world cup
-
ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్ –19 టీ–20 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్లో మిథాలిరాజ్ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి. టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్లోకి వెళతా. ఓవర్ కవర్ షాట్ నా ఫేవరెట్. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు. లక్ష్యంతో పనిచేస్తేనే.. కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని ఏఆర్కే ఫౌండర్ ఛైర్మన్ రామ్రెడ్డి అన్నారు. 2028లో లోకేష్ , వెన్నెల మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్ రామ్రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించాను. మెరుగైన కోచింగ్ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ జనార్థన్రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎంఎస్కే ప్రసాద్, మాజీ ఐఏఎస్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్వన్ ఆల్రౌండర్గా ఉంది. నాలుగు ప్రపంచ కప్లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్మెన్పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
మన ఐకాన్.. త్రిష!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్ అండర్ – 19, టీ 20 వరల్డ్ కప్ పోటీలకు జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 2022లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలోనూ ఆమె తనదైన ప్రతిభ చాటింది.ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ..ఈనెల 15న పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో ఒత్తిడికి గురైన త్రిష ఓపెనర్గా దిగి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత పసికూన నేపాల్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులతో నాటౌట్గా నిలిచి క్రీజులో లయను అందుకుంది. తర్వాత జరిగిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్లలో వరుసగా 58 నాటౌట్, 32 పరుగులతో రాణించింది. చివరగా బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విలువైన 52 పరుగులు జోడించి, భారత్ గెలుపులో కీలకంగా మారింది. దీంతో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.శిక్షణలో రాటుదేలి..సికింద్రాబాద్లో ఇప్పించిన ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన త్రిష 12 ఏళ్ల వయసులోనే అండర్ – 19 హైదరాబాద్ జట్టుకు ఎంపికై ంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్ –19 ఇండియా జట్టుకు ఎంపికై దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్తో పాటు లెగ్ స్పిన్నర్గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్రను సమర్థంగా పోషించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు భారత ఏ జట్టులో ఆడుతూ సీనియర్ జట్టులో చోటు కోసం శ్రమిస్తోంది.భద్రాచలం టు సికింద్రాబాద్..భద్రాచలానికి చెందిన గొంగడి రామిరెడ్డి ఫిట్నెస్ ట్రైనర్గా ఐటీసీలో పని చేస్తూనే పట్టణంలో సొంతంగా రామ్స్ జిమ్ నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్గా రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు అన్నట్టుగా కూతురు త్రిష చిన్నతనం నుంచే క్రికెట్పై ఆసక్తి చూపించింది. దీంతో క్రికెట్ను కెరీర్గా మలచాలని భావించిన రామిరెడ్డి ఉత్తమ శిక్షణ కోసం సికింద్రాబాద్కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా త్రిషకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఐటీసీలో ఫిట్నెన్ ట్రైనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పట్టణంలో ఉన్న జిమ్ సెంటర్ను అమ్మేసి 2013లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ మొదలైంది.ఐపీఎల్ లెగ్ బ్రేక్..భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లింది మొదలు రెండేళ్ల క్రితం వరకు క్రికెట్లో త్రిష ప్రయాణం ఎదురులేకుండా సాగింది. హైదరాబాద్ అండర్ – 19 నుంచి భారత ఏ జట్టు వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అయితే క్రికెట్ వరల్డ్లో క్రేజీ టోర్నమెంట్గా పేరున్న ఉమెన్ ఐపీఎల్ త్రిషకు కలిసి రాలేదు. ఈ టోర్నీ కోసం జరిగిన వేలంలో త్రిషను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో టోర్నమెంట్ గెలుపులో తాను ఒకరిగా ఉండడం కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. కఠోర సాధన చేసింది. దాని తాలూకూ ఫలితాలు ఈ డిసెంబర్లో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో కనిపించాయి.ఎన్నికల ప్రచారకర్తగా..తెలంగాణ ఎన్నికల సంఘం గొంగడి త్రిషను ఐకాన్గా గుర్తించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్ ఐకాన్గా, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఐకాన్గా పని చేసింది. 2023లో తెలంగాణ ఉమెన్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించింది. ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ త్వరలోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్లో సీనియర్ జట్టుకు ఆడాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.ఇండియా జట్టుకు ఆడాలిఅండర్ –19 విభాగంలో మూడేళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నా. ఇటీవల భారత ఏ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఆడాను. ఏషియా కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రావడం, ఆ కప్ దేశానికి అందించడం సంతోషాన్ని ఇచ్చింది. ఇండియా మహిళల జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం.– గొంగడి త్రిష -
భారత్ ‘ఖో ఖో’ కూత పాక్తో షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్తో ప్రపంచకప్కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం జవహర్లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
దేశం కోసం క్యాన్సర్ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్డే యువీ (ఫోటోలు)
-
Younus Farhan: క్లౌడ్ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం
ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్షిప్ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్పై నేచర్ చేసిన సిగ్నేచర్ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్ ఫర్హాన్ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? మేఘంతో నా సాన్నిహిత్యంచిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్ ఫొటోగ్రఫీ కెరీర్గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. ముఖ్యంగా 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్ కప్ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను. నార్కోటిక్స్ డే ప్రచారంగా.. నేను మొదటిసారి ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్ షేప్ను కూడా ఫొటో తీశాను. వరల్డ్ నార్కోటిక్స్ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్ భగత్ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం సోషల్ మీడియాలో నా క్లౌడ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చేరాలి2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్ లేదా థియరీలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. – యూనస్ ఫర్హాన్ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ -
ఖో ఖో తొలి ప్రపంచకప్.. ఆరంభం ఆరోజే!
న్యూఢిల్లీ: మన మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ఇప్పుడు ప్రపంచకప్గా ప్రసిద్ధికెక్కెందుకు సిద్ధమైంది. ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ టోర్నమెంట్కు న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు జరిగే పోటీలను ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక లోగోను ‘ది వరల్డ్ గోస్ ఖో ఖో’ ట్యాగ్లైన్తో బుధవారం ఆవిష్కరించారు.మొత్తం 24 దేశాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఖోఖో ఆట మన మట్టిలో పుట్టింది. ఇప్పుడు ‘మ్యాట్’ మీదికి మారి మరో స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామీణ క్రీడను అంతర్జాతీయ క్రీడగా ఎదిగేందుకు కృషి చేసిన మన సమాఖ్యను అభినందించాల్సిందే.ముందుగా మన దేశంలో ఈ ఆటను అల్టిమేట్ ఖోఖో లీగ్గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రపంచకప్ మెగాఈవెంట్గా తీసుకొస్తున్నాం’ అని అన్నారు. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఖోఖో మన చరిత్రలో భాగమైందని, భారత ప్రభుత్వం ఇలాంటి క్రీడలకు విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తోందని, ఈ వరుసలోనే తొలి ఖోఖో ప్రపంచకప్ ఆతిథ్యమిస్తోందని చెప్పారు. ఈ విషయంలో కేకేఎఫ్ఐ పోషించిన పాత్రను ఆమె అభినందించారు. -
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్కు భారత్ ఆతిథ్యం
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్లో పదహారు పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. ‘ఖోఖో మూలాలు భారత్లో ఉన్నాయి. ప్రాచీన క్రీడలో ప్రపంచకప్ నిర్వహించడం ద్వారా ఘన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో 54 దేశాలు ఆడుతున్నాయి. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం. అందులో ప్రపంచకప్ తొలి అడుగు’ అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్నాన్చాంగ్ (చైనా): ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 110–99 పాయింట్లతో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా రిలే స్కోరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్లు జరుగుతుండగా... తొలుత 110 పాయింట్లు చేరిన జట్టు విజేతగా నిలుస్తుంది. టర్కీకంటే ముందు పెరూ, అజర్బైజాన్, మారిషస్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ భారత జట్టు గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది. -
మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం. ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్లుంటే ఒక టికెట్తోనే ఆ రెండు మ్యాచ్ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్సైట్తో పాటు, ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది. -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్లో కాదు. ప్రపంచకప్లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్కప్లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్బాల్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్బాల్లో రాణిస్తున్న తనను పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్బాల్ క్రీడాకారిణి -
భారత్ విక్టరీ.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా..
ఢిల్లీ: టీ20 వరల్డ్కప్లో విజేత నిలిచిన భారత జట్టును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. టీమిండియా విజయం పట్ల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదే సమయంలో టీమిండియా విజయంపై ఢిల్లీ పోలీసులు సరికొత్తగా ట్వీట్ చేశారు. టీమ్ విజయానికి ట్రాఫిక్ సిగ్నల్స్కు లింక్ పెడుతూ ప్రతీ ఒక్కరిని ఆలోచించే విధంగా పోస్ట్ను ట్విట్టర్లో పోస్టు చేశారు. We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCupLet's be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say? Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA— Delhi Police (@DelhiPolice) June 29, 2024కాగా, ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The Dream Come True Number Plate!#UnStoppables#IndVsSA#WorldChampions pic.twitter.com/xMHfQjsnCc— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 29, 2024 -
T20 World Cup 2024: 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్కు చేరింది. ప్రపంచకప్ టోర్నీల్లో ప్రొటీస్ ప్రస్తానం 1992 వన్డే వరల్డ్కప్ ఎడిషన్తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్ గండం దాటింది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది. సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్లో ఆరంభ ఎడిషన్ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్కు చేరింది.బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ (వరల్డ్కప్) గెలవలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్ మార్క్రమ్ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్కప్ (టీ20) ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా మార్క్రమ్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్కు అండర్-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్గానూ రికార్ంది. మార్క్రమ్ సెంటిమెంట్ తమకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న రాజ్సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!) -
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్, అర్ష్దీప్ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్కప్ బెర్త్పై గంపెడాశలు పెట్టుకున్న రింకూ సింగ్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యాడు. శుభ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ కూడా ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యారు.టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ -
ఫైనల్ లో బోల్తా పడ్డ కుర్రోళ్ళు
-
ప్రపంచ క్రికెట్పై కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యం
ప్రపంచ క్రికెట్పై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ జట్టు ఫార్మాట్లకతీతంగా వరుస టైటిల్స్ సాధిస్తూ ప్రపంచ క్రికెట్ను శాశిస్తుంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్లో ఆస్ట్రేలియా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా హవా పురుషుల క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్లోనూ ఈ జట్టు డామినేషనే నడుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ సత్తా చాటారు. ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన అండర్ 19 వరల్డ్కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తు చేసి ఈ విభాగంలో నాలుగోసారి జగజ్జేతగా అవతరించింది. అండర్ 19 టైటిల్తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో (పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్) వరల్డ్ ఛాంపియన్గా (వన్డే ఫార్మాట్లో) అవతరించింది. వన్డే వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా అండర్ 19 వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల టీ20 ఛాంపియన్-ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్-ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
ఆహా.. ఏం ఆడార్రా మన కుర్రోళ్లు..!
-
2024 ఆటలు...ఆశలు...
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్లో ఈ సారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్ టైటిల్తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్–19 స్థాయిలో ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్ 23 రేస్లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్బాల్లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే. టెన్నిస్లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్స్లామ్ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్ మీ కోసం... భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ జనవరి 11–17: అఫ్గానిస్తాన్తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్లు జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్తో స్వదేశంలో 5 టెస్టులు ఐపీఎల్: మార్చి 22 నుంచి మే 26 వరకు జూలై: శ్రీలంకలో భారత్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ (2 టెస్టులు, 3 టి20లు) అక్టోబర్: స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ (3 టెస్టులు) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (5 టెస్టులు) పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వేదిక: వెస్టిండీస్, అమెరికా ఫుట్బాల్ ఆసియా కప్ (ఖతర్) జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు యూరో–2024 (జర్మనీ) జూన్ 14 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా టోర్నీ (అమెరికా) జూన్ 20 నుంచి జూలై 14 వరకు బ్యాడ్మింటన్ జనవరి 9–14: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 16–21: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 5–10: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) మార్చి 12–17: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్–1000 టోర్నీ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 28–మే 5: థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ (చెంగ్డూ, చైనా) మే 28–జూన్ 2: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ జూన్ 4–9: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) ఆగస్టు 20–25: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) సెప్టెంబర్17–22: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) నవంబర్ 19–24: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) నవంబర్ 26–డిసెంబర్ 1: సయ్యద్ మోడి ఓపెన్–300 టోర్నీ (లక్నో) డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా) టెన్నిస్ జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (పారిస్) జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ (న్యూయార్క్) నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (టురిన్, ఇటలీ) ఫార్ములావన్ మార్చి 2: బహ్రెయిన్ గ్రాండ్ప్రి మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్ప్రి మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్ప్రి ఏప్రిల్ 7: జపాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 21: చైనా గ్రాండ్ప్రి మే 5: మయామి గ్రాండ్ప్రి మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్ప్రి మే 26: మొనాకో గ్రాండ్ప్రి జూన్ 9: కెనడా గ్రాండ్ప్రి జూన్ 23: స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్ప్రి జూలై 7: బ్రిటిష్ గ్రాండ్ప్రి జూలై 21: హంగేరి గ్రాండ్ప్రి జూలై 28: బెల్జియం గ్రాండ్ప్రి ఆగస్టు 25: డచ్ గ్రాండ్ప్రి సెప్టెంబర్ 1: ఇటలీ గ్రాండ్ప్రి సెప్టెంబర్15: అజర్బైజాన్ గ్రాండ్ప్రి సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్ప్రి అక్టోబర్ 20: యూఎస్ గ్రాండ్ప్రి అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్ప్రి నవంబర్ 3: బ్రెజిల్ గ్రాండ్ప్రి నవంబర్ 23: లాస్ వేగస్ గ్రాండ్ప్రి డిసెంబర్ 1: ఖతర్ గ్రాండ్ప్రి హాకీ జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–19: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (రాంచీ, భారత్) జనవరి 15–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్) షూటింగ్ జనవరి 5–18: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జకార్తా) జనవరి 12–22: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్గన్ టోర్నీ (కువైట్ సిటీ) జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (కైరో, ఈజిప్ట్) ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ (రబాట్, మొరాకో) ఏప్రిల్ 11–19: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) ఏప్రిల్ 22–30: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్గన్ టోర్నీ (దోహా, ఖతర్) మే 1–12: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నీ (బకూ, అజర్బైజాన్) మే 31–జూన్ 7: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) జూన్ 10–19: ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ (లొనాటో, ఇటలీ) అండర్–19 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ సెప్టెంబర్–అక్టోబర్ వేదిక: బంగ్లాదేశ్ పారిస్ ఒలింపిక్స్ – 26 జూలై – 11 ఆగస్టు అథ్లెటిక్స్ జనవరి 21: ఆసియా మారథాన్ చాంపియన్షిప్ (హాంకాంగ్) ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (టెహ్రాన్) మార్చి 1–3: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (స్కాట్లాండ్) ఆగస్టు 26–31: ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్ (పెరూ) చెస్ ఏప్రిల్ 3–25: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (టొరంటో, కెనడా) జూన్ 1–14: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్షిప్ (న్యూఢిల్లీ, భారత్) సెప్టెంబర్10–23: చెస్ ఒలింపియాడ్ (బుడాపెస్ట్, హంగేరి) అక్టోబర్ 22–నవంబర్ 2: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (బ్రెజిల్) రెజ్లింగ్ ఏప్రిల్ 11–16: ఆసియా సీనియర్ చాంపియన్షిప్ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) ఏప్రిల్ 19–21: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) మే 9–12: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) బాక్సింగ్ ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇటలీ) ఏప్రిల్: ఆసియా చాంపియన్షిప్ మే 23–జూన్ 3: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్లాండ్) అక్టోబర్ 20–నవంబర్ 6: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (క్రొయేషియా) టేబుల్ టెన్నిస్ ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ (బుసాన్, కొరియా) డిసెంబర్ 1–8: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (స్వీడన్) ఆర్చరీ ఏప్రిల్ 23–28: ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ (షాంఘై, చైనా) మే 21–26: ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ (యెచోన్, కొరియా) జూన్ 18–23: ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) -
‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ గెలిచి వారం రోజులు దాటినా ఆ్రస్టేలియా జట్టు తమ విజయాన్ని ఇంకా వేడుకలా జరుపుకుంటూనే ఉంది. మంగళవారం సిడ్నీ మైదానంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ మిచెల్ స్టార్క్ కలిసి వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కమిన్స్ తన ఫైనల్ మ్యాచ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా కోహ్లి వికెట్ తీయడం మ్యాచ్ను మలుపు తిప్పిందని అతను అన్నాడు. కమిన్స్ బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఆ క్షణం మైదానంలో ఆవరించిన నిశ్శబ్దం మరచిపోలేనని కమిన్స్ అన్నాడు. ‘కోహ్లి వికెట్ పడిన తర్వాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్మిత్ ఒక మాట అన్నాడు. మైదానంలో ఏదైనా శబ్దం వినిపిస్తోందా అని అడిగాడు. మేం ఒక క్షణం ఆగి గమనించాం. స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది. లక్ష మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటా’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఒకే సమయంలో భిన్న ఫార్మాట్లలో తాము ప్రపంచ చాంపియన్లుగా ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు ముందుగానే... భారత్తో జరుగుతున్న టి20 సిరీస్లో పాల్గొంటున్న ఆ్రస్టేలియా జట్టులోని ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు సిరీస్ ముగియడానికి ముందే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నవారిలో ఏడుగురు టి20 సిరీస్ కోసం ఇక్కడే ఆగిపోయారు. వీరిలో హెడ్ ఒక్కడే సిరీస్ ముగిసే వరకు ఉండనున్నారు. స్మిత్, జంపా ఇప్పటికే బయల్దేరిపోగా...మరో నలుగురు మ్యాక్స్వెల్, స్టొయినిస్, ఇన్గ్లిస్, అబాట్ మూడో మ్యాచ్ ముగియగానే వెళ్లిపోతారు. చివరి రెండు మ్యాచ్లకు వీరు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానాల్లో జోష్ ఫిలిప్, బెన్ మెక్డెర్మాట్, బెన్ డ్వార్షియస్, క్రిస్ గ్రీన్లను ఆ్రస్టేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు. -
సల్మాన్ ఖాన్ కు సీక్వెల్ ఫీవర్.. టైగర్ 4 ప్లాన్!
-
"పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రంచకప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ రావడం వల్లే భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్లో జరిగిన ప్రచార ర్యాలీ మోదీని 'దురదృష్టం'తో పోలుస్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే "పనౌటీ మోదీ" అని అన్నారంటూ దూమారం రేగింది. అంతేగాదు ఆ బహిరంగ ర్యాలీలో మోదీని అదాని పారశ్రామికవేత్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనౌటి అనే పదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా అవుతోంది. ఐతే ఈ పనైటి పదానిక అర్థం.. ఏవ్యక్తి మన వద్దకు వస్తే అవ్వాల్సిన పనులు ఆగిపోవడం లేదా జరగకపోవడం వంటివి జరిగినప్పుడూ ప్రయోగిస్తారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై "పనౌటి" అనే పదాన్ని ప్రయోగించడంతో రాహుల్పై తీవ్ర స్థాయిలో మండిపడింది బీజేపి. పైగా రాహుల్ ఆ ప్రచార ర్యాలీలో మోదీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి హిందూ-ముస్లీం అని జపిస్తుంటారు. ఆయన మిలినియర్ల రుణాలను మాఫీ చేసి మంచి ప్రయోజనాలు అందిస్తుంటారని విమర్శలు గుప్పించారు. पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs — Congress (@INCIndia) November 21, 2023 దీంతో ఒక్కసారిగా రాహుల్పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ మేరకు బీజేపీ లోక్సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..రాహుల్గాంధీ ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి పదాన్ని ఎలా ప్రయోగించగలిగారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మీనాకాశి లేఖి కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ప్రధానిపై అలాంటి పదాన్ని ఉపయోగించగలిగారంటే.. రాహుల్ ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. VIDEO | "If Rahul Gandhi has used a word like 'panauti', then it reflects what kind of person he is. Using such words for PM, who is working continuously for the country, is not acceptable and the entire country is watching this," says Union MoS @M_Lekhi on Rahul Gandhi's remark… pic.twitter.com/SfI8ASwtrt — Press Trust of India (@PTI_News) November 21, 2023 ఇలాంటి పదాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. యావత్తు దేశం మిమ్మల్ని చూస్తోంది. నిరంతరం దేశం కోసం పనిచేసే ఓ వ్యక్తిపై ఇలా నిందలు వేయడం సబబు కాదని హితవు పలికారు. అలాగే లోక్సభ ఎంపీ రవి శకంర్ ప్రసాద్ కూడా రాహుల్ మీకు ఏమైంది? ఆ రోజు క్రీడాకారులను కలిసి వారిలో స్థైర్యాన్ని పెంచే యత్నం చేసిన అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదాన్ని ప్రయోగిస్తారా? అంటూ తిట్టిపోశారు. మీరు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని రాహుల్కి చురకలంటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆరోపణల స్ట్రాటజీ వర్సెస్ గ్యారంటీల గేమ్? రాష్ట్ర ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే! -
టీమిండియా ఓటమికి ఉద్యోగులకు సెలవు
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. Boss ne sach me leave de di aaj😭 Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3 — Diksha Gupta (@thedikshagupta) November 20, 2023 -
డిప్రెషన్కు వాడే టాబ్లెట్ పేరేంటి?.. నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్!
ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అభిమానులను అలరించిన హీరో నవీన్ పొలిశెట్టి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ','జాతి రత్నాలు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం 'జాతి రత్నాలు' డైరెక్టర్తోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలో నవీన్ మాట్లాడుతూ..' అరే వంశీ.. అదేదో డిప్రెషన్ కోసం ఏదో టాబ్లెట్ ఉందన్నావ్ కదరా.. ఆ టాబ్లెట్ పేరేంట్రా?.. ఒక ఫ్రెండ్ కోసం అడుగుతున్నారా? నాకోసం నేనేందుకు అడుగుతారా?.. ఇప్పుడు నా లైఫ్లో జాయ్ఫుల్ ఫేజ్లో ఉన్నా.. డోలో 650 నా.. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేక పేమేంట్ సీటా? అని అన్నారు. అయితే ఈ వీడియోకు వరల్డ్ కప్ ఫైనల్-2023 అంటూ ట్యాగ్ చేశారు. అయితే మ్యాచ్లో ఇండియా ఓటమిని ఇంకా మర్చిపోలేక ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5 — Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023 -
భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ప్రధాని
అహ్మదాబాద్: వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఉరకలెత్తే ఉత్సాహంతో ముందంజ వేసిన భారత జట్టు ఫైనల్ పరాభవంతో షాక్కు గురైంది. నిశ్శబ్దం ఆవహించి... నిరాశలో కూరుకుపోయిన రోహిత్ శర్మ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ఆదివారం రాత్రి బహుమతి ప్రదానోత్సవం ముగిశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి మోదీ భారత డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ప్రతీ ఒక్క ఆటగాడిని సముదాయించారు. ఈ నిరాశ నుంచి కోలుకునేందుకు ఓదార్పు మాటలు చెప్పారు. ‘ప్రియమైన టీమిండియా... మీ ప్రతిభ, ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంకితభావంతో ప్రపంచకప్ గెలిచేందుకు టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడారు. మీ కృషి వెలకట్టలేనిది. ప్రపంచకప్లో మీరు కనబరిచిన క్రీడాస్ఫూర్తిని చూసి జాతి గర్విస్తోంది. యావత్ దేశం మీ వెన్నంటే ఉంది. ఇకపై కూడా ఉంటుంది’ అని ఎక్స్లో ప్రధాని ట్వీట్ చేశారు. దీన్ని పలువురు క్రికెట్ అభిమానులు షమీని ప్రధాని ఓదారుస్తున్న ఫోటోను జతచేసి రీ ట్వీట్లతో అనుసరించారు. ‘టోర్నీలో గొప్పగా ఆడాం. ఆఖరి పోరులోనే ఓడిపోయాం. ఈ చేదు ఫలితం అందరి గుండెల్ని బద్దలు చేసింది. ఇలాంటి సమయంలో ప్రధాని మా డ్రెస్సింగ్ రూమ్కు వచ్చి కొండంత బలాన్నిచ్చేలా ఓదార్పు పలికారు. మోదీకి కృతజ్ఞతలు’ అని ఆల్రౌండర్ జడేజా ఎక్స్లో పోస్ట్ చేశారు. -
CWC 2023:‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్
వన్డే ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ఎయిర్లైన్స్కు కలిసొచ్చిన వరల్డ్కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్స్కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్స్కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
అబ్బుర పరిచిన వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: అనుకున్నట్లుగానే చక్కని ప్రణాళికతో, స్వల్పకాల రిహార్సల్స్తో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ఏయిర్ షో లక్షమందికి పైగా ప్రేక్షకుల్ని కన్నార్పకుండా చేసింది. తొమ్మిది హాక్ ఎంకే–132 ఎయిర్క్రాఫ్ట్లతో కూడా బృందం నరేంద్ర మోదీ స్టేడియంపై చరిత్ర సృష్టించింది. లక్షా 32 వేల మంది జేజేలతో విన్యాసాలను ఆస్వాదించారు. సూర్యకిరణ్ టీమ్ వైమానిక విన్యాసాలు కొత్త కాకపోయినా... ఓ క్రికెట్ స్టేడియంపై ఎయిర్షో చేయడమే కొత్త. గతంలో క్రికెట్ అనే కాదు... ఏ ఆటకు అంతెందుకు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ (2010)లోనూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. తద్వారా ఈ ప్రపంచకప్కు ఎయిర్ షో కొత్త శోభ తెచ్చినట్లయింది. -
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్లో షమీ తన బౌలింగ్తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్తో నా కుమారుడు అయాన్కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
విరాట్ కోహ్లీ మా పొరుగింటి వ్యక్తే: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే టైగర్-3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. టైగర్ సిరీస్లో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మెరిసింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మరోవైపు కోలీవుడ్లో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ప్రస్తుతం అందరిదృష్టి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పైనే ఉంది. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష) ఫైనల్ మ్యాచ్కు ముందు కింగ్ కోహ్లీ విరాట్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఇన్స్టాలో 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్' అనే సెషన్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ గురించి చెప్పండి? అని ప్రశ్నించారు. దీనికి కత్రినా బదులిస్తూ.. 'సూపర్ స్టార్, ఆదర్శవంతుడు, అంతే కాకుండా మా పొరుగు వ్యక్తి' అంటూ విరాట్ ఫోటోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా టైగర్ సినిమా గురించి నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కత్రినా తెలిపారు. ఈ వరల్డ్ కప్లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీని కత్రినా ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు.. ఆమె పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీని ప్రశంసించారు. కాగా.. అనుష్క శర్మ, కోహ్లి చాలా ఏళ్లుగా ముంబయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. కత్రినా తన వివాహానంతరం భర్త విక్కీ కౌశల్తో కలిసి అదే భవనంలో ఉంటోంది. (ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!) -
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
ఇండియా టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న హీరో వెంకటేష్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
రివేంజ్ పక్కా అంటున్న భారత్..!
-
ఫైనల్కు 13 భారీ స్క్రీన్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.గోపీనాథ్రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్), స్టేడియాల్లో సదుపాయాలు, క్రీడాకారులకు పౌష్టికాహారం, విశాఖలో నూతన స్టేడియం నిర్మాణం, స్కూల్ విద్యార్థులకు లీగ్ టోర్నమెంట్స్.. ఇలా ఏసీఏ ప్రణాళికలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు. ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్స్, ఫుడ్ కోర్టులూ ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో రూ. 300 కోట్లతో కొత్త స్టేడియం విశాఖలో బీసీసీఐతో కలిసి రూ.300 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తాం. ఈ స్టేడియం సామర్థ్యం 50 వేల పైనే ఉంటుంది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల సంక్షేమం, శిక్షణపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోంది. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయి. అన్నింట్లోనూ మెషినరీ, నెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్లను శిక్షణ కోసం ఎన్సీఏకు పంపిస్తున్నాం. ఏపీఎల్ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే రెండు సీజన్లు విశాఖలో నిర్వహించాం. పదేళ్లుగా ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్ వచ్చింది. త్వరలో స్కూల్ లీగ్స్ ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్రా క్రికెట్లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిలో ముఖ్యమైనది పాఠశాలల స్థాయిలో లీగ్స్. 12 నుంచి 16 ఏళ్లలోపు వారికి ప్రతి నియోజకవర్గం పరిధిలో టోర్నమెంట్స్ నిర్వహిస్తాం. వీటిలో ప్రతిభ చూపిన వారిని సబ్సెంటర్లకు, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి.. ఇలా ఉన్నత స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంచేందుకు జోనల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్రికెటర్కు నెలకు రూ.3 వేలు పౌష్టికాహారం కోసం అందజేస్తున్నాం. ఇందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతోంది. దేశంలో మరే అసోసియేషన్ ఇవ్వని విధంగా రిటైర్డ్ రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలని ఏసీఏ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకస్తుందని ప్రకటించింది. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో శిక్షణ ఇచ్చే వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. సీజన్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లను పంపిస్తాం. -
ఇండియా వరల్డ్ కప్.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరల్డ్ కప్లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు వేయండి. అజారుద్దీన్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్ హైదరాబాద్లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం. కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్ధన్రెడ్డి కొడుకు విష్ణు బీఆర్ఎస్లో చేరి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇదీచదవండి.. బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో భారత్తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్కతా: ఐదుసార్లు వరల్డ్కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్కు చేరింది. ఆదివారం భారత్తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్లోనే భారత్తో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్లోనే వార్నర్ 3 సిక్స్లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్లో లబుõÙన్ (18), మ్యాక్స్వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్వుడ్ 3; బవుమా (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్వెల్ (బి) షమ్సీ 1; ఇన్గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్లో అప్రతిహతంగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయాస్లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్లో మొదటి 4 మ్యాచ్ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
‘షమీ’ఫైనల్ వండర్
భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్లో ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్కు చేర్చాడు. ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాలుగోసారి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, అయ్యర్ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (7/57) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్కతాలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఒకరితో మరొకరు పోటీ పడి... ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్లోనే రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. గిల్ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్ 70 పరుగులు చేసింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్ పెవిలియన్కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్ మెరుపు బ్యాటింగ్తో కివీస్ పని పట్టాడు. 29వ ఓవర్ తొలి బంతికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. 40వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లతో అయ్యర్ సత్తా చాటాడు. సౌతీ ఓవర్లో భారీ సిక్స్ బాదిన అయ్యర్ తర్వాతి బంతికి సింగిల్ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 110 పరుగులు సాధించింది. భయపెట్టిన భాగస్వామ్యాలు... దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్లు, బైస్, ఓవర్త్రోలు, ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్కు కలిసొచ్చాయి. ముఖ్యంగా మిచెల్ ప్రతీ బౌలర్పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 181 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్కు వికెట్ దక్కింది. విలియమ్సన్ను అవుట్ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్ (0)ను వెనక్కి పంపడంతో కివీస్ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్లో కివీస్ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరాజయం ఖాయమైంది. 4 వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్ 1983 (విజేత), 2003 (రన్నరప్), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది. 1 ఒకే ప్రపంచకప్లో మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు తీసిన తొలి బౌలర్గా షమీ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్ (ఇంగ్లండ్; 1975లో), అషంత డి మెల్ (శ్రీలంక; 1983లో), వాస్బెర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్; 2003లో), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్; 2011లో), ముస్తఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్; 2019లో), మిచెల్ స్టార్క్ (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 51 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ అవతరించాడు. రోహిత్ ఇప్పటి వరకు 51 సిక్స్లు కొట్టాడు. 49 సిక్స్లతో క్రిస్ గేల్ (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గానూ రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ 28 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ (2015లో 26 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. 397 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై న్యూజిలాండ్ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. ‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ ఎదురుగా... సచిన్ సొంత మైదానంలో... సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన తేదీన... సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఖరి సారిగా బ్యాటింగ్ చేసిన తేదీన... ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో సచిన్ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్ చూస్తే మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్ (2011, 2015, 2019) సెమీఫైనల్స్లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్లో చూడచక్కటి సిక్సర్ కొట్టాక ఫిలిప్స్ ఓవర్లో తీసిన సింగిల్తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది. 49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు పంపిన కింగ్... సచిన్ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది. 711 ఈ ప్రపంచకప్లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించాడు. 24 భారత్లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్ 20 సెంచరీలు (భారత్లో), పాంటింగ్ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా. –విరాట్ కోహ్లి విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం. -షమీ ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాప్–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 47; గిల్ (నాటౌట్) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 105; రాహుల్ (నాటౌట్) 39; సూర్యకుమార్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్: బౌల్ట్ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్ట్నర్ 10–1–51–0, ఫెర్గూసన్ 8–0–65–0, రచిన్ 7–0–60–0, ఫిలిప్స్ 5–0–33–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రాహుల్ (బి) షమీ 13; రచిన్ (సి) రాహుల్ (బి) షమీ 13; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 69; మిచెల్ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్మన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 2; సాన్ట్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 9; సౌతీ (సి) రాహుల్ (బి) షమీ 9; బౌల్ట్ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) రాహుల్ (బి) షమీ 6; ఎక్స్ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్: బుమ్రా 10–1–64–1, సిరాజ్ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్ 10–0–56–1. -
ప్రపంచకప్లో నేడు రెండో సెమీఫైనల్.. ఆసీస్తో సౌతాఫ్రికా 'ఢీ'
కోల్కతా: ఫైనల్ను తలపించే సెమీఫైనల్ పోరుకు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సిద్ధమయ్యాయి. రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ రెండో సెమీఫైనల్ కడదాకా ఆసక్తికరంగా జరగడం ఖాయం. తరాలు మారినా హేమాహేమీలతో సరితూగిన సఫారీ జట్టు ప్రపంచకప్లో మాత్రం చోకర్స్గానే మిగిలింది. గతంలో దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్లో నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీఫైనల్లోకి ప్రవేశించి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఐదో ప్రయత్నంలోనైనా తొలిసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగుతోంది. జట్టు కూడా జోరుమీదుంది. ఓపెనింగ్, మిడిలార్డర్ అందరూ భారీ స్కోర్లలో భాగమవుతున్నారు. పైగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థులపై ఐదుసార్లు 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసిన జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే! ఒక్క భారత్ తప్ప సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలపై తమ భారీస్కోర్ల తడాఖా చూపింది. డికాక్, డసెన్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో రబడ కంటే కొయెట్జీ ప్రమాదకరంగా మారాడు. ఎన్గిడి, కేశవ్ మహరాజ్లతో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. మరోవైపు ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా ప్రపంచకప్ను ఆరంభించిన తీరు, తర్వాత మారిన విధానం, దూసుకొచ్చి న వైనం ఈ ఈవెంట్లో ఏ జట్టుకు సాధ్యం కాదేమో! ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆసీస్ టోర్నీ సాగేకొద్దీ దుర్బేధ్యంగా మారింది. వార్నర్, మార్‡్ష, లబుషేన్, స్మిత్లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అఫ్గానిస్తాన్తో వీరోచిత డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్వెల్ గాయంతో తదుపరి బంగ్లాదేశ్లో ఆడలేకపోయాడు. అయితే కీలకమైన ఈ సెమీస్లో అతను బరిలోకి దిగుతాడని, ఫిట్నెస్తో ఉన్నాడని కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్ష సూచన ఉంది. గురువారం మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే శుక్రవారం కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఫలితం రాకపోతే టోర్నీ లీగ్దశలో మెరుగైన స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
CWC 2023: నేడు భారత్తో న్యూజిలాండ్ సెమీస్ సమయం
9 మంది ప్రత్యర్థులు... 9 విజయాలు... అదిరిపోయే బ్యాటింగ్ బలగం... పేసర్ల అద్భుత ప్రదర్శన... స్పిన్నర్ల జోరు... ఫీల్డింగ్ మెరుపులు... వెరసి ఇప్పటివరకు టీమిండియా అజేయ యాత్ర సాగిపోయింది. ఏమాత్రం పోటీ, ఎదురన్నదే లేకుండా దూసుకుపోయి ప్రపంచకప్ లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ జట్టు అసలైన సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో చూపించిన జోరును మరో రెండు మ్యాచ్లలో కొనసాగిస్తే చాలు... భారత్ మూడోసారి వరల్డ్ కప్ సగర్వంగా గెలిచి కోట్లాది అభిమానుల కోరిక నెరవేరడం ఖాయం. అయితే ఇప్పుడు గత 9 మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. తీవ్ర ఒత్తిడి, ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించినా కోలుకునే అవకాశం ఉండని నాకౌట్ మ్యాచ్లో పూర్తి స్థాయిలో సత్తా చాటాల్సిందే. ఎదురుగా ఉన్నది అణువణువూ పోరాటతత్వం నింపుకున్న న్యూజిలాండ్ జట్టు. ప్రత్యర్థి ఎవరైనా ఆఖరి బంతి వరకు పట్టు వీడని కివీస్తో పోరు అంత సులువు కాదు. నాలుగేళ్ల క్రితం సెమీఫైనల్లోనే కివీస్ కొట్టిన దెబ్బను సగటు భారత క్రికెట్ అభిమాని మరచిపోలేదు... ప్రత్యరి్థతో పోలిస్తే మన జట్టుదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తున్నా కీలక సమయంలో పట్టుదలగా నిలవడమే ప్రధానం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తొలి సెమీఫైనల్కు రంగం సిద్ధమైంది. వరుసగా గత రెండు ప్రపంచకప్లలో సెమీఫైనల్కే పరిమితమైన భారత్ ఈసారి ఈ అడ్డంకి దాటి ఫైనల్ చేరుతుందా లేక గత రెండు టోరీ్నల్లో ఫైనల్లోనే ఓడిన న్యూజిలాండ్ మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: ప్రపంచకప్లో భారత్ గెలిచిన 9 మ్యాచ్లలో కాస్త ఇబ్బంది పడిన, తడబాటుకు గురైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్తోనే. 274 పరుగుల లక్ష్యఛేదనలో చివరికి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి టీమిండియా గట్టెక్కింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్తోనే రోహిత్ బృందం సెమీఫైనల్లో అమీతుమీకి సై అంటోంది. వాంఖెడే మైదానంలో నేడు జరిగే తొలి సెమీస్ పోరులో కివీస్తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ఆరంభంలో అద్భుతంగా ఆడి ఆ తర్వాత వెనుకబడినా చివర్లో రాణించి టాప్–4లో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్ మరోసారి సెమీస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తున్నా నాకౌట్ మ్యాచ్ కావడంతో అంచనాలకు భిన్నంగానూ సాగే అవకాశం ఉంది. మార్పుల్లేకుండా... వరల్డ్కప్లో తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత ధర్మశాలలో న్యూజిలాండ్ జరిగిన ఐదో మ్యాచ్ కోసం టీమిండియా స్వల్ప మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచి ఎలాంటి మార్పు లేకుండా అదే తుది జట్టును కొనసాగిస్తోంది. జట్టు ఫామ్ను బట్టి చూస్తే ఇప్పుడూ అదే కొనసాగించడం ఖాయం. టీమ్ మొత్తం తమదైన రీతిలో సత్తా చాటి జట్టును నడిపిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విషయంలోనూ లోపాలు లేకుండా జట్టు గొప్పగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి టోర్నీలో టాప్ స్కోరర్గా (594 పరుగులు) కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 503, శ్రేయస్ 421 పరుగులతో జట్టు బ్యాటింగ్ను నడిపిస్తున్నారు. గిల్, రాహుల్లకు కూడా విజయాల్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, జడేజాల బ్యాటింగ్ భారత్కు అదనపు బలంగా మారింది. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు దాదాపు అసాధ్యంగా మారగా... కుల్దీప్, జడేజా స్పిన్ను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో భారత్ను నిలువరించాలంటే ఏ జట్టయినా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. ఆల్రౌండ్ నైపుణ్యంతో... న్యూజిలాండ్ కూడా అంచనాలకు మించి రాణించి భారత్ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర వరుసగా జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. రచిన్ 565 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మిడిలార్డర్ బ్యాటర్ డరైల్ మిచెల్ కూడా 418 పరుగులు సాధించాడు. 359 పరుగులు చేసిన కాన్వే దూకుడుగా ఆడటంలో మేటి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను సమర్థంగా నడిపించగలడు. టామ్ లాథమ్ కూడా చక్కటి బ్యాటర్ కాగా... మెరుపు బ్యాటింగ్ చేయగల ఫిలిప్స్, చాప్మన్ ఆ జట్టు మిడిలార్డర్లో ఉండటం అదనపు బలం. స్పిన్నర్ సాన్ట్నర్పై భారత్పై మంచి రికార్డు ఉండగా... కివీస్ కూడా తమ పేస్ బలాన్ని నమ్ముకుంటోంది. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. ఫెర్గూసన్ కూడా ఫామ్లో ఉండగా సౌతీ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. 4 నేడు న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగుసార్లు (2011, 2015, 2019, 2023) వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. 8 వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిది ఎనిమిదో సెమీఫైనల్ కానుంది. మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై; 2003లో కెన్యాపై; 2011లో పాకిస్తాన్పై) సెమీఫైనల్స్లో నెగ్గిన భారత్.... నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో; 1996లో శ్రీలంక చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2019లో న్యూజిలాండ్ చేతిలో) సెమీఫైనల్లో ఓటమి పాలైంది. 11 మూడు వరల్డ్కప్ సెమీఫైనల్స్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. 2011 పాక్తో సెమీస్లో 9 పరుగులు... 2015 ఆ్రస్టేలియాతో సెమీస్లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్తో సెమీస్లో 1 పరుగు చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్లో ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే కోహ్లి అవుట్ కావడం గమనార్హం. 9 వన్డే ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టుకిది తొమ్మిదో సెమీఫైనల్ కానుంది. రెండుసార్లు (2015లో దక్షిణాఫ్రికాపై, 2019లో భారత్పై) నెగ్గిన న్యూజిలాండ్... ఆరుసార్లు (1975లో వెస్టిండీస్ చేతిలో; 1979లో ఇంగ్లండ్ చేతిలో; 1992లో పాకిస్తాన్ చేతిలో; 1999లో పాకిస్తాన్ చేతిలో; 2007లో శ్రీలంక చేతిలో; 2011లో శ్రీలంక చేతిలో) పరాజయం పాలైంది. 117 భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్ల్లో భారత్... 50 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 7 మ్యాచ్లు రద్దయ్యాయి. 5 వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్కప్ మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్ల్లో (1987లో జింబాబ్వేపై, 2011లో శ్రీలంకపై, 2023లో శ్రీలంకపై) నెగ్గి, 2 మ్యాచ్ల్లో (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో ఆ్రస్టేలియా చేతిలో) ఓటమి పాలైంది. 9 వన్డే వరల్డ్కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 9 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 4 మ్యాచ్ల్లో భారత్... 5 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ విజయం సాధించాయి. 1 వాంఖెడె స్టేడియంలో భారత్తో జరిగిన ఏకైక మ్యాచ్లో (2017లో) న్యూజిలాండ్ గెలిచింది. 21 వాంఖెడే స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడింది. 12 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పిచ్, వాతావరణం ఈ వరల్డ్ కప్లో వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్ బౌలింగ్కు పిచ్ అనుకూలిస్తోంది. సెమీస్ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్కు రిజర్వ్ డే కూడా ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్మన్, సాన్ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్. -
CWC: న్యూజిలాండ్తో సెమీస్.. భారత అభిమాని గుండె పగిలిన క్షణం..!
2019 జూన్ 9–10... మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం... భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్కు కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో తర్వాతి రోజు ఆట కొనసాగగా, చివరకు 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులతో న్యూజిలాండ్ ముగించింది. ఎలా చూసినా ఇది టీమిండియా ఛేదించదగ్గ స్కోరే. అయితే 5 పరుగులకే రోహిత్, కోహ్లి, రాహుల్ వెనుదిరగడంతో పేలవ ఆరంభం లభించగా... ఒకదశలో జట్టు 92/6తో ఓటమికి చేరువైంది. జడేజా 59 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్లతో ఎదురుదాడి చేయడంతో గెలుపుపై ఆశలు రేగాయి. అయితే కివీస్ తమ బౌలింగ్తో మళ్లీ మ్యాచ్ను అదుపులోకి తెచ్చుకుంది. 14 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా వెనుదిరగ్గా... మరో మూడు బంతుల తర్వాత ధోని రనౌట్ భారత అభిమానుల గుండె పగిలేలా చేసింది. అయితే ఏ దశలోనూ దూకుడు చూపించని, అభిమానులు కూడా నివ్వెరపోయేలా సాగిన ధోని ఇన్నింగ్సే (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) ఓటమికి కారణాల్లో ఒకటనేది వాస్తవం! ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్థిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరం. –మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోvలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్డాగ్స్గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్తో సెమీస్లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. – కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ -
పరుగుల ధమాకాకు భారత్ సిద్ధం
ఒక మ్యాచ్ను మించి మరో మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన...ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతూ విజయాల్లో తమ భాగస్వామ్యం...ఎదురు లేని ఆటతో దూసుకుపోతున్న భారత జట్టు ప్రపంచకప్లో లీగ్ దశను అజేయంగా ముగించేందుకు సిద్ధమైంది. ఎనిమిది వరుస విజయాల తర్వాత చివరి పోరులోనూ నెగ్గి స్కోరును 9/9కు చేర్చాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పెద్ద పెద్ద జట్లే రోహిత్ సేన ముందు నిలవలేకపోగా...బలహీనమైన నెదర్లాండ్స్ ఇప్పుడు ఎదురుగా ఉంది. బెంగళూరు: వరల్డ్ కప్లో ఎప్పుడో సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్న టీమిండియా వరుసగా తొమ్మిదో విజయాన్ని ఆశిస్తోంది. 2003 ప్రపంచకప్లో భారత్ వరుసగా 8 మ్యాచ్లు నెగ్గింది. ఇప్పుడు మరో మ్యాచ్లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. ఈ ప్రపంచకప్లోనే ఆఖరి లీగ్ మ్యాచ్ (45వ)లో నేడు నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. బలాబలాలు, అంచనాల ప్రకారం టీమిండియా డచ్కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. ఈ వరల్డ్ కప్లో కూడా భారీ స్కోర్లే నమోదు కాగా, మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. ప్రసిద్కు అవకాశం... భారత జట్టు జైత్రయాత్ర చూస్తే తుది జట్టులో నిజానికి ఎలాంటి మార్పులు అవసరం లేదు. బుధవారం న్యూజిలాండ్తో జరిగే సెమీ ఫైనల్ పోరు గురించే ప్రస్తుతం భారత జట్టు ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుత ప్రత్యర్థిని బట్టి చూస్తే ఒకటి రెండు మార్పులతో బరిలోకి దిగవచ్చు. పేసర్లలో ఒకరిని పక్కన పెట్టిన కొత్తగా జట్టులోకి చేరిన ప్రసిధ్ కృష్ణకు అవకాశం కల్పించవచ్చు. కర్నాటకకే చెందిన ప్రసిధ్ బరిలోకి దిగితే అతనికి ఇదే తొలి వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుంది. చెన్నైలో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత మిగిలిన 7 మ్యాచ్లలో స్పిన్నర్ అశ్విన్కు చోటు దక్కలేదు. ఇక్కడ కుల్దీప్ స్థానంలో అతడిని ఆడించేందుకు అవకాశం ఉంది. మరో వైపు ఐపీఎల్లో విరాట్ కోహ్లి సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో అతని ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్కతాలో 49వ సెంచరీతో సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లి ఇక్కడ 50వ శతకం బాదుతాడా అనేది ఆసక్తికరం. పోటీనిచ్చేనా... అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా ఓవరాల్గా నెదర్లాండ్స్ ఆటతీరు సాధారణంగా ఉంది. పటిష్టమైన భారత్కు ఈ టీమ్ ఏమాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి. ఓపెనర్లు డౌడ్, బరెసి శుభారంభంతో పాటు కెప్టెన్ ఎడ్వర్డ్స్, అకెర్మన్, డి లీడ్ బ్యాటింగ్లో... మీకెరెన్, వాన్ బీక్ బౌలింగ్లో అంచనాలకు తగినట్లుగా రాణిస్తే కొంత పోరాడవచ్చు. మరో వైపు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి ఆపై న్యూజిలాండ్కు వలస వెళ్లి ప్రస్తుతం నెదర్లాండ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజ నిడమనూరు తొలిసారి స్వదేశంలో భారత జట్టుపై ఆడనున్నాడు. ఈ క్షణం కోసం తాను ఉద్వేగభరితంగా ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ x న్యూజిలాండ్ నవంబర్ 15 (ముంబై) ఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికా నవంబర్ 16 (కోల్కతా) -
మిచెల్ మార్ష్ వీరవిహారం
పుణే: ఐదు సార్లు విజేత ఆ్రస్టేలియా ప్రపంచకప్లో లీగ్ దశను ఘనంగా ముగించింది. ఆరంభంలో తడబడి రెండు మ్యాచ్లు ఓడినా...ఆ తర్వాత ప్రతీ మ్యాచ్కు తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైన తర్వాతా అదే దూకుడును కనబర్చి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హ్రిదయ్ (79 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్స్లు), నజు్మల్ హొస్సేన్ (57 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించగా...తన్జిద్ (36), లిటన్ దాస్ (36), మహ్ముదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు 22.3 ఓవర్లలోనే అభేద్యంగా 175 పరుగులు జోడించారు. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జిద్ (సి) అండ్ (బి) అబాట్ 36; లిటన్ (సి) లబుషేన్ (బి) జంపా 36; నజు్మల్ రనౌట్ 45; తౌహిద్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 74; మహ్ముదుల్లా రనౌట్ 32; ముషి్ఫకర్ (సి) కమిన్స్ (బి) జంపా 21; మెహిదీ హసన్ మిరాజ్ (సి) కమిన్స్ (బి) అబాట్ 29; నజుమ్ రనౌట్ 7; మెహదీ హసన్ నాటౌట్ 2; తస్కిన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–76, 2–106, 3–170, 4–214, 5–251, 6–286, 7–303, 8–304. బౌలింగ్: హాజల్వుడ్ 7–1–21–0, కమిన్స్ 8–0–56–0, అబాట్ 10–0–61–2, మార్ష్ 4–0–48–0, జంపా 10–0–32–2, హెడ్ 6–0–33–0, స్టొయినిస్ 5–0–45–1. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) తస్కిన్ 10; వార్నర్ (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 53; మార్ష్ నాటౌట్ 177; స్మిత్ నాటౌట్ 63; ఎక్స్ట్రాలు 4; మొత్తం (44.4 ఓవర్లలో 2 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–12, 2–132. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 10–0–61–1, మెహిదీ హసన్ 9–0–38–0, నజుమ్ అహ్మద్ 10–0–85–0, మెహిదీహసన్ మిరాజ్ 6–0–47–0, ముస్తఫిజుర్ 9.4–1–76–1. -
ఘన విజయంతో ఇంగ్లండ్ ఇంటికి
కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్గా ఈ వరల్డ్ కప్లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ టోర్నీలో చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైంది. వరుస ఓటముులతో ఎప్పుడో సెమీస్ అవకాశాలు కోల్పోయిన ఆ జట్టు చివరకు విజయంతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. శనివారం ఈడెన్ గార్డెన్స్లో పాకిస్తాన్తో జరిగిన ఆఖరి లీగ్లో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 84; 11 ఫోర్లు, 2 సిక్స్లు), జో రూట్ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు), బెయిర్ స్టో (61 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే పాకిస్తాన్ సెమీస్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ‘నామ్కే వాస్తే’ తరహాలో లక్ష్యాన్ని లెక్క కట్టి చూస్తే... సెమీస్కు అర్హత సాధించాలంటే 6.4 ఓవర్లలో 338 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కావడంతో పాక్ ఊరట విజయంపై దృష్టి పెట్టింది. కానీ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 43.3 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆగా సల్మాన్ (45 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (45 బంతుల్లో 38; 6 ఫోర్లు), రిజ్వాన్ (51 బంతుల్లో 36; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా 11వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన రవూఫ్ (23 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరిపించాడు. వన్డే కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ 5 మ్యాచ్ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: మలాన్ (సి) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 31; బెయిర్స్టో (సి) సల్మాన్ (బి) రవూఫ్ 59; రూట్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 60; స్టోక్స్ (బి) షాహిన్ 84; బట్లర్ రనౌట్ 27; బ్రూక్ (సి) షాహిన్ (బి) రవూఫ్ 30; అలీ (బి) రవూఫ్ 8; వోక్స్ నాటౌట్ 4; విల్లీ (సి) ఇఫ్తికార్ (బి) వసీమ్ 15; అట్కిన్సన్ (బి) వసీమ్ 0; రషీద్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–82, 2–108, 3–240, 4–257, 5–302, 6–308, 7–317, 8–336, 9–336. బౌలింగ్: షాహిన్ 10–1–72–2, రవూఫ్ 10–0–64–3, ఇఫ్తికార్ 7–0–38–1, వసీమ్ 10–0–74–2, షాదాబ్ 10–0–57–0, సల్మాన్ 3–0–25–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) విల్లీ 0; ఫఖర్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 1; బాబర్ (సి) రషీద్ (బి) అట్కిన్సన్ 38; రిజ్వాన్ (బి) అలీ 36; షకీల్ (బి) రషీద్ 29; సల్మాన్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 51; ఇఫ్తికార్ (సి) మలాన్ (బి) అలీ 3; షాదాబ్ (బి) రషీద్ 4; షాహిన్ (ఎల్బీ) (బి) అట్కిన్సన్ 25; వసీమ్ నాటౌట్ 16; రవూఫ్ (సి) స్టోక్స్ (బి) వోక్స్ 35; ఎక్స్ట్రాలు 6; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–61, 4–100, 5–126, 6–145, 7–150, 8–186, 9–191, 10–244. బౌలింగ్: విల్లీ 10–0–56–3, వోక్స్ 5.3–0–27–1, రషీద్ 10–0–55–2, అట్కిన్సన్ 8–0–45–2, అలీ 10–0–60–2. -
దర్జాగా దక్షిణాఫ్రికా గెలుపు
అహ్మదాబాద్: ఈ వన్డే వరల్డ్కప్లో అందరినీ ఆకట్టుకున్న అఫ్గానిస్తాన్ పోరాటం చివరకు పరాజయంతో ముగిసింది. ఇది వరకే సెమీఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఆఖరి లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈనెల 16న కోల్కతాలో ఆ్రస్టేలియాతో జరిగే రెండో సెమీఫైనల్ పోరులో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనుంది. నిర్ణీత తొమ్మిది లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా ఏడో విజయంతో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అసాధ్యమైన సమీకరణంతో సెమీఫైనల్ ఆశలు వదులుకున్న అఫ్గానిస్తాన్ ఈ మెగా ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తోపాటు మాజీ విశ్వవిజేతలు పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించామన్న సంతృప్తితో స్వదేశానికి వెళ్లనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (107 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్లు) ఒంటరి పోరాటం చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4, ఎన్గిడి, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్డర్ డసెన్ (95 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి గెలిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ చెరో 2 వికెట్లు తీశారు. ఒమర్జాయ్ ఒంటరిగా... ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (15), రహ్మానుల్లా గుర్బాజ్ (22 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా (2) కూడా నిరాశపరచడంతో 45 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ను మిడిలార్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవతలివైపు రహ్మత్ షా (46 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఇక్రామ్ (12), రషీద్ ఖాన్ (14), నూర్ అహ్మద్ (32 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఇలా ఏ ఒక్కరు బాధ్యతగా క్రీజులో నిలువలేకపోయినా... అజ్మతుల్లా మాత్రం కడదాకా నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. శతకానికి 3 పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. అతని పోరాటం వల్లే అఫ్గాన్ ఆ మాత్రం స్కోరు చేసింది. ఆదుకున్న డసెన్ సునాయాస లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు డికాక్ (47 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ బవుమా (28 బంతుల్లో 23; 3 ఫోర్లు) తొలి వికెట్కు 64 పరుగులు జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే మార్క్రమ్ (32 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), క్లాసెన్ (10) లాంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో 139 పరుగులకే 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన డసెన్... మిల్లర్ (33 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి పరిస్థితి చక్కదిద్దాడు. తర్వాత ఫెలుక్వాయో (37 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా సంచలనానికి తావివ్వకుండా గెలిచింది. అబేధ్యమైన ఆరో వికెట్కు డసెన్, ఫెలుక్వాయో 65 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) క్లాసెన్ (బి) కేశవ్ 25; జద్రాన్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 15; రహ్మత్ షా (సి) మిల్లర్ (బి) ఎన్గిడి 26; హష్మతుల్లా (సి) డికాక్ (బి) కేశవ్ 2; అజ్మతుల్లా ఒమర్జాయ్ (నాటౌట్) 97; ఇక్రామ్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 12; నబీ (సి) డికాక్ (బి) ఎన్గిడి 2; రషీద్ ఖాన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 14; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 26; ముజీబ్ (సి) మార్క్రమ్ (బి) కొయెట్జీ 8; నవీనుల్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–45, 4–94, 5–112, 6–116, 7–160, 8–204, 9–226, 10–244. బౌలింగ్: రబడ 10–0–40–0, ఎన్గిడి 8.3–0–69–2, మార్క్రమ్ 4.3–0–25–0, కొయెట్జీ 10–1–44–4, కేశవ్ మహరాజ్ 10–1–25–2, ఫెలుక్వాయో 7–0–36–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 41; బవుమా (సి) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; డసెన్ (నాటౌట్) 76; మార్క్రమ్ (సి) నవీనుల్ (బి) రషీద్ 25; క్లాసెన్ (బి) రషీద్ ఖాన్ 10; మిల్లర్ (సి అండ్ బి) నబీ 24; ఫెలుక్వాయో (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 9; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–116, 4–139, 5–182. బౌలింగ్: ముజీబ్ 10–0–51–1, నవీనుల్ 6.3–0–52–0, నబీ 10–1–35–2, ఒమర్జాయ్ 1–0–8–0, రషీద్ ఖాన్ 10–1–37–2, నూర్ అహ్మద్ 9–0–49–0, రహ్మత్ షా 1–0–12–0. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X బంగ్లాదేశ్ వేదిక: పుణే ఉదయం గం. 10:30 నుంచి ఇంగ్లండ్ X పాకిస్తాన్ వేదిక: కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి...
సాక్షి, బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన వాడని తెలిసిందే. రచిన్ కన్నడిగుడు. ఇప్పటికీ అతని మూలాలు బెంగళూరుతో ముడిపడే ఉన్నాయి. అందుకే శ్రీలంకతో మ్యాచ్ ముగియగానే రచిన్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మనవడు పుట్టింది విదేశంలో అయినా స్వదేశీ అలవాట్లు, సంప్రదాయాలు బాగా తెలిసిన పెద్దావిడ (అమ్మమ్మ) తన ఇంటికి రాగానే రచిన్ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కివీస్లో స్థిరపడిన రచిన్ తల్లిదండ్రులు దీప, రవి కృష్ణమూర్తి బెంగళూరు వాసులు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన రవి వృత్తిరీత్యా 1990లో కివీస్కు వలస వెళ్లగా... 1999లో వెల్లింగ్టన్లో రచిన్ జన్మించాడు. రవి కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఇష్టం. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లంటే అభిమానం. అందువల్లే తన కుమారుడికి వారిద్దరి పేర్లు కలిపి పెట్టారు. తనకిష్టమైన క్రికెట్లో బ్యాటర్ను చేశాడు. రచిన్కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దుబాయ్: రచిన్ రవీంద్ర ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్కప్లో రచిన్ అత్యధిక పరుగులు (565) చేసిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్లాడిన ఈ కివీస్ ఓపెనర్ 3 శతకాలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ సెమీస్ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతనికి ఐసీసీ అవార్డుకు ఎంపిక చేసింది. రేసులో ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ (591), భారత సీమర్ బుమ్రా (15 వికెట్లు) ఉన్నప్పటికీ అవార్డు మాత్రం రచిన్నే వరించింది. 2021 జనవరి నుంచి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు ఇస్తోంది. రచిన్కంటే ముందు న్యూజిలాండ్ నుంచి డెవాన్ కాన్వే (2021–జూన్), ఎజాజ్ పటేల్ (2021–డిసెంబర్) ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు గెల్చుకున్నారు. -
కివీస్కు సెమీస్ పిలుపు!
గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ కీలక సమరంలో తమ సత్తా చాటింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాల తర్వాత నాలుగు పరాజయాలతో తమ పరిస్థితిని క్లిష్టంగా మార్చుకున్న కివీస్ ఆఖరి ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చి దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి మ్యాచ్లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు మరే జట్టుపై ఆధారపడకుండా తమ సెమీస్ అవకాశాలను తానే సృష్టించుకుంది. కివీస్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు చేజారాయి. సాంకేతికంగా, అంకెల ప్రకారం పాక్ పూర్తిగా, అధికారికంగా నిష్క్రమించకపోయినా... అసాధ్యమైన, ఊహకు కూడా అందని తరహాలో ఆ జట్టు తర్వాతి మ్యాచ్లో గెలవాల్సిన నేపథ్యంలో వాస్తవికంగా చూస్తే పాక్ ఆట ముగిసినట్లే! బెంగళూరు: పదునైన బౌలింగ్, ఆపై దూకుడైన బ్యాటింగ్తో న్యూజిలాండ్ వరల్డ్కప్ లీగ్ దశను ఘనంగా ముగించింది. సెమీస్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో చెలరేగిన ఆ జట్టు తమ లక్ష్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. 10 ఓవర్లలోపే 70/5 స్కోరుతో కుప్పకూలేందుకు సిద్ధమైన లంక... చివర్లో మహీశ్ తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/37)తో పాటు ఇతర కివీస్ బౌలర్లూ సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. కాన్వే (42 బంతుల్లో 45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 74 బంతుల్లోనే 86 పరుగులు జోడించి విజయానికి పునాది వేయగా, మిచెల్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో న్యూజిలాండ్ సెమీస్కు చేర డం దాదాపుగా ఖాయం కాగా... కివీస్ ఓటమిపై ఆశలు పెట్టుకున్న పాక్, అఫ్గానిస్తాన్కు నిరాశ తప్పలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) లాథమ్ (బి) సౌతీ 2; పెరీరా (సి) సాన్ట్నర్ (బి) ఫెర్గూసన్ 51; మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) (బి) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 19; కరుణరత్నే (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మదుషంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–3, 2–30, 3–32, 4–70, 5–70, 6–104, 7–105, 8–113, 9–128, 10–171. బౌలింగ్: బౌల్ట్ 10–3–37–3, సౌతీ 8–0–52–1, ఫెర్గూసన్ 10–2–35–2, సాన్ట్నర్ 10–2–22–2, రచిన్ 7.4–0–21–2, ఫిలిప్స్ 1–0–3–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–86, 2–88, 3–130, 4–145, 5–162. బౌలింగ్: మదుషంక 6.2–0–58–0, తీక్షణ 7–0–43–1, ధనంజయ 2–0–22–0, చమీర 4–1–20–1, మాథ్యూస్ 4–0–29–2. ప్రపంచకప్లో నేడు దక్షిణాఫ్రికా x అఫ్గానిస్తాన్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
బెన్ స్టోక్స్ సెంచరీ
పుణే: వరల్డ్కప్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడి సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి, అనంతరం బంగ్లాదేశ్పై నెగ్గిన ఇంగ్లండ్... ఆపై వరుసగా అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియా జట్ల చేతిలో చిత్తయింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీ సాధించగా... డేవిడ్ మలాన్ (74 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్స్లు), క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో 133/1తో మెరుగైన స్థితిలో కనిపించిన ఇంగ్లండ్... తర్వాతి 15 ఓవర్లలో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 192/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్, వోక్స్ ఏడో వికెట్కు 13.3 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. తేజ నిడమనూరు (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా... స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్లీ బరేసి (37), సైబ్రాండ్ (33) ఫర్వాలేదనిపించారు. తాజా విజయంతో ఏడో స్థానానికి చేరిన ఇంగ్లండ్ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ప్రస్తుతానికి సజీవంగా ఉంచుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) మీకెరెన్ (బి) దత్ 15; మలాన్ (రనౌట్) 87; రూట్ (బి) వాన్ బీక్ 28; స్టోక్స్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బీక్ 108; బ్రూక్ (సి) అకెర్మన్ (బి) డి లీడ్ 11; బట్లర్ (సి) తేజ (బి) మీకెరెన్ 5; అలీ (సి) డి లీడ్ (బి) దత్ 4; వోక్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 51; విల్లీ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 6; అట్కిన్సన్ (నాటౌట్) 2; రషీద్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–48, 2–133, 3–139, 4–164, 5–178, 6–192, 7–321, 8–327, 9–334. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–67–2, వాన్ బీక్ 10–0–88–2, మీకెరెన్ 10–0–57–1, డి లీడ్ 10–0–74–3, వాన్డర్ మెర్వ్ 3–0–22–0, అకెర్మన్ 7–0–31–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ బరేసి (రనౌట్) 37; మ్యాక్స్ ఒ డౌడ్ (సి) అలీ (బి) వోక్స్ 5; అకెర్మన్ (సి) బట్లర్ (బి) విల్లీ 0; సైబ్రాండ్ (సి) వోక్స్ (బి) విల్లీ 33; ఎడ్వర్డ్స్ (సి) మలాన్ (బి) అలీ 38; డి లీడ్ (బి) రషీద్ 10; తేజ నిడమనూరు (నాటౌట్) 41; వాన్ బీక్ (సి) మలాన్ (బి) రషీద్ 2; వాన్డర్ మెర్వ్ (సి) రషీద్ (బి) అలీ 0; దత్ (బి) రషీద్ 1; మీకెరెన్ (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–12, 2–13, 3–68, 4–90, 5–104, 6–163, 7–166, 8–167, 9–174, 10–179. బౌలింగ్: వోక్స్ 7–0–19–1, విల్లీ 7–2–19–2, అట్కిన్సన్ 7–0–41–0, మొయిన్ అలీ 8.2–0–42–3, ఆదిల్ రషీద్ 8–0–54–3. ప్రపంచకప్లో నేడు న్యూజిలాండ్ x శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో?
ప్రపంచకప్లో భారత్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలి యా జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. లీగ్ దశలో 40 మ్యాచ్లు ముగియగా... మరో 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో భారత్–నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా–బంగ్లాదేశ్ మ్యాచ్లకు ప్రాధాన్యత లేదు. దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లు మాత్రమే రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఒక సెమీస్లో ఈ రెండు జట్లు తలపడతాయి. ‘టాప్’ ర్యాంక్ను ఖరారు చేసుకున్న భారత్ నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో మరో సెమీఫైనల్లో తలపడతుంది. ఒకవేళ పాకిస్తాన్ ముందంజ వేస్తే మాత్రం భారత్ 16న కోల్కతాలో పాక్తో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్లలో ఒక జట్టు సెమీస్కు చేరితే భారత్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది. ప్రస్తుతం నాలుగో సెమీఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ ఉంది. మూడు జట్లకు ప్రస్తుతం సమాన పాయింట్లు (8) ఉన్నా... తక్కువ రన్రేట్తో (–0.338) అఫ్గానిస్తాన్ వెనుకబడి ఉంది. రేసులో కనీసం నిలవాలంటే శుక్రవారం తమ ఆఖరి పోరులో ఆ జట్టు భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. దానికి ముందు నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. పాకిస్తాన్ (0.036)కంటే మెరుగైన రన్రేట్ ఉండటం న్యూజిలాండ్ (0.398)కు సానుకూలాంశం. లంకపై గెలిస్తే చాలు కివీస్ ముందంజ వేసినట్లే. పాక్ శనివారం తమ చివరి పోరులో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బలహీనంగా కనిపిస్తున్నా సరే... ఇది పాక్కు అంత సులువు కాదు. అయితే అందరికంటే చివరగా మ్యాచ్ ఆడనుండటంతో పాక్కు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. నేడు లంక చేతిలో కివీస్ ఓడినా...వర్షంతో మ్యాచ్ రద్దయినా రన్రేట్తో సంబంధం లేకుండా ఇంగ్లండ్పై పాక్ గెలిస్తే చాలు సెమీఫైనల్ చేరుతుంది. -
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్వుడ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్వెల్ భారీ హిట్టింగ్కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్తో కలిసి జట్టు రాతను తన బ్యాట్తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్లు అబేధ్యమైన 8వ వికెట్కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్పై 8వ వికెట్కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా మ్యాక్స్వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్పై చిట్టగాంగ్లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్బర్గ్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్వుడ్ (బి) మ్యాక్స్వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్వుడ్ 9–0–39–2, మ్యాక్స్వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
మాక్స్వెల్ డబుల్ సెంచరీ.. సెమీస్కు ఆస్ట్రేలియా
ఆఫ్ఝనిస్తాన్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాక్స్వెల్ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 128 బంతుల్లో 201 పరుగులు సాధించాడు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు.అజేయ శతకంతో ఆఖరి వరకు క్రీజులో ఉండి మొత్తంగా 129 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో రహ్మత్ షా 30, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 26, అజ్మతుల్లా 22 చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అయితే, చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 35 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి వారెవ్వా అనిపించాడు.జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్కు తోడు రషీద్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 291 పరుగులు చేసింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 292 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 24 పరుగులు చేసి నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లోనే రెండో వికెట్గా అవుట్ అయ్యాడు . తరువాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్ కూడా తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవుతారు అనుకున్న తరుణంలో మాక్స్వెల్ అఫ్గనిస్తాన్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగి అద్భుతమైన స్ట్రోక్ ప్లే తో డబుల్ సెంచరీతో( 201 ) ఆస్ట్రేలియా టీం ను గెలిపించాడు. అయితే లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో దెబ్బ కొట్టినప్పటికి మ్యాక్సి సంచలన ఇన్నింగ్స్ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియాను సెమీస్ చేర్చి డబుల్ ధమాకా అందించాడు. -
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం. -
భారత్ ప్రతాపం.. దక్షిణాఫ్రికా దాసోహం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ కష్టపెట్టింది. ఆరంభంలో రో‘హిట్స్’తో పరుగులు సులువైనా... తర్వాత గగనమైంది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ కనిపెట్టుకొని పరుగులు పేర్చితే జట్టు స్కోరు 300 మార్కు దాటింది. ‘బర్త్డే బాయ్’ విరాట్ సెంచరీ పర్వాన్ని చూపిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల కూల్చివేతల్లో త్వరపడ్డారు. దీంతో వార్ వన్సైడ్ అయిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయంతో రోహిత్ శర్మ బృందం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ‘టాప్ ర్యాంక్’ను ఖరారు చేసుకుంది. కోల్కతా: అదేంటో ఈ ప్రపంచకప్లో యుద్ధం తప్పదనుకున్న మ్యాచ్ల్లోనే భారత్ సులువుగా దండయాత్ర చేసి గెలుస్తోంది. ఆ్రస్టేలియాతో మొదలైన టీమిండియా తొలి మ్యాచ్, క్రికెట్ ప్రపంచం గుడ్లప్పగించి చూసిన పాక్తో సమరం... భారీస్కోర్లతో చేలరేగుతున్న దక్షిణాఫ్రికాతో తాజా పోరు... ఇవన్నీ కూడా పోటాపోటీగా సాగుతాయనుకుంటే భారత్ వీరంగంతో ఏకపక్షమయ్యాయి. దీంతో ఆతిథ్య జట్టు కాస్తా అజేయ శక్తిగా మారిపోయింది. ఈ ప్రపంచకప్లో భారత జట్టు తర్వాత జోరుమీదున్న దక్షిణాఫ్రికా టీమిండియా దూకుడుకు దాసోహమైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. కోహ్లి పుట్టినరోజు (నవంబర్ 5) ఉదయం శుభాకాంక్షలతో మొదలైతే... సాయంత్రం వచ్చేసరికి శతక ప్రదర్శనతో ప్రశంసలు వెల్లువెత్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సచిన్కు సరిసమానమైన 49వ వన్డే సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్స్కోరర్! రవీంద్ర జడేజా (5/33) తన స్పిన్తో దక్షిణాఫ్రికాను చుట్టేశాడు. కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్ జట్టుతో ఆడుతుంది. రో‘హిట్స్’తో మొదలై... కెప్టెన్ , హిట్మ్యాన్ రోహిత్ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఎదురుదాడికి దిగడంతో స్కోరు సగటున 10 పరుగుల రన్రేట్తో దూసుకెళ్లింది. 6వ ఓవర్లోనే రబడ అతని వేగానికి కళ్లెం వేయగా... కోహ్లి, శుబ్మన్ గిల్ (24 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగానే ఆడటంతో 10 ఓవర్లలో భారత్ 91/1 స్కోరు చేసింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ‘స్విచ్చాఫ్’ చేసినట్లు మారింది. గిల్ను అవుట్ చేసి... సహకరించే పిచ్పై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కట్టడి చేయడంతో తర్వాతి 16 ఓవర్లలో భారత్ 60 పరుగులే చేయగలిగింది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 151/1 స్కోరుతో వేగంలో వెనుకబడింది. ‘శత’క్కొట్టిన కోహ్లి పిచ్ సంగతి అర్థమైన కోహ్లి... కేశవ్ బౌలింగ్ ప్రమాదకరమని గుర్తించాడు. అవతలివైపు అయ్యర్నూ అలర్ట్ చేసి సింగిల్స్, డబుల్స్తోనే స్కోరును ముందుకు సాగనిచ్చాడు. కానీ షమ్సీని మాత్రం వదల్లేదు. చక్కగా బౌండరీలు బాదారు. కోహ్లి 67 బంతుల్లో, అయ్యర్ 64 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. ఈ జోడి మూడో వికెట్కు 134 పరుగులు జతచేశాక అయ్యర్ ఆటను ఎన్గిడి ముగించాడు. రాహుల్ (8) వచ్చివెళ్లాడు. ఆఖరి దశలో సూర్యకుమార్ (14 బంతుల్లో 22; 5 ఫోర్లు) జోరును షమ్సీ అడ్డుకోగా... జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే భారత్ పుంజుకొని 300 దాటింది. కోహ్లి (119 బంతుల్లో) శతకం సాధించాడు. ఈ మేటి బ్యాటర్ క్రీజులో ఉన్నా కూడా... కేశవ్ పూర్తి కోటా వేసినా... ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం. సఫారీ పేకమేడలా... ఈ టోర్నీలోనే బాగా సెంచరీలు, భారీగా స్కోర్లు చేస్తున్న జట్టు... రన్రేట్లో ముందున్న జట్టు దక్షిణాఫ్రికానే! కానీ ఈ జట్టు కూడా భారత బౌలింగ్కు కుదేలైంది. ఇంకా చెప్పాలంటే వికెట్లు రాలిన ఉదంతాన్ని చూస్తే ఓ క్రికెట్ కూననే తలపించింది. సిరాజ్ డెలివరీకి డికాక్ (5) క్లీన్బౌల్డ్ అయ్యాడు. జడేజా ముందుగానే రంగంలోకి దించితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమం తప్పకుండా సఫారీ మేటి బ్యాటర్లను పడగొట్టేశాడు. బవుమా (11), క్లాసెన్ (1), మిల్లర్ (11)లను స్పిన్ ఉచ్చులో ఉక్కిరి బిక్కిరి చేయగా... మరోవైపు షమీ పేస్తో డసెన్ (13), మార్క్రమ్ (9)లను పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ కూడా తనవంతు మ్యాజిక్ చూపడంతో 40 పరుగులకే 5 వికెట్లను... 83 పరుగులకే దక్షిణాఫ్రికా మొత్తం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బవుమా (బి) రబడ 40; గిల్ (బి) కేశవ్ 23; కోహ్లి (నాటౌట్) 101; అయ్యర్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 77; రాహుల్ (సి) డసెన్ (బి) జాన్సెన్ 8; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) షమ్సీ 22; జడేజా (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–62, 2–93, 3–227, 4–249, 5–285. బౌలింగ్: ఎన్గిడి 8.2–0–63–1, జాన్సెన్ 9.4–0–94–1, రబడ 10–1–48–1, కేశవ్ మహరాజ్ 10–0–30–1, షమ్సీ 10–0–72–1, మార్క్రమ్ 2–0–17–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; బవుమా (బి) జడేజా 11; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 13; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 9; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 1; మిల్లర్ (బి) జడేజా 11; జాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; కేశవ్ (బి) జడేజా 7; రబడ (సి అండ్ బి) జడేజా 6; ఎన్గిడి (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్) 83. వికెట్ల పతనం: 1–6, 2–22, 3–35, 4–40, 5–40, 6–59, 7–67, 8–79, 9–79, 10–83. బౌలింగ్: బుమ్రా 5–0–14–0, సిరాజ్ 4–1–11–1, జడేజా 9–1–33–5, షమ్సీ 4–0–18–2, కుల్దీప్ 5.1–1–7–2. ప్రపంచకప్లో నేడు శ్రీలంక Xబంగ్లాదేశ్ వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
‘టాప్’ సమరానికి సమయం
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ల చివరి దశలో ఒక ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు బలమైన ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు సన్నద్ధమయ్యాయి. ఒక్క ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న టీమిండియా ఒక వైపు...అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడినా మిగతా అన్ని మ్యాచ్లలో తమ బలాన్ని చూపించిన సఫారీ బృందం సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. ఈడెన్గార్డెన్స్ పోరులో భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది చూడాలి. కోల్కతా: ఎదురు లేని ఆటతో వరుసగా ఏడు విజయాలు సాధించిన రోహిత్ సేన ఇప్పుడు ఎనిమిదో మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. టోర్నీలో ఉన్న ఇతర బలమైన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్లనుంచి ఎలాంటి పోటీ లేకుండా అలవోక విజయాలు అందుకున్న టీమిండియాకు సెమీస్కు ముందు దక్షిణాఫ్రికా రూపంలో మరో పెద్ద జట్టు నిలబడింది. మరో వైపు అసాధారణ ఆట కనబరుస్తున్న సఫారీ కూడా అంతే స్థాయిలో గట్టి పోటీకి సవాల్ విసురుతోంది. నేడు విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు. ఈ రోజున వన్డేల్లో తన 49వ సెంచరీ సాధించి దిగ్గజం సచిన్ రికార్డును సమం చేస్తాడా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్పుల్లేకుండా... భారత జట్టుకు సంబంధించి కించిత్ కూడా ఆందోళన కలిగించే అంశం లేదు. ఏడు విజయాల్లోనూ జట్టు సభ్యులంతా తమ వంతు పాత్ర పోషించారు. గత మ్యాచ్కు ముందు వరకు అయ్యర్ బ్యాటింగ్, సిరాజ్ వికెట్లు తీయకపోవడం కొంత సమస్య అనిపించినా...శ్రీలంకతో పోరులో ఆ బెంగా తీరింది. టాప్–3లో రోహిత్, గిల్, కోహ్లి చెలరేగుతుండగా....మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్, సూర్యల జోరుతో భారత్ దూకుడు సాగుతోంది. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీ ఒకరితో మరొకరు పోటీ పడి బౌలింగ్ చేస్తుండగా...కుల్దీప్, జడేజా స్పిన్ను సఫారీ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది చూడాలి. అంతా ఫామ్లో... టోర్నీలో ఆరు మ్యాచ్లు గెలిచిన దక్షిణాఫ్రికా పాక్తో చివరి వరకు కాస్త తడబడగా, అనూహ్యంగా డచ్ చేతిలో ఓడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఐదు సార్లు ఆ జట్టు సాధించిన స్కోర్లు వారి బ్యాటింగ్ బలమేంటో చూపించాయి. 428, 311, 399, 382, 357...ఇలా నమోదు చేసి అన్నింటిలో కనీసం వంద పరుగుల తేడాతో సఫారీ టీమ్ నెగ్గింది. ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన డికాక్ ఒకే టోర్నీలో అత్యధిక శతకాల (5) రోహిత్ రికార్డు కోసం సన్నద్ధమయ్యాడు. బవుమా మినహా డసెన్, మార్క్రమ్, మిల్లర్, క్లాసెన్ చెలరేగిపోతున్నారు. ఇక రబడ, ఎన్గిడి, కొయెట్జీ, జాన్సెన్లతో కూడిన పేస్ దళంకు ఈడెన్ గార్డెన్స్ బౌన్సీ పిచ్పై కాస్త అవకాశం దొరికితే తిరుగుండదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), డికాక్, డసెన్, మార్క్రమ్, మిల్లర్, క్లాసెన్, జాన్సెన్, రబడ, మహరాజ్, ఎన్గిడి, కొయెట్జీ పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమతుల్యత ఉన్న పిచ్. ఇద్దరికీ మంచి అవకాశం ఉంది. వర్షసూచన లేదు కానీ మంచు ప్రభావం చూపించవచ్చు. -
ఫఖర్ మెరుపుల ‘వాన’లో...
బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరింది. చెలరేగిన రచిన్, విలియమ్సన్ ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు. ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), చాప్మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారు. ఫఖర్ విధ్వంసం వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు. 4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది. అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది! స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0. -
ఇంగ్లండ్ ఖేల్ ఖతం
అహ్మదాబాద్: డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్ ప్రపంచకప్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. వరుసగా ఐదో ఓటమితో... మొత్తం 6 పరాజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరో వైపు ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఆరంభ దశలో తడబడినప్పటికీ తర్వాత జూలు విదిల్చింది. క్రమంగా గెలుపుబాట పట్టి ప్రత్యర్థుల ఆట కటిస్తూ సెమీస్కు మరింత చేరువైంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 33 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ముందుగా ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌటైంది. లబుషేన్ (83 బంతుల్లో 71; 7 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (52 బంతుల్లో 47; 5 ఫోర్లు), స్మిత్ (52 బంతుల్లో 44; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (90 బంతుల్లో 64; 2 ఫోర్లు, 3 సిక్స్లు), డేవిడ్ మలాన్ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. మొయిన్ అలీ (43 బంతుల్లో 42; 6 ఫోర్లు), వోక్స్ (33 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆ్రస్టేలియా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (3/21), స్టార్క్(2/66), హాజల్వుడ్ (2/49), కమిన్స్ (2/49) సమష్టిగా ప్రత్యర్థిని దెబ్బ తీశారు. టోర్నీ తొలి మ్యాచ్లో గత ఫైనలిస్ట్ న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్... తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్పై మాత్రమే 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియాల చేతిలో ఓడింది. నామమాత్రమైన చివరి మ్యాచ్లో ఆ జట్టు బుధవారం నెదర్లాండ్స్తో తలపడుతుంది. 2015 ప్రపంచకప్లో చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ ఆ జట్టు వన్డేల్లో ఒక్కసారిగా స్వరూపం మార్చుకుంది. భీకర ఆటతో తర్వాతి నాలుగేళ్ల పాటు వన్డే క్రికెట్ను శాసించి 2019లో జగజ్జేతగా నిలిచిన టీమ్ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పతనావస్థకు చేరి మరో సారి 2015కు ముందు రోజులను గుర్తుకు తెచ్చింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) రూట్ (బి) వోక్స్ 11; వార్నర్ (సి) విల్లీ (బి) వోక్స్ 15; స్మిత్ (సి) అలీ (బి) రషీద్ 44; లబుషేన్ (ఎల్బీ) (బి) వుడ్ 71; ఇంగ్లిస్ (సి) అలీ (బి) రషీద్ 3; గ్రీన్ (బి) విల్లీ 47; స్టొయినిస్ (సి) బెయిర్స్టో (బి) లివింగ్స్టోన్ 35; కమిన్స్ (సి) మలాన్ (బి) వుడ్ 10; స్టార్క్ (సి) అలీ (బి) వోక్స్ 10; జంపా (సి) బట్లర్ (బి) వోక్స్ 29; హాజల్వుడ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–11, 2–38, 3–113, 4–117, 5–178, 6–223, 7–241, 8–247, 9–285, 10–286. బౌలింగ్: విల్లీ 10–1–48–1, వోక్స్ 9.3–0–54–4, వుడ్ 10–0–70–2, లివింగ్స్టోన్ 6–0–42–1, మొయిన్ అలీ 4–0–28–0, రషీద్ 10–0–38–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 0; మలాన్ (సి) హెడ్ (బి) కమిన్స్ 50; రూట్ (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 13; స్టోక్స్ (సి) స్టొయినిస్ (బి) జంపా 64; బట్లర్ (సి) గ్రీన్ (బి) జంపా 1; మొయిన్ అలీ (సి) వార్నర్ (బి) జంపా 42; లివింగ్స్టోన్ (సి) సబ్–అబాట్ (బి) కమిన్స్ 2; వోక్స్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 32; విల్లే (సి) జంపా (బి) హాజల్వుడ్ 15; రషీద్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్వుడ్ 20; వుడ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–103, 4–106, 5–169, 6–174, 7–186, 8–216, 9–253, 10–253. బౌలింగ్: స్టార్క్ 10–0–66–2, హాజల్వుడ్ 9.1–1–49–2, కమిన్స్ 10–1–49–2, జంపా 10–0–21–3, హెడ్ 5–0–28–0, స్టొయినిస్ 4–0–34–1. -
భారత్ కు షాక్..హార్దిక్ పాండ్య ఔట్..
-
WC 2023: అఫ్గాన్... అదే జోరు.. సెమీఫైనల్ ఆశలు సజీవం
లక్నో: సమష్టి ప్రదర్శనతో అదరగొడుతూ... అంచనాలకు మించి రాణిస్తూ... వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అఫ్గానిస్తాన్ నాలుగో విజయం నమోదు చేసింది. ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన మూడు జట్లపై సంచలన విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్ తాజాగా నెదర్లాండ్స్ జట్టును ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ (86 బంతు ల్లో 58; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మ్యాక్స్ ఓ డౌడ్ (40 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలిచింది. రహ్మత్ షా (54 బంతుల్లో 52; 8 ఫోర్లు), కెపె్టన్ హష్మతుల్లా (64 బంతు ల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. డచ్ రనౌట్... నెదర్లాండ్స్ జట్టులో టాప్–5లో ఒక్క ఓపెనర్ వెస్లీ (1) మినహా... తర్వాత వరుసగా నలుగురు బ్యాటర్లు మ్యాక్స్ ఓ డౌడ్, అకెర్మన్ (35 బంతుల్లో 29; 4 ఫోర్లు), సైబ్రాండ్, కెపె్టన్ ఎడ్వర్డ్స్ (0) రనౌట్ కావడమే డచ్ కొంపముంచింది. వన్డేల్లో ఒక జట్టు తరఫున టాప్–5లో నలుగురు రనౌట్ కావ డం ఇదే ప్రథమం. సమన్వయలోపం, పరుగేలేని చోట ప్రయత్నించి భంగపడటంతో నెదర్లాండ్స్ కష్టాలు కొనితెచ్చుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. గెలిపించిన రహ్మత్, హష్మతుల్లా సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్కు ఓపెనర్ల వైఫల్యం కంగారుపెట్టింది. రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) నిరాశపరిచారు. ఈ దశలో రహ్మత్ షా, కెపె్టన్ హష్మతుల్లా ఇన్నింగ్స్ నడిపించి, గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో రహ్మత్ షా (47 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్కు 74 పరుగులు జోడించాక జుల్ఫికర్ బౌలింగ్లో రహ్మత్షా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా (31 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్కు 52 పరుగులు జత చేసిన హష్మతుల్లా జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అఫ్గాన్ ఏదో గాలివాటం గెలుపులేమీ గెలవలేదు. చక్కని బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్తో మాజీ చాంపియన్లను ఓడించి 8 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఇప్పటివరకైతే బానే ఉంది. కానీ హష్మతుల్లా జట్టుకు మిగిలినవి రెండు మ్యాచ్లే! అవి కూడా గట్టి ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా (7న ముంబైలో), దక్షిణాఫ్రికా (10న అహ్మదాబాద్లో)లతో కావడంతో... సెమీస్ చేరడం, కల సాకారమవడం మాత్రం అంత సులభమైతే కాదు. అయితే సంచలనాల మజా ఆఖరి దశను రసవత్తరం చేస్తే మాత్రం... 2003లో కెన్యా సెమీస్ చేరినట్లే... అఫ్గాన్కు ఆ అవకాశం దక్కినా దక్కొచ్చు! స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 1; మ్యాక్స్ ఓ డౌడ్ (రనౌట్) 42; అకెర్మన్ (రనౌట్) 29; సైబ్రాండ్ (రనౌట్) 58; ఎడ్వర్డ్స్ (రనౌట్) 0; బస్ డి లీడే (సి) ఇక్రామ్ (బి) నబీ 3; జుల్ఫీకర్ (సి) ఇక్రామ్ (బి) నూర్ అహ్మద్ 3; వాన్ బిక్ (స్టంప్డ్) ఇక్రామ్ (బి) నబీ 2; వాన్డెర్ మెర్వ్ (సి) జద్రాన్ (బి) నూర్ అహ్మద్ 11; ఆర్యన్ దత్ (నాటౌట్) 10; మీకెరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 4; ఎక్స్ట్రాలు 16; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–3, 2–73, 3–92, 4–92, 5–97, 6–113, 7–134, 8–152, 9–169, 10–179. బౌలింగ్: ముజీబ్ 10–0–40–1, ఫరూఖీ 5–0–36–0, ఒమర్జాయ్ 3–0–11–0, నబీ 9.3–1–28–3, రషీద్ ఖాన్ 10–0–31–0, నూర్ అహ్మద్ 9–0–31–2. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 10; జద్రాన్ (బి) వాన్డెర్ మెర్వ్ 20; రహ్మత్ షా (సి అండ్ బి) జుల్ఫికర్ 52; హష్మతుల్లా (నాటౌట్) 56; అజ్మతుల్లా (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 12; మొత్తం (31.3 ఓవర్లలో 3 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–27, 2–55, 3–129. బౌలింగ్: ఆర్యన్ దత్ 8.3–0–49–0, వాన్ బిక్ 7–0–30–1, మీకెరన్ 5–0–35–0, వాన్డెర్ మెర్వ్ 5–0–27–1, జుల్ఫికర్ 3–0–25–1, అకెర్మన్ 3–0–12–0. ప్రపంచకప్లో నేడు న్యూజిలాండ్ X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు ఉదయం గం. 10:30 నుంచి ఆ్రస్టేలియా Xఇంగ్లండ్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: సెమీఫైనల్ లక్ష్యంగా...
ముంబై: ఎదురులేని ఆటతో వరల్డ్కప్లో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి దూసుకుపోతున్న భారత జట్టు ఇప్పుడు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే పోరులో మాజీ విశ్వవిజేత శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఒకవైపు భారత్ అజేయంగా చెలరేగుతుండగా, మరోవైపు శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. మూడు పరాజయాల తర్వాత రెండు మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు గత మ్యాచ్లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడటం వారిని తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగియవచ్చు. మార్పుల్లేకుండా... భారత జట్టు విషయంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం, అవసరం కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ మ్యాచ్లోనూ ఆడటం లేదు. ఇంగ్లండ్తో పోరులో జట్టు బ్యాటింగ్ కాస్త తడబడినట్లుగా కనిపించినా... అది పూర్తిగా భిన్నమైన, కఠినమైన పిచ్ కావడం మన బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. కానీ అది పునరావృతం కాకుండా మన ఆటగాళ్లు చెలరేగిపోగలరు. అయితే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ మాత్రమే కాస్త సమస్యగా కనిపిస్తోంది. బుమ్రా, షమీల ప్రమాదకరమైన బౌలింగ్... స్పిన్లో జడేజా, కుల్దీప్ల జోరు భారత్ను దుర్బేధ్యంగా మారుస్తున్నాయి. మాథ్యూస్పై ఆశలు... ఒకవైపు ఆట పేలవంగా ఉండటంతో పాటు మరోవైపు కీలక ఆటగాళ్లకు వరుస గాయాలు శ్రీలంకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో తుది జట్టులో వరుసగా మార్పులు చేయాల్సి ఉంది. అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సీనియర్ ఎంజెలో మాథ్యూస్కు భారత్పై మంచి రికార్డు ఉంది. 54 సగటుతో అతను మూడు సెంచరీలు కూడా సాధించాడు. అదే ఆటను మళ్లీ చూపించాలని లంక కోరుకుంటోంది. బౌలింగ్లో అందరూ అంతంతమాత్రమే. రజిత, తీక్షణ, మదుషంకలాంటి జూనియర్లు భారత బ్యాటింగ్ బలగాన్ని నిలువరించడం చాలా కష్టం. మొదటి నుంచి వాంఖెడే మైదానం పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. ఈ టోర్నీలో జరిగిన తొలి రెండు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 399, 382 పరుగులు చేసింది. మ్యాచ్కు వర్షసూచన లేదు. -
కివీస్ నెత్తిన సఫారీ పిడుగు!
పుణే: ప్రపంచకప్లో అమితాసక్తి రేపిన మ్యాచ్లలో ఇదొకటి... ఇరు జట్ల తాజా ప్రదర్శన, బలాబలాలు, గత రికార్డులను బట్టి చూస్తే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపించింది. కానీ చివరకు వచ్చేసరికి అంతా సఫారీల హవానే సాగి ఏకపక్ష విజయం దక్కింది. పేలవ బౌలింగ్తో భారీగా పరుగులిచ్చిన కివీస్ ఆ తర్వాత బ్యాటింగ్లోనూ కుప్పకూలింది. దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయంతో అగ్రస్థానానికి చేరగా... టోర్నీ ఆరంభంలో అద్భుతంగా అనిపించిన న్యూజిలాండ్ ఖాతాలో ఇప్పుడు వరుసగా మూడో ఓటమి చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన కివీస్ ఊహించని విధంగా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ముందుగా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డసెన్ (118 బంతుల్లో 133; 9 ఫోర్లు, 5 సిక్స్లు), డికాక్ (116 బంతుల్లో 114; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు 200 పరుగులు జోడించగా, ఆఖరి 10 ఓవర్లలో సఫారీ జట్టు 119 పరుగులు సాధించింది. డికాక్కు ఈ మెగా టోర్నీలో ఇది నాలుగో శతకం. అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 114; బవుమా (సి) మిచెల్ (బి) బౌల్ట్ 24; డసెన్ (బి) సౌతీ 133; మిల్లర్ (సి) మిచెల్ (బి) నీషమ్ 53; క్లాసెన్ (నాటౌట్) 15; మార్క్రమ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–38, 2–238, 3–316, 4–351. బౌలింగ్: బౌల్ట్ 10–1–49–1, హెన్రీ 5.3–0–31–0, సౌతీ 10–0–77–2, సాన్ట్నర్ 10–0–58–0, ఫిలిప్స్ 7–0–52–0, రచిన్ 2–0–17–0, నీషమ్ 5.3–0–69–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 2; యంగ్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 33; రచిన్ (సి) కొయెట్జీ (బి) జాన్సెన్ 9; మిచెల్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 24; లాథమ్ (సి) మహరాజ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (సి) రబడ (బి) కొయెట్జీ 60, సాన్ట్నర్ (బి) మహరాజ్ 7; సౌతీ (ఎల్బీ) (బి) జాన్సెన్ 7; నీషమ్ (బి) మహరాజ్ 0; బౌల్ట్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 9; హెన్రీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (35.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–56, 4–67, 5–90, 6–100, 7–109, 8–110, 9–133, 10–167. బౌలింగ్: జాన్సెన్ 8–1–31–3, ఎన్గిడి 6–1–28–0, రబడ 6–2–16–1, కొయెట్జీ 6.3–0–41–2, కేశవ్ మహరాజ్ 9–0–46–4. -
పాకిస్తాన్ విజయం
కోల్కతా: ప్రపంచకప్లో పాకిస్తాన్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు ఖాతాలో గెలుపు చేరింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో పాక్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. బంగ్లాకు ఇది ఆరో పరాజయం కాగా...తాజా ఫలితంతో సెమీస్ అవకాశాలు కోల్పోయి టోర్నీనుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా బంగ్లా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (70 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), లిటన్ దాస్ (64 బంతుల్లో 45; 6 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. షాహిన్ అఫ్రిది 3 కీలక వికెట్లతో బంగ్లాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (74 బంతుల్లో 81; 3 ఫోర్లు, 7 సిక్స్లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 21.1 ఓవర్లలో 160 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యం చేరిన పాక్ టోర్నీలో తమ ఆశలు నిలబెట్టుకుంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్తాన్కు ఈ విజయం దక్కింది. స్కోరు వివరాలు: బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (ఎల్బీ) (బి) షాహిన్ 0; దాస్ (సి) సల్మాన్ (బి) ఇఫ్తికార్ 45; నజు్మల్ (సి) ఉసామా (బి) షాహిన్ 4; ముష్ఫికర్ (సి) రిజ్వాన్ (బి) రవూఫ్ 5; మహ్ముదుల్లా (బి) షాహిన్ 56; షకీబ్ (సి) సల్మాన్ (బి) రవూఫ్ 43; తౌహీద్ (సి) ఇఫ్తికార్ (బి) ఉసామా 7; మిరాజ్ (బి) వసీమ్ 25; తస్కీన్ (బి) వసీమ్ 6; ముస్తఫిజుర్ (బి) వసీమ్ 3; షరీఫుల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 204. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–23, 4–102, 5–130, 6–140, 7–185, 8–200, 9–201, 10–204. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 9–1–23–3, ఇఫ్తికార్ 10–0–44–1, రవూఫ్ 8–0–36–2, వసీమ్ 8.1–1–31–3, ఉసామా 10–0–66–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) మిరాజ్ 68; ఫఖర్ (సి) తౌహీద్ (బి) మిరాజ్ 81; బాబర్ (సి) మహ్మదుల్లా (బి) మిరాజ్ 9; రిజ్వాన్ (నాటౌట్) 26; ఇఫ్తికార్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 4; మొత్తం (32.3 ఓవర్లలో 3 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–128, 2–160, 3–169. బౌలింగ్: తస్కీన్ 6–1–36–0, షరీఫుల్ 4–1–25–0, మిరాజ్ 9–0–60–3, ముస్తఫిజుర్ 7–0–47–0, షకీబ్ 5.3–0–30–0, నజు్మల్ 1–0–5–0. ప్రపంచకప్లో నేడు న్యూజిలాండ్ X దక్షిణాఫ్రికా వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
‘నేనెప్పుడూ అనుకోలేదు’
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడు అనుకోలేదని భారత స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈ వన్డే ప్రపంచకప్లో 48వ సెంచరీతో భారత గ్రేటెస్ట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ (49) సరసన నిలిచేందుకు చేరువైన కోహ్లి తన తారాస్థాయి బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందిస్తూ... ‘క్రికెట్ గురించే మాట్లాడితే... ఇంతలా రాణిస్తానని, ఇన్ని మైలురాళ్లు అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోనే లేదు. దేవుడి కృప వల్లే ఎక్కడో ఉన్న నేను ఇక్కడిదాకా వచ్చాను. నా ఆటతీరు, నిలకడ కొనసాగుతున్నాయి. సెంచరీలు చేయాలని, వేల కొద్దీ పరుగులు సాధించాలని కలలైతే కనేవాణ్ని. కానీ అవన్నీ ఇలా ఒక్కొక్కటిగా సాకారమవుతాయని అనుకోలేదు. నిజం చెప్పాలంటే క్రికెట్లో ఇవి ఇలా జరుగుతాయని, పయనం ఇలా సాగుతుందని ఎవరూ ప్రణాళికలు వేసుకోరు’ అని అన్నాడు. ఈ 12 ఏళ్లలో టన్నుల కొద్దీ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఒక దశలో తన ప్రొఫెషనల్ క్రికెట్లోని లోపాల్ని గుర్తించడం... వెంటనే ఆటకు తగిన జీవనశైలి, క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్లే అంతా మంచి జరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘నా దృష్టంతా జట్టుపైనే ఉంటుంది. టీమిండియా విజయాల కోసం నా ప్రదర్శన బాగుండాలని, క్లిష్ట సమయంలోనూ జట్టును గట్టెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే జీవనశైలి (సంపూర్ణ ఫిట్నెస్ కోసం)ని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ తప్పదని భావించాను. ఆట ఎప్పుడు మన కృషినే గుర్తిస్తుంది. నిజాయితీగా చెబుతున్నా... నా కెరీర్లో నేను బాగా నేర్చుకుంది ఇదే! ఫీల్డులో వంద శాతం అంకితభావంతో ఆడేందుకే కృషి చేస్తా. ఇదంతా కూడా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తా’ అని కోహ్లి వివరించాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ కింగ్... సచిన్ తర్వాత అంతటి క్రేజ్ను సంపాదించుకోవడమే కాదు... ఆ మాస్టర్ బ్లాస్టర్ వేర్వేరు ఘనతలను తిరగరాశాడు. ఈ ప్రపంచకప్లో ఒక శతకం, మూడు అర్ధసెంచరీలతో అతను ఇప్పటికే 354 పరుగులు చేశాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నవంబర్ 5న కోహ్లి పుట్టినరోజు. అదే రోజు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉండటంతో శతకోటి భారతీయులంతా ఆ రోజు కింగ్ కోహ్లి శతకం కొట్టాలని కోరుకుంటున్నారు. మరో వైపు కోహ్లి కోసం ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఈడెన్ గార్డెన్స్లో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్కు ముందు ఐసీసీ అనుమతితో అందరి ముందు భారీ కేక్ను కట్ చేయించాలనేది ప్రతిపాదన. దీంతో పాటు మైదానానికి వచ్చే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులకు లోపలికి వెళ్లే సమయంలో ‘కోహ్లి మాస్్క’లను అందజేస్తారు. దాంతో స్టేడియమంతా కోహ్లిమయమయ్యే అవకాశం ఉంది. -
శ్రేయస్పైనే దృష్టి
ముంబై: వరల్డ్కప్లో వరుసగా ఏడో విజయంపై దృష్టి పెట్టిన భారత జట్టు తమ సన్నాహకాలకు పదును పెట్టింది. మ్యాచ్కు రెండు రోజుల ముందు సోమవా రం టీమ్ సాధన కొనసాగింది. ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ కావడంతో రోహిత్, కోహ్లి, గిల్ దీనికి హాజరు కాలేదు. అయితే జట్టులోని ఇతర ప్రధాన ఆటగాళ్లంతా నెట్స్లో శ్రమించారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా... జడేజా, అశ్విన్, శార్దుల్ కూడా తమ బౌలింగ్కు పదును పెట్టారు. అయితే అన్నింటికంటే కీలక సెషన్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్దే. ఆశించిన స్థాయిలో ఈ టోర్నీలో రాణించలేకపోతున్న అయ్యర్ పదే పదే షార్ట్ పిచ్ బంతులకు అవుటవుతూ తన బలహీనతను బయట పెట్టుకుంటున్నాడు. దీనిని సరిదిద్దే క్రమంలో అయ్యర్ ప్రాక్టీస్ సాగింది. ఆరంభంలో స్థానిక నెట్ బౌలర్లు అతనికి బౌలింగ్ చేయగా... ఆ తర్వాత టీమ్ త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అతనికి పెద్ద సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరాడు. అయ్యర్ సాధనను పర్యవేక్షించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి తగిన సూచనలిస్తూ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేశారు. ముంబైకే చెందిన శ్రేయస్ సొంత మైదానంలో జరిగే మ్యాచ్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. -
ధర్మశాలలో ధమాకా
ఆ్రస్టేలియాతో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయలక్ష్యం 389... ఇంత భారీ స్కోరు చూడగానే సాధారణంగా ఛేదన చేసే జట్టు మానసికంగా ముందే ఓటమికి సిద్ధమవుతుంది. కానీ న్యూజిలాండ్ తలవంచకుండా చివరి వరకు పోరాడింది... ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు జోరు తగ్గించలేదు. చివరకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన స్థితి వరకు మ్యాచ్ను తీసుకొచ్చింది. ఇక్కడా అవకాశం ఉన్నా... ఆ్రస్టేలియా అద్భుత ఫీల్డింగ్తో కివీస్ను నిలువరించడంలో సఫలమైంది. బౌండరీని దాటగలిగే రెండు బంతులను మెరుపు వేగంతో దూసుకెళ్లి ఆపడంతో పాటు రెండో పరుగు కోసం చేసిన ప్రయత్నాన్ని రనౌట్తో పడగొట్టింది! దాంతో ఆఖరికి 5 పరుగుల తేడాతో గెలిచి ఆ్రస్టేలియా ఊపిరి పీల్చుకుంది. రచిన్, నీషమ్ల పోరాటం చివరకు వృథా అయింది. అంతకు ముందు తన తొలి ప్రపంచకప్ మ్యాచ్లో హెడ్ మెరుపు సెంచరీ, వార్నర్ దూకుడు వెరసి ఆసీస్కు భారీ స్కోరును అందించాయి. వరల్డ్ కప్లో వరుసగా రెండో రోజు అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసే అవకాశం దక్కగా... ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన 771 పరుగులు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మొత్తం కావడం విశేషం. ధర్మశాల: మ్యాచ్ మ్యాచ్కూ మరింత పదునెక్కుతున్న ఆ్రస్టేలియా ప్రపంచకప్లో మరో కీలక విజయాన్ని అందుకుంది. ఐదు సార్లు విజేత అయిన ఆసీస్కు ఈ టోర్నీలో ఇది వరుసగా నాలుగో విజయం కాగా, వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు 350 పరుగుల స్కోరు దాటగలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డేల్లో నాలుగో శతకం సాధించగా, డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 4 సిక్స్లు) వరుసగా మూడో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్కు 115 బంతుల్లోనే 175 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్స్లు) టోర్నీ రెండో సెంచరీ సాధించగా... జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్స్లు), డరైల్ మిచెల్ (51 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వరల్డ్ కప్ కోసం ఆసీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ట్రవిస్ హెడ్ ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతని చేతికి గాయమైంది. అయినా సరే అతని స్థానంలో మరొకరిని తీసుకోకుండా 14 మందితోనే ఆసీస్ జట్టును కొనసాగించింది. తొలి ఐదు మ్యాచ్లకు దూరమైన అతను తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చీ రాగానే తన విలువేంటో చూపించాడు. హెడ్, వార్నర్ కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో తొలి 10 ఓవర్లలోనే ఆసీస్ ఏకంగా 118 పరుగులు చేసింది. ఈ క్రమంలో వార్నర్ 28 బంతుల్లో, హెడ్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 175/0 కాగా, ఈ స్కోరు వద్ద జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. అనంతరం 59 బంతుల్లోనే హెడ్ శతకాన్ని అందుకున్నాడు. ఈ దశలో ఆసీస్ మిడిలార్డర్ తడబాటుకు లోనై తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ఇన్గ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఛేదనను కివీస్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు యంగ్ (28), కాన్వే (28) సరైన ఆరంభాన్ని ఇవ్వగా, రచిన్ ఆ జోరును కొనసాగించాడు. రచిన్, మిచెల్ కలిసి 96 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 77 బంతుల్లోనే రచిన్ సెంచరీ పూర్తయింది. 59 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో రచిన్ వెనుదిరగ్గా... ఆ తర్వాత నీషమ్ బాధ్యతను తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతని రనౌట్ జట్టు ఓటమిని ఖాయం చేసింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) అండ్ (బి) ఫిలిప్స్ 81; హెడ్ (బి) ఫిలిప్స్ 109; మార్ష్ (బి) సాన్ట్నర్ 36; స్మిత్ (సి) బౌల్ట్ (బి) ఫిలిప్స్ 18; లబుషేన్ (సి) రవీంద్ర (బి) సాన్ట్నర్ 18; మ్యాక్స్వెల్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 41; ఇన్గ్లిస్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 38; కమిన్స్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 37; స్టార్క్ (సి) నీషమ్ (బి) హెన్రీ 1; జంపా (బి) బౌల్ట్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 388. వికెట్ల పతనం: 1–175, 2–200, 3–228, 4–264, 5–274, 6–325, 7–387, 8–388, 9–388, 10–388. బౌలింగ్: హెన్రీ 6.2–0–67–1, బౌల్ట్ 10–0–77–3, ఫెర్గూసన్ 3–0–38–0, సాన్ట్నర్ 10–0–80–2, ఫిలిప్స్ 10–0–37–3, రచిన్ 8–0–56–0, నీషమ్ 2–0–32–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 28; యంగ్ (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 32; రచిన్ (సి) లబుషేన్ (బి) కమిన్స్ 116; మిచెల్ (సి) స్టార్క్ (బి) జంపా 54; లాథమ్ (సి) హాజల్వుడ్ (బి) జంపా 21; ఫిలిప్స్ (సి)లబుషేన్ (బి) మ్యాక్స్వెల్ 12; నీషమ్ (రనౌట్) 58; సాన్ట్నర్ (సి) మ్యాక్స్వెల్ (బి) జంపా 17; హెన్రీ (సి) హాజల్వుడ్ (బి) కమిన్స్ 9; బౌల్ట్ (నాటౌట్) 10; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 383. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–168, 4–222, 5–265, 6–293, 7–320, 8–346, 9–383. బౌలింగ్: స్టార్క్ 9–0–89–0, హాజల్వుడ్ 9–0–70–2, కమిన్స్ 10–0–66–2, మ్యాక్స్వెల్ 10–0–62–1, జంపా 10–0–74–3, మార్ష్ 2–0–18–0. -
ఉత్కంఠను దాటి... పాకిస్తాన్పై ఒక వికెట్ తేడాతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా
చెన్నై: ఒక్కో బంతి, ఒక్కో పరుగుకు గుండెచప్పుడు పెరుగుతుంటే... మరోసారి ‘చోకర్స్’ అనిపించుకోరాదని దక్షిణాఫ్రికా ఒకవైపు... ఈ అవకాశం పోతే వన్డే వరల్డ్కప్లో తమ ఖేల్ ఖతమ్ అని తెలుసు కాబట్టి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాకిస్తాన్ మరోవైపు... వరల్డ్ కప్ 26వ మ్యాచ్ అభిమానులకు అత్యంత ఉత్కంఠను పెంచి ఆసక్తికరంగా ముగిసింది. విజయానికి చేరువైన దశలో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం సఫారీ టీమ్లో ఆందోళన పెంచగా... ఆఖరి వికెట్ తీసేందుకు 11 బంతులు పోరాడిన పాక్ చివరకు తలవంచింది. 17 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా ఒత్తిడిని అధిగమించి కేశవ్ మహరాజ్ కొట్టిన బౌండరీతో ఆట ముగిసింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ముందుగా పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బంతుల్లో 52; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ప్రదర్శన చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీకి 4 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (93 బంతుల్లో 91; 7 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. కీలక భాగస్వామ్యం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అబ్దుల్లా (9), ఇమామ్ (12) సమష్టిగా విఫలమయ్యారు. తొలి బంతికే జాన్సెన్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ (27 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే రిజ్వాన్, ఇఫ్తికార్ (21)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మరోవైపు తడబడుతూనే ఆడిన బాబర్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. 141/5 స్కోరుతో పాక్ కుప్పకూలడం ఖాయమనిపించింది. ఈ దశలో షాదాబ్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో పాటు వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆరో వికెట్కు షకీల్తో కలిసి 84 పరుగులు (71 బంతుల్లో) జోడించిన అనంతరం షాదాబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 50 బంతుల్లో షకీల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. కానీ అతను అవుటైన తర్వాత పరుగులు జోడించడంలో పాక్ విఫలమైంది. 30 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 4 వికెట్లు కోల్పోగా మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన మార్క్రమ్... ఛేదనను దక్షిణాఫ్రికా దూకుడుగా మొదలు పెట్టింది. షాహిన్ వేసిన రెండో ఓవర్లో డికాక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) నాలుగు ఫోర్లు బాదగా, బవుమా (27 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరితో పాటు వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి డసెన్ (21), ఫామ్లో ఉన్న క్లాసెన్ (12) కూడా వెనుదిరగడంతో పాక్ జట్టులో ఆశలు రేగాయి. అయితే మార్క్రమ్, మిల్లర్ (29) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ సహజశైలిలో వీరు ధాటిగా ఆడటంతో సఫారీ జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. వీరిద్దరు ఐదో వికెట్కు 70 పరుగులు జత చేశారు. అయితే లక్ష్యానికి చేరువవుతున్న దశలో పాక్ బౌలర్లు చెలరేగడంతో టీమ్ తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 59 బంతుల్లో కేవలం 21 పరుగులు చేయాల్సిన దశలో మార్క్రమ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరిత ముగింపు వైపు సాగింది. ఫీల్డింగ్లో తలకు గాయం కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పాక్ బౌలర్ షాదాబ్ మైదానం వీడగా... ‘కన్కషన్ సబ్స్టిట్యూట్’గా ఉసామా మీర్ బరిలోకి దిగాడు. వరల్డ్ కప్లో ఇదే తొలి ‘కన్కషన్ సబ్స్టిట్యూట్’ ఘటన కావడం విశేషం. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అబ్దుల్లా (సి) ఎన్గిడి (బి) జాన్సెన్ 9; ఇమామ్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 12; బాబర్ (సి) డికాక్ (బి) షమ్సీ 50; రిజ్వాన్ (సి) డికాక్ (బి) కొయెట్జి 31; ఇఫ్తికార్ (సి) క్లాసెన్ (బి) షమ్సీ 21; షకీల్ (సి) డికాక్ (బి) షమ్సీ 52; షాదాబ్ (సి) మహరాజ్ (బి) కోయెట్జి 43; నవాజ్ (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 24; షాహిన్ (సి) మహరాజ్ (బి) షమ్సీ 2; వసీమ్ (సి) డికాక్ (బి) ఎన్గిడి 7; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–20, 2–38, 3–86, 4–129, 5–141, 6–225, 7–240, 8–259, 9–268, 10–270. బౌలింగ్: జాన్సెన్ 9–1–43–3, ఎన్గిడి 7.4–0–45–1, మార్క్ రమ్ 4–0–20–0, మహరాజ్ 9–0–56–0, కోయెట్జి 7–0–42–2, షమ్సీ 10–0–60–4. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) షకీల్ (బి) వసీమ్ 28; డికాక్ (సి) వసీమ్ (బి) షాహిన్ 24; డసెన్ (ఎల్బీ) (బి) ఉసామా 21; మార్క్రమ్ (సి) బాబర్ (బి) ఉసామా 91; క్లాసెన్ (సి) ఉసామా (బి) వసీమ్ 12; మిల్లర్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 29; జాన్సెన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 20; కోయెట్జి (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 10; మహరాజ్ (నాటౌట్) 7; ఎన్గిడి (సి) అండ్ (బి) రవూఫ్ 4; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 21; మొత్తం (47.2 ఓవర్లలో 9 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–34, 2–67, 3–121, 4–136, 5–206, 6–235, 7–250, 8–250, 9–260. బౌలింగ్: ఇఫ్తికార్ 3–0–23–0, షాహిన్ అఫ్రిది 10–0–45–3, నవాజ్ 6.2–0–40–0, రవూఫ్ 10–0–62–2, వసీమ్ 10–1–50–2, ఉసామా 8–0–45–2. ప్రపంచకప్లో నేడు ఆ్రస్టేలియా X న్యూజిలాండ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి బంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా విజయం
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. చెన్నై వేదికగా పాకిస్తాన్తో చివరి వరకు నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు . ఈ ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో సాతాఫ్రికా విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో మార్క్రమ్(91) టాప్ స్కోరర్గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ల లో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా ,రవూఫ్ , వసీం , ఉసామ మీర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు . టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలలో బాబర్ ఆజం(50), సౌధ్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆఖరిలో షదాబ్ ఖాన్(43), నవాజ్(24) పర్వాలేదనపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షంసీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జానెసన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, లుంగీ ఎంగిడి ఒక్క వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్ మళ్లీ బోల్తా
బెంగళూరు: గత మెగా ఈవెంట్ ఫైనల్లో న్యూజిలాండ్తో సూపర్ ఓవర్దాకా పోరాడి మరీ పుట్టింటికి ప్రపంచకప్ను పట్టుకెళ్లిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం లీగ్ దశలోనే ఇంటికెళ్లే ప్రమాదంలో పడింది. సగం మ్యాచ్లు పూర్తయినా ఒక్కటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. ఇకపై ఆడాల్సిన నాలుగు వరుసబెట్టి గెలిచినా... రేసులో నిలవడమైతే అసాధ్యమే! ఇప్పటికే అఫ్గానిస్తాన్ జట్టు చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్ జట్టును గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో బోల్తా కొట్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్ బృందం 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరులాంటి చిన్నస్వామి స్టేడియంలో ఇది టి20లకు సైతం చిన్నస్కోరు. అలాంటిది వన్డేలకు ఏం సరిపోతుంది. బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 43; 6 ఫోర్లు) చేసిందే టాప్ స్కోర్! ఇంకో ఇద్దరు ఓపెనర్లు బెయిర్స్టో (31 బంతుల్లో 30; 3 ఫోర్లు), మలాన్ (25 బంతుల్లో 28; 6 ఫోర్లు)లవి చెప్పుకోదగ్గ స్కోర్లే తప్ప జట్టుకు ఉపయోగపడే పరుగులేమీ కావు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లహిరు కుమార 3, మాథ్యూస్, కసున్ రజిత చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ను కట్టడి చేశారు. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ నిసాంక ( 83 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), సమరవిక్రమ (54 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించారు. నిసాంక 54 బంతుల్లో, సమరవిక్రమ 44 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తిచేశారు. శ్రీలంక 23 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కుదురుగా ఆడి అబేధ్యమైన మూడో వికెట్కు 137 పరుగులు జోడించి జట్టును విజయతీరానికి చేర్చారు. నిర్లక్ష్యమే నిండా ముంచింది! ఈ మెగా టోర్నీ లో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్, శ్రీలంకలాంటి గట్టి జట్లు 400, 350 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసేస్తుంటే చిన్న స్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కనీసం 160 పరుగులైనా చేయలేకపోయింది. ఓపెనర్ బెయిర్స్టో నుంచి లోయర్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వోక్స్ (0) దాకా బ్యాటింగ్ సామర్థ్యమున్న జట్టు... మేం ఆడేది వరల్డ్కప్ మ్యాచ్ కాదన్నట్లు, మాకేం పట్టనట్లు ఆద్యంతం నిర్లక్ష్యం కనబరిచింది. స్టోక్స్ ముందు, తర్వాత ఇంకెవరూ అసలు చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. రూట్ (3), కెపె్టన్ బట్లర్ (8), లివింగ్స్టోన్ (1), మొయిన్ అలీ (15) అంతా లంక బౌలింగ్కు దాసోహమయ్యారు. ఆదిల్ ఆదమరుపు కీపర్ డైరెక్ట్ త్రో మెరుపు ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ తన నిర్లక్ష్యంతో నాన్స్ట్రయిక్ ఎండ్లో వికెట్ను పారేసుకున్నాడు. 32వ ఓవర్లో తీక్షణ వేసిన ఐదో బంతి లెగ్సైడ్ దిశగా నేరుగా కీపర్ కుశాల్ మెండిస్ చేతుల్లో పడింది. అవతలి వైపున్న రషీద్ క్రీజు వెలుపల ఉన్నాడు. ఇది గమనించిన మెండిస్ గ్లౌజ్ తీసి బుల్లెట్ వేగంతో నాన్స్ట్రయిక్ ఎండ్ వికెట్లను గిరాటే వేయడంతో రషీద్ రనౌటయ్యాడు. రషీద్ అవుటయ్యాక మరో తొమ్మిది బంతులకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) ధనంజయ (బి) రజిత 30; మలాన్ (సి) కుశాల్ మెండిస్ (బి) మాథ్యూస్ 28; జో రూట్ (రనౌట్) 3; స్టోక్స్ (సి) హేమంత (సబ్) (బి) లహిరు 43; బట్లర్ (సి) కుశాల్ మెండిస్ (బి) లహిరు 8; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లహిరు 1; అలీ (సి) పెరీరా (బి) మాథ్యూస్ 15; వోక్స్ (సి) సమరవిక్రమ (బి) రజిత 0; విల్లే (నాటౌట్) 14; ఆదిల్ రషీద్ (రనౌట్) 2; వుడ్ (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) తీక్షణ 5; ఎక్స్ట్రాలు 7; మొత్తం (33.2 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–45, 2–57, 3–68, 4–77, 5–85, 6–122, 7–123, 8–137, 9–147, 10–156. బౌలింగ్: మదుషంక 5–0–37–0, కసున్ రజిత 7–0–36–2, తీక్షణ 8.2–1–21–1, మాథ్యూస్ 5–1–14–2, లహిరు కుమార 7–0–35–3, ధనంజయ 1–0–10–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (నాటౌట్) 77; కుశాల్ పెరీరా (సి) స్టోక్స్ (బి) విల్లే 4; కుశాల్ మెండిస్ (సి) బట్లర్ (బి) విల్లే 11; సమరవిక్రమ (నాటౌట్) 65; ఎక్స్ట్రాలు 3, మొత్తం (25.4 ఓవర్లలో 2 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–9, 2–23. బౌలింగ్: వోక్స్ 6–0–30–0, డేవిడ్ విల్లే 5–0–30–2, ఆదిల్ రషీద్ 4.4–0–39–0, మార్క్ వుడ్ 4–0–23–0, లివింగ్స్టోన్ 3–0–17–0, మొయిన్ అలీ 3–0–21–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ X దక్షిణాఫ్రికా వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
మ్యాక్స్వెల్ విధ్వంసం
న్యూఢిల్లీ: ప్రత్యర్థులు బహు పరాక్! వన్డే ప్రపంచకప్లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా ఫామ్లోకి వచ్చేసింది. క్రికెట్ కూన నెదర్లాండ్స్ను హడలెత్తించింది. ఏకంగా 309 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా... వన్డే ఫార్మాట్ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. తన ఫామ్ కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్స్లు) వరుసగా రెండో సెంచరీ చేయగా... స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్వెల్ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) నెదర్లాండ్స్ బౌలర్ల భరతం పట్టి... వీర విధ్వంసం సృష్టించి... ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. 40 బంతుల్లో మ్యాక్స్వెల్ 100 పరుగులు పూర్తి చేసి ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ (49 బంతుల్లో) సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా (3–0–8–4) మూడు ఓవర్లతోనే స్పిన్ ఉచ్చు బిగించాడు. దంచుడు వార్నర్తో మొదలైతే... నాలుగో ఓవర్లోనే ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్ (9) అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో డచ్ శిబిరానికి కలిగిన ఆనందం ఇదొక్కటే! తర్వాతంతా అలసిపోవడమే! ఎందుకంటే అప్పటికే క్రీజులో ఉన్న వార్నర్గానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లబు షేన్లు గానీ నెదర్లాండ్స్పై కనీస దయ చూపలేదు. బంతిని వదల్లేదు. ఫీల్డర్లను విడిచిపెట్టలేదు. బంతిని, బౌలర్లు, ఫీల్డర్లను కలిపి బలిపీఠం ఎక్కించినట్లుగా వీరబాదుడు బాదేశారు. స్మిత్ 53 బంతుల్లో, వార్నర్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్మిత్ వెనుదిరిగాడు. తర్వాత లబుõÙన్ (42 బంతుల్లో) ఫిఫ్టీ కొడితే... వార్నర్ (91 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 84 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో వచ్చి... 40 బంతుల్లో శతక్కొట్టి... ఓ సెంచరీ, ఇద్దరి ఫిఫ్టీలతోనే ఆసీస్ కథ ముగియలేదు. 39వ ఓవర్లో వచ్చిన మ్యాక్స్వెల్ వరల్డ్కప్లో తన బ్యాట్తో కొత్త రాత (రికార్డు) రాశాడు. 48 ఓవర్లలో ఆసీస్ స్కోరు 361/6. మ్యాక్సీ (75 పరుగులతో) సెంచరీకి దూరంగానే ఉన్నాడు. కానీ లీడే వేసిన 49 ఓవర్లో 4, 4, 6, 6, నోబ్ 6, 1, 0లతో ఏకంగా 28 పరుగులు పిండుకోవడంతో 40 బంతుల్లోనే ఎవరి ఊహకందని విధంగా శతకం పూర్తయ్యింది. 115 వన్డే మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నెదర్లాండ్స్ ప్లేయర్ లీడే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్లో లీడే 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిక్ లూయిస్ (0/113; 2006లో దక్షిణాఫ్రికాపై), ఆడమ్ జంపా (0/113; 2023లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న రికార్డును లీడే అధిగమించాడు. 6 ప్రపంచకప్లో ఆరో సెంచరీతో వార్నర్ ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. రోహిత్ శర్మ (7) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 9; వార్నర్ (సి) ఆర్యన్ (బి) వాన్ బిక్ 104; స్మిత్ (సి) మెర్వ్ (బి) ఆర్యన్ 71; లబుషేన్ (సి) ఆర్యన్ (బి) లీడే 62; ఇంగ్లిస్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 14; మ్యాక్స్వెల్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బిక్ 106; గ్రీన్ (రనౌట్) 8; కమిన్స్ (నాటౌట్) 12; స్టార్క్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–28, 2–160, 3–244, 4–266, 5–267, 6–290, 7–393, 8–393. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–59–1, అకెర్మన్ 3–0–19–0, వాన్ బిక్ 10–0–74–4, మికెరన్ 10–0–64–0, విక్రమ్జీత్ 4–0–27–0, వాన్డెర్ మెర్వ్ 5–0–41–0, బస్ డి లీడే 10–0–115–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్జీత్ (రనౌట్) 25; మ్యాక్స్ ఓ డౌడ్ (బి) స్టార్క్ 6; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హాజల్వుడ్ 10; సైబ్రాండ్ (సి) వార్నర్ (బి) మార్ష్ 11; లీడే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 4; ఎడ్వర్డ్స్ (నాటౌట్) 12; తేజ (సి) ఇంగ్లిస్ (బి) మార్ష్ 14; వాన్ బిక్ (సి) ఇంగ్లిస్ (బి) జంపా 0; వాన్డెర్ మెర్వ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; ఆర్యన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 1; మికెరన్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (21 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–28, 2–37, 3–47, 4–53, 5–62, 6–84, 7–86, 8–86, 9–90, 10–90. బౌలింగ్: స్టార్క్ 4–0–22–1, హాజల్వుడ్ 6–0–27–1, కమిన్స్ 4–0–14–1, మార్ష్ 4–0–19–2, జంపా 3–0–8–4. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ X శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంగ్లండ్తో మ్యాచ్కూ హార్దిక్ పాండ్యా దూరం
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరో మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈనెల 19న బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా చీలమండ గాయానికి గురైన పాండ్యా 22న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగలేకపోయాడు. ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కూ హార్దిక్ దూరమయ్యాడు. నేడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో పాల్గొంటాడు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా పాండ్యా జాతీయ జట్టుకు మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలుస్తుంది. -
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
బంగ్లాదేశ్పై సౌతాఫ్రికా భారీ విజయం
ముంబై: వరల్డ్కప్-2023లో సౌతాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్తో మంగళవారం జరిగిన మ్యాచ్ సఫారీలు 149 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్లో చెలరేగిపోయిన సౌతాఫ్రికా.. ఆపై బౌలింగ్లో కూడా విశ్వరూపం ప్రదర్శించింది. సఫారీల బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ 233 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఆటగాళ్లలో మహ్మదుల్లా(111) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా బంగ్లాకు ఘోర పరాజయం ఎదురైంది.ఇది బంగ్లాదేశ్కు నాల్గో ఓటమి కాగా, దక్షిణాఫ్రికాకు నాల్గో విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.ఈ మ్యాచ్లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. -
షమీ 5 కోహ్లి 95 భారత్ 5
1, 2, 3, 4, 5... ఐదు మ్యాచ్లు మనవే! మైదానంలోకి దిగిన ప్రతీసారి విజయం మన జట్టునే వరించింది... ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ లెక్క కూడా తేల్చేశాం... ఐదుసార్లూ ప్రత్యర్థి లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్నింటినీ ఛేదించేశాం... ఫలితంగా వరల్డ్ కప్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో మళ్లీ పైచేయి సాధించింది... టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సమరంలో రోహిత్ బృందానికే గెలుపు దక్కింది. ప్రపంచకప్లో 20 మ్యాచ్లు జరిగినా హోరాహోరీ సమరం కనిపించలేదనేవారికి ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చింది. పలు మలుపులతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో 12 బంతుల ముందు భారత్ గట్టెక్కింది. 19/2 నుంచి 243/4కు చేరిన కివీస్ను 273కే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది. గత మ్యాచ్లకు భిన్నంగా కొంత తడబడి ఆరు వికెట్లు చేజార్చుకున్నా... చివరకు ఫలితం దక్కింది. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్లో షమీ 5 వికెట్లతో చెలరేగగా... కోహ్లి తనదైన శైలిలో నిలబడి పరుగులను వేటాడినా త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదో మ్యాచ్లోనూ గెలుపు బావుటా ఎగరేసిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ సాధించగా, రచిన్ రవీంద్ర (87 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని నిలువరించాడు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగగా, రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్లు), రవీంద్ర జడేజా (44 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్తో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాన్వే (0)ను సిరాజ్ అవుట్ చేయగా, ఈ ప్రపంచకప్లో తాను వేసిన తొలి బంతికే యంగ్ (17)ను షమీ అవుట్ చేశాడు. అయితే రచిన్, మిచెల్ మూడో వికెట్ భాగస్వామ్యం కివీస్ను కోలుకునేలా చేసింది. మరో 25 ఓవర్లపాటు వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లందరినీ కట్టడి చేసిన కుల్దీప్ బౌలింగ్లో వీరు వేగంగా పరుగులు రాబట్టారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రచిన్ ఇచ్చిన (షమీ బౌలింగ్లో) సునాయాస క్యాచ్ను జడేజా వదిలేశాడు! దీనిని రచిన్ సమర్థంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 60 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. 69 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను బుమ్రా నేలపాలు చేశాడు. ఎట్టకేలకు రచిన్ను వెనక్కి పంపి షమీ ఈ జోడీని విడదీశాడు. లాథమ్ (5) విఫలం కాగా 100 బంతుల్లో మిచెల్ శతకాన్ని అందుకొని ప్రపంచకప్లో భారత్పై సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. 243/4తో మెరుగైన స్థితిలో కనిపించిన జట్టు భారత బౌలర్ల ధాటికి చివరి 6 ఓవర్లలో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. జడేజా అండగా... భారత్కు ఛేదనలో రోహిత్ మరోసారి అద్భుత ఆరంభాన్ని అందించాడు. బౌల్ట్, హెన్రీల బౌలింగ్లో చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో దూసుకుపోయాడు. అతనికి శుబ్మన్ గిల్ (31 బంతుల్లో 26; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే ఫెర్గూసన్ 7 బంతుల వ్యవధిలో వీరిద్దరిని వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి పట్టుదలగా నిలబడిన తీరు భారత్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)లతో పాటు చివర్లో జడేజాతో కోహ్లి మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఒకదశలో 47 బంతుల్లో 28 పరుగులే చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. సమన్వయలోపంతో సూర్యకుమార్ (2) రనౌటైన తర్వాత కోహ్లి, టోర్నీలో తొలిసారి బ్యాటింగ్కు దిగిన జడేజా జత కలిశారు. ఆ సమయంలో 16.1 ఓవర్లలో మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ జట్టును లక్ష్యంవైపు నడిపించారు. కివీస్ బౌలర్లు అప్పుడప్పుడు కొన్ని మంచి బంతులతో ఒత్తిడి పెంచగలిగినా... భారత్ గెలుపును ఆపలేకపోయారు. పాండ్యా, శార్దుల్ స్థానాల్లో షమీ, సూర్యకుమార్ ఈ మ్యాచ్లో జట్టులోకి వచ్చారు. ఈసారి సెంచరీ దక్కలేదు! మ్యాచ్లో ఒకవైపు భారత్ గెలుపు అవకాశాలు మెరుగవుతూ రాగా, మరోవైపు కోహ్లి సెంచరీ చేసి సచిన్ను సమం చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో రాహుల్లాగే ఈసారి జడేజా కూడా సహకరించడంతో ఆఖర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కోహ్లి ఒక్కడే చేసి శతకానికి చేరువయ్యాడు. జట్టుకు 35, కోహ్లికి 25 పరుగులు అవసరమైనప్పుడు ఉత్కంఠ పెరిగింది. ఆపై ఈ సమీకరణం 19 పరుగులు, 18 పరుగులకు మారింది. అయితే బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కోహ్లి 6, 4 సహా 11 పరుగులు రాబట్టి 93కు చేరుకున్నాడు. ఇప్పుడు 7 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. అయితే మూడో బంతిని భారీ సిక్సర్గా మలచి ముగించే ప్రయత్నంలో బౌండరీ లైన్కు చాలా ముందే క్యాచ్ ఇచ్చాడు. దాంతో అతను ప్రస్తుతానికి 48 సెంచరీల వద్దే నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; యంగ్ (బి) షమీ 17; రచిన్ (సి) గిల్ (బి) షమీ 75; మిచెల్ (సి) కోహ్లి (బి) షమీ 130; లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 5; ఫిలిప్స్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 23; చాప్మన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; సాన్ట్నర్ (బి) షమీ 1; హెన్రీ (బి) షమీ 0; ఫెర్గూసన్ (రనౌట్) 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 273. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–178, 4–205, 5–243, 6–257, 7–260, 8–260, 9–273, 10–273. బౌలింగ్: బుమ్రా 10–1–45–1, సిరాజ్ 10–1– 45–1, షమీ 10–0–54–5, జడేజా 10–0– 48–0, కుల్దీప్ 10–0–73–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఫెర్గూసన్ 46; గిల్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 26; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 95; అయ్యర్ (సి) కాన్వే (బి) బౌల్ట్ 33; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాన్ట్నర్ 27; సూర్యకుమార్ (రనౌట్) 2; జడేజా (నాటౌట్) 39; షమీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (48 ఓవర్లలో 6 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–71, 2–76, 3–128, 4–182, 5–191, 6–269. బౌలింగ్: బౌల్ట్ 10–0–60–1, హెన్రీ 9–0–55–1, సాన్ట్నర్ 10–0–37–1, ఫెర్గూసన్ 8–0–63–2, రచిన్ 9–0–46–0, ఫిలిప్స్ 2–0–12–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ Xఅఫ్గానిస్తాన్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అఫ్గాన్ స్పిన్కు పాక్ ఎదురునిలిచేనా?
చెన్నై: ప్రపంచకప్లో మళ్లీ గెలుపుబాట పట్టాలని పాకిస్తాన్... మరో సంచలనంపై కన్నేసిన అఫ్గానిస్తాన్ సమరానికి సై అంటున్నాయి. బాబర్ ఆజమ్ బృందంతో పోల్చితే ఏ రకంగా చూసినా కూడా అఫ్గాన్ కూనే! అయితే ఈ ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్లపై 270 పైచిలుకు పరుగులు చేయడం, మ్యాచ్ను పలుపు తిప్పే స్పిన్నర్లు ఉండటంతో హష్మతుల్లా షాహిది జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక పాక్ విషయానికే వస్తే వరుసగా భారత్, ఆ్రస్టేలియా చేతుల్లో ఓడిన జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. గెలిస్తే సెమీఫైనల్ రేసులో నిలుస్తుంది. లేదంటే మరింత ఒత్తిడిలో కూరుకుపోతుంది. వరుసబెట్టి గెలవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవొచ్చు. కాబట్టి అబ్దుల్లా షఫీక్, ఇమాముల్లతో కూడిన టాపార్డర్, రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్లతో ఉన్న మిడిలార్డర్ బాధ్యతగా ఆడాలి. బౌలింగ్లో షాహిన్ అఫ్రిదికి మిగతా సీమ్ సహచరులు కూడా తోడైతే అఫ్గాన్ను ఆదిలోనే కట్టడి చేయొచ్చు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్ తర్వాత రన్నరప్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ ఫలితం పక్కన బెడితే మ్యాచ్కు వేదికైన ఇక్కడి చెపాక్ పిచ్ స్పిన్కు కలిసొచ్చేది. అఫ్గాన్ జట్టులోని స్పిన్ వనరులకు (రషీద్, నబీ, ముజీబ్) ఈ పిచ్ సహకరిస్తే పాక్పై సంచలనం తప్పకుండా ఆశించవచ్చు. బ్యాటింగ్ దళం కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ హష్మతుల్లాసహా గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మ త్ షాలు నిలకడగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఏమాత్రం ఆదమరిచినా కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్ ), షఫీక్, ఇమాముల్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, నవాజ్, ఉసామ మీర్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, రవూఫ్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మత్ షా, ఒమర్జాయ్, ఇక్రామ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నవీనుల్, ఫరూఖీ. 7 వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరిగాయి. ఏడు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ జట్టే గెలిచింది. ఈ రెండు జట్లు ప్రపంచకప్లో (2019) ఒకసారి తలపడ్డాయి. పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.