానే ఈశ్వరమ్మ దాదాపు రూ.50వేలకు పైగా పెట్టుబడి అయిందని వివరించారు. పాలగిరిలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ వీఎన్ పల్లె మండలం పాలగిరిలో ప్రతిభ బయోటిక్ ఎండీ ఇసుకపల్లె రాజశేఖర్రెడ్డి ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించగా, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కమలాపురం ఎంఎల్ఏ పి.రవీంద్రనాథ్రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీపంలో ఉన్న నూతన చర్చిని వైఎస్ జగన్ ప్రారంభించి ప్రార్థనలు చేశారు. కమలాపురం పెద్ద దర్గా.. అమ్మవారిశాలలో ప్రత్యేక ప్రార్థనలు కమలాపురంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్గఫార్ షా ఖాద్రి, జహీరియా దర్గాలో వైఎస్ జగన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గఫార్ స్వామి జగన్మోహన్రెడ్డికి శాలువకప్పి సన్మానించారు. అలాగే పట్టణంలోని అమ్మవారు శాలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. పెద్దచెప్పలిలో వెలసిన హేలాంబ ఆలయంలో జగన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మైదుకూరు సెగ్మెంట్లోనూ అదే ఆదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మైదుకూరు సెగ్మెంట్లోనూ అదే ఆదరణ లభించింది. కమలాపురం నుంచి మైదుకూరుకు వెళుతుండగా మార్గమధ్యలో తవ్వారిపల్లె, సుంకేసుల, ఖాజీపేట, మైదుకూరు, వనిపెంట తదితర గ్రామాల వద్ద మహిళలు వచ్చి వైఎస్ జగన్కు హారతి పట్టారు. పొలాన్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత మైదుకూరు పరిధిలోని ఓబులాపురం పంచాయతీలోని మద్దుపల్లెకి చెందిన రామకృష్ణారెడ్డి పొలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. పొలంలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయగా, పొలాలన్నీ ఎండిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. నూతన జంటకు ఆశీర్వాదం ఇటీవలే వివాహమైన మైదుకూరు వైఎస్సార్ సీపీ నాయకుడు మదీనా దస్తగిరి కుమార్తె, అల్లుడులను వైఎస్ జగన్ శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. అలాగే మైదుకూరు మాజీ మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా వెళ్లి కలిశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురి కుటుంబాలకు పరామర్శ వేముల మండల మాజీ ఎంపీపీ ఆర్.జనార్ధన్రెడ్డి గుండెకు సంబంధిత ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం వైఎస్ జగన్మోహన్రెడ్డి నల్లచెరువుపల్లెకు వెళ్లి పరామర్శించారు. ఇంతలోనే జనార్ధన్రెడ్డి తండ్రి సిద్ధారెడ్డి బాధపడుతుండటాన్ని చూసి వైఎస్ జగన్రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన ఆర్కే జనార్ధన్రెడ్డికి ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో ఆయనను కూడా వైఎస్ జగన్రెడ్డి పరామర్శించారు. గొందిపల్లెకు చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్రెడ్డి పరామర్శించారు. కమలాపురం వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు హిదాయత్ తండ్రి ఎస్ఆర్టీ ఇటీవల మృతి చెందారు. వైఎస్ జగన్రెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి ఎస్ఆర్టీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే చిన్నచెప్పలి ఎంపీటీసీ సభ్యుడు బుజ్జన్న సోదరుడు దాదాగారి దాదావలి కూడా ఇటీవల మృతిచెందారు. అలాగే దాదావలి కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్రెడ్డి పరామర్శించారు. తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్రెడ్డిని పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు కలిసి చర్చించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, రాచమల్లు ప్రసాద్రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. మూడు రోజుల పర్యటన విజయవంతం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 13వ తేదీన పులివెందులకు వచ్చిన ఆయన వేంపల్లె మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పులివెందుల ప్రజలతో కలసి పోయారు. అలాగే శనివారం పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించునకుని శనివారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
విజయవాడ వస్తే...స్వాగతిస్తాం
-
ఆర్చరీ మెరుపులు
- విజయవాడ చేరుకున్న పూర్వాష, జ్యోతిసురేఖ - ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు ఘనస్వాగతం విజయవాడ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్లో బెజవాడ కీర్తిపతాకను ఎగురవేసి నగరానికి వచ్చిన ఆర్చర్లకు ఘనస్వాగతం లభించింది. ఇంచియాన్ (కొరియా)లో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్లో విజయవాడ నుంచి భారత కాంపౌండ్ మహిళా ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన పూర్వాష, వెన్నం జ్యోతి సురేఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పూర్వాష తన కోచ్ ఎల్.చంద్రశేఖర్తో కలిసి గన్నవరం చేరుకోగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.రామకృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు, క్రీడాసంఘాల ప్రతినిధులు నామిశెట్టి వెంకట్, డి.శ్రీహరి, శాతవాహన కళాశాల పీడీ సంగీతరావు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అర్చర్లతో పాటు పూర్వాష చదువుకున్న విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ర్యాలీగా నగరానికి చేరుకున్నారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విజయవాడ ఓల్గా అకాడమీ ఆర్చర్లు తప్పకుండా పతకాలు సాధిస్తారని ముందుగానే చెప్పామని, అదిప్పుడు నిజమైందని పేర్కొన్నారు. హైదరాబాద్లో సీఎంను కలిసిన సురేఖ భారత జట్టుతో శుక్రవారం ఢిల్లీ వచ్చిన మరో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అక్కడ్నుంచి హైదరాబాద్కు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శనివారం నగరానికి చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాసంఘాలు, సహచర ఆర్చర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి సురేఖకు సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సీబీఆర్ ప్రసాద్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. 1951 ఢి ల్లీలో జరిగిన తొలి ఏషియన్ గేమ్స్లో కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు, దండమూడి రాజగోపాలరావు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించగా.. ఇన్నేళ్ల తరువాత జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించిందన్నారు. ఆమెకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చారు. జ్యోతిసురేఖ వెంట తండ్రి సురేంద్ర, డీఎస్డీవో పి.రామకృష్ణ, కేఎల్యూ డెరైక్టర్ రామకృష్ణ, శాయ్ కోచ్ వినాయకప్రసాద్, సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు అర్జా పాండురంగారావు ఉన్నారు. -
నేడు స్పీకర్ సిరికొండ రాక
జిల్లాలో తొలి పర్యటన ఘనస్వాగతానికి ‘గులాబీ’ల ఏర్పాట్లు చెంచుకాలనీని సందర్శించనున్న మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి బుధవారం జిల్లాకు రానున్నారు. స్పీకర్గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. నూతన రాష్ట్రానికి తొలి స్పీకర్గా ఆయనకు అవకాశం రావడాన్ని జిల్లాకు గర్వకారణంగా భావిస్తున్నారు. పార్టీలకతీతంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని తన నివా సం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 9 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. 10.15 గంట లకు మడికొండకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా సమీపంలోని కీర్తి స్థూపం, అమరవీరుల స్థూపం, కాళోజీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయశంకర్సార్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మకూరు... అక్కడి నుంచి శాయంపేటకు చేరుకుం టారు. అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించి, అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంట లకు తన స్వగ్రామం నర్సక్కపల్లికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పరకాలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం చెంచుకాలనీని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తన సొంత నియోజకవర్గమైన భూపాలపల్లికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి 10.15 గంటలకు హన్మకొండలోని అర్ అండ్ బీ గెస్ట్హౌస్కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. -
వెల్కం గ్రూపు దెబ్బపడింది: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇటీవల ఎవరు కన్పించినా ‘వెల్కం’ గ్రూపు దెబ్బకు బలయ్యామని వాపోతున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘వెల్కం’ గ్రూపును దెబ్బతీయాలంటే తెలంగాణలోనూ తామంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంద న్నారు. దీంతో ఓ విలేకరి ‘‘అన్నా అసలు ‘వెల్కం’ అంటే ఏంది?’’అని అడగడటంతో... ‘‘వెల్కం అంటే వెలమ+ కమ్మ సామాజిక వర్గమే. మా పార్టీలో ఈ రెండు గ్రూపులను మోస్తూ వచ్చాం. ఇప్పుడు మాకే దెబ్బపడింది. మా రాజ్యాధికారం పోయింది’’ అని చెప్పారు. -
మోడీ కోసం.. 7 రేస్ కోర్స్ రోడ్డు సిద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం 7 రేస్ కోర్స్ రోడ్డు కొత్త హంగులు సంతరించుకుంది. ఈ భవనానికి రంగు వేసి, పూలతో అలంకరించారు. భారత 15వ ప్రధాన మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఈ ఇంట్లోకి రానున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మోడీ ఇంట్లోకి రావాలని భావిస్తే ఆయన కోసం 3 నెంబర్ బంగ్లాను సిద్ధంగా ఉంచారు. మోడీ బస చేయడానికి వీలుగా ఈ అతిథి గృహంలో ఏర్పాట్లు చేశారు. రేసు కోర్సు రోడ్డుకు రాష్ట్రపతి భవన్కు కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు అధికార నివాసాన్ని ఖాలీ చేశారు. -
జగన్ ప్రభంజనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరుకు విచ్చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనం పలికారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు రోడ్లపై బారులుదీరి ఘనస్వాగతం పలికారు. రాజన్న బిడ్డను ముఖ్యమంత్రి చేస్తామంటూ ఆశీర్వదించారు. పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు సాగిన రోడ్షోలో వెన్నంటి నడిచారు. కాబోయే సీఎం జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో జగన్మోహన్రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం, చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం అందరినీ ఆకట్టుకుంది.. ఆలోచింపజేసింది. చివరిలో జగన్మోహన్రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాలకు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో విశ్వసనీయతకే మా ఓట్లు అంటూ జనం బదులిచ్చారు. సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా రాపూరుకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన రాపూరుకు వచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి ప్రతిచోటా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతను పలకరించేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులు రోడ్లపై బారులుదీరారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు జగన్ రోడ్షో జనంతో కిక్కిరిసిపోయింది. మిద్దెలు, మేడలపై సైతం జనం కిక్కిరిశారు. సుమారు 50 నిమిషాల పాటు రోడ్షో సాగింది. జగన్మోహన్రెడ్డి ప్రతిచోటా వాహనం నిలిపి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘‘రాబోయే కాలం మనదే, మంచి జరుగుతుంది’’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. మా రాజన్న బిడ్డ మీరు.. ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటామంటూ ఆయనను జనం ఆశీర్వదించారు. ‘కాబోయే సీఎం జగన్’ అనే నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో రాపూరు కిటకిటలాడింది. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం జనంలో ఉత్సాహం నింపింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఫ్రీగా చేస్తానని చెప్పడమేమిటని జగన్ నిలదీయడంతో ఈలలు, కేకలతో జనం స్పందించారు. బాబు తన పాలనలో రైతులు, వృద్ధులను పట్టించుకోలేదని, పేదల ఆరోగ్యం అసలు ఆయనకు పట్టలేదని జగన్ వివరిం చారు. చివరిలో జగన్మోహన్రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాల కు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో విశ్వసనీ యతకే మా ఓట్లు అంటూ జనం పెద్దఎత్తున స్పందించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నిన్ను సీఎంని చేసుకుంటామంటూ ఉత్సాహంగా ఈలలు, కేకలతో తమ అభిప్రాయం తెలిపారు. తాను సీఎం అయిన మరుక్షణమే రైతుల కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకోసం రూ. 2వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధుల పింఛన్ పెంపు, అమ్మఒడి పేరుతో విద్యార్థులను ఉచితంగా చదివించడం తదితర పథకాలపై సంతకాలు చేస్తానని చెప్పారు. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగిన జగన్ పర్యటనకు విశేష స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ గుర్తు.. ఈ విషయం గ్రామాల్లో కొంత మందికి సరిగ్గా తెలియడంలేదు. ప్రతి కార్యకర్త అందరికీ మన గుర్తు ఫ్యాన్ అని చూపించి వివరించాలని జగన్ మోహన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు దీనిని సీరియస్గా తీసుకోవాలన్నారు. మన గుర్తు ఏ గుర్తు అంటూ జగన్ సభకు వచ్చిన జనాన్ని ప్రశ్నించారు. దీంతో అందరూ ఫ్యాన్ అంటూ స్పందించారు. వరప్రసాద్ను గెలిపించండి... తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ మంచి వ్యక్తి అని, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన ఆయన ప్రజలకు మంచి చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్మో హన్రెడ్డి పిలుపునిచ్చారు. ఘనస్వాగతం వైఎస్సార్ జిల్లా నుంచి చిట్వేలు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మేకపాటి గౌతమ్రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, సంజీవయ్య, పాశం సునీల్కుమార్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పాపకన్ను రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: వరప్రసాద్ మహానేత వైఎస్సార్ లాంటి సమర్థుడైన వ్యక్తి సీఎం కావాలంటే జగన్ను గెలిపించుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పిలుపుని చ్చారు. విభజన పుణ్యమాని రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తనను ఎంపీగా, లక్ష్మయ్యనాయుడుని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
దీక్షా ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ విజయమ్మ