Amar Singh
-
‘ఆప్’కు మరో షాక్.. హర్యానా అభ్యర్థి కాంగ్రెస్లో చేరిక
చండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. నీలోఖేరి (రిజర్వ్డ్) స్థానం నుంచి పోటీలోకి దిగిన ఆప్ అభ్యర్థి అమర్ సింగ్ ఉన్నట్టుండి కాంగ్రెస్లో చేరారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సమక్షంలో అమర్ సింగ్ కాంగ్రెస్లో చేరారు.ఈ సందర్భంగా అమర్సింగ్ను కాంగ్రెస్లోకి స్వాగతిస్తున్నట్లు భాజ్వా ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, రాష్ట్రంలోని రైతులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీని ఓడించేందుకే తాను కాంగ్రెస్లో చేరానని పేర్కొన్నారు. నీలోఖేరి కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ గొండర్కు మద్దతు ప్రకటించానని, ఆయన తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉందని అన్నారు.బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడమే తన లక్ష్యమని, తాను తన అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తే, ఓట్ల విభజన జరిగి, బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్లో చేరానని అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఫరీదాబాద్ ఆప్ అభ్యర్థి ప్రవేశ్ మెహతా సెప్టెంబర్ 28న బీజేపీలో చేరారు. అక్టోబర్ 5న హర్యానాలో ఓటింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు -
రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ మరో ఎంపీ అమర్సింగ్ కూడా ఇదే కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్సభ ఒక బులెటిన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో అనర్హత వేటు పడకముందు రాహుల్ గాంధీ రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ ఎంపీ ఫైజల్ పి.పి.మొహమ్మద్ లోక్సభ సభ్యతాన్ని కూడా పునరుద్ధరించారు. ఆయనను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. -
అమర్సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో జన్మించిన అమర్సింగ్కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ కన్నుమూత
-
రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ కన్నుమూత
లక్నో : సమాజ్వాదీ పార్టీ మాజీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ (64) మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందుతూ కన్నుమూశారు. 2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని నెలల పాటు సింగపూర్లో వైద్య చికిత్స సైతం తీసుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్లోని అజమ్ఘర్లో జన్మించిన అమర్సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్సింగ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అమర్సింగ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్కు అత్యంత సన్నిహితుడు. -
అమితాబ్పై అమర్సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘బిగ్ బి’ పట్ల అతిగా ప్రవర్తించానని ఒప్పుకున్నారు. ‘ఈరోజు నా తండ్రి వర్ధంతి సందర్భంగా అమితాబ్ బచ్చన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఒకానొక సమయంలో మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చాను. చావుతో పోరాడి ఇప్పుడిలా ఉన్నాను. అమితాబ్బచ్చన్, ఆయన కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాను. వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అని అమర్సింగ్ ట్వీట్ చేశారు. మూత్రపిండం పాడవడంతో కొన్నేళ్ల క్రితం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఒకప్పుడు అమితాబ్కు ఆప్తుడిగా మెలిగారు. అయితే అమితాబే తమ స్నేహానికి ముగింపు పలికారని గతంలో అమర్ సింగ్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో అమర్సింగ్ మాట్లాడుతూ.. అమితాబ్, జయబచ్చన్ వివాహ సంబంధం సవ్యంగా సాగడం లేదని, వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. జయబచ్చన్ సమాజ్వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించొద్దని తనను అమితాబ్ హెచ్చరించారని అప్పట్లో అమర్సింగ్ తెలిపారు. అంతేకాదు అమితాబ్ అప్పుల్లో ఉన్నప్పుడు తాను ఎంతో సహాయం చేశానని, తాను జైలులో ఉన్నప్పడు కనీసం చూడటానికి కూడా రాలేదని వాపోయారు. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే చూడటానికి వచ్చారని, అప్పుటికే తన మనసు విరిగిపోయిందని.. అమితాబ్తో మాట్లాడటానికి మనసు రాలేదన్నారు. మనుషులు ఇంత అవకాశవాదులుగా ఉంటారా అని అమర్ సింగ్ వాపోయారు. అయితే అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తానే అత్యుత్సాహం ప్రదర్శించానని తాజాగా అమర్సింగ్ విచారం వ్యక్తం చేశారు. (రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్ప్రైజ్) -
వేడుకున్నా వదల్లే..
ట్రాఫిక్ పోలీసులకు చేతులెత్తి మొక్కుతూ.. కాళ్లావేళ్లా పడుతున్న ఈ పెద్దాయన పేరు అమర్సింగ్(55). మధ్యప్రదేశ్కు చెందిన ఈయన అక్కడ ఉపాధి లేక బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చింతల్ హెచ్ఎంటీ ప్రధాన రోడ్డులో చిన్న షెడ్డు వేసుకుని రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పోలీసులను బతిమిలాడుతున్న అమర్సింగ్ ఈక్రమంలో రోడ్డు పక్కనున్న అమర్సింగ్ షెడ్డును కూడా తొలగిస్తుండగా.. తన బతుకు నాశనం చేయొద్దంటూ అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ రమేష్సింగ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కాళ్లపై కూడా పడ్డాడు. అయినా అధికారులు కనికరం చూపకుండా అమర్సింగ్ షెడ్డును తొలగించి, సామగ్రిని జప్తు చేశారు. దాంతో బాధితుడు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా మరేం చేయలేకపోయాడు. ఇతడి లాగే మరికొందరు బడుగుల బతుకును అధికారులు కూల్చివేశారు. బడాబాబుల ఆక్రమణలపై కన్నెత్తి చూడలేని అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చిరుజీవులపై ప్రతాపం చూపుతున్నారని అక్కడి పరిస్థితిని గమనించిన కొందరు చెప్పుకోడం గమనార్హం. -
ఆ ఫోటోలు చూసి చనిపోవాలనుకున్న : జయప్రద
లక్నో : ‘అమర్ సింగ్ను నా గాడ్ఫాదర్గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్లైన్ లిటరేచర్ ఫెస్టివల్కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు. జయప్రద తొలుత సమాజ్వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్ఫాదర్గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు. -
సమాజ్వాది చీలిక వెనక అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహా కూటమి ఆవిర్భవించక ముందే సమాజ్వాది పార్టీలో చీలిక రావడం విచారకర పరిణామమే. పార్టీ వ్యవస్థాపక నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, తన అన్న కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ ‘సమాజ్వాది సెక్యులర్ ఫ్రంట్’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించారు. చీలికవైపు శివపాల్ యాదవ్ను ప్రోత్సహించిందీ తెరముందు నుంచి అమర్ సింగ్ అయితే, తెరవెనక నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అని నిస్సందేహంగా చెప్పవచ్చు! ఎందుకంటే శివపాల్ యాదవ్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి 24 గంటల ముందే అమర్ సింగ్ లక్నోలో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతో బీజీపీ పార్టీలో శివపాల్ యాదవ్కు సముచిత స్థానం కల్పించడం కోసం ఆ పార్టీ అధినాయకులతో మాట్లాడానని, అయితే చివరి నిమిషంలో శివపాల్ తన మనసు మార్చుకున్నారని చెప్పారు. శివపాల్ యాదవ్కు, అమర్ సింగ్కు మధ్యన మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. శివపాల్ కారణంగానే అమర్ సింగ్ రెండోసారి సమాజ్వాది పార్టీలోకి వచ్చారు. శివపాల్ యాదవ్ బీజేపీలో చేరడానికి బదులు సమాజ్వాది పార్టీని ఏర్పాటు చేశారంటే ఇందులో ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉండే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. శివపాల్ను పార్టీలో చేర్చుకోవడానికి బదులు కొత్త పార్టీని ఆయనతో పెట్టిస్తే రానున్న ఎన్నికల్లో అఖిలేష్ పార్టీని దెబ్బతీయవచ్చని, తద్వారా ఎస్పీ–బీఎస్పీ కూటమి విజయావకాశాలను అడ్డుకోవచ్చని అమిత్ షా ఆలోచించి ఉంటారు. యూపీలోని రెండు లోక్సభ, ఒక అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు సార్లు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్పూర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విజయోత్సాహంతో 2019లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఐక్యంగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నిర్ణయించుకోవడంతోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను కలుపుకొని మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఈలోగా శివపాల్ యాదవ్ రూపంలో పార్టీలో చీలిక రానుంది. పార్టీలో ఎంతో కాలం సీనియర్ నాయకుడిగా చెలామణి అయిన శివపాల్ యాదవ్కు పార్టీలో పలుకుబడి బాగానే ఉంది. అందుకనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన శివపాల్ యాదవ్కే అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మద్దతు ఇచ్చారు. పార్టీలో భిన్న శిబిరాలు ఏర్పడిన కారణంగా నాటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని గ్రహించిన పార్టీలోని శిబిరాలు ఎన్నికల అనంతరం కనీసం బయటకు ఐక్యంగానే ఉంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో శివపాల్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ‘గత ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్లో మార్పు వస్తుందని ఎదురు చూశాను. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. నాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు అలాగే ఫీలవుతున్నారు. నేను ఇక లాభం లేదనుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. మిగతా వారు కూడా వస్తారు’ అని శివపాల్ యాదవ్ తెలిపారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తనకు తన అన్న ములాయం సింగ్ యాదవ్ దీవెనలు ఉన్నాయని అయన చెప్పారు. ఆయన దీవెనలు ఉన్నా లేకపోయినా, ఆయన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరుతారనడంలో సందేహం లేదు. అందుకే అమిత్ షా, పార్టీలో చేరడానికి తన వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చిన శివపాల్ యాదవ్కు ఏదో విధంగా నచ్చచెప్పి కొత్త పార్టీ ఏర్పాటుకు పురిగొల్పి ఉంటారు. -
బీజేపీ మిత్రపక్షం నుంచి అమర్ సింగ్కు ఆహ్వానం
వారణాసి : సమాజ్వాదీ పార్టీ బహిష్కృ నేత అమర్ సింగ్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) తెలిపింది. ఆయనకు ఇష్టమైతే 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో పర్యటించిన సందర్భంగా అమర్ సింగ్కు అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమర్ సింగ్ స్పందిస్తూ ప్రధాని మోదీ, సీఎం యోగి అదిత్యనాథ్లకే తాను ఒటేస్తానని చెప్పడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా ఎస్బీఎస్పీ కూడా అమర్ సింగ్ను తమ పార్టీలోకి ఆహ్వానం పలకడం చూస్తుంటే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో నిలువనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్బార్ మంగళవారం వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ.. అమర్ సింగ్ ఒక పెద్ద నాయకుడు. ఒకవేళ ఆయనకు ఇష్టమైతే 2019 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అజాంఘడ్ లోక్సభ స్థానం(పొత్తులో భాగంగా తమ పార్టీకి వస్తే) నుంచి పోటీ చేయవచ్చన్నారు. అమర్సింగ్ వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అజాంఘడ్ ఎంపీగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఉన్నారు. మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్సింగ్ -
అఖిలేశ్కు అమర్సింగ్ ఝలక్!
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్(బీఎస్పీ) పార్టీలపై బహిష్కృత ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని, ఈ పార్టీలు రెండూ ఒకే నాణానికి చెరో వైపు అని వ్యాఖ్యానించారు. ఆదివారం లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమర్సింగ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మోదీ.. ‘కొందరు బహిరంగంగా పారిశ్రామికవేత్తలను కలవరు. కానీ, తెరవెనుక ఉండి కుట్రలు చేస్తారు. అలా పారిశ్రామికవేత్తలతో తెర వెనుక మంతనాలు జరిపేవారెవరో (ఎస్పీ, బీఎస్పీలనుద్దేశించి) అమర్ సింగ్కు తెలుసు’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమర్సింగ్ సోమవారం స్పందించారు. నిబద్దతో కూడిన రాజకీయాల్లో మీరెవరికి మద్దతిస్తారని నన్నడిగితే బబువా(పిల్లాడు), బువా(అత్త)లకు కాకుండా మోదీ, యోగి ఆదిత్యనాథ్లకే నా ఓటు అని చెప్తానని అమర్సింగ్ వ్యాఖ్యానించారు. అమర్సింగ్ తరచుగా అఖిలేశ్ యాదవ్ను బబువా అని, బీఎస్పీ అధినేత మాయవతిని బువా అని పిలవడం తెల్సిందే. బీజేపీలో చేరతారా? నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభిమానిస్తున్నట్టు చెప్పడం ద్వారా బీజేపీలో చేరాలన్న ఆకాంక్షను అమర్సింగ్ బహిరంగంగా వ్యక్తపరిచారు. అంతేకాదు తన జీవితం మోదీకి అంకితమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా, కాంగ్రెస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కమలం పార్టీలోకి రావాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
‘తెరచాటు వ్యక్తుల’తో బాబు రహస్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఊహించిందే జరుగుతోంది. లక్షల మంది డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే దిశగా తెర వెనుక పావులు కదులుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలోనే ఇది జరుగుతుండటం గమనార్హం. ప్రత్యేక హోదా సాధన పేరుతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ సంగతి పక్కనపెట్టి అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో తీరికలేకుండా గడిపారు. సుభాష్చంద్ర ఫౌండేషన్ చైర్మన్ సుభాష్ చందర్జీ, ప్రముఖ రాజకీయ నేత అమర్ సింగ్లతో చంద్రబాబు తను బస చేసిన చోట రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా తాజాగా వెలుగు చూశాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా దక్కించుకోవాలన్న అంశంపై మంతనాలు సాగించినట్లు సమాచారం. వెనక్కి తగ్గింది అందుకే.. తాము అనుకున్న పథకాన్ని అమలు చేసేందుకు అమర్సింగ్, సుభాష్లతో చంద్రబాబు భేటీ తరువాత సుభాష్ చంద్ర ఫౌండేషన్ కొత్త డ్రామాకు తెరలేపింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేస్తామంటూ హైకోర్టు సాక్షిగా చెప్పిన ఆ సంస్థ అందులో భాగంగానే అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు, అది చెల్లించాల్సిన అప్పులకు పొంతనే లేదని, అగ్రిగోల్డ్ టేకోవర్ తమకు ఆర్థికంగా ఎంతమాత్రం లాభసాటి కాదంటూ చేతులెత్తేసింది. ఇదే సమయంలో డిపాజిటర్ల పేరు చెప్పి అమర్సింగ్ను తెరపైకి తెచ్చింది. అమర్సింగ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని కోర్టుకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–తమ ఫౌండేషన్ సంయుక్తంగా అగ్రిగోల్డ్ స్థిరాస్తులను అభివృద్ధి చేసేలా అమర్సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి అగ్రిగోల్డ్ గ్రూపులో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామంది. సుభాష్చంద్ర ఫౌండేషన్ అమర్సింగ్ పేరును తెరపైకి తేవడంపై న్యాయమూర్తులు సైతం ఒకింత విస్మయానికి గురయ్యారు. కోర్టులో ఉన్న డిపాజిటర్లు ఖంగుతిన్నారు. ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన హైకోర్టు... తెర వెనుక వ్యక్తులతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలను నిర్ధారించుకునేందుకు వివరణ కోరింది. -
గొప్పింటి కష్టాలు
మహిళా క్రికెటర్లు ఎప్పుడో ఆడి గెలిచిన ఆటకు ఇప్పుడాయన ట్వీట్ చేశారని ఉమెన్ ప్లేయర్స్ హర్ట్ అవడంతో అమితాబ్ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. బచన్స్ ఫ్యామిలీకి గ్రహాలు ఫర్గా ఉన్నట్లు లేవు! శ్రీదేవి చనిపోడానికి కొన్ని గంటల ముందు అమితాబ్ బచన్ ట్విట్టర్లో తాత్వికంగా.. ‘ఏదో జరగబోతోందని నా మనసుకు అనిపిస్తోంది’అని చిన్న ట్వీట్ పడేయడం పెద్ద టాపిక్ అయింది! అదయ్యాక.. ‘కంగ్రాట్స్.. ఉమెన్ క్రికెట్ చాంపియన్స్’ అని ఆయన ట్వీట్ చెయ్యడం కూడా ఇష్యూ అయింది. మహిళా క్రికెటర్లు ఎప్పుడో ఆడి గెలిచిన ఆటకు ఇప్పుడాయన ట్వీట్ చేశారని ఉమెన్ ప్లేయర్స్ హర్ట్ అవడంతో అమితాబ్ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చుట్టూ డాక్టర్లు ఉన్నారు! షూటింగ్లో కాస్ట్యూమ్స్ బరువు ఎక్కువై ఆయనకు నెక్ పెయిన్, బ్యాక్పెయిన్ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇక్కడ పాలిటిక్స్లో ఆయన భార్య జయాబచన్ కూడా ఉత్తి పుణ్యానికి మాటలు పడాల్సి వస్తోంది! సమాజ్వాదీ పార్టీలోంచి బీజేపీలోకి వెళ్తూ వెళ్తూ నరేశ్ అగర్వాల్ అనే ఆయన.. ‘డాన్స్ చేసుకునేవాళ్లతో నాకెందుకు పోటీ’ అని కామెంట్ చేసి మరీ వెళ్లాడు! జయ కారణంగానే తనకు రాజ్యసభ టిక్కెట్ రాలేదని ఆయన ఉక్రోషం. ఆ కామెంట్కు జయ హర్ట్ అవలేదు. రియాక్ట్ అవలేదు. ఆ తర్వాత సేమ్పార్టీ లీడర్ అమర్సింగ్ జయను కామెంట్ చేశారు. ఆమెకు మాస్ ఫాలోయింగ్ లేదట. జనంలో కలవలేదట. హోప్లెస్ అట. జయ పలక పట్టుకున్న స్కూల్ పిల్లలా టైమ్కి రాజ్యసభకు వచ్చి, లాంగ్ బెల్ కొట్టగానే ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్లిపోతుందట. ఆమె కంటే హేమమాలిని చాలా బెటర్ అట. ఈ మాటలకు కూడా జయ రియాక్ట్ కాలేదు. ఇక అభిషేక్, ఐశ్వర్యలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో లోకానికి తెలియడం లేదు. వాళ్లిద్దరి పెళ్లికి ముందు అమితాబ్ ఫ్యామిలీ పెద్ద హోమం చేసింది. అలాంటి హోమం ఏదైనా మళ్లీ జరిగితే తప్ప ఈ పెద్దింటి వారికి చిన్నచిన్న చికాకులు తప్పేలా లేవు. -
శ్రీదేవి చనిపోయాక బోనీ ఫస్ట్ ఫోన్కాల్
సాక్షి, న్యూఢిల్లీ : నటి శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తేలితే తప్ప ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో బోనీ కపూర్ను విచారణ చేపట్టాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన అధికారులు.. కాల్ లిస్ట్లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఓ జాతీయ మీడియా అమర్ సింగ్ను ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ‘అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో బోనీ కపూర్ నాకు కాల్ చేశారు. సెల్ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండటంతో నేను గుర్తించలేకపోయా. తర్వాత నా ల్యాండ్ నంబర్కు ఫోన్ చేశారు. ‘బాబీ ఇక లేదు’ అని గద్గద స్వరంతో ఆయన నాకు చెప్పారు. అయితే అది మాట్లాడే తరుణం కాదనుకుని ఫోన్ పెట్టేశాను. బహుశా ఆ వార్త బోనీ మొదట చెప్పింది నాకే అయి ఉండొచ్చని భావిస్తున్నా’ అని అమర్ సింగ్ పేర్కొన్నారు. ‘శ్రీదేవి-బోనీ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఇది నిజంగా ఎవరూ ఊహించని ఘటన. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. వారికి ఎలాంటి అప్పులు లేవు. ఆర్థికంగా వారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది’ అని అమర్ సింగ్ తెలిపారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే... శ్రీదేవి చనిపోయే ముందు రోజు బోనీ కపూర్, అమర్సింగ్లు లక్నోలో ఇన్వెస్టర్ల సమ్మిట్కు హజరు అయ్యారు. అయితే అక్కడ అమర్ సింగ్కు అవమానం జరగటంతో ఆయన బహిష్కరించి ఢిల్లీకి వెళ్లిపోగా.. బోనీ శ్రీదేవి సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లినట్లు ఆ కథనం ఉటంకించింది. ఇక ఇప్పటిదాకా కేవలం ఆయన కాల్ డేటాను పరిశీలించిన దుబాయ్ పోలీసులు అసలు బోనీ కపూర్ను విచారణే చేపట్టలేదని ఖలీజ్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆదివారం మృతదేహానికి పరీక్షలు నిర్వహించే సమయంలో కేవలం ఎలా జరిగింది అన్న వివరణ తీసుకుని బోనీని హోటల్కు పంపించేశారంట. కేసు ప్రాసిక్యూషన్ విభాగానికి అప్పజెప్పిన నేపథ్యంలో నేడు ఇంటరాగేషన్ కోసం బూర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా బోనీని కోరినట్లు సమాచారం. శ్రీదేవికి మద్యం అలవాటు లేదు -
‘శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదు’
న్యూఢిల్లీ : ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని ఆయన తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె వైన్ మాత్రం తీసుకునేవారని అమర్ సింగ్ పేర్కొన్నారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమునాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఆమె మృతిపై లోతైన విచారణ చేపట్టాలన్నారు. శ్రీదేవి మృతి ఘటనపై అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాను మాట్లాడినట్లు అమర్ సింగ్ తెలిపారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి, శ్రీదేవి మృతదేహాన్ని భారత్కు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె భౌతికకాయం సోమవారం రాత్రికి ముంబై చేరే అవకాశం ఉన్నట్లు అమర్ సింగ్ పేర్కొన్నారు. కాగా శ్రీదేవీ మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ యూఏఈ ఆరోగ్యశాఖ సోమవారం ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి నీటి టబ్లో పడిపోవడం వల్లే మృతి చెందినట్టు పేర్కొంది. అయితే శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొది. అయితే ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని ఫోరెన్సిక్ నివేదికలో ప్రస్తావించలేదు. మరోవైపు శ్రీదేవి భర్త బోనీకపూర్ను దుబాయ్ పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కాగా ఈ కేసు విచారణను పోలీసులు...దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. -
అమర్సింగ్ నోట అగ్రిగోల్డ్ మాట!
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. శనివారం విజయవాడ విచ్చేసిన ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాలని ఆయన అభిలషించారు. సోదరుడు సుభాష్ చంద్ర తన ఫౌండేషన్ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. లాభాపేక్షతో ఈ కార్యక్రమం చేపట్టలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చటానికే ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబుతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావు, కుటుంబరావు తదితర అధికారులు అందిస్తోన్న సహకారం మరువలేనిదన్నారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని హామీయిచ్చారు. రాజకీయాలు మాట్లాడటానికి దేవాలయం వేదిక కాదని, మరోసారి వచ్చినపుడు రాజకీయాల గురించి మాట్లాడతానని అమర్సింగ్ అన్నారు. -
‘రాజకీయ వేశ్యలా వాడుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ తనను ఒక రాజకీయ వేశ్యలా వాడుకునేందుకు ప్రయత్నించారంటూ.. అమర్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. చాలాకాలంగా క్రియాశీల రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న అమర్సింగ్ తాజాగా ములాయంపై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు రేగి అఖిలేశ్ యాదవ్ పార్టీ పగ్గాలు అందుకున్న సమయంలో ములాయం, రామ్గోపాల్ యాదవ్ ఎవరికీ తెలియకుండా నన్ను కలిసేందుకు ప్రయత్నించారని అమర్సింగ్ వెల్లడించారు. ఒకదశలో అఖిలేశ్కు భయపడిన ములాయం, రామ్గోపాల్ యాదవ్లు రాత్రి సమయంలో దొడ్డిదారిగుండా.. వచ్చి కలుస్తామని చెప్పారన్నారు. అంతేకాక తమ మధ్య జరిగే సమావేశాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని వారు కోరినట్లు అమర్సింగ్ తెలిపారు. ములాయంతో ఉంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్ ఉండదని.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మంగళవారం తన వద్ద వాపోయారని చెప్పారు. ఇదిలా ఉండగా.. తాను ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలోనే కొనసాగుతున్నాని అమర్ సింగ్ ప్రకటించారు. అయితే పార్టీలో ఎటువంటి పాత్ర పోషించడం లేదని చెప్పారు. -
‘అఖిలేశ్తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్
తనకు అఖిలేష్ యాదవ్తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లిపెద్ద అమర్సింగ్ మీద సీఎం భార్య డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను తాను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. కనీసం తన పిల్లలను టీవీలో కూడా అమర్ సింగ్ ముఖం చూడనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందని తాను ఒకసారి ములాయం సింగ్ యాదవ్కు చెప్పినట్లు అమర్ సింగ్ అన్న విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి మనుషులను తాను పట్టించుకోనని, టీవీలో ఆయన ముఖం వస్తే వెంటనే టీవీ కట్టేస్తానని, తన పిల్లలకు కూడా ఆయన ముకం టీవీలో చూపించబోనని డింపుల్ అన్నారు. అఖిలేష్ యాదవ్కు, ఆయన తండ్రి ములాయంకు మధ్య తగాదాలకు అమర్ సింగే ప్రధాన కారణమన్న వాదన ఒకటి ఉంది. అమర్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతే పార్టీలో ముసలం మొదలైంది. మైనర్పై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్వాదీ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆమెను అడగ్గా.. అది వాస్తవం కాదని, తాము చట్టాన్ని గౌరవిస్తామని, నేరం చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
అదంతా ములాయం నాటకం: అమర్సింగ్
-
అదంతా ములాయం నాటకం: అమర్సింగ్
న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్’ అంతా తూచ్ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్సింగ్. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్ యాదవ్ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్ బాంబు పేల్చారు. ‘ములాయం, అఖిలేశ్ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్ ఎన్–న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు. మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ ములాయం. కాంగ్రెస్తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు. -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్పై అమర్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!?
దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చారు. అందరూ తనవారేనంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఒకప్పుడు బద్ధ శత్రువుగా పరిగణించిన అమర్సింగ్ను ఉద్దేశించి సైతం 'అంకుల్' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఓ హిందీ చానెల్ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన అఖిలేశ్ తన వర్గం, కుటుంబం అంతా ఒక్కటే అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. తండ్రి ములాయం సింగ్ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన సమాజ్వాదీ (సోషలిస్ట్). ఇంట్లో, బయటా ఒకేవిధంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు' అని అన్నారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తంచేస్తూ.. 'నా కొడుకుపై నేనెప్పుడైనా ఈవిధంగా కోప్పడగలనా? అని అనుకున్నాను' అని పేర్కొన్నారు. ములాయం పలుసందర్భాల్లో బాహాటంగానే అఖిలేశ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బహిరంగంగా అఖిలేశ్ పాలనను ఆయన విమర్శించారు కూడా. ఇక, తనను ఎస్పీ నుంచి గెంటేశారని అమర్సింగ్ ఒకవైపు ఆవేదన చెందుతుండగా.. ఆయన మంచి వ్యక్తి అని, తమ కుటుంబాన్ని ఎంతోగానో ప్రేమిస్తారని అఖిలేశ్ సాంత్వనపూరిత వ్యాఖ్యలు చేశారు. -
‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’
ముంబై: సమాజ్ వాదీ పార్టీలో పరివార్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మరో బాంబు పేల్చారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని తెలిపారు. అత్తాకోడళ్లు జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ కు పడడంలేదని అమర్ సింగ్ చెప్పినట్టు ‘ఏబీపీ మజ్హా’ వార్తా సంస్థ పేర్కొంది. ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా చూపుతుందని ఆయన వాపోతూ... ‘నేను అమితాబ్, జయబచ్చన్ లను కలిసే నాటికి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో ఉంటే, మరొకరు జానక్ లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్యరాయ్ మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు ఊహాగానాలు వచ్చాయి. దీనికి నేను బాద్యుడిని కాద’ని అన్నారు. సమాజ్ వాదీ పార్టీలో చేరొద్దని జయను అమితాబ్ హెచ్చరించారని గతంలో అమర్ సింగ్ చెప్పారు. మొదట్లో అమర్ సింగ్ తో సన్నిహితంగా మెలగిన అమితాబ్ తర్వాత ఆయనను దూరం పెట్టారు. అమర్ సింగ్ వ్యాఖ్యలపై బచ్చన్ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
'ప్రాణాలతో వెళ్లవని బెదిరించాడు'
న్యూఢిల్లీ: అఖిలేశ్పై తాను చేసిన ప్రశంసలు తేనెపూసిన మాటలు కావని బహిష్కృత నేత అమర్సింగ్ అన్నారు. సమాజ్వాదీ పార్టీలో పునరాగమనం కోసం తాను అఖిలేశ్ను పొగడ లేదని చెప్పారు. సైకిల్ గుర్తును ఎన్నికల కమిషన్(ఈసీ) అఖిలేశ్కు కేటాయిస్తూ చేసిన ప్రకటన అనంతరం అమర్సింగ్ అఖిలేశ్పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. పార్టీలో ముసలానికి కారణం అఖిలేశేనని అమర్సింగ్ గతంలో విమర్శించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం బాధను కలిగించిందని ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన తర్వాతి నుంచి రామ్గోపాల్ యాదవ్ తనను ఓడిపోయిన పోట్లగిత్తలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తనను చంపేస్తానని పలు మార్లు రామ్గోపాల్ యాదవ్ బెదిరించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాణాలతో వెళ్లలేవని రామ్గోపాల్ యాదవ్ అన్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన అమర్సింగ్కు ఈ మధ్య కాలంలోనే భద్రతను జెడ్ కేటగిరీకి పెంచారు. కేంద్ర రక్షణా సంస్ధల ఆదేశాల మేరకే అమర్సింగ్కు భద్రతను పెంచినట్లు ఓ అధికారి తెలిపారు. -
ములాయం సింగ్ యాదవ్కు మరో షాక్!
-
ములాయంకు మరో షాక్!
లండన్: సమాజ్వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్ యాదవ్కు మరో షాక్! ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాజీ సిద్ధపడ్డాడో.. ఆ ప్రియనేస్తం అమర్సింగ్ బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం! సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలకు అసలు కారకుడిగా, 'శకుని మామ'గా విమర్శలు ఎదుర్కొన్న అమర్ సింగ్.. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం వెలువడకముందే లండన్ వెళ్లిపోయారు. 'నేను ఎప్పటికీ నేతాజీ(ములాయం) మనిషినే'అని పలుమార్లు బల్లగుద్దిచెప్పిన అమర్సింగ్.. సడన్గా సైడ్ మార్చారు. మంగళవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ('సైకిల్'పై అఖిలేశ్ అనూహ్య నిర్ణయం) "ఈసీ తీర్పుకు ముందే ఒక విషయం స్పష్టంగా చెప్పా.. నేను ములాయంవైపుగానీ, అఖిలేశ్వైపుగానీ లేను! ప్రస్తుతం లండన్లో ఉన్నా! సమాజ్వాదీ పార్టీ నాపై వేటు వేసింది. దాన్ని నేను అంగీకరిస్తున్నా. అమిత్షాతో మంతనాలు జరిపానని అందరూ అంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా, నేను బీజేపీలో ఎప్పుడు చేరబోయేది అందరికీ చెప్పాకే చేరుతా" అని అమర్సింగ్ అన్నారు. (స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!) అఖిలేశ్లపై తనకున్న ప్రేమ గొప్పదని, ఖల్నాయక్(విలన్) అన్నా, శకుని అన్నా భరించగలిగే ఓపిక తనకుందని అమర్సింగ్ పేర్కొన్నారు. 'ఏది ఏమైనా నేతాజీ(ములాయం) మాత్రం నన్ను విలన్గా చూడరు'అని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల గుర్తును గెలుచుకున్నవాళ్లు చెడ్డవాళ్లనో, ఓడినవాళ్లు మంచివాళ్లనో అనలేం, ఆమేరకు జరిగిన ప్రయత్నాలు సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ అభివర్ణించలేమని అమర్సింగ్ అన్నారు. అమర్ ప్రస్తుతం ఎస్పీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) -
అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం
లక్నో: సమాజ్వాదీ పార్టీలో, ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్కు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. యూపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. చికిత్స కోసం త్వరలో లండన్కు వెళ్తున్నట్టు అమర్ సింగ్ చెప్పారు. మార్చి చివర్లో మళ్లీ స్వదేశానికి తిరిగి రానున్నారు. ‘నేను గతంలో లండన్లో చికిత్స చేయించుకున్నాను. పార్టీ నుంచి పిలుపు రావడంతో మధ్యలో వచ్చేశాను. చికిత్స పూర్తిగా చేయించుకోవడానికి ఇప్పుడు మళ్లీ లండన్ వెళ్తున్నాను. తర్వాత సింగపూర్కు వెళ్తాను. మార్చి చివర్లో తిరిగి వస్తాను’ అని అమర్ సింగ్ చెప్పారు. ఆ సమయానికి యూపీలో ఎన్నికలు పూర్తవుతాయి. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ములాయం కుటుంబంలో విభేదాలకు అమర్ సింగే కారణమని ముఖ్యమంత్రి అఖిలేష్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక అఖిలేష్ వర్గం అమర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించింది. అఖిలేష్ వెంట పార్టీలో అత్యధికమంది నాయకులు ఉండగా.. ములాయం వెంట సోదరుడు శివపాల్, అమర్ సింగ్తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పార్టీ గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు పోరాడుతున్నాయి. ఈసీని కలసి సైకిల్ను తమకే కేటాయించాలని విన్నవించారు. ములాయం వెంట అమర్ సింగ్ కూడా వెళ్లి ఈసీని కలిశారు. ఈ నేపథ్యంలో లండన్ వెళ్లాలని అమర్ సింగ్ చెప్పడం ఎస్పీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిలేష్ డిమాండ్ మేరకు ములాయం తన సన్నిహితుడు అమర్ సింగ్ను కొన్నాళ్లు పక్కనపెట్టారా? లేక తానే దూరంగా ఉండాలని అమర్ భావిస్తున్నారా? ఈ రెండు కారణాలు గాక ఆయన చికిత్స కోసమే లండన్ వెళ్తున్నారా అన్నది ఎస్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
-
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
లక్నో: అందరం కలిసి ఉండేందుకు తాము ఏం చేసేందుకైనా సిద్ధం అని సమాజ్ వాది పార్టీ నేత, ఎస్పీ కుటుంబంలో చిచ్చురేగడానికి కారణమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అన్నారు. ఎస్పీ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని, అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా, బలిదానానికైనా తాను సిద్దంగా ఉన్నానని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను వేడుకుంటూ అమర్ సింగ్ చెప్పారు. దాదాపు చీలిపోయిన ఎస్పీ భవితవ్యం రేపు ఎన్నికల కమిషన్ ముందు తేలనున్న నేపథ్యంలో అమర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను, ములాయం సోదరుడు శివపాల్ మట్టిలాంటి వాళ్లం. మమ్మల్ని శిల్పాలుగా తీర్చిదిద్దింది ములాయం సింగ్ యాదవ్. మేమిద్దరం ఆయనకు రెండు భుజాలలాంటివాళ్లం. అలాంటి నామీద, సోదరుడు శివపాల్ యాదవ్ మీద విషం చిమ్మారు. మనిద్దరివీ అద్దాల మేడలే. నేనూ ఆలోచిస్తా.. నువ్వు కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో నీ చేతిలో ఆ రాళ్లెందుకు? ఎందుకీ మొండి పట్టుదల? అసలు నువ్వెందుకు అలిగావు? ఇంట్లోని నిప్పువల్లే ఇంటికి మంట అంటుకుంది. మేం కలిసే ఉండాలనుకుంటున్నాం. నేను చేతులు జోడించి వేడుకోవాలనుకుంటున్నా.. ఇంకేం తీసుకోవాలనుకుంటున్నావు? రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. శివపాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబం విడిపోకూడదని, మనమంతా ఒక్కటిగానే ఉండేందుకు మేం అన్నిరకాల త్యాగాలు, బలిదానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను రాజీనామా చేయడానికి ప్రయత్నించాను. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నిరకాల బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ అఖిలేశ్కు మీడియా ద్వారా అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మరోపక్క, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా స్పందిస్తూ 'ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేతాజీ పుణ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వెంటే ఉంటాను' అని అన్నారు. -
దింపుడు కల్లం ఆశలో ములాయం
సమాజ్వాదీ పార్టీ చీఫ్ (?) ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని తండ్రీకొడుకులు ఫైట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు చివరిసారిగా తన వాదనను వినిపించేందుకు పెద్దాయన సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు ముమ్మర ప్రయత్నాలు చేసినా రెండు వర్గాలు కలవడం మాత్రం అసాధ్యం అని తేలిపోవడంతో.. ఇక తన వెంట ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్ను తీసుకుని హస్తినకు చేరారు. ఎన్నికల కమిషన్ ముందు సోమవారం తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే, ఈసారి వాళ్లిద్దరితో పాటు అమర్సింగ్ కూడా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పార్టీలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెబుతూనే మరోవైపు ఇలా ఎన్నికల గుర్తు కోసం ములాయం పోరాడాల్సి రావడం ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే చాలా క్లిష్ట సమయం అని పరిశీలకులు అంటున్నారు. ఇక పార్టీపై తిరుగులేని పట్టు తనకే ఉందని చెబుతున్న అఖిలేష్ వర్గం.. దాదాపు ఆరు పెట్టెల నిండా భారీ మొత్తంలో అఫిడవిట్లను తీసుకెళ్లి ఎన్నికల సంఘానికి సమర్పించింది. శనివారం నాడు ఎన్నికల కమిషనర్ సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీని అఖిలేష్ వర్గం కలిసింది. రాంగోపాల్ యాదవ్, సురేంద్ర నాగర్, సునీల్ సాజన్.. ఈ ముగ్గురూ కలిసి అఫిడవిట్లు సమర్పించారు. సోమవారంతో గడువు ముగుస్తుండటంతో.. ఇక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే నిర్ణయం వినడానికి రెండు వర్గాలు ఉత్కంఠగా ఉన్నాయి. దాదాపుగా తమకు పార్టీ గుర్తు రావడం ఖాయమైపోయిందని, అధికారికంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ఒక్కటే మిగిలిందని అఖిలేష్ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ చెబుతున్నారు. ఇదే నిజమైతే పాతికేళ్లుగా ములాయం పడిన కష్టం మొత్తం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. -
అమర్ సింగ్కు జెడ్ కేటగిరి భద్రత
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ములాయం సింగ్ సన్నిహితుడు అమర్ సింగ్కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అమర్ సింగ్కు తక్షణం భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో తీవ్ర విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గంలో ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వర్గంలో సోదరుడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్తో పాటు కొందరు మాత్రమే మిగిలారు. అమర్ సింగ్ను అఖిలేష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో అమర్ సింగ్కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులకు భద్రత తగ్గించారు. ఇటీవల అమర్ సింగ్కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మళ్లీ భద్రత పెంచింది. -
అఖిలేశ్ను పెంచింది ఈ ‘శకుని మామే’..!
- పార్టీలో పరిణామాలపై ఎంపీ అమర్ సింగ్ భావోద్వేగం లక్నో: ‘అఖిలేశ్ నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి నాకు తెలుసు. అతని చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం.. అన్నింటిలోనూ తోడ్పడ్డా. ‘నా’ అనుకున్నవాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దనుకుంటే ఎంత బాధపడతామోకదా! ప్రస్తుతం నాదీ అలాంటి పరిస్థితే. అఖిలేశ్ నా గురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె బరువెక్కిపోతుంది..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అమర్సింగ్. (సమయం లేదు మిత్రమా.. త్యాగం తప్పదు) పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్తో కలిసి శుక్రవారం ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన అమర్సింగ్.. ఎయిర్పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేశ్ డిమాండ్ చేయడం బాధాకరం. సొంతవాళ్లే మనని ద్వేషిస్తూ ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి నాకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి పార్టీలో పెద్దాయనే(ములాయమే) సుప్రీంగా ఉండాలి. రెండు, అఖిలేశ్ రాజకీయాల్లో ఇంకా ఉన్నతస్థానానికి ఎదగాలి. ఇంతకు మించి నాకేదీ అక్కర్లేదు’ అని అమర్సింగ్ అన్నారు. (బాబాయ్ అబ్బాయ్ భేటీ) ఇదిలాఉంటే, ఢిల్లీ నుంచి తిరిగివస్తోన్న తండ్రి(ములాయం)కి లక్నో ఎయిర్పోర్టులో స్వాగతం పలుకుదామనుకున్న సీఎం అఖిలేశ్.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ములాయం వెంట అమర్సింగ్ కూడా ఉండటమే అందుకు కారణమని, ‘శకుని మామ వెంటుంటే మనమెలా వెళతాం?’అని అఖిలేశ్ వ్యాఖ్యానించినట్లు ఆయన అనునాయులు పేర్కొన్నారు. తండ్రి ప్రాపకంతో తనకు వ్యతిరేకంగా ఎత్తులువేస్తోన్న అమర్సింగ్ను అఖిలేశ్ ‘శకుని మామ’గా అభిర్ణించడం పార్టీలోని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. (టార్గెట్ 300: అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?) -
బాబాయ్ అబ్బాయ్ భేటీ
► అనంతరం ములాయంతో శివ్పాల్ మంతనాలు.. తేలని రాజీ చర్చలు ► ఎస్పీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ అమర్సింగ్ సంకేతాలు లక్నో: ఒక రోజు రాజీ చర్చలు, మరో రోజు ఆధిపత్య పోరుతో సమాజ్వాదీ రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. పార్టీ ప్రక్షాళనకు అఖిలేశ్ సిద్ధమవడంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన బాబాయ్ శివ్పాల్ శుక్రవారం అఖిలేశ్తో చర్చలు జరిపారు. అనంతరం ములాయంను కలిసి చర్చల సారాంశాన్ని వివరించినా రాజీపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తండ్రితో రాజీ కోసం బయలుదేరి... సంధి ప్రయత్నాల్లో భాగంగా గురువారం రాత్రే తండ్రిని కలిసేందుకు అఖిలేశ్ నిర్ణయించారు. ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న తండ్రికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాలని మొదట భావించినా... ములాయం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో అమర్సింగ్ కూడా ఉన్నారన్న వార్తలతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇదే సమయంలో ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి అఖిలేశ్ వర్గం సంతకాల సేకరణ చేపట్టింది. చివరి ప్రయత్నంగా తండ్రికి అఖిలేశ్ ఫోన్ చేసి పార్టీపై 3 నెలల పాటు నియంత్రణ ఇవ్వాలని కోరినా... చర్చలు ఫలించలేదు. అఖిలేశ్ వర్గం మొత్తం 229 మంది ఎమ్మెల్యేలకు గాను 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలకు 56 మంది , 24 మంది ఎంపీల్లో 15 మంది, 5 వేల మంది ప్రతినిధుల నుంచి సంతకాలు సేకరించింది. ఈసీకి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. పార్టీలో మార్పులతో కలవరం శివ్పాల్ నియమించిన జిల్లా అధ్యక్షుల్ని తొలగించి తన అనుకూల నేతల్ని నియమించేందుకు శుక్రవారం అఖిలేశ్ కసరత్తు మొదలుపెట్టడంతో రాయబారం కోసం శివ్పాల్ యాదవ్ హడావుడిగా సీఎం నివాసానికి వెళ్లారు. ఇదే సమయంలో పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ ఎస్పీ ఎంపీ అమర్ సింగ్ కూడా పరోక్ష సంకేతాలిచ్చారు. తండ్రీ కొడుకులు ఏకమవ్వాలనే తాను కోరుకుంటున్నానని, సీఎం అఖిలేశ్ దారికి అడ్డంకి కాబోనని చెప్పారు. అయితే బాబాయ్, అబ్బాయ్ మధ్య చర్చల సారాంశంపై పార్టీ వర్గాలు మాత్రం ఇంకా స్పందించలేదు. అఖిలేశ్తో భేటీ అనంతరం మళ్లీ ములాయంను కలిసిన శివ్పాల్ రాజీ ఫార్ములాపై చర్చించారు. ఖాతాల్ని ఫ్రీజ్ చేయండి: అఖిలేశ్ వర్గం సమాజ్వాదీ ఖాతాల్ని స్తంభింపచేయాలం టూ అఖిలేశ్ వర్గం బ్యాంకులకు లేఖ రాసింది. బ్యాంకుల్లో రూ. 500 కోట్లు ఉండగా... శివ్పాల్ సంతకం తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!
- ప్రియనేస్తం ములాయం కోసం అమర్ సింగ్ కీలక నిర్ణయం! - అఖిలేశ్ డిమాండ్ మేరకు మూడు నెలలు పార్టీకి దూరంగా.. లక్నో: ఎవరి కోసమైతే తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేశ్లు తగువులాడుకుంటున్నారో.. ఆ అమర్సింగ్ చివరికి త్యాగానికి సిద్ధపడ్డట్టు తెలిసింది. ప్రియ స్నేహితుడి కొడుకు, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీఎం అఖిలేశ్ డిమాంఢ్ మేరకు.. ఎంపీ అమర్ మూడు నెలలపాటు రాజకీయ సన్యాసం తీసుకొనబోతున్నారని సమాచారం. ఈ మూడు నెలలూ పార్టీకి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాధికారాలు అఖిలేశ్ తీసుకుంటారు. ఈ అంశం ప్రాతిపదికనే గురువారం రాత్రి నుంచి ములాయం, అఖిలేశ్ల నివాసాల్లో ఎడతెరిపిలేకుండా మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అనూహ్యంగా బాబాయి శివపాల్ యాదవ్.. అఖిలేశ్ ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ అమర్ సింగ్.. ములాయంతో భేటీ అయ్యారు. మరి కొద్ది గంటల్లోనే అమర్ త్యాగానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంచనా. (ఆయన గుండెల్లో నేను లేని క్షణాన.. ) ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారం సాధించేలా మార్చి వరకు సర్వనిర్ణయాధికారాలూ తనకే కట్టబెట్టాలని సీఎం అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ను కోరినట్లు.. అఖిలేశ్ వర్గీయుడైన మంత్రి రవిదాస్ మల్హోత్రా మీడియాకు చెప్పారు. నేతాజీ(ములాయం) కూడా ఇందుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 214 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే పార్టీని స్వాధీనం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి ములాయంను పార్టీ ‘మార్గదర్శి’గా నియమించారు. పార్టీని తిరిగి కైవసం చేసుకోలేని స్థితిలో ములాయం.. కొడుకుకు జై కొట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అఖిలేశ్ వర్గంలోని అతివాదులు వ్యాఖ్యానించారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) అఖిలేశ్ డిమాండ్ ప్రకారం అమర్సింగ్, శివపాల్ యాదవ్లు వచ్చే మూడు నెలల పార్టీకి దూరంగా ఉండేలి. అభ్యర్థుల ఎంపిక సహా ఎలాంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకుదు. అయితే ఈ మాటను ములాయం చేతే చెప్పించాలని అఖిలేశ్ పట్టుపడుతున్నారు. సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన ములాయం.. కమిషన్ను కలవకుండానే లక్నోకు తిరుగుపయనం అయ్యారు. ఆ విధంగా సైకిల్ గుర్తు అఖిలేశ్కే దక్కేలా ములాయం వ్యవహరించారని తేలింది. (మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!) -
‘పెద్దాయన’ ఇంటికి జయప్రద
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ సంక్షోభం నేపథ్యంలో అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద మళ్లీ తెరపైకి వచ్చారు. చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జయప్రద మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ‘పెద్దాయన’ ములాయం సింగ్ యాదవ్ నివాసానికి వచ్చారు. తన కుమారుడిపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన ములాయం తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. లండన్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన నేరుగా ములాయం నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశానికి జయప్రద కూడా హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టకాలంలో ‘నేతాజీ’కి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆమె వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని గతేడాది ప్రకటించిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చారు. ములాయం వెన్నంటే నడుస్తారా, ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆయన గుండెల్లో నేను లేని క్షణాన..
న్యూఢిల్లీ: 'అంతా నేనే చేశానని నిందిస్తున్నారు. సరే, ఎంత తిట్టినా నేను భరిస్తా. కానీ నేతాజీ తన హృదయంలో నుంచి నన్ను తీసివేస్తే.. ఆ క్షణాన్ని మాత్రం నేను భరించలేను. బహుశా జీవితంలో నేను అత్యంత దుఃఖపడే సందర్భం అదే కావచ్చు' అని జిగిరీ దోస్త్ ములాయం సింగ్ను ఉద్దేశించి అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ములాయం-అమర్సింగ్ విషయంలో తప్పే అవుతుంది. కొడుకు అఖిలేశ్, తమ్ముళ్లు శివపాల్, రాంగోపాల్, నమ్మకస్తుడు ఆజంఖాన్.. ఇలా ఎంతోమంది మొత్తుకుని మొరాయించినా ములాయం.. అమర్ సింగ్ను వెంటే ఉంచుకున్నారు. ములాయం ఇంట్లో చెలరేగిన వివాదానికి అసలు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్.. ఇక్కడ ఉండలేక లండన్ వెళ్లిపోయారు. అయితే అఖిలేశ్ వర్గం ఏకంగా పార్టీనే హైజాక్ చేయడం, ములాయం హైబీపీకి గురై అస్వస్థతకు లోనుకావడంతో అమర్ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన మీడియాతో రెండు ముక్కలు మాట్లాడారు. (సమాజ్వాదీ పార్టీ హైజాక్: అధినేతగా అఖిలేశ్) 'పార్టీలో చెలరేగుతోన్న విపత్కరాలన్నింటికీ నేనే కారణం అని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో నిజం ఉందని నమ్మితే నిరభ్యంతరంగా నన్ను బహిష్కరించండని ములాయంకు ఎప్పుడో చెప్పా. పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడానికి నేనేమీ బాధపడను. కానీ ములాయం గుండెల్లో నుంచి తీసేస్తే మాత్రం భరించలేను' అని అమర్ సింగ్ భావోద్వేగంతో చెప్పారు. ములాయం, శివపాల్ యాదవ్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో అమర్ సింగ్ కూడా వారితో కలుస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్షన్ కమిషన్ను కలిసి, హైజాక్కు గురైన పార్టీ గుర్తు 'సైకిల్'ను తమకే ఇప్పించాలని కోరతారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని ములాయం ప్రకటించారు. (ఆత్మరక్షణలో ములాయం.. 'సైకిల్' కోసం పోరాటం) (చదవండి: ములాయం 'అమర్' ప్రేమ రహస్యం) -
దయచేసి నన్ను బతకనీయండి
-
దయచేసి నన్ను బతకనీయండి: అమర్ సింగ్
లండన్: సమాజ్ వాదీ పార్టీలో రేగిన చిచ్చుకు తాను కారణం కాదని ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ పునరుద్ఘాటించారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ వివాదాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ములాయం, అఖిలేశ్ మధ్య విభేదాల వెనుక తాను లేనని చెప్పారు. లండన్ లో ఉన్న ఆయన సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంపై స్పందించారు. ‘నాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. దయచేసి నన్ను బతనీయండి. నా కుటుంబం కోసం నేను బతకాలనుకుంటున్నాను. ఒకవేళ సమాజ్ వాదీ పార్టీలో నావల్లే సంక్షోభం ఏర్పడిందని భావిస్తే నన్ను వదులుకోవాలని ములాయం సింగ్ ను కోరతాను. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించమని చెబుతాన’ని అమర్ సింగ్ ఆవేదనతో అన్నారు. కాగా, ఆదివారం లక్నోలో జరిగిన సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సు సందర్భంగా అమర్ సింగ్ పై కార్యకర్తలు మండిపడ్డారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. -
అసలు కారకుడు అమర్ ఏమన్నారంటే..
-
అసలు కారకుడు అమర్ ఏమన్నారంటే..
లక్నో: సమాజ్వాదీ పార్టీలో చెలరేగిన కల్లోలానికి అసలు కారకుడంటూ అఖిలేశ్ వర్గం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అమర్ సింగ్ మొత్తం వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. 'చీకటి చిక్కగా ఉంటేనే పొద్దు రసవత్తరంగా ఉంటుందంటూ' పార్టీ ఎదుర్కొన్న తీవ్ర సంక్షోభం గురించి కవిత వినిపించారు. అఖిలేశ్ యాదవ్ను సస్పెండ్ చేస్తూ ములాయం నిర్ణయాన్ని ప్రకటించిన నిమిషం(శుక్రవారం సాయంత్రం) నుంచి ఎవ్వరికీ కనిపించకుండా తిరిగిన అమర్సింగ్.. శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవని వ్యాఖ్యానించిన ఆయన.. కార్యకర్తలంతా నేతాజీ(ములాయం) వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. చివరికి కథ సుఖాంతం కావడాన్ని స్వాగతించారు. 'ములాయం మరోసారి రాజకీయ పరిపక్వతను ప్రదర్శించారు. పార్టీగానీ, కుటుంబంగానీ ఎట్టి పరిస్థితుల్లో చీలిపోకుండా కాపాడుకుంటానన్న ప్రతిజ్ఞను నూటికినూరుశాతం నిలబెట్టుకున్నారు. నిజమే, చీకటి ఎంత చిక్కగా ఉంటే, తొలిపొద్దు అంత రంజకంగా ఉంటుంది' అని అమర్ సింగ్ చమత్కరించారు. (చదవండి: ములాయం అమర ప్రేమ రహస్యం) అఖిలేశ్, రాంగోపాల్ లపై ములాయం శుక్రవారం విధించిన బహిష్కరణను శనివారం ఉదయానికి ఎత్తేయడంతో పరి'వార్' కాస్తా టీ కప్పులో తుఫానుగా ముగిసింది. ఎస్పీ పరిణామాలపై సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 1. ములాయం ఎపిసోడ్ అంతా నాటకమేనా! 2. ములాయం-అఖిలేష్ వివాదంలో మరో ట్విస్ట్ 3. ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్న కోడలేనా? 4. అఖిలేశ్ నివాసం వద్ద హైడ్రామా! 5. నాన్నకు ప్రేమతో.. అఖిలేశ్ ఉద్వేగ ప్రసంగం! -
భరించలేను.. గుండె బద్దలవుతోంది..
న్యూఢిల్లీ: ‘ప్రతిమనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. నా సహనానికి కూడా ఒక హద్దుంది. ముఖ్యమంత్రి, ఆయన మనుషులు ఆ పరిధి దాటి నన్ను నిందిస్తున్నారు. వాళ్ల మాటలు నన్ను తీవ్రంగా కుంగదీస్తున్నాయి. గుండె బద్దలవుతోంది. ఇక భరించలేను. పెద్దాయనే నాకు దిక్కు. ఆయనకే నా బాధ చెప్పుకుంటా. నిజానికి నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)తో బాబు(సీఎం అఖిలేశ్ యాదవ్) గురించి ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్గానే తప్ప నెగటివ్గా మాట్లాడను. ఈ విషయంలో వాళ్ల(అఖిలేశ్ వర్గం) విమర్శలు భరించలేకపోతున్నా’అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ మీడియాతో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన అమర్ సింగ్.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ములాయం సింగ్ నివాసానికి వెళ్లి గంటలపాటు చర్చలు జరిపారు. సమాజ్వాదీ పార్టీలో కొద్ది రోజుల కిందట తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు.. ములాయం జోక్యంతో సద్దుమణిగినట్లయ్యాయి. కానీ వైరిపక్షాలు వీలుచిక్కినప్పుడల్లా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూనేఉన్నారు. అమర్ సింగ్కు వ్యతిరేకంగా సీఎం అఖిలేశ్ వర్గీయులు మాటలదాడిని తీవ్రతరం చేశారు. దీంతో అమర్.. నేతాజీని వ్యక్తిగతంగా కీలక చర్చలు జరిపారు. ‘ముఖ్యమంత్రి అఖిలేశ్తోనే నాకు గొడవ. అదే ములాయం కొడుకుగా మాత్రం అఖిలేశ్తో ఎలాంటి సమస్యలు లేవు. వాస్తవంగా అతనికి సంబంధంచి మేలుచేసే సలహాలే ఇస్తుంటా. ఎందుకోగానీ వాళ్లకు ఆ విషయం అర్థంకాదు. నేతాజీ నన్ను అర్థం చేసుకున్నారు. అందుకే బహిరంగవేదికలపైనా నన్ను సమర్థిస్తారు. ఏది ఏమైనా నేను ములాయం నమ్మినబంటును. నా బాధ చెప్పుకుంటా. చివరికి ఆయన ఆదేశాలనే శిరసావహిస్తా’అని అమర్సింగ్ అన్నారు. -
‘అఖిలేశ్తో ఎలా వేగమంటారు?’
న్యూఢిల్లీ: త్వరలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్రంలోని అధికార పార్టీ వేగంగా దూసుకెళుతుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీ మాత్రం ఇంకా ఇంటి పంచాయితీలతోటే సతమతమవుతోంది. ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, ఆయన మద్దతు దారులు తనను అవమానిస్తున్నారని మరోసారి ఎస్పీ నేత అమర్ సింగ్ ఫిర్యాదు చేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, ఆ మేరకు మాత్రమే భరించగలమని, ఈ విషయంలో ఏం చేయమంటారో చెప్పండంటూ ఆయన సోమవారం పార్టీ చీఫ్ ములాయం సింగ్తో భేటీ అయ్యారు. ‘నాకు అఖిలేశ్ ను బాధపెట్టడం ఇష్టం లేదు. కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడింది. నేను ములాయంతో మాట్లాడుతాను. కుమారుడిని కూడా కాదని నేరుగా నాకు మద్దతిచ్చిన వ్యక్తి ములాయం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాను’ అని అమర్ సింగ్ ములాయంను కలవకముందు మీడియాతో చెప్పారు. అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా ములాయంను గాయపరిచే ఏ చర్యలను తాను చేయబోనని ఆయన చెప్పారు. ‘నేను అఖిలేశ్ తో ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ ములాయంతోనే ఉంటాను. అయినప్పటికీ నేను ఎప్పుడు ఏం మాట్లాడినా అఖిలేశ్కు అనుకూలంగా మాట్లాడతాను. నేతాజీకి నేనేమిటో పూర్తిగా తెలుసు’ అని ఆయన చెప్పారు. -
'అందరూ వద్దంటున్నా.. సీఎం పెళ్లి నేనే చేశా'
ములాయం సింగ్ యాదవ్ కుటుంబం అంతా అఖిలేష్ యాదవ్ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే.. డింపుల్తో అతడి పెళ్లి తానే చేయించానని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ సహచరుడు అమర్ సింగ్ చెప్పారు. అప్పట్లో అఖిలేష్ తరఫున గట్టిగా నిలబడింది తానొక్కడినేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అతడి పెళ్లి ఫొటోలు చూస్తే.. తాను లేకుండా ఏ ఒక్క ఫొటో కూడా ఉండదని తెలిపారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు తనను 'దలాల్' అంటూ వ్యాఖ్యానించడం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తోందని అమర్ సింగ్ చెప్పారు. 'ముఖ్యమంత్రి అఖిలేష్'కు తాను సన్నిహితం కాకపోవచ్చు గానీ.. ములాయం కొడుకు అఖిలేష్కు మాత్రం తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది గానీ అఖిలేష్ అపాయింట్మెంట్ మాత్రం దొరకదన్నారు. తన బలితోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే.. బలిదానం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. రాంగోపాల్ యాదవ్ తనను బెదిరిస్తూ చేసిన ప్రకటన చూసి భయం వేస్తోందని.. తనకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని అమర్ సింగ్ చెప్పారు. రాంగోపాల్ యాదవ్ను తాను ఎప్పుడూ 'నపుంసకుడు' అనలేదని, ఆయన పేరుతోను, బాలగోపాల్ అనే పేరుతో మాత్రమే పిలిచానని చెప్పారు. తానెప్పుడూ అలాంటి తిట్లు వాడలేదన్నారు. పవన్ పాండే చేతిలో దెబ్బలు తిన్నారని కథనాలు వచ్చిన అషు మాలిక్ను తాను ఎప్పుడూ కలవలేదని అమర్ తెలిపారు. శివపాల్ యాదవ్కు బదులు అఖిలేష్ను సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు కూడా తననే అందరూ తప్పుబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు శివపాల్ యాదవ్ మాత్రం తనను తప్పుబట్టకుండా, కొత్త అధ్యక్షుడైన అఖిలేష్ను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారన్నారు. ఇక నవంబర్ 3వ తేదీ నుంచి అఖిలేష్ యాదవ్ నిర్వహించనున్న రథయాత్రకు తనకు ఆహ్వానం లేదని.. అలాంటప్పుడు తాను అక్కడకు వెళ్తే అఖిలేష్ మద్దతుదారులు తన దుస్తులు చింపి, కొట్టడం ఖాయమని అమర్ సింగ్ చెప్పారు. అప్పుడు అనవసరంగా అఖిలేషే తనను కొట్టించాడన్న ఆరోపణలు వస్తాయని, అందువల్ల ఆ రథయాత్రకు తాను వెళ్లడం లేదని తెలిపారు. -
ములాయం 'అమర'ప్రేమ రహస్యం
'రాజకీయాల్లో రాసి కంటే వాసి ముఖ్యం' అనుకుంటే సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ కంటే గొప్ప(!) వ్యూహకర్త లేరు. జైలు శిక్ష నుంచి ములాయం సింగ్ యాదవ్ ను కాపాడినా, నేతాజీకి ఢిల్లీ రాజకీయాల ఓనమాలు దిద్దించినా, బిల్ క్లింటన్ నుంచి బడా పారిశ్రామికవేత్తలను యూపీకి రప్పించినా, సినిమా స్టార్లతో సమాజ్ వాదీకి మరింత గ్లామర్ అద్దినా అది ఒక్క అమర్ సింగ్ ఘనతేనని నేతాజీ(ములాయం) బలంగా నమ్ముతారని పార్టీ ప్రముఖులు చెబుతారు. అందుకే కన్న కొడుకును సైతం కాదని ములాయం.. అమర్ సింగ్ పై అమర ప్రేమను ప్రకటిస్తారని అంటారు. అసలు వీళ్ల దోస్తీ ఎలా మొదలైంది? అప్పటికే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ముయాలం జనతాపార్టీ ప్రతిధిగా 1985లో యూపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ములాయంకు యూపీలో బలమైన రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన అమర్ సింగ్ పరిచయం అయ్యారు. 1989లో ములాయం మొదటిసారి (జనతాదళ్ నుంచి)ముఖ్యమంత్రి అయిన తర్వాత అమర్-ములాయంకు మరింత దగ్గరయ్యారు. పరివార్ నుంచి విడిపోయి ములాయం 1992లో సొంతగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించినప్పుడూ అమర్ సింగ్ వెంటే ఉన్నారు. 96లో అధికారికంగా పార్టీలో చేరిన అమర్ సింగ్.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ (1996-98) ఏర్పాటయినప్పుడు సమాజ్ వాదీ పార్టీ తరఫున కీలక పాత్ర పోశించారని సీనియర్లు చెబుతారు. ధారళమైన ఇంగ్లీష్, స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా మాట్లాడే అమర్ సింగ్.. రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తోన్న ములాయంకు అన్నీ తానై వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ఆ సమయంలో యూపీలో పార్టీ పగ్గాలన్నీ అమర్ సింగ్ చేతుల్లో ఉండేవి. 2003లో ములాయం మరోసారి యూపీ సీఎంగా గద్దెనెక్కినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో అమర్ సింగ్.. పారిశ్రామికవేత్తలకు యూపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిచారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లను సమాజ్ వాదీలో చేర్పించింది కూడా అమర్ సింగే. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలనే కోరిక అమర్ సింగ్ వ్యూహాలతో తప్పక నెరవేరుతుందని ములాయం బలంగా నమ్మేవారని, ఇప్పటికీ ఆ నమ్మకాన్ని వీడలేదని నేతాజీ కీలక అనుచరులు చెబుతారు. అలా వర్థిల్లుతోన్న వారి స్నేహం 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుదుపులకుగురైంది. బయటి వ్యక్తిని తండ్రి(ములాయం) అతిగా నమ్ముతున్నారని అఖిలేశ్ పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అఖిలేశ్ సీఎం పగ్గాలు చేపట్టడంతో ఆయన ఖాళీ చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానంలో భార్య డింపుల్ యాదవ్ పోటీకి దింపారు. అది రుచించని అమర్ సింగ్.. డింపుల్ కు వ్యతిరేకంగా ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఫలితం అఖిలేశ్ కు అనుకూలంగా రావడం, ఆ వెంటనే తండ్రిని ఒప్పించి అమర్ సింగ్ పై వేటువేయడం చకచకా జరిగిపోయాయి. ఆరేళ్ల బహిష్కరణా కాలాన్ని పూర్తిచేసుకున్న అమర్ సింగ్ 2016లో సమాజ్ వాదీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా కొడకు చరిష్మా ముందు ములాయం స్టార్డమ్ వెలిసిపోతున్న తరుణంలోనే ములాయంకు అమర్ తోడయ్యారు.. తన ప్రియ స్నేహితుడికి పూర్వవైభవం కల్పించడంతోపాటు (ప్రధాని కావాలనే)పాతకలలను నిజం చసే బాధ్యతను అమర్ తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడుదుడుకులు, తీవ్రస్థాయి విమర్శలకు గురైనా అమర్ 'స్నేహం కోసం' ఎంతకైనా వెళతానని ములాయం తేల్చిచెప్పారు. -
'ఒట్టు.. పార్టీని నిలువునా చీలుస్తానన్నాడు'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్పై ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మాటల తూటాలు పేల్చారు. సమాజ్ వాది పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడై తిరిగి పార్టీలోకి వచ్చిన అమర్ సింగ్ కాలిగోటికి కూడా అఖిలేశ్ సరిపోడని పరుష వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని వేళలా పార్టీకోసం కష్టపడ్డానని, తాను ఏం చేసినా నేతాజీ(ములాయం సింగ్)కోసమే చేశానని చెప్పారు. సమాజ్ వాది పార్టీని చీలుస్తానని, కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని తనతో అఖిలేశ్ స్వయంగా అన్నాడని, ఈ విషయం తాను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నానని అన్నారు. అమర్ సింగ్ తిరిగి అడుగుపెట్టడం, మంత్రి పదవి నుంచి శివపాల్ను తొలగించడం వంటి పరిణామాల తర్వాత ఎస్పీ దాదాపు నిట్టనిలువునా చీలిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన శివపాల్.. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోపక్క, తాజాగా ఏర్పడిన వివాదం విషయంలో సోమవారం ములాయంతో శివపాల్, అఖిలేశ్ వేర్వేరుగా భేటీ అయ్యి పలు విషయాలు కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ములాయం ముందు శివపాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 'సమాజ్ వాది పార్టీకి నేను చేసిన సేవలు చిన్నవా?అఖిలేశ్ను సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు మద్దతిచ్చాను. కానీ, నన్ను ఎప్పుడైతే అధ్యక్షుడిగా చేశారో అతడు నా వద్ద ఉన్న ఇతర శాఖలు లాక్కున్నాడు. నేను అఖిలేశ్ కన్నా తక్కువ పనిచేశానా? ముఖ్యమంత్రిగా అతడు చెప్పిన ప్రతీది విన్నాను. అలాగే నేతాజీ చెప్పింది చేశాను. నేను అమర్ సింగ్ తో టచ్ లో ఉన్నది నిజమే. అయితే, ఈ విషయం నేను ఎప్పుడూ దాచలేదు' అని చెప్పాడు. అదే సమయంలో తండ్రి ములాయంకు అఖిలేశ్ కూడా గట్టి వివరణ ఇచ్చాడు. పార్టీ చీఫ్ (శివపాల్) ఏం చేశాడో అందుకు ప్రతిఫలమే ఇదంతా. నేను మీవల్లే(ములాయం వల్లే) ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఉన్నాను. మీకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించబోను. పార్టీనిగానీ, ములాయంను గానీ బలహీన పరచాలని కుట్ర చేసేవారిపై నేను వెంటనే చర్యలు తీసుకుంటాను' అని అఖిలేశ్ అన్నారు. కాగా, వీరిద్దరితో కలిసి ములాయం సాయంత్రం మరోసారి భేటీ అవనున్నారు. -
కోరి ‘తెచ్చుకున్న’ కొరివి
(సాక్షి, నేషనల్ డెస్క్): బద్దలయ్యే ముందు అగ్నిపర్వతంలా ఉంది సమాజ్వాదీ పార్టీ పరిస్థితి. పార్టీ చీఫ్, తండ్రి ములాయంతోనే నేరుగా ఢీకొనేందుకు సీఎం అఖిలేశ్ సిద్ధమయ్యేలా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికలముందు పార్టీకి అవసరమని తీసుకొచ్చిన అమర్సింగ్ కారణంగానే.. ఎస్పీలో, యాదవ కుటుంబంలో ముసలం పుట్టిందని పార్టీ ముఖ్యనేతలంటున్నారు. అంతా అమర్సింగ్ వల్లే! పార్టీ నుంచి ఆరేళ్ల క్రితం బహిష్కృతుడైన అమర్ను మళ్లీ పార్టీలోకి రావటంతో ఎస్పీలో ముసలం మొదలైంది. అయితే.. యూపీ ఎన్నికల నేపథ్యంలో అమర్ పార్టీలోకి రావటం అవసరమని ములాయంను సొంత సోదరుడు శివ్పాల్ ఒప్పించాడు. అమర్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవటం, ఏకంగా రాజ్యసభ సీటివ్వటాన్ని అఖిలేశ్ వర్గం వ్యతిరేకిస్తోంది. అఖిలేశ్కు ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ మద్దతుగా ఉన్నారు. పై చేయి కోసం.. దీనికి తోడు నెలరోజుల క్రితం వివిధ కారణాలతో శివ్పాల్ను కేబినెట్ నుంచి అఖిలేశ్ తప్పించటం.. తదనంతర పరిణామాలతో యూపీ పార్టీ చీఫ్గా అఖిలేశ్ను తప్పించిన ములాయం.. శివ్పాల్కు బాధ్యతలు అప్పగించటంతో వివాదం మొదలైంది. అఖిలేశ్కు అనుకూలంగా ఉన్న కొందరు యువనేతల్నీ ములాయం పార్టీ పదవుల నుంచి తప్పించారు. దీనికితోడు గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ నేతృత్వంలోని ఖ్వామీ ఏక్తా దళ్ను ఎస్పీలో విలీనం చేసే ప్రయత్నాన్నీ అఖిలేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణాలన్నీ యాదవ కుటుంబంలో ముసలానికి కారణమయ్యాయి. సయోధ్యకోసం ములాయంతోపాటు.. పార్టీ సీనియర్ నేతలైన బేణీ ప్రసాద్వర్మ, మరికొందరు ప్రయత్నించినా ప్రభావం కనిపించలేదు. చీలిన కుటుంబం.. ఈ నేపథ్యంలోనే.. ఇన్నాళ్లుగా ఒకచోటే కలసి ఉంటున్న యాదవ్ కుటుంబం నుంచి బయటపడ్డ అఖిలేశ్ వేరు కుంపటి పెట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు. దీనికి అఖిలేశ్ పినతల్లి (ములాయం రెండో భార్య) కారణమంటూ సీఎం వర్గం ఎమ్మెల్సీ ఉదయ్వీర్ వ్యాఖ్యానించటం.. ఆయన్ను పార్టీనుంచి ములాయం బహిష్కరించటం చకచకా జరిగిపోయాయి. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే అమర్సింగ్ అనుకూలురుగా పేరున్న ముగ్గురు మంత్రులను సీఎం తొలగించటం, దేనికైనా సిద్ధమనే ధోరణిలో కనిపించటం సమాజ్వాదీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలనిస్తోంది. -
మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సన్నిహితుడు, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) బహిష్కృత నేత ఉదయ్వీర్ సింగ్ పార్టీ సీనియర్ నేత అమర్సింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ములాయం కుటంబంలో చిచ్చు రాజుకోవడానికి కారణం అమర్సింగేనని, బీజేపీతో కుమ్మక్కయి.. సమాజ్ వాదీ పార్టీని దెబ్బతీయడానికి ఆయన కుట్ర పన్నారని ఆరోపించారు. 'పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వంలో అమర్ సింగ్ చేసిన కుట్ర ఇది. కుటుంబ విలువలు, అంతర్గత ఈర్ష్యద్వేషాల సాకుతో అఖిలేశ్ యాదవ్ను బలహీనుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మరోసారి అధికారంలోకి రాకుండా ఈ కుట్ర పన్నారు' అని ఆయన సీఎన్ఎన్ న్యూస్18తో అన్నారు. ఎస్పీలో మళ్లీ చేరినప్పటికీ అమర్సింగ్ ఇంకా బీజేపీ నేతలను కలుస్తున్నారని, బీజేపీ నేతలు, వ్యక్తులు ఇచ్చే పార్టీలకు ఆయన హాజరవుతున్నారని పేర్కొన్నారు. పార్టీ అధినేత ములాయంను తప్పుదోవ పట్టించి.. పార్టీని భ్రష్టు పట్టించేందుకు ముందస్తు కుట్రతో అమర్సింగ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అఖిలేశ్కు అత్యంత సన్నిహితుడైన ఉదయ్వీర్ సింగ్ను అధినేత ములాయం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనను కొడుకు అఖిలేశ్ చేరదీసి రాజకీయ ఆశ్రయం కల్పించడం ములాయంకు నచ్చలేదని తెలుస్తోంది. అతని బహిష్కరణతో బాబాయి శివ్పాల్ యాదవ్, సీఎం అఖిలేశ్ మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న అంతర్గత వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇరువర్గాలు తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధపడుతుండటంతో ఎస్పీలో చీలిక వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మా కుటుంబం విచ్ఛిన్నానికి అమర్ సింగ్ కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదురుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని ఆరోపించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన కుట్రపన్నారని అఖిలేష్ అన్నారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విబేధాలు ఆదివారం తారస్థాయికి చేరుకున్నాయి. బాబాయ్ శివపాల్ సహా నలుగురు మంత్రులపై ఈ రోజు అఖిలేష్ వేటు వేశారు. అమర్ సింగ్కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. అనంతరం అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం ఆవేశంగా మాట్లాడిన అఖిలేష్.. అమర్ సింగ్ మద్దతుదారులు తమ మద్దతు దారులు కారని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శివపాల్ తన సోదరుడు ములాయం ఇంటికి వెళ్లారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు ములాయం అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
ఇలా జరుగుతుందని ముందే తెలుసు: ఆజంఖాన్
లక్నో: నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీలో భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ అనుంగుడు, అఖిలేష్ మంత్రివర్గంలో సీనియర్ అయిన ఆజం ఖాన్.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తాను ముందే ఊహించానన్నారు. ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆజం ఖాన్.. 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటి పరిణామాలు తప్పవు. వాళ్లు మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టినప్పుడే ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించా'అని పరోక్షంగా అమర్ సింగ్ విమర్శించారు. కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవర్ని తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆమేరకు అఖిలేష్ వ్యవహరించారని ఆజం ఖాన్ అన్నారు.(సీఎం సంచలన నిర్ణయం:యూపీలో రాజకీయ కలకలం) అమర్ సింగ్ పునరాగమనంతో సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గతపోరులో ములాయం సింగ్ యాదవ్ ప్రియ సహోదరుడు శివపాల్ యాదవ్ ఒకవైపు ఉండిపోగా, సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరోవైపునకు చేరారు. రెండు వర్గాలకు మధ్య సమన్వయం చేసేందుకు నేతాజీ ములాయం చేసిన ప్రయత్నాలన్ని బెడిసికొట్టడం చివరికి మంత్రుల ఉద్వాసనకు దారితీసింది. -
మక్క బుట్టలకూ గిరాకే
బట్టీల్లో పెరిగిన బుట్టల వినియోగం గంపకు రూ.70 వెచ్చించి కొనుగోలు బాల్కొండ: రైతు సాగు చేసిన ప్రతి వస్తువూ ఉపయోగకరమే. ఒకప్పుడు మొక్కజొన్న నూర్పిడి తర్వాత వచ్చే బుట్టను వంటకు ఉపయోగించే వారు. తమకు అవసరమైనంత మేరకు ఉంచుకొని మిగతాది తెలిసిన వారికి ఇచ్చే వారు. అయితే, సిలిండర్ల వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో మక్క బుట్టల వినియోగం చాలా తగ్గింది. అయితే, ఇప్పుడదే బుట్టకు వ్యాపారుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో బుట్ట గంప రూ.70 పలుకుతోంది. ఖరీఫ్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను ప్రస్తుతం నూర్పిడి చేస్తున్నారు. బుట్ట నుంచి వేరు చేసిన మక్కలను విక్రయిస్తున్నారు. అయితే, బుట్టకు కూడా డిమాండ్ ఏర్పడడంతో దాన్నీ విక్రయిస్తున్నారు. మన జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారులు బాల్కొండ మండలానికి వస్తున్నారు. గ్రామాల్లో సంచరిస్తూ బుట్ట గంపకు రూ.70 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్యాలాలు, అటుకుల తయారీ బట్టీలో ఈ బుట్టలను వినియోగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. వడ్ల నుంచి ప్యాలలు, బియ్యం నుంచి అటుకులు, మక్కల నుంచి మక్క ప్యాలాలు తీయడానికి వంట చెరుకు చాలా అవసరం. అయితే, వంట చెరుకు స్థానంలో మక్క బుట్టలు వినియోగిస్తున్నారు. దీంతో బుట్టలకు మంచి గిరాకీ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాలకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రూ.70లకు ఒక్కో గంప కొంటున్న వ్యాపారులు.. రూ.120 చొప్పున ప్యాలాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న కంకులు నూర్పిడి చేయడం వలన మక్క బుట్టలు వస్తాయి. ప్రస్తుతం సిలిండర్ వాడకం ఎక్కువ కావడం వలన మక్క బుట్టలను రైతులు వినియోగించడం లేదు. అయితే, ఈ బుట్టలను పసుపు ఉడికించే యంత్రాల్లో వినియోగించ వచ్చు. కానీ కూలీలు వాటిని వాడకపోవడంతో ఇలా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా రైతులకు ఎంతో కొంత ఆదాయం కలిసి వస్తోంది. బట్టీల్లో విక్రయిస్తాం రైతుల నుంచి మక్క బుట్టలు కొనుగోలు చేసి ప్యాలాలు, అటుకుల బట్టీలకు విక్రయిస్తాం, కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టం వస్తుంది. – అమర్ సింగ్, వ్యాపారి, పిట్లం డిమాండ్ ఎక్కువగా ఉంది మక్క బుట్టలకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే గ్రామాల్లో తిరుగుతూ బుట్టలను కొనుగోలు చేస్తున్నాం. గంపకు రూ.70 పెడుతున్నాం. రైతులు అధికంగానే విక్రయిస్తున్నారు. – బాలుసింగ్, వ్యాపారి, పిట్లం -
కొడుక్కి ఝలక్ ఇచ్చిన ములాయం
లక్నో: కొడుకు అభ్యంతరాలను తోసిరాజని సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ తనకు అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇటీవల పార్టీలో తలెత్తిన సంక్షోభానికి అమర్ సింగ్ కారణమంటూ పరోక్షంగా అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేసినా ములాయం పట్టించుకోలేదు. ‘మిమ్మల్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాం. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి పాటు పడాల’ని అమర్ సింగ్ కు రాసిన లేఖలో ములాయం పేర్కొన్నారు. క్లుప్తంగా హిందీలో రాసిన లేఖపై ములాయం సంతకంతో కూడిన ప్రకటన ఆయన యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఈ-మెయిల్ నుంచి మీడియాకు అందింది. 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్ సింగ్ ఇటీవల సొంతగూటికి తిరిగొచ్చారు. ఆయన పునరాగమనాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించినా ములాయం లెక్కచేయకుండా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి కుమారుడికి ఝలక్ ఇచ్చారు. ‘బయటి వ్యక్తి’ కారణంగానే తమ పార్టీలో ఇటీవల సమస్యలు తలెత్తాయని అఖిలేశ్ పరోక్షంగా అమర్ సింగ్ పై విమర్శలు చేశా -
బహిష్కరించినా విప్కు కట్టుబడాల్సిందే
పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తన తీర్పు పునస్సమీక్షకు నో అమర్సింగ్, జయప్రదల పిటిషన్ కొట్టివేత న్యూఢిల్లీ: ఒక రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్కు ఎన్నికైన లేదా నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ విప్కు కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పటికీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. 2010 ఫిబ్రవరి 2న రాజ్యసభ సభ్యుడైన అమర్సింగ్ను, లోక్సభ ఎంపీ అయిన జయప్రదను సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. 2012లో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి ప్యారీమోహన్ మహాపాత్ర బహిష్కరణకు గురయ్యారు. వీరు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 1996 నాటి తీర్పును పునస్సమీక్షించాలని కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్.. పిటిషనర్ల పదవీకాలం ముగిసిందని, దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నామని, ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబివ్వకపోవడమే సరైనదని పేర్కొంది. ఆ పిటిషన్లు ఇప్పుడు వ్యర్థమంటూ తోసిపుచ్చింది. అంతకుముందు జయప్రద, అమర్ల లాయర్లు వాదనలు వినిపిస్తూ.. 1996 నాటి జి.విశ్వనాథన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని, తాము పార్టీకి రాజీనామా చేయలేదని, సొంత పార్టీ పెట్టుకోలేదని తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన వారికి లేదా పార్టీలో ఉండి విప్ను ధిక్కరించిన వారికే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పార్టీయే తమను బహిష్కరించింది కనుక ఏ పార్టీకీ చెందని సభ్యులుగా ఉంటామని, అందువల్ల పార్టీ విప్కు కట్టుబడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు కేంద్రం ఒక పార్టీ నుంచి ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుడు బహిష్కరణకు గురైనా కూడా అతను పార్టీ నియంత్రణలోనే ఉంటారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ట్రంప్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కుటుంబ ఫౌండేషన్కు అందిన విరాళాల విషయమై రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్-అమెరికా పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటేసినందుకుగాను భారతీయ రాజకీయ నాయకులు, భారతీయ సంస్థల నుండి ఆమెకు నిధులు అందాయని ఆరోపించారు. హిల్లరీ క్లింటన్కు అందిన విరాళాల విషయమై గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన ఆరోపణలు చేశారు. తాజాగా ట్రంప్ ప్రచార బృందం విడుదల చేసిన 35 పేజీల బుక్లెట్లో హిల్లరీకి అందిన నిధులపై ఆరోపణలు గుప్పించారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీపడటం దాదాపు ఖాయమైన నేపథ్యంలో హిల్లరీపై ట్రంప్ ఆరోపణల జోరు పెంచారు. న్యూయార్క్లో ఈ వారం ట్రంప్ చేసిన ప్రంసగంలోని టాప్ 50 నిజాల పేరిట ఈ బుక్లెట్ను విడుదల చేశారు. 2008లో భారత రాజకీయ నాయకుడు అమర్ సింగ్ క్లింటన్ ఫౌండేషన్ కు పది లక్షల డాలర్ల నుంచి 50 లక్షల డాలర్ల వరకు విరాళాలు ఇచ్చాడంటూ న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనాన్ని పేర్కొంటూ ట్రంప్ ప్రచార బృందం ఆరోపణలు చేసింది. 2008లో సెప్టెంబర్లో అమర్ సింగ్ అమెరికాను సందర్శించి అణు ఒప్పందం కోసం లాబీయింగ్ చేశారని, అప్పటి సెనేటర్ గా ఉన్న క్లింటన్ అణు ఒప్పందాన్ని అడ్డుకోబోమని హామీ ఇచ్చిందని, ఇందుకు ప్రతిఫలంగానే ఆమె ఫౌండేషన్ కు నిధులు అందాయని పేర్కొన్నారు. -
ఓయూలో హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
ఉస్మానియా లేడీస్ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు, కలుషిత మంచినీరు, అరకొర భద్రత ఏర్పాట్లపై వారు నిరసించారు. మెస్ కాంట్రాక్టర్ అమర్సింగ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. చీఫ్వార్డర్కు, డెరైక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. విద్యార్థినులు రోడ్డుపై ఆందోళనకు దిగటంతో వర్సిటీ ప్రధాన మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
'నమ్మించి చేసిన ద్రోహమే నయం'
ఆజమ్ఖాన్, నేనూ.. ఇద్దరమే ఉన్నాం! ఇద్దరు బద్ధ విరోధులకు కొవ్వొత్తుల కాంతిలో సమాజ్వాదీ పార్టీ ఏర్పాటు చేసిన స్నేహపూర్వకమైన డిన్నర్ మీట్ అది. ఒక్క డిష్ కూడా కదలడం లేదు. తనకు మింగుడు పడని ఒక విషయాన్ని నాతో చర్చించడానికి ఆజమ్ ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఆయనతో నాకు మితిమీరిన శత్రుత్వమేమీ లేదని ఆయనకూ తెలుసు. అలాగని నాతో స్నేహానికి ఆయనేం ఉవ్విళ్లూరడం లేదన్న సంగతి ఆయన ముఖంలో అస్థిమితంగా కదులుతున్న నీడలను బట్టి నాకూ తెలుస్తూనే ఉంది. ‘‘పెద్దాయన నిన్ను రాజ్యసభకు అడుగుతున్నారు’’ అన్నారు ఆజమ్. ‘‘మరి.. మీకు ఇష్టమేనా ఆజమ్జీ.. నేను మళ్లీ పార్టీలోకి రావడం?’’ అన్నాను నవ్వుతూ. ఆజమ్ ఇంకా పెద్దగా నవ్వారు. అది రాని నవ్వు. ‘‘నీ విషయంలో ఒక కేబినెట్ మినిస్టర్గా నేను గానీ, పార్టీ జనరల్ సెక్రెటరీగా రామ్ గోపాల్ యాదవ్ గానీ సర్దుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందని ములాయంజీ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు’’ అన్నారు ఆజమ్. ‘‘ఎంతైనా అంటే?’’ అన్నాను. ఆజమ్ చికాగ్గా ముక్కు విరిచారు. ‘‘ఎన్నికలొస్తున్నాయి. పార్టీకి ఫండ్స్ కావాలి. క్రౌడ్ పుల్లర్స్ కావాలి. అన్నిటికన్నా ముఖ్యం.. రాజ్నాథ్ సింగ్ లాంటి ఒక బలిష్టుడైన ఠాకూర్కి చెక్ పెట్టడం ఇంకో ఠాకూర్ వల్లనే అవుతుంది. ఇవన్నీ నువ్వు మాత్రమే చెయ్యగలవని నా చేత చెప్పించడానికి ఎందుకింత ఉత్సాహపడుతున్నావు అమర్’’ అన్నారు. ఆయనకు నా ప్రశ్న అర్థమైనట్టు లేదు! అవసరాలకు అతీతమైన స్నేహం పెద్దాయనలో గానీ, పార్టీ పెద్దల్లో గానీ ఏ కాస్తయినా మిగిలి ఉందా అన్నది తెలుసుకోవాలని నా ఆరాటం. పార్టీ నుంచి బయటకి వచ్చిన ఈ ఆరేళ్లలో నన్నొక్కరూ.. ‘స్నేహితుడా’ అని హత్తుకోలేదు. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన సంగతి, నా పేగుల్లోని కొంత భాగానికి డాక్టర్లు అనవసరంగా కోత పెట్టిన సంగతి, నేను అతి కొద్దిగా మాత్రమే తినగలనన్న సంగతి, ఆ కొద్దిగానైనా ఒంటికి పట్టడానికి బలమైన మందులు వాడుతున్నానన్న సంగతి తెలుసుకోలేనంత సమీపానికి మాత్రమే ఇప్పటికీ నా పూర్వపు సన్నిహితులు రాగలుగుతున్నారు! దుబాయ్ ప్రయాణంలో ఓసారి నా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా డౌన్ అయి, ఫ్లైట్లోనే కోమాలోకి వెళ్లిపోయాను. ‘ఇక బయటికి రాడు’ అన్నారట డాక్టర్లు. కానీ వచ్చాను. దేవుడికి కూడా నేను తనకి దగ్గరవడం ఇష్టం లేనట్లుంది! ములాయంజీని దేవుడికంటే గొప్పవాడు అనుకోవాలి. వద్దనుకున్న మనిషిని.. మళ్లీ వస్తే బాగుండని అనుకుంటున్నాడు కదా! అందుకు. ఏమైనా.. పెద్ద పెద్ద స్నేహాలు, పెద్ద పెద్ద పొజిషన్లు అశాంతికి లోను చేస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నమ్మకస్నేహాలను తట్టుకోలేక ఎప్పుడో కుప్పకూలిపోతాం. నమ్మించి చేసిన స్నేహం కన్నా, నమ్మించి చేసిన ద్రోహమే నయం అనిపిస్తుంది. అమితాబ్లు, ఆజమ్ఖాన్ల కన్నా... దాదర్లో పాన్వాలాతోనో, చౌపాటీలో భేల్వాలాతోనో స్నేహం ఆహ్లాదాన్నిస్తుంది. ఆరోగ్యానిస్తుంది. - మాధవ్ శింగరాజు -
'జయప్రదతో విభేదాలు లేవు'
లక్నో: జయప్రదకు, తనకు ఎటువంటి విభేదాలు లేవని సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అమర్ సింగ్ తెలిపారు. ములాయం సింగ్ మన్ననలు చూరగొనడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వం కంటే ములాయం దీవెనలు పొందడమే తనకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ తన ఫోన్ చేసి అభినందలు తెలిపారని, ఆయన ఎందుకు అభినందలు తెలిపారో ముందు అర్థం కాలేదన్నారు. తర్వాత రోజు ములాయంతో మాట్లాడినప్పుడు తనను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జయాబచ్చన్ తో విభేదాల గురించి అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. -
'బాస్' రూటులో జయప్రద?
లక్నో: అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలోకి తన పునరాగమాన్ని ఘనంగా చాటారు. పార్టీలో బడా నేతలు వ్యతిరేకించినప్పటికీ పెద్దల సభ సీటు దక్కించుకుని సత్తా చాటారు. ఆయనతో పాటు సమాజ్ వాది పార్టీకి దూరమైన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా మళ్లీ ఎస్ పీ గూటికి చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రియాశీల రాజకీయల్లోకి మళ్లీ అడుగు పెట్టేందుకు జయప్రద ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్ సొంతగూటికి చేరడంతో ఆమెకు అనుకూలించే పరిణామం. తనకు మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిన అమర్ సింగ్ మార్గాన్నే ఆమె అనుసరించే అవకాశముంది. ఆయన సొంత గూటికి చేరుకుని రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడంతో జయప్రద ఆయన బాటలోనే ప్రయాణిస్తారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె మళ్లీ యూపీ వైపు మళ్లనున్నారని తెలుస్తోంది. అమర్ సింగ్ పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆజాంఖాన్, రాంగోపాల్ యాదవ్.. జయప్రద రాకకు మోకాలడ్డే అవకాశముంది. అయితే 'బాస్' అమర్ సింగ్ తలచుకుంటే జయప్రదకు మళ్లీ యూపీ పాలిటిక్స్ లో మెరుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ పార్లమెంట్కు అమర్ సింగ్
న్యూఢిల్లీ : సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన పాత్ర మిత్రుడు అమర్ సింగ్కు ఎంపీగా మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా అమర్ సింగ్ మరోసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. అమర్ సింగ్తో పాటు బేణీ ప్రసాద్ వర్మ పేర్లును రాజ్యసభ సభ్యులుగా బెర్త్ లు ఖరారు అయ్యాయి. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎస్పీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం లక్నోలో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా అమర్ సింగ్తో పాటు బేణీ ప్రసాద్, సంజయ్ సేథ్, శుక్రాం యాదవ్, విశ్వంభర్ ప్రసాద్ నిశీద్, అరవింద్ సింగ్, రేవతి రామన్ సింగ్ పేర్లను ప్రకటించింది. జూన్లో జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా ఆరు సీట్లు సమాజ్ వాదీకి దక్కనున్నాయి. కాగా సమాజ్వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ తిరిగి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆరేళ్ల తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ కొన్నాళ్లకు 'రాష్ట్రీయ లోక్ మంచ్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ ఆయనకు అంతగా కలసి రాకపోవడంతో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) లో చేరారు. అక్కడా కలిసిరాక చివరకు ఎస్పీలో చేరారు. -
ఆ ప్రశ్నలకు సమాధానం దాటవేత
లక్నో: సమాజ్ వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ పునరాగమనంపై అడిగిన ప్రశ్నలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సమాధానం దాటవేశారు. అమర్ సింగ్ మళ్లీ సమాజ్ వాది పార్టీలోకి వచ్చే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... ఈ ప్రశ్నకు ఔచిత్యం లేదంటూ సమాధానమిచ్చారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని ములాయం పక్కనే కూర్చున్న ఆజాంఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బేణి ప్రసాద్ వర్మ శుక్రవారం సమాజ్ వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ విలేకరులతో మాట్లాడినప్పుడు అమర్ సింగ్ పునరాగమనంపై పలు ప్రశ్నలు సంధించారు. వీటికి ములాయం జవాబివ్వలేదు. ఇటీవల అమర్ సింగ్ తరచుగా ములాయం, యూపీ సీఎం అఖిలేశ్ నివాసాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో మళ్లీ సమాజ్ వాది పార్టీలోకి వస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
అమితాబ్ నన్ను అప్పుడే హెచ్చరించాడు!
ముంబై: పనామా ప్రకంపనల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్ దేవగణ్ చిక్కడం హిందీ సినీ పరిశ్రమను కుదిపేసింది. పన్ను ఎగవేతకు స్వర్గధామల్లాంటి దేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచి.. అక్రమంగా డబ్బు దాచుకునేందుకు పనామాలోని 'మోసాక్ ఫొన్సెకా' అనే లా కంపెనీ సేవలు వీరు వాడుకున్నారన్నది ప్రధాన అభియోగం. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తన పేరును దుర్వినియోగం చేసి విదేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచినట్టు కనిపిస్తున్నదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఇటీవల ఒకప్పటి బిగ్ బీ సన్నిహితుడు, యూపీ రాజకీయ నేత అమర్సింగ్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అమితాబ్ పనామా పత్రాల వివాదంలో చిక్కుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా.. 'రెండురోజుల కిందటే నేను పబ్లిగ్గా చెప్పాను. ఐశ్వర్య గానీ, అభిషేక్గానీ నా పట్ల అమితమైన గౌరవం చూపుతారు. అమితాబ్ తోనూ నాకెలాంటి గొడవ లేదు. నిజానికి ఆయనే నన్ను ఓసారి హెచ్చరించాడు. జయాబచ్చన్కు స్థిరచిత్తం ఉండదని, ఆమెను మీ రాజకీయాల్లోకి (పార్టీలోకి) తీసుకోవద్దని సూచించాడు. కానీ, నేను ఆయన ఉదాత్తమైన సలహాను వినలేదు. జయ అలవాట్లు, అస్థిరమైన ధోరణి కారణంగా ఆమె నుంచి ఎలాంటి కచ్చితత్వాన్ని ఆశించవద్దని అమితాబ్ నన్ను హెచ్చరించాడు. ఆమె తరఫున నాకు ఆయన క్షమాపణలు చెప్పాడు కూడా. అక్కడితో ఈ విషయం ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ నివాసంలో డిన్నర్ సందర్భంగా జయాబచ్చన్ వల్ల ఓ గొడవ జరిగింది. ఈ వివాదంలో బచ్చన్ కూడా తలదూర్చారు. కాబట్టి (పనామా వివాదంపై) ప్రశ్నలను అరుణ్ జైట్లీని అడగండి. లేదా ఈ వివాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను అడగండి. అదీ కుదరకపోతే అమితాబ్నే నేరుగా అడగండి. నన్ను వదిలేయండి. అమితాబ్ ప్రసక్తి లేకుండా శాంతియుతంగా ఉండనివ్వండి' అని అమర్ చెప్పుకొచ్చారు. -
కౌలాలంపూర్ పోలీస్ బాస్గా భారత సంతతి పౌరుడు
కౌలాలంపూర్: మలేషియాలో భారత సంతతి పౌరుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతి సిక్కు పోలీసు అధికారి అమర్ సింగ్ కౌలాలంపూర్ కమిషనర్ ఆఫ్ పోలీసు చీఫ్ గా నియామకం అయ్యారు. తాజుద్దీన్ మహ్మద్ అనే పోలీసు అధికారి స్థానంలో అమర్ సింగ్ అనే భారత సంతతి పౌరుడు కొనసాగనున్నారు. తాజుద్దీన్ మహ్మద్ సీఐడీలోని వాణిజ్య విభాగ డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో భారత సంతతి పౌరుడికి ఈ అవకాశం దక్కింది. గతంలో ఈ పోస్టుకు ఇదే సిక్కు మతానికి చెందిన సంతోఖ్ సింగ్ అనే వ్యక్తి ఎంపికయ్యారు. అమర్ సింగ్ తండ్రి, తాత కూడా పోలీసు అధికారులే. అమర్ తండ్రి ఇషార్ సింగ్ 1939లో మాలే స్టేట్ పోలీసు విభాగంలో చేరారు. -
'వారిద్దరూ నన్ను చంపేందుకు కుట్రపన్నారు'
లక్నో: సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తనను చంపేందుకు కుట్రపన్నారని ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. అమర్ సింగ్, సంగీత్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, వీరిద్దరూ తనను అంతం చేసేందుకు పథకం రచించారని చెప్పారు. వీరు తాము అనుకున్నది చేయగలరని ఆజం ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, సోమ్ ఇంతకుముందు ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో ఆజంకు సంబంధముందని ఆరోపించారు. అమర్ సింగ్ కూడా ఆజం ఖాన్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపణలు చేశారు. -
సునంద కేసులో అమర్సింగ్కు సిట్ పిలుపు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనను పిలిపించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా అమర్ సింగ్తో పాటు సునంద కుమారుడికి కూడా కబురు పంపింది. సునంద హత్య కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఆమె సన్నిహితులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో సునంద కొడుకు, అమర్ సింగ్లను ప్రశ్నించనున్నారు. ఐపీఎల్ వివాదంలో సునంద పేరు తెరపైకి వచ్చినపుడు అమర్ సింగ్ ఆమెను సమర్థించారు. అంతేగాక సునంద తనకు మంచి స్నేహితురాలని అప్పట్లో ఆయన చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అమర్ సింగ్ను విచారించనుంది. సునంద హత్య కేసులో భర్త శశి థరూర్తో పాటు ఆమె సన్నిహితురాలు నళినీ సింగ్లను ఇటీవల విచారించారు. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
అమర్ సింగ్ చూపు.. బీజేపీ వైపు!
-
10 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ
న్యూఢిల్లీ: పదిమంది రాజ్యసభ సభ్యులు తమ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని మంగళవారం పదవీ విరమణ చేశారు. వీరిలో బ్రజేశ్ పాథక్ (బీఎస్పీ), అమర్ సింగ్ (స్వతంత్ర), అవ్తార్ సింగ్ కరీమ్పురి (బీఎస్పీ), మొహమ్మద్ అదీబ్ (స్వతంత్ర), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), వీర్ సింగ్ (బీఎస్పీ), అఖిలేశ్ దాస్ గుప్తా, బ్రిజ్లాల్ ఖబ్రి, కుసుమ్ రాయ్, రాజారామ్ ఉన్నారు. రిటైరైన వారిలో ముగ్గురు తిరిగి సభ్యులుగా ఎన్నికయ్యారు. -
అమర్సింగ్కు ములాయం జెల్ల!
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. తన పాత మిత్రుడు అమర్సింగ్కు మరోసారి జెల్లకొట్టారు. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాటిలో అమర్ సింగ్ పేరు మాత్రం లేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్ పదవీకాలం త్వరలోనే ముగుస్తోంది. అయితే, సమాజ్వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీ, చంద్రపాల్ సింగ్ యాదవ్, నీరజ్ శేఖర్, రవిప్రకాష్ వర్మ, తంజీమ్ ఫాతిమాల పేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్లలో నీరజ్ శేఖర్.. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు. ఫాతిమా.. మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతుడైన ఆజం ఖాన్ భార్య. రాంగోపాల్ యాదవ్ అంటే స్వయానా ములాయం సింగ్ యాదవ్కు బంధువు. చాలామంది ఈసారి అమర్ సింగ్కు కూడా రాజ్యసభ అవకాశం వస్తుందని అంచనా వేశారు గానీ, అది మాత్రం సాధ్యం కాలేదు. కొన్ని రోజుల క్రితం అమర్ సింగ్ వెళ్లి సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ ఇద్దరినీ కలిశారు. కానీ, అసలు అమర్సింగ్ మళ్లీ పార్టీలోకి రావడాన్నే రాంగోపాల్ యాదవ్, ఆజంఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాగోలా ఆ అడ్డంకులను అధిగమించి అమర్ సింగ్ వచ్చినా, చివరకు ఆయనకు పదవి దక్కకుండా వీరిద్దరూ అడ్డుకుని.. తమవాళ్లకు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఈసారి మొత్తం 10 మందిని ఎన్నుకోవాలి. అసెంబ్లీలో బలాన్ని బట్టి సులభంగా 6 సీట్లు సమాజ్వాదీకి దక్కుతాయి. -
అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే సంబంధాలను పక్కన పెట్టి ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ లు ఏకమయ్యేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. మంగళవారం ఉదయం సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలోని నివాసానికి అమర్ సింగ్ రావడం చర్చనీయాంశమైంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ ను మళ్లీ పార్టీలోకి రప్పించి పటిష్టం చేసే విధంగా ములాయం వ్యూహాలు పన్నుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అమిత్ సింగ్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ములాయం, అమర్ సింగ్ లు ఏకమవ్వడమే కాకుండా.. మయావతిని కూడా తమ కూటమిలోకి చేరాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం అన్ని ప్రధాన పార్టీలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. -
అమర్సింగ్ను పార్టీలో చేర్చుకోం: యాదవ్
మెయిన్పురి: రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ను మళ్లీ సమాజ్వాది పార్టీ చేర్చుకుంటారని వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తోసిపుచ్చారు. అమర్సింగ్ను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదని యాదవ్ చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ములాయం సింగ్ యాదవ్, అమర్సింగ్ ఓ బహిరంగ సభలో ఒకే వేదిక మీద కనిపించారు. దీంతో అమర్సింగ్ మళ్లీ సమాజ్వాది పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది. -
'మా మధ్య బ్రోకర్ అవసరం లేదు'
ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ల స్నేహం 'జయ' కారణంగానే చెడిందట. జయ అంటే జయప్రద అనుకునేరు. ఎంతమాత్రం కాదు. అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కారణంగానే చిరకాల మిత్రుడికి దూరం అయ్యాయని అమర్ సింగ్ స్వయంగా వెల్లడించారు. తమిద్దరి మధ్య జయ చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ములాయంకు అత్యంత సన్నిహితంగా మెలగిన అమర్ సింగ్ అనూహ్యంగా 2010లో సమాజ్వాది పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారు. తర్వాత వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఇక సమాజ్వాది పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్తో వైరంగా కారణంగా అమర్ సింగ్ స్నేహితురాలు జయప్రద కూడా ములాయంకు దూరయ్యారు. తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలో చేరారు. ఇదిలావుంచితే తాజాగా జయబచ్చన్ పై అమర్ సింగ్ విరుచుకుపడ్డారు. ములాయంతో సంబంధాలు పునరుద్దరించుకోవడానికి తనకు బ్రోకర్ అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. అసలు తన పాత్ర మిత్రుడితో సంబంధాలు దెబ్బతినడానికి జయా బచ్చనే కారణమని వెల్లడించారు. తనకు, ములాయంకు మధ్య జయ మధ్యవర్తిగా వచ్చినప్పటి నుంచే తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. తమ మధ్య సంబంధాలు మళ్లీ చిగురించడానికి ఏ మధ్యవర్తి, బ్రోకర్ అక్కర్లేదని ఘాటుగా విమర్శించారు. అయితే ములాయంకు మళ్లీ దగ్గరయ్యేందుకే అమర్ సింగ్ ఈ పల్లవి అందుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఒకే వేదికపై ములాయం, అమర్ సింగ్!
లక్నో: ఎంతో సన్నిహితంగా ఉండి బద్దశత్రువులుగా మారిని ఇద్దరు రాజకీయ నేతలు మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన అమర్ సింగ్, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు మంగళవారం ఓకే సభ పాల్గొననున్నారు. లక్నోలో నిర్వహించే జననేశ్వర్ మిశ్రా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ములాయం స్వయంగా ఆహ్వానించారని రాష్ట్రీయ లోకదళ్ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. ములాయం ఆహ్వానాన్ని స్వీకరించి రేపు కార్యక్రమానికి హాజరవుతున్నాని అమర్ సింగ్ తెలిపారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో చేరేది మాత్రం లేదని ఓ ప్రశ్నకు అమర్ సింగ్ సమాధానమిచ్చారు. -
'ఆ ఎంపీని బహిష్కరించాల్సిందే'
కోల్ కతా: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్టీయ జనతాదళ్ పార్టీ(ఆర్ఎల్డీ)నేత అమర్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు అపార నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ఆమె.. ఆ ఎంపీని పార్టీ నుంచి బయటకు పంపకపోతే రాబోవు రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని విమర్శించారు. ఆర్ఎల్డీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ఆ ఎంపీపై తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు. ' మహిళా నేతగా ఉన్న ఆమె సాటి మహిళలపై ఆరోపణలు చేసిన తపస్ పాల్ చర్యలు చేపట్టాలి. తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించడమే ఇందుకు మార్గం' అని అమర్ సింగ్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం సరైన పద్దతి కాదన్నారు. 'అతనొక మానసిక వికలాంగుడు. చాలా చెడు వ్యక్తి. పాల్ నుంచి ఒక్క క్షమాపణ ఆశించడం సరికాదు. పార్టీ బహిష్కరణ ఒక్కటే తగిన చర్య'అని ఆయన స్పష్టం చేశారు.ఇకనైనా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. -
'40 ఏళ్ల మహిళను దిగ్విజయ్ పెళ్లాడితే తప్పేంటి?'
న్యూఢిల్లీ: 40 ఏళ్ల మహిళను 68 ఏళ్ల వ్యక్తి పెళ్లాడితే తప్పేంటని ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ ప్రశ్నించారు. రాజకీయనేతల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయవద్దని అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాజకీయనేతల వ్యక్తిగత జీవితాలపై బహిరంగ చర్చ పెట్టకూడదని దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్ట్ అమృతారాయ్ వివాహ వార్తపై ఆయన స్పందించారు. నరేంద్రమోడీ, దిగ్విజయ్ సింగ్ ల వైవాహిక జీవితాలపై ప్రజావేదికల మీద చర్చ పెట్టడం సమంజసం కాదని అమర్ సింగ్ అన్నారు. దేశంలో నరేంద్రమోడీ హవాలేదని అమర్ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. సమాజ్ వాదీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రీయ లోకసభ అభ్యర్తిగా ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. -
అమర్ సింగ్ కు వ్యతిరేకంగా జయబచ్చన్ ప్రచారం
ఆగ్రా: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమర్ సింగ్, బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. అయితే ములాయం సింగ్ యాదవ్ తో విబేధించి సమాజ్ వాదీ పార్టీకి గుడ్ బై చెప్పాక అమర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ తరపున ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుంచి అమర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికల్లో అమర్ సింగ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్ ప్రచారం చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి జయ బచ్చన్ ఫతేబాద్, ఎత్మద్ పూర్, ఫతేపుర్ సిక్రి ప్రచారం చేపట్టనున్నారు. ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జయప్రద, శ్రీదేవి, బోని కపూర్, రాజా మురాద్, అస్రానీ తదితర బాలీవుడ్ ప్రముఖులతో ఇటీవల అమర్ సింగ్ ర్యాలీలు నిర్వహించారు. -
అమరాంజనేయస్వామి!
నమ్మకం ఆ బాలుడి పేరు అమర్సింగ్. వయసు ఆరు సంవత్సరాలు. ఇతడిది ఉత్తరప్రదేశ్లోని నిజ్మాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఐదుమంది తోబుట్టువుల్లో అందరి కన్నా చిన్నవాడు.ఆమర్ ఇప్పుడు వాళ్ల ఊరిలో ప్రత్యేకమైన వాడు. అతడిని ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తోంది ఆ గ్రామం మొత్తం. అందుకు కారణం అమర్కు వెన్నెముకకు కింది భాగంలో శరీరంపై పొడవాటి రోమాలు ఉండటమే. పొడవుగా పెరిగిన అవాంఛిత రోమాలు అతడు ఆంజనేయస్వామి అంశ అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. గ్రామస్తులే కాదు, అమర్ కుటుంబం కూడా అదే అభిప్రాయంతో ఉంది. తమకు దైవాంశ పుట్టాడని అమర్ తండ్రి అంటున్నాడు. తమ కుమారుడికి ఆ వెంట్రుకలు వరంగా లభించాయని ఆయన అంటున్నాడు. ఇక అమర్కు అలా వెంట్రుకలు పెరగడం స్పైనా బిఫిడా ప్రభావమే అంటున్నారు వైద్యులు. వెన్నెముకకు సంబంధించిన చిన్నపాటి సమస్యతో అలా వెంట్రుకలు పెరగడం జరుగుతుందని వైద్యుల అభిప్రాయం. అయితే ఇలా వెంట్రుకలు పెరగడం వల్ల అసౌకర్యం ఉండవచ్చునేమో కానీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ర్పభావం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
అమర్ సింగ్ ఆస్తి వంద కోట్లు!!
అమర్ సింగ్.. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఈయన ఆస్తి ఎంతో తెలుసా? అచ్చంగా వంద కోట్లు!! ఫతేపూర్ సిక్రీ స్థానం నుంచి రాష్ట్రీయ లోక్దళ్ తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న అమర్సింగ్.. తనకు, తన భార్యకు కలిపి వంద కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడి, మ్యూచువల్ పండ్లు, బీమా పాలసీలు కలిపి రూ. 41.34 కోట్ల చరాస్తులు ఉన్నాయన్నారు. ఓ భాగస్వామ్య సంస్థలో రూ. 12.23 కోట్ల పెట్టుబడి, లెక్సస్, మారుతి స్విఫ్ట్ కార్లు, 8.68 లక్షల విలువైన బంగారం, 28 కిలోల వెండి పాత్రలు ఉన్నాయి. ఇంకా ఫర్నిచర్, వాచీలు, పెయింటింగులు.. వీటన్నింటి విలువ రూ. 64.40 లక్షలు. ఆయన భార్యకు రూ. 21.95 కోట్ల చరాస్తులున్నాయి. తనకు చేతిలో పది లక్షల నగదు, తన భార్యకు ఐదు లక్షల నగదు ఉన్నట్లు అమర్ సింగ్ ప్రకటించారు. ఆయనకు బెంగళూరు, నోయిడా, లక్నో లాంటి ప్రాంతాల్లో ఇళ్లు, భూములు ఉన్నాయి. -
'అమితాబ్, జయబచ్చన్ అవకాశావాదులు'
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దంపతులపై రాష్ట్రీయ లోక దళ్ నేత అమర్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బచ్చన్ కుటుంబం సభ్యులు అవకాశవాదులని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. గుజరాత్ అభివృద్ధిపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అనుకూలంగా అమితాబ్ బచ్చన్ టెలివిజన్ లో ప్రకటనలు ఇవ్వడాన్ని అమర్ సింగ్ తప్పుపట్టారు. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజసభ్యురాలిగా జయాబచ్చన్ ఉన్నారని.. అయితే గుజరాత్ అభివృద్దికి కారణం మోడీ అంటూ అమితాబ్ కీర్తించడం సమంజసమా అని ప్రశ్నించారు. జయ, అమితాబ్ లు అవకాశవాదులని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలని ఆయన అన్నారు. భార్త అమితాబ్ మోడితో.. భార్య సమాజ్ వాదీ పార్టీలో ఉంటూ అవకాశ రాజకీయాలు నడుపుతున్నారని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత మోడీతో పొత్తు పెట్టుకోవడానికి బచ్చన్ కుటుంబాన్ని ములాయం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, ములాయంల మధ్య సయోధ్య కుదర్చడానికి బచ్చన్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అమర్ సింగ్ విమర్శించారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా ఉన్న అమర్ సింగ్ ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతే పూర్ సిక్రి నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ టికెట్ బరిలోకి దిగారు. -
ఎలక్షన్ వాచ్...
జయప్రద, అమర్లకు ఎంపీ టికెట్ల ఖరారు లక్నో: రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ)లో చేరిన సమాజ్వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్సింగ్, జయప్రదలకు లోక్సభ టికెట్లు ఖరారయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ నుంచి అమర్, బిజ్నూర్ నుంచి జయ పోటీలో దిగనున్నారు. ఆర్ఎల్డీ అధినేత అజిత్సింగ్ బాగ్పత్ నుంచి బరిలో దిగుతుండగా, ఆయన తనయుడు జయంత్ చౌధురి మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్తో జతకట్టిన ఆర్ఎల్డీకి సర్దుబాటులో భాగంగా యూపీలో ఆరు సీట్లు వచ్చాయి. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆర్ఎల్డీ మంగళవారం ప్రకటించింది. ‘చాయ్ పే చర్చా’లో ఉచిత టీలు ఇవ్వొద్దు! లక్నో: ముందస్తుగా తగిన అనుమతి తీసుకున్న తర్వాతే ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ కార్యక్రమం సందర్భంగా ఎన్నికల కోడ్ను అతిక్రమించేలా ప్రజలకు ఉచితంగా టీలు ఇవ్వొద్దని మంగళవారం బీజేపీకి ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా ఎన్నికల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాకే చాయ్ పే చర్చా నిర్వహించాలని యూపీ ముఖ్య ఎన్నికల అధికారి ఉమేశ్ సిన్హా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి చాయ్కి డబ్బులు వసూలు చేయాలన్న షరతుతోనే సంబంధిత అధికారులు అనుమతి జారీ చేస్తారన్నారు. చాయ్ పే చర్చాలో చాయ్కి అందరితోనూ డబ్బులు వసూలు చేస్తామని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయ్ హామీనిచ్చారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు మోడీ బుజ్జగింపు ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)తో దోస్తీకి బీజేపీ అర్రులు చాస్తుండడంపై భగ్గుమంటున్న ఎమ్మెన్నెస్ బద్ధశత్రువు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రంగంలోకి దూకారు. ఉద్ధవ్ కు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేసి బుజ్జగించారు. ‘సేన బీజేపీకి పాత, నమ్మకమైన నేస్తం. పాతికేళ్ల మన బంధం బలమైంది’ అని మోడీ చెప్పినట్లు శివసేన వర్గాలు తెలి పాయి. ప్రస్తుత పరిణామాలపై ఆందోళనపడాల్సి అవసరం లేదని అన్నారన్నాయి. రాజకీయ పార్టీలపై ఎనిమిది కేసులు న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు వివిధ రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు 8 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. లోక్సభ ఎన్నికలకు ఈ నెల 5న షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నియమావళి అదే రోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోడ్ను ఉల్లంఘించాయంటూ కాంగ్రెస్పై ఒకటి, ఇతర పార్టీలపై ఏడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని ఈసీ నోడల్ అధికారి ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 72 తుపాకులు, పెద్ద మొత్తంలో లిక్కర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మూడో కూటమికి మద్దతు: కరుణ చెన్నై, సాక్షి : రాహుల్గాంధీ, నరేంద్రమోడీ లేని మూడో లౌకికవాద కూటమికి డీఎంకే మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి స్పష్టం చేశారు. వంద అంశాలు, హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం ఆయన ఇక్కడ విడుదల చేశారు. కచ్చదీవుల సాధన, సేతు సముద్ర పథకం పూర్తి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్, పది లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఈలం తమిళుల సమస్యపై ప్రజాభిప్రాయ సేకరణ, ఉరిశిక్ష రద్దు, మద్రాస్ హైకోర్టులో తమిళ భాష అమలు, నదుల అనుసంధానం వంటి వంద హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 76 మంది ఎంపీలపై తీవ్ర నేరాభియోగాలు న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభ సభ్యుల్లో 76 మంది తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్), జాతీయ ఎన్నికల నిఘా సంస్థ(ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. 2009లో లోక్సభకు ఎన్నికైన నేతల్లో 162 మంది 306 క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండగా.. వారిలో 76 మంది హత్య, అపహరణ వంటి తీవ్ర నేరాల్లో నిందారోపణలను ఎదుర్కొంటున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో అభియోగాలు నమోదైతే.. ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఈ సంస్థలు నేతలపై కేసుల వివరాలను బయటపెట్టడం గమనార్హం. పెరుగుతున్న ఎన్నికల వ్యయం! సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న పార్టీల సంఖ్య, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య, జనాభాకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్లు.. ఓటరు చైతన్య కార్యక్రమాలు.. వెరసి ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం నానాటికీ పెరుగుతోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఓటరు తలసరి వ్యయం పైసలు దాటి రూపాయిలకు చేరింది. దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగిన 1951-52 నుంచి 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల వరకు ప్రభుత్వ ఖర్చు పరిశీలిస్తే ఓటరు తలసరి వ్యయం 20 రెట్లు పెరిగింది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. 1951-52లో తొలి లోక్సభ ఎన్నికల్లో ఒక ఓటరుకు 60 పైసలు వ్యయం చేయగా, 2009 నాటి ఎన్నికల్లో ఈ వ్యయం రూ.12కు చేరింది. 1951-52లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.10.45కోట్లు వ్యయం చేయగా, 2009లో రూ.846.67 కోట్లు వ్యయం చేసింది. -
జయప్రదకు ఆర్ఎల్డీ ఎంపీ టిక్కెట్
లక్నో: రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)లో చేరిన సమాజ్వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్సింగ్, జయప్రదలకు లోక్సభ టిక్కెట్లు ఖరారయ్యాయి. అమర్సింగ్కు ఫుతేపుర్ సిక్రీ, జయప్రదకు బిజ్నౌర్ స్థానాలు కేటాయించారు. ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ బాగ్పట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన తనయుడు జయంత్ చౌదురి మాథూరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీ ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు దక్కాయి. నటి జయప్రద, అమర్ సింగ్... సమాజ్వాది పార్టీ నుంచి 2010, ఫిబ్రవరిలో బహిష్కృతులయ్యారు. వీరిద్దరూ నిన్న ఆర్ఎల్డీలో చేరారు. -
అమర్, జయ ప్రవేశంతో ఆరెల్డీలో లుకలుకలు
చౌదరి అజిత్సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) పార్టీలోకి అమర్ సింగ్, జయప్రద వెళ్లడంతో ఆ పర్టీలో లుకలుకలు మొదలయ్యాయి. అసలు వాళ్లను పార్టీలోకి తీసుకోవడం ఏంటని కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లు ఆరెల్డీ పంచన చేరడంతో పలు పార్టీలకు సంబంధించి లోక్సభ ఎన్నికల వ్యూహాలు కూడా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అమర్సింగ్ ఫతేపూర్ సిక్రీ నుంచి, జయప్రద బిజ్నూర్ నుంచి పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. ఫతేపూర్ సిక్రీలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి అరిదమాన్ సింగ్ భార్య పక్షిలా సింగ్ను నిలబెడుతుండగా, బీఎస్పీ తరఫున ఆ పార్టీ నేత రాంవీర్ ఉపాధ్యాయ భార్య సీమా ఉపాధ్యాయను పోటీ చేయిస్తున్నారు. ఆమె మాయావతికి సన్నిహితురాలు. ఇంతకుముందు ఆమె కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ను ఓడించారు. అయితే ఫిరోజాబాద్ ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్పై రాజ్ బబ్బర్ గెలిచారు. బీజేపీ మాత్రం ఈ స్థానంలో ఎవరిని నిలబెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్, నటుడు సన్నీ డియోల్, బాబూలాల్ చౌదరి, కేశవ్ దీక్షిత్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అమర్ సింగ్ వస్తున్నారు కాబట్టి.. ఇప్పుడు గట్టి అభ్యర్థిని నిలబెట్టాల్సిందేనని ఇతర పార్టీలు భావిస్తున్నాయి.