adivasis
-
ప్రకృతి పంట.. ఆదాయం ఇంట
గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో లభించే తునికాకును ప్రకృతి సంపద (పంట)గా భావిస్తారు. ప్రతీ వేసవిలో రెండు నెలల పాటు తునికాకే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు. ఏటా ఆదివాసీలు ఏప్రిల్లో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అయితే ఎక్కువగా మే నెలలో సేకరించడం పూర్తి చేస్తారు. తద్వారా రెండు నెలల పాటు ఆదాయం సమకూరుతుంది. విరివిగా లభ్యం.. మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, గూడూరు అటవీశాఖ డివిజన్తో పాటు ములుగు, ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, గుండాల, బయ్యారం మండలాల్లో ఏప్రిల్, మేలలో తునికాకు సేకరణ జోరందుకుంటుంది. ఒక్కో సంవత్సరం తునికాకు సేకరణ ఎక్కువగా జరిగి ప్రభుత్వ సూచన ప్రకారం ఫారెస్టు అధికారులు ప్రతీ డివిజన్లో టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వేసవిలో తునికాకు సేకరణను ఉపాధి మార్గంగా ఎంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా కూలీల ద్వారా ఆకు సేకరించి కట్టలను కొనుగోలు చేస్తోంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించారు. ఈ సంవత్సరం కట్ట ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి కోడి కూతతో అడవికి పయనం.. తునికాకు సేకరణకు గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుంటారు. అంబలి, గంజి తీసుకొని అడవులకు పయనమవుతారు. అడవిలో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకు కోసి బస్తాల్లో నింపుకుని ఎత్తుకొస్తారు. కొందరు బస్తాల్లో తీసుకొచ్చిన ఆకులను ఇంటి వద్ద కట్టలు కట్టగా, మరికొందరు అడవిలోనే చెట్ల కింద కూర్చొని 50 ఆకుల చొప్పున కట్ట కడతారు. సాయంత్రం ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల వద్ద వాటిని విక్రయిస్తారు. ప్రతీరోజు ఒక్కో కూలీ రూ.450 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో.. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మట్టెవాడ, కొంగరగిద్ద, గోపాలపురం గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల దాదాపు 10 కల్లాలను ఏర్పాటు చేస్తారు. గతేడాది గూడూరు రేంజ్ పరిధిలో 2 వేల స్టాండర్ట్ బ్యాగులు (20 లక్షల) తునికాకు కట్టల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తునికాకు సేకరణపై నిఘా పెడతాం. ఆకుల కట్టలు విక్రయించిన కూలీలకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లిస్తాం. ఆకులు సేకరించే వారి నుంచి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు ఖాతా జిరాక్స్లను సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ఆకు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బత్తుల విశాల్, డీఎఫ్ఓ, మహబూబాబాద్ రెండు నెలలు ఉపాధి వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రెండు నెలల పాటు పని దొరుకుతుంది. ప్రతీరోజు తెల్లవారు జామునే అడవికి వెళ్తాం. బస్తాల నిండా ఆకు సేకరించి, ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. మధ్యాహ్నం కుటుంబం అంతా కలిసి కూర్చొని 50 ఆకులతో కట్టలు కడుతాం. సాయంత్రం కల్లం వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తాం. – మేడ సమ్మయ్య, మట్టెవాడ, గూడూరు తునికాకు ఉపాధి కల్పిపస్తుంది మండుటెండా కాలంలో కూలీ పనులు దొరకవు. దీంతో ప్రతీ సంవత్సరం తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రోజు పొద్దున్నే అడవికి వెళ్లి ఆకు కోసుకొస్తాం. మధ్యాహ్నం కట్టలు కట్టి కల్లంలో అమ్ముతాం. రోజు రూ.450 నుంచి రూ.500 వరకు డబ్బులు వస్తాయి. – ప్రవళిక, మర్రిమిట్ట, గూడూరు వృద్ధులకు సైతం ఆదాయం తునికాకు సేకరణతో విద్యార్థులు, వృద్ధులకు డబ్బులు వస్తాయి. విద్యార్థులు బడులు మొదలయ్యే ముందు కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు కొనేందుకు వాడుకుంటారు. వృద్ధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. – రమ్య, మర్రిమిట్ట, గూడూరు -
రీచింగ్ ది అన్రీచ్డ్..!
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఇక వారి పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదనే చెప్పాలి. తరతరాలు ఆదివాసుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయని కలత చెందిన కొందరు యువకులు.. వారికి అక్షర జ్ఞానం అందించాలని సంకల్పించారు. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ (బీసీహెచ్సీ) పేరిట చిన్న సంస్థను నెలకొల్పి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరావు.. ఆ సంస్థ సేవలపై డాక్యుమెంటరీ నిర్మించారు. దీనికి యూజీసీ ఆధ్వర్యంలో జోధ్పూర్లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి లభించింది. - సాక్షి, హైదరాబాద్అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో జీవించే ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు. రాళ్లు రప్పల దారుల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. వారి భాష, వేషం, నమ్మకాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలను స్కూల్కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బయటి వ్యక్తులను కనీసం నమ్మరు కూడా. అలాంటివారికి విద్యాబుద్ధులు నేర్పుతోంది బీసీహెచ్సీ. సంతోష్ ఈస్రం అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సంస్థ. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన.. తమ ఉద్దేశాన్ని ఆ గిరిజనులకు వివరించి ఒప్పించడానికే రెండున్నర నెలల పాటు కష్టపడ్డారు. వారి భాష కూడా నేర్చుకున్నారు. పిల్లలను బడికి రప్పించేందుకు రోజూ కోడిగుడ్లు ఇచ్చారు. అలా వారితో కలిసిపోయి నెమ్మదిగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. చివరికి 2020 జూన్ 23న బీసీహెచ్సీ పేరుతో సంస్థను స్థాపించారు. తాడ్వాయి మండలంలోని నీలంగోతు అనే చిన్న పల్లెలో గుడిసె కట్టి అందులో 10 ఏళ్ల లోపు ఉన్న 45 మంది చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.కొండ కోనల్లో నడిచి.. నీలంగోతులో పాఠశాల విజయవంతం కావడంతో భూపాలపల్లి జిల్లాల్లోని బండ్లపహాడ్, సారలమ్మగుంపు, తక్కెళ్లగూడెం, ఐలాపురం, ప్రాజెక్ట్ నగర్, కల్వపల్లి, దండుపల్లి, ముసలమ్మ పెంటలో గుడిసె బడులు తెరిచి ఒక్కో టీచర్ను నియమించారు. వాళ్లు రోజూ ఏకంగా 10 నుంచి 18 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరితో పాటు అనేకమంది వలంటీర్లు ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పిల్లలకు చదువు చెప్పేందుకు వీలుగా ఒకచోట పక్కా భవనం నిర్మించింది. డాక్యుమెంటరీకి అవార్డు.. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘుపతి.. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉండి, పిల్లల స్థితిగతులు.. టీచర్ల కృషిని చూసి ముగ్ధుడయ్యారు. ‘రీచింగ్ ది అన్రీచ్డ్’పేరిట డాక్యుమెంటరీ తీశారు. తాజాగా రాజస్తాన్లోని జోద్పూర్లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెవలప్మెంట్ కేటగిరీలో దీనికి బెస్ట్ షార్ట్ఫిల్మ్ అవార్డు లభించింది. అలాగే మానవ హక్కుల కేటగిరీలో కూడా స్క్రీనింగ్కు ఎంపికైంది. దీనికి వచి్చన రూ.50 వేల నగదు బహుమతిని ఆయన బీసీహెచ్సీకే అందజేశారు.ఎంతో కష్టపడాల్సి వచ్చిoది..ఆదివాసుల కష్టాలు కళ్లారా చూశాను. నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి వచ్చాను. వాళ్ల గూడేల్లోకి వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి వారికి చదువుకోవటం అనేది చాలా పెద్ద విషయం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు నేర్పించేందుకు సుముఖత చూపించరు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించి బడి వరకు రప్పించాం. మా సంస్థపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. –సంతోష్ ఈస్రం, భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వ్యవస్థాపకుడు -
‘ఆపరేషన్ కగార్’ పై సర్వత్రా చర్చ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్గఢ్కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం మావోలకు ఇలాఖాగా మారింది. అప్పట్లో పోలీసు బలగాలకు మావోయిస్టులు కంటికి మీద కునుకు లేకుండా చేశారు. కాలక్రమంగా వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కీలక స్థానాల్లో తెలుగువారునిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పొలిట్బ్యూరో కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. » మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా సింగరేణి కోల్ కమిటీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు సమాచారం. » ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, రాష్ట్ర కమిటీ మెంబర్, కేబీఎం (కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల) కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. » బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ పార్టీ నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్నట్టుగా చెబుతారు. ఇదే మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి, అతని సహచరి పుష్ప దండకారణ్యంలోనే ఉన్నారు. » కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క దండకారణ్యంలోనే ఉన్నారు. ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షలకు పైనే రివార్డులు ఉన్నాయి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లుగత కొంతకాలంగా మావోయిస్టులు చనిపోవడమో, లొంగిపోవడమో జరుగుతోంది. ఐదు దశాబ్దాలకుపైగా పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్(69) గతేడు జూన్లో మరణించారు. బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడు, పార్టీ పత్రికలకు ఎడిటర్గా పని చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. » దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్చార్జ్గా పనిచేసిన కాసర్ల రవి అలియాస్ అశోక్ ఎన్కౌంటర్లో మరణించారు. వీరే కాకుండా కంతి లింగవ్వతోపాటు సీనియర్లను పార్టీ కోల్పోయింది. మూడేళ్ల క్రితం ఉమ్మ డి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూ రు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకా లు చేపట్టింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో భదత్రా బలగాల చేతిలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. ప్రస్తుతం కోల్బెల్ట్ కమిటీ సింగరేణి కారి్మకుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలకే పరిమితమైంది.అడవి వీడి బయటకు రావాలి మా చెల్లి నా కోసం వచ్చి అక్కడే ఉండిపోయింది. నేను లొంగిపోయి సాధారణ జీవితం గడు పుతున్నా. మా చెల్లి 36 ఏళ్లుగా పార్టీలోనే ఉంది. అడవి వీడి తిరిగి వస్తే అందరికీ సంతోషం. - చౌదరి చిన్నన్న, చౌదరి అంకుబాయి అన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగర్గూడఆశయాన్ని చంపలేరు వ్యక్తులను చంపగలరు గానీ ఆశయాన్ని చంపలేరు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకున్నా అంతిమ విజయం ప్రజలదే. నా స్వార్థం కోసం మా నాన్నను అజ్ఞాతం వీడమని చెప్పలేను. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపి పరిష్కారాన్ని వెతకాలి. అంతేకాని ఉద్యమాన్ని అణచడం కాదు. – బండి కిరణ్, మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ కొడుకుజీవించే హక్కును కాపాడాలి ఆదివాసీలు నేరం చేసినట్టు లక్షల కొద్దీ బలగాలతో అడవుల్లో క్యాంపులను ఏర్పా టు చేసి అమాయకులను చంపేస్తున్నా రు. అడవి, సహజ వనరులను నాశనం చేసి సాధించేదేమిటి? 2005 నుంచి అనేక పేర్లతో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, అసమానతల కోణంలో చూస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపు తున్న మరణహోమాన్ని వెంటనే ఆపేయాలి. చర్చలకు పిలవాలి. ప్రతీ ఒక్కరికి జీవించే హక్కును కాపాడాలి. – నక్క నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పౌరహక్కుల సంఘం. -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
గొత్తికోయల ‘అరణ్య’ రోదన
వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు. దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్ఓఎఫ్ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు. అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు. బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు. హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది. గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
అడవి బిడ్డల తిరుగుబాటు
-
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్లో 39 మందితో, ఛత్తీస్గఢ్లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్ను ఓడించిన ఘనత విజయ్కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్సింగ్ చౌహాన్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదివాసీల అభివృద్ధే దేశాభివృద్ధి: గవర్నర్
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): ప్రకృతితో మమేకమై స్వచ్ఛంగా ఉండే ఆదివాసీలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందినట్లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంస్థ, ఆదివాసీ విద్యార్థి మండలి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమంటే భగవంతుడికి సేవ చేయడమేనన్నారు. గవర్నర్గా ఇక్కడికి వచ్చాక ఆరు ఆది వాసీ గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ సర్వే చేయించగా...అక్కడి మహిళలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నట్లు తేలిందని, వారికి ఐరన్ మాత్రలు పంపించగా...వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడలేదని వివరించారు. దీంతో ఐరన్ ఎక్కువగా లభించే మహువా పూలతో తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తే చాలామంది మహిళలు రక్తహీనతనుంచి బయటపడ్డారని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆదివాసీలతో కలసి గవర్నర్ నృత్యాలు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..ఆర్టి కల్ 244 ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయని, కానీ వాటిని పరిరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంబ్రాయిడరీ ఎంపవర్మెంట్
తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్. సాధికారత కుట్టారు షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు. ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్లు, మఫ్లర్లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు. నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్లో కూడా లభిస్తున్నాయిప్పుడు. కళ కొనసాగాలి ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్. -
75 ఏళ్ల తర్వాత తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది. ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినదని తెలిసిందే. చదవండి: బీజేపీ ఇన్చార్జి తరుణ్ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్? -
అక్కగా.. అండగా ఉంటా!
భద్రాచలం/సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాజ్భవన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. సాధారణంగా రాజ్భవన్ల ద్వారాలు మూసి ఉంటాయి. కానీ ఈ రాజ్భవన్ ద్వారాలు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. ఇది నిజంగా ఒక ప్రజాభవన్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రాజ్భవన్ను సందర్శించండి. అక్కడ ఈ అక్క మీకు అండగా ఉంటుంది. నేను తమిళనాడు ఆడపడుచునైనా తెలంగాణ అక్కనే..’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో, ఖమ్మం రూరల్ మండలంలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. సీతారాములను దర్శించుకుని.. గవర్నర్ ముందుగా భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ‘ప్రియాతి ప్రియమైన నా ఆదివాసీ బంధువులారా..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆదివాసీల సమస్యలు తన హృదయాన్ని కలచివేస్తున్నాయని.. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యపరంగా ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి కలసి పనిచేద్దామన్నారు. జనంలోకి వెళితేనే సమస్యలు తెలుస్తాయి ప్రజలను నేరుగా కలిస్తేనే సమస్యలపై మరింత అవగాహన కలుగుతుందని, రాజ్భవన్లో కూర్చుంటే సమస్యలు మాత్రమే వినగలుగుతానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల సమస్యలను, బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వచ్చానని, వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్ను.. ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీల తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు. పరిశోధనలపై దృష్టి పెట్టాలి దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం.. ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), ఎంటర్ ప్రెన్యూర్íÙప్ (వ్యవస్థాపన) కీలకమని.. కళాశాలలు తమ క్యాంపస్లను ఆవిష్కరణలకు వేదికగా మార్చుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టిపెట్టాలని సూచించారు. బుధవారం ఖమ్మంరూరల్ మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వై20 ఇండియా ఉత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, తమ అభిరుచికి అనుగుణంగా రాణించడానికి కృషిచేయాలని సూచించారు. విద్యార్థులు రాజకీయాల్లో కూడా రాణించాలని.. చదువుకున్న రాజకీయ నాయకులు దేశానికి ఉపయోగపడతారని పేర్కొన్నారు. -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్గా వ్యవహరిస్తున్న వరుణ్రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
మొదలైన ‘నాగోబా’ జాతర.. ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి/ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరెను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. పుష్య అమావాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం నుంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం తెల్లవారుజామున 84 మందికి తూమ్ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో నియమనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దలకు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నాయక్పాడ్ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనేరు నుంచి పవిత్రజలాలను నాగోబా సన్నిధికి తెచ్చారు. గతేడాది నిర్మించిన మట్టిపుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టలను తయారు చేశారు. మట్టి ఉండలను మహిళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు గోవాడా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
భయం మొదలైందా..? ఇన్నాళ్లకు ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగిందా?
ఆ సంఘం ఓ వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒకసారి ఎమ్మెల్యేను చేసింది. మరోసారి ఎంపీని చేసింది. ఎంపీ కాగానే రాజకీయ జన్మనిచ్చిన సంఘాన్ని వదిలేశారాయన. జనానికి దూరమై రాజకీయంగా బలహీనమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగింది. మళ్లీ తనకు జీవితాన్నిచ్చిన సంఘానికి సారథ్యం వహించాలని అనుకుంటున్నారు. ఆదివాసీలకు దగ్గర కావాలంటే ఆ సంఘం నాయకత్వం ఎంత అవసరమో గ్రహించారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆ సంఘం సంగతేంటి? ఉద్యమం నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలో అణగారిన వర్గంగా ఉన్న గోండు తెగ ఆదివాసీల్లో చైతన్యాన్ని రగిల్చిన సంస్థ తుడుం దెబ్బ. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు గుర్తింపు లభించింది. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరపున విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం వరకు తుడుం దెబ్బకు నాయకత్వం వహించిన సోయం బాపూరావు.. ఎంపీ బాధ్యతల కారణంగా సంఘం నాయకత్వాన్ని వదులుకున్నారు. ఉద్యమ సారథిగా ఉన్న కాలంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం నడిపారు. ఆదివాసీల హక్కుల కోసం బలమైన ఉద్యమం నిర్మించడం ద్వారానే నాయకుడిగా గుర్తింపు పొందారాయన. మమ్మల్ని దూరం పెడతారా? ఆదివాసీల మద్దతుతోనే పార్లమెంట్లో అడుగు పెట్టిన సోయం బాపూరావు.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు. పోరాటం అగిపోయింది. సంఘం బాధ్యతల నుంచి కూడా ఏడాదిన్నర క్రితం తప్పుకున్నారు. తాము నమ్మి ఎంపీనీ చేసిన నాయకుడు ఉద్యమం నుండి వైదొలగడం అదివాసీలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఎంపీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఖరితోనే ఉద్యమ కాలంలో బాపూరావు వెన్నంటి ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను వీడిపోయారట. ఏడాదిరన్నరలోగానే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆదివాసీలు దూరం కావడంతో.. ఎంపీకి జ్ఞానోదయం కలిగిందంటున్నారు. ఆదివాసీలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలిందట. మీ మాట వింట.. మీ వెంట ఉంటా.! పరిస్థితి అర్థం కావడంతో ఎంపీకి దడ మొదలైందట. గతంలో ఒక పిలుపునిస్తే చాలు... వేలాదిగా రోడ్ల మీదకు వచ్చేవారు. వారి వల్లే ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన తాను.. ఇప్పుడు ఓడి పోవడం ఖాయమనే భయం మొదలైందట. దీంతో మళ్ళీ తన సామాజిక వర్గమైన ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందులో భాగంగానే తుడుం దెబ్బ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా తిరిగి పదవి దక్కించుకోవడానికి సోయం బాపూరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు పదవి అప్పగిస్తే చాలు అదివాసీల హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారట. ఆదిలాబాద్ ఎంపీ గోండులకు దగ్గర కావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. తుడుం దెబ్బ బాధ్యతలను తిరిగి బాపూరావుకు అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సోయం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో... ఆదివాసీలు మద్దతు ఎంతవరకు కూడగడతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గొత్తికోయలను వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేకచర్య: జూలకంటి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గొత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం మాజీ శాసనసభ పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నాయన్న విషయం తెలియకుండా శతాబ్దాలుగా అడవే జీవనా«ధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఛతీస్గఢ్ రాష్ట్రం నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గొత్తికోయలు వలస వచ్చారన్నారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివాసీ అటవీహక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘గొత్తికోయలు – పోడుభూముల సమస్యలు’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయల జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. వారు తెలంగాణ పౌరులు కాదని మంత్రి సత్యవతిరాథోడ్, అటవీఅధికారులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను బూచీగా చూపి వారికి పోడు భూములపై హక్కులు కల్పించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గిరిజన సంఘం కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రమణాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
World Tribal Day: ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 'గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం.#WorldTribalDay — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022 చదవండి: (ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?) -
భారత్.. నాదీ కాదు, మోదీ-షాలదీ కాదు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత దేశం గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్.. నాది(ఒవైసీ) కాదు, మోదీ-షాలదీ కాదు.. అంతుకుమించి థాక్రేలది అసలే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. భారత్.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాదీ కాదు, మోదీ-షాలదీ, థాక్రేలది అసలే కాదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలోకి మొగల్స్ వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, సంజయ్ రౌత్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నవాబ్ మాలిక్.. ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Bhiwandi, Maharashtra | India is neither mine, nor Thackeray's, nor Modi-Shah's. If India belongs to anyone, it's Dravidians & Adivasis but BJP-RSS only after Mughals. India was formed after people migrated from Africa, Iran, Central Asia, East Asia:AIMIM's Asaduddin Owaisi(28.5) pic.twitter.com/NmpxCYo2oC — ANI (@ANI) May 28, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం -
వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..
సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు ఆహారపు అలవాట్లు వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు వాగులు వంకల్లోనే నివాసం కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు. పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
ఆదివాసుల దినోత్సవం: అడవితల్లి బిడ్డల అగచాట్లు
కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం... సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు నార్నర్(ఆసిఫాబాద్): ఆదివాసీ గిరిజనులు అనా దిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతకాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ వి వాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్రావు ఆదివాసీ తెగలకు సంబంధింన 40 రకాల వాయిద్యాలు సేకరిం 2019 వర్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు. ఆదివాసీ వాయిద్యాలు : డోల్ (డోలు) : డోలు, డ ప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇత ర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒ క్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్, చెడ్యంగల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు. డప్ (డప్పు) : దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బ ట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు. పెప్రే(సన్నాయి) : పెప్రేలను ప్రధాన్, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్ వస్తుంది. కాలికోం(కొమ్ము) : పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు. తుడుం : డోలు, డప్లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి వత్రమే దీనిని వాడతారు. కిక్రీ : ఇది తోటి, ప్రధాన్లలో ఉంటుంది. పెర్సాపెన్, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు. డోల్కి : ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు. ఆకట్టుకునే సంస్కృతి,సంప్రదాయాలు.. దండేపల్లి(మంర్యాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు. ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భమి, నీరు, అడవిలో దొరికే ఫలా లపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్త వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢవసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన)దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్, తదితర పూజలకు ఇప్పపరకనూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది. ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. మారని బతుకులు ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల 95వేల 794 మంది అదివాసీ గిరిజనులున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేసేందుకు 1975లో ప్రభుత్వం ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఏర్పాటైన ఐటీడీఏ నాలుగు దశాబ్దాలు దాటినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. నేటికి చాలా అదివాసీ గిరిజన ప్రాంతాలు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏటా జ్వరాలు, వ్యాధులతో వందల సంఖ్యలో మృత్యుఒడి చేరుతున్నారు. పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా.. జన్నారం(ఖానాపూర్): అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాĶæలు నేటికీ అద్దం పడుతున్నాయి. జన్నారం మండలంలోని లోతొర్రే, అలీనగర్, కొలాంగూడ, హాస్టల్ తండా, నర్సింగాపూర్, తదితర ఆదివాసీ గ్రావల్లో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. దండోరా సంబరాల్లో గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా సంప్రదాయం మారదు మేమంతా ఒకేతాటిపై ఉంటాం. మా తండ్రులు, తాతలు నేర్పిన సంప్రదాయాలు వర్చుకోం. సంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్లు మమ్మల్ని కాపాడుతారు. గూడెంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారు. – గంగరాం, లోతొర్రే గూడెం పటేల్ లక్ష్యం సాధించాలి... ఆదిలాబాద్రూరల్: నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతగానో శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించా. ఆదివాసీ తెగలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నా. క్రీడల్లో రాణించే వారికి సైతం ఆర్థికంగా చేయూత అందజేస్తున్నా. – డాక్టర్ సుమలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, ఆదిలాబాద్ దుకాణం నడుపుతూ చదివా ఆదిలాబాద్రరల్: వది బేల మండలంలోని దహేగాం. చదువుకునే రోజుల్లో సాంగిడిలో చిన్న కిరాణా షాపు నడిపించా. మా నాన్నకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. సర్పంచ్ చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో మాగ్రామానికి న్యూస్పేపర్ వచ్చేది కాదు. కిరాణా సామాను కోసం ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పేపర్ చదివేవాడిని. 1985లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఎస్సైగా ఉద్యోగం సాధించాను. సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగా. – డీజీపీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మడావి బాపురావ్,డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఆదిలాబాద్రరల్: ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు అవకాశాలు లేవు. సౌకర్యాలు అంతంత వత్రమే. మా తల్లిదండ్రులు టీచర్లు కావడంతో ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల ను ప్రోత్సహించాలి. - కుడ్మేత మనోహర్, ఏజెన్సీ డీఎంహెచ్వో, ఉట్నూర్ పట్టుదలతో ఉద్యోగం సాధించా ఆదిలాబాద్రూరల్: నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే రోజుల్లో అంతగా పోటీ ఉండేది కాదు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. ఏకకాలంలో ఆర్టీసీలో, మెడికల్ ఫీల్డ్లో ఉద్యోగాలు వచ్చాయి. అందులో మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నా. ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారు పేదవారికి సహాయం చేస్తే వారు కూడా ఉద్యోగం సాధించే ఆస్కారం ఉంటుంది. – సిడాం వామన్రావు, డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా.. బేల(ఆదిలాబాద్): మండలంలోని సోన్కాస్లో నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మేస్రం జనార్దన్, శాంతబాయి దంపతుల కుమారుడు మేస్రం నాగేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువు పూర్తి చేశాడు. 2013 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రం విభాగంలో చేరి 2018 జూన్లో పట్టా సాధించాడు. సోడియం ఫ్లోరైడ్ అనే టాక్సికేట్ను ఎలుకలకు ఇచ్చి ప్లురోసిస్ అనే వ్యాధిని గుర్తించాడు. వ్యాధిని నయం చేసేందుకు అల్లనేరేడు, జామ, ఉసిరి, అడవిబెండ వంటి ఫలాల నుంచి క్యూరే్సటిన్ అనే ఔషధాన్ని తయారు చేశాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఫర్ ఉమెన్స్, కోఠిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదర్శంగా నాగోరావు తాంసి: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మేస్రం నాగోరావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగం సాధించి ఆరేళ్లుగా విధులు నిర్వహిస్త తమ ప్రాంతంలోని గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిపాని గ్రామంలోని గిరిజన కుటుంబం చెందిన మేస్రం భంబాయి, దేవరావ్ల కుమారుడు మేస్రం నాగోరావు. మొదటి ప్రయత్నంలోనే ఎఫ్సీఐలో ఉద్యోగం సాధించి 2016లో విధులలో చేరాడు. -
గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి
సాక్షి, ఆదిలాబాద్ : కొమరం భీమ్ జిల్లా అదివాసీ కళాకారునికి అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. చదవండి: పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు. అయితే గుస్సాడీ కళ వందల ఎళ్ల కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా దండారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్ను ప్రార్థిస్తూ గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి. -
ఆదివాసీలతో పవన్ ముచ్చట.. వీడియో వైరల్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. లాక్డౌన్ ముగిశాక ఓ షెడ్యూల్లో పాల్గొన్న ఆయన కాస్త విరామం తీసుకున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్లాష్ బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్లో భాగంగా అరకు వెళ్లిన పవన్.. అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపాడు. షూటింగ్ విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్కు వివరించారు. ఈ వీడియోని స్వయంగా పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది)’అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA — Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020 -
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. (చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు) అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని అధికారులకు సూచించారు. అధికారులు మానవత్వంతో పని చేయాలని, గిరిజనులు ఆదాయం పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్లో లింక్ చేయాలని సూచించారు. అదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
చిరుత మృతి ఘటనలో కొత్త ట్విస్ట్
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండలం డేడ్రా అటవీ ప్రాంతం చిరుతపులి మృతి చెందిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆదివాసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చిరుతను ఎవరు చంపారనే దానిపై ఆదివాసీలు, లంబాడాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసు ఇన్ఫార్మర్గా ఉన్న లంబాడీ వర్గానికి చెందిన నామ్దేవ్ పులిని చంపి ఆ కేసులో అమాయక గిరిజన రైతులను ఇరికించారని ఆదివాసీ నేతలు ఆరోపిస్తున్నారు. నామ్దేవ్ పులిని చంపి వస్తూ దారిలో ఉన్న రైతులకు గోర్లు ఇచ్చి.. రెండు కాళ్లు పోలీసులకు ఇచ్చి తమను కేసులో ఇరికించారని నిందితులు చెబుతున్నారు. దీంతో ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య వివాదం ముదురుతోంది. మరోవైపు ఆదివాసీ నేతలు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లడంతో.. నిందితులు వారిని ఫోన్లో సంప్రదించి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నామ్దేవ్ పోలీసు ఇన్ఫార్మర్ కావడంతోనే తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే అటవీ అధికారులు తమను అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు. కాగా, చిరుత మరణానికి అడవిలో అమర్చిన విద్యుత్ తీగలే కారణమని అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకు కారణమైన 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. విద్యుత్ తీగలు పంటల రక్షణ కోసం అమర్చారా లేదా వేట కోసమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. -
ఢిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు
సాక్షి, న్యూఢిల్లీ: హక్కుల సాధన కోసం ఆదివాసీలు కదంతొక్కారు. అస్తిత్వ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉధృతం చేశారు. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం జోడెఘాట్ కేంద్రంగా పురుడుపోసుకున్న ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఆదివాసీల హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు వేల సంఖ్యలో ఆదివాసీలు తరలివచ్చారు. ప్రత్యేక రైళ్లు, వాహనాల్లో ఢిల్లీ బాటపట్టారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ భూమిపై హక్కులు కల్పించాలని, ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో సరైన విధానం పాటించకుండా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీనివల్ల ఆదివాసీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. వందలో మూడు ఉద్యోగాలు కూడా దక్కడం లేదు: సోయం లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వందలో 3 ఉద్యోగాలు కూడా ఆదివాసీలకు దక్కడం లేదని, 97 శాతం రిజర్వేషన్ ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ, సమితి అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆది వాసీలు హక్కులు కోల్పోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సభ నిర్వహించినట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఎమ్మెల్యే సీతక్క సహా పలు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కదిలిన ఆదివాసీ దండు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీ దండు కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9న జరిగే ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పయనమైంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఆదివాసీలు శనివారం జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్ నుంచి రైలుమార్గం ద్వారా నాగ్పూర్కు తరలివెళ్లారు. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక వాహనాలు, రైళ్ల ద్వారా వెళ్లగా, మిగతా వారు శనివారం బయల్దేరారు. రెండు జిల్లాల నుంచి 3వేల మంది వరకు వెళ్లినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఈ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ సభ జరగనుంది. గత కొన్నిరోజుల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు సభకు భారీ సంఖ్యలో తరలించేందుకు సన్నద్ధం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ ధ్రువపత్రాలను అరికట్టాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సభ నిర్వహిస్తున్నారు. గుస్సాడీ వేషధారణలో ఢిల్లీకి పయనమవుతున్న యువకులు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టగా, దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టే సభ ద్వారా ఈ విషయం దేశమంతటా తెలిసేందుకు ఆస్కారం ఉంది. ఆదివాసీ అస్తిత్వ పోరాట సభకు ఆదివాసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. సభకు ఎంతమంది తరలివెళ్తున్నారనే విషయంపై ఇంటెలిజెన్స్, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో అక్కడ జరిగే సభ ఏర్పాట్లను, జిల్లా నుంచి వచ్చే ఆదివాసీల ఏర్పాట్లు, తదితరవి పరిశీలిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపుతున్నారు. రైలు మార్గం ద్వారా వెళ్లేవారికి మధ్యలో భోజనాలు, ఢిల్లీలో ప్రత్యేకంగా ఫంక్షన్హాల్లు ఏర్పాటుచేసినట్లు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. తుడుందెబ్బ జెండాలు తీసుకెళ్తున్న ఆదివాసీలు రైల్వేస్టేషన్లో సందడి.. ఢిల్లీలో జరిగే అస్తిత్వ పోరాట సభకు తరలివెళ్లేందుకు వచ్చిన ఆదివాసీలతో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ సందడిగా మారింది. వేలాది సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో రైల్వేస్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన జనంతో కిటకిటలాడింది. జై ఆదివాసీ.. జైజై ఆదివాసీ అనే నినాదాలతో రైల్వేస్టేషన్ మార్మోగింది. -
ఆదివాసీ.. హస్తినబాట
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి కదిలి వెళ్తున్నారు. మొదట రైళ్లు, విమానాల్లోనే వెళ్తున్నారనే ప్రచారం జరిగినా వాహనాల్లోనూ పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. జిల్లా నుంచి ముందుగా అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో సభలో పాల్గొననున్నారు. జిల్లా నుంచే సుమారు 3వేల మంది వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదివాసీ ఉద్యమంలో హస్తిన సభ మరో మైలురాయిగా నిలిచే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల నుంచి శుక్రవారం వందలాది వాహనాలు ఢిల్లీ బాట పట్టాయి. వాహనాల్లో వెళ్లేవారు శుక్ర, శనివారాల్లో ప్రయాణాన్ని ఎంచుకొని 9న ఢిల్లీలో ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని బయల్దేరుతున్నారు. కొంతమంది ఆదివాసీ నాయకులు శుక్రవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి తమ ఢిల్లీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆదివాసీల పోరాటానికి చిహ్నంగా నిలిచే ఈ స్తూపం నుంచే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. రైలు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో బోగీలను ముందస్తుగా బుక్ చేసుకొని సిద్ధంగా ఉన్న ఆదివాసీలు పెద్ద ఎత్తున శనివారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి బయల్దేరి వెళ్తున్నారు. ఇక హైదరాబాద్, నాగ్పూర్ నుంచి విమాన ప్రయాణానికి సంబంధించి ముందుగానే బుకింగ్ చేసుకున్న వందలాది మంది ఆదివాసీలు శనివారం రాత్రి బయల్దేరి వెళ్తున్నారు. డిసెంబర్ 9.. మళ్లీ ఈ తేదికి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017 ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను మించి దేశ రాజధాని ఢిల్లీలో సభ చేపట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఆదివాసీల గర్జన వినిపించేలా చేస్తున్నారు. ఈ సభలో దేశంలోని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమైన నాయకులు పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమురంభీం జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి కూడా పాల్గొననున్నారని ఆదివాసీలు చెబుతున్నారు. ఇక్కడి ఆదివాసీలు మాత్రం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఏజెన్సీలో నకిలీ ధ్రువపత్రాల జారీని నిలిపివేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలనే ప్రధాన డిమాండ్లతో తమ గళాన్ని ఈ సభ ద్వారా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ సభకు సంబంధించి ఆదివాసీలు గత కొద్ది నెలలుగా ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా కదులుతూ వస్తున్నారు. నవంబర్ 18న ఉట్నూర్లో నిర్వహించిన ర్యాలీ ఢిల్లీ సభకు ముందు బలప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో పోలీసులు నిరంతరం నిఘా సారించడంతో ఆదివాసీలు సభ విషయంలో నిర్ణయాలకు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారని కొంతమంది ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. వేర్వేరు చోట్ల సమావేశాలు నిర్వహిస్తే సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతో రాయిసెంటర్లలో సార్మేడిల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా వేలాది మందిని ఈ సమావేశాల ద్వారా ఢిల్లీ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. వందలాది వాహనాలు, రెండు రైళ్లలో వేలాది మంది బయల్దేరుతున్నారు. అలాగే వందలాది మంది విమాన ప్రయాణం ద్వారా ఢిల్లీ చేరుకోనున్నారు.పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఢిల్లీ వెళ్లిన ఎంపీ సోయం బాపురావు సభ జరిగే రాంలీలా మైదానాన్ని పరిశీలించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆదివాసీలు తరలిరానుండడంతో మైదానంలో స్థితిగతులను చూశారు. ఇలా అప్పటి నుంచే సభ విషయంలో సోయం బాపురావు ఏర్పాట్లను ముందుండి చేపట్టారు. ఆ తర్వాత జిల్లాకు తిరిగి వచ్చినా మళ్లీ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఇటు సమావేశాల్లో పాల్గొంటూనే మరోపక్క సభ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైలు మార్గం ద్వారా సభకు వెళ్తున్న వేలాది మందికి మధ్యలో రెండు చోట్ల భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలో రెండు ఫంక్షన్ హాళ్లలో ఇక్కడినుంచి వెళ్లేవారికి కోసం వసతి కల్పించారు. ఏదేమైనా 9న సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ⇒ ఇది ఆదివాసీ అస్తిత్వ కోసం జరుగుతున్న పోరాటం. మొదట 5వేల మందితో ఢిల్లీలో సభ నిర్వహించాలని అనుకున్నాం. కాని పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా ఆదివాసీలు తరలివస్తుండడంతో ఈ సంఖ్యను అంచనా వేయడం కష్టమే. 50వేలకుపైగా తరలివచ్చే అవకాశం ఉంది. 35 మంది ఆదివాసీ ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు ఫగల్సింగ్ కులస్తే, రేణుక సరోడే, అర్జున్ ముండేలను ఆహ్వానించాం. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు -
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి!
సాక్షి, ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీ మహిళా లోకం కదం తొక్కింది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐటీడీఏ ముట్టడి నిర్వహించారు. సూమారు ఐదు వేలకు పైగా ఆదివాసీలు అందోళనలో పాల్గొనడంతో ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు ఐటీడీఏలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఆదివాసీలు మండల కేంద్రంలోని వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏటీడీఏకు వేల సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఉట్నూర్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఐటీడీఏ ప్రధాన రహదారిపై ఆదివాసీలు బైటాయించి నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ అక్కడకు చేరుకుని వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. అయినా ఆందోళనను ఆదివాసీలు విరమించలేదు. ఐటీడీఏ కార్యలయం వద్ద పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం లోకి ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలువాలంటూ పెద్ద ఎత్తున మహిళలు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు గోడపై నుంచి దూకి లోనికి వెళ్లగా మహిళలు ఒక్కసారిగా మరో గేటు నుంచి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు. ఐటీడీఏ ప్రధాన ద్వారం వద్దకు బైటాయించి నిరసన తెలిపారు. అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్లు ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆదివాసీ మహిళ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువపత్రాలు ఇవ్వకూడదన్నారు. ఇచ్చిన తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన 25 మంది అభ్యర్థులపై చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుకబాయి, ఉపాధ్యక్షురాలు సోయం లలితబాయి, మహిళా నాయకులు మర్సకొల సరస్వతి, రంభబాయి, ఆత్రం సుగుణ, నాయకులు కనక వెంకటేశ్వర్లు, మర్సకొల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. కుమురం భీం విగ్రహానికి నివాళులు.. నార్నూర్: ఉట్నూర్లో నిర్వహించిన ఆదివాసీ మహిళల ఐక్యత ర్యాలీకి నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి మహిళలు భారీగా తరలివెళ్లారు. మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ వలస వచ్చిన లంబాడీలతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9న ఢిల్లీలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా నాయకులు అడ సీతాబాయి, ఆత్రం అనసూయ, కనక సరిత, మందాడి కౌసల్యబాయిలతో పాటు తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు తొడసం నాగోరావు, మేస్రం శేఖర్, మండలాధ్యక్ష, కార్యదర్శలు మానిక్రావు, ప్రభాకర్, నాయకులు మాన్కు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు
ఉట్నూర్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్తోపాటు తమ సమస్యలను ప్రభుత్వం వెంట నే పరిష్కరించాలంటూ ఆదివాసీ మహిళాలోకం కదంతొక్కింది. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐదువేలకు పైగా ఆదివాసీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉట్నూర్ ప్రధానవీధుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయడం.. గేటుకు తాళం వేయడం తో ఆదివాసీలు కోపోద్రిక్తులయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికా రి రావాల్సిందేనంటూ.. లోపలికి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. ఆదివాసీలు భారీ సంఖ్యలో ఉండటంతో చేతులెత్తేయాల్సి వచ్చింది. పలువురు ఆదివాసీలు గోడపై నుంచి దూకి కార్యాలయం లోపలికి వెళ్లారు. అదనపు ఎస్పీ రవికుమార్, డీఎస్పీ డేవిడ్ ఆదివాసీలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐటీడీఏ ఉన్నది ఆదివాసీల కోసమేనని, తమను ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. లంబాడీలకు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దంటూ నినదించారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలిచ్చిన తహసీల్లార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్టీలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన 25 మందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ నేతలపై పెట్టిన కేసుల ను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం నాయకులు గోడం రేణుకాబాయి, సోయం లలితాబాయి, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ ముట్టడికి యత్నం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు మళ్లీ పోరుబాట పట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరుతూ బుధవారం ఐటీడీఏ కార్యాలయ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలను పోలీసులు కట్టడి చేసే క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కుమురంభీం కాంప్లెక్స్లో బుధ వారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. లోపల సమావేశం జరుగుతుండగా.. వెలుపల ఆదివాసీలు నినాదాలతో హోరెత్తించారు. లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపించడంతో కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యలు బయటకు వచ్చి ఆదివాసీలను శాంతింపజేసేందుకు యత్నించారు. వారి ప్రధాన డిమాండ్పై సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినందున తీర్పు వచ్చేవరకూ ఆగాలన్నారు. ఏజెన్సీలో డీఎస్సీ నిర్వహిం చేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో తీర్మా నం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
ధూమ్..ధామ్ దండారి
సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్) : ఆదివాసీలు దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించే దండారి ఉత్సవాలు అతి పవిత్రంగా, ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఆదివారం మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మారుతిగూడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలకు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ దంపతులతో కలిసి కలెక్టర్ దివ్యదేవరాజన్ దంపతులు హాజరయ్యారు. మారుతిగూడ దండారి బృందం గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలికారు. అతిథులకు దండారి నిర్వాహకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో బట్టలు బహుకరించారు. గుస్సాడీలు, యువకులు, మహిళలు చేసిన సంప్రదాయ నృత్యాలను వారు తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆదివాసీలు దండారి ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసిందని, ఒక్కో దండారికి రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి ఆదివాసీలు కృషి చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ దండారి ఉత్సవాల్లో గుస్సాడీ, కోలాటం, మహిళల నృత్యాలను కుటుంబ సమేతంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో డాక్టర్ గోపి, ఎస్పీ బంధువులు ఫైలెట్ ఆనంద్ దంపతులు, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు, సలహాదారుడు సిడాం భీంరావ్, పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్ వెడ్మ బోజ్జు, డీడీ చందన, ఎంపీపీ పోటే శోభ, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్రావ్, సర్పంచ్ గోడం నాగోరావ్, ఆదివాసీ జిల్లా నాయకులు ఆర్క ఖమ్ము, కనక తుకారం, దండారి నిర్వహకులుదుర్వ జంగు, సిడాం శంకర్ ఉన్నారు. నార్నూర్లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న కలెక్టర్ గోండిభాషలో మాట్లాడుతూ.. నార్నూర్: సంధీర్కూన్ రాం రాం... సంధీర్ చకోట్ మంతీట్ అంటు గోండిభాషలో మాట్లాడుతూ కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఉమ్మడి మండలంలో పర్యటించి, గిరిజనులతో మమేకమయ్యారు. ఉమ్మడి మండలంలోని ఖైర్డట్వా, ఆర్జుని కొలాంగూడలో ఆమె భర్తతో కలిసి దండారి, గుస్సాడీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఏటీడీవో చంద్రమొహన్, ఎంపీపీ కనక మోతుబాయి, పెసా చట్టం జిల్లా కో ఆర్డినేటర్ వెడ్మా బోజ్జు ఎస్ఐ విజయ్కూమార్, సుబ్బారావు, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షలు ఉర్వేత రూప్దేవ్, తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మేస్రం శేఖర్, తొడసం నాగోరావు, గ్రామ పటేల్ మేస్రం రూప్దేవ్, నారంజీ పటేల్ తదితరులు ఉన్నారు. -
దండారి.. సందడి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల పెద్ద పండగ దండారి. గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే దండారి గుస్సాడి ఉత్సవాలు నేడు ప్రారంభంకానున్నాయి. విచిత్ర వేశాధారణతో అంతే అద్భుతమైన పద్ధతులతో వారు చేసే పూజలు, ఏర్పాట్లు వారి సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. దీపావళికి పక్షం రోజుల ముందు ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక దండారి మొదలవుతుంది. బలిదానంతో దండారి మొదలు.. ఆదివాసీలు గ్రామ కూడలిలో నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు, గుమేల, ఫరా లాంటి వాయిద్యాలతో పాటు గజ్జెలు, కోలాలు, మంత్రదండం లాంటి రోకలి తదితర సంప్రదాయ వస్తువులను గ్రామ పటేల్ ఇంటి ముందు ఉంచి వాటికి బలిదానం చేసి ప్రత్యేక పూజలతో బోగి పండగ చేసి ఉత్సవాలు ఆరంభిస్తారు. గిరిజన గోండు గూడాల్లో గ్రామ పటేల్ది ప్రత్యేకమైన స్థానం. ఆయన ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. గిరిజనులకు పటేల్ మాట వేదవాక్కు. అందుకే దండారి ఉత్సవాలు గ్రామ పటేల్ ఇంటి ముందే నిర్వహించడం ఆనవాయితీ. ప్రత్యేక వేషధారణలు.. దండారి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు గుస్సాడి వేషాధారణ వేసిన వారు దండారి ముగింపు వరకు స్నానం చేయరు. ఒంటికి బూడిద పూసుకొని దాన్నే స్నానంగా భావించడం వీరి ఆచారం. దీనితో పాటు ముఖానికి మసి, ఎడమ భుజంపై జింక తోలు, మెడలో రుద్రాక్షలు, కుడి చేతిలో మంత్రదండం(రోకలి), జంతువుల కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన టోపీలు, కాళ్లకు గజ్జలు, నడుముకు వారి వస్తువుల సంచితో, విచిత్ర వేశధారణతో సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తారు. ఇతర గ్రామాల గుస్సాడీలకు ఆథిత్యం.. గుస్సాడి వేశధారణ వేసినవారు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి గిరిజనుల ఆథిత్య విందులో పాల్గొని ఆటపాటలతో, నృత్యాలతో కనువిందు చేయడం ఆనవాయితీ. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లిన గుస్సాడీలకు ఘన స్వాగతం పలుకుతారు. మొదట అథిత్యం పుచ్చుకున్న వీరు తర్వాతి సంవత్సరం తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. ఇలా ఆ గ్రామాల మధ్య బంధుత్వం పెరుగుతుంది. గుస్సాడీ వేషాలు.. థింసా నృత్యాలు గిరిజనులు గుస్సాడీ వేషాన్ని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. గుస్సాడీ వేషాధారణ వేసిన వారికి వారి దేవతలు ఆవహిస్తారని చెబుతారు. అతని చేతికి ఉన్న మంత్రదండం శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని వారి నమ్మకం. డప్పులు, భాజాలతో చప్పుళ్లకు అనుగుణంగా గజ్జెల అడుగులతో లయబద్ధంగా నాట్యం చేస్తూ గుస్సాడీ నృత్యాలు ప్రదర్శిస్తారు. గోండు గిరిజన మహిళలు కూడా పురుషులతో సమానంగా థీంసా నృత్యాలు చేస్తారు. నువ్వుల నూనెతో పూజలు.. గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటిలో దీపావళి పండగ సందర్భంగా గిరిజన మహిళలు పవిత్రంగా ఉపావాస దీక్ష చేస్తూ నువ్వులను రోటిలో దంచి నూనెను తీస్తారు. ఆ నూనెతో దండారి ముగింపు వరకు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. నెమలి టోపీల తయారీకి కేరాఫ్ పాటగూడ.. నెమలి పింఛం టోపీల తయారీలో కెరమెరి మండలంలోని పాటగూడ గ్రామం ప్రసిద్ధి గాంచింది. గడిచిన పాతికేళ్ల నుంచి ఈ గ్రామస్తులు నెమలి టోపీలను తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి, తిర్యాణీ, వాంకిడి తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి పింఛం టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒక్క టోపీ ఖరీదు రూ. 10 వేలు పలుకుతున్నా.. వీరు కేవలం రూ. 3 వేలు కూలీ కింద తీసుకుంటున్నారు. కొలబోడితో దండారి ముగింపు.. దీపావళి పండగ మరుసటి రోజు కొలబోడి ఉత్సవాలను దండారి సంబరాలు ముగిస్తారు. దీపావళి అనంతరం గుస్సాడీలు చివరి రోజున ఆనందంగా నృత్యాలు చేస్తారు. అనంతరం గ్రామ పొలిమేరల్లో ఉన్న ఇప్ప చెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. అక్కడ కొలబోడి సందర్భంగా నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేశధారణ, అలంకారణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్లు, మేకలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్రమైన పండగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పండగా పవిత్రమైన పండగ. అత్యంత పవిత్రంగా గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాము. ఈ పండగకు బంధువుల ఇళ్లకు వెళ్తాం. గ్రామంలో ప్రతి రోజు రాత్రి గుస్సాడీలు థింసా నృత్యాలు, రేలారేరేలా ఆడపడుచుల నృత్యాలు ఆకట్టుకుంటాయి. –పర్చ సాయన్న, బజార్హత్నూర్ -
దత్తత గ్రామాన్ని పట్టించుకోని చంద్రబాబు
సాక్షి, అరకు: పెడలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అరకులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి దిశగా అడుగులు పడలేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవో-97ను రద్దు చేశారని చెప్పారు. ప్రతీ నియోజక వర్గానికి కోటి రూపాయలు మంజూరు చేసి సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారన్నారు. గిరిజన అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, కలెక్టర్ వినయ్ చంద్, జీసిసి ఎండీ బాబూరావు నాయుడు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే ఆదివాసీలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రూ. 300 కోట్ల విలువైన వరాలను ప్రభుత్వం ప్రకటించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో రూ. 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఇతర ఉపకరణాలను పంపిణీ చేయనుంది. సంపదను దోచుకునేందుకు చంద్రబాబు కుట్ర : జంగా గిరిజనుల్లో పేదరికాన్ని తోలగించి, వారిని ఉన్నత విద్యవంతులుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మట్లాడుతూ.. ఏపీ సహజ వనరులకు పుటినిల్లు అని.. ఆ సంపదను దోచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని విమర్శించారు. గిరిజనుల హక్కులు కాపాడటం కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదివి ఇచ్చి గౌరవించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పనులు, పదవుల్లో 50 శాతం కేటాయించారని గుర్తుచేశారు. -
చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం
స్వచ్ఛమైన సెలయేళ్లు.. దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారావాలు.. పచ్చని ప్రకృతి అందాలు... వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. సాక్షి, విజయనగరం: దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. ఇప్పుడు అదే మంత్రి చేతుల మీదుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో జరుపుకునే అవకాశాన్నిచ్చింది. జిల్లాలో గిరిజన ప్రాంత స్వరూపం ట్రైబుల్ సబ్ప్లాన్ మండలాలు (గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట) 8 మొత్తం గిరిజన జనాభా 5.20 లక్షలు పురుషులు 90,948 మహిళలు 96,881 గ్రామ పంచాయతీలు 77 గ్రామాలు 289 గిరిజన ఆవాసాలు 773 జియోగ్రాఫికల్ ఏరియా(జిల్లా విస్తీర్ణంలో 34.4 శాతం) 2383 చదరపు కిలోమీటర్లు గిరిజన తెగలు జటపూస్, కొండదొర, సవర, గదబ జాతులు..భాషలు జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలో ట్రైబల్ సబ్ప్లాన్ మండలాల్లో నివసించే వారి సంఖ్య 1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి, జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవర భాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలా ఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల బతుకులు ఎప్పుడో మారిపోయి ఉండేవి. సజీవ సంప్రదాయాలకు నిలయం గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్జుడు అనే వ్యక్తి పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వహిస్తుంటే వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం. కనీస సౌకర్యాలు కరువు నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ, డోలీ సాయంతో మైదాన ప్రాంతా లకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఉండటానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. బాక్సైట్, గ్రానైట్ దోచుకుంటున్నారు. కొండలు పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. జగనన్నతోనే మార్పు మొదలు గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కురుపాం, సాలూరు గిరిజన రిజరŠడ్వ్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ప్యానెల్ స్వీకర్ పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్ ప్లాన్ నిధులు ఖర్చుచేశారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి స్థానిక అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండేవారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశంతో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో, గిరిజన ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నాళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు. 200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగాన్ని ఉచితం చేశారు. దీనివల్ల జిల్లాలో 70వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకునే 1415 మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గత ప్రభుత్వ హయాంలో నెలకు కేవలం రూ.400 మాత్రమే భృతి ఇచ్చేవారు. కానీ గిరిజనుల ఆరోగ్యం దృష్ట్యా సీఎం జగన్మోహన్రెడ్డి ఆ వేతనాన్ని పదిరెట్లు పెంచి నెలకు రూ.4వేలు చేశారు. అందుకే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని తొలిసారిగా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్నారు. -
మైనింగ్ కోసం దేవుళ్లు కూడా మాయం!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఉండేవారంతా ఆదివాసులే. వారు అక్కడి పర్వత శ్రేణిని నందరాజ్ కొండలు అని పిలుచుకుంటారు. నందరాజ్, ఆయన భార్య పితోర్మేట ఆదివాసీల దేవుళ్లు. అక్కడి 84 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు పితోర్మేటను ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఆమె పేరిట పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. గోంచా, హరియేలి, కోరా, నవఖని, చెర్తా ప్రధానంగా అక్కడి ఆదివాసీలు నిర్వహించే ఉత్సవాలు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం అక్కడి ఆదివాసీలకు ఎలాంటి ఉత్సవాలు లేవు. వారికంటూ ఓ ప్రత్యేక సంస్కతి కూడా లేదు. డాక్యుమెంట్ల ప్రకారం పితోర్మేట కొండల్లో 13 ఖనిజ నిక్షేపాలు, వాటిల్లో 32.60 కోట్ల టన్నుల ప్రథమ శ్రేణి ఇనప ఖనిజాలు ఉన్నాయి. వాటిల్లో నుంచి కోటి టన్నుల ఇనప ఖనిజాలను వెలికి తీసే హక్కులను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ హయాంలోని జాతీయ ఖనిత అభివద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కి అప్పగించింది. కాని పనులేమి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోని చత్తీస్గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీకి 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మైనింగ్ హక్కులను కేటాయించింది. ఆ జాయింట్ వెంచర్ సంస్థ ఆ హక్కులను తీసుకెళ్లి ‘అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’కు 2018, సెప్టెంబర్లో కేటాయించింది. ఆ తర్వాత రెండు నెలలోపే అంటే, 2018, డిసెంబర్ నెలలో క్షేత్రస్థాయి పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ఎందుకు ఆగిపోయాయి ? అప్పటి నుంచి చకా చకా మైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. లక్షలాది చెట్లను కొట్టివేశారు. మట్టి రోడ్లు వేసి చదును చేశారు. ఖనిజాలను తరలించేందుకు కన్వేయర్ బెల్ట్ పనులు కూడా చేపట్టారు. అప్పటికి ఐక్యమైన ఆదివాసీలు మైనింగ్ పనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ‘మా భూములపై మీకు హక్కు ఎవరిచ్చారు ?’ అంటూ నిలదీశారు. రాస్తో, రోకోలు, ధర్నాలు చేశారు. ఫలితంగా చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ జూలై ఆరవ తేదీన మైనింగ్ పనులను నిలిపివేశారు. ఆదివాసీల గ్రామ సభ ప్రాజెక్ట్కు అనుమతిస్తూ తీర్మానం చేసినట్లు హిరోలి గ్రామ సర్పంచ్, 106 మంది గ్రామస్థులు సంతకాలు చేసి వేలి ముద్రలు వేశారంటూ అధికారులు చూపిస్తున్న డాక్యుమెంట్ నకిలీదని, అలాంటి గ్రామ సభనే తాము నిర్వహించలేదని, తాము ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, అలాంటి తీర్మానం చేయమని సర్పంచ్తో సహ హిరోలి గ్రామస్థులంతా స్పష్టం చేయడంతో ఆ డాక్యుమెంట్పై చత్తీస్గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దంతేవాడ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించారు. 2014, జూలై 4వ తేదీతో డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలో చేపట్టే మైనింగ్ ప్రాజెక్ట్కు అనుమతిస్తూ హిరోలి గ్రామం జూలై 4, 2014న గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానించినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పారిశ్రామిక, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ‘పంచాయత్స్ (ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) యాక్ట్’ కింద గ్రామ సభ అనుమతి తప్పనిసరి. తాము సంతకాలు చేసినట్లు అధికారులు చూపిన కాగితంపై ఉన్నవి తమ సంతకాలు, వేలి ముద్రలు కావని హిరోలి సర్పంచ్, బుధ్రి, ఆమె భర్త భీమారామ్ కుంజం, మాజీ సర్పంచ్ జోగా కుంజం, గ్రామస్థులు మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తాము జనవరి 9వ తేదీనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. అదంతా దంతెవాడ జిల్లా కలెక్టర్ పని గ్రామ సభ అనుమతి ఉన్నట్లు అప్పుడు సంతకాలు, వేలి ముద్రల డాక్యుమెంట్ రూపొంచినప్పుడు దంతెవాడ జిల్లా కలెక్టర్గా కేసీ దేవ్సేనాపతి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జియాలోజి అండ్ మైనింగ్’తోపాటు ‘మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చత్తీస్గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. డాక్యుమెంట్ వివాదం గురించి మీడియా ఆయన వివరణ కోరగా, విషయం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని చెప్పారు. రాజ్యాంగంలోని 244 అధికరణ ఉల్లంఘన ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 244వ అధికరణను అధికారులు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది. ఆదివాసీల స్థలాలను ఇతరులకు అమ్మరాదు, కొనరాదు. ప్రభుత్వ పథకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. గ్రామ సభల అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు చేపట్టే భూములకు సామాజిక, సాంస్కతిక, మతపరమైన ప్రాముఖ్యతలు ఉండరాదు. ఇవేమీ లేవంటూ చత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవుల శాఖ ప్రాంతీయ కార్యాలయం ‘ఫారెస్ట్ అడ్వజరీ కమిటీ’కి 2016, జూలై 8న సమర్పించిన ‘సైట్ ఇన్స్పెక్షన్’ నివేదికలో పేర్కొంది. కానీ ఆదివాసీలు పంట కోతకు వచ్చినప్పుడే కాకుండా దేవుళ్ల పేరిట పలు వేడుకలు స్థానికంగా నిర్వహిస్తుంటారు. -
ఇంత దారుణమా!
ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీం ఎనిమిది దశాబ్దాల క్రితం ‘జంగల్, జల్, జమీన్ హమారా’ నినాదాలే ఇరుసుగా పోరాడారు. ఆ పోరాటక్రమంలో అమరుడయ్యారు. ఇన్నేళ్లు గడిచాక కూడా తమ జీవిక కోసం, నిలువనీడ కోసం ఆదివాసీలు ఉద్యమించక తప్పడం లేదు. కన్నెర్రజేస్తున్న అధికార యంత్రాంగం ధాటికి కష్టాలుపడక తప్పడంలేదు. ఈ దుస్థితిలో తెలంగాణ హైకోర్టు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మానవతావాదులందరికీ ఊరటనిస్తాయి. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్ డిపోలో నిర్బంధించారని పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్లతో కూడిన ధర్మాసనం ఆదివారమైనా అత్యవసర అంశంగా భావించి విచారణ జరిపి వారందరికీ ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశిం చింది. అంతవరకూ వారి బాగోగులకు ప్రభుత్వమే పూచీ పడాలని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలు యదార్థమే అయి ఉండొచ్చు. పులుల సంరక్షణ కేంద్రంగా ఉంటున్న ఆ ప్రాంతానికి ఆదివాసీలు అయిదారేళ్లక్రితం వచ్చి ఉండొచ్చు. ఆయనన్నట్టు ప్రభుత్వం దృష్టిలో అది ఆక్రమణే కావొచ్చు. ఇవన్నీ నిజమే అనుకున్నా జిల్లా అధికార యంత్రాంగం వారిపట్ల వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమైనది. క్షమార్హం కానిది. ఈ నెల 12న పూజ కోసం అందరూ బయటికెళ్లిన సమయంలో అధికారులు మందీమార్బలంతో వచ్చి బుల్డోజర్లతో తమ ఇళ్లు, పశువుల పాకల్ని కూల్చేశారని... అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని పోలీసులు, అటవీ సిబ్బంది కొట్టారని ఆదివాసీలు ధర్మాసనానికి చెప్పడాన్ని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న సంశయం కలుగుతుంది. కొమరం భీం జిల్లాకు కలెక్టర్ ఉన్నారు. ఆదివాసీల సంక్షే మాన్ని కాంక్షించి పనిచేసే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉంది. గిరిజనుల అభ్యున్నతి కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం కోసం ప్రజా ప్రతినిధులు న్నారు. ఇంతమంది ఉన్నా, ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నా చివరకు ఆదివాసీలను అక్కడినుంచి పంప డానికి పోలీసులు, అటవీ సిబ్బంది, బుల్డోజర్లు తప్ప మరో మార్గం లేదనుకోవడం అధికారుల తీరును పట్టిచూపుతుంది. తాము అనుకుంటున్నవిధంగా ఆదివాసీలకు నచ్చజెప్పి ఒప్పించడానికి వారు ప్రయత్నించి ఉంటే, అందుకు సమయం పట్టినా ఓపిగ్గా వేచి ఉంటే బాగుండేది. పర్యావరణ సమతూకం సాధనకు, ఆ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అత్యవసరమని, పట్టణీకరణ నానాటికీ విస్తరిస్తున్న వేళ వన్యప్రాణులను సంరక్షించడానికి వాటికోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పర్చడమే మార్గమని వన్యప్రాణి సంరక్షణ కోసం పాటుబడేవారు చెబుతారు. అమెరికా, యూరప్లలో ఉండే ఈ భావన 70వ దశకంలో మన దేశానికి కూడా చేరింది. 1973లో ఇప్పటి జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో తొలిసారి పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటయింది. మొదట్లో 9గా ఉన్న ఈ కేంద్రాలు ఇప్పుడు 50 అయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సంరక్షణ కేంద్రాల్లో పులుల సంఖ్య 2,226కు చేరుకుందని 2014నాటి గణన చెబు తోంది. తాజాగా నిరుడు పులుల గణన ప్రారంభమైంది. ఈ కేంద్రాల నిర్వహణకు దేశంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) పనిచేస్తోంది. వన్యప్రాణులను కాపాడి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం సదాశయమే. అవసరమైనదే. కానీ ఆ క్రమంలో సహజంగానే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తమకు వన్యమృగాలు, వాటికి తాము కొత్త కాదని, తరతరాలుగా వాటితో సహజీవనం చేస్తున్నామని ఆదివాసులు చెబుతున్నారు. వాటిని సంరక్షించే పేరిట అడవి నుంచి వెళ్లగొడితే తమ జీవనం ప్రమాదంలో పడుతుందని వాపోతున్నారు. 2011నాటి జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీల జనాభా దాదాపు 11 కోట్లు. ఇది దేశ జనాభాలో 8.6 శాతం. 461 తెగలుగా ఉన్న ఈ ఆదివాసీల్లో దాదాపు 95 శాతంమంది అటవీ ప్రాంతాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. సరిగ్గా ఈ కారణం వల్లనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుండే ప్రాంతాల్లో తరచు సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివాసీల మంచికోసమే వారిని తరలిస్తున్నామని, ఇది ప్రగతిశీలమైన చర్య అని, దీనివల్ల వారు ‘ఆధునికం’ కావడానికి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా తరలించే సందర్భాల్లో ఆదివాసీ కుటుంబాలకు కలిగే నష్టాన్ని బట్టి రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకూ పరిహారం చెల్లించాలని నిరుడు నవంబర్లో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సిఫార్సు చేసింది. కుటుంబానికి ఇంటి స్థలం, రెండున్నర ఎకరాల వ్యవ సాయ భూమి, కుటుంబంలో కనీసం ఒకరికి తగిన శిక్షణనిచ్చి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడి పులుల సంరక్షణ కేంద్రంతో ముడిపడి ఉండే ఉద్యోగాన్ని చూపాలని కూడా సూచించింది. ఆదివాసీలకు పునరావాసం ఏర్పరిచేచోట రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది. ఈ సిఫార్సులన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తే ఆదివాసీలకు మేలు కలుగుతుందా లేదా అన్న సంగతలా ఉంచి కనీసం వాటినైనా కొలాంగోంది గ్రామంలో అమలు చేద్దామని అధికార యంత్రాంగం చూడలేదు. పైగా ఆదివాసీలతో ఎంతో మొరటుగా ప్రవర్తించింది. ట్రాక్టర్లలో తీసుకెళ్లి కనీస సదుపాయాలు లేని టింబర్ డిపోలో అక్రమంగా నిర్బంధించింది. వన్యప్రాణులపట్ల దయ కలిగి ఉండటం, వాటి క్షేమం కోసం ఆత్రుతపడటం మంచిదే. కానీ తోటి మనుషుల పట్ల తమ ప్రవ ర్తన ఎలా ఉందో, ఎలా ఉండాలో... ఇలాంటి విపరీత పోకడ ఈ వ్యవస్థపై ఆదివాసీల్లో ఎలాంటి అభిప్రాయం కలగజేస్తుందో ఆ అధికారులు కాస్తయినా ఆలోచించారా? హైకోర్టు ధర్మాసనం జోక్యంతో ఆదివాసీలకు ఇప్పటికైతే ఉపశమనం దొరికింది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించి నిర్దిష్ట వ్యవధిలో వారికి పూర్తి న్యాయం చేకూర్చడానికి అధికారులు కృషి చేస్తారని ఆశిద్దాం. -
ఆదివాసీలకు అండగా హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కొమురం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలం కొలంగొండి గ్రామానికి చెందిన 67 మంది ఆదివాసీలను పునరావాస చర్యలు తీసుకోకుండానే అటవీ ప్రాంతం నుంచి బలవంతంగా తరలించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మందికి చెందిన 16 కుటుంబాల పెద్దలను అటవీ అధికారులు ధర్మాసనం ఎదుట ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామన్న హామీల్ని నమోదు చేసిన ధర్మాసనం వాటి అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. వాకెండిలోని ప్రభుత్వ వసతి గృహంలో 67 మంది ఆదివాసీలకు వసతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేయాలి. ఏడాదిలోగా వారందరికీ శాశ్వత వసతి గృహాల్ని నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వం గుర్తించిన 91 ఎకరాల్ని ఆరు నెలల్లోగా బాధితులు 67 మందికి కేటాయించాలి. భూములు సాగు చేసుకునేందుకు వీలుగా ఇరిగేషన్ శాఖ బోర్లు ఇతర వసతులు కల్పించాలి. బాధితుల పశువుల్ని తిరిగి ఇచ్చేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ అమలుచేసే వరకూ బాధితులకు ఆహారం, తాగునీరు, విద్య, వైద్యం, గర్భిణీలకు ప్రత్యేక వసతులు కల్పించాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గోడువెళ్లబోసుకున్న ఆదివాసీలు ఆదివాసీలను అక్రమంగా నిర్బంధించారంటూ తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం విదితమే. హైకోర్టు ఆదేశాల మేరకు 16 మంది కుటుంబ పెద్దలను ఆదివారం సాయంత్రం 5 గంటలకు పర్యాటక శాఖ బస్సుల్లో తీసుకువచ్చి న్యాయమూర్తుల ఎదుట హాజరుపర్చారు. ఆదివాసీయులు చెప్పే సాక్ష్యాలను అనువాదం చేసేందుకు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రొఫెసర్ జి.మనోజ కూడా విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వి.రఘునాథ్ వాదించారు. ధర్మాసనం ఎదుట.. ఆదివాసీ పెద్దల్లోని ఆత్రం భీము, సిడెం పువా అనే ఇద్దరు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ‘ఈనెల 12న తాము పూజ చేసేందుకు వెళ్లినప్పుడు అటవీ అధికారులు వచ్చి గూడెంలోని మా గుడిసెల్ని కూల్చేశారు. పశువుల పాకల్ని కూడా పీకేశారు. మమ్మల్లి వేంపల్లి ఫారెస్ట్ డిపోలో పెట్టారు. అక్కడేమీ వసతులు లేవు. తాగేందుకు నీరు, తిండికి కూడా ఇబ్బంది పడ్డాం’అని చెప్పారు. జస్టిస్ షమీమ్ అక్తర్ వాటిని ఇంగ్లిష్లోకి అనువదించి ఏసీజేకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. వారిని మనుషులనుకుంటున్నారా.. పశువుల్ని చూసినట్టు చూస్తారా.. అని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు శ్రీకాంత్, మనోజŒ మాట్లాడుతూ, వారు మహారాష్ట్ర నుంచి వచ్చి రిజర్వుడ్ ఫారెస్ట్ను ఆక్రమించుకున్నారని, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతం నుంచి అందరినీ ఖాళీ చేయించామని చెప్పారు. పునరావాస చర్యలు ప్రారంభించామని, హైకోర్టు ఆదేశాల మేరకు పునరావాసం కల్పించే వరకూ వారందరికీ వసతి, ఇతర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆక్రమణదారులను తొలగించాలన్నా చట్ట ప్రకారం చేయాలని, పునరావాసం కల్పించకుండానే వారందరినీ అక్కడి నుంచి తరలించడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫారెస్ట్ డిపోలో వారిని పెడితే ఎలాగని, మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని, బాధితులకు అన్ని పునరావాస చర్యలు తీసుకునే వరకూ ప్రభుత్వం వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోతే బాధితులు 67 మందిలో ఎవరైనాగానీ లేదా పిటిషనర్లుగానీ, వారి న్యాయవాదిగానీ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేసుకోవచ్చుననే వెసులుబాటు కల్పిస్తున్నామని ప్రకటించిన ధర్మాసనం, వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లు తెలిపింది. -
నాగరిక చట్టం అడవికి వర్తించదా?
ఆదివాసులు, మరికొన్ని సంప్రదాయ జాతులు అడవుల్లో తరతరాల నుంచి ఉంటున్నారు. అభివృద్ధి పేరుతో, వారిని ‘అభివృద్ధి చేస్తా’మనే సాకుతో, మనం అభివృద్ధి కావడానికి వారిని వెనుకకు, ఇంకాఇంకా వెనుకకు తోసేస్తున్నాం. తరతరాలుగా అక్కడే ఉండి బతుకుతున్నవారిని నోటీసు లేకుండా తొలగించడం న్యాయమా? ‘మీరు ఇక్కడి నించి వెళ్లిపొండి’ అని వారిని గద్దిస్తే రెండు ప్రశ్నలు వేస్తారు. ‘ఈ నేల ఎందుకు వదలాలి? ఎక్కడికి వెళ్లాలి?’ ఈ ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు? 1927లో బ్రిటిష్ పాలకులు అడవులను రక్షిం చడానికేనని అంటూ, అడవి చట్టం తెచ్చారు. అటవీ అధికారులు, గార్డులు, జవాన్లు తదితర ఉద్యోగులతో ఒక పెద్ద క్యాడర్ తయారైంది. ప్రభుత్వం ఫలానా హద్దుల్లోని ప్రాంతం అడవి అని ప్రకటిస్తే చాలు, అటవీ అధికారులు అక్కడ రాజ్యం ఏలడం మొదలుపెడతారు. మన హక్కులను అమలుచేసుకోవడానికి కాల పరిమితులచట్టం పరిమితులు నిర్దేశించింది. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులను ఎవరైనా కబ్జా చేస్తే ఆ కబ్జా చేసినవారిని ఖాళీ చేయించడానికి ఈ చట్టం 12 సంవత్సరాల కాలపరిమితి విధించింది. ఈలోగా రాకపోతే కబ్జాదారుడే ఆ కబ్జాలో దర్జాగా కొనసాగే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాల పాటు ఆక్రమణల్లో ఉంటే ప్రభుత్వం అది నా భూమి అని క్లెయిమ్ చేయకపోతే ఆ తరువాత అవకాశం లేకుండా పోతుంది. ఆదివాసులు, తదితరులు తరతరాలనుంచి కొంత అడవి భూమిని తమ అధీనంలో ఉంచుకుంటే, ప్రభుత్వం ఆ భూమి తనదే అని ఏ విధంగా క్లెయిమ్ చేయగలుగుతుంది? నాగరికుల చట్టం అడవిలో వారికి వర్తించదా? 1927నుంచి అడవి చట్టం కింద అటవీ అధికారులకు తీవ్రమైన అధికారాలు ఇవ్వడం వల్ల తగా దాలు మొదలైనాయి. ఫారెస్ట్ గార్డ్ ఈ అటవీవాసు లకు గాడ్ కన్నా భయంకరుడు. ఈ గార్డ్ చెప్పుచేతల్లో అడవి మనుషుల హక్కులు ఉంటాయి. ఈ నిరంకుశ అటవీ పాలనలో జనం పడ్డబాధల పునాదుల మీద తీవ్రవాదం, నక్సలిజం పుట్టి పెరిగాయి. విభజనవాదం, వేర్పాటువాదం కూడా వచ్చింది. అడవిపైన ఆదివాసులకు యాజమాన్యపు హక్కు ఇవ్వకపోయినా, కనీసం అడవిలో ఉండే హక్కు వారికి ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, ఉద్యమాలు సాగుతున్నాయి. చివరకు ప్రభుత్వం ఈ ప్రజాందోళనలకు తలొగ్గి 2006లో అడవి హక్కుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆదివాసులు 2005 డిసెంబర్ 13 నాటికి తాము అడవిలో ఫలానా హద్దుల మధ్య ఉంటున్నట్టు రుజువుచేస్తే ఆ హద్దుల మధ్య నివసించే హక్కు ఉందని పత్రం ఇస్తారు. ఈ చట్టంద్వారా కొత్త హక్కులు ఇవ్వడం లేదు, ఇదివరకు నుంచి వారి హక్కులను గుర్తించి, రక్షించి, పరిధులను నిర్ణయించడం ఈ చట్టం ఉద్దేశం. ఈ హక్కులను గుర్తించడానికి ఒక ప్రక్రియను నిర్దేశించారు. గ్రామసభకు ఆదివాసులు తమ క్లెయి మ్లను సమర్పించాలి. ఆ హక్కు అభ్యర్థన పత్రాలను, రుజువులను సబ్ డివిజినల్ స్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి ఒక అధికారి అధ్యక్షుడు. వీరి నిర్ణయాన్ని సమీక్షించడానికి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. క్లెయిమ్లను పరిశీలించి న్యాయంగా నిర్లక్ష్యం లేకుండా వ్యవ హరిస్తే అటవీ నివాసులకు హక్కులు లభిస్తాయి. నిర్లక్ష్యంగా ఆ క్లెయిమ్లు తిరస్కరిస్తే అప్పీలులో కూడా న్యాయం జరగకపోతే వారేమవుతారు? అనేక రాష్ట్రాలలో నవంబర్ 2018 నాటికి 42 లక్షల 24 వేల క్లెయిమ్లు వచ్చాయని, అందులో 18 లక్షల 94 వేల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, 19 లక్షల 39 వేల క్లెయిమ్లు తిరస్కరించారని కేంద్ర అటవీ శాఖ లెక్కలు వివరిస్తున్నాయి. దాదాపు 44.8 శాతం మంది క్లెయిమ్దారులకు హక్కు పత్రాలు ఇచ్చారు. కానీ మిగిలిన 55 శాతం మంది గతేమిటి? వారిని ఆక్రమణదారులంటారా? అక్కడ నివసిస్తున్నామనడానికి రుజువులు చూపలేకపోతేనో, చూపిన రుజువులు నమ్మకపోతేనో, అవి చెల్లవంటే వారి క్లెయిమ్ ఒప్పుకోరు. అందువల్ల ఆక్రమణదారుడని నిందించి అడవి వదిలి వెళ్లిపోవాలంటారా? అది న్యాయమా? అనేది ధర్మాసనం ముందున్న ప్రశ్న. అర్హులందరికీ పట్టాలిచ్చారా? ఇవ్వని వారంతా అనర్హులైన ఆక్రమణదారులా అని సుప్రీంకోర్టు అడిగింది. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రమాణ పత్రాల ఆధారంగా 16 రాష్ట్రాలలో ఉన్న 11 లక్షల మంది గిరిజనులు, ఇతర సంప్రదాయ నివాసులను తొలగించాలని సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ 11 లక్షలమందిని అడవుల నుంచి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? సమస్య చాలా తీవ్రమైందని గుర్తించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13 తీర్పుపైన తానే ఫిబ్రవరి 28న స్టే ఇచ్చింది. అటవీ వాసుల సమస్య అంతటితో తీరుతుందా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
తన ఆదేశాలపైనే స్టే ఇచ్చుకున్న ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్ఆర్ఏ)–2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది. అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75 ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగకపోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదా అనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్ అయిన వైల్డ్ లైఫ్ ఫస్ట్ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వ తేదీకి వాయిదావేసింది. -
అడవి బిడ్డలను పొమ్మంటున్నారు
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశంలోని 16 రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులు, అడవిపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది తక్షణమే అడవి వదలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు ఆదివాసీల అటవీ హక్కుల చట్టానికి భిన్నమైన తీర్పు రావడం బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రాధాన్యాన్ని కోర్టులో సరిగ్గా వివరించని కారణంగానే ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుందని అపవాదును ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటవీ హక్కుల చట్టం–2006 చెల్లుబాటుకు సంబంధించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్పై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పిటిషన్ దారుల్లో ఒకరైన నేచర్ కన్జర్వేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ 2006 అటవీ హక్కుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అడవి విధ్వంసానికి, వన్యప్రాణులకు నష్టం చేస్తుందని పేర్కొంది. అటవీ హక్కుల చట్టంలో వాడిన అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్యుయెల్లర్స్ అనే కోవలోనికి ఎవరొస్తారన్న విషయంలో రాజ్యాంగంలోనే అస్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఆధారంగా ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ హక్కుల చట్టం పరిధిలో భూ యాజ మాన్య హక్కు దరఖాస్తుల తిరస్కరణకు గురైన దాదాపు 11 లక్షల మంది ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి జూలై 27లోగా ఖాళీ చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. నిర్దాక్షిణ్యంగా తరిమికొడతారా? ఆదివాసీలపై అటవీశాఖ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసీల హక్కులు హరణకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఆ శాఖ ఎదుర్కొంటోంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూయాజమాన్య హక్కుల దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను అడవి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నం జరుగుతోంది. అటవీ ఉత్పత్తుల ద్వారా అటవీ శాఖకు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఆదివాసీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆదివాసీల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2శాతం మందికే అనుమతి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ గణాంకాల ప్రకారం దేశం మొత్తం 42.19 లక్షల మంది భూ యాజమాన్య హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందినే అనుమతించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారిని కూడా కలుపుకుంటే అడవి నుంచి నిర్వాసితులు కానున్న ఆదివాసీల సంఖ్య 23 లక్షలకు పైగానే ఉంటుంది. గోండూ, ముండా, డోంగ్రి యా తదితర ఆదివాసీలు తమ అటవీ భూములను బాగు చేసుకొని అందులో పండించుకునే అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి బతుకుతారు. ఇందులో 2 శాతం మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన వారంతా అక్రమంగా అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న వారేనని అటవీ హక్కుల చట్టాన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే కోర్టులో కేంద్రం ఆదివాసీల రక్షణ చట్టాన్ని సమర్థించుకోలేకపోయిందన్న విమర్శలొస్తున్నాయి. -
‘గణతంత్రం’లో ఆదివాసీ స్ఫూర్తి
మౌలిక ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థ సంప్రదాయానికి అలవాటుపడిన మన ఆదివాసీ గిరిజనులు తమ ఓటింగ్ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి.. ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ప్రాంతంలోనే 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నూటికి 94 మందికి పైగా ఆదివాసీలు తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! ఆధునికులమనుకునే మనందరికీ ఆ గిరిజనుల చైతన్యం ఒక చెంపపెట్టు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల గణతంత్ర గిరిజన సంస్కృతి మిణుకు మిణుకుమంటూ సుదూరంగా కొండకోనల్లో మనగలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా? ‘‘ఓటర్ల జాబితా నుంచి వేలాదిమంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇలా ఓటర్ల పేర్లను గల్లంతు చేసినందున నిజాయితీగా ఎన్నికలు జరపడానికి రాష్ట్రం (తెలంగాణ) స్థిరంగా లేని సమయంలో ఎన్నికలొ చ్చాయి. ఈ పరిణామానికి ప్రధాన ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పు కోవాలి’’ – ఇందుకు కారకులైన రాజకీయ శక్తుల్ని పేర్కొనకుండా కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన ప్రకటన (08–12–2018) ‘నేను ఓటేయకపోతే నేను చచ్చిపోయినట్లుగా భావిస్తారు. అందుకే గత నలభై ఏళ్లుగా వోటు వేస్తున్నాను’ అని అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, ఆదివాసీయేతర గిరిజన మండలాలకు చెందిన ఆదివాసీ రాజగోండ్ ఓటరు కుడిమేత భీంబాయి చెప్పింది– కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల ఉన్న మేటి గూడ గ్రామవాసి. అలాగే ఇదే జిల్లాకు చెందిన గడిగూడ నార్నూర్ మండలాల్లో మొత్తం 31,317 మంది ఓటర్లలో 29,317 మంది (రాష్ట్రం లోనే 94.27 శాతంమంది) వోట్లు వేశారు. కాగా ఖనామార్, ఇంద్రవెల్లి గిరిజన ప్రాంతాల్లో 71.41 శాతం మంది వోటింగ్లో పాల్గొన్నారు. పోల్ అయిన ఓట్ల శాతం పెరగడానికి గిరిజన ఆదివాసీల ప్రజాస్వామ్య భావన కారణమైంది‘ ‘‘ది హిందు’’ ; 9–12–18 తెలంగాణ అసెంబ్లీకి అర్ధంతరంగా 9 మాసాలు ముందే జరిగిన ఎన్ని కల్లో ఫలితాలు ప్రకటించకముందు పోటీలో ఉన్న నాలుగు ప్రధాన రాజ కీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో 181 మంది నేరస్థులుగా ఆరో పణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు వీరిపైన అయిదేళ్లకు పైగా నాను తూనే ఉన్నాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ క్రిమినల్ కేసుల గురించి పదేపదే హెచ్చరిస్తూ ఉండే కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు గానీ ఏళ్లో పూళ్లోగా స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. పైగా కొన్ని అసెంబ్లీల (ఆంధ్ర–తెలంగాణ శాసనసభల) స్పీకర్లు సైతం అధికార, ప్రతిపక్షాల మధ్య స్వేచ్ఛగా జరుగుతూండే ఫిరాయింపుదార్లపైనగానీ ఉన్న చట్టాలను గౌరవించి చర్యలు తీసుకోవడం లేదు! ఓటు విలువకు పట్టం కట్టిన సంస్కృతి ఈ దారుణ పరిస్థితుల్లో 70 ఏళ్లకు పైగా కొట్టుమిట్టాడుతున్న ధనిక (పెట్టుబడిదారీ) వ్యవస్థలో సైతం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రక్షించగల మూలవాసులైన గణతంత్ర ఆదివాసీ గిరిజన సంస్కృతి మిణుకుమిణుకుమంటూ రాష్ట్రంలో సుదూరంగా కొండకోనల్లో మన గలుగుతూండటం ఒక మరవరాని ఆనవాలు కాదా? అది ప్రాచీన గణతంత్ర వ్యవస్థ కాబట్టే ఇంకా మన మైదానప్రాంతాల దోపిడీ వ్యవస్థా సంస్కృతికి భిన్నంగా–ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతీకగా ఆదివాసీ గిరిజన జనాభాలో నూటికి 94 మందికి పైగా తమ ఓటు విలువను కాపాడుకోగలిగారు! కటిక దారిద్య్రంలో కాలం గడుపుతున్నప్పటికీ ప్రయివేట్ ఆస్తులకు కోటికి పడగలెత్తని వారిని గురించి దక్షిణాఫ్రికా గాంధీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా విమోచన ప్రదాత నెల్సన్ మండేలా అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. ‘‘బానిస త్వంలా, జాతి వివక్షలాగా దారిద్య్రం అనేది ఆకస్మికంగా రుద్దబడే ఘటన కాదు – దారిద్య్రాన్ని సృష్టించేది మానవుడే. దాన్ని నిర్మూలిం చడం అనేది మానవమాత్రుల నిశ్చయాత్మకమూ, నిర్మాణా త్మకమైన చర్యల ద్వారానే సాధ్యం, సుసాధ్యం’’ అన్నాడు. కనుకనే ఈ రాష్ట్ర లేదా దేశవ్యాపిత ఎన్నికలనే కాదు, ధనికవర్గ వ్యవస్థ జనాభాలోని కొద్దిమంది లేదా కొన్ని సంపన్నవర్గాల ప్రత్యేక ప్రయోజనాలకు ఎప్పుడు రక్షణ కవచంగా నిలబడుతుందో, అప్పుడు బీఆర్ అంబేడ్కర్ లాంటి రాజ్యాంగ నిర్ణేతలు రూపొందించిన సెక్యులర్ రాజ్యాంగమూ, దాని విలువలూ ఆచరణలో ప్రజా బాహుళ్యానికి దూర మైపోతూ ఉంటాయి. మన దేశంలో కాంగ్రెస్–బీజేపీ పాలకవర్గాల మూలంగా రాజ్యాంగ విలువలు దఫదఫాలుగా పతనమవుతూ, వీలును బట్టి ఆ పరిమిత లౌకిక రాజ్యాంగ స్వచ్ఛత కూడా రానురాను మసక బారిపోయి, ప్రజా ప్రయోజనాలకు హానికరంగా మారుతోంది. ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేసి ఏనాడూ ‘హిందూ రాజ్య’ భావనను ప్రతిపాదిం చని వైదిక నీతిని వదిలేసి, ‘హిందు’ పదమే ‘సింధు’ పదానికి అపభ్రం శమని చెప్పి, మనది సర్వమత సమ్మేళనను ప్రబోధించి ‘సర్వజనులు సుఖశాంతులతో’ వర్ధిల్లాలి (సర్వేజనాః సుఖినోభవంతు) అని, ‘ప్రపం చం నలుమూలల నుంచి వచ్చే సకల భావధార’ను ఆహ్వానించాలని బోధిం చిన పూర్వ వైదిక ధర్మం మాత్రమే మనదనీ చాటిన ఆదిశంకరుల నీతిని సహితం పక్కకు తోసిపుచ్చుతున్నాయి బీజేపీ–ఆరెస్సెస్ వర్గాలు. ఈ దశలో ప్రధానంగా కాంగ్రెస్–బీజేపీల పాలనా కాలంలోనే 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ నేరారోపణలను తీవ్ర స్థాయిలో ఎదుర్కొనవలసి వచ్చిందని మరవరాదు. అయినా అత్యున్నత న్యాయస్థానం, అనేక ప్రజా ప్రయోజనాల రక్షణకు వీలైన ఎన్నికల చట్ట నిబంధనలను, అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చట్టాలనూ తీవ్ర నేరా రోపణలున్న లెజిస్లేటర్లపైన (అభ్యర్థులపైన) ఎన్నికల్లో పోటీ చేయ కుండా రాజకీయ అనర్హులుగా ప్రకటించడానికి ఆరోపణలను వాడరా దని చెప్పడం (ఇండియాటుడే: 25.9.2018) ఎంతవరకు సమంజసమో చర్చనీయాంశం కావాలి. ప్రస్తుత లోక్సభలో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు 35 శాతం ఉన్నారని సాధికార ఏడీఆర్ నివేదిక పేర్కొన్నప్పుడు కూడా సుప్రీం చర్యకు దిగకపోవడం, ఆ పనిని పార్ల మెంట్ నిర్ణయానికి వదిలిపెట్టడం సబబా? బ్రూట్ మెజారిటీ పేరుతోనో లేదా రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో కూడిన రాజకీయ పార్టీలు అధి కారంలో ఉన్నప్పుడు న్యాయస్థానం సహృదయంతో చేసిన ప్రతిపాద నకు ఎంతవరకు వీలు ఉంటుంది? ఆలోచించాలి. దీనికితోడు కుల వ్యవ స్థను, అసమానతల సమాజాన్ని దేశంలో పెంచి పోషిస్తున్న పాలకులు కుల, మత, వర్గ వివక్షకు తావులేని సామాజిక వ్యవస్థ స్థాపనకు కనీస ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడలేని దుర్గతికి చేరుకున్నారు. నేరమయ రాజకీయాలు, నేరారోపణలు చివరికి దేశ పాలకులు కొందరు ఓటింగ్ మిషన్ల లోపాలను సరిచేయకుం డానే వాడకంలోకి పెట్టి వాటంగా వాడుకోజూస్తున్న ఘటనలు ఎన్నో ప్రచారంలో ‘వైరల్’ అవుతున్నాయి. వేలు, లక్షల సంఖ్యలోనే పలుచోట్ల ఓటర్లు తమకు ఫొటో–ఓటర్ చీటీలు అందలేదని, ఓటర్లయినా ‘స్లిప్స్’ లేకపోయినా, ఆధార్ కార్డులున్న వారిని కూడా పోలింగ్ బూత్ నుంచి వెనక్కి తిప్పి పంపించేస్తున్న ఫిర్యాదులూ లక్షల్లోనే ఉంటున్నాయి. అసలు తాము ఓటు వేసే పోలింగ్ బూత్స్ ఉన్న ప్రాంతాలు స్పష్టంగా తెలియక పలు బూత్స్ తిరిగినా ఎక్కడా తమ పేర్లు కనిపించక పోయే సరికి హతాశులై వెనక్కి మళ్లిన వారి సంఖ్య కూడా అసంఖ్యాకంగా నమో దైంది. వీరిలో సరైన వయస్సులో వారే కారు, వృద్ధులు కూడా ఉన్నారు. పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ ఓటు వేసిన తర్వాత అది నమోదైన తీరును చూసుకునే అవకాశమివ్వాల్సిన వివిపాట్స్ యంత్రాలు అనేక చోట్ల మొరాయించి 2–3 గంటలపాటు పనిచేయక పోవడంతో ఓటర్లు తమ ఓటు వినియోగించుకోకుండానే వెనుదిరిగిపోయారు. కొన్ని చోట్ల యితే అసలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా మార్చేయడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. ఇదీ మన ప్రజాస్వామ్యపు ‘మేడిపండు’ గాథ. కనుకనే చూసి, చూసి ఈ అధర్మ, అరాచక వ్యవస్థను కొంత వరకైనా గాడిలో పెట్టే సదుద్దేశంతోనే సుప్రీం ధర్మాసనం ఓటింగ్ సరళిని ‘ప్రజాస్వామికం’ చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు వారి ఓటు గుర్తులున్న జాబితాలో ‘పై అభ్యర్థులెవరూ మాకిష్టం లేదు’ (నోటు–ఎబౌ–నోటా) అన్న ఇంటూ సింబల్ను కూడా ఆఖర్లో చేర్చారు. ప్రజాస్వామ్యమా? ‘వంచనా’ స్వామ్యమా? ఇటీవల కొంతకాలంగా ఈ ‘నోటా’కు ఓటు వేసే వారి సంఖ్య డజన్ల స్థాయినుంచి, వందలకు, ఆపైన వేలకు, ఇటీవల కాలంలో లక్షల సంఖ్య లోకి పెరుగుతోందని పత్రికల సమాచారం. ఇటీవల కొన్ని ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ‘నోటా’ ఓటర్ల సంఖ్య పెరగ డాన్ని పత్రికలు నమోదు చేశాయి. అంటే, ప్రజాస్వామిక భావాలకు, పౌర సమాజ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛకూ పాలకుల నుంచి రోజు రోజుకు ఎదురవుతున్న ఆంక్షలకు, బెదిరింపులకు సమాధానంగా ఒక ప్రజాస్వామిక నిరసనగా ఈ ‘నోటా’ విలువ పరిమితమైనది. కానీ మౌలిక ప్రజాస్వామిక సంప్రదాయానికి, గణతంత్ర వ్యవస్థ సంప్రదా యానికి అలవాటుపడి ఇప్పటికీ ఆ ప్రజాస్వామిక సంప్రదాయం ప్రకారం తమ ఎంపికను స్వేచ్ఛగా ప్రకటించడానికి ఏ రోడ్డు రవాణా, వాహన సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజనులు 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి ఓటింగ్లో పాల్గొనడం... ఆధునికమని చెప్పు కునే మన నేటి స్వార్థపూరిత ధనికవర్గ సమాజంలో మనందరికీ ఒక చెంప పెట్టు. కాగా, శ్రీశ్రీ అన్నట్టుగా ‘నేటి రివల్యూషనరీ రేపటి రియా క్షనరీ’ అయితే ఎలా ఉంటుందో ప్రజాయుద్ధ నౌక, దళిత కవి గద్దర్ మనకు నమూనాలా కనిపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం గద్దర్ ఏ చంద్రబాబు తుపాకీ గుండు దెబ్బతిన్నాడో అదే చంద్రబాబు నేడు ఆ గద్దర్ దృష్టిలో ‘ప్రజాస్వామ్య రక్షకుడి’గా కన్పించడం సృష్టిలోపమా, దృష్టిలోపమా, మనకు తెలియదు. అందుకే దేశంలో నేడున్నది ప్రజాస్వామ్యమా? లేక ఆ పేరుతో ప్రబోధాలతో ప్రజాశక్తుల్ని దశలవారీగా లొంగదీసుకోవడా నికి వేగంగా ప్రయత్నిస్తున్న వంచనా స్వామ్యమా అన్నది శేష ప్రశ్న. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆదివాసీల స్థితిగతులపై పరిశోధన
సాక్షి,ఆదిలాబాద్రూరల్ : మండలంలోని చించుఘాట్ గ్రామంలో ఆదివాసీల స్థితిగతులు, ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లపై మధ్యప్రదేశ్లోని అమరకంఠన్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రొఫెస ర్లు ఆదివారం పరిశోధన చేశారు. ఆదివాసీల జీవన విదానం, తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రానురానూ గోండి భాష కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. పుట్టుక నుంచి చావు వరకు దేవతలను పూజించడం, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన పాటలు, తదితర వాటిని రికార్డింగ్ చేసుకున్నామని ప్రొఫెసర్లు వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ల బృందంలో వినయ్కుమార్ తివారీ, బిరేంద్ర ప్రతాప్సింగ్, సౌరభ్ కుమార్, హేమంత్రావు, గ్రామ పెద్దలు లింగు, అనిల్కుమార్, బిపిన్కుమార్, హర్షన్రావు, తదితరులు ఉన్నారు. -
అర్బన్ నక్సల్స్కు కాంగ్రెస్ వత్తాసు
జగ్దల్పూర్: ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ గిరిజన తెగల సంస్కృతిని హేళనచేసిందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్తర్లోని జగ్దల్పూర్లో ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. మావోల సమస్యను సాకుగా చూపి గత ప్రభుత్వాలు బస్తర్ అభివృద్ధికి చొరవ చూపలేదన్నారు. నక్సల్స్ను దుష్ట మనసు కలిగిన రాక్షసులుగా అభివర్ణించిన మోదీ...బస్తర్లో బీజేపీ కాకుండా ఎవరు గెలిచినా ఆ ప్రాంత అభివృద్ధి కలలకు విఘాతం కలుగుతుందన్నారు. ఇటీవల ఛత్తీసగఢ్లో మావోల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూకు నివాళులర్పించారు. వాళ్ల దృష్టిలో ఓటుబ్యాంకే.. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల గురించి మాట్లాడే కాంగ్రెస్ వారిని మనుషులుగా కాకుండా ఓటుబ్యాంకుగానే చూస్తోందని మోదీ విమర్శించారు. ‘ఆదివాసీల సంప్రదాయాల్ని కాంగ్రెస్ ఎందుకు హేళన చేసిందో నాకు అర్థం కాలేదు. ఓసారి ఈశాన్య భారత్లో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీల సంప్రదాయ తలపాగా ధరించినప్పుడు కాంగ్రెస్ నాయకులు నా వేషధారణను చూసి నవ్వుకున్నారు. ఇది ఆదివాసీల సంప్రదాయాలను అవమానించడమే. ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్ కంట్రోల్గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్ మద్దతిస్తోంది’ అని అన్నారు. మరోవైపు, సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేమే నక్సల్స్ బాధితులం: కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ మద్దతిస్తోందన్న మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ తిప్పికొట్టింది. 2013లో నక్సల్స్ హింసలో కాంగ్రెస్ 25 మందికి పైగా నాయకుల్ని కోల్పోయిందని తెలిపింది. నక్సలిజం సమస్యను పరిష్కరించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోదీ తనకే సొంతమైన ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. మోదీ అసమ్మతిని సహించలేరని, ఆయన విధానాల్ని ప్రశ్నించినవారిని జాతి వ్యతిరేకులు, అర్బన్ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: వారికి వచ్చిన నష్టం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలు వ్యాపించి దిగంతాలకు తాకేలా అత్యంత ఎల్తైన అద్భుత కళాఖండంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వాతంత్య్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తే ఆ పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? విగ్రహావిష్కరణ సభను అడ్డుకునేందుకు సిద్ధమైన వారిలో దాదాపు మూడు వందల యాభై మంది ఆదివాసీ రైతులను ముందుగానే అరెస్ట్ చేసి పోలీసులు ఎందుకు 20 గంటల పాటు నిర్బంధించారు ? వారికి వచ్చిన నష్టం ఏమిటీ? వారికి బుధవారం నాడు విగ్రహావిష్కరణ రోజే తక్షణం ముంచుకొచ్చిన నష్టం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సరోవర్ డ్యామ్ గేట్లు తెరవడం. సర్దార్ సరోవర్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సర్మదా నది నీళ్లతో నిండుగా కనిపించడం కోసం సరోవర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ కారణంగా సమీపంలో మూడు గ్రామాల్లోని దాదాపు 30 మంది రైతుల పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయని పిపాలయ పోలీసు స్టేషన్ నిర్బంధం నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన రైతు నాయకుడు లఖాన్ ముసాఫిర్ తెలిపారు. ఆయనతోపాటు 24 మంది ఆదివాసీలను పిపాలయ పోలీసు స్టేషన్లో 20 గంటలపాటు నిర్బంధించారు. నర్మదా జిల్లా అంతటా దాదాపు 350 మంది ఆదివాసీ రైతులను పోలీసులు నిర్బంధించారని పటేల్ విగ్రహానికి 8 కిలోమీటర్ల దూరంలోని గురుదేశ్వర్ గ్రామానికి చెందిన లఖాన్ తెలిపారు. పటేల్ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతాలను టూరిస్ట్ జోన్గా అభివద్ధి చేయడం వల్ల ఇల్లు వాకిలినే కాకుండా పచ్చటి పంట పొలాలను కూడా కోల్పోతున్నామని ఆదివాసీ రైతులు ఆందోళన చేస్తున్నారు. నీటిలో మునుగుతున్న 13 గ్రామాలు సర్దార్ పటేల్ విగ్రహం పరిసరాల్లో టూరిజం అభివద్ధిలో భాగంగా ‘వాలీ ఆఫ్ ఫ్లవర్స్’ను, ‘టెంట్ సిటీ’ నిర్మాణ పనులు చేపట్టారు. టెంట్ సిటీలో ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అతిథి గహంతోపాటు పర్యాటక శాఖల గెస్ట్హౌజ్లు, ప్రైవేటు, ప్రభుత్వ రిస్టారెంట్లు నిర్మిస్తారు. బోటు షికార్ల కోసం ఓ సరస్సు నిర్మాణం పనులు కూడా చేపడుతున్నారు. ఈ పనుల సాకారం కోసం పటేల్ విగ్రహం ఉన్న కెవాడియాకు సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో, గురుదేశ్వర్ గ్రామానికి సమీపంలో ఓ చిన్న డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత సరోవర్ డ్యామ్ నుంచి నీళ్లను విడుదల చేసి చిన్న డ్యామ్ వరకు నీళ్లు నిండుగా ఉండేలా చేస్తారు. దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిన్న డ్యామ్ నిర్మాణం వల్ల ఇప్పటికే ఆరు గ్రామాలు నీటిలో మునిగిపోగా, డ్యామ్ నిర్మాణం పూర్తయి, నీటిని విడుదల చేస్తే మరో ఏడు గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. పటేల్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా దాదాపు 20 గ్రామాలు నష్టపోతుంటే పరోక్షంగా పరిసరాల్లో 70 ఆదివాసీ గ్రామాలు నష్టపోతున్నాయి. అందుకనే ఆ గ్రామాల ప్రజలంతా బుధవారం నాడు అన్నం వండుకోకుండా పస్తులుండి నిరసన తెలిపారు. 22 గ్రామాల సర్పంచ్ల లేఖ భారత దేశ కీర్తి ప్రతిష్టల కోసం తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్న తమ కడుపులు కొట్టవద్దంటూ ఇటీవల 22 గ్రామాల ప్రజలు తమ సర్పంచ్ల సంతకాలతో ప్రధాని పేరిట ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘మా పరిసర గ్రామాల ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని పలు గ్రామాలకు పాఠశాల, వైద్యశాలల వసతులే కాకుండా కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదు. ప్రజలు కష్టపడి సంపాదించి పన్నులు కడితే ఆ సొమ్మును మీరు ఇలా వధా చేయడం భావ్యం కాదు. పటేల్ ప్రాజెక్టు పూర్తయితే మా వ్యవసాయానికే కాదు, మాకు మంచినీటి కూడా సరోవర్ నది నుంచి ఒక్క చుక్కా దొరకదు. సరోవర్ కెనాల్ నెట్వర్క్ను (20 వేల కిలోమీటర్ల కెనాల్ను పూర్తి చేయాల్సి ఉంది) పూర్తి చేయడానికి నిధులు లేవనే సర్కార్, పటేల్ ప్రాజెక్టుకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ? అందుకనే మిమ్మల్ని 31వ తేదీన అతిథిగా ఆహ్వానించడం లేదు. అయినా మీరొస్తే మీ కార్యక్రమాన్ని మేం బహిష్కరిస్తాం’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నష్టపరిహారం ఊసేలేదు! పటేల్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇంకా తేల్చడం లేదు. ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ నష్టపరిహారం కోసం ఆర్జీలు పెట్టుకుంటే పరిశీలిస్తాంగానీ, ప్రాజెక్టు వద్దూ నష్టపరిహారం వద్దంటే తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 1990 దశకంలో సరోవర్ డ్యామ్ను నిర్మించడం వల్ల గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని 42 వేల కుటుంబాలు, దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులకు ఎక్కడో దూరాన పట్టాలిచ్చారని, వ్యవసాయం చేసుకునే భూమికి, ఇళ్ల స్థలాలకు మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం ఉందని ఆదివాసీ రైతులు తెలిపారు. దేశాన్నే కుదిపేసేలా ఆందోళన చేస్తే వారికి దక్కింది ఆ మాత్రం నష్టపరిహారమని, ఇక తమకు ఏపాటి పరిహారం దొరకుతుందని వారు ప్రశ్నించారు. -
గూడేల్లో ఎగిరిన నల్లజెండాలు
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామా ల్లో తుడుందెబ్బ నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ‘మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో నినాదాలు మారుమోగాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నల్ల జెండాలు ఎగురవేస్తూ ఆదివాసీలు నిరసనలు తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గూడేలతోపాటు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అరెస్టుచేశారు. మా భూమి మాకివ్వండి నేరడిగొండ మండలంలోని వాగ్ధారిలో తమ 105 ఎకరాల భూమిని లంబాడాల పేరుపై పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ముందుగా వాగ్ధారి గ్రామంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచి ధస్నాపూర్ వరకు 500 మంది ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో వచ్చేంత వరకు అక్కడే బైఠాయించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్డీవో సూర్యనారాయణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలకు ఆదివాసీలు వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయుల అడ్డగింత ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లంబాడా మహిళా ఉపాధ్యాయులను బహిష్కరించాలని ఆదివాసీ విద్యార్థులు అడ్డుకున్నారు. తరగతులకు రానివ్వకుండా ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ మండలంలోని కుమురంభీం చౌరస్తాలో, అంకోలి గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల జెండాను ఎగురవేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నేతలు నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రం, బీంపూర్ మండల కేంద్రం, బోథ్ మండంలోని పట్నపూర్లో నల్ల జెండాలు ఎగురవేశారు. ఉట్నూర్ మండలంలోని చిన్నసుద్దగూడ, పెద్దసుద్దగూడ, పర్కుగూడ, కల్లూరిగూడల్లో.. నార్నూర్ మండలంలోని మంకాపూర్, నాగల్కొండ, బలాన్పూర్, శేకుగూడతోపాటు దాదాపు జిల్లావ్యాప్తంగా అన్ని ఆదివాసీ గూడెల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. -
అడవి బిడ్డల ‘స్వయంపాలన’!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు ముందుగా చెప్పినట్లుగానే గూడేల్లో స్వయం పాలనను ప్రారంభించారు. మావ నాటే మావ రాజ్.. మావ నాటే మావ సర్కార్.. అనే నినాదంతో అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో చర్చలు విఫలమైన తర్వాత గూడేల్లో స్వయం పాలనను గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పిన తుడుందెబ్బ నేతలు.. ఆ దిశగానే కదిలారు. కుమురంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాల మధ్య స్వయం పాలనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ గూడేల్లో చాలాచోట్ల ఇలాంటి సంబరాలే జరిగాయి. అధికారులు, టీచర్ల అడ్డగింత: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడేల్లో శుక్రవారం ఉదయం నుంచే ఉద్యమం ప్రారంభించారు. గూడేల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల నుంచి వెళ్లిపోవాలంటూ లంబాడా ఉపాధ్యాయులను కోరారు. శనివారం నుంచి అసలు రావద్దని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లో, కుమురంభీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో లంబాడా ఉపాధ్యాయులను రానివ్వలేదు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన సాగలేదు. నార్నూర్ మండలంలోని జమాడలో ఆదివాసీలపై లంబాడా ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్యకు లంబాడా ఉపాధ్యాయులు సమాచారం అందించగా.. ఎలాంటి వివాదం చేయకుండా ఐటీడీఏకు తిరిగి రావాలని వారికి చెప్పినట్లు సమాచారం. నేడు తుడుందెబ్బ జెండాల ఆవిష్కరణ ఆదివాసీ సంఘాలు ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గూడేలన్నింటిలో తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించాలని ఆదివాసీలు నిర్ణయించారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తును మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నిషేధిత గ్రామం.. మావ నాటే మావ రాజ్.. మావ నాటే మావ సర్కార్.. అవర్ విలేజ్ అవర్ రూల్.. అవర్ విలేజ్ సెల్ఫ్ గవర్నమెంట్.. అండర్ యాక్ట్ 243, 244(1) పెసా చట్టాన్ని అనుసరించి పైన తెలుపబడిన నినాదం మా ఊళ్లో అమలులో ఉన్నది. కావున అనుమతి లేనిదే లోనికి ప్రవేశించకూడదు. పెసా కార్యకర్త, గ్రామ పటేల్ను సంప్రదించాలి. ఇట్లు మార్లవాయి గ్రామస్తులు..’’ఇది కుమురంభీం జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ పొలిమేరలో శుక్రవారం వెలసిన బోర్డు. -
మా ఊళ్లో మా రాజ్యం
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్ : మావ నాటే.. మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అనే నినాదంతో ఆదివాసీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి గూడేల్లో స్వయం పాలనను ప్రకటించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ముందుకు కదులుతున్నారు. స్వయంపాలనలో భాగంగా లంబాడా అధికారులను గూడేల్లోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషితో ఆదివాసీ పోరాట సమితి అధ్యక్షుడు సోయం బాపురావు ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సచివాలయంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆదివాసీ నేతలు స్వయం పాలనకు పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్లో ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉద్యమం సాగింది. గత డిసెంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణల తర్వాత ప్రభుత్వం ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్తోపాటు డీజీపీ మహేందర్రెడ్డి జిల్లాలో పర్యటించి ఆదివాసీలు, లంబాడాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా జనవరి 4న ఆదివాసీలు ప్రభుత్వానికి మెమొరాండం అందజేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్ 1 నుంచి స్వయంపాలనకు వెళ్తామని హెచ్చరించారు. డిసెంబర్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘర్షణలు సద్దుమణిగినప్పటికీ ఆదివాసీలు ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తూ వచ్చారు. తుడుందెబ్బ నాయకులు చెప్పినట్లు శుక్రవారం నుంచి ఆదివాసీ గూడేల్లో స్వయం పాలన ప్రారంభించాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం.. శైలేంద్రకుమార్ జోషితో చర్చల సందర్భంగా సమితి ప్రతినిధులు తమ డిమాండ్లను సీఎస్ ముందుంచారు. ఎస్టీ(షెడ్యూల్డ్ తెగలు) జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 342 ప్రకారం 9 తెగలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చారని, కానీ 1976 తర్వాత వలస మార్గంలో వచ్చిన లంబాడీలు అక్రమంగా ఎస్టీల్లో చేరారన్నారు. ఎలాంటి కమిషన్ వేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. అలాగే ఏజెన్సీ ధ్రువీకరణ పొందిన వేలాది లంబాడా యువత ఆదివాసీల ఉద్యోగాలను తన్నుకుపోయినట్లు స్పష్టంచేశారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తేనే న్యాయం జరుగుతుందని సీఎస్కు ఏకరువు పెట్టారు. దీనిపై జోషి స్పందిస్తూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరిస్తానని సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయితే ప్రధాన డిమాండ్పై స్పష్టత రాకపోవడంతో చర్చల ప్రసక్తే లేదంటూ సమితి ప్రతినిధులు సీఎస్ చాంబర్ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. ఇక స్వయం పాలనే: సోయం బాపురావు ప్రభుత్వంతో చర్చల అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడారు. చర్చలు సఫలీకృతం కానందున తమ కార్యచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనకు పిలుపునిచ్చారు. మా ఊరు– మా రాజ్యం పేరుతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రానికి వలసలుగా వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో దొడ్డిదారిన చేరిన లంబాడీలు ఆదివాసీల హక్కులను పూర్తిగా హరించారన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాక ఉద్యమం ఆపేదిలేదన్నారు. జూన్ 2న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న లంబాడా అధికారుల విధులను అడ్డుకుంటామన్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడీలు మధ్యప్రదేశ్లో ఓసీ కేటగిరీలో ఉన్నట్లు చెప్పారు. అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా, రాజస్థాన్ ఓసీలుగా చలామణి అవుతున్నారని, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీలుగా ఉన్నట్లు వివరించారు. -
‘అంబేద్కర్కి మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు’
జైపూర్: బీజేపీ నేతల మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మతతత్వ పార్టీ అంటూ బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. నాయకుల అనుచిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తమని ఆదివాసీలుగా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్కు మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆయన కంటే ముందుగా హనుమాన్ని పూజించాలి. ఎందుకంటే, ఆదివాసీల మొదటి నాయకుడు హనామన్ జీ మాత్రమే.వారంతా ఆయనకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. వారి మొదటి దేవుడు హనుమాన్. దళితులకు మార్గ నిర్దేశం చేసింది హనుమానే’ అని అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం కింద హనుమాన్ చిత్రపటం ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ని అవమానించారని మండిపడ్డారు. ‘మీరు సిగ్గు పడాలి. మీరంతా ఆదివాసీలమని చెప్పుకొంటూనే హనుమాన్ని అవమానిస్తారా..!’ అని స్థానిక ఎంపీ కిరోడి లాల్ మీనాపై అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 లక్షల దేవాలయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరే దేవుడికి ఇన్ని ఆలయాలు లేవని తెలిపారు. అహుజా వ్యాఖ్యలపై ఎంపీ కిరోడిలాల్ స్పందించారు. ‘ హనుమాన్ కాలంలో ఇటువంటి రాజకీయాలు లేవు. అహుజా హనుమాన్ జీని ఆదివాసీ, దళిత నాయకుడు అని అనాల్సిన అవసరం ఏమొచ్చిందో అంతుచిక్కడం లేద’ని ఆయన అన్నారు. ‘హనుమాన్కి అవమానం జరిదిందని విన్నాను. ఇది చాలా విచారకరం. అలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను కించపరుస్తాయి. అయినా, ఈ ఘటనకు ఆదివాసీలను బాధ్యులను చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు. -
ముందుగానే మృత్యువాత పడుతున్నారు..
దేశంలోని ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఆదివాసీలు, షెడ్యూల్డ్ కులాలు, అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు) ముందుగానే మృత్యువాత పడుతున్నారు. ఇతర వర్గాల ప్రజలతో పోల్చితే సరైనస్థాయిలో వైద్యసేవలు అందక క్షీణిస్తున్న ఆరోగ్యాల కారణంగా చిన్నవయసులోనే చనిపోతున్నారు. భారత్లోని నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడగున ఉన్న అణగారిన వర్గాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఉన్నత తరగతులు, ముస్లీమేతర వర్గాలకు చెందిన వారితో పోల్చి చూస్తే ఈ వర్గాలకు సరైన వైద్య,ఆరోగ్య సేవలు అందడం లేదని ‘భారత్లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004–14 మధ్యకాలంలో)’ పై ఆర్థికవేత్త వాణీæకాంత్ బారువా జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. 2004 నుంచి 2014 వరకు పరిశీలిస్తే ఆదివాసీల సగటు జీవితకాలం తగ్గిపోయింది.. 2004 వరకు ఎస్టీలు సగటును 45 ఏళ్లపాటు జీవిస్తుండగా, ఆ తర్వాతి దశకంలో అది మరింత తగ్గిపోయింది. ఎస్సీల సగటు జీవితకాలం 42 నుంచి 2014 కల్లా ఆరేళ్లు పెరిగింది. మొత్తం ఆరుగ్రూపుల్లో ముస్లీమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవించే వయసు 2004లో 55 ఏళ్ల నుంచి 2014లో 66 ఏళ్లకు పెరిగింది. దీనికి ఆరోగ్య,వైద్యసేవల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తుతున్న అసమానతలే ప్రధాన కారణమని బారువా తేల్చారు. భారత్లో ఓ వ్యక్తి ఆరోగ్యస్థితి నిర్థారణకు అతడు/ఆమె ఆర్థిక, సామాజిక స్థాయి సారూప్యపాత్ర (రిలేటివ్ రోల్) నిర్వహిస్తోందంటారు. 2004, 2014లలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) గణాంకాల ఆధారంగా ఆయన వివిధ అంశాలు పరిశీలించారు. 2004, 2014లలో సామాజిక బృందాల వారీగా సగటు వయసు మరణాలు... 2004 2014 ముస్లీమేతర ఉన్నత వర్గాల వయసు 55 60 ముస్లీమేతర ఓబీసీలు 49 52 ఉన్నత వర్గ ముస్లింలు 44 49 షెడ్యూల్డ్ కులాలు 42 48 షెడ్యూల్డ్ జాతులు 45 43 ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఎస్టీలు తక్కువ వయసులోనే చనిపోతున్నా, తాము అనారోగ్యంగా ఉన్న విషయాన్ని 24 శాతం మాత్రమే వెల్లడిస్తున్నారు. 2004లో ఇది 19 శాతంగానే ఉంది. ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు. పేదలు, ఒంటరిగా ఉంటున్న వారు తమ ఆరోగ్య సమస్యలు వెల్లడించి వైద్యసేవలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బారువా పేర్కొన్నారు. -
ఆదివాసీలతో పెట్టుకుంటే పుట్టగతులుండవ్
నార్నూర్ (ఆదిలాబాద్): ఆదివాసీలతో పెట్టుకుంటే సీఎం కేసీఆర్కు పుట్టగతులు ఉండవని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదివాసీలది ఆకలి, సామాజిక న్యాయపోరాటమని పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ‘ఆదివాసీల అస్థిత్వం’ పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఐక్యంగా ఉండి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో ఉద్యమించాలన్నారు. మావ నాటే మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అంటూ తీర్మానం చేయాలన్నారు. మే 9న హన్మకొండలో 5 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామన్నారు. -
ఆదివాసీలంటే ఇంత చిన్న చూపా?
నేడు రాష్ట్రంలో, దేశంలో ఆదివాసీలు అస్తిత్వం కోసం అల్లాడిపోతుంటే, తమ హక్కుల కోసం గొంతెత్తి విల్లం బులు ఎక్కుపెట్టి, రాజ్య హింసలో రాలిపోతుంటే ఆది వాసీల వైపు నిలబడాల్సిన కళాలు, గళాలు ఎందుకు మూగబోతున్నాయి? ఎందుకు భయపడుతున్నాయి? 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనేతర ఆధిప త్యాన్ని ఎదిరించి సవాల్ చేస్తున్న ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు, రచయితలు, కవులు, కళా కారులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తలు నోరు మెదపడం లేదెందుకు? వారి ప్రయాణం ఎటువైపు..? తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు తమ రిజర్వేషన్లు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించటం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదివాసీ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు మిలిటెంట్ ఉద్యమాలు చేస్తుంటే, ఆదివాసీల ప్రజాస్వామిక డిమాండ్ను ఎందుకు ఆమో దించట్లేదు. తెలంగాణలో లంబాడీలకూ – ఆదివాసీ లకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం, సంఘర్షణ నెలకొంటే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఎందుకు నోరు విప్పటం లేదో సమాధానం చెప్పాలి. ఏజెన్సీలో నెల రోజులుగా 144 సెక్షన్ విధించి ఆదివాసీల గొంతు నొక్కుతుంటే ఈ నాగరిక సమాజం, మేధావి వర్గం ఆదివాసీల పట్ల ఎందుకు సవితి తల్లి ప్రేమను చూపిస్తోంది? ఆదివాసీ ఉద్యమ వార్తలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కవర్ చేయొద్దు, ఎలాంటి వార్తలు రాయద్దు అని పాలక వర్గాలు నిరంకుశత్వపు శాసనాలు జారీ చేస్తుంటే.. ఆదివాసీల వైపు కళాన్ని, గళాన్ని వినిపించాల్సిన ప్రజాసంఘాలు, రచయితలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎటువైపు ఉన్నారు? ఎందుకు ఆదివాసీలంటే అంత చిన్నచూపు. ఆది వాసీలు ఈ దేశ పౌరులు కాదా? వాళ్లు మనుషులు కారా? ఈ దేశ మూల వాసులు కాదా? ఈ దేశ చట్టాలు, సంస్కృతి, పాలక వర్గాల సంక్షేమ పథకాలు ఇక్కడి ఆదివాసులకు చెందవా? ఆదివాసీలపై ఎందుకంత నిర్లక్ష్యం? పవిత్రమైన ఆదివాసీ ఉద్యమాలపైన ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి? ఆదివాసీ ఉద్యమానికి మావో యిస్టు ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం. మావోయిస్టు ముద్ర వేసి ఆదివాసీల గొంతు నొక్కాలని చూస్తున్నా కూడా మేధావులు, కవులు, కళాకారులు ఎందుకు స్పందించరు? నేడు భారతదేశంలో 5వ, 6వ షెడ్యూల్ ఆదివాసీ భూభాగంలో ఉన్న గిరిజనేతరుల గురించి, గిరిజనే తరుల దోపిడీ గురించి మాట్లాడటం వృథా అవుతుంది. ఒకే బోనులో పులి, జింక ఎలా జీవిస్తాయో, ఒకే బోనులో, ఒకే కలుగులో ఎలుక, పిల్లి ఎలా జీవిస్తాయో కూడా నేడు గిరిజనేతర పార్టీలు సమాధానం చెప్పాలి. - వూకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం మొబైల్ : 98660 73866 -
స్వయంపాలనను చాటే జాతర
యావత్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా జరిగే మహత్తర జాతర ఈ ఆదివాసీ జాతర. ఇంత పెద్ద ఆదివాసీ జాతర ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఆదివాసీలు, ఆదివాసీయేతరులు లక్షలాదిగా తరలివచ్చే ఎంతో ప్రకృతి రమణీయమైన జాతర. మేడారం జాతరలో విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం ప్రకృతి ఆరాధన, పసుపు కుంకుమలు తప్ప మరే ఇతర ఆచా రాలు ఉండని జాతర మేడారం జాతర. ఏదో ఒక పేరుతో ఆదివాసీల్ని అడవినుండి వెళ్లగొ ట్టాలనే కుట్రలు మన పాలక ప్రభుత్వాల విధానాలుగా ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మికతను జోడించి ప్రశ్నించే తత్వాన్ని పారదోలేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీల రాగా లాపన ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. ఆదివాసీల ప్రాకృతిక ఆరాధనకు, ఆధిపత్య ప్రతిఘటనకు ప్రతీకగా ఈ మేడారం జాతర నిలుస్తుంది. ఆధిపత్య సంస్కృ తుల్ని సవాల్ చేస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతుల్ని రూపొందిం చుకునే క్రమానికి స్థానికంగా ఆదివాసీ సమాజం ఎది గింది. అందువలనే ప్రకృతిని తప్ప మరో మనిషి ముందు సాగిలపడే సంస్కృతికి ఆదివాసీ సమాజంలో స్థానం లేదు. ఇక్కడ ఫ్యూడల్ మంత్రతంత్రాల ప్రసక్తి లేదు. నిర ర్థకమైన క్రతువులకు చోటు లేదు. అంతటా ప్రకృతికి, మానవ ప్రత్యామ్నాయానికి పెద్ద పీట వేయటం ఈ జాత రలో కనిపించే దృశ్యం. మరోవైపు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి, జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది. అదే గనుక జరిగితే ఆదివాసీల అస్తిత్వం అంతమవుతుంది. మేడారం జాతరపై పాలక వర్గాల ఒత్తిడి, ఆధిపత్యం ఎక్కువవుతుంది. ఆదివాసీలు జాతరకు దూరమవు తారు. గిరిజనేతరుల వలసలు, ఆధిపత్యం ఎక్కువై జాతర నిర్వహణ గిరిజనేతరుల చేతిలోకి, దేవాదాయ శాఖ చేతిలోకి పోతుంది. ఆదివాసీల పోరాట చరిత్ర కనుమరుగు అవుతుంది. ఆదివాసీల చట్టాలు, జీవోల రాజ్యాంగ రక్షణలు, భూములు ఎలాగో పోయాయి. ఆదివాసీల అస్తిత్వమైన మేడారం జాతరను సైతం ఆదివాసీలకు దూరం చేయా లని పాలకులు, గిరిజనేతరులు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా, ఆదివాసీలు కాక తీయులపై కత్తులు దూసి ఆదివాసీ స్వయంపాలన కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మల పోరాట వార సత్వాన్ని పుణికిపుచ్చుకొని మేడారం జాతరను కాపా డుకోవాలి. (జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో జరుగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా) – వూకె రామకృష్ణ దొర ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు 98660 73866 -
నేడు హైమన్ డార్ఫ్ 31వ వర్ధంతి
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీ ఆరాధ్యుడు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వోన్ ఫ్యూరర్ హైమన్డార్ఫ్ 31వ వర్ధంతిని గురువారం కుము రం భీం జిల్లా జైనూర్ మండలం మార్ల వాయిలో ఆదివాసీలు ఘనంగా జరపనున్నారు. 1940వ దశకంలో ఆస్ట్రియా దేశపు ఆంత్రోపాలజిస్టు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేశారు. మార్లవాయిలో నివసించిన ఆయన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఆదివాసీల సమస్యలు వివరించి వారికోసం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించేలా కృషి చేశారు. 1987లో హైమన్ డార్ఫ్ బార్య ఎలిజబెత్, 1995లో డార్ఫ్ లండన్లో చనిపోగా వారి కోరిక మేరకు వారి చితాభస్మం తెచ్చి సమాధులు నిర్మించా రు. అప్పటి నుంచి ఆదివాసీలు డార్ఫ్ వర్ధంతిని ఏటా నిర్వహిస్తున్నారు. -
ఏజెన్సీలో మళ్లీ ఉద్రిక్తత
జన్నారం(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు, లంబాడీ తెగల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మంగళవారం మళ్లీ గొడవలు చెలరేగాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామపంచాయతీ పరిధి కొత్తపేట్ కొలాంగూడకు చెందిన ఆదివాసీ యువకుడిపై లంబాడీలు దాడి చేశారని తండాపై దాడికి పాల్పడ్డారు. ఇళ్లు, దుకాణాలపై దాడి చేసి చేతికందిన వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఎక్కడి వారిని అక్కడనే కట్టడి చేశారు. ఇరువర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. కొత్తపేట్ కొలాంగూడ సమీపంలో చేపల పెంపకం చేపడుతున్న సిడాం భీంరావు సోమవారం రాత్రి చెరువు వద్ద కాపలాకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి అతడిపై దాడి చేశారు. భీంరావు తప్పించుకుని గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులకు సమాచారమివ్వగా.. వారు వెంటనే జన్నారం ఎస్ఐ రమేశ్గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి భీంరావును మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెల్లారేసరికి ఆదివాసీలకు తెలిసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది యువకులు, మహిళలు, నాయకులు మధ్యాహ్నం కొలాంగూడకు చేరుకున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తరలివచ్చా రు. ఇదే క్రమంలో మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు గౌస్బాబా, సీతారాములు, మంచిర్యాల, లక్సెట్టిపేట్, శ్రీరాంపూర్ సీఐలు, మంచిర్యాల, హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట్, జన్నారం, కడెం ఎస్ఐలు తమ సిబ్బందితో కొలాంగూడకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్రావు, ఎస్బీ ఏసీపీ విజయసారథి వచ్చి ఆదివాసీ నాయకులతో చర్చించారు. సమస్య శాంతియుతంగా పరి ష్కరించుకుందామని, భీంరావుపై దాడిచేసిన వారిని పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. అక్కడి నుంచి వెళ్లి.. ఓ పక్క డీసీపీ వేణుగోపాల్రావు, ఏసీపీలు గౌస్బాబా.. సీతారాములు ఆదివాసీ నాయ కులతో మాట్లాడుతుండగా.. కొలాం గూడకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆగ్రహంతో చేల నుంచి పరుగులు తీసి కొత్తపేట్లో లంబాడీలకు చెందిన ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. పలు ఇండ్ల కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. బయట ఉన్న వస్తువులను పగులకొట్టారు. రెండు కిరాణా దుకాణాలను ధ్వంసం చేశారు. ఒక కారు అద్దాలు పగులకొట్టారు. రెండు ఇళ్లకు నిప్పంటించారు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పివేశారు. డీసీపీ, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెళ్లి అందరినీ తిరిగి కొలాంగూడకు తీసుకువెళ్లారు. ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, డివిజన్ అధ్యక్షుడు రాజుకుమార్, పవన్కుమార్ తదితరులకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. నేడు జిల్లా బంద్కు పిలుపు భీంరావుపై దాడికి నిరసనగా బుధవారం మంచిర్యాల జిల్లా బంద్కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉన్న ఆదివాసీలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. దోషులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు పవన్కుమార్, డివిజన్ నాయకుడు రాజుకుమార్ డిమాండ్ చేశారు. సమీక్షించిన డీఐజీ, కలెక్టర్ కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్కుమార్, మంచిర్యాల కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఆర్వీ.కర్ణన్ కొలాంగూడలో పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల నేతలతో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండా లని పోలీసులకు సూచించారు. -
ఉట్నూరులో డీజీపీ, సీఎస్ పర్యటన
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల దృష్ట్యా శాంతి భద్రతలను పర్యవేక్షంచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉట్నూరు చేరుకుని పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సీఎస్, డీజీపీ సమావేశమయ్యారు. అదే విధంగా ఆదివాసీ, లంబాడీ నాయకులతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. -
ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివాసీలు సోమవారం తాళాలు వేశారు. ఆదివాసీలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు ప్రతీ కార్యాలయానికి వెళ్లి బంద్ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహకార సంఘం కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని మర్యాదపూర్వకంగా బయటకు పంపించి తాళాలు వేశారు. -
ఎస్టీల్లో ఉన్నా అన్యాయమే..
సాక్షి, హైదరాబాద్ : ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఆదివాసీలకు అందడం లేదు. ఎస్టీలుగా ఉన్నా, దేశంలో అణగారిన తెగగా చెప్పబడుతున్నా అన్యాయమే జరుగుతోంది. విద్య, ఉద్యోగావకాశాలు అందక వెనుకబాటు పెరుగుతోంది. దీన్ని అధిగమించాలంటే ఆదివాసీల డిమాండ్ల పరిష్కారమే ఏకైక మార్గం’అని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఫగ్గన్సింగ్ కులస్తే ఉద్ఘాటించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో శనివారం ఆదివాసీల మహాగర్జన జరిగింది. తుడుందెబ్బ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు 20 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు హాజరయ్యారు. మహాగర్జనకు ముఖ్యఅతిథిగా హాజరైన ఫగ్గన్సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆదివాసీలు భూమిని నమ్ముకునే జీవిస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించి వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆదివాసీలకు చేరడం లేదని, దీంతో వారంతా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన తెగల కోసం గత ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు ఏర్పాటు చేసినా వారిచ్చిన నివేదికలు మాత్రం బయటకు రాలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ట్రైబల్ కమిషన్ను ప్రక్షాళన చేశారని, ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతం చేశారని వివరించారు. కుమ్రం భీం, రాంజీగోండ్ లాంటి మహానుభావులు పుట్టిన తెలంగాణలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారని, వారడుగుతున్న డిమాండ్లు సమ్మతమైనవని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఆదివాసీల హక్కని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కోవా లక్ష్మికి నిరసనల సెగ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవా లక్ష్మికి ఆదివాసీల మహాగర్జనలో నిరసనల సెగ తగిలింది. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఆదివాసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని కోవా లక్ష్మి పేర్కొన్నారు. దీంతో సభకు హాజరైనవారు కేసీఆర్ డౌన్డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కోవా లక్ష్మికి వ్యతిరేఖంగా నినాదాలు ఊపందుకోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనుల మధ్య ఆదిలాబాద్ కలెక్టర్ చంపాలాల్ చిచ్చు పెట్టారని, ఏజెన్సీలో లంబాడ కలెక్టర్ను ఎలా నియమిస్తారని, ఇది ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, జీపీపీ జాతీయాధ్యక్షుడు హీరాసింగ్ మాల్కం, ప్రొఫెసర్లు వీరాలాల్ అల్వా, నాగేశ్వరరావు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, మహిళా కార్యదర్శి సుగుణ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వివేక్ వినాయక్, కొప్పుల రవి, డాక్టర్ నిరంజన్ పాల్గొన్నారు. మహాగర్జనకు భారీ స్పందన ఆదివాసీల మహాగర్జనకు అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని 20 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఆదివాసీలు సరూర్నగర్ స్టేడియంకు చేరుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన వాహనాలతో ఎల్బీనగర్–చైతన్యపురి మధ్య ట్రాఫిక్ కిక్కిరిసింది. రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సభకు దాదాపు లక్ష మంది ఆదివాసీలు వచ్చినట్లు అంచనా. భారీగా జనం రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాగర్జన తీర్మానాలివే.. ⇒ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. ⇒ చట్టబద్ధత లేని లంబాడాల ఎస్టీ హోదాను తక్షణమే రద్దు చేయాలి. ⇒ ఆర్టికల్ 342 ప్రకారం రాజ్యాంగ పరిషత్ కమిటీ గుర్తించిన 9 ఆదిమ తెగలకే 1915 గెజిట్ ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ⇒ ఎస్టీ కుల ధృవీకరణ, ఏజెన్సీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన లంబాడీ ఉద్యోగులపై విచారణ జరిపి ఉద్యోగాలు తొలగించాలి. ⇒ షెడ్యూల్ ఏరియాలోని లంబాడ అధికారులను మైదాన ప్రాంతాలకు బదిలీ చేసి ఆదివాసీలను నియమించాలి. ⇒ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు, ఇంటర్, డిగ్రీ, మెడిసిన్, న్యాయ, ఫార్మసీ కోర్సులతో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. ⇒ అటవీ హక్కుల చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలు సాగిస్తున్న వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి. ⇒ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని 9 ఆదిమ తెగల అభివృద్ధికే కేటాయించాలి. ⇒ కుమ్రంభీం వర్ధంతి సభ సందర్భంగా ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడిలో 333 మంది ఆదివాసీ తెగల అభ్యర్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తేయాలి. లంబాడీలతోనే పెను ప్రమాదం: సోయం బాబూరావు తెలంగాణలోని ఆదివాసీలకు ఆంధ్రోళ్ల కంటే లంబాడీలతోనే పెను ప్రమాదం ఉందని, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగిస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబూరావు అన్నారు. ఆదివాసీల హక్కులు సాధించే వరకు పోరాటం ఆపబోమని, ఈ నెల 15 వరకు ప్రభుత్వానికి గడువిస్తున్నామని, డిమాండ్ల పరిష్కారంపై దిగిరాకుంటే పోరాటం తీవ్రం చేస్తామని, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నుంచి ఎంపీ నగేశ్ హామీ తెచ్చే వరకు పోరాటం ఆగదని, తల తాకట్టు పెట్టైనా ఆదివాసీలకు న్యాయం జరిగేలా పోరాడుతానని పేర్కొన్నారు. త్వరలో వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆదివాసీ మహిళలతోనూ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం, లంబాడీల వల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించానని చెప్పారు. ప్రభుత్వపరంగా ఆదివాసీలకు లబ్ధి జరిగేలా సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఏ పార్టీ ముందుకు రాలేదని, న్యాయం చేయలేదని భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య ఆరోపించారు. జీవో నం.3 తీసుకొస్తే తాను పూర్తిగా వ్యతిరేకించానని, దీంతో ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. -
ఆ సేవలను గుర్తించే క్షణం ఎప్పుడో!
వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి. ‘ఆఫ్రికా నవ నక్షత్రాలూ వెనక్కి ఇచ్చేయాలి. అవి ఆఫ్రికా వజ్రాలు. తొమ్మిది వజ్రాలను తొమ్మిది నక్షత్రాలని పిలుస్తాం. ఇవి బ్రిటన్లో ఉన్నాయి. అటువంటి వేలాది వజ్రాలు ఆఫ్రికా నుంచి తవ్వి తీసుకెళ్లారు. అవి మావి, మాకే చెందాలి’ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ నాయకులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బెర్నిగ్రాంట్ డిమాండ్ ఇది. ఆఫ్రికాను బ్రిటన్ వలసగా మార్చుకోవడం, సంపదను దోచుకెళ్లడం వంటి వివరాలను బెర్నిగ్రాంట్ తెలి యజేశారు. ఆఫ్రికా నల్లజాతి ప్రజలు వజ్రాలను వెలికితీసి బ్రిటన్ను సంపన్నదేశంగా మార్చారని బెర్నీ పేర్కొన్నారు. ఆఫ్రికా నల్లజాతి కార్మికుడు ఒకరు ప్రీమియర్ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో 1905లో ఒక వజ్రం కంటపడింది. ఇది చరిత్రలో నమోదు కాలేదు. ఆ వజ్రాన్ని 1907లో బ్రిటన్ ప్రభుత్వం లక్షా యాభైవేల పౌండ్స్కు కొనుగోలు చేసి చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్కు జన్మదిన కానుకగా అందజేసింది. దాన్ని ఆ తర్వాత తొమ్మిది చిన్న వజ్రాలుగా మలిచారు. వీటినే తొమ్మిది నక్షత్రాలుగా పిలుస్తామని బెర్నీగ్రాంట్ తెలి పారు. బెర్నీ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ నాయకుడు. ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం 2001 ఆగస్టు– సెప్టెంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన ప్రపంచ జాతి వివక్షా వ్యతిరేక సదస్సులో మొదటిసారిగా ‘రిపరేషన్స్’అనే అణగారిన ప్రజల విముక్తినాదం నా చెవులను తాకింది. ‘వివక్షకూ అణచివేతకూ గురైన ప్రజల ప్రగతి కోసం మానవ హక్కులూ, సేవాదృక్పథం మాత్రమే సరిపోవు. కోల్పోయిన అన్నిరకాల వనరులు, సంపద తిరిగి పొందేంతవరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే రిపరేషన్స్’ అని నల్లజాతి నినదించింది. అప్పటి నుంచి ఆ ఉద్యమం అంచెలంచెలుగా విస్తరిస్తున్నది. అమెరికాలో, ఆస్ట్రేలియాలలో ఆదిమ తెగల ప్రజలకు అక్కడి ప్రభుత్వాలు రిపరేషన్స్ పేరుతో ఏటా కొన్ని నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. డిసెంబర్ 7, 2009న ఫెడరల్ కోర్టు రెడ్ ఇండియన్స్కి రిపరేషన్స్ నిధులు అందజేయాలని తీర్పునిచ్చింది. ఇది ఆధునిక ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడానికి సూచనగా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా భావించారు కూడా. ఆదిమ తెగల ప్రజల సంపద, వారసత్వం మీదనే ఆధునిక సమాజాల నిర్మాణం జరిగిందనీ, అణచివేతతో, పీడనతో ప్రజలనుంచి దోచుకున్న సంపదతోనే ప్రస్తుత వ్యవస్థలు పనిచేస్తున్నాయనీ, అటువంటి వారసత్వాన్నీ, సంపదనూ అందించిన ప్రజలను మర్చిపోవడం లేదా వివక్షకు గురిచేయడం ఎంత మాత్రం సరికాదని ఆ సమయంలోనే ఒబామా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనితో మరోసారి రిపరేషన్స్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘రిపరేషన్స్’అంశం చరిత్రకు కొత్తకాదు. గతంలో యుద్ధంలో ఓడినవారు విజేతలకు నష్టపరిహారంగా కొంత సంపదను రిపరేషన్స్ పేరిట చెల్లించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో జరిగిన యూదు జాతి హత్యాకాండకు పరిహారంగా ప్రభుత్వం ఏటా రిపరేషన్స్ చెల్లిస్తున్నది. కెనడాలో 1991 నుంచి అ««ధ్యయనం చేసి 2006లో అక్కడి ఆదిమ తెగల అభివృద్ధి కోసం రెండు బిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని అందజేసింది. నియంతృత్వ పాలనలలో నిర్బంధానికి గురైన ప్రజలకు, కార్యకర్తలకు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన అనంతరం తగు నష్టపరిహారం చెల్లించినట్టు ఆధారాలున్నాయి. చిలీ, మొరాకో, గుయానా, బార్బొడాస్, జమైకా దేశాల్లో ఇటువంటి రాజకీయ రిపరేషన్స్ అందజేశారు. రాజకీయ పరమైన వారసత్వ హక్కుగా ఈ రోజు ఆఫ్రికా రిపరేషన్ మూవ్మెంట్ నడుస్తున్నది. అమెరికా నల్లజాతి ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయానికీ, దోపిడీకి రిపరేషన్స్ పరిష్కారమని భావిస్తున్నారు. రిజర్వేషన్ – రిపరేషన్ ఈ నేప«థ్యం నుంచే భారతదేశంలో రిజర్వేషన్లను అర్థం చేసుకోవాలి. ఇటీవల ఈ రిజర్వేషన్ల డిమాండ్కు కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. జనాభా అధికంగా ఉండి, రాజకీయాలను ప్రభావితం చేసేవారు తమ ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్లపైన ఉద్యమాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం కాకుండా కేవలం తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు ఇటువంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. ఎలాగైనా అధికారంలోనికి రావాలనే ఆశతో ప్రధాన పార్టీలన్నీ ఇటువంటి నినాదాలను సమర్థిస్తున్నాయి. రాజ్యాంగ పరిధిలో అవి ఏమాత్రం ఇమడవని తెలిసినప్పటికీ ప్రోత్సహిస్తున్నాయి. దానితో రిజర్వేషన్ల లక్ష్యమే ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం పౌరులెవ్వరైనా వివక్షకు గురికాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే నిజానికి ఏ వర్గాలైతే ఈ దేశంలో వివక్షకూ, దోపిడీకీ, వెలివేతకూ గురయ్యాయో అవి ఇంకా అదే పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వర్గాలకే ఎంతో చేసినట్టు, దేశ సంపదను దోచిపెడుతున్నట్టు ఆధిపత్య కులవాదులు భావించడమే దారుణం. పైకి ఏం చెబుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల పట్ల, వారి అభివృద్ధి పట్ల రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేదు. కానీ సంక్షేమం పేరుతో ఘనకార్యం చేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ స్ఫూర్తిని చూశాక, వారి వాదనను అర్థం చేసుకున్న తర్వాత ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు కావాల్సింది రిజర్వేషన్లు మాత్రమే కాదు, రిపరేషన్స్ సైతం తప్పనిసరి అని భావించాలి. ప్రస్తుతం ఎస్సీలుగా పేర్కొంటున్న అంటరాని కులాలు మూడు వేల సంవత్సరాలకు పైగా తమ శ్రమను, సంపదను, ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించాయి. ఆ శ్రమ, త్యాగం వృథా కారాదు వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి. వ్యవసాయ సమాజం పురోగమించడానికి అంటరాని కులాలు చేసిన కృషి అనిర్వచనీయం. చనిపోయిన పశువుల చర్మాలను శుద్ధి చేసి 18 రకాల వృత్తి వస్తువులను అందించి ఉండకపోతే ఈ రోజు మన సమాజాన్ని ఈ స్థాయిలో ఊహించడం కష్టమే. అత్యంత మురికితో ఉండి, వాసనకూడా తట్టుకోలేని స్థితిలో తోలును లందలో ఉంచి శుభ్రం చేయడం సమాజంలోని మరే ఇతర సామాజిక వర్గం చేయలేనప్పుడు అంటరాని కులాలుగా ఉన్న వీరు దాన్ని అత్యంత బాధ్యతగా సామాజిక పురోగమనానికి ఒక ఆయుధంగా వాడారు. వ్యవసాయ రంగంలో పశుపోషణ, చెరువుల నిర్మాణం, నిర్వహణ, దున్నడం, పంటల రక్షణ వంటి పనులు అంటరాని కులాలే నిర్వహించాయి. ఇటీవల రైతేరాజు అనీ, అన్నదాత అనీ చెపుతున్నదంతా ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నదంటే భూమి ఎవరి చేతిలో ఉందో వారిని గురించే, భూమిపైన కాగితపు హక్కుదారులను గురించే తప్ప ఆ మట్టిలో మట్టిగా ఆరుగాలం కష్టపడి, తమ చెమటతో పంటలను పండించిన ఈ అంటరాని జనం తమ రక్తాన్ని ధారపోసి గుక్కెడు గంజికి సైతం నోచుకోక తరతరాలుగా ఆ భూమికి దూరంగా బతుకుతున్నారన్న స్పర్శ ఈ సమాజానికి ఎందుకు లేకుండా పోయిందో అర్థం కాదు. ఇక ఏ తోలైతే సాంకేతిక నైపుణ్యానికి పునాదులు వేసిందో దాన్ని ఆవిష్కరించిన అంటరాని కులాలు ఈ రోజు అదే పరిశ్రమలో కూలీలుగా కూడా మిగల్లేదు. ఏటా వేల కోట్ల రూపాయల ఎగుమతితో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న వాళ్లు పరిశ్రమాధిపతులైతే వృత్తికీ, ఉత్పత్తికీ దూరమై దిక్కు తోచక గ్రామాల్లో అలమటిస్తున్నది మాత్రం అంటరాని కులాలు. 150 ఏళ్ల రైల్వే, గనుల చరిత్రను తవ్వి తీస్తే కార్మికుల కృషి, త్యాగం బయటపడతాయి. కానీ ఇప్పటి వరకు ఆ చరిత్రను రాయడానికీ, అధ్యయనం చేయడానికీ ఏ ప్రభుత్వాలూ సిద్ధంగా లేవు. ఆదివాసీల పరిస్థితీ అంతే! అదేవిధంగా ఆదివాసీలు గత వందల సంవత్సరాల్లో తమ భూమినీ, అడవినీ కోల్పోయి పుట్టిన గడ్డపైనే పరాయి బతుకు బతుకుతున్నారు. పరిశ్రమాధిపతుల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు ఆదివాసీలను తరిమి వేస్తూ అక్కడి వనరులను ఆక్రమించుకుంటున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ఆధునిక ప్రభుత్వాలు సైతం వారిని వెంటాడి వేటాడుతున్నాయి. దేశ సంపదను వృద్ధి చేయడంలో, వనరులను కాపాడడంలో ఎన్నో త్యాగాలు చేసిన∙ఆదివాసీల కోసం, అంటరాని కులాల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వాటి మీద ఆధారపడి అమలు జరుగుతున్న రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, రోజురోజుకీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద, వారి మంచి, చెడు ప్రవర్తనలమీద ఆధారపడుతున్నాయి. అందుకే ఆఫ్రికా నల్లజాతి ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా, ఉద్యమిస్తున్నట్టుగా రిపరేషన్స్ అనే ఉద్యమాన్ని భారతదేశంలో కూడా ఆది వాసీలు, దళితులు ఆరంభించక తప్పని పరిస్థితిని భారత సమాజం, ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. రిజర్వేషన్ల మీద నిరసనతో ఉన్న సమాజం, దళితుల పట్ల అడుగడుగునా ద్వేషంతో ఉన్న కుల సమాజం భారతదేశ చరిత్రను మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అణచివేతకు గురైన వర్గాల వారు దేశంలో 25 శాతం ఉన్నారు. దేశంలో సామరస్యం, శాంతి, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక్కటే మార్గం ఉంది. తరతరాలుగా ఈ సమాజంలో భాగం కాలేకపోయిన, వివక్షకీ గురి అవుతోన్న ఆ అణగారిన వర్గాలను ఈ దేశంలో ఒక భాగంగా గుర్తించక తప్పదు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
ఇండ్ల స్థలాల కోసం ఆదివాసీల ఆందోళన
నిర్మల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుపేద ఆదివాసీ గిరిజనులు ఇండ్ల స్థలాలకోసం నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు. గత యాభై రోజులుగా ఆదివాసీ గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భీంరావు, భారతి అనే గిరిజన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనున్న వారు గుర్తించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం జిల్లా కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
అన్ని ప్రభుత్వాల సారాంశం ఒక్కటే
తమ హక్కులకోసం, మనుగడ కోసం ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేయటం నరేంద్ర మోదీతోనే మొదలు కాలేదు. తొలి ప్రధాని నెహ్రూ హయాంలో, బ్రిటిష్ హయాంలో, బహుశా అంతకుముందు నుంచి కూడా ఇది కొనసాగుతోంది. మోదీ తర్వాత కూడా ఇదే జరగనుంది. తన కంటే ముందున్నవారు పాటించిన దాన్ని మోదీ కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. భాషలో మాత్రమే తేడా ఉంటోంది తప్ప, వైఖరి మాత్రం అప్పుడూ ఇప్పుడూ కూడా కఠినంగా ఉంది. భారత్ను ఉదారవాద వ్యతిరేక దేశంగా మారుస్తున్నారన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తప్పుగా మోపే ఆరోపణల్లో ఒకటి. ఉదారవాద వ్యతిరేకత (ఇల్లిబ రల్) అనే పదానికి అసహనం అనీ, వాక్ స్వేచ్ఛపై ఆంక్షలకు మద్దతు ఇవ్వడం అని అర్థం. ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుగా నిందిస్తున్నారని నేనంటాను. ఎందుకంటే భారత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కూడా ప్రత్యేకించి ఉదారవాద స్వభావంతో లేదని వాస్తవాలు చూపుతున్నాయి. దశాబ్దాలుగా కొన్ని సమస్యల పరిష్కారంపై పనిచేస్తున్న పౌర సమాజ బృందాలు, ప్రభుత్వేతర సంస్థలు నేను చెప్పిన అంశాన్ని ససాక్ష్యంగా నిర్ధారిస్తాయి. ఆదివాసీలు, కశ్మీరీలు, ఈశాన్య భారత ప్రజల హక్కుల వంటి సమస్యలు ఇటీవల ప్రాధాన్యం సంతరించుకున్నవి కావు. దశాబ్దాలుగా ఈ సమస్యలు మనని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేదా ఈ ప్రధానమంత్రే సమస్యలన్నిటికీ కారణం అని భావించడం తప్పు. ఖనిజ సంపదకు సంబంధించి అత్యంత సుసంపన్నంగా ఉండే ఆదివాసీ భూములను కొల్లగొట్టడం అనేది నెహ్రూ హయాంలో, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే ముందే మొదలైంది. ఆదివాసీలకు వ్యతిరేకంగా అత్యంత అసహ్యకరమైన, అత్యంత తలబిరుసుతనంతో కూడిన చర్యలను మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టారు. కొద్దిమంది చేస్తున్నారని చెబుతున్న నేరాలకు గానూ ఆదివాసులందరినీ శిక్షిస్తున్నారు. మధ్యభారత్ ప్రాంతంలో వేలాది పారామిలటరీ బలగాలు తిష్టవేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2015 అక్టోబర్ నెలలో ‘మావోయిస్టు వ్యతిరేక చర్యలు : ఛత్తీస్గఢ్, గగనతలం నుంచి ప్రతీకార దాడులు కొనసాగించనున్న భారత వాయుసేన’ శీర్షికతో పత్రికలు వార్త ప్రచురించాయి. భారత వాయుసేన తన సొంత ప్రజలపై ఆకాశం నుంచి దాడి చేయడానికి రష్యన్ తయారీ ఎమ్ఐ–17 హెలికాప్టర్లను ఉపయోగిం చిందన్నది ఆ వార్తా కథనం సారాంశం. వాయుసేన ‘విజయవంతంగా దాడుల’ను కొనసాగించిందని ‘మూడు ఐఎఎఫ్ హెలికాప్టర్లు బీజాపూర్ ప్రాంతంపై విహరించి, దాడులు చేశాయ’ని వార్తలు తెలిపాయి. దాడులు అంటే ‘తక్కువ ఎత్తులో విహరిస్తున్న యుద్ధ విమానం నుంచి పదేపదే బాంబులతో దాడి చేయడం అనీ లేదా మెíషీన్ గన్లతో కాల్పులు జరపటం’ అనీ అర్థం. భారత దేశం గురించి పరిచయం ఉన్నవారికి దేశంలో జనం ఏమాత్రం లేని ప్రాంతాలు అంటూ ఏవీ లేవని తెలిసే ఉంటుంది. మరి మన వాయుసేన పైనుంచి బాంబులతో, మెషీన్ గన్ కాల్పులతో సైనిక చర్యల ప్రాక్టీస్ చేసిన ప్రాంతంలో ఏం జరిగి ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ స్థాయి హింస ఆ ప్రాంతానికి కొత్త కాదనీ, బ్రిటిష్ కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకు ముందునుంచి కూడా ఆందోళన చేస్తున్న పౌరులను భారత రాజ్యవ్యవస్థ అణచివేస్తోందన్నదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఇదంతా మోదీతోనే ప్రారంభమైందని భావించడం తప్పు మాత్రమే కాకుండా వాస్తవ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి అలాంటి ఊహే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మోదీకి ముందు, భారత రాజ్య వ్యవస్థ తన పౌరులతో ఇలాగే వ్యవహరించింది, దురదృష్టవశాత్తూ మోదీ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తుంది కూడా. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో నేను కొన్ని నెలల క్రితం సంభాషిం చాను. కశ్మీర్ నుంచి సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్ఎస్పీఎ)ని భారత ప్రభుత్వం ఎత్తివేయాలని ఆయన చెప్పారు. అయితే తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిదంబరం ఈ అభిప్రాయాన్నే వ్యక్తీకరించి ఉంటే అది మరింత విశ్వసనీయంగా ఉండి ఉండేదని నేను భావిస్తున్నాను. కశ్మీరీల ఆందోళనపై ప్రస్తుత ప్రభుత్వ కఠిన వైఖరిపట్ల చింతిస్తున్నవారు.. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి కఠిన వైఖరినే ప్రదర్శించాయని తెలుసుకోవాలి. ఏమంటే దాని వ్యక్తీకరణే కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమందిని చంపించింది. కానీ అది ఈ విషయంపై మృదువుగా మాట్లాడుతుంది. బీజేపీ కఠిన పదాలు వాడుతుంది. రెండు పార్టీల మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఇదే. తన ప్రజల అవసరాలు, హక్కులకు భిన్నంగా ఉండే ప్రాథమ్యాలపైనే భారత రాజ్యవ్యవస్థ పనిచేస్తూ వచ్చింది. భారత్ను లూఠీ చేస్తూ తన సొంత ప్రయోజనాల కోసం మన వనరులను తరలిస్తోందని మనం బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని విమర్శిస్తూంటాం. 1943 నాటి బెంగాల్ కరువు ఉదాహరణను యుద్ధ విధాన ఫలితంగా చూపుతుంటారు. ప్రజలు ఆకలిదప్పులకు గురవుతూ, అవిద్యావంతులుగా ఉన్న ప్రాంతంలో అది నిజంగా నీతిబాహ్యమైన ప్రవర్తనే. అయితే, ప్రజాస్వామ్య పం«థాలో ఇది ఎంత భిన్నంగా ఉందని నేను ఆశ్చర్యపోతుంటాను. గత సంవత్సరం భారత వాయుసేనకు 36 యుద్ధ విమానాలకోసం మనం రూ. 59,000 కోట్లు ఖర్చుపెట్టాం. ఈ ఏడు భారత నావికాబలగం కోసం 57 యుద్ధవిమానాలపై రూ. 50,000 కోట్లు ఖర్చుపెడుతున్నాం. సంవత్సరానికి రూ. 33,000 కోట్ల ఆరోగ్య బడ్జెట్ (వాస్తవానికి అరుణ్ జైట్లీ హయాంలో దీనిపై కోత విధించారు) ఉంటున్న దేశంలో ఇలా జరుగుతోంది. ప్రతి వారం 10 వేలమంది భారతీయ పిల్లలు పోషకాహార లేమి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ల కోసం మనం మరికొంత డబ్బు వెచ్చించలేం కానీ మన సాయుధబలగాల కోసం మాత్రం మరిన్ని ‘బొమ్మ’లను మాత్రం కొంటుంటాం. ఇది మాత్రం బ్రిటిష్ రాజ్ కాలం నాటి అనైతిక చర్య కాదా? ఈ కొత్త యుద్ధ విమానాలు మనకు తప్పనిసరి అవసరమేనా అని ఎవరైనా కేసు పెట్టగలరా? పెట్టలేరు. మన దేశంలో దీనిపై కనీసం చర్చకూడా జరపరు. దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయి. పైగా చాలా విషయాల్లో ప్రస్తుత ప్రధానమంత్రితో ఎవరైనా విభేదించవచ్చు కానీ తనకంటే ముందున్నవారు పాటించిన దాన్ని ఈయన కేవలం కొనసాగిస్తున్నారని మనం అంగీకరించక తప్పదు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
అడవిలో 16 కిలోమీటర్ల కాలినడక
గర్భిణీని జడ్డీలో మోసుకొచ్చిన ఆదివాసీలు చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆది వాసీలకు జడ్డీ మోత తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు ఏ కష్టం వచ్చినా జడ్డీ కట్టాల్సి వస్తోంది. మంగళవారం కూడా ఓ నిండు గర్భిణీని సుమారు 16 కిలోమీటర్లు.. అడవిలో జడ్డీలో మోసుకు రావాల్సి వచ్చింది. జిల్లాలోని చర్ల మండల సరిహద్దు చెన్నాపు రానికి చెందిన కుడుం రేష్మ నిండు గర్భిణీ. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభం కాగా, బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అరుుతే ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. విషయం తెలుసుకున్న కుర్నపల్లి ఆరోగ్య ఉపకేంద్రం సెకండ్ ఏఎన్ఎం గట్టుపల్లి రాజేశ్వరీ తన భర్త శేఖర్ సహాయంతో గ్రామానికి వెళ్లారు. గర్భిణిని సత్యనారా యణపురం వైద్యశాలకు తీసుకెళ్లేందుకు జడ్డీ కట్టించారు. రేష్మ భర్త ఉం గయ్య, బంధువుల సహకారంతో 16 కిలో మీటర్లు నడిచి మంగళవారం సాయం త్రానికి తిప్పాపురం శివారుకు చేరుకున్నారు. అక్కడ సెల్ఫోన్ సిగ్నల్ రావడంతో సత్యనారా యణ పురం ఫోన్ చేసి 108 అంబులెన్సను పిలిపిం చారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి సత్య నారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చగా.. అర్ధరాత్రి వరకు పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి అవకాశం లేదని గుర్తించారు. వెంట నే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా బుధవారం తెల్ల వారుజామున రేష్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యం గానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలిం చేందుకు కృషి చేసిన రాజేశ్వరి, ఆమె భర్త శేఖర్ను పలువురు అభినందించారు. -
పోరుబిడ్డకు జోహార్లు
జోడేఘాట్లో ఘనంగా కుమ్రం భీం వర్ధంతి హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, గృహనిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అటవీ సంక్షేమ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న తెలంగాణ సారథి ఆధ్వర్యంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా తరలివచ్చిన అడవి బిడ్డలు ఆసిఫాబాద్/కెరమెరి : జోడేఘాట్లో కొత్తగా నిర్మించిన భీం సమాధి వద్ద భీం మనవడు కుమ్రం సోనేరావు, ఆదివాసీ సంఘాల నాయకులు నాలుగు గోత్రాల జెండాలు ఎగురవేశారు. రాష్ట్ర గిరిజన , పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఎస్టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, టూరిజం ఎండీ కిష్టినా జెడ్ బోంగ్దూ, ఐటీడీఏ పీవో, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్, కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రజాప్రతినిధులు, అధికారులు భీంకు ఘనంగా నివాళులర్పించారు. టూరిజం కేంద్రంగా అభివృద్ధి – చందూలాల్, రాష్ట్ర మంత్రి జోడేఘాట్ను టూరిజం కేంద్రంతో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. భీం వర్ధంతి సందర్భంగా జోడేఘాట్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జోడేఘాట్ పర్యాటక కేంద్రానికి అనుకూలంగా ఉందని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కుమ్రం భీం వారసులు, ఆదివాసీల ఆత్మగౌరవం కాపాడేందుకే సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్కు కుమ్రం భీం జిల్లాగా నామకరణం చేశారన్నారు. భీం చేసిన పోరాటాల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. కుమ్రం భీం అసువులు బాసిన వీరభూమి వద్ద రూ.25 కోట్లతో మ్యూజియం, స్మృతి చిహ్నం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 51 గిరిజన ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలు, 119 బీసీ ఆశ్రమ వసతి గృహాలు, 100 ఎస్సీ ఆశ్రమ వసతి గృహాలు, 71 మైనార్టీ వసతి గృహాలు మంజూరు చేసినట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. పాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు – జోగు రామన్న, మంత్రి పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆసిఫాబాద్కు కుమ్రం భీం జిల్లాగా నామకరణం చేయడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. చిన్న జిల్లాలు ఆదివాసీల అభివృద్ధికి దోహద పడుతాయని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయన్నారు. గత ఏడు దశాబ్దాలుగా సమైక్య పాలకులు జోడేఘాట్లో వర్ధంతి సభకు అనుమతించలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి సీఎం కేసీఆర్ జోడేఘాట్ వర్ధంతి సభకు హాజరై ఆదివాసీ గిరిజనుల్లో ఆత్మసై్థర్యం నింపారన్నారు. రెండేళ్లలో జిల్లా అభివృద్ధి – ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రెండేళ్లలో కుమ్రం భీం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద కుమ్రం భీం విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. కొత్త జిల్లాలో గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని, భీం పేరుతో 31వ జిల్లాగా ఏర్పాటు కావడం ఆదివాసీల అభివృద్ధికి సంకేతమన్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలి – పేర్వారం రాములు, టీఎస్టీడీసీ చైర్మన్ చెట్లు, కొండలు, కోనలు, అడవులతో జోడేఘాట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని టీఎస్టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. దేశ విదేశీయులను ఆకట్టుకునేలా కుమ్రం భీం అసువులు బాసిన పుణ్యభూమిలో అడ్వంచర్ స్పోర్ట్స్ కేంద్రం ఏర్పాటు చేస్తే, ఇక్కడి ఆదివాసీ గిరిజనులకు సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయన్నారు. కుమ్రం భీమ్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. సీఎం హామీలు నెరవేర్చారు – కోవ లక్ష్మి, ఎమ్మెల్యే రెండేళ్ల క్రితం జోడేఘాట్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జోడేఘాట్లో భీం కాంస్య విగ్రహం, స్మృతి చిహ్నం, మ్యూజియం నిర్మాణం పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ భీం మనవడు సోనేరావుకు ఐదెకరాల భూమి, రూ.10లక్షల ఆర్థికసహాయం అందించినట్లు తెలిపారు. ఇద్దరు కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్కు కుమ్రం భీమ్ జిల్లాగా నామకరణం చేసి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయాలి – పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్సీ కుమ్రం భీం జిల్లాలోని సమితుల గుండం, సిర్పూర్ (యు)లోని మిట్ట జలపాతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ సూచించారు. గత ప్రభుత్వాలు జోడేఘాట్ వర్ధంతికి అధికారులు, ప్రజా ప్రతినిధులను అనుమతించలేదని, భీమ్ చరిత్రను మరుగున పడేలా చేశాయన్నారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జోడేఘాట్లో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారన్నారు. మంత్రుల వెన్నంటి ఉండాలి – కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే మొన్నటి వరకు ఒకే జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ నుంచి నాలుగు జిల్లాలుగా వేరైనప్పటికీ కుమ్రం భీం జిల్లా అభివృద్ధికి జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వెన్నంటి ఉండాలన్నారు. భీం జిల్లాలో సాగు నీటికి కొదవ లేదని, రాబోయే రోజుల్లో జిల్లాలోని ప్రాజెక్టులు పూరై్త వ్యవసాయాభివృద్ధి చెందుతుందన్నారు. మండలంలోని కుమ్రం భీం ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, త్వరలో మిగితా పనులు పూర్తవుతాయన్నారు. జిల్లాకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. భీం ఆశయ సాధనకు పాటుపడతా – చంపాలాల్, కలెక్టర్ కుమ్రం భీం ఆశయ సిద్ధికి పాటు పడతానని కలెక్టర్ చంపాలాల్ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కుమ్రం భీం తొలి జిల్లా కలెక్టర్గా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. మంచిర్యాల కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్తో మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షత వహించగా, టూరిజం ఎండీ కిష్టినా జెడ్ బోంగ్డూ, జేసీ అశోక్కుమార్, సబ్కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్, జెడ్పీటీసీ సభ్యులు అరిగెల నాగేశ్వర్ రావు, అబుల్ కలాం, ఏమాజీ, ఎంపీపీ సారాబాయి, ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొమరంభీం వర్థంతికి భారీగా ఆదివాసీలు
ఈ రోజు ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండు వీరుడు కొమరం భీం 76వ వర్థంతి సందర్భంగా అదికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి జోడెఘాట్కు భారీగా ఆదివాసీలు తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున గోండులు వస్తుండటంతో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల సౌలభ్యం కోసం ఆర్టీసీ జోడేఘాట్కు ఉచిత బస్ సర్వీస్లను నడుపుతోంది. మరి కొద్దిసేపట్లో జరగనున్న వర్థంతి వేడుకలకు మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
దండ కారణ్యంలో దడ
ఖమ్మం జిల్లా సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. ఈనెల 28నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. వారోత్సవాలకు ముందే జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు వరుస సంఘటనలకు పాల్పడుతున్నారు. సరిహద్దు మండలాల్లో పోలీస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి పురుడు పోసిన చారు మజుందార్ 1972 జూలై 28న మరణించారు. ఆయన సంస్మరణార్థం ఏటా దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో వారంరోజులపాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సరిహద్దున ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏటా జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ (కరీంనగర్, ఖమ్మం, వరంగల్), శబరి ఏరియా (చర్ల, వెంకటాపురం, చింతూరు) కమిటీల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించేవారు. ఇటీవల సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. అయితే సంస్మరణ వారోత్సవాలు సమీపించడంతో ఏకంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీల పేరుతో చర్ల, వెంకటాపురం మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. వారోత్సవాలను ఆదివాసీలు, గిరిజన ప్రజలు విజయవంతం చేయాలని ఈ మూడు కమిటీలు పిలుపునిచ్చాయి. రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్లు రావడం, వెంకటాపురం-భద్రాచలం రోడ్డులో మూడురోజుల క్రితం టిఫిన్బాంబు పెట్టి మావోయిస్టులు హల్చల్ చేయడంతో.. జిల్లా సరిహద్దుల్లోనే రాష్ట్ర కమిటీ మకాం వేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆదివాసీ సంతల్లో తనిఖీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు ఆదివాసీ సంతల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలు ఛత్తీస్గఢ్కు సరిహద్దున ఉండటంతో ఇక్కడ జరిగే వారాంతపు సంతలకు వచ్చే వారిపై నిఘాపెట్టారు. అలాగే, భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వాజేడు వరకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ పరిస్థితులతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆదివాసీలు ఆందోళనలో ఉన్నారు. -
ఆదివాసీ జిల్లా కోసం కదిలిన దండు
భారీగా తరలివచ్చిన ఆదివాసీలు జోడేఘాట్తో కూడిన కొమరం భీమ్ జిల్లా కోసం డిమాండ్ ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే కుట్రేనని ఆరోపణ కెరమెరి : ఆదివాసీ ప్రత్యేక జిల్లా కోసం ఆదివాసీల దండు కదిలింది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసీలు గురువారం భారీగా తరలి రావడంతో జోడేఘాట్ మరో సారి దర్బార్ను తలపించింది. హట్టి నుంచి జోడేఘాట్ వరకు వందలాది మందితో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కొమరం భీమ్ సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిరంగ సభలో ఆదివాసీ వక్తలు, వివిధ సంఘాల నాయకులు, ఆఇఫాబాద్ మాజీ ఎమ్మేల్యే ఆత్రం సక్కు, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం భగవంత్రావు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, ఆదివాసీ రచయితల సంఘం నేత మైపతి అరుణ్కుమార్, వరంగల్ అడ్వోకేట్ పాపాలాల్, ప్రోఫెసర్ నాగేశ్వరరావు, జేఏసీ జిల్లా నాయకులు కనక యాదోరావు, వెడ్మ బొజ్జులు మాట్లాడారు. ఆదివాసీలను విడదీసే కుట్రలో భాగమే జిల్లాల పునర్విభజన అని, అందరు ఆదివాసీలు కలిసికట్టుగాఉంటే రాన్ను కాలంలో ఏలుతారని భావించి సీఎం కేసీఆర్ కట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కొమురం భీమ్ మండలాన్ని వేరే జిల్లాలో కలిపి కెరమెరిని మాత్రం ఆదిలాబాద్ లో కలుపుతామని ప్రకటించడం సరికాదన్నారు. మాననాటే.. మావరాజ్ (మా గ్రామంలో మా రాజ్యం ) వస్తే మనం బాగుపడతామన్నారు. ఇందుకు ప్రత్యేక జిల్లా సాధించి తీరుదామన్నారు. ఇంద్రవెల్లి నుంచి కౌటాల వరకు 13 మండలాలల్లో ప్రత్యేక జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాలలో కొమురం భీమ్ విగ్రహం పెట్టనివ్వలేదు – కుంరం సోనేరావు గతంలో మంచిర్యాలలో తాత కొమురం భీమ్ విగ్రహం పెడతామంటే అరెస్ట్ చేశారు. మంచిర్యాలలో తాతకు అవమానం జరిగింది. అలాంటి జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ కొమురం భీమ్ మనవడు కొంమురం సోనేరావు అన్నారు. జోడేఘాట్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఐక్యమంత్యంతో ఉంటే ఆదివాసీ జిల్లా ను సాధించుకో గలుగుతామన్నారు. ఆసిపాబాద్ జిల్లా చేస్తే మంచిది – ఏమాజీ 27 సంవత్సారాలు ఆసిపాబాద్ జిల్లా ఉంది. అందుకు ఆసిఫాబాద్ జిల్లా చేస్తే మంచిదని జెడ్పీటీసీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఏమాజీ అన్నారు. జోడేఘాట్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 5 నుంచి 8 వందల ఎకరాలు వరకు ప్రభుత్వ భూమి ఉందని జిల్లా ఏర్పాటకు ఇది సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం కార్యాలయాలు సైతం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ఆసిపాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నైతం నారాయణ, జనార్ధన్, ఆత్రం లక్ష్మణ్, కోవ, అనక దేవ్రావు, కనక మాదవ్రావు, కుసుంబ్ రావు, సుగుణ, శేకర్, విజయ్కుమార్, మడావి కన్నిబాయి, వెంకటేశ్, బీజేపీ నాయకులు అంజనేయులు గౌడ్, పౌడల్, నాగేశ్వర్రావు, భీంరావు తదితరులున్నారు. -
గ్రీన్హంట్ను నిలిపివేయాలి: వరవరరావు
హైదరాబాద్: ఆదివాసీలను మట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 3వ దశ గ్రీన్హంట్ను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు అన్నారు. ఆదివాసీ, దళిత, మహిళ, మైనార్టీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, పోలీస్, పారామిలటరీ జరుపుతున్న హత్యాకాండలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన వరంగల్ పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఎదురుగా ఇస్లామియా కాలేజీ వరకు ర్యాలీ, అనంతరం బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ పోస్టర్ను స్వాతంత్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్తా, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరితో కలసి గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ దోపిడీకి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారని వారికి పాలకులు అండగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆదివాసీ సమాజాన్ని మ్యూజియం వస్తువుగా మార్చారని భారతదేశంలో కూడా చేసేందుకు యత్నిస్తున్నా వామపక్షాలు వారికి పూర్తిగా అండగా ఉండడంవల్ల సాధ్యం కావడంలేదని అన్నారు. -
సీపీఎం నాయకుడిపై ఆదివాసీల దాడి..
- దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మడివి రమేష్ పినపాక ఖమ్మం జిల్లా పినపాక మండలంలో సీపీఎం నాయకుడి పై వలస ఆదివాసీలు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వలస ఆదివాసీలకు నాయకుడు, సీపీఎం మండల కమిటీ సభ్యుడు మడివి రమేష్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఛత్తీస్గఢ్ నంచి వలసవచ్చిన ఆదివాసీలు మండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో సుందరయ్యనగర్లో నివాసం ఏర్పరచుకున్నారు.ఇది పూర్తిగా వలసవచ్చిన ఆదివాసీల కాలనీ. వీరందరికీ మడివి రమేష్ పెద్దదిక్కువగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గురువారం నలుగురు వ్యక్తులు రమేష్ దగ్గరకు వచ్చి తాము కూడా ఇక్కడే కూలీ పనులు చూసుకుని జీవిస్తామని చెప్పారు. రమేష్ ఇంట్లోనే బస చేసిన ఆ నలుగురు శుక్రవారం అతడిపై కత్తితో దాడి చేసి గోదావరి దాటి పారిపోయారు. తీవ్ర గాయాలైన రమేష్ను తొలుత భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం తరలించే ఏర్పాటు చేశారు. -
రామాలయం వద్ద ఆదివాసీల నిరసన
భద్రాచల రామాలయంలో ప్రైవేటీకరణ దిశగా చేపట్టే చర్యలపై ఆదివాసీలు నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆలయంలోని సీతారాముల విగ్రహాలను అమెరికాకు చెందిన సంస్థకు విక్రయించే యత్నాన్ని వారు నిరసించారు. దీంతో పాటు... ఆలయంలో వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఖండించారు. ఆదివాసీ యువతకు ఆలయంలో ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. -
మేడారంలో బుధవారం ‘మండమెలిగె’
వరంగల్ : సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం రోజున... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలలో జాతరకు శ్రీకారం చుడతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మేడారం జాతర లాంఛనంగా మొదలవుతుంది. మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజ కార్యక్రమాలను ‘మండ మెలిగె’ పేరుతో పిలుస్తారు. మండ మెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. మేడారం జాతర ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనుంది. మండ మెలిగె రోజు నుంచి మేడారం జాతర పూర్తయ్యే వరకు ఆదివాసీలు ప్రతి రోజు వన దేవతలకు పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగె రోజు నుంచే ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. ప్రధాన పూజారి(వడ్డె) నేతత్వంలోని బందం బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటుంది. గుడిని శుభ్రం చేస్తారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. మహా జాతరకు ఉపయోగించే సామగ్రిని శుద్ధి చేస్తారు. పసుపు, కుంకుమలు పెడతారు. ముగ్గులు వేసి శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. దుష్టశక్తులను నివారించేందుకు కోడిపిల్లను మామిడి తోరణాలకు కడుతారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం ఉదయం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేద్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే రకమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. -
అంగట్లో ఆదివాసీలు
భద్రాచలం కేంద్రంగా బ్రోకర్ల దందా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న అమాయకులపై వల ఉపాధి చూపుతామంటూ పలు ప్రాంతాలకు కూలీలుగా తరలింపు 2 వేల జీతంతో దుర్భర జీవితం అనుభవిస్తున్న గిరిపుత్రులు బతుకుదెరువు కోసం వచ్చి చాకిరీలో మగ్గిపోతున్న వైనం భద్రాచలం: అది భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్.. ఓ ప్రైవేటు బస్సు వచ్చి ఆగింది.. పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన గిరిజనులు బిలబిలమంటూ దిగారు.. వారిలో పిల్లాజెల్లా, మహిళలు, యువకులు ఉన్నారు.. అంతా లోకం పోకడ తెలియని అమాయకులే.. ఇంతలోనే వారిపై బ్రోకర్లు రాబందుల్లా వాలిపోయారు! ‘మాతో రండి.. మేం పని ఇప్పిస్తాం’ అంటూ వెంట పడ్డారు. వారందరినీ గుత్తగా మాట్లాడుకొని హైదరాబాద్, చెన్నై, విజయవాడ వంటి నగరాలతోపాటు ఇతర ప్రాంతాలకు కూలీలుగా పంపారు. వారిని పనిలో కుదుర్చుకున్న వారు నెలకు రెండు, మూడు వేల జీతమిచ్చి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారు. బోరింగ్, సిమెంట్ ఫ్యాక్టరీలు, వివిధ పరిశ్రమల్లో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అటు పని మానుకోలేక.. ఇటు ఇంటి దారి పట్టక అమాయక అడవి పుత్రులు నరకం అనుభవిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలూ చోటుచేసుకుంటున్నాయి. మరికొందరితో ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేయిస్తున్నారు. వారిని వివిధ ప్రాంతాలకు చేరవేసిన బ్రోకర్లు మాత్రం తమ కమీషన్ జేబులో వేసుకొని జారుకుంటున్నారు! ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా అన్నెంపున్నెం ఎరుగని ఆదివాసీలతో ఈ అమానవీయ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తన్నుకుపోయేందుకు పోటాపోటీ ప్రతి రోజూ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 200 నుంచి 300 మంది గిరిపుత్రులు భద్రాచలం వస్తున్నారు. వీరిని రాగానే తన్నుకుపోయేందుకు బ్రోకర్లు కాచుకొని కూర్చుంటున్నారు. గురువారం ‘సాక్షి’ పరిశీలనలో ఇది తేటతెల్లమైంది. సుమారు 40 మంది ఆదివాసీలు రాగానే అక్కడే ఉన్న మధ్యవర్తులు వారితో బేరసారాలకు దిగారు. కూలీ రేట్లు మాట్లాడిన వెంటనే వారిని అక్కడ్నుంచి ఆటోల ద్వారా భద్రాచలం, సారపాక ప్రాంతాల్లోని తమ అడ్డాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బ్రోకర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నేను ముందు మాట్లాడుకున్నానంటే నేనంటూ..’ ఇద్దరు బ్రోకర్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారిపోయాయి. కమీషన్ దండుకొని వదిలేయడమే.. వలస వచ్చే ఆదివాసీలను హైదరాబాద్, చెన్నై, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. బోర్లు వేసే పనులు, సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. కూలీలను పంపినందుకు మధ్యవర్తులకు సదరు కాంట్రాక్టర్ కమీషన్ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. ఇలా పంపించినందుకుగాను ఒక్కో కూలీకి బ్రోకర్కు రూ.3 వేల వరకూ కమీషన్ రూపంలో అందుతోంది. ఈ వ్యవహారం భద్రాచలంలో సిండికేట్లా మారింది. భద్రాచలం శివారులో బ్రోకర్లంతా ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దారుణ పరిస్థితుల మధ్య.. ఆదివాసీలు పనిచేస్తున్న చోట్ల దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయి. అక్కడ చాకిరీ, ఇబ్బందులు తట్టుకోలేక అనేక మంది పారిపోయి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు బ్రోకర్లు కమీషన్ల కోసం యువకులను స్మగ్లింగ్ వంటి పనులకు కూడా పంపుతున్నారు. ఇలా భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి వెళ్లిన పది మంది వరకు యువకులు గతంలో తిరుపతి సమీపంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించి ఆదివాసీలను కాపాడాలని మానవ హక్కుల సంఘాల నేతలు కోరుతున్నారు. -
కాటేస్తున్న దోమ
మన్యంలో ప్రబలుతున్న మలేరియా మంచానపడి ఆదివాసీలు విలవిల ముంచంగిపుట్టు మండలంలో 20 మంది మృతి: గిరిజన సంఘం మన్యంలో మలేరియా కసిగా కోరలు చాస్తోంది. వందలాది మంది మంచాన పడి అల్లాడిపోతున్నారు. గతేడాది గుర్తించిన కేసులను తలదన్నేలా ఈ ఏడాది మలేరియా పాజిటివ్ కేసుల నమోదుతో ఆదివాసీలు సతమతమవుతున్నారు. ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఈ మహమ్మారి ప్రబలకుండా చేయడంలో ప్రభుత్వశాఖలు విఫలమవుతున్నాయి. ఇతర కారణాల వల్లే చనిపోతున్నారంటూ పీహెచ్సీ అధికారుల నివేదికలతో పరిస్థితి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి వెళ్లడం లేదు. పాడేరు: మన్యాన్ని రోగాలు చుట్టేస్తున్నాయి. ముఖ్యం గా మలేరియా విజృంభిస్తోంది. ఎపిడమిక్కు వర్షాలు తోడవ్వడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీకి చెందిన మూడేళ్ల చిన్నారి సునంద సెరిబ్రల్ మలేరియాతో చనిపోయింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం, బాబుసాల, బుంగాపుట్టు, బరడ పంచాయతీల్లో మూడు నెలల్లో 20 మంది చనిపోయినట్టు తమ పరిశీలనలో వెల్లడయిందని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్శ తెలిపారు. ఏజెన్సీలో ఈ పరిస్థితి దృష్ట్యా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఆల్ఫా సైఫామిథ్రిన్ (ఏసీఎం 5%), యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్న మలేరియా నియంత్రణ సాధ్యపడటం లేదు. ఇప్పటికే ఏజెన్సీలో మలేరియా పాజిటివ్ కేసులు 6 వేలకు పైగా నమోదయ్యాయి. మారుమూలగూడేల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పరిస్థితి అదుపుతప్పు తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం లేదు. గిరిజనుల జీవన పరిస్థితులు కూడా మలేరియా విజృంభించడానికి ఊతమిస్తున్నాయి. ఇళ్లల్లో ఏసీఎం స్ప్రేయింగ్కు నిరాకరిస్తుండటంతోపాటు కొండవాగుల నుంచి సేకరించి తెచ్చిన నీటిని నిల్వ ఉంచుకోవడం, పశువులశాలలను గృహ ఆవరణలోనే ఉంచడం, పౌష్టికాహారం కొరత వంటివాటితో గిరిజనులు మలేరియాకు గురై చనిపోతున్నారు. వ్యాధి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రామాల్లో ఇందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మలేరియా జ్వరాల నిర్ధారణ కొరవడుతోంది. మరణాలు సంభవించినా తెలియని దుస్థితి. డాట్ ప్రోగ్రాం అమలు చేయాలి మలేరియా నియంత్రణకు ‘డాట్’ (డెరైక్ట్ ఆబ్జర్వేషన్ ట్రీట్మెంట్) పటిష్టంగా అమలు చేయాలి. దీనిని మలేరియాశాఖలో కొన్నేళ్ల క్రితం నిర్వహించే వారు. ఏజెన్సీలో ఇది కొరవడింది. జ్వర పీడితులు రెండు మూడు రోజుల్లో అపస్మారక స్థితిలో వెళ్లే పరిస్థితి ఉంటే అనుమానం లేకుండా సెరిబ్రెల్ మలేరియాగా గుర్తించ వచ్చు. మెడికేటెడ్ దోమ తెరలు కచ్చితంగా ప్రతి గిరిజన కుటుంబానికి పంపిణీ చేయాలి. - పి.రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో, విశాఖపట్నం. -
గిరిజనులను మోసం చేయొద్దు
- పోడు భూముల్లో హ రితహారం మానుకోవాలి - అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ సింహాద్రి ఝాన్సీ - ఆర్డీవో కార్యాలయం ముట్టడి ములుగు : తరతరాలుగా ఆదివాసీలు అడవినే నమ్ముకొనే జీవిస్తున్నారని, వారిని మోసం చేయడం తగదని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ కామ్రెడ్ సింహాద్రి ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల పోడు భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కామ్రెడ్ ఝాన్సీ మాట్లాడారు. అడవిలో లభించే సందప, పోడు వ్యవసాయం గిరిజనులకు జీవనాధారమని, వాటిని దూరం చేయాలని చూస్తే సహించేది లేదని మండిపడ్డారు. గిరిజనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ సాధిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ నేడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి పొట్టలు నింపుకున్నారని ఆరోపించారు. ఇప్పుడేమో గ్రామాల్లో పాత వెలుగులు తీసుకువస్తానని గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాడని, ఇది ఏ మేరకు సాధ్యపడుతుందో వేచి చూడాలని అన్నారు. సీపీఐఎంఎల్ కేంద్ర కమిటీ నాయకుడు గుర్రం విజయ్కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచిపోయి పేద ప్రజలపై నిత్యవసర సరుకుల ధరల భారం మోపుతోందని ఆరోపించారు. సమావేశంలో తెలంగాణ ైరె తు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి భూతం వీరన్న, నల్లాని స్వామిరావు, మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి బాదవత్ రాజు, వివిధ సంఘాల నాయకులు మోడెం మల్లేశం, పిట్టల సత్యం, ఈర్ల పైడి, పల్లెబోయిన స్వామి, బానోతు నరసింహ. మోడెం శ్రీలత, ఊకె ఎల్లక్క, బల్గూరి వెంకటరెడ్డి, ఐలన్న, చందర్, యాకూబ్, రాములు, ఎల్లన్న, ప్రసాద్, రాంచందర్, అశోక్, బాలకొమురు, భీమన్నలు పాల్గొన్నారు.