basara
-
బాసరలో వసంత పంచమి వేడుకలు
-
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
-
బాసరలో ప్రారంభమైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తొలి విడతలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ చేస్తోంది. ఇక, బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలని మూడుచోట్ల నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం, బాసర, ఆలంపూర్ నుంచి యాత్రలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల్లో స్థానిక బీజేపీ నేతలు, లీడర్లు ఆ మార్గాల్లోనే పాల్గొననున్నారు. సుమారు 18 రోజులు పాటు బీజేపీ నేతల యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక్కో రూట్లో 36 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు. ఇక, బీజేపీ నేతల యాత్ర ప్రారంభం నుంచే ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కమలం పార్టీ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. అయితే, యాత్ర ముగింపు సభను సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీని కూడా ముగింపు సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన ముగింపు సభ కన్నా ముందే ఉండే నేపథ్యంలో యాత్రలు కూడా ముందుగానే ముగించాలనుకుంటున్నట్టు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: పవన్. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్ -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్పిలానీ ప్రొఫెసర్ మోహన్తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్చాన్స్లర్ వెంకటరమణ ఏఐ యాప్పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
అక్కడ ఎందుకలా చనిపోతున్నారు?
నిర్మల్: విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి. ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. జూన్లోనే ఇద్దరు విద్యార్థి నులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం. బలవన్మరణాలు ఎందుకు? ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్లో.. అదీ ఎగ్జాస్ట్ ఫ్యాన్కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక(17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు. ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ–1 చదువుతున్న గజ్వేల్కు చెందిన బుర్ర లిఖిత జూన్ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయింది. లిఖిత మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ మండలం నాగాపూర్కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ చేస్తున్నారా.. విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పా ర్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది.. నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరుగుతోంది.. అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు. ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.. -
బబ్లూ ఎలా చనిపోయాడో చెప్పాలని తల్లిదండ్రుల డిమాండ్
-
బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబిత ఆరా
-
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్కుమార్తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
RGUKT బాసర VC ప్రొఫెసర్ వి.వెంకట రమణ మీట్ అండ్ గ్రీట్
-
బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!
భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డికి వివరించారు. కొత్త నమూనాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్ప్లాన్ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు. కృష్ణ శిలలతో నిర్మాణం... గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. -
సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు
బాసర (ముథోల్): బాసరలోని జ్ఞాన సరస్వతీదేవిపై భారతీయ నాస్తిక సంఘం రాష్ట్ర శాఖకు చెందిన రేంజర్ల రాజేశ్ అనే గాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం బాసరవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్థానిక రైల్వేస్టేషన్ చౌరస్తాలో బైఠాయించి రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమ్మవారిని వ్యంగ్య పదాలతో దూషించిన రాజేశ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ తాత్కాలిక లేబర్ సొసైటీ సిబ్బంది సైతం అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం ఎదుట ధర్నా చేశారు. గ్రామస్తులతో కలసి ర్యాలీగా వెళ్లి.. పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రాజేశ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్పై ఐపీíసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. కాగా, సరస్వతీదేవిని దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేశ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీహెచ్పీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. నరేశ్ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు కాళేశ్వరం: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే వికారాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన బైరి నరేశ్ను మహారాష్ట్ర పోలీసులు ఇదే తరహా కేసులో అరెస్టు చేశారు. అతన్ని గడ్చిరోలి జిల్లా సిరొంచ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతేడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో సిరొంచలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సిరొంచ, అహేరి తాలూకాల్లో అతనిపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను తిడితే వీపులు పగలకొట్టండి ఎంపీ సోయం బాపూరావ్ బోథ్: హిందూ దేవుళ్లను తిట్టినా.. కించపరిచినా వారి వీపులు పగలకొట్టాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దేవుల్నాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన జగదాంబదేవి జాతరలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. పోలీసులకు ఫిర్యాదు.. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేశ్పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్లో టెన్షన్.. టెన్షన్.. -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసరలో చక్రేశ్వరి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బాసరలో అరుదైన జైన శిల్పాన్ని గుర్తించారు. ఇది జైన మతంలో ప్రాధాన్యమున్న శాసనదేవత చక్రేశ్వరి విగ్రహం కావటం విశేషం. బాసరలో ఇంద్రతీర్ధంగా పిలుచుకునే కుక్కుటేశ్వరాలయంలో ఈ విగ్రహం ఉంది. సుఖాసనస్థితిలో ఉన్న ఈ చతుర్భుజి విగ్రహం వెనక హస్తాలలో శంఖం, అకుశం ఉండగా.. ముందు కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి ఫలంతో ఉంది. తలపై కిరీట మకుటం, తల వెనక ప్రభావళి, చెవి కుండలాలు, జైన తీర్థంకరులకు ఉండే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు ఉన్నాయని, ఇది 9 లేదా 10 శతాబ్దాలకు చెందిన రాష్ట్రకూట శైలి విగ్రహమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తమ బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దీన్ని గుర్తించారని చెప్పారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
-
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్!
బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హాస్టల్ రూం నంబర్ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఆ గదిలోని నూతన వస్తువులైన బెడ్ కార్టులు, ట్యూబ్ లైట్లను పీయూసీ–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు. ఇటీవల డైరెక్టర్ సతీశ్కుమార్ హాస్టల్ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకూ సీనియర్ల ర్యాగింగ్ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు. -
బాబ్లీ గేట్ల మూసివేత
బాల్కొండ/బాసర (ముధోల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్లోకి వచ్చే వరదలకు బ్రేకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి 0.6 టీఎంసీల నీటిని వదలాలి. అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా ఉండటంతో మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 8268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్లద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులతో నిండుగా ఉంది. -
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
బాసర ట్రిపుల్ ఐటీ రెండో జాబితా విడుదల
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో జాబితాను ఆదివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతలో 1,404 మంది విద్యార్థుల జాబితాలో గైర్హాజరైన 125 మందికి సంబంధించిన సీట్ల జాబితాను కళాశాల వెబ్సైట్లో పొందుపర్చారు. ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు రాష్ట్రేతర (గ్లోబల్ సీట్లు), దివ్యాంగులకు కేటాయించిన సీట్లతో పాటు స్పోర్ట్స్, కాప్ కేటగిరీకి చెందిన 95 సీట్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. 125 సీట్లకు సంబంధించి 7న, మిగిలిన కేటగిరీలకు సంబంధించిన 95 సీట్లకు ఈనెల 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మొదటి విడతలో 1,279 మంది విద్యార్థులు ప్రవేశం పొందార -
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవలే కళాశాల భవనంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బాయ్స్ హాస్టల్–2లోని ఓ గదిలో శనివారం రాత్రి నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడిపడటంతో గదిలో పడుకున్న విద్యార్థి మెడ భాగంలో గాయాల య్యాయి. వెంటనే ఇతర విద్యార్థులు అధికా రులకు సమాచారం ఇవ్వడంతో వారు వర్సిటీ లోని ఆస్పత్రిలో విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించారు. ఫ్యాన్ తలపై పడి ఉంటే ఘోరం జరిగేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటిని పరిశీలించిన గవర్నర్ తమిళిసై
-
నిర్మల్ జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన
-
బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన విరమించిన విద్యార్థులు
-
మరోసారి ఆందోళన బాటలో బాసర IIIT విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలం
-
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు విఫలం
-
ఆరో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన
-
బాసర ట్రిపుల్ ఐటీలో ౩వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
-
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
బాసరలో పోటెత్తిన భక్తులు
-
హైదరాబాద్లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. -
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి
భైంసా (ముధోల్)/ధరూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం నుంచి నది వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన హరిహర కాటేజ్ నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా నదిలో వరద ప్రవాహం మాత్రం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత బాసర ఆలయం వైపు వెళ్లే మార్గాన్ని సైతం ముంచెత్తింది. ఇదే మార్గంలో ఉన్న హరిహర కాటేజ్ నీట మునిగింది. అందులో ఉన్నవారంతా అప్రమత్తమై స్లాబుల పైకి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పడవల సాయంతో కాటేజ్ వద్దకు చేరుకుని 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతూ మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణ ఆలయానికి తాకింది. రైల్వే వంతెన నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న పొలాలన్నీ నీటమునిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు. జూరాలకు మళ్లీ వరద ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి 1,27,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని 11యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1,60,553 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీలు ఉంది. -
పునః ప్రారంభమైన బాసర శ్రీ జ్ఞ్యాన సరస్వతి ఆలయం
-
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన ‘గీత’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు) సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. -
నాగుల పంచమి: కొండచిలువ కలకలం
సాక్షి, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు పొడవాటి కొండచిలువ శనివారం కనిపించింది. ఈ రోజు శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆలయం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. (పులికి చెమటలు పట్టించిన పైథాన్) అదే విధంగా ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా రెండు జంట నాగులు సయ్యాటలాడాయి. ఈ ఘటన చెక్ డ్యాం వద్ద చోటుచేసుకుంది. శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. -
బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం
-
బాసర: రేపటి నుంచి అర్జిత సేవలు బంద్
సాక్షి, బాసర(నిర్మల్): కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, మాల్స్, థియోటర్లు, రెస్టారెంట్లతో పాటు ప్రముఖ దేవాలయాలను కూడా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) వేములవాడ రాజన్న ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి(శనివారం) నుంచి అర్జిత సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారి చేసింది. (రాజన్న ఆలయం మూసివేత) ఇక రేపటి నుంచి భక్తులు ఆలయాలని రావోద్దని ఆలయ అధికారులు సూచించారు. ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, కుంకుమార్చన వివిధ అర్జిత సేవలు నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఇక ఆలయంలో వేకువ జామునే జరిగే సరస్వతి అమ్మవారి అభిషేకం, హారతి పూజలు యధావిధిగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు. -
బాసర ఆలయంలో పోటెత్తిన భక్తులు
-
కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసిన విద్యార్థులు
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్గా తెలుస్తోంది. -
లడ్డూ ప్రసాదంలో పురుగుల ఘటనపై అధికారుల ఆరా
-
బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయస్థాయి అవార్డు
బాసర: బ్లాక్చైన్ సాంకేతిక పరిజ్ఞానంపై బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు వరించింది. రాజస్తాన్ ఎలేట్స్ టెక్నో ఆధ్వర్యంలో జైపూర్లో ఈనెల 24, 25వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్తాన్ ఉన్నత విద్య కమిషన్ కార్యదర్శి అశుతోష్ ఏటిపడేకర్ చేతుల మీదుగా బాసర ట్రిపుల్ ఐటీ అకడమిక్ డీన్ సాయినాథ్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మణిపూర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రులు, ఏఐసీటీఈ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో పెరగనున్న సీట్లు!
బాసర(ముథోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2018–19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 500 సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2008లో 2000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్ఐటీని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల సీట్ల నుంచి వెయ్యి సీట్లకు కుదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పలుసార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రిపుల్ఐటీలో 6వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లు విద్యాభ్యాసం పూర్తి చేసిన వందలాదిమందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం 500 సీట్లు పెరగనుండడంతో గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగనుంది. సీట్ల పెంపు సమాచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసరకు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
అమెరికాలో ‘వసంత పంచమి’
నిర్మల్/బాసర: బాసర క్షేత్రం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది వసంత పంచమి వేడుకలకు ఏర్పాటు చేయటం.. ఇక్కడి నుంచి పూజసామగ్రి.. పూజారులను తరలించే యత్నం చేశారు. ఇప్పటికే పంపిణీ చేసిన కరపత్రం.. ఇక్కడి నుంచి పూజారులను, పూజా సామగ్రిని తరలించేయత్నం వంటి చర్యలన్నీ అధికారిక కార్యక్రమాన్ని తలపిస్తుండగా.. ఆలయ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదనడం చర్చనీయాంశంగా మారింది. బాసర దేవస్థానం పేరిట ఈనెల 20న అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే అక్కడ కరపత్రాలు పంపిణీ చేశారు. పూజాసామగ్రి కూడా దేవస్థానమే అందిస్తోందని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, అమెరికాలో పూజా కార్యక్రమాలకు ఇక్కడి ఆలయం నుంచి విగ్రహాలు, ఎలాంటి పూజాసామగ్రి, అర్చకులు వెళ్లడం లేదని ఈవో సోమయ్య పేర్కొన్నారు. ఆలయ రిటైర్డ్ ఈవో వెనకుండి ఈ కార్యక్ర మాన్ని జరిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కరపత్రంలో అతని పేరు ఇప్పటికీ ఈవోగానే ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులు, ఇద్దరు ఉద్యోగులను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, వారి వీసాలు రద్దు కావటంతో పక్క జిల్లాకు చెందిన అర్చకులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. -
సరస్వతీదేవి సాక్షిగా దోపిడీ పర్వం
నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సొమ్మును అక్కడ పని చేసే అధికారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆలయ ఉన్నత స్థాయి అధికారితో పాటు.. అతని తర్వాతి స్థాయి అధికారి ఓ పద్ధతిగా ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పనిమనిషి పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ దోపిడీ పర్వాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. ఇలా ఇచ్చి.. ఇలా తీసుకుంటారు.. బాసరలో నిత్యపూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం వస్తువుల కొనుగోలుతో పాటు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ దేవాదాయ శాఖ బిల్లులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంది. ఇదే విధానం ఇప్పుడు ఇక్కడి అధికారులకు కలిసి వస్తోంది. పూజా సామగ్రి, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాల నుంచి ముందుగా అధిక మొత్తంలో బిల్లులు తీసుకొని, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. సదరు దుకాణదారులు తమకు రావాల్సిన అసలైన బిల్లు తీసుకుని, అదనంగా వచ్చిన డబ్బులను తిరిగి అధికారులు సూచించిన బినామీ వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు. ఇలా సికింద్రాబాద్లోని ఓ జనరల్ దుకాణం, మహారాష్ట్రలోని మరో దుకాణం నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి. బినామీ ఖాతాల నుంచి వాటాలు.. బినామీ వ్యక్తి ఖాతాల్లోకి నగదు చేరిన వెంటనే వాటాల పంపకాలు జరిగిపోతుంటాయి. ఆలయంలోని పెద్దసారు, చిన్నసారుతో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులకూ ఇందులో వాటాలు ఉంటాయి. స్థాయిల వారీగా ఈ పంపకాలు జరుగుతాయి. ఇలా బినామీలను పెట్టుకుని కథంతా నడిపేది ఆలయంలో చిన్నసారే కనుక.. ఆయనకు కాస్త ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్లు సమాచారం. ఈ అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. తమ కుటుంబసభ్యుల ఖాతాల్లో వేసుకుంటారు. సిబ్బంది ఎరియర్సూ వదల్లేదు.. ఆలయం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఎరియర్స్నూ ఆలయ అధికారులు వదిలి పెట్టలేదు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.లక్షల్లో ఎరియర్స్ వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఆయా ఏజెన్సీలు అధికారుల బినామీ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఎరియర్స్కు సంబంధించి డబ్బులో రూ.2 లక్షలను బినామీ వ్యక్తి ఆలయ ఉన్నతాధికారి కోడలి బ్యాంకు అకౌంట్లోకి చేర్చడం గమనార్హం. ఎవరికీ అనుమానం రాకుండా రూ.2 లక్షలు ఒకేసారి వేయకుండా ఐదుసార్లు రూ.40 వేల చొప్పున ఈ ఖాతాలో జమచేసినట్లు సమాచారం. ఇక అదే రోజు ద్వితీయ స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా తన బినామీకి సంబంధించిన ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి వారి స్థాయికి తగ్గట్లు డబ్బులు ముట్టినట్లు తెలిసింది. చిన్నసారే సూత్రధారి..! ఆలయంలో కొనసాగుతున్న అవినీతి పర్వానికి అక్కడ కొనసాగుతున్న ద్వితీయ స్థాయి అధికారి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలోనే అక్రమాలకు పాల్పడ్డాడన్న కారణంతో సస్పెండ్ చేసి, అనంతరం కొండగట్టుకు డిప్యుటేషన్పై పంపించారు. గోదావరి పుష్కరాలపుడు మళ్లీ పైరవీతో బాసరకే చేరుకున్నారు. అప్పుడు మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో ఇలాంటి అధికారిని ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారంటూ ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. ఇలా చేతులు మారాయి.. - 24–05–2017న మహారాష్ట్రకు చెందిన దుకాణదారుడి నుంచి బినామీ వ్యక్తి ఖాతా (ఎస్బీఐ 62211311029)లోకి రూ.1,50,000 జమ అయ్యాయి. అదేరోజు బినామీ వ్యక్తి తన ఖాతాలో నుంచి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భార్య అకౌంట్ (62240751111)కు రూ.40 వేలు, రూ.20వేల చొప్పున రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే చిన్నసారుకు సంబంధించిన ఓ మహిళ ఖాతా (62031507489)లోకి రూ.30 వేలు జమచేశాడు. - 29–05–2017న ఆలయ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఎరియర్స్ రూ.1,05,192 లను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అకౌంట్ (52170507610)లోకి జమ చేశారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగి అందులో నుంచి వెంటనే బినామీ వ్యక్తికి చెందిన ఖాతా (62211311029)లోకి రూ.40 వేలు, రూ.30 వేల చొప్పున మొత్తం 70వేల రూపాయలు పంపించాడు. - 29–05–2017 రోజునే వాగ్దేవి కో–ఆపరేటివ్ లేబర్ సొసైటీ నుంచి చెక్ (నం.363101) ద్వారా బినామీ వ్యక్తి ఖాతాలోకి రూ.1,83,200 జమ అయ్యాయి. ఈ డబ్బులు ఆలయంలోని 86 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. - ఆలయ సిబ్బంది ఎరియర్స్ 29–05– 2017న బినామీ వ్యక్తి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల్లో నుంచి 30–05–2017న రూ.40వేల చొప్పున ఐదుసార్లు అంటే మొత్తం రూ.2 లక్షలను ఉన్నతాధికారి కోడలి ఖాతా (62495094834)లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 01–06–2017 రోజున బినామీ వ్యక్తి అకౌంట్ నుంచి ఆలయంలోని ఓ చిరు ఉద్యోగి ఖాతా (52170508400)లోకి రూ.10వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 06–06–2017 రోజున బినామీ వ్యక్తి ఖాతా నుంచి ద్వితీయ స్థాయి అధికారి భార్య ఖాతా (52170497974)లోకి రూ.26వేలు చేరాయి. ఎంక్వైరీ చేయిస్తాం.. ఆలయంలో అధికారులు బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తాం. ఈ విషయం నిజమని తేలితే ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటాం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి బినామీలు లేరు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. – సుధాకర్రెడ్డి, ఈఓ, బాసర ఆలయం -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
సాక్షి, బాసర: కార్తీక మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యకేత్రంలో 'దక్షిణ గంగా వేద నిత్య హారతి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ హారతి కార్యక్రమం శనివారం ( నవంబర్ 4 ) న మొదలు కానున్నట్టు వేద పండితులు తెలిపారు. మానవ జాతి సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ హారతి ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాటు పలువురు పాల్గొంటారన్నారు. ఈ నిత్య హారతి కార్యక్రమానికి అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
-
వీడిన ‘విగ్రహ’ ముడి
ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం ► అధికారుల సమక్షంలో తనిఖీ ► తీసుకెళ్లింది ఉత్సవ విగ్రహం కాదు నిర్మల్ రూరల్: బాసర సరస్వతమ్మ విగ్రహ లొల్లి ఓ కొలిక్కి వచ్చింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరుదాటించారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ప్రధాన అర్చకుడి అధీనంలో ఉన్నది అమ్మవారి ఉత్స వమూర్తి కాదని, భక్తులు సమర్పించిన చిన్న విగ్రహమేనని అధికారులే తేల్చారు. ఆలయ ఈవో సుధాకర్రెడ్డి, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో సోమవారం బీరువాలను తెరిచా రు. ఇందులో ప్రధాన అర్చకుడి బీరువాలో భక్తులు కానుకగా ఇచ్చిన కిలోన్నర బరు వున్న అమ్మవారి పంచలోహ విగ్రహం బయ టపడింది. ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్ శర్మలతో పాటు పరిచారకుడు విశ్వజిత్లు గత నెల 28న నల్లగొండ జిల్లా దేవరకొండ లోని రెండు పాఠశాలల్లో అక్షరాభ్యాసాలను చేయించారు. ఈ పూజలకు బాసర క్షేత్రం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో ఆలయ అధికా రులు విచారణ చేపట్టారు. ప్రధానార్చకుడు అందుబాటులో లేకపోవడం, విగ్రహం కూడా కనిపించకపోవడంతో ఆలయ అధికా రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండకు వెళ్లిన అర్చకులే విగ్రహాన్ని తీసుకెళ్లారని అనుమానం ఉందన్నారు. ఆలయ స్టోర్రూంలోని ప్రధాన అర్చకుడి బీరువాలను సీజ్ చేశారు. ఈ వివాదంలో దేవాదాయశాఖ ప్రధాన అర్చకుడు, సప్తశతి పారాయణధారుడికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాల ‘లెక్క’లేదా.. ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి.. భక్తులు సమర్పించిన విగ్రహాలెన్ని.. అన్న లెక్కలు అధికారుల వద్దే స్పష్టంగా లేనట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం రికార్డుల్లో ఉందా.. అన్న దానిపైనా అధికా రులు స్పష్టత ఇవ్వలేదు. సదరు విగ్రహం గురించి ప్రశ్నిస్తే రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందని ఈవో పేర్కొనడం గమనార్హం. ఆలయంలో ఎన్ని ఉత్సవ మూర్తులు ఉన్నాయి.. ఎన్ని భక్తులు సమర్పించిన విగ్రహాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా, ఈ విగ్రహం తరలింపు విషయంలో విచారణ కొనసాగుతుందని ఆలయ ఈవో చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. కాగా, తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగం గానే కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి చెప్పారు. తాను ఎలాంటి విగ్రహాన్ని దేవర కొండకు తీసుకెళ్లలేదని వివరించారు. బీరువా తనిఖీల్లో.. కేసు విచారణలో భాగంగా దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం ఆలయ ఈవో, బాసర తహసీల్దార్ వెంకటరమణ, ముధోల్ సీఐ రఘుపతి, బాసర ఏఎస్ఐ నర్స య్య తనిఖీలు చేపట్టారు. సీజ్ చేసిన ప్రధాన అర్చకుడి బీరువాలో సరస్వతీ మాత పంచలోహ విగ్రహం బయట పడింది. అది అమ్మవారి ఉత్సవ విగ్రహం కాదని, భక్తులు సమర్పించిన విగ్రహమేనని తేలింది. -
బాసర: బీరువాలోనే అమ్మవారి విగ్రహం!
- పోలీసుల సమక్షంలో బయటికి తీసిన అధికారులు - ఉత్కంఠకు తెర.. ఘటనపై సర్వత్రా విస్మయం నిర్మల్: బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గడిచిన 10 రోజులుగా కనిపించకుండా పోయిన అమ్మవారి ఉత్సవ విగ్రహం.. ఆలయంలోని బీరువాలో ప్రత్యక్షమైంది. సోమవారం పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు బీరువా నుంచి విగ్రహాన్ని, అలంకరణ సామాగ్రిని బయటికి తీయడంతో ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఆలయ ప్రధాన అర్చకుడు, మరో పూజారి కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించారనే ఆరోపణలపై నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగింది? నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శించే బాసర ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. ఆగస్టు 8 తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మరో పూజారితో కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఓ పాఠశాలకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పూజలు, అక్షరాభాస్యం చేయించినట్లు వెల్లడైంది. దీంతో ఆ ఇద్దరికీ నోటీసులు జారీ అయ్యాయి. బీరువాలోనే అమ్మవార్లు: పూజారులకు నోటీసులు ఇచ్చి పదిరోజులు గడిచినా, అమ్మవారి విగ్రహం ఎక్కడుందనే దానిపై స్పష్టతరాలేదు. బాసర ఆలయంలోపల రెండు బీరువాలు ఉండగా సోమవారం తహసిల్దార్, పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు వాటిని తెరిచారు. మొదటి బీరువాలోనే వెండి పళ్లెంలో సరస్వతి అమ్మవారి ఉత్సవమూర్తి, అలంకరణ సామగ్రి కనిపించాయి. ఎట్టకేలకు ఆలయంలోని బీరువాలోనే అమ్మవారి విగ్రహం ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విగ్రహం మాయం కేసులో ఆలయ అధికారి ప్రమేయం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. వీరిపై కేసులు నమోదు చేస్తారా, లేదా అన్నది తెలియాల్సిఉంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. అమ్మవారి దర్శనానికి ప్రస్తుతం మూడు గంటల సమయం పడుతోంది. గురుపౌర్ణమి చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులకు దేవాలయ అధికారులు పట్టువస్ర్తాలు సమర్చించనున్నట్లు తెలిపారు. -
బాసరలో యాత్రీకుల యాతన
భైంసా(ముథోల్) : బాసర క్షేత్రానికి భక్తులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. చిన్న పిల్లలతో కుటుంబమంతా రాత్రి సమయంలో రైలు దిగి ఆలయానికి వెళ్లేందుకు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ముందరున్న ఏ వాహనమైన సరే తీసుకుని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి.. అప్పటికే ప్రయాణంలో అంతా అలిసిపోయి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోతారు. పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని పక్కనే ఉన్న ఆలయానికి చేరుకోవాలని యాత్రీకులు తపన పడుతుంటారు. అలాంటి సమయంలో వచ్చే యాత్రీకులకు రైలు దిగగానే ఉచిత బస్సు సౌకర్యం ఉందని, ఆలయంలో వసతి సౌకర్యం ఉందని చెప్పే ఏర్పాట్లు ఉండాలి. రైల్వేస్టేషన్లోనే ఆలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి యాత్రీకులకు తగ్గట్లు అవసరమైతే బస్సును 2 నుంచి 3 ట్రిప్పులు అయినా సరే పంపించే ఏర్పాట్లు చేయాలి. బస్సులో వెళ్లే యాత్రీకులు రైలు దిగగానే అక్కడే సేదదీరేలా వసతి కల్పించాలి. బాసర రైల్వేస్టేషన్లోనే రైలుమార్గం ద్వారా వచ్చే యాత్రీకులకు వసతి గదులను బుక్ చేసుకునేలా ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే వచ్చే వారికి తక్కువ ధరకే ఆలయ వసతి గృహాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం వచ్చిన యాత్రీకులంతా ముందు వసతి కోసం ఆలయ అతిథి గృహాలకు వెళ్లి అక్కడ గదులు లేవని చెప్పగానే ప్రైవేటు లాడ్జీలకు తిరగాల్సి వస్తోంది. ఇలా రాత్రంతా పిల్లాపాపలతో వచ్చే కుటుంబీకులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేకువజామునే స్నానాలు చేసి నిద్ర లేకుండానే పిల్లలకు అక్షరశ్రీకార పూజలు జరిపిస్తున్నారు. దీంతో ఒక్కసారి బాసరకు వచ్చే యాత్రీకులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవంటూ పెదవి విరుస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత బస్సులను నడిపితే రాత్రి సమయంలో వచ్చే యాత్రీకులకు ఇబ్బందులు దూరమవుతాయి. ఆ బస్సులోనే ఆలయ వసతిగృహాల ఖాళీ గదుల వివరాలను తెలిపే ఏర్పాట్లు చేస్తే యాత్రీకులను నేరుగా అక్కడికే వెళ్లగలుగుతారు. క్యాబ్లు నడిపితే.. ప్రస్తుతం బాసర రైల్వేస్టేషన్ నుంచి ఆలయం వరకు ప్రైవేటు ఆటోలు నడుపుతున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తగ్గట్లు ప్రభుత్వమే క్యాబ్లను అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాబ్లలో యాత్రీకులకు నిర్ధిష్టమైన అద్దె చెల్లింపునకు రశీదులు అందుతాయి. ఇప్పుడున్న ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన యాత్రీకుల వద్ద అద్దె డబ్బులను తీసుకుంటున్నారు. క్యాబ్లతో బాసర ఆలయానికి కొత్త అందం కూడా వస్తుంది. యాత్రీకులకు సౌకర్యంగా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వాహనాలు నడిపే వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ఉంటుంది. రోడ్డుపైనే పార్కింగ్ బాసర రైల్వేస్టేషన్ వద్ద ఉన్న చౌరస్తాలో ప్రైవేటు ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. భైంసా–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎప్పుడు చూసినా ఇక్కడ చౌరస్తా సర్కిల్లో ప్రయాణికుల కోసం వాహనాలను నిలిపి ఉంచుతారు. ఆలయానికి ప్రతీరోజు వందల సంఖ్యలో యాత్రీకులు వస్తుంటారు. వారిని తీసుకువచ్చే వాహనాల రాకపోకలకు రోడ్లపై నిలిపిన ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. యాత్రీకుల నిరీక్షణ రైల్వేస్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది. యాత్రీకులు రైలు దిగగానే బస్సుల కోసం వేచిచూస్తారు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం జరుగలేదు. కిలోమీటరున్నర దూరంలో బాసర గ్రామంలో ఉన్న బస్టాండ్ ఎవరికీ ఉపయోగపడడంలేదు. రైలు దిగగానే ట్రిపుల్ఐటీకి వెళ్లే విద్యార్థులు భైంసా, మహారాష్ట్రకు వెళ్లేవారు బాసర ఆలయానికి చేరుకునే వారంతా బస్సుల కోసం ప్రధాన రోడ్డుపైకి వస్తుంటారు. వర్షాకాలంలో, వేసవిలో పక్కనే ఉన్న హోటల్ షెడ్లలోకి వెళ్లి బస్సు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చౌరస్తా కూడలిలో అందరికీ ఉపయోగపడేలా బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సిన అత్యవసరం ఉంది. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఇక ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. బాసర రైల్వేస్టేషన్, గ్రామం, భైంసా, నిజామాబాద్ల నుంచి నాలుగు వైపులుగా వచ్చే వాహనాలన్నీ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చౌరస్తా మీదుగా వెళ్తాయి. ఈ చౌరస్తా వద్ద ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ముథోల్కు చెందిన హోంగార్డు కూడా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాసరకు చెందిన పలువురు యువకులు సైతం ఇలా రోడ్లపై నిలిపి ఉన్న భారీ వాహనాలకు ఢీకొని మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఉచిత బస్సులు నడపాలి దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఆలయం నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి నదికి వెళ్లేలా ఉచిత బస్సులను నడపాలి. అలా చేస్తే ఇబ్బందులు ఉండవు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. - లక్ష్మి, నిర్మల్ వసతి కల్పించాలి రైల్వేస్టేషన్కు రాగానే ఉచిత బస్సు వచ్చే వరకు నిరీక్షించేందుకు వసతి సౌకర్యం కల్పించాలి. రైలు ద్వారా ఒకేసారి వందలాది మంది యాత్రీకులు వస్తారు. అందరినీ ఉచిత బస్సు ద్వారానే ఆలయానికి తరలించాలి. - భాస్కర్, మహారాష్ట్ర ఆన్లైన్లో వివరాలుంచాలి ఉచిత బస్సు, ఆలయంలో వసతి వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలి. రైల్వేస్టేషన్లో దిగగానే యాత్రీకులకు ఎక్కడెక్కడ గదులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలి. - సురేశ్, మహారాష్ట్ర -
బాసరలో సినీ హీరో సందడి
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సినీ నటుడు ఆర్యన్ రాజేష్ సోమవారం దర్శించుకున్నారు. తన కూతురు అక్షర శ్రీకారం కోసం ఆలయానికి విచ్చేసిన ఆర్యన్ రాజేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు భక్తులతో కలిసి సాధారణ భక్తులతో పాటే క్యూలైన్లో నిల్చొని అమ్మవారిని దర్శించుకోవడం గమనార్హం. ఏకాదశి శుభ ముహుర్తం కావడంతో అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర శ్రీకారల కోసం వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. -
బాసరలో బీదర్ ఎంపీ
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకలోని బీదర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ భగవంత్ కూభా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, నిర్మాల్ జిల్లా బీజేపీ ఇంన్ఛార్జి మురళీధర్గౌడ్ ఇతర నాయకులు ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర(నిర్మల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం మర్లగడ్డ క్యాంప్నకు చెందిన కె. రాధ ట్రిపుల్ ఐటీ నాలుగో సంవత్సరం చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం గమనించిన తోటివారు సిబ్బందికి సమాచారం అందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: వారాంతం కావడంతో నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సెలవు రోజు కావడంతో శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షరాభ్యాసాలు, పత్ర్యేక పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శానానికి దాదాపు 3 గంటలు సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సరస్వతి అమ్మవారి పంచమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రద్దీ దష్ట్యా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరలో నగదు రహిత లావాదేవీలు
- ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నగదు రహిత లావాదేవీలకు నూతన సంవత్సరం ఆరంభం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచే ప్రారంభించనున్నారు. రూ. 1000, రూ.500 నోట్ల రద్దుతో బాసరలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని విభాగాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని కౌంటర్లలో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర కొరత సైతం ఈ మిషన్ల ఏర్పాటు తో తీరనుంది. కాగా, ఆలయంలో స్వీపర్, ఉద్యోగులు, అర్చకులు, ఎన్ఎంఆర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 180 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. 30 నిమిషాలు ఆలస్యమైతే గైర్హాజరుగా నమోదు అవుతుందని ఈఓ తెలిపారు. -
బాసరలో పెరిగిన భక్తుల రద్దీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కార్తీక శుక్రవారం కావడంతో.. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. -
బాసరలో చోరీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సందట్లో సడేమియాలాగా.. భక్తుల రద్దీని అదునుగా చేసుకొని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
శైలిపుత్రిగా సరస్వతీమాత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు -
బాసరలో భక్తుల సందడి
బాసర : శ్రావణమాసంలో ఆఖరి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదితీరాన శివాలయంలో పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాస స్వీకార, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. -
రసాయనిక శాస్త్రంతో మానవ మనుగడ
పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్ మెహతా ట్రిపుల్ ఐటీలో జాతీయ స్థాయి సదస్సు నూతన ఆవిష్కరణపై చర్చలు బాసర : మానవుని మనుగడ రసాయనిక శాస్త్రంతో ముడి పడి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ మెహతా అన్నారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ‘రసాయనిక, పదార్థ శాస్త్రాల్లో ఇటీవల కాలంలో వస్తున్న పురోగతి’పై జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరానికే కాకుండా విశ్వవ్యాప్తమైన సృష్టి అంతా రసాయనాలతో నిండి ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో నోటి, దంత క్యాన్సర్, ఎయిడ్స్ తదితర ప్రాణాంతక వ్యాధులపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించిన ఔషధాలు, వాటి పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వ్యాధుల నివారణకు తయారు చేయాల్సిన డ్రాగ్ డిజైనింగ్లో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పలువురు రసాయనిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నానో మెటీరియల్, సెమీ కండక్టింగ్, పాలిమర్ మెడిసిన్ మందుల తయారీ గోడప్రతుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ప్రపంచం మెుత్తాన్ని గడగడలాడించిన ఎబోలా, వ్యాధులకు మందు కనిపెట్టారని తెలిపారు. నానోటెక్నాలజీ ద్వారా ఆభరణాలు, పింగళి వస్తువుల తయారీకి ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ఛాన్స్లర్ సత్యనారాయణ మాట్లాడుతూ రసాయనిక, భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో గోవర్ధన్మెహతా, ఢిల్లీ సీఎస్ఐఆర్టీ ప్రొఫెసర్ జేఎస్ యాదవ్, కళాశాల వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ మెుక్కలు నాటారు. సదస్సులో బాసర ఐఐఐటీ రయసానిక విభాగ అధిపతి రవివారల, శ్రీపాద్, వివిధ జిల్లాల రసాయనిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతమంతా జనసంద్రంగా మారి పోయింది. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
బాసర ట్రిపుల్ఐటీలో స్వచ్ఛభారత్
బాసర : కేంద్రప్రభుత్వం, ఎన్ఎస్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్ఐటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ చాన్స్లర్ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, స్వచ్ఛభారత్ సాధన దిశగా కషిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బి.శ్యాంబాబు, ఆఫీసర్ విజయ్కుమార్, అనిత, నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
పుష్కర స్నానాలు
-
29న బాసరకు హైకోర్టు జడ్జి
ఆదిలాబాద్ : ఈ నెల 29న హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ చైర్మన్ వి.రామసుబ్రహ్మణ్యం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రాత్రి బాసరకు చేరుకుంటారని, 30న ఉదయం సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ మీదుగా ఉట్నూర్కు వెళ్తారని తెలిపారు. గిరిజన హక్కులకు సంబంధించిన నల్సా చట్టంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కుంటాల, పొచ్చర జలపాతాలతోపాటు కడెం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జన్నారం మీదుగా నిజామాబాద్కు బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. -
బాసరలో గురుపౌర్ణమి వేడుకలు
జ్ఞాన ప్రదాత.. సరస్వతీ మాత ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వేద పండితులు, కళాకారులు, సాహితీ వేత్తలకు సన్మానం బాసర : సకల జనులకూ జ్ఞానాన్ని అందించే ప్రదాత.. సరస్వతీ మాత అని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అక్షర భ్యాస మండపంలో మంగళవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన ఆలయాలకు చెందిన సుమారు 140 మంది వేద పండితులు, అర్చకులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.5,100 వరకు నగదు పురస్కారాన్ని దేవాదాయ, «దర్మాదాయ ఆధ్వర్యంలో అందజేశారు. అంతకుముందు ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఆర్డీ అరుణకుమారి హాజరై పండితులకు సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువుల సేవలు మరిపోలేనివి గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన వేద పండితులు, అర్చకులు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గురువుల సేవలను ఏ శిష్యుడూ మరచిపోలేరని పేర్కొన్నారు. ముగిసిన యజ్ఞం ఉత్సవాల ప్రారంభం రోజు నుంచి జరుగుతున్న మహాచండీ యాగం మంగళవారం ముగిసింది. పూర్ణాహుతితో వేద పండితులు యజ్ఞాన్ని ముగింపు పలికారు. ముగింపు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డితోపాటు ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య పాల్గొన్నారు. కళాకారులకు సన్మానం గురుపౌర్ణమిని పురస్కరించుకొని సన్మానం పొందిన వారిలో పలువురు ప్రముఖ కళాకారులు ఉన్నారు. 800కు పైగా సినిమాల్లో, సీరియల్స్లో వివిధ పాత్రల్లో నటించిన మహంకాళి బాలగంగాధర్ తిలక్, కర్ణాటక సంగీత విద్వాంసులు రామకష్ణ సన్మానం పొందారు. వీరితోపాటు ్రప్రముఖ రచయిత, తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు, ప్రిన్సిపాల్ ఆచార్య పి.కనకయ్య, ఇదే శాఖ సహాయ ఆచార్యులు, తెలంగాణ సాహిత్య పరిశోధకులు డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, బాసరకు చెందిన రిౖటñ ర్ట్ ఉపాధ్యాయుడు నరసింహాచారి, వేదపండితులు నాగేశ్వర శర్మ, నటేశ్వర శర్మ తదితరులను శాలువాతో సత్కరించారు. నగదు పురస్కారాలు అందజేశారు. ఈ ముంగిపు ఉత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అనూషాసాయిబాబా, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, సర్పంచ్ శైలజ సతీశ్వర్రావు, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు గెంటెల శ్యాంసుందర్, భూదేవి, ముథోల్ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, డైరెక్టర్ హన్మంతరావు, వైస్ చైర్మన్ రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూకం రామారావు, ముథోల్ సీఐ రఘుపతి, ట్రైనీ ఎస్సై టి.మహేశ్, టీఆర్ఎస్ నాయకులు బాల్గం దేవేందర్, జగ్గం మల్కన్న, బాల మల్కన్న తదితరులు పాల్గొన్నారు. -
వేదఘోషతో పులకరించిన బాసర
బాసర : బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం వేదఘోషతో పుల కరలించింది. గురుపౌర్ణమి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. తొమ్మిది గంటలకు ఆలయం నుంచి ఆలయ చైర్మన్ శరత్పాఠక్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో వేద వ్యాస ఆలయానికి బయలు దేరారు. వేదవ్యాస ఆలయంలో అర్చకులు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల «మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధన, చండీపారాయణం, తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేద వ్యాస ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి పూజ కార్యక్రమాలు .... ఉదయం 8:30 లకు స్థాపిత దేవత ఆహ్వానం, మహావిద్యాపాయణం, చండీపారాయణం, సరస్వతీ హŸమం, తదితర పూజలను నిర్వహిస్తారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
బాసర: అక్రమంగా రైళ్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో సోమవారం రైల్లో తనిఖీలు చేపడుతున్న పోలీసులకు ఇద్దరి మహిళల వద్ద భారీగా గంజాయి లభ్యమవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అమ్మ కటాక్షం కోసం అక్షర శ్రీకారం!
బాసర(ఆదిలాబాద్ జిల్లా): బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్త జనం సందోహంతో నిండిపోయింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ చిన్నారులను తల్లిదండ్రులకు జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో అక్షర శ్రీకారం చేయించారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3గంటల సమయం పట్టింది. 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 876 మంది చిన్నారులకు అక్షర శ్రీకారం జరిపించారు. అమ్మవారి ఆలయానికి సుమారు రూ.4లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. -
బాసరలో భక్తుడి హఠాన్మరణం
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన అవినాష్ (24) శనివారం ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. తర్వాత గుట్టపై ఉన్న వ్యాసుడి గుహ చూసేందుకు వెళుతున్నపుడు గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు భక్తుడి మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. -
బాసర ఆలయ గోపురంపై పిడుగు
- పాక్షికంగా ధ్వంసమైన గోపురం బాసర(ఆదిలాబాద్): బాసరలోని సరస్వతీ ఆలయ గోపురంపై పిడుగు పడింది. దీంతో గోపురం పాక్షికంగా ధ్వంసమైంది. సిమెంట్ పెచ్చులు ఊడి పడ్డాయి. బుధవారం సాయంత్రం వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా తూర్పు భాగాన ఉన్న రాజగోపురంపై భారీ శబ్దంతో పిడుగు పడింది. సమీపంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఏఈవో అశోక్, ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ పిడుగు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణ మధ్య స్థానాచార్యుడు, ప్రధానాచార్యుడు ఆలయంలో శాంతిపూజ, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి జలంతో తూర్పు రాజగోపురంపై నీళ్లు చల్లారు. ప్రకృతి వైపరీత్యం: సంజీవ్ బాసర ఆలయంలో పిడుగు పడడం ప్రకృతి వైపరీత్యం. ఇలాంటి ఘటనలు సాధారణమే. పిడుగు పడ్డ తర్వాత అమ్మవారి ఆలయంలో శాంతిపూజ నిర్వహించాం. ఆందోళన అక్కర్లేదు: ప్రవీణ్ పాఠక్ రాజగోపురంపై పడిన పిడుగుపాటుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంఘటనలు సహజమే. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
బాసరలో చోరీ
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర గ్రామపంచాయతీలోని యు.హనుమంతరావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం వేకువజామున చోరీ జరిగింది. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత వచ్చిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా రూ.లక్ష నగదు, 24 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే చోరీ జరిగిందని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థికి ‘నాసా’ ఆహ్వానం
హైదరాబాద్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఆహ్వానం మేరకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్ అమెరికా వెళ్లనున్నారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రశాంత్ స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం ఘన్సూర్. ఈ నెల 18 నుంచి 22 వరకు అమెరికాలోని సాన్ జావున్ సిటీలో నాసా సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ప్రశాంత్ను ‘నాసా’ ఆహ్వానించింది. అయితే ఆర్థిక ఇబ్బందులను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. -
బాసర ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసరలోన అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఓ జనరల్ స్టోర్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు జరిగింది. ప్రమాదం గమనించిన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలని నిప్పుపెట్టారా లేక షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనేది మిస్టరీగా ఉంది. పోలీసులకు సమాచారం అందించారు. -
నీటిపై అవగాహన ర్యాలీ
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : 'వరల్డ్ వాటర్ డే' సందర్భంగా మంగళవారం బాసర గ్రామంలో నీటిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ 'వాక్ ఫర్ వాటర్'లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు గురువారం పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు అమ్మ దర్శనానికి బారులు తీరారు. ముఖ్యంగా అక్షర శ్రీకార కార్యక్రమం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నానికి సుమారు 473 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బాసర చేరుకున్నారు. వేకువజామున నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలకు భక్తులు బారులు తీరారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరో వైపు భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు
ఆదిలాబాద్: యశ్వంత్పూర్-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్పై ఉన్న కంకర మెషిన్ను రైలు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. రైలు ధర్మాబాద్ నుంచి తెలంగాణలోని బాసరకు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ధర్మాబాద్ స్టేషన్ సమీపంలో కాపలాదారుడు లేని గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. మరమ్మతుల కోసం తీసుకువచ్చిన కంకర మెషిన్ రైల్వే ట్రాక్పై ఉండడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో కంకర మెషిన్ 200 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకున్నా.. రైలింజన్ నుంచి ఆయిల్ లీకేజీ కావడంతో రైలును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ బృందం ధర్మాబాద్కు చేరుకున్నారు. ట్రాక్పై ఉన్న వాటిని తొలగించి మరో రైలు ఇంజన్ను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
బాసర గోదావరి తీరంలో ఇసుక దందా
బాసర: వశిష్ట గోదావరి ఎండిపోవడంతో ఇసుక అక్రమార్కులు కళ్లు తెరిచారు. బాసర గోదావరి తీరం నుంచి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను ఇసుకతోపాటు సీజ్ చేశారు. నిజానికి ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో సుమారు 10 టిప్పర్ల మేర ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో.. అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. -
బాసరలో 'కళాతపస్వి'
బాసర (ఆదిలాబాద్) : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు అలనాటి నటి మంజు భార్గవి (శంకరాభరణం ఫేం) కూడా ఉన్నారు. అనంతరం ఆలయ ఈవో ఏవీ రమణమూర్తి, ఆలయ చెర్మైన్ శరద్ పాఠక్ ఆయనను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
బాసర: దసరా నవరాత్రి ఉత్సవాలు బాసరలో ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం 11 గంటలకే మూలా నక్షత్రం ప్రవేశించిందని అర్చకులు తెలపడంతో బాసరకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాసాలు పెరిగాయి. దీంతో అక్షరాభ్యాస కార్యక్రమానికి , అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. సరస్వతి అమ్మవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. -
కాత్యాయినీ అలంకారంలో బాసర సరస్వతీ దేవి
ఆదిలాబాద్ (బాసర) : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా సెలవులు, నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆరవ రోజు సరస్వతీ దేవి కాత్యాయినీ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. -
నీటిగుంతలో పడి చిన్నారి మృతి
బాసర (ఆదిలాబాద్) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రైల్వే స్టేషన్కు సమీపంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాసరకు చెందిన కాగడ విజయలక్ష్మి(7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. కాగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఆడుకుంటోంది. కాగా ఇంటి పక్కన గోదావరి పుష్కరాల ఏరాట్లలో భాగంగా వాహనాల పార్కింగ్ కోసం కొన్ని గుంతలు తవ్వారు. పుష్కరాల అనంతరం వాటిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో.. ఆ గుంతల్లో నీళ్లు నిలిచాయి. ఇది గమనించని చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు ఘనంగా పుష్కరాల ముగింపు
బాసరలో అధికారిక వేడుకలు ఇప్పటికే 6 కోట్ల మంది స్నానాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం ముగింపు వేడుకలను కూడా అంతే ఘనంగా జరపనుంది. ఈ నెల 14న పుష్కరాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ప్రారంభించడం తెలిసిందే. ముగింపు వేడుకలను శనివారం ఆదిలాబాద్ జిల్లా బాసరలో నిర్వహించనున్నారు. బాసర సరస్వతీ అమ్మవారికి హారతి ఇచ్చాక ఆలయం నుంచి గోదావరి ఒడ్డు వరకు ఊరేగింపు జరుపుతారు. అక్కడ గోదావరికి మహాహారతి ఇచ్చి పుష్కరాలను అధికారికంగా ముగిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుంచి 7.30 దాకా ‘గోదావరి సంబురాలు’ పేర బాసర ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న ఈ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే తెలంగాణలోని ఐదు గోదావరి పరీవాహక జిల్లాల్లోనూ ప్రధాన పుష్కర ఘాట్లలో నదీమతల్లికి మహాహారతి ఇవ్వనున్నారు. ఈ 11 రోజుల్లో తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 5.98 కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజైన శనివారం కూడా భక్తులు పోటెత్తవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దృష్ట్యా ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు. -
పుష్కర భక్తుల కునుకు కష్టాలు..
ఆరుబయటే నిద్రిస్తున్న భక్తులు వర్షం పడితే ఇబ్బందులే డార్మెటరీ భవనం నిరుపయోగం తెరుచుకోని అక్షరాభ్యాస మండపం బాసర : పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులను వసతి కష్టాలు వీడడం లేదు. కుటుంబంతో కలిసి వచ్చిన వారికి ఎక్కడ విడిది చేయూలో పాలుపోవడం లేదు. కన్పించిన ఖాళీస్థలంలోనే రాత్రిళ్లు కునుకు తీయూల్సిన స్థితి. వర్షంలోనూ కాలం వెల్లదీయూల్సిన దుస్థితి. విడిది కోసం ఏర్పాటు చేసిన భవనాలు అందుబాటులోకి తేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇదీ. లడ్డుల తయారీ కోసమే రెండు భవనాలు ఆదిలాబాద్ జిల్లా బాసరకు పుష్కరస్నానానికి వచ్చే భక్తులు కునుకు తీయడానికి కోటి కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో కల్పించిన సౌకర్యాలు భక్తులకు అందడం లేదు. అన్నదాన సత్రం వెనుక 4.40 కోట్లతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాన్ని అధికారులు లడ్డూల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. విశాలంగా ఉన్న ఈ భవనంలో సుమారు 1000కిపైగా భక్తులు రాత్రి బస చేయవచ్చు. సామన్లను లాకర్లలో భద్రపరుచవచ్చు. అయితే ఈ భవనాన్ని లడ్డూల తయారీ కోసం వినియోగిస్తుండటంతో భక్తులు టీటీడీ భవన సముదాయంలోని చెట్ల కిందే పడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లడ్డూ తయారికి కావాల్సిన సామగ్రిని నిల్వ చేశారు. అయితే పుష్కరాల సమయంలో లడ్డూల తయారీ కోసమే రెండు భవనాలకు కేటాయించడం విశేషం. తెరుచుకోని మండపం... బాసర పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్లే మార్గంలో చిన్నారుల అక్షరాభ్యాసం కోసం రూ. 4.25 కోట్లతో నూతన మండపాన్ని నిర్మించారు. పుష్కరాల్లో ఇదే మండపంలో అక్షర శ్రీకార పూజలు జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఈ మండపం తెరువలేదు. అక్షర శ్రీకార పూజలు జరిపించకపోయినా విశాలంగా ఉన్న ఈ భవనం తెరిచి ఉంచితే రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు వేల మంది నిద్రించేందుకు ఉపయోగపడేది. ఆరుబయటే భక్తులు... రాత్రి సమయంలో బాసర చేరుకునే భక్తులంతా ఆరుబయటే నిద్రిస్తున్నారు. వసతి లేకపోవడంతో టీటీడీ భవన సముదాయంలోని ఖాళీ స్థలాల్లో నిద్రిస్తున్నారు. రాత్రి సమయంలో వర్షం కురిస్తే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తేరుకొని నూతనంగా నిర్మించిన భవనాలను భక్తుల కోసం ఉపయోగించాలి. -
గోదావరి వంతెన వద్ద ఆటోలో మంటలు
-
బాసర గోదావరి వంతెన వద్ద ఆటోలో మంటలు
ఆదిలాబాద్ (బాసర) : ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి వంతెన సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తూ ఓ ఆటో మంటల్లో చిక్కుకుంది. టర్పెన్టాయిల్, కలర్ డబ్బాలతో ఉన్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన డ్రైవర్, అందులో ఉన్న ప్రయాణికులు దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా కాలిపోయింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బాసరలో భక్తులకు ఉచితభోజనం
-
బాసరలో పెరిగిన భక్తులు
ఆదిలాబాద్(బాసర): ఆదిలాబాద్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు కావడంతో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకువ జామునే పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకున్న భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. భారీ రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
బురద నీళ్లతోనే పుష్కరస్నానం
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరిలో నీరు తగ్గుతోంది. గోదావరి నదిపై ఉన్న వంతెనల వద్ద నీటిమట్టం తగ్గడంతో నల్లమట్టి దిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. స్నానఘట్టాలకు నీరు చేరకపోవడంతో అక్కడికి వచ్చిన భక్తులంతా మట్టి కుప్పలను దాటుకుంటూ వెళ్లి పుష్కరస్నానాలు ఆచరిస్తున్నారు. తగినంతగా నీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంతెనల వద్ద ఉన్న నాలుగు, ఐదు స్నానఘట్టాల్లో షవర్ల కింద కూర్చున్నా బురదతో కలిసిన నీరే వస్తోంది. గోదావరిలో నీరు లేక ఇలా బురదతో కూడిన నీటితో స్నానం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బాసర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పవిత్రంగా భావించే నదీజలాలను బురదతో కూడి ఉన్నప్పటికీ బాటిళ్లలో నింపుకుని ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు. -
బాసరలో కోలాహలం
బాసర: గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు పుష్కరఘాట్ల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బాసరలో అధిక సంఖ్యలో పుష్కరస్నానాలను ఆచరిస్తున్నారు. దీంతో బాసరలోని పరిసర ప్రాంతాలు యాత్రికులతో కోలాహలంగా మారాయి. కాగా, పుష్కర ఏర్పాట్లపై భక్తులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాసర వద్ద అనుకున్న స్థాయిలో గోదావరి నీటి మట్టం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే పుష్కర స్నానాలు ప్రశాంత వాతావరణంలో జరగుతుండటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మంత్రి జోగు రామన్న బాసరలో స్నానం చేసిన అనంతరం పుష్కరాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా బాసరలో పుష్కరస్నానం చేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా మంగపేటలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పుష్కర స్నానం చేశారు. -
మహాపుష్కరాలు: బాసరలో భక్తుల సందడి!
-
'పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తి'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బాసర మినహా అన్ని ఘాట్లలో నీరు ఉందని చెప్పారు. బాసర ఘాట్కు మరిన్ని నీరు వదిలేలా మహారాష్ట్ర సీఎంను కోరుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 13 సాయంత్రం ధర్మపురికి సీఎం కేసీఆర్ వస్తారని.. 14న ఉదయం పుష్కర స్నానం చేస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
మల్కాజిగిరి నుంచి బాసరకు రైళ్లు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ నుంచి బాసరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నట్లు సబర్బన్ ట్రెన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19 వరకు, తిరిగి 21 నుంచి 26 వరకు మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక రైలు పుష్కరాలకు వెళ్లే వారికి అందుబాటులో ఉంటుందన్నారు. బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్, మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ రైల్వేస్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయని తెలిపారు. -
పుష్కరవేళ.. బాసర గోదారమ్మ వెలవెల!
భైంసా (ఆదిలాబాద్): పుష్కరసంబరానికి సమయం దగ్గరపడుతుంటే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారమ్మ వెలవెలబోతోంది. ఈ నెల 1న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తడంతో అదే రోజు సాయంత్రానికి బాసరలో గోదావరి పరవళ్లు తొక్కింది. అయితే రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. గేట్లు ఎత్తి నీరు వదలడంతో పుష్కర భక్తులకు ఇబ్బందులు తీరుతాయని అంతా ఆశపడ్డారు. కానీ, రెండు రోజుల్లోనే బాసరలోని స్నానఘట్టాల వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నల్లని మట్టి పైకితేలి కనిపిస్తోంది. నదిలో రైలు, బస్సు వంతెనల మధ్య బండరాళ్లు, మట్టికుప్పలు పైకి తేలి కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరో తొమ్మిది రోజుల్లో ఉన్న నీరు ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో భక్తుల పుణ్య స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. మరోవైపు పుష్కరాల్లోపు వర్షాలు కురియకపోతే గోదావరిలో పల్లపు ప్రాంతాల్లో నిలిచే నీటిని పైపులతో స్నానఘట్టాలకు మళ్లించే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. షవర్ల ద్వారా పుణ్య స్నానాలకు అవకాశం కల్పించనున్నారు. -
బాసర ఆర్జీయూకేటీలో పెరగనున్న సీట్లు!
ప్రభుత్వం ఓకే చెబితేనే అమలు బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: బాసరలోని రాజీవ్గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంలో (ఆర్జీయూకేటీ) సమీకత బీటెక్ (ట్రిపుల్ఐటీ) కోర్సులో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థుల వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. బాసరలోని క్యాంపస్లో 1,000 సీట్ల భర్తీకి విద్యార్థులను ఎంపిక చేసినట్లు మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో బాసర క్యాంపస్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు. స్పెషల్ కేటగిరీ (స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగులు) వారికి 28, 29 తేదీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నిర్ణీత తేదీల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా, సీట్లు మిగిలినా 31వ తేదీన తుది దశ కౌన్సెలింగ్ నిర్విహ స్తామని పేర్కొన్నారు. తుది కౌన్సెలింగ్ తరువాత కూడా సీట్లు మిగిలితే ఆ తరువాత ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రవేశాల కోసం మొత్తంగా 10,713 మంది దరఖాస్తు చేసుకోగా జనరల్ కేటగిరీలో 936 మంది విద్యార్థులను ప్రవేశాలకు ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ఓకే అంటేనే అదనం ప్రస్తుతం రాష్ట్రంలోని 202 మండలాలకు చెందిన విద్యార్థుల్లో ఒక్కరికి కూడా సీట్లు లభించలేదని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సూపర్ న్యూమరరీ సీట్లు క్రియేట్ చేయాలని తీర్మానం చేసిందని, ఈ మేరకు ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు చెప్పారు. ప్రస్తుతం బాసర క్యాంపస్లో 1,000 సీట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఒప్పుకుంటే 202 సీట్లు అదనంగా వస్తాయన్నారు. -
బాబ్లీ వదిలినా భరోసా లేదు..!
వరుణుడు కరుణిస్తేనే బాసర వద్ద పుష్కర స్నానాలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గోదావరి నది ఖమ్మం జిల్లా భద్రాద్రి వద్ద పరవళ్లు తొక్కుతుంటే.. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద మాత్రం ఇప్పటికీ ఎడారినే తలపిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నదిలో వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ నీటి మట్టం కూడా అంతగా పెరగలేదు. ప్రస్తుతం 1,057.6 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులో కనీసం మత్తడి లేవల్ వరకు కూడా నీరు రాలేదు. ఎస్సారెస్పీకి 80 శాతం క్యాచ్మెంట్ ఏరియా మహారాష్ట్రలో ఉంది. సుమారు ఐదు శాతం కర్నాటకలో ఉండగా, మిగిలిన 20 శాతం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉంటుంది. ఈ రెండు జిల్లాలో వారం రోజులుగా కొంత మేరకు వర్షపాతం నమోదైనప్పప్పటికీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. రానున్న పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే జూలై 14 నుంచి ప్రారంభం కానున్న పుష్కర స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. జూలై మొదటి వారం తర్వాతే నీటిమట్టం విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తజనం
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు సరస్వతీదేవి దర్శనానికి బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్జేయూకేటీ (రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్, బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.విద్యార్థులకు దరఖాస్తులు ఆన్లైన్లో లభ్యం అవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19వ తేదీ. రెండు రాష్ట్రాల్లో 85 శాతం స్థానికత, 15 శాతం ఓపెన్ కేటగిరి ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. -
బాసరలో పోటెత్తిన భక్తులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదే శ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్థానమాచరించారు. అనంతరం తల్లిదండ్రులు చిన్నారులకు అక్షర శ్రీకార, కుంకుమార్చన పూజలు చేయించారు. అమ్మవారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతోంది. (బాసర) -
బాసర అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్
ఆదిలాబాద్: బాసర సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు శనివారం దర్శించుకున్నారు. బాసరలో వెలమ సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. గవర్నర్ వెంట తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉన్నారు. (భైంసా) -
గో‘దారి’లో...బాసర టు చెన్నై
గోదావరి నదిని జల రవాణా పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఓకే సముద్రతీరంలోని పోర్టులతో రాష్ట్రానికి అనుసంధానం పెద్ద సరుకు రవాణా నౌకలు వెళ్లేలా ఏర్పాట్లు బాసర నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదిలో.. అక్కడి నుంచి చెన్నై వరకు బకింగ్హామ్ కాలువలో రవాణా ఈ ప్రాజెక్టుతో రవాణా వ్యయం నాలుగో వంతుకు తగ్గుతుందని అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు ఊహలకే పరిమితమైన జలరవాణా వాస్తవరూపం దాల్చేందుకు మార్గం సుగమం అవుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి నదిని జల రవాణా పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిని ఆంధ్రప్రదేశ్లోని బకింగ్హామ్ కాలువతో అనుసంధానించటం ద్వారా బాసర నుంచి చెన్నై వరకు జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. దీనితో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం, దుగరాజపట్నం ఓడరేవులతో తెలంగాణ అనుసంధానమవుతుంది. ఈ ప్రా జెక్టు సాకారమైతే చాలా తక్కువ వ్యయంతో సరుకులను రవాణా చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటివరకు రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా రవాణా అవుతున్న బొగ్గు, సిమెంటు, ఉక్కుతోపాటు నిత్యావసర వస్తువులను ఈ నదీ మార్గం ద్వారా రవాణా చేస్తారు. అంకురార్పణ ఇలా.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొంతకాలంగా నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. వృథాగా సముద్రంలోకి చేరుతున్న నీటిని.. ఇతర నదుల్లోకి మళ్లించి, సద్వినియోగం చేసుకోవడం దీని ఉద్దేశం. అయితే ఇదే సమయంలో జలరవాణా అంశం తెరపైకి వచ్చింది. దేశంలో రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఎక్కువగా రవాణా జరుగుతోంది. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అదే జలరవాణా అందుబాటులోకి వస్తే రవాణా వ్యయం నాలుగో వంతుకు తగ్గుతుందని నిపుణులు తేల్చారు. ఈ క్రమంలో దేశంలోని 101 నదులను అనుసంధానించి జలరవాణాకు వినియోగించుకునే బృహత్తర పథకానికి కేంద్రం రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని యోచిస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని బాసర నుంచి చెన్నై వరకు నదీ రవాణా ప్రాజెక్టును కూడా చేర్చబోతోంది. గడ్కారీ రాకతో సానుకూలం.. జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేసేందుకు రెండు రోజుల కింద కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్రానికి రావడం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగా మారింది. గతంలోనే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో గడ్కారీతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఒకటి రెండు సార్లు సీఎం మాట్లాడారు. గడ్కారీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు గడ్కారీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రోడ్లను పరిశీలించిన గడ్కారీ... రవాణా పరంగా తెలంగాణ బాగావెనకబడిందని, దానిని అధిగమించేందుకు కేంద్రం కచ్చితంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జలరవాణాపై సానుకూల ప్రకటన చేశారు. పైగా గోదావరి నదికి ఎగువన గడ్కారీ సొంతరాష్ట్రం మహారాష్ట్ర ఉండటంతో... గోదావరిపై జలరవాణా అభివృద్ధి చేస్తే మహారాష్ట్రకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న జలరవాణా ప్రాజెక్టులో ఈ మార్గాన్ని కూడా చేరుస్తున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించారు. అనుసంధానం ఇలా.. బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు గోదావరి నది రాష్ట్రానికి అనుకూలంగా ఉంది. కానీ దాన్ని సముద్ర మార్గ కేంద్రమైన చెన్నైతో అనుసంధానించేందుకు కొంత కసరత్తు అవసరమవుతోంది. ఇందుకోసం చారిత్రక బకింగ్హామ్ కాలువతో అనుసంధానాన్ని తెరపైకి తెచ్చారు. బ్రిటిష్ పాలనా సమయంలో కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకు 796 కిలోమీటర్ల మేర బకింగ్హామ్ కాలువను నిర్మించారు. బ్రిటిష్ పాలన తర్వాత ఈ కెనాల్ ద్వారా రవాణా నిలిచిపోవడంతో.. నామమాత్రంగా మిగిలిపోయింది. కొంతకాలం కింద దానిని పునరుద్ధరించేందుకు ‘ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ చర్యలు ప్రారంభించింది. పులికాట్ సరస్సుతో అనుసంధానించి.. పుదుచ్చేరి వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు దానిని మరింత విస్తరించి విశాలమైన గోదావరితో అనుసంధానించాలనే ప్రణాళిక తెరపైకి వచ్చింది. గోదావరిపై రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా బ్యారేజీలోకి అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ ద్వారా బకింగ్హామ్ కెనాల్తో అనుసంధానిస్తారు. ఫలితంగా గోదావరిలో బాసర నుంచి మొదలై నేరుగా చెన్నై వరకు జల రవాణా మార్గం ఏర్పడుతుంది. ప్రాజెక్టులకు నావిగేషన్ డిజైన్.. గోదావరిలో నౌకలు వెళ్లాలంటే మధ్యలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. భారీ ప్రాజెక్టులు, వంతెనలు నిర్మిస్తే నౌకలు వెళ్లేందుకు మార్గం కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులు, వంతెనలకు ఇలాంటి వెసులుబాటు కల్పించేలా డిజైన్లు మార్చుకోవాలని సూచించింది. ఫలితంగా ఇప్పటికే నమూనా సిద్ధమైన పోలవరం డిజైన్ మార్చాల్సి ఉంది. దీనిపై గడ్కారీ స్వయంగా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడినట్టు తె లిసింది. ఇక రాష్ట్రంలోని దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టులకు కూడా ఆ తరహాలో డిజైన్ మార్చాల్సి ఉంటుంది. ఇక భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించబోతున్న వంతెనను కూడా దీనికి తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు, భద్రాచలం పాత వంతెనల వద్ద మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది. నదిలో ప్రత్యేక కెనాల్.. సరుకు రవాణా నౌకలు వెళ్లాలంటే నిర్ధారిత పరిమాణంలో నదిలో నీరు ఉండాలి. ఎండాకాలంలో చాలాచోట్ల ఇసుక దిబ్బలు తేలి ఉంటాయి. దీంతో గోదావరి నదిలో ఒక పక్కన నిర్ధారిత పరిమాణంలో ప్రత్యేక కెనాల్ను ఏర్పాటు చేస్తారు. దీనికి అక్కడక్కడ గేట్లు బిగిస్తారు. అందులో నిరంతరం నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా ఏర్పాటు చేస్తారు. నౌక వెళ్లగానే గేట్లు మూసి నీటి నిల్వను నియంత్రిస్తారు. భారీ ఆదా.. సరుకు రవాణాలో రైలు మార్గానికి నాలుగు రూపాయలు, రోడ్డు మార్గంలో తరలిస్తే మూడు రూపాయలు వ్యయమయ్యే చోట... జలరవాణాకు కేవలం అర్ధరూపాయి మాత్రమే ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం లెక్కలేసింది. దీనికి సంబంధించి కేంద్రం డీపీఆర్లు సిద్ధం చేస్తోంది. ఇదీ మార్గం.. (గోదావరి నదిలో..) బాసర - శ్రీరాంసాగర్ - ధర్మపురి - రామగుండం- కాళేశ్వరం - ఏటూరు నాగారం - భద్రాచలం - పోలవరం (బకింగ్ హామ్ కాలువ ద్వారా) కాకినాడ - సామర్లకోట - ఏలూరు - విజయవాడ - తాడేపల్లి - తెనాలి- బాపట్ల - నిజాంపట్నం - నెల్లూరు - చెన్నై -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్ నిర్వహణ సరిగా లేదని గురువారం ఉదయం నుంచి ధర్నా చేశారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ అప్పలనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా విద్యార్థులు వినలేదు. మెస్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (బాసర) -
వసంత పంచమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
బాసర: సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని బాసరలో శనివారం జరగబోయే వసంత పంచమి ఏర్పాట్ల గురించి ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఏర్పాట్లపై ఆలయ అధికారులతో, పోలీసులతో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే కలిసి వస్తుందని భక్తజనం భావిస్తుంటారు. ఈ పంచమికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది ప్రజలు తరలి వస్తారు.మూడు రోజుల పాటు పంచమి వేడుకలు జరుగుతాయి. -
బాసర పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందడి
ఆదిలాబాద్ : కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోదావరి తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో మహభిషేకం నిర్వహించారు. గోదావరి నదికి భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు. -
బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు. ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ!
-
ప్రతి ఊరూ బాసరే
* కేజీ నుంచి పీజీపై టీ-సర్కారు కసరత్తు షురూ! * తొలిదశలో 100 స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక * వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభం * బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం * ముందుగా గ్రామీణ నియోజకవర్గాల్లో అమలు * తర్వాత ఐదారు గ్రామాలను కలిపి క్లస్టర్గా ఏర్పాటు * సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికల సందర్భంగా పదే పదే చెప్పిన ఈ మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనికి శ్రీకారం చుట్టాలని రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తొలిదశలో గ్రామీణ నియోజకవర్గాల్లో కనీసం ఒక్కొక్కటి చొప్పున సమగ్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, తదుపరి దశల్లో వాటిని విస్తరించాలని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన మంగ ళవారం ఈ కార్యాచరణకు సంబంధించిన తొలి సమావేశం జరిగింది. విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలతో ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించాలన్నది ఈ కార్యాచరణ లక్ష్యం. దీని ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రామీణ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి రూ. 10 కోట్ల చొప్పున వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, తర్వాతి ఏడాది రెండు స్కూళ్లు, ఆపై నాలుగేళ్ల పాటు ఏటా రెండు స్కూళ్ల చొప్పున ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. క్రమంగా వీటిని మండల కేంద్రాలకు విస్తరించడం, ఆ తర్వాత ఐదారు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి, వాటి పరిధిలో విద్యా సంస్థలను ప్రారంభించే అంశాలను పరిశీలించారు. గ్రామస్థాయిలో నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలనిఅధికారులు నిర్ణయించారు. దశలవారీగా విద్యాలయాల విస్తరణ... మొదట ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6, 7 తరగతులు, ఆపైన క్రమంగా 10వ, 12వ తరగతుల వరకు విద్యా సంస్థలను విస్తరిస్తూ వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనూ అందించే స్థాయికి వీటిని సమగ్ర విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో వివిధ కోర్సులను అందించేలా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. విద్యావేత్తలు మాత్రం మరో రకంగా సూచిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో పిల్లలను హాస్టల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధపడరని, ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల స్వరూపం * ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియంలో కేజీ నుంచి పీజీ కోర్సులు * స్కూళ్లలో ఆటస్థలం, లైబ్రరీ, హాస్టల్ సదుపాయాలు * గురుకుల విద్యాలయాలను ఆదర్శంగా తీసుకుని వసతుల కల్పన * ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 34 వేల ఖర్చు. మొత్తం విద్యార్థుల కోసం ఏటా రూ. 2.50 కోట్ల వరకు వ్యయం * 3 లక్షల మంది విద్యార్థులున్న 882 గురుకులాలకు ఇబ్బంది లేకుండా కొత్త విద్యా సంస్థల ఏర్పాటు -
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. జూన్ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. -
రక్షణ గాలికి..
బాసర, న్యూస్లైన్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విద్యార్థులకు కనీస రక్షణ లేకపోవడం, రక్షణ సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉండటం, పట్టించుకునే వారు లేకపోవడంతో విద్యార్థులు ఎప్పుడు వెళ్తున్నారో, వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గత నెల లోనే నాగరాజు అనే విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువకు ముందే సోమవారం అర్ధరాత్రి రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు తుప్పురా గాంధీ(22) అనే విద్యార్థి కిందపడి మృత్యువాత పడ్డాడు. బండేపల్లి గ్రామానికి చెందిన తుప్పుర గాంధీ బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం గాంధీ, శివకుమార్లు కలిసి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని ఓ శుభకార్యానికి ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అనుమతి లేకుండా వెళ్లారు. శుభకార్యం చూసుకుని షాపింగ్ చేసుకుని ఇద్దరు అర్ధరాత్రి ఒంటి గంటకు నిజామాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అజ్మీర్ వేళ్లే రైలులో బాసర వద్ద దిగాలని చూశారు. బాసరలో స్టాప్ లేకపోవడం, స్టేషన్ వద్ద మరమ్మతు చేస్తుండటంతో రైలు వేగం తగ్గింది. రైలు ఆగుతుందనుకుని మొదట శివకుమార్ దూకగా గాయాలు అయ్యాయి. గాంధీ దూకుతుండగా రైలు వేగం పెరగడంతో ప్లాట్ ఫాం, రైలుకు మధ్యలో ఇరుక్కపోయాడు. తలకు తీవ్రగాయాలు కాగా, కాళ్లు, చేతులు విరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన విద్యార్థి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి సమాచారం చేరవేయడంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి వచ్చి గాంధీ మృతదేహాన్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా యాజమాన్యం అనుమతి తీసుకోవాలి. అటువంటికి విద్యార్థులు అనుమతి లేకుండానే బయటకు వెళ్లారు. రిజిస్టర్లో కూడా వారు బయటకు వెళ్లినట్లు లేదు. కాగా, గాంధీ తల్లిదండ్రులు విజయలక్ష్మి, బస్వరాజు. బసవరాజు రిటైర్డ్ ఆర్మి అధికారి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రక్షణ కరువు.. బాసర సరస్వతీ అమ్మవారి చెంత 2008లో ట్రిపుల్ ఐటీ నెలకొల్పబడింది. వైఎస్సార్ ఉన్న హయాంలో ఏ లోటు లేకుండా విద్యార్థులు నిశ్చింతగా చదువుకున్నారు. ఆయన మరణానంతరం విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. ప్రస్తుతం 8 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో దాదాపు 150 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ప్రహరీ నిర్మాణం కాకపోవడంతో యాజమాన్యం అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. వారిని పట్టించుకోకపోవడంతో ఎప్పుడు వస్తున్నారో తెలియదు. ఇప్పటివరకు గాంధీ, లక్ష్మన్, నాగరాజు విద్యార్థులు నిండు ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రత ఏర్పరచి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి
ఆదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి స్థానిక ట్రిపుల్ ఐటీ విద్యార్థి గాంధీ మరణించారు. చిత్తురు జిల్లాకు చెందిన గాంధీ ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గాంధీ రైల్లో వస్తు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. దాంతో గాంధీ అక్కడికక్కడే మరణించారు. రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే స్పందించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో గాంధీ మృతదేహన్ని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి మృతి వార్త తెలియడం బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి కె.నాగరాజు కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆశ.. నిరాశ..
సాక్షి, మంచిర్యాల : కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. కొత్తలైన్ల ప్రస్తావన, రైళ్ల నిలుపుదల విషయంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించినా.. వినతి పత్రాలు సమర్పించినా కేంద్రం కనికరించడం లేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, రైళ్ల విస్తరణ, రైల్వే లైన్ల నిర్మాణం, ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలతోపాటు కనీస వసతులు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పశ్చిమ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బాసర, తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, రెబ్బెన, కాగజ్నగర్, సిర్పూర్లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే నెలకు రూ. కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేటాయిస్తోన్న నిధులు స్వల్పమే. రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్బోర్లు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రతీసారి జిల్లాకు సంబంధించిన ఎంపీలు ప్రతిపాదనలు పంపించడం.. అవి బుట్టదాఖలు కావడం మామూలైంది. గత ఫిబ్రవరి 26న రైల్వే కేంద్ర మంత్రి పవన్కుమార్ బన్సల్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ జిల్లా వాసులను నిరాశకు గురి చేసింది. సూపర్ ఫాస్ట్, టికెట్ రద్దు చార్జీలు, తాత్కాల్ టికెట్ ధరలు పెంచి ప్రయాణీకులపై అదనంగా భారం మోపింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈనెల 12న రైల్వేబడ్జెట్ను రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందో చూడాలి. జిల్లావాసుల డిమాండ్లు.. తూర్పు జిల్లా ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల రైల్వేస్టేషన్లో కేరళ, సంఘమిత్ర, స్వర్ణజయంతి, హిమసాగర్, రామేశ్వరం, నవయుగ ఎక్స్ప్రెస్ల నిలుపుదల, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో అదనపు బోగీలు, ఏసీ బోగీల ఏర్పాటు కాలేదు. చెన్నై - జోద్పూర్ గుజరాత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-బికనూరు రాజస్థాన్ ఎక్స్ప్రెస్, విశాఖ-జోధ్పూర్, విశాఖ-గాంధీనగర్ ఎక్స్ప్రెస్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలి. మంచిర్యాల-జద్గల్పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఉంది. షిరిడి నుంచి బల్లార్ష వరకు నడుస్తున్న రైలును బెల్లంపల్లి వరకు పొడిగించాలి. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడిపించాలని, హైదరాబాద్-న్యూఢిల్లీ దూరంతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నవజీవన్, గ్రాండ్ ట్రక్ రైళ్లను స్టేషన్లో నిలుపుదల చేయాలనే డిమాండ్ ఉంది. బెల్లంపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ఏర్పాటు చేస్తానని ఎంపీ వివేక్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని ఏకైక మందమర్రి రైల్వేస్టేషన్లో తెలంగాణ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఆపాలని రైల్వే జీఎంకు వినతి పత్రాలిచ్చినా ఫలితం లేదు. రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వయా వరంగల్ మీదుగా విజయవాడ వరకు వెళ్లేందుకు జనతా ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఇవ్వాలని రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. గత ఎన్డీఏ, ప్రస్తుత యూపీఏ హయాంలో అఖిలపక్ష నేతలు ఎన్నిమార్లు వినతి పత్రాలిచ్చినా ప్రయోజనం లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏకైక రెబ్బెన రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ను ఆపాలన్న ప్రయాణికుల వినతులు బుట్టదాఖలయ్యాయి. పదేళ్ల క్రితం కాగజ్నగర్ వరకు ఉన్న బుషావత్(మహారాష్ట్ర) ప్యాసింజర్ను రద్దు చేసి బల్లార్షా వరకు పరిమితం చేశారు. దీంతో కాగజ్నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్యాసింజర్ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. డెహ్రడూన్-చెన్నై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఆపాలనే డిమాండ్ ఉంది. రైలు మార్గం ద్వారా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వె ళ్లేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క రైలు (కృష్ణా ఎక్స్ప్రెస్) ఉంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర మీదుగా బాసర, నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కు వెళ్తొంది. తొమ్మిదిన్నర గంటలు రైళ్లో ప్రయాణించాల్సి వస్తుంది. బస్సులో వెళ్లినా అంతే సమయం పడుతుంది. నాందేడ్ - జైపూర్ ఎక్స్ప్రెస్ను ఆదిలాబాద్ మీదుగా నడిపించాలన్న డిమాండ్ ఉంది. దక్షిణ భార త దేశంలోనే పేరొందిన బాసరలోని చదువుల తల్లి పుణ్యక్షేత్రానికి రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో హైదరాబాద్ నుంచి బాసర వరకు జ్ఞాన సరస్వతీ ఎక్స్ప్రెస్ను నడిపించారు. ప్రస్తుతం రద్దయింది. దాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది. బాసర స్టేషన్లో ప్రతి ఎక్స్ప్రెస్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్ టు బాసర సింగిల్ లైను ఉండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఉంది. కలగానే బ్రిడ్జీల నిర్మాణం జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా సుమారు 30 రైళ్లు వెళ్తుంటాయి. ప్రతిసారి స్టేషన్ సమీపంలోనే ఉన్న హమాలీవాడ ప్రాంతంలోని గేటు వేయడంతో వాహనాలు బారులు తీరుతాయి. గేటువేసి ఉన్నా కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎంసీసీ ఫ్యాక్టరీ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లోనూ ఇదే పరిస్థితి. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 2010లోనే రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. నిర్మాణానికి రూ.17 కోట్లు అవసరముంటాయని అంచనా వేశారు. అందులో సగం నిధులు రైల్వే శాఖ, సగం డబ్బులు స్థానిక మున్సిపాలిటీ భరించాలని సూచించింది. అన్ని నిధులు ఇవ్వలేమని ఆదిలాబాద్ పురపాలక సంఘం అధికారులు చేతులెత్తేశారు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2006లోనే ప్రతిపాదనలు పంపారురూ. రూ. 17 కోట్లు మంజూరయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న రైల్వే కాంట్రాక్టర్ 80 శాతం పనులు పూర్తి చే శాడు. ఆ తర్వాత బిల్లులు సకాలంలో రావడం లేదంటూ పనులు నిలిపేశాడు. ప్రతిపాదనలకే పరిమితం గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా ఇంత వరకు కనీసం సర్వే కూడా ప్రారంభం కాలేదు. 2010-11 రైల్వే బడ్జెట్లో మంచిర్యాల రైల్వేస్టేషన్లో డిస్పెన్సరీని ప్రతిపాదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డిల మీదుగా హైదరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరయ్యాయి. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. అయినా ఇంత వరకు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్ : చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి వేడుకలు బాసర పుణ్య క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘుశుద్ధ పంచమిని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాసం పూజలు ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ప్రారంభమైంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహేభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదంగా ఫొటో, పెన్ను, రక్షాబంధన్ అందచేస్తున్నారు. -
బాసర ఆలయ ఏఈవోపై వేటు
బాసర, న్యూస్లైన్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయంలో ఏఈవోగా విధులు నిర్వహించి ఇటీవలే బదిలీ అయిన గంగా శ్రీనివాస్పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. సుప్రసిద్ధమైన దేవాలయంలో తిష్టవేసి ఏళ్ల తరబడిగా అన్నీతానై వ్యవహరిస్తున్న ఆయన ఆగడాలు ఎట్టకేలకు పరాకాష్టకు చేరాయి. సుమారు 15 ఏళ్ల క్రితం బాసర ఆలయంలో క్రింది స్థాయి ఉద్యోగిగా చేరింది మొదలు అక్రమమార్గంలో ఏఈవో స్థాయికి ఎదిగాడంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఆదాయం మొదలుకుని అభివృద్ధి పనులకు కేటాయించే నిధుల వినియోగం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లో జరిపించిన ఆయనపై చివరకు సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. బాసర ఆలయంలో ఈవోగా ఉన్నతస్థాయి అధికారులున్నా, ఏఈవోగా చక్రం తిప్పిన శ్రీనివాస్ ఇటీవలే హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయానికి డెప్యూటేషన్పై వెళ్లారు. హైదరాబాద్లో డెప్యూటేషన్పై వెళ్లిన ఆయన సొంత అవసరాల పేరిట సెలవు పెట్టారు. ఇదే క్రమంలో ఆయన బాసరకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లాడంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో గంగా శ్రీనివాస్పై పోలీసులు 497, 498 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం జిల్లాలో వ్యాపించగా పత్రికా కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ గంగా శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. తన భార్యను తీసుకెళ్లాడన్న ఓ వ్యక్తి పోలీసుస్టేషన్లో శ్రీనివాస్పై ఫిర్యాదు చేయడం, ఆయనపై కేసులు నమోదు కావడం వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం కలగడంతో సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్గా బాసర దేవాలయంలో పనిచేస్తున్న రజినిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఆలయ ఈవో తెలిపారు. కాగా మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న శ్రీనివాస్ సస్పెన్షన్ ఆలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
బాసర/గుడిహత్నూర్, న్యూస్లైన్ : కాలం కలిసిరాక రైతు లు ఆత్మహత్యల ఒడి చేరుతున్నారు. అతివృష్టి నిలువు నా ముంచినా ఆదుకునే వారు లేక.. ప్రాణాలు వదులుతున్నారు. వెరసి అప్పుల బాధ తాళలేక జిల్లాలో శుక్రవా రం రాత్రి, శనివారాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణం పొందారు. ముథోల్ మండలం కిర్గుల్(బి) గ్రామానికి చెందిన నడిపి కోట య్యకు పదెకరాలు భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకైన మల్లయ్య (32) తనకు కేటాయించిన మూడెకరాల్లో పత్తి సాగుచేశాడు. ఇందుకు తన తండ్రి పేర బ్యాంకులో రూ.50 వే లు రుణం తీసుకున్నాడు. అంతకుముందు చేసిన అప్పులు లక్షన్నర వరకు ఉన్నాయి. ఈసారీ అతివృష్టి కారణంగా అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో రూ.2 లక్షల అప్పులు ఎలా తీర్చాలో తెలియక మైలాపూర్ గ్రామ శివారులో శనివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, ఇద్దరు కొడుకులున్నారు. కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై పున్నం చందర్ తెలిపారు. అలాగే గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండతండాకు చెందిన రాథోడ్ రాము (40) తనకున్న నాలుగున్నర ఎకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది పంటలు సాగుచేశాడు. ఇందుకోసం మహారాష్ట్ర బ్యాంకులో రూ.40 వేలు అప్పు చేశాడు. భార్య మీరాబాయి పేర స్వయం సహాయక సంఘం నుంచి మరో రూ.10 వేలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దిగుబడి రాకుండా పోయింది. దీంతో అప్పుల తీర్చే మార్గం లేక దిగాలు చెందాడు. ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి చేనుకు వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాడు. తదుపరి ఇంటికి చేరుకున్న అతన్ని కుటుంబసభ్యులు గమనించి వెంటనే రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రవిప్రసాద్ తెలిపారు. -
సౌకర్యాలు అధ్వానం
బాసర, న్యూస్లైన్ : బాసర ట్రీపుల్ఐటీలో సౌకర్యాల తీరుపై ఆర్డీవో అరుణశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్డీవో ట్రీపుల్ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమా రు రెండు గంటలపాటు ఉండి, ప్రతీ విభాగాన్ని పరిశీ లించారు. మెస్, వైద్యశాల, వంట గదులతోపాటు హాజ రుపట్టికలను తనిఖీ చేశారు. వంటశాలలో కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చారుు. కారంపొడి, పప్పులు తది తర సరుకులు నాసిరకం వాడుతుండడంతో మెస్ నిర్వాహకుడిపై మండిపడ్డారు. విద్యార్థులకు కనిపిం చేలా మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం వైద్య శాలను తనిఖీ చేశారు. వైద్యశాలలో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులుండగా ఒక్కరే విధులకు హాజరయ్యూరు. దీంతో హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుపట్టికలో ముందే సంతకాలు చేసి ఉండడం, ఒకరి సంతకాలు మరొకరు పెట్టడంపై వైద్యు డు కౌశిక్పై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో కనీసం ఫ్రీజ్ సైతం లేకపోవడమేంటని, మందులు ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ నిర్వహణ తీరుపై ఓఎస్డీ నారాయణతో మాట్లాడారు. నిర్వహణ అస్తవ్యస్తం.. ట్రిపుల్ ఐటీ తనిఖీ అనంతరం ఆర్డీవో అరుణశ్రీ విలేకరులతో మాట్లాడారు. సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులున్న ట్రీపుల్ ఐటీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉం దని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తు న్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పన, పరిపాలన విషయంలో ట్రీపుల్ఐటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మెస్లో కుళ్లిన కూరగాయల నిల్వలు ఉన్నాయన్నారు. నిధుల విషయంలో ఆడిట్ లేకపోవడంతో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలపై అధికారులు బదులు ఇవ్వలేకపోయూరని తెలిపారు. ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉందని, ఇందులో ఇద్దరు ఉండగా తనిఖీ సమయంలో ఒక్కరే ఉన్నారని చెప్పారు. తనిఖీలో వెలుగుచూసిన విషయూలను నివేదిక రూపంలో కలెక్టర్కు అందిస్తానని పేర్కొన్నారు. ఆమె వెంట తహశీల్దార్ నరేందర్, ఆర్ఐ, వీఆర్ఏ ఉన్నారు. -
అవినీతికి వారసులు
భైంసా, న్యూస్లైన్ : బాసర శ్రీ జ్ఙానసరస్వతీ ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అమ్మవారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, భక్తుల పూజాధికాలు, చిన్నారుల అక్షరశ్రీకారాల నిర్వహణకు ఆలయంలో ఒక స్థానాచార్య, ఒక ప్రధాన అర్చక, ఇద్దరు ఉపప్రధాన అర్చకులు, ఇద్దరు ముఖ్యఅర్చకులు, ఏడుగురు అర్చకులు, ఏడుగురు పరిచారికలు, నలుగురు వేదపండితులు ఉన్నారు. వీరు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు షిప్టులుగా విధులు నిర్వర్తిస్తారు. నెలలో మెదటి అర్ధభాగం ఉదయం విధుల్లో ఉన్న బ్యాచ్, తర్వాతి 15 రోజుల్లో మధ్యాహ్నం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పండుగలు, ప్రముఖులు వచ్చిన సమయాల్లో అందరూ విధిగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇది వాస్తవంగా ఆలయాధికారులు, ఆలయస్థానాచార్య, ప్రధాన అర్చకుల ప్రమేయంతో కూడిన అధికారిక నిర్ణయం. అధికారులు, అర్చకులు దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ ఆలయంలో ఇవేమీ అమలు కావడంలేదు. జరుగుతోంది ఇదీ.. అధికారుల ఈ నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితమైంది. దేవాదాయశాఖ అర్చకులకు వేలల్లో జీతాలు చెల్లిస్తున్నా.. అనాదిగా కొనసాగిన వంశపారంపర్య అర్చకత్వమే ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో బాసర గ్రామానికి చెందిన బ్రాహ్మణ కుటుంబాలు ఆలయంలో అర్చకత్వం నిర్వహించేవి. నెలల వారీగా వంతులు వేసుకుని సంవత్సరంపాటు వారు అర్చక విధులు నిర్వర్తించేవారు. తిరిగి మరుసటి సంవత్సరం అదే పద్ధతి కొనసాగించారు. ఆలయంలో పూజాధికాలు నిర్వహించినందుకు గాను ప్రభుత్వం అర్చకులకు డబ్బులు చెల్లించేది కాదు. భక్తుల నుంచి వచ్చిన కానుకల్ని మాత్రమే స్వీకరించేవారు. అయితే ఈ విధానంలో అమ్మవారికి చెందాల్సిన కానుకలు, ఆదాయం పక్కదారి పడుతోందని, అక్రమాలకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేసింది. అర్చక కుటుంబాల నుంచి అర్చకత్వ అర్హతలు ఉన్న వారికి ఆలయంలో ఉద్యోగాలు ఇచ్చి వారికి వేలల్లో జీతాలు నిర్ణయించింది. అలా ఆలయంలో అర్చక విధులు నిర్వర్తించిన బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం వారే ఆలయంలో విధులు నిర్వహిస్తున్నరు. ప్రభుత్వ ఆశయానికి గండి... ప్రభుత్వం సదాశయంతో నూతన విధానాన్ని అమలు చేయాలనుకున్నా, వారు పాత పద్ధతిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయం లేని చోట్ల ఆలయాధికారులు నిర్ణయం మేరకు విధులు నిర్వర్తిస్తున్నా, ప్రధాన ఆలయంలో (గర్భగుడి,అంతరాలయం) మాత్రం అర్చకుల పాత పద్ధతినే వంశపారంపర్యలో అమలవుతున్నారు. ఆలయ అధికారులు నిర్ణయించిన వేళల్లో కాకుండా ఎవరి పూజా సమయంలోనైనా ఆ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వేలల్లో జీతాలు పొందుతున్న అమ్మవారి కానుకలపై అనురక్తి వారికి సిరులు కురిపిస్తోంది. అడిగే నాథుడు, అడ్డుచెప్పే అధికారి లేకపోవటం అర్చకులకు వరంగా మారింది. మిగతా వారిలో అలసత్వం... ఆలయంలో ఈ వంశపారపంపర్య విధానం కారణంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా ఆలయ ఆదాయానికి గండిపడుతుండగా, వంతులో భాగంగా తమది కాని రోజుల్లో మిగతా పూజారుల్లో అలసత్వం చోటుచేసుకుంటోంది. వంశపారంపర్య విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ గర్భగుడిలో అనధికారికంగా తిష్టవేసి అమ్మవారికి చెందాల్సిన కానుకలను తమ జేబులో వేసుకుంటున్నారు. వంతులేని పూజరులది మరోకథ. వంతులవారీ పూజ మనది కాదు, అదనపు ఆదాయం ఏమీ రాదు అనే భావనతో వారు విధులకు సరిగా హాజరుకావటం లేదు. సెలవుపెట్టడం లేదా గైర్హాజరవుతున్నారు. నామమత్రంగా ఆలయ ఇన్స్పెక్టర్కు సెలవు చీటి పంపుతున్నారు. ప్రధాన అర్చకులు, స్థానాచార్యకు గైర్హాజరు విషయం తెలిపి వారి అనుమతి తీసుకోవాల్సి ఉన్న అర్చకులు అలా చేయటం లేదు. దీంతో భక్తులకు అర్చకుల కొరత ఏర్పడుతోంది. అక్షరాభ్యాసాలు ఆలస్యమవుతూ చిన్నారులు క్యూలైన్లో అలమటిస్తున్నారు. ఈ విషయంలో ఈవో అర్చకులకు హెచ్చరిక చేసినా వారిలో స్పందన లేదు. ఈ విషయమై గ్రామస్తులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. వేలల్లో జీతాలు తీసుకుంటున్న అర్చకులు అక్రమ సంపాదనకు ఆశపడి పాతపద్ధతిని కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గతంలో బాసర మాజీ సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పలుమార్లు ఆలయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ గ్రామస్తులు ఇచ్చిన విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. ఎవరి మాటలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇక ఆలయంలోనూ సీసీ కెమెరాలు అక్కడక్కడ పనిచేయకపోవడంతో రోజూ వచ్చే కానుకలు మూటలు కట్టుకుని ఇళ్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ పాలకులు కళ్లు తెరవాలని భక్తులు కోరుతున్నారు. ఇకనైనా ఆ విధానానికి ఆలయాధికారులు స్వస్తి పలికాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆలయానికి ఆదాయం పెరగటంతోపాటు, భక్తులకు మెరుగైన సేవలు అందుతాయి. ఈ విషయమై ఆలయ ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
బాసరలో వీఐపీలకే పెద్దపీట
భైంసా/బాసర, న్యూస్లైన్ :‘మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. అమ్మవారిని దర్శించుకునేందుకు లైన్లో ఉంటే దొబ్బేస్తున్నారు. పక్కద్వారం నుంచి ఎవరినో తీసుకువచ్చి ప్రశాంతంగా పూజలు చేయిస్తున్నారు. మాలాంటి సామాన్య భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడలేక ఇబ్బంది పడుతున్నాం’. అంటూ నల్గొండ జిల్లా నేరేడిపల్లికి చెందిన బుద్దారెడ్డి అమ్మవారి దర్శనం అనంతరం తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం గగనమవుతోంది. ఉత్సవాలు నిర్వహించే ప్రతీసారి ఇక్కడి సిబ్బంది వీఐపీల సేవలో తరించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేక, కనీసం మంచి నీళ్లు దొరకక అసహానానికి గురవుతున్నారు. పిల్లల రోధనలు.. శుక్రవారం వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి కనిపించారు. ఈయేడాది భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. క్యూలైన్లలో చంటిపాపలు, పిల్లల రోధనలు ప్రతిధ్వనించినా వారిని పక్క నుంచి పంపలేకపోతున్నారు. వయస్సు మీద పడ్డవారు నిలబడలేక వరుసల్లో నుంచి బయటకు వచ్చారు. లోపలికి వెళ్లి గంటల తరబడి నిలబడలేక ప్రాంగణంలోనే అమ్మవారిని మొక్కుకున్నారు. చాలా మంది పిల్లలు లైన్లో దాహం అంటూ ఏడుస్తూ కనిపించారు. బాసర క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతించడం లేదు. ఎంతో దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన వారు కూడా అందరితో కలిసి గంటల తరబడి నిలబడ్డాకే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం శుక్రవారం అమ్మవారి మూలనక్షత్రం కావడంతో అక్కడికి వచ్చే వారిలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. తూర్పు ద్వారం నుంచి వారిని అనుమతించారు. ఇలా వీఐపీల రాకతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మూలనక్షత్రం కావడంతో రెండు రోజుల నుంచి ఆలయ సిబ్బంది సామాన్యులకు వసతి అతిథి గృహాలను కూడా కేటాయించడం లేదు. ముందుగానే గదులన్ని బుకింగ్ అయ్యాయని సమాధానం ఇస్తున్నారు. ప్రైవేటు లాడ్జిలకు వె ళ్లాలంటూ భక్తులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తొక్కేస్తున్నారు.. సామాన్య భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు టెంకాయలు, పసుపు, కుంకుమ అగర్బత్తులు పవిత్రంగా తీసుకువస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చే సామాన్యుల పసుపు, కుంకుమలు, అగర్బత్తులు,టెంకాయ లు కొట్టే స్థలంలో కాళ్ల కింద తొక్కేస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా యి. పవిత్రమైన పసుపు, కుంకుమలను హిం దూ సంప్రదాయ ప్రకారం పక్కన పెద్ద పాత్రలు ఉంచి అందులో వేయాలి. అయినా ఆలయ సిబ్బంది ఇవేమి పట్టించుకోవడం లేదు. బోర్డులకే పరిమితం... ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద నోపార్కింగ్ బోర్డును పక్కన పారేసి ద్విచక్రవాహనాలను నిలిపి ఉంచుతున్నారు. బస్సులు ఎక్కే ప్రాంతంలో నీరు నిలిచినా శుభ్రం చేయడం లేదు. ఇక భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లోనూ ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సేవలు రైల్వే సమయాలకు అనుకూలంగా అందిస్తున్నారు. శుక్రవారం భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ ఈ బస్సును వినియోగించలేదు. ఒక పక్క వర్షం కురుస్తున్నా మధ్యాహ్నం సమయంలో ఈ బస్సును పార్కింగ్ స్థలంలోనే నిలిపివేశారు. దీంతో వర్షంలోనే తడుస్తూ భక్తులు వెళ్లాల్సి వచ్చింది. స్నాన ఘట్టాల వద్ద... ఇక స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతియేటా బాసరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. స్నాన ఘట్టాల వద్ద ఉన్న షెడ్ల పైకప్పులు తుప్పుపట్టినా కొత్తవి ఏర్పాటు చేయలేదు. పైకప్పు లేక వర్షానికి భక్తులు తడవాల్సి వచ్చింది. ఇక గంగమ్మ తల్లికి ఇక్కడికి వచ్చే భక్తులంతా నైవేద్యం సమర్పిస్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వంటలు చేసేందుకు స్థలం లేక బట్టలు మార్చుకునే గది గోడకు ఆనుకుని నైవేద్యాలు వండుతూ మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. మందు బాబుల జల్సాలు... పవిత్ర గోదావరి నది ఒడ్డున మందుబాబుల జల్సాలు కొనసాగుతున్నాయి. స్నాన ఘట్టాల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదిని నిర్మించారు. ఈ గది స్లాబుపైకి ఎక్కితే తాగిపారేసిన ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. గంగమ్మ తల్లి పక్కనే మందుబాబులు జల్సాలు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆగడాలు కొనసాగుతున్నా సిబ్బంది, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా స్నాన ఘట్టాలే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పట్టించుకోవడం లేదు బాసరకు వచ్చే సామాన్య భక్తులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏది కొందామన్న అన్ని రెట్టింపు ధరలే. కనీసం అమ్మవారిని దర్శించుకుందామన్న ఆ కోరిక తీరడం లేదు. ఎంతో భక్తితో ఇక్కడికి వస్తే మాలాంటి సామాన్యులను పట్టించుకోవడం లేదు. ఏర్పాట్లలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. కనీసం చంటి పాపలతో వచ్చిన మహిళలు, వృద్ధులను కూడా లోపలికి అనుమతించడం లేదు. - ధర్మారెడ్డి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా -
బాసర సరస్వతీ సన్నిధిలో అర్చకుల దందా
భైంసా, న్యూస్లైన్ :వారు అర్చకులు.. బాసర సరస్వతీ సన్నిధిలో చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేస్తూ అమ్మసేవలో తరిస్తుంటారు. అయితే వారి ప్రస్తుత చర్యలు భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారులకు అక్షర శ్రీకారం చుట్టే చేతులే అక్రమాలకు పాల్పడుతున్నాయి. అమ్మసేవలో తరించాల్సిన వారు డబ్బున్న వారి సేవలో తరిస్తున్నారు. అర్చకత్వం మాటున ‘దందాలు’ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్య భక్తులు భక్తితో అమ్మవారికి సమర్పించిన కానుకలను పక్కదారి పట్టిస్తున్నారు. శ్రీకార పూజలు నిర్వహించే అర్చకులు భక్తుల నగదును క్యారీ బ్యాగుల్లో నొక్కేస్తున్నారు. ఈ తతంగాన్ని చిత్రీకరించే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ వ్యవహారం సాగుతోంది. కాసుల పంట అదో పళ్లెం. సిరులు కురిపించే ఆ అక్షయపాత్ర బాసర సరస్వతీ ఆలయ గర్భగుడిలో కొలువై ఉంది. హుండీలో పట్టనన్ని డబ్బులను పళ్లెం తనలో ఇముడ్చుకుని అర్చకులకు తర‘గని’ ఆస్తిగా భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తారు. ఏ ఆలయంలోనైనా కానుకలను హుండీలో వేసి భగవంతునికి సమర్పించినట్లు భావించి తృప్తిపడతారు. అయితే బాసర సరస్వతీ ఆలయంలో మాత్రం హుండీలు నామమాత్రం. భక్తుల కానుకలు హుండీలో కన్న అర్చకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న అనధికార హుండీలోకే చేరుకుంటాయి. వేలల్లో జీతాలు పొందుతున్న అర్చకులు అమ్మవారి కానుకలకు ఎసరు పెడుతున్నారు. మెత్తం మీద 40 శాతం కానుకలు పక్కదారి పడుతున్నాయి. నిబంధనలు పక్కదారి ఆలయ నియమాల మేరకు అర్చకులు అమ్మవారికి సమర్పించిన కానుకలు స్వీకరించరాదు. కేవలం భక్తులు అమ్మవారికి సమర్పించిన బియ్యం నుంచి కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులకు మధుకర భిక్ష నిమిత్తం బియ్యాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ అనుమతితో తీసుకోవాలి. అయితే అర్చకులు బియ్యంతోపాటు అమ్మవారికి చెందాల్సిన నగదును, ఇతర కానుకలను తీసుకెళ్తున్నారు. హుండీకి సమాంతరంగా అనధికారికంగా ప్లేట్ను ఏర్పాటు చేసుకుని భక్తులను తప్పుదోవ పట్టించి హుండీలో వేయాల్సిన కానుకలను తమ పళ్లెంలోకి మళ్లించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హుండీలోనే కానుకలు వేయాలని భక్తులకు „సూచించే బోర్డు రాసిన అధికారులు ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆలయ అర్చకుల ఈ దందాను మామూలుగా తీసుకుని వదిలేస్తున్నారు. ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి చేరుతుండటంతో ఈ విషయంపై ఎవరు నోరు మెదపటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ హోదాకు అడ్డు బాసర సర„స్వతీ ఆలయం ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన ఆలయం. వరుసగా మూడేళ్లపాటు ఆలయానికి రూ.5 కోట్ల పైచిలుకు ఆదాయం లభిస్తే ఆలయ స్థాయి డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఆర్జేసీ(రీజినల్ జాయింట్ కమిషనర్) స్థాయికి చేరుకుంటుంది. దేవాదాయశాఖలోని ఆర్జేసీ స్థాయి అధికారి ఆలయ పర్యవేక్షణ భాధ్యతలను స్వీకరిస్తారు. ఆలయ హోదా పెరిగి ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరుగుతాయి. అయితే అర్చకుల తీరు ఆ హోదాకు అడ్డంకిగా మారింది. భక్తుల నుంచి వస్తున్న ఆదాయంలో 40 శాతం వరకు అర్చకుల జేబుల్లోకి చేరుతుండ టంతో కొన్నేళ్లుగా ఆలయ ఆదాయం స్వల్పగానే పెరుగుతోంది. బాసర సరస్వతీ ఆలయం ఆదాయం పరంగా మిగిలిన దేవాలయాలతో పోలిస్తే చాల వెనకబడి ఉంది. వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయాల సరసన నిలిచే బాసర ఆలయం, ఆదాయపరంగా కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, కొమురవెల్లి, సికింద్రాబాద్లోని గణేష్ ఆలయాలతో సమాన హోదా కలిగి ఉంది. ఆలయ అధికారులు దృష్టిసారించి అర్చకుల తతంగాన్ని నిలువరించాలని భక్తులు కోరుతున్నారు. -
వీడిన మిస్టరీ
మంచిర్యాల అర్బన్, న్యూస్లైన్ : అది ఆగ స్టు 17వ తేదీ. ఆ రోజు బాసరకు చెందిన వ్యాపారి అశోక్, ఆయన భార్య సువర్ణ, కొడుకు మణికంఠ దారుణంగా హత్యకు గురయ్యారు. నలుగురిపై దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడిచేయగా.. అందులో నుంచి ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఆగస్టు 18వ తేదీ. మంచిర్యాలలోని శ్రీశ్రీనగర్లో నివాసం ఉంటున్న దేవి దుర్గమ్మ, ఆమె కొడుకు రవీందర్లను దారుణంగా హతమార్చారు. వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఎట్టకేలకు దొరికిన ఆచూకీ.. వరుస దోపిడీ హత్యల కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులూ నిందితులను పట్టుకోవడం లో అంతే కృషి చేశారు. వారిని పట్టుకునేందుకు ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మంచిర్యాల, బాసర సీఐలు రవీందర్రెడ్డి, మహేశ్లతో కూడిన రెండు బృందాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ముఠా పనే అయి ఉంటుందని ఆ దిశగా కూపీ లాగారు. మహారాష్ట్రలో విచారణ సైతం చేశారు. ఎట్టకేలకు నిందితుల ఆచూకీ దొరకడంతో ఊపిరిపీల్చుకున్నారు. కరుడుగట్టిన హంతకులు.. మహారాష్ట్రకు చెందిన కరుడుగట్టిన హంతకుల ముఠా ఈ దారుణాలకు పాల్పడింది. బీడ్ జిల్లా కోద్గావ్ గ్రామానికి చెందిన బాలాజీ పండిత్, చత్రీయ శిర్గాజీ షిండే, పర్బని జిల్లా సాయికేడ్కు చెందిన కల్యాణ్ జయపూల్యా అలియాస్ షేక్ సలీం, సాయికేడ్కు చెందిన మిట్టుబాపురావు అలియాస్ రాములు ఈ హత్యలు చేశారు. కరుడు గట్టిన హంతకుడు బాలాజీ ఈ ముఠాకు నాయకుడు కాగా.. అతనిపై మహారాష్ట్రలో 23 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. 15 రోజుల క్రితం మేడ్చల్ పరిధిలో మరో దోపిడీకి పాల్పడుతుండగా.. అక్కడి పోలీసులు కల్యాణ్, మిట్టులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు చర్లపల్లి జైలులో ఉండగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడి తల్లి.. నిందితుల్లో ఒకడైన కల్యాణ్ తల్లి జహీరతిని శనివారం పోలీసులు బాసర రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. కొడుకు అరెస్టు విషయం తెలుసుకున్న ఆమె.. జైల్లో ఉన్న కొడుకును కలిసేందుకు వెళ్తుండగా జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి బాసర, మంచిర్యాలలో దొంగిలించిన కుంకుమ భరణి, సెలఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొరికారు.. నిందితులు దొరికిన విధానంపై మంచిర్యాల, బాసర సీఐలు శనివారం వివరాలు వెల్లడించారు. మంచిర్యాలలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారు మాట్లాడారు. వారు తెలిపిన వివరాలు.. నిందితుల కోసం మహారాష్ట్ర, కర్ణాటకలోని బీదర్లో వెతికారు. చివరకు మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన నలుగురు పార్దీ తెగకు చెందిన ముఠా సభ్యులే ఈ హత్యలు చేశారని గుర్తించారు. బాసరలో హత్యకు పాల్పడిన వీరు.. తదుపరి వ్యాపారి కారులోనే మంచిర్యాలకు చేరుకున్నారు. మరుసటి రోజే అక్కడ తల్లీకొడుకుని హత్య చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తూ జహీరాబాద్ వద్ద కారును వదిలారు. అక్కడి నుంచి మహారాష్ట్ర చేరారు. మరికొన్ని రోజుల తర్వాత కల్యాణ్, బాపురావు సుమో కిరాయికి తీసుకుని మేడ్చల్లో దొంగతనానికి పాల్పడి ఇద్దరిని గాయపర్చారు. స్థానికుల చొరవతో వారు అక్కడే పట్టుబడ్డారు. నిందితుల్లోని కల్యాణ్ తల్లిని బాసరలో అదుపులోకి తీసుకోగా ఆమె ఈ వివరాలు వెల్లడించిందని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. -
బాసర, మంచిర్యాల ఘటనల్లో పురోగతి శూన్యం
ఆదిలాబాద్, న్యూస్లైన్ : జిల్లాలో సంచలనం కలిగించిన బాసర, మంచిర్యాల దోపిడీ, హత్య కేసుల మిస్టరీ వీడలేదు. నెలన్నర అవుతున్నా పురోగతి లేదు. మహారాష్ట్ర, కర్నాటకలో పోలీసులు గాలిస్తున్నా నిందితుల ఆచూకీ లభించడం లేదు. బాసర హత్య కేసు లో చోరీకి గురైన కారును మెదక్ జిల్లాలో స్వాధీనం చేసుకోవడం మినహా పోలీసులు సాధించింది ఏమి లేదు. ఈ రెండు కేసులను ఛేదించడానికి ఉన్నతాధికారులు ఐదు పోలీసు బృందాలను నియమించినా కేసులు కొలిక్కిరావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చినట్లు సమాచా రం. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గతంలో ఓ మందిరంలో జరిగిన దొంగతనం కేసులో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాసర, మంచిర్యాల కేసులతో ఈ దొంగలకు ఏదైన సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కొనసాగుతున్న శోధన ఆగస్టు 16 అర్ధరాత్రి దాటిన తర్వాత బాసరలో వ్యాపారి అశోక్స్వామి, ఆయన భార్య సువర్ణ, పెద్దకుమారుడు మణికంఠలను అగంతకులు దారుణంగా హతమర్చారు. చిన్నకుమారుడు శరత్ చంద్ర(10)పై కూడా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. శరత్చంద్ర ఇచ్చిన సమాచారంతో పోలీసులు శోధిస్తున్నారు. దొంగలు ముసుగు ధరించి వచ్చినట్లు శరత్చంద్ర పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పార్థిముఠా ఇలాగే ముసుగు ధరించి దోపిడీ, హత్యలకు పాల్పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కొంత కర్ణాటక దొంగల ముఠాపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాసర సంఘటన మరుసటి రోజే ఆగస్టు 17న మంచిర్యాలలో దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురైన దుర్గమ్మ, రవీందర్ హత్యకు గురయ్యారు. బాసరలో ముగ్గురిని హత్య చేసిన ముఠానే ఈ హత్యలకు పాల్పడిందా? లేనిపక్షంలో మరో దొంగల ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఒక నిర్ధారణకు రానట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లోని కూకట్పల్లి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో దోపిడీ, హత్యలకు పాల్పడిన కర్ణాటకు చెందిన పార్థి గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. వారికి జిల్లా కేసులతో సంబంధం ఉందా లేదా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే హత్య కేసుల శోధన కోసం నియమించిన ఐదు పోలీసు బృందాలు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, రాయిచూర్, ఉశంగబాద్, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, లాతూర్, పర్బని, నాందేడ్లతోపాటు పలు ప్రాంతాల్లో దొంగల కోసం గాలించారు. కర్ణాటక, బీదర్లో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి జిల్లాకు తీసుకొచ్చారనేది సమాచారం. ఇద్దరిని ఇప్పటికే రిమాండ్ చేయగా మరో ముగ్గురిని విచారణ చేస్తున్నారు. ఇటీవల వీరిని బాసర తీసుకెళ్లి విచారించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ ఐదుగురు నిందితులకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో దుర్గా మందిరంలో జరిగిన చోరీ కేసుకు సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారనేది సమాచారం. కొంత బంగారంతోపాటు వెండిని స్వాధీనం చేసుకున్నారనేది వినికిడి. ఈ ఐదుగురు నిందితులతోపాటు మరో ముగ్గురు ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారనే సమాచారంతో మిగతా ముగ్గురి కోసం కూడా వెతుకుతున్నారు. ఆదిలాబాద్లో గతంలో నివసించిన ఒక వ్యక్తి అరెస్ట్ అయిన గ్యాంగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో కుక్కల బెడద
భైంసా, న్యూస్లైన్ : చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో విద్యార్థుల కోసం మెరుగైన వసతులతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఎన్నో ప్రమాణాలు.. మరెంతో లక్ష్యంతో నిర్మించిన ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఉండాలంటేనే భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. భవ నం చుట్టూ ప్రహరీ లేక కుక్కలు.. పశువులు బెడద వేధిస్తోంది. ట్రిపుల్ ఐటీ ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా విద్యార్థుల సంక్షేమ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిండా నిర్లక్ష్యం.. బాసర ట్రిపుల్ఐటీ కళాశాల చుట్టూ ప్రహరీ లేదు. దీం తో పశువులు, మేకలు, కుక్కలు ట్రిపుల్ ఐటీ ఆవరణలోనే సంచరిస్తుంటాయి. దీనికితోడు మెస్కు చెందిన వ్యర్థ పదార్థాలను కళాశాల ఆవరణలో డంపింగ్ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే దుర్వాసనతోపాటు అక్కడికి కుక్కలు కూడా వస్తుంటాయి. ఇవే కాకుండా ట్రిపుల్ఐటీ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. అయినా.. విద్యార్థుల సంక్షేమ కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించడంలేదు. కళాశాల ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు. ఫలితంగా శుక్రవారం రాత్రి తరగతి గ దుల నుంచి భోజనశాల వైపు వస్తున్న విద్యార్థులపై పి చ్చి కుక్క దాడిచేసింది. 20 మందిని తీవ్రంగా గాయపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రులు హై రానా పడ్డారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని హైదరాబాద్ తరలించారు. మరికొందరు త ప్పించుకునే ప్రయత్నంలో కిందపడి గాయపడ్డారు. ఆదివారం మరోమారు దాడికి యత్నం.. శుక్రవారం రాత్రే కుక్క 20 మంది విద్యార్థులను గా యపరిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం రాత్రి సమయంలోనూ మరో కుక్క కళాశాల ఆవరణ లోకి వచ్చింది. దాడికి యత్నించే క్రమంలో విద్యార్థు లు గమనించి పారిపోయేలా ప్రయత్నించారు. ఈ క్ర మంలో కిందపడి విద్యార్థినులు మౌనిక, భవాని గా యపడ్డారు. ఇద్దరికీ స్థానికంగా చికిత్స అందించారు. ఇదిలాఉంటే.. అప్పటికే కళాశాలలోని 60 శాతం మం ది విద్యార్థులు భోజనం చేయగా.. కుక్క ఎప్పుడు వ చ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురై రాత్రి 40 శాతం మందిభోజనానికి దూరంగా ఉన్నారు. తేరుకోకుంటే మరోముప్పు.. ట్రిపుల్ఐటీ కళాశాల విద్యార్థులను కుక్క దాడిలో గాయపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం తేరుకోవాల్సి ఉంది. విద్యార్థుల రక్షణపై దృష్టి సారించాలి. ట్రిపుల్ఐటీ క్యాంపస్లో భవనాలపై చాలా చోట్ల తేనె తుట్టెలు పెట్టాయి. ప్రమాదవశాత్తు అవి చెలరేగితే విద్యార్థులు మరోసారి పరుగులు తీయాల్సిందే. నీటి ట్యాంకు ఆనుకుని ఉన్న భవనంలోనూ.. ఆస్పత్రికి వెళ్లే మార్గంలోనూ ఇవి కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు కుక్కలు.. మరో వైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. సెలవు రోజుల్లో తొలగిస్తే మేలు.. ప్రస్తుతం ట్రిపుల్ఐటీలో 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాల ఆవరణలో తేనె తుట్టెలు పెట్టాయి. ఇప్పుడు వాటిని తొలగించినా ఇబ్బందులు తలెత్తుతాయి. దసరా సెలవుల్లో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోతారు. అలాంటి సమయంలోనైనా విశాలంగా ఉన్న ట్రిపుల్ఐటీ భవనాల్లో తేనె తుట్టెలను తొలగిం చాలి. ట్రిపుల్ఐటీ కళాశాల ఆవరణలో మూగజీవాలు, గొర్రెలను మేపుతుంటారు. చిట్టడివిని తలపించే కళాశాల ఆవరణను శుభ్రం చేయాలి. ముళ్లపొదలు తొల గించి కళాశాల ఆవరణను చదును చేయాలి. లేనిపక్షంలో విషసర్పాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదిస్తాం - నారాయణ, ట్రిపుల్ఐటీ ఓఎస్డీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం 57 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రహరీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ట్రిపుల్ఐటీ చుట్టూ గోడ నిర్మించే విషయంలో ప్రభుత్వానికి మరోసారి నివేదిస్తాం. -
బాసరలో ఎస్పీ ఆరా
ముథోల్/బాసర, న్యూస్లైన్ : బాసరలో ముగ్గురు హత్యకు గురైన సంఘటన స్థలాన్ని ఆదివారం ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో జరిగిన ఘాతుకం తెలుసుకునేందుకు భైంసా డీఎస్పీ దేవిదాస్ నాగులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి అశోక్ దంపతుల హతమార్చిన స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్వారం వద్ద పొడవాటి కట్టెను స్వాధీనం చేసుకున్నారు. కట్టెతో తలపై మోది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కట్టెకు ఒక వైపున రక్తపు మరకలు ఉన్నాయి. అనంతరం ఒకటవ అంతస్తులోకి వెళ్లి ఎస్పీ అక్కడ పనిచేసే వారితో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ కల్పించండి.. శారదానగర్కు వచ్చిన ఎస్పీ త్రిపాఠిని రక్షణ కల్పించాలంటూ కాలనీవాసులు విన్నవించుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమకు ఏమి తోచడం లేదని వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. కాలనీలో ఉండేవారంతా ఐక్యంగా ఉండాలని పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. కాలనీలో ఐక్యంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. అనంతరం బాసర పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ సందర్శన.. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించారు. కళాశాలలో ర్యాగింగ్లాంటివి జరగకుండా కళాజాత ప్రదర్శనలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డీఎస్పీ దేవిదాస్ నాగులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలో చదివే విద్యార్థులు ట్రిపుల్ఐటిలో పోలీసు ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయించాలని ఎస్పీని కోరారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ విషయం పై దృష్టిపెడతామన్నారు. -
24 గంటల్లో ఐదుగురి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బాసరలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురి దారుణహత్య.. మంచిర్యాలలో శనివారం అర్ధరాత్రి ఇద్దరి హతం.. 24 గంటల్లోనే ఐదుగురు హత్యకు గురయ్యారు.. ఈ రెండు సంఘటనల్లో అగంతకులు కత్తులు, గునపాలు, ఇనుపరాడ్లు వాడినట్లు తెలుస్తోంది.. హతుల తలపైనే బలంగా గాయపరిచారు.. ఛిద్రమయ్యేలా బాదారు.. రెండు సంఘటనలు తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కలకలం రేపాయి. ఇప్పటికే జిల్లాలో వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతుండగా, అగంతలకు ఐదుగురిని దారుణంగా హతమార్చి పోలీసులకు సవాల్ విసిరారు. చెలరేగుతున్న దోపిడి దొంగలు, మాఫియా పోలీసులకు తలనొప్పిగా మారింది. బాసరలో శుక్రవారం రాత్రి అశోక్స్వామి, అతని భార్య సువర్ణ, పెద్ద కుమారుడు మణికంఠలను హత్య చేసిన అగంతకులు, చిన్న కుమారుడు శరత్చంద్రను తీవ్రంగా గాయపరిచారు. అయితే ఈ సందర్భంగా అగంతకులు మరాఠిలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మంచిర్యాల శ్రీశ్రీనగర్లో శనివారం రాత్రి హత్యకు గురైన దేవి దుర్గమ్మ(55), దేవి రవీందర్ (25) ఇదే తరహాలో దుండగులు కత్తులు, గునపాలు వాడటం చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ రెండు సంఘటనలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహారాష్ట్ర ముఠా పనే?.. ఎస్పీ త్రిపాఠి ఆరా.. బాసర, మంచిర్యాలలో జరిగిన రెండు సంఘటనలు, ఐదుగురి హత్య మిస్టరీగా మారింది. వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనల్లో అసలు హంతకులు ఎవరనేది పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకత ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమీపంలో జరిగిన ముగ్గురి హత్యపై పోలీసులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బాసరలో హత్య చేసిన అగంతకులు మరాఠిలో మాట్లాడినట్లు పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది. హంతకుల ఆచూకీ కోసం రంగంలోకి డాగ్ స్క్వాడ్ మహారాష్ర్ట వైపు వెళ్లే రైలు మార్గాల వెంట తిరగడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీముల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇదిలా వుండగా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం బాసరకు చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. సంఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడ పనిచేస్తున్న కొందరిని అడిగి తెలుసుకున్నారు. ముగ్గురి హత్యకు కారణమైన సంఘటనపై వివరాలు తెలుసుకున్న ఎస్పీ త్రిపాఠి భైంసా సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వేర్వేరుగా జరిగిన సంఘటనలపైనా తీవ్రంగా స్పందించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కేసు మిస్టరీని ఛేదించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా అశోక్స్వామి కుటుంబం హత్య వెనుకు మహారాష్ర్టకు చెందిన దొంగల ముఠా పనా? లేక వేరేవరైనా ఆ అఘాయిత్యానికి ఒడి గట్టారా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మంచిర్యాల ఘటనపై కూడా ఎస్పీ త్రిపాఠి పోలీసు అధికారులను విచారణకు ఆదేశించారు. ఐదేళ్లలో రికవరీ అంతంతే.. జిల్లాలో దొంగలు విజృంభిస్తుంటే పోలీసులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. ఐదేళ్లుగా కేసుల రికవరీలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2008లో 380 దొంగతనం కేసులు నమోదైతే, 2009లో 310, 2010లో 285, 2011లో 309 కేసులు నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. అలాగే 2008లో 3 డెకాయిట్, 2009లో 6, 2010లో 4, 2011లో 3, రాబరీ కేసులు 2008లో 20, 2009లో 19, 2010లో 15, 2011లో 9, 2012లో 7 కేసులు నమోదుకాగా ఆ కేసుల్లో పోలీసులు సాధించిన ప్రగతి అంతంత మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 2008లో మొత్తం కేసులు 4,898 నమోదు కాగా, 2009లో 4,923, 2010లో 4,598, 2011లో 4,672, 2012లో 4,538 నమోదైన ట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 45 శాతానికి పైగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. 2009లో సుమారుగా రూ.1.39 కోట్లు చోరీకి గురికాగా రూ. 94.05 లక్షలు రికవరీ అయ్యాయి. 2010లో రూ.1.68 కోట్లకు రూ.89.47 లక్షలు, 2011లో రూ. 2.82 కోట్లకు రూ.1.30 కోట్లు, 2012లో 2.46 కోట్లకు రూ.1.84 కోట్లు రికవరీ కాగా రూ.46.46 శాతం మాత్రమే బాధితులకు అందింది -
బాసరలో దొంగల బీభత్సం.. ముగ్గురి మృతి..
భైంసా/ముథోల్/బాసర, న్యూస్లైన్ : బాసరలో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగొట్టారు. ఓ కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నారు. కేవలం నగలు.. నగదు కోసం ముగ్గురిని బలితీసుకున్నారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ యజమాని, అతని భార్య, పెద్ద కొడుకు దుండగుల దాడికి విగతజీవులయ్యారు. చిన్న కొడుకు తీవ్ర గాయాలతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. వలస వచ్చి... హైదరాబాద్కు చెందిన సాలిక అశోక్ (50) 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వలసవచ్చారు. అతనికి భార్య సువర్ణ (45), ఇద్దరు కొడుకులు మణికంఠ (25), శరత్చంద్ర (11), ఇద్దరు కూతుళ్లు. ఆరేళ్ల ఓ కూతురు అనారోగ్యంతో చనిపోగా.. ఐదేళ్ల క్రితం మరో కూతురు వివాహం జరిపించాడు. బాసరలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పెద్ద కొడుకు మణికంఠ చదువు పూర్తిచేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. చిన్న కొడుకు ఆరో తరగతి చదువుతున్నాడు. గతంలో నష్టపోయి... సాలిక అశోక్ గతంలో వ్యాపారంలో నష్టపోయాడు. వ్యాపారం చేస్తూ ఓ లాడ్జి కొనుగోలు చేశాడు. అప్పులు తీర్చలేక మళ్లీ దాన్ని అమ్మేశాడు. అనంతరం ఆరేళ్లుగా ఆలయ ప్రాంగణంలో బారీకేడ్ల వద్ద పూలదుకాణం పక్కనే కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఆట వస్తువులు విక్రయించే దుకాణాన్ని వేలం పాట ద్వారా దక్కించుకున్నాడు. దుకాణాన్ని నడుపుతూ శారదనగర్లో ఇంటిని నిర్మించాడు. ఇంటి పనులు పూర్తయితే పెద్ద కొడుకు మణికంఠ వివాహం చేయాలని ఇంట్లో చర్చించుకుంటున్నారు. దోపిడీ హత్యలే... శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే ఇంటికి చేరుకున్న అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఇంటి వెనకాల కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి చొరబడ్డారు. ప్రధాన ద్వారం వద్ద హాలులో నిద్రిస్తున్న కుటుంబీకులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కత్తులతో ఇష్టారాజ్యంగా దాడిచేసి ముఖాలను గుర్తుపట్టలేని విధంగా చేశారు. దుండగుల దాడితో సాలిక అశోక్, ఆయన భార్య సువర్ణ, పెద్ద కొడుకు మణికంఠ అక్కడికక్కడే చనిపోయారు. చిన్న కొడుకు శరత్చంద్ర తీవ్రగాయాలతో రాత్రంతా అక్కడే పడిఉన్నాడు. అందరూ చనిపోయారనుకుని దుండగులు బయటపడ్డారు. వ్యాపారి ఇంట్లోని నగదు, నగలు, సెల్ఫోన్లు, ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న కారును తీసుకెళ్లిపోయారు. ఇలా వెలుగులోకి.. వ్యాపారి ఇంట్లో ఒకటో అంతస్తులో కార్పెంటర్లు ఇంటి అలంకరణ చేస్తున్నారు. శుక్రవారం పనులు చేశాక పైఅంతస్తులోనే నిద్రించారు. శనివారం ఉదయం నిద్రలేచి బయటకు వెళ్లారు. హోటల్లో అల్పాహారం చేశాక మళ్లీ పనులు చేసేందుకు వెనక్కి వచ్చారు. ప్రతి రోజూ అశోక్ నిద్రలేవగానే.. ఆరోజు చేపట్టే పనులపై వాకబు చేసేవారు. తెల్లవారినా ఆయన రాకపోవడంతో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వారు కిందికి వచ్చి కిటికీ నుంచి లోపలికి చూశారు. అప్పటికే రక్తపు మడుగుల్లో వ్యాపారి కుటుంబీకులను చూసి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్పటికే విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే.. శరత్చంద్ర చేతి కదపడంతో అతను బతికే ఉన్నాడనుకుని ఆస్పత్రికి తరలించాలని స్థానికులు పోలీసులకు చెప్పారు. డీఎస్పీ వచ్చాకే తలుపులు తెరుస్తామని, అప్పటి వరకు లోనికి ఎవరూ వెళ్లొద్దని ముథోల్ సీఐ శ్రీధర్రావు స్థానికులకు స్పష్టం చేశారు. పిల్లాడిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లకుంటే ప్రాణాలు దక్కవని గ్రామస్తులు కోరడంతో సీఐ శ్రీధర్రావు అంబులెన్సును పిలిపించారు. 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శరత్చంద్ర కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించే ముందు వ్యాపారి చిన్న కొడుకు శరత్చంద్ర దుండగులు మరాఠీలో మాట్లాడారని వెల్లడించారు. బండరాళ్లు, కత్తులతో కొట్టి చంపారని.. అంతా దోచుకువెళ్లారని తెలిపారు. జాగిలాలతో తనిఖీ... భైంసా డీఎస్పీ దేవిదాస్నాగుల సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలను రప్పించారు. మధ్యాహ్నం 1.27 గంటలకు జాగిలాలు ఇంటిలోకి పంపించారు. శారదనగర్ సమీపంలోని కల్యాణ మండపం, పెట్రోల్ బంక్, రైల్వే స్టేషన్ వరకు వెళ్లి జాగిలాలు ఆగిపోయాయి. జాగిలాలు పరుగెత్తిన మార్గాన్ని బట్టి చూస్తే దుండగులు మహారాష్ట్రకు చెందిన వారే అయి ఉంటారని రైలు మార్గం ద్వారా బాసర వచ్చి పెట్రోల్ బంక్ సమీప రోడ్డు నుంచి కల్యాణ మండపం దాటి ఇంట్లోకి చొరబడ్డారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
బాసరలో దొంగల బీభత్సం
భైంసా/బాసర, న్యూస్లైన్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దొంగల క్రూరత్వానికి బలయ్యారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేయడమే కాకుండా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. బాసర ఆలయం ఎదుట గల గిఫ్ట్ గ్యాలరీ షాపు యజమాని సాలిక అశోక్ శారదానగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి ఆయన ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాక అందరూ నిద్రకు ఉపక్రమించారు. దొంగల ముఠా ఇంటి వెనకాల కిటికీ గ్రిల్ తొలగించి లోనికి చొరబడ్డారు. ఒక్కసారిగా అశోక్(50), ఆయన భార్య సువర్ణ (45), పెద్ద కొడుకు మణికంఠ (25), చిన్న కొడుకు శరత్చంద్రలపై కత్తులతో దాడిచేశారు. సువర్ణపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో సువర్ణతోపాటు అశోక్, మణికంఠ అక్కడికక్కడే చనిపోయూరు. అనంతరం దొంగలు ఇంట్లోని నగలు, నగదు తీసుకొని అశోక్కు చెందిన కారులో పరారయ్యారు. శనివారం ఉదయం కార్పెంటర్ తలుపులను తట్టగా.. వారు ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూశాడు. రక్తపుమడుగులో ఉన్న మృతదేహాలను చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. నలుగురు చనిపోయారని అందరూ భావిస్తున్న తరుణంలో, శరత్చంద్ర బతికే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే 108లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లోని యశోదకు తీసుకెళ్లారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ఆదివారం సెలవు కావడంతో బాసరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి, అక్షరాభ్యాసానికి ఐదు గంటల సమయం వేచిచూడాల్సి వస్తోంది. మరోవైపు నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్లోని నాగోబా ఆలయంలో జాతర ప్రారంభయింది. చుట్టుపక్కలవారే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.