wrestler
-
ఒంటికాలితో విజయం సాధించి..
అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా చాలా మంది ఆటలు ఆడటానికి ఆసక్తి చూపరు. కానీ ఒక కాలు లేకపోయినా ఓ యువకుడు కుస్తీ పోటీలో పాల్గొనడమే కాకుండా, విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెవరికీ తీసిపోనని క్రీడాభిమానుల సాక్షిగా నిరూపించాడు. సంకల్ప బలానికి వైకల్యం అడ్డురాదని చాటిచెప్పాడు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దివ్యాంగ మల్లయోధుడు యు. సాయిలు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో బేడీల మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దివ్యాంగ మల్లయోధుడు (Divyang Wrestler) సాయిలు కూడా ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయన రూ.500 కుస్తీ పోటీల్లో ఓ మల్లయోధునితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. దీంతో సాయిలు పోరాటానికి మెచ్చిన ప్రేక్షకులు రూ.3 వేల వరకు విరాళాలు అందజేశారు. వివిధ విభాగాల్లో కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నగదును బహుమానంగా అందజేశారు. కట్టె కాసులు తెచ్చి పెట్టెతెల్లబంగారం (White Gold) సాగులో ఆదిలాబాద్ జిల్లాది ఆసియాలోనే ప్రథమ స్థానమని చెప్పొచ్చు. జిల్లాలో 90 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తితీత అనంతరం మిగిలిన చెట్లను గతంలో ట్రాక్టర్ల సాయంతో పెరికేసి చేలల్లోనే కాల్చేసేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లోని బాయిలర్లలో ఉపయోగించే బ్రికెట్లను ఈ పత్తి కట్టెతో తయారు చేస్తుండటంతో పత్తికట్టె కూడా అన్నదాతకు లాభసాటిగా మారింది. రైతులు పత్తి ఏరివేసిన అనంతరం మిగిలిన పత్తి కట్టెకు వ్యాపారులు ఎకరాకు రూ.300 చెల్లించి.. వారే ట్రాక్టర్ల ద్వారా తొలగించి జిల్లా కేంద్రంలోని ఓ పరిశ్రమకు తరలిస్తున్నారు. అక్కడ క్రష్ చేసి బ్రికెట్స్ను తయారు చేస్తున్నారు. దీంతో పత్తి కట్టె అన్నదాతకు అదనపు లాభంగా మారింది.చి‘వరి’కి పశువుల మేతగా..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రైతుల ఆరుగాలం కష్టం పశువులకు మేతగా మారుతోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు చెందిన రైతు గుగులోతు మహేశ్నాయక్.. అప్పులు చేసి ఆరు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నాలుగు బోర్లు ఎత్తిపోయాయి. మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీటిని విడుదల చేయకపోవడంతో.. సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. సాగునీటి కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చి‘వరి’కి రైతు మహేశ్నాయక్ పంట పొలాన్ని పశువులకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.చదవండి: అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి -
2 వేల కోట్లు వసూలు చేస్తే.. మాకిచ్చింది కోటే..!
-
ట్రెండింగ్లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
పాక్ రెజ్లర్ అలీ అసద్పై నాలుగేళ్ల నిషేధం
కరాచీ: ప్రదర్శన మెరుగయ్యేందుకు నిషేధిత ఉ్రత్పేరకాలు ఉపయోగించిన పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్పై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్లో అలీ అసద్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక బౌట్లో అలీ అసద్ 11–0తో సూరజ్ సింగ్ (న్యూజిలాండ్)పై గెలుపొందాడు.అయితే, 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అలీ అసద్ నిషేధిత ఉ్రత్పేరకాలు వాడినట్లు తేలింది. దాంతో 2022 నవంబర్లో అలీ అసద్పై తాత్కాలిక నిషేధం విధించారు. అలీ అసద్ నెగ్గిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకొని నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ రెజ్లర్ సూరజ్ సింగ్కు ఈ పతకాన్ని అందించారు. ఈ కేసును రెండేళ్లపాటు విచారించిన ఐటీఏ అలీ అసద్ను దోషిగా నిర్ధారిస్తూ ఈ వారంలో అతడిపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. విచారణ సమయంలో అలీ అసద్ గైర్హాజరు కావడంతో ఐటీఏ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. -
రైతుల గోడు కేంద్రం వినాలి
చండీగఢ్: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ గత 200 రోజులుగా ఉద్యమిస్తున్న రైతన్నలకు సంఘీభావం ప్రకటించారు. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద పంజాబ్ రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనోద్యమం శనివారం 200వ రోజుకు చేరిన సందర్భంగా శంభు బోర్డర్తోపాటు ఖనౌరీ బోర్డర్ వద్దకు వచ్చి రైతులతో కలిసి నిరసన స్థలాల వద్ద బైఠాయించి వారికి వినేశ్ ఫొగాట్ మద్దతు పలికారు. రైతు కుటుంబంలో పుట్టిన వినేశ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ మీ కూతురు మీకు బాసటగా ఉంటుందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. డిమాండ్లు ఇంకా నెరవేర్చనందుకే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 200 రోజులుగా ఉద్యమిస్తున్న వీళ్లను చూస్తే బాధేస్తోంది. రెజ్లర్లుగా మేం రైతులకు మావంతుగా ఏమీ చేయలేకపోయామని ఒక్కోసారి అనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మేము ఇక్కడ సొంత కుటుంబం కోసం ఏమీ చేయలేక నిస్సహాయులమయ్యాం. వీళ్ల బాధను ఇప్పటికైనా ప్రభుత్వం వినాలి. రైతన్న అన్నం పెట్టకపోతే మనమెలా బతుకుతాం?. ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోయినా నిస్వార్థంగా రైతులు పంటలు పండించి దేశానికి తిండి పెడుతున్నారు. వాళ్లది పెద్ద మనసు. ప్రభుత్వం కూడా తమది పెద్దమనసు అని చాటిచెప్పాలి. డిమాండ్లను నెరవేర్చాలి. హరియాణాలో రైతులు ఉద్యమిస్తే వారికీ నేను మద్దతు పలుకుతా. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిందే. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రైతుల ఉద్యమం వృథా కాకూడదు’’ అని అన్నారు. హరియాణాలోని ఛర్ఖీ దాద్రీ జిల్లాకు చెందిన మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా ‘‘ నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు. నాకు రాజకీయ అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రాబోను. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు. ఇది రైతుల ఉద్యమస్థలి. ఇక్కడ రైతన్నల సమస్యల గురించే మాట్లాడదాం. చర్చిద్దాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరసనోద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంయుక్తంగా అక్కడే ‘కిసాన్ మహాపంచాయత్’ ఏర్పాటుచేశాయి. -
Sakshi Malik: నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను
కొన్నాళ్ల క్రితం బౌట్లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్నెస్’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది.బౌట్లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్తక్లోని అఖాడాలో రెజ్లింగ్ నేర్చుకోవడం, దాన్ని కెరీర్గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి. వెన్నుచూపని తీరుఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది. పురుషాధిక్య భారత రెజ్లింగ్ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్ తెలిపింది. -
వినేశ్కు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్గా అభివర్ణించారు.‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. -
వినేశ్కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్లో అసమాన పోరాటంతో ఫైనల్కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
మూడు రోజుల తర్వాత... సీఏఎస్ తీర్పు మళ్లీ వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్కు చేరుకుంది. -
శెభాష్ అమన్.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన రెజ్లర్! లేదంటే?
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టాడు.ప్రత్యర్ధి క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను 13-5తో ఓడించిన అమన్.. తొలి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. తద్వారా ఒలిపింక్స్లో భారత తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా అమన్ చరిత్ర సృష్టించాడు.కాంస్యం వెనక కఠోర శ్రమ..అయితే అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సొంతం చేసుకోవడం వెనక కఠోర శ్రమ దాగింది. అమన్ తృటిలో ఆనర్హత వేటును తప్పించుకున్నాడు. అమన్ కాంస్య పతక మ్యాచ్కు ముందు భారత రెజ్లింగ్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమన్ బరువు(57 కేజీలు) ఉండాల్సిన కంటే 4.5 కేజీలు ఆధికంగా ఉండటమే అందుకు కారణం . సెమీస్లో ఓటమి తర్వాత గురువారం(ఆగస్టు 8) నాడు సాయంత్రం 6: 30 గంటలకు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడినందున.. అమన్ విషయంలో మాత్రం భారత మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో కాంస్య పతక పోరుకు ముందు బరువు తూచే సమయానికి అమన్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అమన్ తన బరువు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. గురువారం రాత్రి మొత్తం అమన్ నిద్ర పోలేదు. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కోచ్లు వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ సెహ్రావత్ బరువు తగ్గించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.అమన్ మిషన్ సాగింది ఇలా..తొలుత ఇద్దరు కోచ్లతో గంటన్నర సుదీర్ఘ మ్యాట్ సెషన్తో అమన్ వెయిట్ లాస్ మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యువ రెజ్లర్ ఒక గంట పాటు హాట్ బాత్(వేడి నీళ్ల స్నానం) సెషన్లో పాల్గోన్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటాక జిమ్లో 30 నిమిషాల నాన్స్టాప్ ట్రెడ్మిల్పై సాధన చేశాడు. ఆ తర్వాత అతడికి 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. బ్రేక్ తర్వాత దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్( ఆవిరి స్నానం) చేయించారు.అప్పటికి అతడు 3.6 కిలోలు తగ్గాడు. కానీ అమన్పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్లో పాల్గోన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు అతని బరువు 4.6 కేజీల తగ్గి 56.9 కిలోలకు వచ్చింది. దీంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది. దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అమన్ తన బరువును తగ్గించుకున్నాడు. శుక్రవారం మ్యాచ్ జరిగే ముందు బరువు తూచే సమయానికి అమన్ సరిగ్గా 56.9 కిలోల బరువు ఉన్నాడు. దీంతో మ్యాచ్లో పాల్గోని కాంస్య పతకాన్ని భారత్కు అందించాడు. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా నీవు వారియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నేను అలసిపోయాను!
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది. పారిస్: సెమీస్లో గెలిచి... ఫైనల్కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు. ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది. కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల! ప్రపంచ చాంపియన్íÙప్లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది. క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వినేశ్ ప్రొఫైల్ -
కాంస్యం కోసం అమన్ పోరు
పారిస్: ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్తో అమన్ తలపడతాడు. రెండు ఘనవిజయాలతో... అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు. అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్షిప్లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్లో దరియన్పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు. అన్షు తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది. భారత్ ః పారిస్ ఒలింపిక్స్నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లులక్ష్య సేన్బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్ఆర్చరీ మిక్స్డ్ టీమ్ మహేశ్వరీ చౌహాన్–అనంత్జీత్ సింగ్ షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ అర్జున్ బబూతాషూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్మనూభాకర్ షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.మీరాబాయి చానూవెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీలు ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...పారిస్ ఒలింపిక్స్లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు. -
భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై మూడేళ్ల నిషేధం
-
వినేశ్ ఫోగట్ సంచలన నిర్ణయం... రెజ్లింగ్కు గుడ్ బై
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు వినేష్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడాల్సిన వినేశ్.. ఆధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేశ్కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ క్రమంలోనే తన ఇష్టమైన క్రీడకు వినేశ్ విడ్కోలు పలికింది. "నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించిండి. మీ కల, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్(2001-2024) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఎక్స్లో వినేశ్ రాసుకొచ్చింది.కాగా ఈ విశ్వక్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ పై 140 కోట్ల భారతీయలు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగాట్తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు విభాగం (50కేజీ) కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేశ్పై అనర్హత వేటు పడింది.కాగా ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్భిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।अलविदा कुश्ती 2001-2024 🙏आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024 -
Paris Olympics: రెజ్లింగ్లో భారత్కు పతకం ఖాయం
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు నాలుగో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ ఖాతాలో చేరేది స్వర్ణమా, రజతమా అనేది నేడు రాత్రి తేలనుంది. ఈరోజు రాత్రి 11 తర్వాత అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాంట్తో జరిగే ఫైనల్లో వినేశ్ విజయం సాధిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా ఆమె గుర్తింపు పొందుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తమ ‘పట్టు’ను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఒలింపిక్స్లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్కు పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన 50 కేజీల ఈవెంట్లో వినేశ్ వరుసగా మూడు బౌట్లలో విజయం సాధించి స్వర్ణ–రజత పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో వినేశ్ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్పై గెలిచింది. మూడు నిమిషాల నిడివి గల తొలి భాగం ముగిసేసరికి వినేశ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలోనూ వినేశ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన వినేశ్ ఈ భాగంలో నాలుగు పాయింట్లు స్కోరు చేసింది. వినేశ్ డిఫెన్స్ను ఛేదించలేక క్యూబా రెజ్లర్ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది.యూరోపియన్ మాజీ విజేతను ఓడించి... క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–5 పాయింట్ల తేడాతో 2018 ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత, 2019 యూరోపియన్ చాంపియన్ ఒక్సానా లివాచ్ (ఉక్రెయిన్)ను ఓడించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో వినేశ్ ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉక్రెయిన్ రెజ్లర్ కోలుకొని స్కోరును సమం చేసింది. అయితే చివర్లో వినేశ్ దూకుడుగా వ్యవహరించి రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ను మట్టికరిపించి... అంతకుముందు తొలి రౌండ్లో వినేశ్ పెను సంచలనం సృష్టించింది. 50 కేజీల విభాగంలో ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్ సుసాకి యుయి (జపాన్)పై 3–2తో గెలిచి రెజ్లింగ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 25 ఏళ్ల సుసాకి ఈ బౌట్కు ముందు తన అంతర్జాతీయ కెరీర్లో ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు. తాను పోటీపడిన 82 బౌట్లలోనూ సుసాకి విజేతగా నిలిచింది.టోక్యో ఒలింపిక్స్లో సుసాకి తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. వినేశ్తో పోరులో సుసాకి ఫేవరెట్ అని అందరూ భావించారు. బౌట్ కూడా అలాగే సాగింది. ఐదు నిమిషాల 49 సెకన్లు ముగిసే వరకు సుసాకి 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచింది. ఈ దశలోనే వినేశ్ అద్భుతం చేసింది. అందివచి్చన అవకాశాన్ని వదలకుండా ఒక్కసారిగా సుసాకిని కిందపడేసి మూడు పాయింట్లు సాధించి అనూహ్య విజయాన్ని అందుకుంది.సాక్షి తర్వాత వినేశ్... 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్కు పతకాలు లభిస్తున్నాయి. 2008 బీజింగ్లో సుశీల్ కుమార్ (66 కేజీలు) కాంస్యం గెలిచాడు. 2012 లండన్లో సుశీల్ కుమార్ (66 కేజీలు) రజత పతకం నెగ్గగా... యోగేశ్వర్ దత్ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ (58 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో బజరంగ్ (65 కేజీలు) కాంస్యం... రవి కుమార్ (57 కేజీలు) రజతం గెల్చుకున్నారు. సాక్షి మలిక్ తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా రెజ్లర్గా వినేశ్ గుర్తింపు పొందనుంది. ‘పట్టు’ వీడని పోరాటంఅసాధారణం వినేశ్ ఫొగాట్ ఒలింపిక్ పతక ప్రస్థానం ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశి్నంచడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది. కెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్పై సంచలనాలు సృష్టించిన వినేశ్పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్భూషణ్ శరణ్పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయతి్నస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచి్చంది. రెజ్లింగ్లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్ను వినేశ్ అధిగమించింది. 2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్తో బౌట్లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది. కొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. ‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తఖ్దీర్ సే పహ్లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్లో కొత్త చరిత్ర సృష్టించింది. – సాక్షి క్రీడా విభాగం -
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్పాత్పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్షిప్లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్షిప్లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్తో ఆమె ఈ మ్యాచ్లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్పై వినేశ్ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్లో ఉన్న ఆమె టాప్ సీడ్గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్కి ఇచ్చిన యూనిఫామ్ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
స్టార్ రెజ్లర్ బజరంగ్పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో.. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్కు ఫిజికల్ ట్రైనర్గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
వినేశ్పైనే దృష్టి
బిషె్కక్ (కిర్గిస్తాన్): భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు సమాయత్తమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వినేశ్ బరిలోకి దిగనుంది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు అయినప్పటికీ ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి అంతిమ్ పంఘాల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. దాంతో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి వినేశ్ పోరాడింది. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలో పాల్గొని రాహుల్ కుస్తీ (ఫొటోలు)
-
వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్రత్న... అర్జున’ వెనక్కి
న్యూఢిల్లీ: ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ వర్గమే గెలిచింది. ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేసింది. -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్భూషణ్ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్బై ‘బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్కు గుడ్బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్భూషణ్ క్యాంప్లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ -
రవి దహియాకు షాక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ రవి దహియా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్లో రజతం, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరుసగా మూడేళ్లు ఆసియా చాంపియన్గా నిలిచిన రవి దహియా (57 కేజీలు) ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో ఆతీశ్ తోడ్కర్ (మహారాష్ట్ర) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే ఈ విభాగంలో అమన్ సెహ్రావత్ విజేతగా నిలిచి ఆసియా క్రీడల బెర్త్ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల్లో దీపక్ పూనియా (86 కేజీలు), విక్కీ (97 కేజీలు), యశ్ (74 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు), విశాల్ కాళీరామన్ (65 కేజీలు) విజేతలుగా నిలిచారు. 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియాకు నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం కల్పించడంతో విశాల్ ‘స్టాండ్బై’గా ఉంటాడు. -
రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా?
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకరంగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరాటానికి మైనర్ రెజ్లర్ తండ్రి రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు, అది తప్పుడు ఫిర్యాదని ఆ మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలపడంతో ఒక్కాసారిగా అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం మీరు ఇలా ఎందుకు మాట మారుస్తున్నారని విలేకరులు ఆయనను అడగగా.. ‘ఈ నిజం న్యాయస్థానం ద్వారా బయటకు రావడం కంటే ఇప్పుడు ఈ రకంగా బయటకు రావడమే మేలు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై వివరణగా.. 2022లో అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే కేవలం ఒక మ్యాచ్లో ఓటమికి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. మీకు అది ఒక్క పోటీనే కావచ్చని, కానీ అది తన కూతురుకు ఏడాది శ్రమకు ఫలితమని చెప్పారు. అంతేకాకుండా తన కూతురు ఓడిపోయిన అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారని, అందుకు ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’ -
బ్రిజ్భూషణ్ను విచారించిన పోలీసులు..
న్యూఢిల్లీ: పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పది మందితో ప్రత్యేక పరిశోధన బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో నలుగురు మహిళా పోలీసు అధికారిణులు కూడా ఉన్నారు. గత నెలలో బ్రిజ్భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఇటీవల బ్రిజ్భూషణ్కు నోటీసులు జారీ చేయగా... గురువారం ఆయన హాజరయ్యారని... ‘సిట్’ మూడు గంటలపాటు ఆయనను ప్రశ్నించదన ఢిల్లీ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారని బ్రిజ్భూషణ్ సమాధానం ఇచ్చినట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటికే 30 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి మున్ముందు కూడా బ్రిజ్భూషణ్ను విచారణ కోసం పిలుస్తామన్నారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాలకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు ఆ పోలీసు అధికారి వివరించారు. ఇప్పటికైతే మేజిస్ట్రేట్ ఎదుట మైనర్ రెజ్లర్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని... త్వరలోనే మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల స్టేట్మెంట్ను కూడా మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం ‘సిట్’ ఏర్పాటు చేశామని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ హర్జీత్సింగ్ జస్పాల్కు శుక్రవారం ఢిల్లీ పోలీసులు నివేదిక సమరి్పంచగా.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. చదవండి: ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు -
రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..
జంతర్మంతర్ వద్ద భారత రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన రైతు సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున వారి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద నాటకీయ పరిణామాం చోటు చేసుకుంది. నిజానికి రైతులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిసి ముందస్తుగా భారీగా పోలీసుల మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు కూడా. ఐతే సోమవారం రైతులు, పోలీసులు మధ్య ముఖాముఖి చర్చలనంతరం వారి ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున తరలివంచిన రైతు సముహాలు జంతర్మంతర్ ఎంట్రీ వద్ద ఉన్న బారీకేడ్లను తోసుకుంటూ ఒకేసారి సమూహాంగా ప్రవేశించారు. దీంతో అక్కడ ఉన్న బారికేడ్లు పడిపోయాయి. అందువల్ల రైతులు కొందరూ వాటిపైకి ఎక్కి వెళ్లడం, మరికొందరూ కింద నుంచి వెళ్లడం వంటివి చేశారు. అంతేగాదు పోలీసుల బృందం వారి ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు బారికేడ్లను పక్కకు తొలగించినట్లు ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రజలను నకిలీ వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భద్రత నిర్ధారిచడానికి డీఎఫ్ఎండీ ద్వారా ప్రవేశాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని, చట్టానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం నిరసన వేదిక ముందు పెద్ద సంఖ్యలో రైతులు కూర్చున్నారు. ఇదిలా ఉండగా..వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..తమ నిరసనను ఎవరూ భగ్నం చేయలేరని నొక్కి చెప్పారు. మే 21లోగా బ్రిజ్ భూషణ్ని అరెస్టు చేయకుంటే తమ నిరసనను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్లతో సహా దేశంలో అగ్రశ్రేణి రెజ్లర్లంతా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జంతర్మంతర్ వద్ద పక్షం రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన చేసిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాల సదరు రెజ్లర్లకు తమ మద్దతను ప్రకటించి, వారి నిరసనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. #WATCH | Farmers break through police barricades as they join protesting wrestlers at Jantar Mantar, Delhi The wrestlers are demanding action against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over allegations of sexual harassment. pic.twitter.com/k4d0FRANws — ANI (@ANI) May 8, 2023 (చదవండి: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ను 21లోగా అరెస్ట్ చేయాలి) -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
రా RAW రాజు
‘కాలం కలిసి రావాలి’ అంటూ కాలాన్ని మాత్రమే నమ్ముకునే వారు ఒక రకం.‘కాలం కలిసి రావాలి అంటే కష్ట పడాలి’ అనుకునే వారు రెండో రకం. ‘రైతుబిడ్డ’ విక్రమ్సింగ్ రెండో రకానికి చెందిన కుర్రాడు.తన నాయకత్వ లక్షణాలతో ‘ఆఫ్బిజినెస్’కు కొత్త వెలుగు తీసుకువచ్చాడు... హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలోని మల్రా గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన విక్రమ్సింగ్ ఖరీదైన స్కూళ్లలో ఎప్పుడూ చదువుకోలేదు. ఆరవతరగతిలో మాత్రమే ఇంగ్లీష్ చదువుకునే అవకాశం వచ్చింది. స్కూల్ పూర్తయిన తరువాత పొలానికి వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు.‘ఏ పనైనా ఇష్టంగా చేయాలి. నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నువ్వు కూడా చదువును ఇష్టంగా చదువుకోవాలి. చదువుకోవడం నా వల్ల కాదు అనిపిస్తే నాతో పా టు పనిచెయ్యి’ అనే వాడు నాన్న. మరోవైపు స్నేహితులు...‘నువ్వు రెజ్లర్ కాకపో తే జీవితంలో ఏది సాధించలేవు’ అనేవారు. ఆప్రాం తంలో రెజ్లింగ్ బాగా పాపులర్. ప్రైజ్మనీ కూడా భారీగా ఉండేది. స్నేహితుల మాటలతో రెజ్లర్ కావాలనే ఆశ విక్రమ్లో మొలకెత్తింది. ఎక్కడ రెజ్లింగ్ పొటీలు జరిగినా వెళ్లేవాడు. ఇది గమనించిన టీచర్ ‘నువ్వు చదువులో ముందున్నావు. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఇలా రెజ్లింగ్ అంటూ ఊళ్లు తిరిగితే చదువు దెబ్బతింటుంది’ అని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి తన మనసులో నుంచి ‘రెజ్లింగ్’ను డిలిట్ చేశాడు విక్రమ్.ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత దిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆ తరువాత కామర్స్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘ఆఫ్బిజినెస్’లో చేరాడు. మూడు సంవత్సరాల తరువాత విక్రమ్ దశ తిరిగింది. ‘ఆఫ్బిజినెస్’కు ఉన్న మూడు యూనిట్లలో ఒకటైన ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సరిౖయెన వ్యక్తుల కోసం కంపెనీ పెద్దలు చూస్తున్న సమయంలో వారికి విక్రమ్ పేరు తట్టింది. అలా విక్రమ్ ‘రా మెటీరియల్ బిజినెస్ యూనిట్’కు హెడ్ అయ్యాడు. ‘రా మెటీరియల్స్ ఎట్ లోయెస్ట్ ప్రైసెస్–గ్యారెంటీడ్’ అనే మాటలో మాంత్రికశక్తి లేకపో వచ్చు. అయితే దీన్ని కస్టమర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో విక్రమ్ విజయం సాధించాడు. ఫ్రెషర్స్తో తనదైన ఒక టీమ్ను ఏర్పాటు చేసుకోని, అడుగులో అడుగు వేస్తూ మెల్లగా నడుస్తున్న యూనిట్ను పరుగెత్తేలా చేశాడు. కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ‘విక్రమ్లో నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మా నమ్మకాన్ని నిలబెట్టాడు’ అంటున్నాడు ‘ఆఫ్బిజినెస్’ సీయీవో ఆశీష్ మహాపా త్రో. ‘అదృష్టం కష్టం వైపు మొగ్గు చూపుతుంది అంటారు. నేను కష్టాన్నే నమ్ముకున్నాను. రైట్ ప్లేస్లో రైట్పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటున్న 29 సంవత్సరాల విక్రమ్సింగ్ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత
మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ(WWE), ఏఈడబ్ల్యూ(AEW) స్టార్ జైసిన్ స్ట్రిఫే(37) కన్నుమూశాడు. కొంతకాలంగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జైసిన్ స్ట్రిఫే గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు అతని సోదరుడు ప్రకటించాడు. జైసిన్కు ఏ రకమైన వ్యాధి సోకిందనేది వైద్యులు కూడా నిర్థారించేలేకపోయారని.. వైరస్ రూపంలో రోజు రోజుకు శరీరాన్ని తినేస్తూ బలహీనంగా తయారు చేసేదని.. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడడంతోనే మృతి చెందినట్లు పేర్కొన్నాడు. ఇక 2004లో ప్రొఫెషనల్ రెజ్లింగ్లో అడుగుపెట్టిన జైసిన్ డబ్ల్యూడబ్ల్యూఈ, ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW)లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010లో మాగ్నమ్ ప్రో రెజ్లింగ్కు ప్రమోటర్గా పనిచేశాడు. ఇక జైసన్ చివరిసారి గతేడాది నవంబర్లో ఆల్ ఎలైట్ రెజ్లింగ్లో పవర్హౌస్ హాబ్స్తో ఆడాడు. -
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఇంట తీవ్ర విషాదం
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం.. హాల్ ఆఫ్ ఫేమ్ కెవిన్ నాష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కెవిన్ నాష్ కుమారుడు 26 ఏళ్ల ట్రిస్టన్ నాష్ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ఈ విషయాన్ని రెజ్లింగ్ రిపోర్డర్ సీన్ రోస్ సాప్ వెల్లడించాడు. కాగా ట్రిస్టన్ నాష్ మృతి వెనుక కారణాలను రివీల్ చేయడానికి అతని కుటుంబసభ్యులు ఇష్టపడలేదని రోస్ సాప్ ట్వీట్ చేశాడు. ''కెవిన్ నాష్, తమరా నాష్ల తనయుడు ట్రిస్టన్ నాష్ 26 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం బాధాకరం. తన తండ్రితో కలిసి ఇటీవలే పాడ్కాస్ట్ ఆరంభించిన ట్రిస్టన్ సరదాగా ఎంజాయ్ చేస్తున్న టైమ్లో ఇలా జరగడం దురదృష్టకరం. కుటుంబసభ్యుల వినతి మేరకు ట్రిస్టన్ మరణంపై ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా ట్రిస్టన్ ఆత్మకు శాంతి చేకూరాలిన భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అంటూ తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్.. మిక్ ఫోలీ(డిక్సీ కార్టర్) స్పందిస్తూ.. నా ప్రియమైన మిత్రుడు కెవిన్ నాష్ గుండె పగిలే వార్త నన్ను ఇబ్బంది పడుతుంది. ట్రిస్టన్ నాష్ ఇంత చిన్న వయసులో మనల్ని విడిచిపెట్టి వెళ్లడం దురదృష్టకరం. కెవిన్ నాష్ సహా అతని కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానభూతి అంటూ ఎమెషనల్ అయ్యాడు. ఇక కెవిన్ నాష్ 1990లో అప్పటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్(ఇప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ)లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్ను ప్రారంభించాడు. 2020లో రెజ్లింగ్కు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. డీజిల్(Diesel), బిగ్ డాడీ కూల్(Big Daddy Cool) పేర్లతో పాపులర్ అయిన కెవిన్ నాష్ తన కెరీర్లో చీటింగ్ చేసి ఎక్కువ విజయాలు సాధించడం గమనార్హం. ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్, ఇంటర్కాంటినెంటల్ చాంపియన్షిప్ ఒకసారి, రెండుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్టీమ్ చాంపియన్గా నిలిచాడు. 2015లో వ్యక్తిగతంగా డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్గా నిలిచన కెవిన్ నాష్.. 2020లో మరోసారి న్యూ వరల్డ్ ఆర్డర్(NWO) తరపున రెండోసారి హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టివ్లో చోటు దక్కించుకున్నాడు. Oh @RealKevinNash & Tamara...I am absolutely brokenhearted to hear about the passing of Tristen. Kevin was so proud of him & I always loved hearing him share stories about his love for his beautiful son. My thoughts, prayers & love to you both during this heart-wrenching time 💔 — Dixie Carter (@TNADixie) October 21, 2022 చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ.. జర్నలిస్ట్ కన్నీటి పర్యంతం -
'ది గ్రేట్ ఖలీ' ఏందయ్యా ఇదీ.. టోల్గేట్ సిబ్బందితోనా..!
చండీగఢ్: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్ దలీప్ సింగ్ రాణా మరోమారు వార్తల్లో నిలిచారు. పంజాబ్, లుధియానాలోని ఓ టోల్గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టోల్ కార్మికుడిపై ఖలీ చేయి చేసుకున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపించారు. టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఖలీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే.. ఆ వీడియోలో టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు.. లాధోవాల్ టోల్ ప్లాజా సిబ్బంది తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు దలిప్ సింగ్ రాణా. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. పంజాబ్లోని జలంధర్ నుంచి హరియాణాలోని కర్నాల్కు ఖలీ తన కారులో వెళ్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద ఈ సంఘటన ఎదురైనట్లు చెప్పారు. ధ్రువీకరణ పత్రం అడిగిన తమ సిబ్బందిని ఎందుకు కొట్టారని ఖలీని టోల్ సిబ్బంది అడుగుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. 'మిమ్మల్ని ఐడీకార్డు చూపించాలని అడిగారు. ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది అడగగా.. మీరు నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు ఖలీ. దానికి 'మిమ్మల్ని మేము బ్లాక్మెయిల్ చేయటం లేదు.. అతడిని ఎందుకు కొట్టారు? మీ దగ్గర ఉంటే ఐడీ చూపించండి' అని టోల్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే.. తన వద్ద ఎలాంటి ఐడీ కార్డు లేదని ఖలీ వారితో చెప్పారు. WWE wrestler #GreatKhali clashes with toll plaza staff at #Ludhiana#TheGreatKhali #ViralVideo #Punjab #Khali #ludhiana #WWE pic.twitter.com/XYJEhsdVtL — Vineet Sharma (@Vineetsharma906) July 12, 2022 ది గ్రేట్ ఖలీ వాహనం టోల్గేట్ దాటి వెళ్లకుండా ముందు బారికేడ్ పెట్టారు అక్కడి సిబ్బంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఖలీ దానిని తీసి పక్కన పడేశారు. టోల్ సిబ్బంది ఖలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇరువురు తమ వాదనలు పోలీసులకు వినిపించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన క్రమంలో వివరణ ఇచ్చారు ఖలీ. 'నిన్న పంజాబ్లోని లాధోవాల్ టోల్ప్లాజా వద్ద సిబ్బంది నా కారును అడ్డుకుని సెల్ఫీ కోసం నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అందుకు అంగీకరించకపోవటం వల్ల జాతివిద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని బూతులు మాట్లాడారు.' అని ఖలీ చెప్పారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్షిప్ ప్రైజ్మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్ను హైదరాబాద్కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్షిప్లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
యువ రెజ్లర్ పూర్ణిమకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్, సబ్ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్కు చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి పూర్ణిమకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్-నాచారం) యాజమాన్యం ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేయనుంది. 16 ఏళ్ల పూర్ణిమకు ప్రతి నెల రూ.10 వేలు ఏడాదిపాటు డీపీఎస్-నాచారం అందజేస్తుంది. ఈ మేరకు నాచారంలోని డీపీఎస్లో జరిగిన కార్యక్రమంలో పూర్ణిమకు రూ. 10 వేల చెక్ను డీపీఎస్ ప్రతినిధి మల్కా యశస్వి అందించారు. గత ఏడాది బళ్లారిలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ క్యాడెట్ చాంపియన్షిప్లో పూర్ణిమ 61 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, రెజ్లింగ్ కోచ్ నర్సింగ్ ముదిరాజ్, పూర్ణిమ తండ్రి జుమ్మి, రెజ్లర్లు మెట్టు శివ, మోహన్ గాంధీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియో: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ
రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్లోని రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో చోటుచేసుకుంది. షహీద్ గణ్పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్ -15 ఈవెంట్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్ మీదకు వెళ్లి ఎంపీ సింగ్ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్ ప్రస్తుతం లోక్సభలో ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. BJP सांसद व भारतीय कुश्ती संघ के अध्यक्ष बृजभूषण शरण सिंह ने रांची में अंडर-15 नेशनल कुश्ती चैंपियनशिप के दौरान मंच पर एक युवा पहलवान को थप्पड़ जड़ दिया। वीडियो वायरल… pic.twitter.com/Tlm6LpXSHG — Ashraf Hussain (@AshrafFem) December 17, 2021 -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్పాత్పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Nisha Dahiya Refuses Her Death Reports.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత, జాతీయ స్థాయి మహిళ రెజ్లర్.. నిషా దహియా చనిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. హర్యానాలోని సోనిపట్లోని సుశీల్ కుమార్ అకాడమీలో జరిగిన కాల్పుల్లో నిషా దహియా, అతని సోదరుడుడ చనిపోయిందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నిషా దహియా స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించింది. '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్ న్యూస్.. ఆ వార్త నమ్మకండి'' అంటూ కామెంట్ చేసింది. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘రౌడీ’.. లాకియాగా పేరు
Ronda Rousey Blessed With Baby Girl: అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్(యూఎఫ్సీ) మాజీ చాంపియన్, ఒలింపిక్ పతక విజేత రోండా రౌసే తల్లయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రౌసే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాపకు లాకియా మకాలపుఓకలానిపో బ్రౌనీగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. కాగా అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన రోండా రౌసే.. యూఎఫ్సీ చాంపియన్గా నిలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్లలోనూ పాల్గొన్న ఆమెను అభిమానులు ముద్దుగా ‘రౌడీ’(దివంగత కెనడియన్ రెజ్లర్ రాడీ పైపర్ పేరు మీదుగా) అని పిలుచుకుంటారు. కాగా రోండా 2017లో ట్రవీస్ బ్రౌనీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఇక రెజ్లర్గా రాణిస్తున్న రోండా.. అమెరికన్ టీవీ తెరపై నటిగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చదవండి: MS Dhoni: ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్.. హెడ్కోచ్గా.. లేదంటే! View this post on Instagram A post shared by Ronda Rousey (@rondarousey) -
సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు
John Cena Pays Tribute To Sidharth Shukla : నటుడు, బిగ్బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బీటౌన్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కి గురయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై నెటిజన్లు సహా బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ వ్రిస్ట్లర్ జాన్ సెనా సిద్ధార్థ్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : Sidharth Shukla : సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం.. అదే కారణమా? డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలో అయ్యేవారికి జాన్సేనా ఎవరో తెలిసే ఉంటుంది. అంతేకాకుండా 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ నిలవడమే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి జాన్సెనా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇటీవలె తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సిద్ధార్థ్ శుక్లా ఫోటో షేర్చేసి సంతాపం తెలిపాడు. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా ఆర్య వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆ ఫోటోని లైక్ చేశారు. ప్రస్తుతం జాన్సెనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హాలీవుడ్ నటుడు సిద్ధార్థ్కు సంతాపం వ్యక్తం చేయడంపై అతని అభిమానులు జాన్సెనాపై ప్రశంసలు కురిపించారు. ఈ పోస్ట్కు సిద్ధార్థ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్ల వర్షం కురుస్తుంది. తమ అభిమాన నటుడికి శాశ్వతంగా గుడ్ బై చెబుతూ పలువురు నెటిజన్లు సంతాపం తెలిపారు. చదవండి : సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్ View this post on Instagram A post shared by John Cena (@johncena) -
నా మనసు విరిగిపోయింది.. ఇక: వినేశ్ ఫొగాట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకావకాశం ఉన్న రెజ్లర్గా బరిలోకి దిగి విఫలం కావడంతో పాటు క్రమశిక్షణ తప్పిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మౌనం వీడింది. తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించడంతోపాటు ఒలింపిక్స్ ముందు, పోటీలు జరిగే సమయంలో తాను మానసికంగా ఎంత వేదన అనుభవించిందో వెల్లడించింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వినేశ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్పై అవగాహనలేని, షూటింగ్తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్కు గురయ్యానని వెల్లడించింది. ‘నేను మానసికంగా సన్నద్ధంగా లేను కాబట్టి పోటీ పడలేను అని అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ చెబితే నిజమే కదా అంటూ మనోళ్లూ సానుభూతి పలుకుతారు. బరిలోకి దిగకపోవడం సంగతి తర్వాత, నేను మానసికంగా సన్నద్ధంగా లేనని ఒక్కసారి చెప్పి చూడండి. ఏం జరుగుతుందో’ అని వినేశ్ గుర్తు చేసింది. తన ఓటమి గురించి కనీసం తాను కూడా బాధపడే అవకాశం ఇవ్వకుండా అంతా కత్తులతో సిద్ధమయ్యారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘స్వర్ణం గెలిచే అవకాశం ఉన్నవారిలో నన్నూ చేర్చండి అని నేను అడిగానా? ఓడితే అందరికంటే ఎక్కువగా బాధ పడేది నేనే కదా. నేను మళ్లీ రెజ్లింగ్లోకి ఎప్పుడు అడుగు పెడతానో, అసలు ఆడతానో కూడా తెలీదు. 2016 ‘రియో’లో కాలు విరిగినప్పుడే బాగుంది. కనీసం దేనికి చికిత్స చేయాలో తెలిసింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగి పోయింది’ అని ఆమె బాధను ప్రదర్శించింది. నోటీసుకు స్పందించాల్సిందే! వినేశ్పై చర్య తీసుకునే విషయంలో ఆమెకు పంపిన నోటీసు విషయంలో స్పందన కోసం ఎదురు చూస్తున్నామని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. ‘వినేశ్ నుంచి మాకు ఇంకా సమాధానం రాలేదు. ఆమె తన సమస్య గురించి ఏం రాసుకుందనేది మాకు అనవసరం. నోటీసు ఇచ్చిన మరో రెజ్లర్ సోనమ్ స్పందించింది. క్షమాపణ కోరిన ఆమె ఇకపై తప్పు చేయనని హామీ ఇచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: మేయర్ అత్యుత్సాహం.. పంటి గాట్లతో గోల్డ్ మెడల్ రీప్లేస్ -
Bajrang Punia: తొలి ప్రయత్నంలోనే పథకం సాధిస్తాడా..?
ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో మూడు పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్... ఆసియా చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... అంతర్జాతీయ టోర్నీ లలో క్రమం తప్పకుండా పసిడి, రజత పతకాలు... అయితేనేం ఒలింపిక్స్లాంటి అత్యున్నత క్రీడా వేదికపై తొలిసారి ఆడుతున్న బజరంగ్ అసలు సిసలు సత్తా చాటాల్సిన చోట తడబడ్డాడు. తొలి రౌండ్లో అంతగా అంతర్జాతీయ అనుభవంలేని కిర్గిజిస్తాన్ రెజ్లర్పై అతికష్టమ్మీద నెగ్గిన అతను, క్వార్టర్ ఫైనల్లో ఇరాన్ ప్రత్యర్థిని ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించినా... కీలకమైన సెమీఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో స్వర్ణ–రజత పతకాలపై ఆశలు వదులుకొని ఇక కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. టోక్యో: తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించేందుకు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో 27 ఏళ్ల బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. దాంతో నేడు జరిగే కాంస్య పతక పోరులో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)–ఆడమా దియాతా (సెనెగల్) మధ్య ‘రెపిచేజ్’ బౌట్ విజేతతో బజరంగ్ తలపడనున్నాడు. అనుభవం, గత రికార్డుల దృష్ట్యా రెపిచేజ్ బౌట్లో నియాజ్బెకోవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నియాజ్బెకోవ్తో బజరంగ్ ఆడాల్సి వస్తే మాత్రం భారత రెజ్లర్ గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. 32 ఏళ్ల నియాజ్బెకోవ్ మూడుసార్లు ఆసియా చాంపియన్గా నిలువడంతోపాటు 2019 ప్రపంచ చాంపియన్షిప్ సెమీఫైనల్లో బజరంగ్ను ఓడించాడు. వివిధ వయో కేటగిరీల్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన హాజీ అలియేవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 5–12 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. బజరంగ్ లోపాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు అలియేవ్ ఆడాడు. బజరంగ్ లెగ్ డిఫెన్స్లో బలహీనంగా ఉండటంతో అలియేవ్ భారత రెజ్లర్ కాళ్లను ఒడిసి పట్టుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తొలి భాగంలో 2, 2 పాయింట్లు స్కోరు చేసిన అలియేవ్ ఒక పాయింట్ కోల్పోయాడు. రెండో భాగంలోనూ అలియేవ్ దూకుడు కొనసాగించగా... బజరంగ్ కూడా కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండుసార్లు సఫలమై 2, 2 పాయింట్లు సాధించాడు. అయితే అలియేవ్ ఒత్తిడికి లోనుకాకుండా బజరంగ్ రెండు కాళ్లను పట్టేసి రెండుసార్లు తిప్పేసి 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత 1, 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 11–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో బజరంగ్ రిఫరీ నిర్ణ యాన్ని చాలెంజ్ చేసి దానిని కోల్పోవడం తో అలియేవ్ ఖాతాలో మరో పాయింట్ చేరింది. అంతకుముందు తొలి రౌండ్లో బజరంగ్ 3–3తో ఎర్నాజర్ అక్మతలియేవ్ (కిర్గిజిస్తాన్)పై గెలుపొందాడు. తొలి భాగంలో బజరంగ్ 1, 2 పాయింట్లు సాధించి, మరో పాయింట్ చేజార్చుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో భాగంలో ఎర్నాజర్ వరుసగా 1, 1 పాయింట్లు సాధించి స్కోరును 3–3తో సమం చేశాడు. బౌట్ ముగిశాక ఇద్దరూ సమఉజ్జీగా నిలిచినా నిబంధనల ప్రకారం బజరంగ్ ఒకే ఎత్తులో హై స్కోరింగ్ (2) పాయింట్లు సాధించ డంతో అతనిని విజేతగా ప్రకటించారు. ‘బై ఫాల్’తో విక్టరీ... ఇరాన్ రెజ్లర్ మొర్తజా ఘియాసి చెకాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 4 నిమిషాల 56 సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో గెలిచాడు. తొలి భాగం ముగిశాక 0–1తో వెనుకబడ్డ బజరంగ్ రెండో భాగం ఆరంభంలో 2 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఇరాన్ ప్రత్యర్థిని కింద పడేసి అతని భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్కు తగిలించాడు. దాంతో నిబంధనల ప్రకారం బజరంగ్ను రిఫరీ విజేతగా ప్రకటించారు. సీమా తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో నిలిచిన చివరి రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సారా హమ్దీ (ట్యునీషియా)తో జరిగిన తొలి రౌండ్లో సీమా 1–3తో ఓటమి పాలైంది. ఆ తర్వాత సారా హమ్దీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో సీమాకు రెపిచేజ్ పద్ధతిలో కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం కూడా చేజారింది. -
బజరంగ్పైనే ఆశలు
రెజ్లింగ్లో మిగిలి ఉన్న ఇద్దరు భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా, సీమా బిస్లా శుక్రవారం బరిలోకి దిగనున్నారు. బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో... సీమా బిస్లా మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఈ ఇద్దరిలో బజరంగ్పైనే భారత్కు భారీ అంచనాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న బజరంగ్కు ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఒలింపిక్స్లాంటి అత్యున్నత వేదికపై అందరూ పతకం గెలవడానికి వస్తారు కాబట్టి ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందనడంలో సందేహం లేదు. తొలి రౌండ్లో కిర్గిజిస్తాన్ రెజ్లర్ ఎర్నాజర్ అక్మతలియెవ్తో బజరంగ్ ఆడతాడు. ఈ బౌట్లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్ ఇరాన్ రెజ్లర్ మొర్తెజా ఘియాసితో బజరంగ్ ఆడే చాన్స్ ఉంది. ఈ బౌట్లోనూ గెలిస్తే బజరంగ్కు సెమీఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హాజీ అలియెవ్ (అజర్బైజాన్) లేదా దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్) లేదా వాల్డెస్ తొబియర్ (క్యూబా) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రస్తుత ప్రపంచ చాంపియన్ రషిదోవ్ (రష్యా), ప్రపంచ మాజీ చాంపియన్ టకుటో ఒటోగురు (జపాన్) ఫైనల్కు చేరుకోవచ్చు. భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో సీమా ట్యునిషియా రెజ్లర్ సారా హమ్దీపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా స్టాడ్నిక్ (అజర్బైజాన్) ఎదురుకావడం ఖాయమనిపిస్తోంది. సీమా సంచలనం సృష్టించి సెమీఫైనల్ చేరితే యు సుసాకి (జపాన్) లేదా వాలెంటినా (కజకిస్తాన్)లలో ఒక్కరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. బజరంగ్ తొలి రౌండ్: ఉదయం గం. 8:49 నుంచి; క్వార్టర్ ఫైనల్ (అర్హత సాధిస్తే): ఉదయం గం. 9:17 నుంచి; సెమీఫైనల్ (అర్హత సాధిస్తే): మధ్యాహ్నం గం. 2:55 నుంచి -
రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
రెజ్లర్ కాళి ఇంట విషాదం
ఛండీగఢ్: వరల్డ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘డబ్ల్యూడబ్ల్యూఈ’లో ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజుల్లోనే ఇంటర్నేషనల్ ఫేమ్ దక్కించుకున్నాడు రెజ్లర్ కాళి. ఆ తర్వాత కరోనా, తన కాంట్రాక్ట్ రెన్యువల్ కాకపోవడంతో రింగ్కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట విషాదం నెలకొంది. దలీప్ సింగ్ రాణా అలియాస్ కాళి తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దలీప్ సింగ్ తల్లి తండీదేవి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్మౌర్ జిల్లా ధిరానియా గ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం ఉపయోగించుకుని.. ది గ్రేట్ కాళి పేరుతో రెజ్లింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాడు. తక్కువ టైంలోనే అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు పంజాబ్ పోలీసాఫీసర్గా పనిచేస్తూనే.. మరోవైపు రెజ్లింగ్ కెరీర్ కొనసాగించాడు. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం అందుకున్నాడు ది గ్రేట్ కాళి. చదవండి: చిల్లర కామెంట్లు.. ఫ్యాన్స్పై కాళి గుస్సా -
రెజ్లర్ సుమిత్పై రూ. 16 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: భారత హెవీవెయిట్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ (125 కేజీలు) డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సుమిత్ డోపింగ్లో పట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్కు దూరమయ్యాడు. డోపింగ్లో పట్టుబడినందుకు సుమిత్ బదులుగా ఈ విభాగంలోనే మరో భారత రెజ్లర్ను పంపించే వీలు లేకుండాపోయింది. డోపింగ్లో దొరికిన రెజ్లింగ్ సమాఖ్యపై యూడబ్ల్యూడబ్ల్యూ రూ. 16 లక్షల జరిమానా విధిస్తుంది. ఈ మొత్తాన్ని డోపింగ్లో పట్టుబడ్డ రెజ్లర్ నుంచి వసూలు చేస్తారు. ఫలితంగా ఇప్పుడు సుమిత్ తన జేబు ద్వారా రూ. 16 లక్షలు భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెల్లించాలి. ఒకవేళ జరిమానా మొత్తం చెల్లించకపోతే సుమిత్పై భారత రెజ్లింగ్ సమాఖ్య జీవితకాల నిషేధం విధించే అవకాశముంది. సుమిత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్ వస్తే అతను రూ. 16 లక్షల జరిమానాతోపాటు టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల కోసం హరియాణా ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 5 లక్షలను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. -
ఆశ్రయమిచ్చిన వారెవరో తెలుసుకునేందుకు...
న్యూఢిల్లీ: హత్యానేరంపై అరెస్టయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను ఢిల్లీ పోలీసులు సోమవారం హరిద్వార్కు తీసుకెళ్లారు. యువ రెజ్లర్ సాగర్ హత్యకు కారణమైన అతను 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్ఫోన్ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్ దాడిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్ ముందుగా హరిద్వార్కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. -
సుశీల్ కుమార్ ఆచూకీ చెబితే రూ.1 లక్ష!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే. -
సుశీల్కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
రెజ్లర్ సుశీల్ కుమార్పై కేసు
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్పై కేసు నమోదైంది. సుశీల్కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. -
జూనియర్ రేస్లర్ రితికా ఫోగట్ ఆత్మహత్య
-
రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా?
నిద్రలో కంటున్న చిరునవ్వుల కల ఆఖరి నిముషంలో చెదిరిపోయినట్లే, వాస్తవం లో నెరవేర్చుకోవాలన్న కల చివరి ఒక్క పాయింట్తోనో, ఒక్క మార్కుతోనో ఛిద్రమైపోతుంది. పోయింది పాయింటే తప్ప, తగ్గింది మార్కే తప్ప జీవితం కాదు. అంత ఆలోచించే శక్తి లేకపోయింది రితికా ఫొగట్కు! ఈ లోకాన్నే విడిచిపోయింది. ఎంత వయసని! పదిహేడేళ్ల అమ్మాయి రితిక. రెజ్లింగ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారిణి. ఆటలో ఫైనల్స్ వరకు వచ్చింది. ఒక్క పాయిట్తో ‘గెలుపు’ను మిస్ అయింది. ఎంత వ్యథ చెందిందో. గెలవలేకపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రాణాలు తీసుకుంది. నిజంగా తనే ప్రాణాలు తీసుకుందా? గెలిచి తీరాలన్న పంతం ఒత్తిడిగా మారి ప్రాణం తీసిందా? ఓడి, ఇంటికి వచ్చాకనైనా ఆమె లోలోపలి ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? బాధను పంచుకోలేకపోయారా? ఏమైనా.. ఇది విషాదం. చుట్టూ ఇంతమంది ఉండి ఒక్కరైనా రితిక మూడ్స్ని పసిగట్టి, ఆమెను కాపాడలేకపోవడం! ఆమె పెద్దమ్మ కూతుళ్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్ ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్లూ రెజ్లర్లే! వాళ్లూ కెరీర్ ఆరంభంలో ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లే. తన ఆవేదనను ఒక్కమాటగానైనా అక్కలలో ఒక్కరికైనా చెప్పలేకపోయిందా రితిక!! ఎవరికి ముఖం చాటేయడానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది! రాజస్థాన్లోని భరత్పూర్లో మార్చి 14న జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్స్లో విజయం రితక చేజారింది. మార్చి 17న ఆమె తన జీవితాన్ని చేజార్చుకుంది. భరత్పూర్ నుంచి తిరిగొచ్చాక జైపూర్ దగ్గరి స్వగ్రామంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఆమె చనిపోయిన తేదీపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోవడానికి కారణం మాత్రం ఏకాభిప్రాయానికి యోగ్యమైదే. ఓటమి నుంచి తిరిగొచ్చాక ఆమెనెవరూ అంటిపెట్టుకుని లేరు! ఒక మాటైతే అని ఉంటారు.. ‘నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అని. ‘టేక్ ఇట్ ఈజీ రితికా’ అని కూడా అని ఉండొచ్చు. కానీ ఆమె గుండె లోతుల్లో ఏం ఉందో ఎవరు ఊహించగలరు? ఊహించాలి. ఆటలో ఓడిన వారిని, మాట పడొచ్చిన వారిని ఒంటరిగా వదలకూడదు. నీడలా వెన్నంటి ఉండాలి. సున్నితమైన మనసు గలవారినే కాదు.. గట్టిగా ఉండేవాళ్లను కూడా దగ్గరగా గమనిస్తుండాలి. ఓటమి ఎంత గట్టివాళ్లనైనా క్రుంగదీస్తుంది. వారిలో కుంగుబాటు కనిపిస్తే నిఘా ఉంచాలి. చెట్టుకు కంచెలా వారి ప్రాణానికి ‘గమనింపు’ను కావలిగా పెట్టాలి. ‘రెస్ట్ ఇన్ పీస్ చోటీ బెహన్ రితికా’ అని వేల పోస్ట్లు వస్తున్నాయి. రితిక ఆ ఆరుగురు ‘పొఘట్ సిస్టర్స్’కి మాత్రమే చెల్లి కాదు అన్నట్లుగా నెట్ నిండా కన్నీటి ట్వీట్లు కురుస్తున్నాయి. -
బబితా ఫోగాట్ సోదరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఆటలన్నాక గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే.. అంతటితో మన కథ ముగిసినట్లు కాదు. మరింత కసిగా ప్రయత్నించి గెలుపు అంతేంటో చూడాలి. అంతేతప్ప ఓడిపోయామని చెప్పి ప్రాణాలు తీసుకోవడం దారుణం. ఈ విషయం రితికాకు తెలియక కాదు. కానీ ఓడిపోయిన ఆ క్షణం ఆమె మనసు తనను స్థిమితంగా ఉండనివ్వలేదు. దాంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది ప్రముఖ మహిళా రెజ్లర్ బబితా ఫోగాట్ సోదరి (కజిన్ సిస్టర్) రితికా ఫోగాట్. ఈ సంఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. వివరల్లోకి వెళితే.. 17 ఏళ్ల రితికా ఫోగాట్ మహావీర్ ఫోగాట్ అకాడమీలో గత ఐదేళ్లుగా రెజ్లింగ్లో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో రితికా తాజాగా భరత్పూర్లోని లోహ్ఘర్ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఉమెన్, సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొన్నది. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభ కనబరిచిన రితికా ఫైనల్కు చేరుకుంది. అయితే మార్చి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవి చూసింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రితికా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం ఈ నెల 16న రితికా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రితికా సోదరుడు హర్వింద్ర మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదు. అసలు రితికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియట్లేదు. కోచ్ మహావీర్, మా తండ్రి మెన్పాల్ కూడా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో రితికాతోనే ఉన్నారు. ఓటమి తర్వాత రితికకు భరోసా కూడా ఇచ్చారు. మరింత కష్టపడితే విజయం సొంతమవుతుందని అందరం తనకు నచ్చ చెప్పాం. కానీ రితికా ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహిచంలేకపోయాం’ అంటూ వాపోయాడు. ఈ క్రమంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న రితకా ఫోగాట్ మృతి చెందింది అనే భయంకర విషయాన్ని వెల్లడించడానికి ఎంతో చింతిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం మారిపోయింది. క్రీడాకారలు మునుపెన్నడు లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం’’ అంటూ ట్వీట్ చేశారు. Terrible news that we lost #RitikaPhogat who had a brilliant career ahead. The world has changed from where it was some decades ago. Athletes are facing pressures which were not there earlier. An essential part of their training should be to deal with these pressures. — Vijay Kumar Singh (@Gen_VKSingh) March 18, 2021 ఇదిలా ఉంటే బబితా ఫోగాట్తో పాటు ఆమె సోదరీమణులు కూడా రెజ్లింగ్లో మేటి ప్లేయర్స్ అనే విషయం తెలిసిందే. మహావీర్ ఫోగాట్ తన కూతుళ్లను మంచి రెజ్లర్స్గా తీర్చిదిద్దాడు. వీరి కథ ఆధారంగానే బాలీవుడ్లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘దంగల్’ అనే సినిమా తెరకెక్కింది. చదవండి: కిమురా ఆకస్మిక మృతి.. షాక్లో అభిమానులు -
ట్రాన్స్జెండర్గా మారిన మాజీ రెజ్లర్
వాషింగ్టన్: మాజీ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూయీ సూపర్స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన ప్రకటన చేశారు. తాను ట్రాన్స్జెండర్గా మారినట్లు ప్రకటించారు. మహిళగా మారిన తర్వాత తీసిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘‘ఇది నేనే.. దీని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడటం లేదు.. భయపటడం లేదు’’ అన్నారు. మహిళగా మారిన ఫోటోతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు గబ్బి. ‘‘నేను చెప్పిన ఈ న్యూస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. ఇది నేనే. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు.. ఇబ్బంది పడటం లేదు. ప్రపంచం ఏమి అనుకుంటుందో అని భయపడి ఇన్నాళ్లు నేను దాచిన నా నీడ ఇది. నా కుటుంబం, స్నేహితులు, అనుచరులు దీని గురించి ఎంతో భయపడ్డారు. నేను ఇక దేనికి భయపడను. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.. ఎలా ఉన్నా నన్ను నేను అమితంగా ప్రేమించుకోగలను’’ అన్నారు. కుటుంబం మద్దతుకి కృతజ్ఞతలు ‘‘గత ఎనిమిది నెలలు నా మొత్తం జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాన్స్ జెండర్గా మారిన తర్వాత ప్రపంచాన్ని ఎదుర్కొవాలంటే ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది. ఈ రోజు ఇతరులు నా గురించి ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకున్న రోజు. నా అస్తిత్వాన్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమించే నా భార్య, కుటుంబం, సన్నిహితులు నన్ను అంగీకరించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారి మద్దతు నాకు ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. బాహ్య రూపం మాత్రమే మారింది ‘‘ఇక ప్రస్తుతం నన్ను అందరూ అంగీకరిస్తారా లేదా అనే విషయం గురించి నేను పట్టించుకోవడం లేదు. నా బాహ్య రూపం మాత్రమే మారింది.. అంతరాత్మ అలానే ఉంది. ఇక నాలోని ఈ మార్పు గురించి మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు.. నేను వాగ్దానం చేసినట్లుగానే వాటన్నింటికి తర్వలోనే సమాధానం చెప్తాను. రేపు ఎక్స్ట్రాలో, బిల్లీ బుష్తో నా ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. దీనిలో అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. నా ప్రయాణంలో పారదర్శకంగా.. నిజాయతీగా ఉంటానని ప్రమాణం చేశాను. అలానే కొనసాగుతాను. ఇది నేనే.. ఎప్పటికి మిమ్మల్ని ఎంతో ప్రేమించే గబ్బి అలోన్ టఫ్ట్’’ అంటూ ముగించారు. 2007 నుంచి రెజ్లింగ్ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్కు వీడ్కోలు పలికారు. ఇక కెరీర్లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రా, స్మాక్డౌన్, రెసిల్ మేనియాలతో తలపడ్డారు. రెజ్లింగ్ నుంచి రిటైర్ అయిన తరువాత.. తన భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువ సమయం గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్గా కెరీర్ని రీస్టార్ట్ చేశారు. చదవండి: బాల బాహుబలి ఇక లేడు View this post on Instagram A post shared by Gabbi Alon Tuft (@gabetuft) -
బాల బాహుబలి ఇక లేడు
మాస్కో: పిన్న వయసులో అధిక బరువుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కి బాల బహుబలిగా పేరు పొందిన ధాంబులత్ ఖటోఖోవ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ రష్యా యువ సుమో రెజ్లర్ గత మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని సుమో రెజ్లింగ్ గవర్నింగ్ బాడీకి చెందిన బెటల్ గుబ్జెవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న ఖటోఖోవ్ మరణానికి సంబంధించిన కారణాలను గుబ్జెవ్ వెలువరించలేదు. రెండేండ్ల వయసులో ఖటోఖోవ్ ఏకంగా 34 కిలోల బరువుతో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. కాగా 7 ఏళ్ల వయసులో 100 కేజీల బరువు పెరిగిన ఖటోఖోవ్ 'బేబి ఎలిఫెంట్' అనే ట్యాగ్ను సంపాదించాడు. చిన్న వయసులోనే బాల బాహుబలిగా పేరు పొందిన ఇతను 13 ఏళ్ల వయసులో 180 కిలోల బరువు పెరిగి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. -
రైతుల నిరసన.. మద్దతు తెలిపిన ‘ఖలీ’
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నప్పటికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది. కేంద్రం బేషరతుగా నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రైతులుకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రానా అకా ది గ్రేట్ ఖలీ చేరారు. రైతులకు మద్దతిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన చేశారు దలీప్ సింగ్. అలానే దేశవ్యాప్తంగా ప్రజలను రైతులకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు ఖలీ. ‘వారు(రైతులు) రెండు రూపాయలకు అమ్ముకుని.. 200 వందల రూపాయలకు కొనుక్కుంటారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల రోజు కూలీలు, రోడు పక్క వ్యాపారులు.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేంద్రం రైతుల డిమాండ్లను ఒప్పుకోవాలంటే మనమంతా వారికి మద్దతివ్వాలి’ అని హిందీలో కోరారు. అంతేకాక పంజాబ్, హరియాణా రైతులను ఒప్పించడం కేంద్రానికి అంత సులభం కాదన్నారు. (చదవండి: ‘కేజ్రీవాల్.. మొసలి కన్నీళ్లు కార్చొద్దు‘) View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) ఇక ఇప్పటికే రైతుల నిరసనకు పలువురు పంజాబ్ గాయకులు, నటులు మద్దతు తెలుపుతున్నారు. వీరిలో సిద్దూ మూసేవాలా, బబ్బూ మాన్లు కూడా ఉన్నారు. గాయకులు కన్వర్ గ్రెవాల్, హర్ఫ్ చీమా ఢిల్లీ సరిహద్దులో జరిగిన నిరసనలలో చేరారు. మొత్తం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన గాయకుడు జస్బీర్ జాస్సీ కూడా ఆందోళనకు తన మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్కు చెందిన వేలాది మంది రైతులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్ని లెక్క చేయకుండా ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత కేంద్రం వీరిని ఢిల్లీలోకి అనుమతించలేదు.. ఆ తర్వాత పోలీసు పహారా మధ్య రైతులను రాజధానిలోని బురారీలోనికి రానిచ్చారు. -
కిమురా ఆకస్మిక మృతి.. షాక్లో అభిమానులు
టోక్యో : ప్రముఖ రెజ్లర్ హనా కిమురా(22) ఆకస్మిక మరణం అభిమానులను షాక్కు గురిచేసింది. ఈ విషయాన్ని రెజ్లింగ్ సంస్థ స్టార్డమ్ వెల్లడించింది. కిమురా మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. అయితే కిమురా మరణానికి గల కారణాలు తెలియడం లేదు. మరోవైపు సైబర్ వేధింపుల వల్లే ఆమె మరణించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చనిపోవడానికి ముందు కిమురా చేసిన పోస్టులు తను సైబర్ బెదిరింపులకు గురయ్యారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు అంటున్నారు. కిమురా జపాన్లో మంచి రెజ్లర్గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విపరీతమైన ఆదరణ పొందిన నెటిఫ్లిక్స్ రియాలటీ షో టెర్రస్ హౌస్లో ఆమె నటించారు. టెర్రస్ హౌస్ షోలో ఉండే ఆరుగురు రెసిడెంట్స్లో కిమురా ఒకరు. అయితే కరోనా కారణంగా ఆ షో షూటింగ్ ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. కాగా, ఆమె తల్లి క్యోకో కిమురా కూడా మంచి రెజ్లర్. -
మహాబలిని మట్టికరిపించిన వేళ...
అది 2000 సంవత్సరం... కొత్త మిలీనియం మొదలైన ఏడాది! సిడ్నీలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. 130 కేజీల విభాగంలో ఓ అమెరికా అనామక రెజ్లర్ రూలన్ గార్డెనర్ స్వర్ణం గెలిచాడు. ఒలింపిక్స్ అన్నాక కొత్త చాంపియన్లు అవతరించడం... పతకాలు గెలవడం సాధారణం. కానీ సిడ్నీ వేదికపై ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. ప్రపంచ రెజ్లింగ్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్గా పేరొందిన రష్యా మహాబలి, దిగ్గజ రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ను గార్డెనర్ ఎంతో నేర్పుగా ఓడించాడు. ఈ శతాబ్దం విస్తుపోయే ఫలితాన్నిచ్చాడు. కరెలిన్తో తలపడుతున్నపుడు ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధిస్తేనే గొప్ప అనుకుంటారు. కానీ గార్డెనర్ ఏకంగా కరెలిన్ను ఓడించాడు. పసిడి పతకం కూడా గెలిచాడు. కనకంతో కెరీర్ను దిగ్విజయంగా ముగించాలని కలలు కన్న కరెలిన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. స్వదేశంలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన రీడ్, వర్జినియా దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఆఖరివాడు రూలన్ గార్డెనర్. కుటుంబానికి సొంతంగా డెయిరీ ఫామ్ ఉండటంతో గార్డెనర్ పాలు అమ్మేవాడు. ఆ తర్వాత రెజ్లింగ్లో రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన అతను సిడ్నీ ఒలింపిక్స్లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చరిత్రలో భాగమయ్యాడు. కనీవినీ క్రేజ్ను ఒక్క రాత్రే సంపాదించాడు. ప్రపంచ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాడు. ఇంకేం ఆ తర్వాత ఓ వెలుగు వెలిగిన ఇతన్ని దురదృష్టం ప్రమాదాల పాలు చేస్తే.... అదృష్టమేమో ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ కాలమైతే ఆగదు. దాంతో క్రేజ్తో వచ్చిన క్యాష్ నిలువలేదు. తోడుగా వచ్చిన కష్టాలు వదిలేయలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడలేదు. చివరకు దివాళా తప్పలేదు. (స్టేడియాలు తెరుచుకోవచ్చు ) ఏకులా వచ్చి... సిడ్నీ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి గార్డెనర్ అనామక రెజ్లరైతే... అలెగ్జాండర్ కరెలిన్ మాత్రం దిగ్గజ రెజ్లర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒక్క బౌట్లోనూ ఓడిపోలేదు. 9 సార్లు విశ్వవిజేతగా... 13 సార్లు యూరోపియన్ చాంపియన్గా... వరుసగా మూడు ఒలింపిక్స్లలో చాంపియన్గా నిలిచిన కరెలిన్ సిడ్నీ ఒలింపిక్స్లో ఏ ప్రత్యర్థికీ కనీసం ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా ఫైనల్ చేరాడు. 1997లో ఓ టోర్నీలో రూలన్ ఎదురైతే కరెలిన్ ఓ పట్టుపట్టి అలవోకగా 5–0తో మట్టికరిపించాడు. అంతేకాదు ఈసారీ స్వర్ణం గెలిస్తే ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు ఒలింపిక్ పసిడి పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారుడిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించేవాడు. కానీ అప్పటి 33 ఏళ్ల కరెలిన్ కలల్ని అమెరికాకు చెందిన నాటి 29 ఏళ్ల పాలబ్బాయి రూలన్ గార్డెనర్ భగ్నం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిగల తొలి రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఇద్దరూ ఖాతా తెరువలేకపోయారు. అయితే రెండో రౌండ్ మొదలైన 23 సెకన్లకు గార్డెనర్ ఒక పాయింట్ సంపాదించాడు. ఇక మూడో రౌండ్లోనూ తన శక్తినంతా కూడదీసుకొని కరెలిన్ను నిలువరించిన గార్డెనర్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తుదకు 1–0తో కరెలిన్ను ఓడించి గార్డెనర్ అద్భుతం చేశాడు. దీంతో ఈ ఫలితం ‘అప్సెట్ ఆఫ్ ద సెంచరీ’ (శతాబ్ది విస్తుపోయే ఓటమి)గా పుటల్లోకెక్కింది. కరెలిన్ బంగారు యాత్ర ముగియడంతో అతని తన కెరీర్నూ ముగించాడు. ఆటకు టాటా చెప్పేశాడు. ‘అతనికి మరణం లేదు’ అనే టైటిల్తో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అసాధారణ చాంపియన్లను చరిత్రలో నిక్షిప్తం చేసే పనిలో పడింది. అందుకే మేటి అథ్లెట్లను ‘తెర’మీదకు తెస్తోంది. ఈ ఉద్దండ పిండాల జాబితాలో గార్డెనర్ కూడా ఉన్నాడు. ఫైవ్ రింగ్స్ ఫిలిమ్స్ బ్యానర్పై ఐఓసీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ పేరు ‘రూలన్ గార్డెనర్ వోంట్ డై’. జూన్ 3న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది. ఇందులో చరిత్ర కెక్కిన సువర్ణ విజయంతో పాటు జీవితంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు, ప్రాణాలమీదికి తెచ్చిన ప్రమాదాలు క్లుప్తంగా చూపించారు. మృత్యుంజయుడు... సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచాక 2001లో ప్రపంచ చాంపియన్షిప్లోనూ గార్డెనర్ పసిడి పతకం నెగ్గి జగజ్జేత అయ్యాడు. అయితే ఆ తర్వాతి ఏడాదే గార్డెనర్కు స్నో డ్రైవ్ ప్రమాదంలో ప్రాణం పోయినంత పనైంది. 2002 ఫిబ్రవరిలో మంచు సరస్సు వద్ద అతను నడుపుతున్న స్నో మొబైల్ ప్రమాదానికి గురైంది. దీంతో కన్నీటి చుక్క కూడా గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా 17 గంటలు అచేతనంగా పడిపోయాడు. తీవ్రంగా గాయమైన గార్డెనర్ కుడి కాలి వేళ్లను తొలగించాల్సి వచ్చింది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్లో పోటీపడ్డ గార్డెనర్ 130 కేజీల విభాగంలోనే కాంస్య పతకం గెలిచి కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2007 ఫిబ్రవరిలో మళ్లీ గార్డెనర్ మరో ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ఓ నదిలో కూలిపోయింది. అప్పుడు కూడా అతను మృత్యుంజయుడుగా నిలిచాడు. గంటకుపైగా ఈదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. తదనంతరం గార్డెనర్ వ్యక్తిగత జీవితం కూడా కుదుపునకు లోనైంది. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ రెండూ విడాకులకు దారి తీశాయి. మరోవైపు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలు రావడం... వాటి నుంచి ఎంతకి బయటపడలేక గార్డెనర్ చివరకు దివాళా తీశాడు. చివరకు తాను సాధించిన సిడ్నీ ఒలింపిక్స్ స్వర్ణాన్ని, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని, ఇతర విలువైన వస్తువులను అమ్ముకొని అప్పులు తీర్చాడు. అనంతరం మూడేళ్లపాటు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశాక మళ్లీ రెజ్లింగ్వైపు వచ్చాడు. ప్రస్తుతం 48 ఏళ్ల గార్డెనర్ సాల్ట్లేక్ సిటీలోని ఓ హైస్కూల్లో రెజ్లింగ్ కోచ్గా చిన్నారులకు కుస్తీ పాఠాలు చెబుతున్నాడు. -
కరోనాతో జపాన్ రెజ్లర్ మృతి
టోక్యో : జపాన్కు చెందిన 28 ఏళ్ల షోబుషి (సుమో రెజ్లర్) కరోనా వైరస్ తో ప్రాణాలు విడిచాడు. కరోనా వైరస్ వల్ల సుమో రెజ్లర్ చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో సంఘం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. రెజ్లర్ షోబుషి అసలు పేరు కియోటకా సుటేకా. అయితే నెల రోజుల క్రితం అతను హాస్పిటల్లో చేరాడు. టోక్యో హాస్పిటల్లో అతను మృతిచెందినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్లో అతను 11వ స్థానంలో నిలిచాడు. ఏప్రిల్లో అయిదుగురు సుమో రెజ్లరకు వైరస్ సంక్రమించినట్లు సంఘం పేర్కొన్నది. మహమ్మారి వల్ల మే 24వ తేదీ నుంచి టోక్యోలో జరిగాల్సిన సుమో రెజ్లింగ్ పోటీలను కూడా వాయిదా వేశారు. జపాన్లో ఇప్పటి వరకు 16,759 మందికి వైరస్ సంక్రమించింది. 691 మంది మరణించారు. (‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’) ('నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు') -
నేనే తప్పూ చేయలేదు: బబితా ఫోగాట్
ఢిల్లీ : గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫోగాట్ తెలిపారు. తబ్లీగీ జమాత్తో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఇదే విషయానికి సంబంధించి ట్విట్టర్లో వివాదస్పద పోస్టులు చేశారు బబితా ఫోగాట్. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ ఓ వర్గం వ్యతిరేకిస్తుంటే, ఆమెకు మద్ధతుగా మరో వర్గం వి సపోర్ట్ బబితా అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి బబితా స్పందిస్తూ..నేనే పెట్టిన ప్రతీ పోస్టుకు కట్టుబడి ఉన్నాను. మీ బెదిరింపులకు భయపడటానికి నేనేమీ జైరా వాసిమ్ (దంగల్లో బబితా అక్క పాత్ర పోషించిన నటి ) కాదు. బబితా ఫోగాట్ . నేనే తప్పూ చేయలేదు. నా దేశం కోసం పోరాడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. బబితా, ఆమె సోదరి గీతా ఫోగాట్, తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ జీవితకథ ఆధారంగా దంగల్ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గీతా పాత్ర పోషించిన జైరా వాసిమ్ గత సంవత్సరం బాలీవుడ్ నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించి పెద్ద చర్చకు దారి తీసింది. గత ఏడాది బీజేపీలో చేరి హర్యానా నుండి పోటీ చేశారు. కంగనా సోదరి రంగోలి ఇటీవలి చేసిన వివాదస్పద ట్వీట్కు కూడా మద్దతు ఇచ్చారు. తదనంతరం కొంతమంది సెలబ్రటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విట్టర్ యాజమాన్యం రంగోలి ఖాతాను తొలగించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా తగ్గుతుందనుకుంటున్న సమయంలో తబ్లీగీ జబాత్ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దాదాపు 25 వేలమంది తబ్లీగి కార్యకర్తలను క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. దేశంలో 13వేల మంది కోవిడ్ బాధితులుండగా, 400పైగానే మరణించారు. -
ఎనిమిదో అడుగు
మొదటి అడుగు: దైవం మనిద్దరినీ ఒకటి చేయుగాక. రెండవ అడుగు: మనిద్దరికీ శక్తి లభించుగాక. మూడవ అడుగు: వివాహ వ్రత సిద్ధి కలుగుగాక. నాలుగు అడుగు: మనకు ఆనందం కలుగుగాక ఐదవ అడుగు: దైవం మనకు పశుసంపదను కలిగించుగాక ఆరవ అడుగు: రుతువులు మనకు సుఖమిచ్చుగాక ఏడవ అడుగు: దైవం మనకు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణను అనుగ్రహించుగాక. వివాహ వేడుకలో వేసే ఏడు అడుగుల అర్థం ఇది. ఈ ఏడు అడుగులతో పాటు మరో అడుగు కూడా వేసింది బబితా పోగట్. తోటి రెజ్లింగ్ క్రీడాకారుడు వివేక్సుహాగ్తో బబిత వివాహం మొన్న ఆదివారం జరిగింది. ఈ వివాహ వేడుకలో సంప్రదాయంగా వేసే ఏడు అడుగులతో పాటు ఆడపిల్లల అభ్యున్నతి కోరుతూ అదనంగా మరో అడుగు వేశారీ దంపతులు. ‘ఆడపిల్లలను కాపాడుదాం, అడపిల్లలను చదువుకోనిద్దాం, ఆడపిల్లలను ఆడుకోనిద్దాం’ అని ఎనిమిదో అడుగు వేశారు ఈ యువదంపతులు. భారతప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి కొనసాగింపుగా ‘ఆడపిల్లలను క్రీడాకారులుగా తీర్దిద్దిదుదాం’ అని కొత్త ఆలోచనకు ఇలా నాంది పలికారు వీళ్లు. దేశమెరిగిన సిస్టర్స్ బబిత పోగట్ పరిచయం అవసరం లేని క్రీడాకారిణి. మల్లయుద్ధ క్రీడాకారిణులు పోగట్ సిస్టర్స్లో రెండవ అమ్మాయి బబిత. పదేళ్ల కిందట కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకంతో మొదలు పెట్టి ఈ పదేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్, వరల్డ్ చాంపియన్షిప్లలో పతకాలు సాధించింది. బబిత అక్క గీత కూడా ఇదే స్థాయిలో విజయాలనందుకుంది. ఈ మల్లయోధురాళ్ల జీవితం ఆధారంగా గత ఏడాది హిందీలో ‘దంగల్’ సినిమా వచ్చింది. అప్పటి వరకు క్రీడాభిమానులకు మాత్రమే తెలిసిన రెజ్లింగ్ సిస్టర్స్ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. మరో ముందడుగు బబిత తండ్రి మహావీర్సింగ్ పోగట్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. అతడు తన కూతుళ్లు నలుగురినీ మల్లయోధులుగా తీర్చిదిద్దడం ద్వారా హరియాణా సమాజంలో ఆడపిల్లల అభ్యుదయానికి దార్శనికుడయ్యాడు. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే చిదిమేసే దుష్ట సంప్రదాయం వేళ్లూనుకుని పోయిన హరియాణా రాష్ట్రంలో పోగట్ సిస్టర్స్ సంప్రదాయ పరిధులను చెరిపేసి విజయశిఖరాల వైపు అడుగులు వేశారు. ఇప్పుడు హరియాణాలో వారి సొంతూరు బలాలి గ్రామంలో జరిగిన వివాహ వేడుక సందర్భంగా బబిత దంపతులు.. సామాజిక చైతన్యం కోసం వివాహవేడుకలో ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాన్ని సవరించి కొత్త సంప్రదాయం వైపు అడుగులు వేశారు.తొలి ఏడు అడుగులు తమకు సంపూర్ణమైన జీవితం సిద్ధించాలని కోరుకున్న ఈ కొత్త దంపతులు ఎనిమిదో అడుగుని సమాజ హితం కోసం వేశారు. తాను ఈ ఏడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి బరిలో దిగడం కూడా విధాన నిర్ణయాల్లో భాగం పంచుకునే అధికారం ఆడవాళ్లకు కూడా ఉందని తెలియచేయడానికేనని ఆమె ఎన్నికల సందర్భంగా చెప్పారు. – మంజీర ఇది సమష్టి నిర్ణయం మేము ప్రాక్టీస్ కోసం గోధుమ చేలలో పరుగులు తీసేటప్పుడు అందరూ మమ్మల్ని వింతగా చూసేవాళ్లు. వాళ్ల దృష్టిలో స్త్రీ ఎలా ఉండాలంటే... దేహాకృతి స్పష్టంగా తెలియనంత వదులుగా దుస్తులు ధరించాలి. అలాంటి భావజాలం రాజ్యమేలుతున్న రోజుల్లో మేము నిక్కర్, టీ షర్ట్ వేసుకుని జుట్టు పొట్టిగా కత్తిరించుకుని పరుగులు తీయడం మా ఊరి వాళ్లకు ఓ పెద్ద విచిత్రం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో మేము ఎక్కడ తప్పటడుగు వేస్తామా అని ఎదురు చూసిన వాళ్లే ఎక్కువ. అలాంటి సమాజంలో ఆడపిల్ల తన జీవితాన్ని తాను జీవించే పరిస్థితులు నెలకొనాల్సిన అవసరం చాలా ఉంది. అడ్డంకులను దాటుకుని ముందడుగు వేసిన మాలాంటి వాళ్లందరం రాబోయే తరాలకు కొత్తదారిని నిర్మించాలి. ఇందులో భాగంగానే గత ఏడాది మా కజిన్ వినేశ్ కూడా తన పెళ్లిలో ఎనిమిది అడుగులు వేసింది. ఇది మేమంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయం. – బబిత పోగట్, రెజ్లింగ్ క్రీడాకారిణి -
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్సింగ్ ఫొగాట్లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
నాలుగో స్వర్ణంపై రెజ్లర్ వినేశ్ గురి
న్యూఢిల్లీ : భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ సీజన్లో నాలుగో స్వర్ణానికి గెలుపు దూరంలో నిలిచింది. బెలారస్లో జరుగుతున్న మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్లో వినేశ్ 53 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో వినేశ్ 11–0తో యాఫ్రెమెన్కా (బెలారస్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో రష్యా రెజ్లర్ మలిషెవాతో ఆడుతుంది. ఈ సీజన్లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాం డ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. -
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం
-
బ్రేకింగ్ : ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం
జకర్తా : ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు తొలిరోజు శుభారంభం లభించింది. రెజ్లింగ్ విభాగంలో భజరంగ్ పునియా భారత్కు తొలి స్వర్ణం అందించారు. పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో జపాన్కు చెందిన తకటాను ఓడించి భజరంగ్ సత్తా చాటాడు. ఫైనల్లో తకాటాపై 11-8 తేడాతో పునియా విజయం సాధించి ఆసియా క్రీడాల్లో తొలి స్వర్ణ పతాకం పొందారు. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో మంగోలియాకు చెందిన బచూలున్పై 10-0తో సంచలన విజయాన్ని నమోదు చేశారు. క్వార్టర్స్లో ఫైజీవ్ అబ్దుల్ ఖాసీమ్పై 12-2తో పునియా అద్భుత విజయాన్ని సాధించారు. కాగా ఆసియా క్రీడల్లో పునియాకు ఇదే తొలి స్వర్ణ పతాకం కావడం విశేషం. 2014లో జరిగిన క్రీడల్లో పునియా రజత పతాకం పొందిన విషయం తెలిసందే. కాగా రెజ్లింగ్ పురుషుల విభాగంలో పునియా ఒక్కడే రాణించాగా, మిగతా ఆటగాళ్లు అందరూ తీవ్రంగా నిరూత్సహాపరిచారు. -
నాడు గోల్డ్ మెడల్ విన్నర్.. నేడు గ్యాంగ్స్టర్
రోహ్తక్(హరియాణా) : ఒకప్పుడు అతను జాతీయస్థాయి కుస్తీ పోటిల్లో బంగారు పతకం సాధించాడు. మరి నేడు పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఒక హత్యానేరంలో ప్రధాన నిందితుడు. అతనిని పట్టించిన వారికి 25 వేల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు పోలీసులు. చివరకు మంగళవారం(నిన్న) పోలీసుల చేతికి చిక్కాడు. అతనే రోహ్తక్లోని మొఖ్రా గ్రామానికి చెందిన రాకేష్ మొఖ్రియా. గత ఏడాది జూన్లో, అస్సాన్ గ్రామానికి చెందిన బల్బీర్ హత్యకేసులో రాకేష్ ప్రధాన నిందితుడు. రాకేష్ ఎందుకు అరెస్ట్ చేయాల్సివచ్చిందో రోహతక్ ఎస్పీ జషన్దీప్ సింగ్ రంధవా చెబుతూ.. ‘గత ఏడాది జూన్లో బల్బీర్ సింగ్, రాకేష్కు మధ్య మద్యం కాంట్రాక్ట్ విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో రాకేష్ తన అనుచరులతో కలిసి బల్బీర్ను చంపేసారు. ఈ హత్యకేసులో పోలీసులు రాకేష్ అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ రాకేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అలానే అతని ఆచూకీ తెలిపిన వారికి 25 వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం బల్బీర్ హత్యతో సంబంధం ఉన్న రాకేష అనుచరున్ని ఒకన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి ఝాజ్జ బైపాస్ రోడ్లో ఉన్న రాకేష్ను యాంటి వెహికల్ థేఫ్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని’ తెలిపారు. రాకేష్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని వద్ద నుంచి ఒక 30బోర్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బల్బీర్ను హత్య చేసిన తరువాత రాకేష్ రాజస్థాన్ వెళ్లి తలదాచుకున్నట్లు విచారణలో తెలిపాడన్నారు. అంతేకాక వీరి గ్యాంగ్ లీడర్ రోహ్తష్ కుమార్ విడుదల కోసం ఎదురుచుస్తున్నాడని, అతను జైలు నుంచి విడుదల కాగానే తిరిగి నేరాలు ప్రారంభిద్దామనుకుంటున్నట్లు తెలిపాడని వెల్లడించారు. కుస్తీ పోటీల్లో బంగారు పతకం... రాకేష్ 2003లో నిర్వహించిన జాతీయ కుస్తీ పోటిల్లో హరియాణా తరుపున పాల్గొని బంగారు పతకం సాధించాడు. అలానే అదే ఏడాది ‘తల్కతోర స్టేడియం’లో జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. కానీ 2005లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆవేశంలో ఝజ్జర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసినందుకుగాను 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన నేర ప్రవృత్తిని మానుకోలేక గతేడాది మరో వ్యక్తిని హత్య చేసి మరోసారి జైలుకెళ్లబోతున్నాడు. -
బౌట్లో విషాదం: మెడ విరిగి రెజ్లర్ మృతి
ముంబై: రెజ్లింగ్ క్రీడలో విషాదం చోటుచేసుకుంది. బౌట్లో ప్రత్యర్థితో పోరాటంలో మెడ విరిగిన రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ (20) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్లో చోటుచేసుకుంది. జ్యోతిబా జాతర సందర్భంగా గత సోమవారం కోల్హాపూర్లోని బండివేడ్లో కుస్తీ పోటీలు నిర్వహించారు. పాల్గొన్న తొలి బౌట్లోనే నీలేశ్కు బలమైన ప్రత్యర్థి ఎదురుపడ్డాడు. ఎక్కువగా ఆత్మరక్షధోరణిలో ఆడుతున్న నీలేశ్ ప్రత్యర్థికి పాయింట్లకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో అసహనానికి లోనైన మరో రెజ్లర్ నీలేశ్ను గాల్లోకి అమాంతం ఎత్తగా.. పట్టు విడిపించుకునే యత్నంలో కిందపడ్డాడు. ప్రత్యర్థి రెజ్లర్ సంబరాలు చేసుకుంటుండగా.. మెడపైనే పూర్తి బరువు పడుతూ పడిపోవడంతో నిలేశ్ స్పృహ కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు కోల్హాపూర్లోని మెట్రో హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషయంగా ఉందని కరాడ్లోని క్రిష్ణ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. గత నాలుగు రోజులుగా వైద్యులు చేసిన యత్నాలు విఫలం కావడంతో రెజ్లర్ నీలేశ్ మృతిచెందాడు. ఆటలో అనుకోకుండా జరిగిన ఘటన కనుక ప్రత్యర్థి రెజ్లర్ పేరు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు. నీలేశ్ మృతికి కారణమైన రెజ్లర్ ఇంకా షాక్లోనే ఉన్నాడని, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని సూచించారు. మరోవైపు రెజ్లర్ నీలేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. -
24 ఏళ్ల సర్వీసు.. 51 పోస్టులు.. మెగా దంగల్
చండీగఢ్: హరియణా కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. 52 ఏళ్లకే.. 51 పోస్టింగ్లు.. 24 ఏళ్ల సర్వీసులో తరచుగా బదిలీలు... అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆయనకు లభించిన బహుమానాలు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు.. కానీ ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గుర్గావ్లో భూమార్పిడిని నిలిపివేసి ఒక్కసారిగా అశోక్ వార్తల్లోకెక్కారు. అంతేకాదు హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. ఆ కారణంగానే తరచుగా ట్రాన్స్ఫర్లు.. ప్రస్తుతం ఆయన ‘మెగా దంగల్’కు సిద్ధం అవుతున్నారు. ఎన్నో బదిలీల తర్వాత అశోక్ ఖేమ్కా హరియణా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండి ఉన్న హరియణా వంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్కు నిర్ణయకర్తగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో కూడా అత్యధిక పతకాలు సాధించింది హరియణా క్రీడాకారులేనన్నారు. పోటీతత్వానికి మారుపేరుగా నిలిచే క్రీడాకారులకు జీవనోపాధి కల్పించడం కనీస బాధ్యత అని, అందుకోసం వారికి ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో కూడిన క్రీడా అకాడమీలు పెంచడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. మార్చి21 నుంచి 23 వరకు జరిగే మల్లయుద్ధ పోటీల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని అశోక్ ఖేమ్కా చెప్పారు. ఉద్యోగం ఉంటేనే భద్రత.. ‘ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ప్రతిభకు గుర్తింపుగా ఎంతో కొంత పారితోషకం లభిస్తుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే ఉద్యోగం అవసరం. క్రీడలను కెరీర్గా ఎంచుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకోసం ప్రతిభకు పదునుపెట్టాలి. ఒలింపిక్స్లో భారత్కు 5 నుంచి 10 పతకాలు హర్యానా క్రీడాకారులు అందిస్తారని’ అశోఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా దంగల్ ఎందుకంటే.. స్వాతంత్ర్య సమర యోధులు.. భగత్ సింగ్, శివరాం హరి రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్లను ఉరి తీసిన రోజును హరియణాలో సహేదీ దివస్గా జరుపుతారు. ఈ రోజును పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తోంది. రూ.1.8 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందిస్తోంది. ‘ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ఇండోర్ స్టేడియంను సిద్ధం చేశామని, ప్రేక్షకుల కోసం ఈసారి ఏసీలు కూడా ఏర్పాటు చేశామని’ క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోఖ్ తెలిపారు. -
మరో నిర్లక్ష్యం.. మరో ప్రాణం: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ట్విట్టర్ లో ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో ఆకట్టుకుని మన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఈసారి ఆవేదనతో కూడిన ట్వీట్ చేశాడు. మరో నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైందంటూ అధికారుల అలసత్వంపై సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహ్ం వ్యక్తం చేశాడు. దీనికి కారణం ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో ఓ 25 ఏళ్ల జాతీయ స్థాయి రెజ్లర్ దుర్మరణం చెందడమే. రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విశాల్ కుమార్ వర్మ అనే రెజ్లర్ కరెంట్ షాక్ తో మృతిచెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేడియంలోకి వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ అయి విశాల్ మృత్యువాత పడ్డారు. అక్కడ స్నానం చేయడానికి బాత్ రూంలోకి వెళ్లిన అతనికి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతను మృతిచెందాడు. దీనిపై సెహ్వాగ్ ఆవేదన చెందాడు. 'మరో నిర్లక్ష్యానికి ఒక జాతీయ స్థాయి రెజ్లర్ ను పోగుట్టుకున్నాం'అంటూ ట్వీట్ చేశాడు. నీరు నిలిచిపోయిన స్టేడియంలో విద్యుత్ షాక్ తో విశాల్ వర్మ మృతి చెందడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం. ఇది నిజంగా ఘోరం''అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. Another Negligence.We have lost a National Wrestler #VishalKumarVerma ,due to electrocution at this water logged stadium in Ranchi.Pathetic! pic.twitter.com/yiumQxRuHk — Virender Sehwag (@virendersehwag) 12 August 2017 -
షార్ట్ సర్క్యూట్ తో రెజ్లర్ దుర్మరణం
న్యూఢిల్లీ:జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఓ 25 ఏళ్ల రెజ్లర్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. గత రెండు రోజుల క్రితం రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విశాల్ కుమార్ వర్మ అనే రెజ్లర్ కరెంట్ షాక్ తో దుర్మరణం చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేడియంలోకి వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ అయి విశాల్ మృత్యువాత పడ్డారు. తొలుత ప్రాక్టీస్ కు సిద్ధమైన విశాల్ కరెంట్ షాక్ తో అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అతని మృతిపట్ల జార్ఖండ్ రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. విశాల్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. కేంద్ర క్రీడాశాఖ నుంచి రూ. 10 లక్షలు ఇప్పించడానికి యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అతని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.లక్షను ప్రకటించారు. దాంతో పాటు ప్రతీనెల రూ.10 వేలను అతని కుటుంబానికి రాష్ట్ర అసోసియేన్ ఇస్తుందన్నారు. 2005లో రెజ్లింగ్ కెరీర్ ను విశాల్ ఆరంభించాడు. ఇటీవల జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ సెమీ ఫైనల్స్ కు చేరి సత్తా చాటుకున్నాడు. -
రెజ్లర్ను మనువాడిన సాక్షి మాలిక్!
రియో ఒలింపిక్స్లో మొదటి పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆమె ఆదివారం రోహతక్లో తోటి రెజ్లర్ సత్యవ్రత్ కడియన్ను వివాహం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో 58 కిలోల కేటగిరీలో సాక్షి కాంస్యం పతకం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్లో పతకం సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. రోహతక్లో అట్టహాసంగా జరిగిన ఆమె వివాహానికి ప్రముఖ రెజ్లర్ సుశీల్కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెజ్లింగ్ క్రీడ ద్వారానే సాక్షికి సత్యవ్రత్కు మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. సత్యవ్రత్ 2010 యూత్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్లో అతను పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. Happy married life congratulation @SakshiMalik pic.twitter.com/7X34PS6MMe — Vijender Singh (@boxervijender) 3 April 2017 Time to get colored with Mehendi for the big day #excited pic.twitter.com/BjcBpIyrx3 — Sakshi Malik (@SakshiMalik) 1 April 2017 -
యోగేశ్వర్ దత్ నిశ్చితార్థం
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. ఢిల్లీకి చెందిన షీతల్తో అతని వివాహ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. వచ్చే జనవరి 16న వీరి పెళ్లి జరుగుతుంది. బీఏ విద్యార్థిని అయిన షీతల్... స్థానిక కాంగ్రెస్ నేత జై భగవాన్ శర్మ కూతురు. నిశ్చితార్థ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, రెజ్లింగ్ సమాఖ్య అధికారులు హాజరయ్యారు. 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ కాంస్యం గెలుచుకోగా... నాడు రజతం గెలిచిన కుడుఖోవ్ డోపింగ్లో పట్టుబడటంతో యోగి సాధించిన కాంస్యం రజత పతకంగా మారింది. -
డోపింగ్ కేసుపై సీబీఐ విచారణ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు ముందు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు స్వీకరించనుంది. ఈ మేరకు తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ శుక్రవారం స్సష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రధాని కార్యాలయంలోని అధికారుల్ని కలిసి ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. 'నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ కేసుకు సంబంధించి ప్రధాని కార్యాలయంలో అధికారుల్ని కలిశా. ఇందుకు పీఎంవో కార్యాలయం సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తుంది' అని బ్రిజ్ భూషణ్ తెలిపారు. గత జూన్లో నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న నర్సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో పాటు నాలుగేళ్ల నిషేధం విధిస్తూ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పునిచ్చింది. అయితే తాను డోపింగ్ పాల్పడలేదని, ఎవరో చేసిన కుట్రకు బలయ్యానని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. ఈ వాదనకు భారత రెజ్లింగ్ సమాఖ్య కూడా మద్దతుగా నిలిచింది. -
అభినమాన సందేహం 'సాక్షి'గా...
రెజ్లర్ సాక్షి మలిక్కు భారీ స్వాగతం ఘనంగా సత్కరించిన హరియాణా ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు పురస్కారం అందజేత న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ సగర్వంగా సొంతగడ్డపై అడుగు పెట్టింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. హరియాణా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ రియో నుంచి ఆమె వెంట రాగా, ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. ముందుగా సాక్షి తల్లిదండ్రులు ఆమెను అభినందనలతో ముంచెత్తగా... ఆ తర్వాత క్రీడాభిమానులు ఎయిర్పోర్ట్ ముందు బ్యాండ్ బాజాలతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. అనంతరం ఝజ్జర్ జిల్లా బహదూర్గఢ్లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సన్మాన కార్యక్రమంలో సాక్షి పాల్గొంది. కాంస్య పతకం గెలుచుకున్న సాక్షికి ఈ సందర్భంగా రూ. 2.5 కోట్ల నగదు పురస్కారపు చెక్ను ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అందజేశారు. దీంతో పాటు హరియాణా ప్రభుత్వం క్లాస్-2 ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. సాంప్రదాయ ‘పగ్డీ’తో సాక్షిని సత్కరించిన ఖట్టర్, బేటీ పఢావో-బేటీ బచావో కార్యక్రమానికి హరియాణా ప్రచారకర్తగా సాక్షిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత అభిమానులు కరెన్సీ నోట్ల దండలను ఆమె మెడలో వేశారు. రియో ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతీ హరియాణా క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు కూడా సీఎం చెప్పారు. అనంతరం భారీ జన సందోహం తోడు రాగా సాక్షి తన స్వగ్రామం మోఖ్రాకు వెళ్లింది. మోఖ్రాలో స్పోర్ట్స్ నర్సరీ, స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి... సాక్షి ఇద్దరు కోచ్లకు చెరో రూ. 10 లక్షల పురస్కారాన్ని ప్రకటించారు. కర్ణాటక సింధు! సాక్షి సత్కార కార్యక్రమంలో మాట్లాడే సమయంలో సీఎం ఖట్టర్ తడబడ్డారు. ముందుగా సాక్షి ఘనతల గురించి గొప్పగా చెప్పిన ఆయన ఇద్దరు అమ్మాయిలు దేశ గౌరవం నిలబెట్టారని ప్రశంసించారు. అయితే సింధు పేరు గుర్తుకు రాక పక్కవారిని ‘ఆ రెండో అమ్మాయి పేరు ఏమిటి’ అని అడిగి తెలుసుకున్నారు. దానితో ఆగిపోకుండా కర్ణాటకకు చెందిన సింధు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చాలా గర్వంగా ఉంది... స్వదేశంలో తనకు లభించిన స్వాగతం పట్ల సాక్షి మలిక్ అమితానందం వ్యక్తం చేసింది. తన 12 ఏళ్ల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆమె ఉద్వేగంగా చెప్పింది. ‘ఇంత మంది నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు అండగా నిలిచిన, ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. ఒలింపిక్ పతకం గెలవాలనే నా కల నిజమైంది. ముగింపు ఉత్సవంలో పతాకధారి కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని 23 ఏళ్ల సాక్షి చెప్పింది. అమ్మాయికి కుస్తీ ఎందుకు అంటూ తమను చాలా మంది విమర్శించారని, ఇప్పుడు ఆమె ఘనత చూసి గర్విస్తున్నామని ఆమె తల్లిదండ్రులు సుఖ్బీర్, సుదేశ్ చెప్పారు. -
కల చెదిరింది
నర్సింగ్యాదవ్పై నాలుగేళ్ల నిషేధం ఓ క్రీడాకారుడికి ఇంత కన్నా దారుణ పరిస్థితి ఏముంటుంది... అనేక అవాంతరాలను దాటుకుని ఒలింపిక్స్లో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణమది.. ప్రత్యర్థి ఎవరో తేలడంతో పాటు వెయింగ్కు కూడా హాజరయ్యాడు.. కానీ ఇంతలోనే అతడి ఆశలను దారుణంగా చిదిమేసిన నిర్ణయం వెలువడింది. నువ్వు డోపీవే.. బౌట్లోకే కాదు నాలుగేళ్ల పాటు ఆటకే దూరం కావాలని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) ఇచ్చిన తీర్పుతో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ హతాశయుడయ్యాడు. అత్యంత నాటకీయ పరిణామాలతో రియోకు చేరిన ఈ రెజ్లర్ ప్రస్థానం అదే తరహాలో ముగిసింది. రియో డి జనీరో: ఒలింపిక్స్లో బరిలోకి దిగడానికి ముందే భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు షాక్ తగిలింది. డోపింగ్ ఆరోపణలతో అతడిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తేల్చింది. ఈ కాలంలో తను ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదని కూడా స్పష్టం చేసింది. దీంతో తను గేమ్స్ నుంచి అర్ధాంతరంగా నిష్ర్కమించాల్సి వచ్చింది. అతడిపై ఎవరో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సీఏఎస్ తేల్చి చెప్పింది. అదే జరిగితే ఇప్పటిదాకా నిందితులకు ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించింది. వాస్తవానికి తను 74కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో శుక్రవారం బరిలోకి దిగాల్సి ఉంది. అయితే సీఏఎస్ నిర్ణయంతో అంతా తలక్రిందులైంది. అసలేం జరిగిందంటే.. జూన్ 25, జూలై 5న నర్సింగ్ ఇచ్చిన డోపింగ్ శాంపిల్లో నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలాయి. అయితే కావాలనే ఎవరో అతడు తీసుకునే ఆహారంలో, పానీయాల్లో డ్రగ్స్ కలిపారనే కారణంతో జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఆగస్టు 2న క్లీన్చిట్ ఇచ్చింది. అయితే రియోకు వచ్చాక ఈ నిర్ణయాన్ని ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) సీఏఎస్ అడ్ హక్ డివిజన్లో అప్పీల్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున సీఏఎస్.. వాడాకు అనుకూలంగా తీర్పునివ్వడంతో నర్సింగ్పై వేటు పడింది. ‘నా భవిష్యత్ను చిదిమేశారు’ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తన ఆశలను దారుణంగా చిదిమేశారని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన చెందాడు. తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని స్పష్టం చేశాడు. ‘సీఏఎస్ నిర్ణయం నా జీవితాన్ని చిద్రం చేసింది. గత రెండు నెలల నుంచి నేను పడుతున్న కష్టమంతా వృథా అయ్యింది. కానీ దేశం కోసం ఆడాలనే నా తపన మాత్రం ఎక్కడికీ పోదు’ అని నర్సింగ్ తెలిపాడు. సీబీఐ విచారణ కోరతాం: ఐఓఏ నర్సింగ్ యాదవ్ ఒక్క సీఏఎస్ చేతిలోనే కాకుండా ఒలింపిక్స్కు అతడు వెళ్లకూడదని కోరుకున్న కొందరి చేతిలోనూ ఓడిపోయాడని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ విషయాన్ని ఇంతటితో వదలబోమని, సీబీఐ విచారణ కోరతామని ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో విద్రోహ చర్య ఉందని తాము గట్టిగా వాదించలేకపోయామని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ అన్నారు. -
సందీప్ తోమర్ అవుట్
రియో డి జనీరో: పురుషుల 57కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ సందీప్ తోమర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్లో తను రష్యాకు చెందిన విక్టర్ లెబెడేవ్ చేతిలో 3-7 తేడాతో ఓడాడు. ఆరు నిమిషాల ఈ బౌట్లో సందీప్ ఏ దశలోనూ ప్రత్యర్థిపై పట్టు సాధించలేకపోయాడు. ఆదిలోనే 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విక్టర్ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోవడంతో సందీప్కు రెప్చేజ్ అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో తను రియో నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. 34వ స్థానంలో సందీప్ కుమార్ 50 కి.మీ రేసు నడక ఫైనల్లో సందీప్ కుమార్ 4:07:55 టైమింగ్తో 34వ స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మటెజ్ టోత్కన్నా తను 26 నిమిషాల 57 సెకన్ల ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకున్నాడు. 80 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసును 48 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. -
సాక్షికి ఎయిర్ ఇండియా నజరానా
రియో 2016 ఒలింపిక్స్ లో కోట్లాది భారతీయుల కలను సాకారం చేసిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు ఎయిర్ ఇండియా మరో అరుదైన బహుమతిని ప్రకటించింది. మహిళల ఫ్రీ స్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నహరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ (23 ) విజయానికి గుర్తుగా నజరానాను అందించనుంది. ఒక సంవత్సరంపాటు వర్తించేలా ఏదైనా రెండు ప్రదేశాలకు, రెండు బిజినెస్ క్లాస్ రిటన్ టికెట్స్ ను (సాక్షి, ఆమెతోపాటు మరొకరికి) ఉచితంగా అందిస్తున్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విమానంలో ప్రయాణించే క్రీడాకారిణి కావాలని కలలు కన్న సాక్షిని తాము ఇలా సన్మానించనున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు గర్వకారణమని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై ఇప్పటికే ఒకవైపు అభినందనల వెల్లువ, మరోవైపు భారీ నజరానాలు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.20 లక్షల ప్రత్యేక అవార్డు, రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. అటు భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించింది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. లక్ష అందజేయనున్నారు. 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాక్షి రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. #AI is happy to offer two Business class return tickets to the pride of Nation,#SakshiMalik.You made us proud.#Rio2016. — Air India (@airindiain) August 19, 2016 -
నర్సింగ్కు మరో గండం!
‘నాడా’ క్లీన్చిట్పై ‘వాడా’ అప్పీల్ కొనసాగుతున్న విచారణ 18న తీర్పు వచ్చే అవకాశం రియో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్లో పాల్గొనడం మళ్లీ సందేహంలో పడింది. ఈ నెల 19న అతను బరిలోకి దిగాల్సి ఉండగా, మూడు రోజుల ముందు అతనికి మరో షాక్ తగిలింది. డోపింగ్ వివాదంలో నర్సింగ్ను నిర్దోషిగా తేలుస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చిన తీర్పుపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సందేహం వ్యక్తం చేసింది. క్లీన్చిట్ను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)లో అప్పీల్ చేసింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా సహా ‘వాడా’ అధికారులు దీనికి హాజరయ్యారు. నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ తీసుకోవడంతో రెండు సార్లు పాజిటివ్గా తేలిన నర్సింగ్... తనపై కుట్ర జరిగిందని ఆరోపించాడు. విచారణ తర్వాత ‘నాడా’ అతని తప్పేమీ లేదని తేల్చింది. దీనికి తోడు భారత రెజ్లింగ్ సమాఖ్య అండగా నిలవడంతో నర్సింగ్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రియో చేరుకున్నాడు. ఇలాంటి సమయంలో ‘వాడా’ అప్పీల్కు వెళ్లడం అతనికి కొత్త సమస్య తెచ్చి పెట్టింది. పోటీలకు ముందు రోజు గురువారం విచారణ కొనసాగుతుంది. అదే రోజు అతనికి అనుకూలంగా తీర్పు వస్తే నర్సింగ్ బరిలోకి దిగుతాడు. ‘వాడా’ అప్పీల్ సరైనదిగా ‘కాస్’ భావిస్తే నర్సింగ్పై కనీసం నాలుగేళ్ల నిషేధం పడుతుంది. తాము చివరి వరకు పోరాడతామని, నర్సింగ్కు న్యాయం జరిగి అతను ఒలింపిక్స్లో పాల్గొనేలా చేస్తామని మెహతా విశ్వాసం వ్యక్తం చేశారు. -
తేలని భవితవ్యం!
నర్సింగ్పై నాడా విచారణ పూర్తి శని లేదా సోమ వారాల్లో తీర్పు ఒలింపిక్స్ అవకాశం లేనట్లే న్యూఢిల్లీ: డోపింగ్లో పట్టుబడ్డ రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఒలింపిక్స్లో పాల్గొనే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల పాటు రెజ్లర్ను సుదీర్ఘంగా విచారించిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పును వాయిదా వేసింది. దీంతో నర్సింగ్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లడంతో పాటు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మాత్రం పెరిగింది. అయితే శని లేదా సోమ వారాల్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీన్ని నోట్ చేసుకున్న నాడా న్యాయ బృందం పూర్తిస్థాయి నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేయనుంది. ‘విచారణ పూర్తయింది. శని లేదా సోమవారాల్లో తీర్పు రావొచ్చు. అయితే నర్సింగ్ ఒలింపిక్స్ వెళ్లేందుకు అర్హుడు కాడని నాడా బలంగా వాదిస్తోంది. ఎందుకంటే అతనిపై కుట్రపూరితంగా నేరం మోపారని రెజ్లర్ చెబుతున్నాడు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రుజువులు మాత్రం చూపలేకపోతున్నాడు. తను తాగే నీటిలో ఏదో కలిపారని అఫిడవిట్ దాఖలు చేశాడు. కానీ నాడా, వాడాను సంతృప్తిపరిచే స్థాయిలో దాన్ని రుజువు చేయలేకపోతున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను తప్పు చేయకపోతే అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని లేకపోతే శిక్ష పడుతుందని ఘాటుగా హెచ్చరించాం. ఓ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా తను తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోకుంటే ఎలా అని ప్రశ్నించాం. అయినా సరే ప్యానెల్కు నర్సింగ్ సమర్పించిన ఆధారాలు ఏమాత్రం సరితూగడం లేదు’ అని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ పేర్కొన్నారు. ‘వాడా’ నిబంధన ప్రకారం సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో ఒలింపిక్స్కు అనర్హత వేటు వేస్తూ శిక్ష పడుతుంది. మరోవైపు నర్సింగ్కు న్యాయం జరగాలని అతని మద్దతుదారులు నాడా ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. సాయ్ సెంటర్కు పోలీసులు సోనేపట్: డోపింగ్పై నర్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం ‘సాయ్’లో విచారణ జరిపింది. సాక్షులు, కోచ్లు, వార్డెన్లతో పాటు మరికొంత మందిని కూడా ప్రశ్నించామని నేర విచారణ విభాగం (సీఐఏ) అధికారి ఇందర్వీర్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఈయనను ప్రత్యేకంగా నియమించారు. కేసుతో సంబంధం ఉన్న అందరి నుంచి స్టేట్మెంట్లను సేకరించామని, నర్సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన రెజ్లర్ జితేశ్ను తర్వాత విచారిస్తామని ఇందర్వీర్ చెప్పారు. పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ అక్కడే ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఏదైనా జరగొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. సాయ్ సెంటర్ తమ పరిధిలోకి రాదని అందుకే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు. నర్సింగ్పై వాడా కన్ను! మొత్తానికి నర్సింగ్ డోపింగ్ అంశం వాడా దృష్టికి కూడా వెళ్లింది. వాడా సలహా మేరకే ఈ నెల 5న రెజ్లర్కు సంబంధించి రెండో శాంపిల్ను సేకరించి పరీక్షించినా అందులోనూ పాజిటివ్ ఫలితమే వచ్చింది. వాస్తవంగా జూన్ 25న సేకరించిన రెండు శాంపిల్స్లో మొదట ఒకదాన్ని పరీక్షించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఈనెల 21న నర్సింగ్ సమక్షంలో బి-శాంపిల్నూ టెస్టు చేయగా అక్కడ కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. దీంతో వాడా ఆదేశాల మేరకు ఈనెల 5న నర్సింగ్ నుంచి ప్రత్యేకంగా రక్త, మూత్ర నమూనాలను తీసి పరీక్షించామని నాడా డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు నాడా విచారణలో నర్సింగ్ నిర్దోషిగా తేలితే ప్రవీణ్ రాణా స్థానంలో మళ్లీ అతన్ని ఎంపిక చేస్తామని ఐఓఏ వెల్లడించింది. -
డోపింగ్ టెస్టుల్లో మరో రెజ్లర్ విఫలం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్కు ముందు భారత్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో రెజ్లర్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. రెజ్లర్ సందీప్ తులసి యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు నిర్ధారణయింది. అంతకుముందు భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడం భారత ఒలింపిక్స్ బృందంలో కలకలం రేపుతోంది. అతడు నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్డైనన్ వాడినట్లుజాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్ధారించింది. దీంతో ఇద్దరు భారత రెజ్లర్లు ఒలింపిక్స్ కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
డోపింగ్లో దొరికిన రెజ్లర్ వినోద్
ఆసీస్ తరఫున ఒలింపిక్స్కు దూరం మెల్బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్లో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన తను 66కేజీ గ్రీకో రోమన్ విభాగంలో ఆసీస్ తరఫున ఒలింపిక్స్లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో వినోద్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. ఏ, బీ శాంపిళ్లు కూడా పాజిటివ్గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అతనికి అవకాశం ఇచ్చారు. వినోద్ను జట్టు నుంచి ఆసీస్ తప్పించింది. -
డోపింగ్లో దొరికిన రెజ్లర్ వినోద్
మెల్బోర్న్: భారతీయ సంతతికి చెందిన రెజ్లర్ వినోద్ కుమార్ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. 2015లో ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వినోద్ 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ఒలింపిక్లో బరిలోకి దిగాల్సి ఉంది. అయితే అల్జీరియాలో జరిగిన ఆఫ్రికన్/ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొన్న వినోద్ అక్కడి డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. అతని ఏ, బీ శాంపిళ్లు పాజిటివ్గా తేలడంతో నాలుగేళ్ల సస్పెన్షన్కు గురయ్యాడు. అయితే క్రీడామధ్యవర్తిత్వ కోర్టుకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. వెంటనే వినోద్ను ఒలింపిక్స్ జట్టు నుంచి తప్పించాలని రెజ్లింగ్ ఆస్ట్రేలియాకు ఆ దేశ ఒలింపిక్ కమిటీ సూచించింది. -
అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
పికె లాంటి భారీ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ప్రస్తుతం దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్లో బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో అదే జానర్లో ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మామూలు కథల విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమిర్, నిజజీవిత కథ కావటంతో దంగల్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్న ఆమిర్., ఆ లుక్స్ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే వయసయిన రెజ్లర్లా కనిపించటం కోసం 22 రెండు కేజీల బరువు పెరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సన్నివేశాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపించనున్నాడు ఆమిర్. ఇక యంగ్ ఏజ్లో ఉన్న మహావీర్ పొగట్టకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం తనను తాను ఓ యోధుడిగా మలుచుకుంటున్నాడు. షూటింగ్ కు రెండు రోజుల ముందు తను ఎలా ఉన్నాడో చూపిస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆమిర్. కేవలం 25 వారాల్లో 25 కిలోల బరువు తగ్గి కండల తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సినిమా కోసం ఇంత రిస్క్ చేస్తున్న ఆమిర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 2 days to go before I shoot for young Mahaveer.... @avigowariker pic.twitter.com/RkdmQAV5c0 — Aamir Khan (@aamir_khan) 13 June 2016 -
ఒలింపిక్స్కు యోగేశ్వర్ అర్హత
ఆసియా క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణం ఆస్తానా (కజకిస్తాన్): అంచనాలకు అనుగుణంగా రాణించిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ భారత్కు రియో ఒలింపిక్స్ బెర్త్ను అందించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో యోగేశ్వర్తో తలపడాల్సిన అతని ప్రత్యర్థి కతాయ్ యెర్లాన్బీకీ (చైనా) బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్ను విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో ఆయా విభాగాలలో ఫైనల్కు చేరిన రెజ్లర్లకు మాత్రమే ఒలింపిక్ బెర్త్ ఖాయమవుతుంది. యోగేశ్వర్ ఫలితంతో ఇప్పటివరకు రెజ్లింగ్లో భారత్కు రెండు బెర్త్లు ఖాయమయ్యాయి. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కాంస్యం సాధించి భారత్కు తొలి బెర్త్ను అందించాడు. -
కన్హయ్యపై రెజ్లర్ ట్విట్టర్ దాడి
న్యూఢిల్లీ: రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత, యోగేశ్వర్ దత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గతంలో జెఎన్యూ వివాదంలో సోషల్ మీడియాలో దేశ భక్తియుత కవితను పోస్ట్ చేసిన యోగి ఇపుడు తన దాడిని కన్నయ్యపై ఎక్కుపెట్టారు. ట్విట్టర్ లో జెఎన్యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ కొంతమంది రాజకీయవేత్తలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పాములకు పాలుపోసి పెంచితే... పాలు తాగిన ఆ పాములు మన అమర జవాన్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. మన సైనిక సోదరులపై విషాన్ని వెదజల్లుతున్నారంటూ ట్విట్ చేశారు. కాగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో యోగేశ్వర్ ఫేస్ బుక్ లో స్పందించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమరవీరుడైతే, లాన్స్ నాయక్, హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. कुछ लोगों ने नाग को दुध पिलाया है जो अब हमारे फ़ौजी भाईयों पर इल्ज़ाम लगा कर उन पे ज़हर उगल रहा है. — Yogeshwar Dutt (@DuttYogi) March 9, 2016 -
అబ్బే..పెద్ద గాయమేం కాదు!
‘‘అయ్యో ఆమిర్ఖాన్కు దెబ్బ తగిలిందా... బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు ఆమిర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు విశ్రాంతిలో ఉండాలి?’’ అని ఆమిర్ ఖాన్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన పడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ ‘దంగల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మల్లయోధుడిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమిర్ బరువు కూడా పెరిగారు. కాగా, లూధియానాలో మల్లయుద్ధానికి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు ఆమిర్ భుజానికి గాయం అయ్యిందనే వార్త వచ్చింది. ఈ వార్త విని, ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమిర్ గ్రహించకుండా ఉంటారా? ‘‘నాకు తగిలినది పెద్ద గాయమేం కాదు. కండరం పట్టేసింది. అంతే. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆ తర్వాత షూటింగ్లో పాల్గొంటాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారాయన. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి, ఆదివారం తీవ్రమైన నొప్పితో ఆమిర్ లూధియానా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు పరిశీలించి, వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, అదే రోజు ప్రయాణం చేయకూడదని చెప్పడంతో ఆదివారమంతా ఆమిర్ లూధియానాలోనే ఉన్నారు. సోమవారం ముంబయ్ ప్రయాణమయ్యారు. -
గీతకు కాంస్యం
న్యూఢిల్లీ : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది. దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో బుధవారం జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో ఆమె... వియత్నాంకు చెందిన థి లొన్ నైగుయెన్ను కంగుతినిపించింది. పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరీలో హితేందర్ కూడా కాంస్యపతక పోటీకి అర్హత సంపాదించాడు. -
సందీప్ యాదవ్కు నిరాశ
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ తాష్కెంట్: గతేడాది మూడు పతకాలు నెగ్గి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ ఈసారి రిక్తహస్తాలతో తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. నిరుడు గ్రీకో రోమన్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా చరిత్ర సృష్టించిన సందీప్ తులసీ యాదవ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. 66 కేజీల విభాగంలో పోటీపడిన ఈ మహారాష్ట్ర రెజ్లర్ ఈసారి రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో సందీప్ 5-2తో మతౌస్ మొర్బిట్జెర్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... రెండో రౌండ్లో 5-6తో హసన్ అలియెవ్ (అజర్బైజాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అలియెవ్ ఫైనల్కు చేరుకోకపోవడంతో సందీప్క కనీసం కాంస్యం కోసం నిర్వహించే ‘రెప్చేజ్’ బౌట్లలో పోటీపడే అవకాశం రాలేదు. 80 కేజీల విభాగంలో హర్ప్రీత్ సింగ్ ‘రెప్చేజ్’ రెండో రౌండ్ బౌట్లో 0-5తో బోజో స్టార్సెవిచ్ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 130 కేజీల విభాగంలో ధర్మేందర్ దలాల్ తొలి రౌండ్లో 0-6తో తినలియేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు.