bc welfare
-
విదేశీ విద్య దరఖాస్తులకు మోక్షమెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం రెండు సీజన్ల నుంచి దరఖాస్తులకే పరిమితమవుతోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ... ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం విడుదల చేయట్లేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టులో దాదాపు 5 వేల మంది బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం.. నెలలు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల అర్హతలను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తోంది. దీంతో విదేశీ విద్యాభ్యాసంపై అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. కొందరు కోర్సును వాయిదా వేసుకోగా మరికొందరు పథకంపై ఆశలు వదులుకొని విదేశాల్లో చదువు కొనసాగించేందుకు వెళ్లిపోయారు.పెండింగ్... పెండింగ్... విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... ఎంపికైన అభ్యరి్థకి గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పీజీ కోర్సు మొదటి సంవత్సరం పూర్తి కాగానే రూ. 10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేశాక మరో రూ. 10 లక్షల చొప్పున సాయాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అలాగే ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు కూడా చెల్లిస్తోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఏటా 300 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహా్వనించగా 2,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.జనవరి నెలాఖరులో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు... విద్యార్థుల మార్కులు, పోటీ పరీక్షలకు సంబంధించిన స్కోరు వివరాలతో జాబితాలను తయారు చేసుకున్నారు. చివరగా పథకానికి అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేయాల్సి ఉండగా... వివిధ కారణాలతో జాబితా ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడం, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచి్చంది.ఇంతలో రెండో విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించిన అధికారులు... అదే నెలాఖరులో ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు అర్హుల జాబితాను విడుదల చేయలేదు. రెండు విడతల్లో 300 మంది అర్హులను గుర్తించకుండా ఈ ప్రక్రియను పెండింగ్లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు అర్హుల జాబితాలను విడుదల చేసినప్పటికీ బీసీ సంక్షేమ శాఖలో నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. -
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
బాబు ఇంతేకదమ్మ!
బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా భరత్కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్కి టికెట్ ఇచ్చి బీసీలను గౌరవించింది. మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే. టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. బాబు కులస్తులకే పెద్దపీట కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్ (తిరుపతి) టికెట్ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. -
తెలంగాణలో త్వరలో కులగణన
-
బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్
సాక్షి, గుంటూరు: సామాజిక న్యాయం.. బహుశా దీని గురించి చంద్రబాబు హయాంలో ఎవరూ విని ఉండరు. ఎందుకంటే.. ఆయన తన కులం గురించి తప్పా ఇతర వర్గాల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి. కానీ, గత నాలుగున్నరేళ్లలో అదెంటో ఏపీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు. పదవుల్లో, పథకాల్లో అన్నింటా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోంది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారిప్పుడు. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని అధికార పక్షానికి చంద్రబాబు సవాల్ విసిరుతున్నారు. అది సీఎం జగన్ సొంత నియోజకవర్గం. మరి పులివెందులలో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టే దమ్ము టీడీపీకి ఉందా?. ఎన్నికలొస్తున్నాయి కదా అందుకే చంద్రబాబు స్వరం మారింది. బీసీలను ఉద్ధరించేవాడిలా స్టేట్మెంట్లు ఇస్తున్నారాయన. ►చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కూడా బీసీలనే దెబ్బకొట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఓడిపోగానే.. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బీసీల నోట్లో మట్టి కొడుతూ వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తనయుడ్ని అదే బాటలో నడిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నాడు. ►బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా నమ్మారు. అందుకే బీసీలకు, అదే విధంగా ఇతర సామాజికవర్గాలకూ పెద్ద పీట వేశారు. ఇప్పుడు కులాలవారీగా ఏపీ ప్రజలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు (2014-2019)తన హయాంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? అలాగే సీఎం జగన్ తన హయాంలో సముచిత స్థానం కల్పించారో లెక్కలు చూస్తే.. 1)మంత్రి పదవులు చంద్రబాబు పాలనలో బీసీలు -8 వైఎస్ జగన్ పాలనలో బీసీలు-11 బాబు పాలనలో ఎస్సీలు -2 జగన్ పాలనలో ఎస్సీలు-5 2)స్పీకర్ బాబు పాలనలో కోడెల-కమ్మ సామాజిక వర్గం జగన్ పాలనలో తమ్మినేని సీతారాం - బీసీ శాసనమండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు 3)రాజ్యసభ ఎంపీలు బాబు పాలనలో బీసీలు-0 జగన్ పాలనలో బీసీలు-4 (50 శాతం) 4)ఎమ్మెల్సీ పదవులు బాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు -18 (37 %) జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు-29 (68 %) 5) సీఎం జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురు (80 శాతం) బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే. 6)13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 7) రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే.. 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు 8 ) 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే.. అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 9) వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 10) 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 11) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. ఈ లెక్కలు చాలావా? జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పడానికి. ‘‘నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తా’’ ‘‘మత్స్యకారుల తోలు తీస్తా’’ ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’’ ఇలాంటి కులహంకార వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు కాదా?.. దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం.. సీఎంగా ఉండి కూడా ప్రజలకు సామాజిక న్యాయం ఎందుకు అందించలేకపోయారు?.. అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ అది చేస్తా.. ఇది చేస్తా.. అంటూ చిడతలు వాయిస్తున్నారిప్పుడు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు- సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ ఒక్కటేనా?.. ఆయన బావమరిది బాలయ్య స్టైల్లోనే చెప్పాలంటే.. ‘‘బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్’’. -
అసెంబ్లీ టికెట్లు ఇవ్వండి
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న లాల్కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్సైట్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. దరఖాస్తు కోసం https://tsobmmsbc.cgg.gov.in క్లిక్ చేయండి -
తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ ఎత్తేసే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఏపీ సర్కార్ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. అంతేకాదు బీసీలకు సాయం అందిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కార్ మాట తప్పిందని, తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారాయన. ‘‘బీసీల్లో ఆరు కులాలకు మాత్రమే టీఎస్ సర్కార్ రూ. లక్ష సాయం అందిస్తోంది. గతంలో అనేక కులాలకు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీల్లో ఉన్న మిగతా 130 కులాలకు కూడా రూ. లక్ష సాయం అందించాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఇక.. బీసీ బంధు ఇస్తామని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారాయన. ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని గుర్తు చేస్తున్నారాయన. అలాగే ‘‘తెలంగాణలో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్లకు రూ.10 వేలు ఇస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ ఎత్తివేసే కుట్రజరుగుతోందని, సీఎం పేషీలో కూడా అదే విధంగా జరుగుతోందని’’ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు. -
బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి
గుంటూరు రూరల్: బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. నగర శివారు అమరావతిరోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నేత సీఎం జగన్ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు, చట్ట సభల్లో ప్రాధాన్యం దక్కిందన్నారు. బీపీ మండల్ బీసీల అభివృద్ధికి దేశ వ్యాప్తంగా తిరిగి జనాభా ప్రాతిపదికన ఎన్నో సంస్కరణలు చేశారని, వాటిని అమలు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి జనగణన చేపట్టాలంటూ బీసీలంతా ఐకమత్యంగా ఒక వేదికపైకి రావడాన్ని అభినందించారు. జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కల్పలతారెడ్డి, ఎంపీ బీద మస్తాన్రావు, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్మండల్, ద్రవిడ కజగం ప్రెసిడెంట్ వీరమణి, తమిళనాడు ఎంపీ తిరుమావళాన్, బీసీ సంక్షేమ సంఘం నేత డాక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో సీఎం జగన్ కాన్వాయ్..
-
వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
జయహో బీసీ: ‘రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేశాను’
జయహో బీసీ మహాసభ.. లైవ్ అప్డేట్స్ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ► ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి ► వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. ► 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. ►రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. ► చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. ► ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ► వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ► చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. ► టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. ► ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ► నా బీసీ కుటుంబం.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసింది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశాను: సీఎం జగన్ ► సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం.. బీసీ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మహాసభను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారాయన. ► నేతల ప్రసంగాలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. అందరికీ అభివాదం తెలిపారు. చివరగా.. సీఎం వైఎస్ జగన్ను ప్రసంగానికి ఆహ్వానించారు. ► సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు. సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. ► మళ్లీ జగన్నే గెలిపించుకుందాం సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. ► 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. మీకు అండగా ఉంటామన్న జగనన్న వెంట నడుద్దామని బీసీలను కోరారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్లు పేల్చారు జోగి రమేష్. వైఎస్ జగన్ను ఎదుర్కొలేని దద్దమ్మలు.. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతాం అని ఆయన అన్నారు. ► బీసీలకు సీఎం జగన్ ఇచ్చింది ఆల్టైం రికార్డు లక్షమంది హాజరైన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం.. ఆల్టైం రికార్డు. ఇదే వేదిక నుంచి ఆయన చంద్రబాబుకు చరకలు అంటించారు. చంద్రబాబు డీఎన్ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని బీసీలకు పిలుపు ఇచ్చారు అనిల్ యాదవ్. ► ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం జగన్ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. ► జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని మంత్రి కారుమూరి తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ► బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత జగన్ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్ పిలుపు ఇచ్చారు. ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 11.31AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారామె. ► విజయవాడ జయహో బీసీ మహాసభ.. ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం ఆయనది. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ► బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారు: ఎంపీ మోపిదేవి ► బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ, జగన్ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు. ► బీసీలు బాబుకి బుద్ధి చెప్పాలి: స్పీకర్ తమ్మినేని జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ► పదకొండు తరాల వెనుకబాటు తనానికి కారణం చంద్రబాబు కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన. ► విజయవాడ దారులన్నీ జయహో బీసీ మహాసభ వైపే వెళ్తున్నాయి. సభ కోసం భారీ సంఖ్యలో బీసీలు తరలి వస్తున్నారు. బీసీ జయ జయ నాదాలతో విజయవాడ మారుమోగిపోతోంది. 80 వేల మంది అంచనాని దాటేసి.. సుమారు లక్ష మంది దాకా సభకు హాజరు అయ్యారు. ► ఆయనేమో బీసీలను చిన్నచూపు చూశారు బీసీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం జగన్దే. బీసీలను చంద్రబాబు చిన్నచూపు చూశారు. కించపరిచారు. అలాంటిది.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ► బీసీల ఆత్మగౌరవమే కాదు.. అభివృద్ధి జరిగింది ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని ఉద్ఘాటించారాయన. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ► బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 09.35AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది. ► బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి ► 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది. - జోగి రమేష్ ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో ఇవాళ(బుధవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ పార్టీ. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు సభ కోసం తరలి వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. ► జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరై.. ప్రసంగించనున్నారు. ► వైఎస్ఆర్సీపీ మినీ ప్లీనరీ తరహాలో ‘జయహో బీసీ మహాసభ’కు భారీ ఏర్పాట్లు చేశారు. ► బీసీ ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలి రానున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ► జయహో బీసీ మహాసభకు హాజరయ్యే వాళ్ల కోసం విజయవాడ, గుంటూరు హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ► బీసీ మహాసభ సందర్భంగా.. విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ► బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. ఎన్నికల హామీలకు మించి అత్యధికంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీసీ మహాసభ: నాడు అవమానం.. నేడు సమున్నతం..
నాడు బాబు హయాంలో... తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తిరిస్తానంటూ అధికార దర్పంతో చంద్రబాబు బెదిరించారు. హామీలను నెరవేర్చాలని విన్నవించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హూంకరించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ దళితులను, కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళలను కించపరిచి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు. నేడు జగన్ పాలనలో... బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో బీసీల ఖాతాల్లోకి రూ.85,915.06 కోట్లు జమ చేశారు. అమ్మఒడి నుంచి విద్యాదీవెన వరకూ వివిధ పథకాల ద్వారా బీసీ విద్యార్థులకు సింహభాగం మేలు చేస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అత్యధిక పదవులను బీసీలకే కేటాయించారు. సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత.. రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. బీసీ బిడ్డల చదువులకు అండగా నిలిచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ సామాజిక వర్గాలను సీఎం వైఎస్ జగన్ సమాజానికి వెన్నెముకలా నిలబెడుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మూడున్నరేళ్లలో పేదలకు రూ.1,77,585.51 కోట్లను పారదర్శకంగా అందించగా బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్ల మేర ప్రయోజనం చేకూరటాన్ని ప్రస్తావిసు్తన్నారు. నగదు బదిలీ, నగదేతర బదిలీతో పేదలకు మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర లబ్ధి చేకూరగా బీసీ వర్గాలకే రూ.1,63,344.10 కోట్ల మేర మేలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అమ్మఒడి, విద్యాకానుక అందచేసి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అధికారంగా వాటా.. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించింది. తాము అధికారంలోకి రాగానే బీసీలకు చేసే మేలును బీసీ డిక్లరేషన్ రూపంలో ఈ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అందులో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా వారికి ప్రయోజనం చేకూర్చారు. అవి ఏమిటంటే... ► 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50% ఓట్లతో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ స్థానాలతో చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న తాజా కేబినెట్లో 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్ బాషాతో పాటు బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు. ► స్పీకర్గా బీసీ వ్యక్తి అయిన తమ్మినేనికు అవకాశం కల్పించారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులుండగా అందులో బీసీలే అత్యధికం కావడం గమనార్హం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా టీడీపీ నేతలను చంద్రబాబు ఉసిగొల్పారు. హైకోర్టు తీర్పుతో బీసీల రిజర్వేషన్లు 24%కి తగ్గిపోయాయి. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. ► 13 జిల్లా పరిషత్ల్లో 9 జడ్పీ చైర్పర్సన్ పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో బీసీలకే పెద్దపీట వేశారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ► 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్ సీపీ క్లీన్స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. ఇందులోనూ బీసీలకే అగ్రతాంబూలం కల్పించారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73% ఇచ్చారు. ఇందులోనూ బీసీలదే అధిక శాతం వాటా ఉంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు.. ► దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 % రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చట్టం తెచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76(39%) బీసీలకే ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు కేటాయించారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. పెద్దల సభకు ఒక్కరినీ పంపలేదు బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఆ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చాక వారికి వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టాక మంత్రివర్గంలో ఆరుగురు బీసీలకే బాబు అవకాశం కల్పించగా 11 మంది ఓసీలకు ఛాన్స్ ఇచ్చారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా బాబు పంపలేదు. నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ, మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. అడుగడుగునా బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు.. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం చేస్తూ బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్ను సీఎం నియమించడంతో ఆయా వర్గాలు వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాలు ఇందుకు నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. బీసీల జనాభా అధికంగా ఉండే కుప్పంలో టీడీపీ కోట కుప్ప కూలటానికి ఇదే కారణమంటున్నారు. -
Warangal: బర్త్డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
మాయ మాటలు చెప్పడానికి చాలామంది వస్తారు
సాక్షి, విజయవాడ: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా.. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గురువారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి. మనకి మాయమాటలు చెప్పడానికి చాలా మంది వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుమని పదిమందికి మంత్రి పదవులు రాలేదు. అలాంటిది సీఎం జగన్ కేబినెట్లోనూ, ఇతర చోట్లా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెట్ పోస్టులలో బీసీలకి 50 శాతం కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్ది.రాజ్యసభ సీటు కోసం కోట్ల రూపాయల ఫండ్ తీసుకుంటున్న రోజులివి. అలాంటిది అలాంటిది.. బీసీ ఉద్యమ నేత అయిన నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. బీసీ బిల్లు పెట్టాలని 40 ఏళ్లగా పోరాటం చేశా. కొందరు ప్రధానులను, ప్రముఖ పార్టీలను కలిశా. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, ఒకేసారి సీఎం వైఎస్ జగన్ని కలిసి అడిగా. వెంటనే ఆయన స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలను పిలిపించి బీసీ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోమన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఏకైకపార్టీగా వైఎస్సార్ సీపీ నిలిచిపోతుంది. ఇంతలా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్కి అండగా నిలబడాల్సిన అవసరం బీసీలకు ఉంది అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో.. ఇక ఈ ఆత్మగౌరవ సభలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎంపీలకు సన్మానం చేశారు. మంత్రులు జోగి రమేష్ , విడదల రజినీ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్లు.. కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు వర్గాలకు నాలుగు ఆల్ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అద్భుతమైన భూమికను పోషించాలి ‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్ పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు. గురుకులాల్లో ఆధునిక కోర్సులు రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
ఏపీలో ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు. -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్ పేరుతో 100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్సీ, క్లరికల్ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్ అలాగే కోచింగ్కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు. ఫలితాలను వెంటనే అన్లైన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా ట్రైనింగ్ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్అకాడమీ, బైజూస్ లాంటి సంస్థలతో టైఅప్ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్నెస్ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్గా కూడా ఆన్లైన్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. -
జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా సాహిత్య రచనలకు ఆహ్వానం, ఏప్రిల్ 11న బహుమతి ప్రదానం
-
పెంచీ పెంచనట్టు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత బడ్జెట్తో పోలిస్తే రూ.175.46 కోట్లు ఎక్కువగా రూ.5,697.55 కోట్లను సర్కారు కేటాయించింది. నిర్వహణ పద్దులో పెరుగుదల ప్రభావంతో ఈ మేరకు బడ్జెట్ పెరిగినా సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు పెరగలేదు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.90 కోట్లు కేటాయించింది. 42 కులాల ఆత్మగౌరవ భవనాల కోసం ఇప్పటికే స్థలాలను ప్రభుత్వం నిర్దేశించగా తాజా కేటాయింపులతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేషన్లకు కోత.. ఫెడరేషన్లకు కొంత.. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు తాజా బడ్జెట్ నిరాశ కలిగించింది. 2021–22 బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.500 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. తాజా బడ్జెట్లో ఒక్కో కార్పొరేషన్కు రూ.300 కోట్లు చొప్పున ప్రకటించింది. గత బడ్జెట్తో పోలిస్తే రూ.400 కోట్లు కోతపడింది. ఫెడరేషన్లకు గత బడ్జెట్లో రిక్త హస్తం చూపినా తాజా బడ్జెట్లో 12 ఫెడరేషన్లకు సింగిల్ డిజిట్లో నిధులు కేటాయించింది. ఉచిత విద్యుత్ పథకం కింద రజకులకు రూ.50 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.50 కోట్లు చొప్పున ప్రకటించింది. ఎస్సీలకు దండిగా.. ఎస్టీలకు మెండుగా.. ఎస్సీ అభివృద్ధి శాఖకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం నిధులు భారీగా కేటాయించింది. రూ.20,624.88 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్తో పోలిస్తే పద్దు రూ.15,036.91 కోట్లు పెరిగింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు ప్రకటించడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది. గిరిజన సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.3,415.41 కోట్లను కేటాయించింది. ఈ పద్దు గత బడ్జెట్తో పోలిస్తే 359.29 కోట్లు పెరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్ కన్నా రూ.122.32 కోట్లు ఎక్కువగా రూ.1,728.71 కోట్లను ప్రకటించింది. నిధులు దాదాపు 7 శాతం మేర పెరగడంతో పెండింగ్ పథకాలకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
50 మంది విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్ అభినందించారు. -
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
బీజేపీకి బీసీ ఓట్లు అవసరం లేదా?: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే బీజేపీని బీసీలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణనను నిర్వహించేది లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని దేశంలోని 60 కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శనివారం దోమలగూడలోని బీసీ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో జాజుల మాట్లాడుతూ బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం నేడు మాట మార్చడం అంటే బీసీలను దగా చేయడమేనని ఆరోపించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని జనాభా లెక్కలు సేకరించాలని బీజేపీ పార్లమెంట్లో డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ జనాభా లెక్కలు తీస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి జాజుల లింగం, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, విద్యార్థి సంఘం నాయకులు మహేశ్, చంద్రశేఖర్గౌడ్, రాజేందర్, సాయితేజ్, అరవింద్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
బీసీల్లో పేదరికాన్ని పోగొట్టేందుకే సంక్షేమ పథకాలు
సాక్షి, అమరావతి: బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జంగమ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. జంగమ కార్పొరేషన్ చైర్పర్సన్ వావిలేటి ప్రసన్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బీసీ కుటుంబంలో పేదరికాన్ని పొగొట్టేందుకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు రుణాలు ఇవ్వడం లేదంటూ ప్రచారం చేసే ఎల్లో మీడియా బీసీలకు అమలు చేస్తున్న పథకాలు గురించి తెలుసుకోవాలన్నారు. జంగమ కులస్తులు ప్రతి గ్రామంలోనూ ఉండి సంప్రదాయాల పరంగా అందరికి సేవలందిస్తుంటారని తెలిపారు. చిన్న కులమే అయినప్పటికి.. వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ జంగమ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారన్నారు. జంగమ కార్పొరేషన్.. ఆ కులంలో ఉండే ప్రతి సమస్యను పరిష్కరించి, వారి కులస్తులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జంగమ కార్పొరేషన్ కింద ఉన్న ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. కార్పొరేషన్ చైర్పర్సన్, డైరెక్టర్లు జిల్లాలవారీగా జంగమ కులస్తుల సమస్యలపై సమావేశాలు నిర్వహించి సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ, బీసీ మంత్రి దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని తెలిపారు. శైవ క్షేత్రాల్లో జంగమ కులం వారిని పెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బీసీల సువర్ణ శకానికి సీఎం జగన్ నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, జంగమ కులస్తుల రాష్ట్ర నేతలు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. -
Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!
సాక్షి, అమరావతి: బ్యాక్వర్డ్ క్లాస్!!. బీసీలంటే అంతే!!. చంద్రబాబు దృష్టిలోనూ ఇంతే!!. వారికో ప్రత్యేక గుర్తింపునివ్వాలని... ఆర్థికంగానే కాక అధికారం కూడా ఇచ్చి బలోపేతం చేయాలని చంద్రబాబుకు తాను అధికారంలో ఉన్నపుడెప్పుడూ అనిపించలేదు. అలా అనిపించకపోవటం తప్పు అని ఆయనకు బాజా కొట్టే ‘ఈనాడు’కూ అనిపించలేదు. మా బాబు వాళ్లకేది విదిలిస్తే అదే గొప్ప... అన్న రీతిలో దాని వార్తాకథనాలు సాగిపోయాయి అప్పట్లో!. కానీ వైఎస్ జగన్ విషయంలో అలా కాదు.. వారిని సమాజానికి వెన్నెముకలా (బ్యాక్బోన్) చూశారు. అలా మార్చే పనిలో పడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లకు స్థానమివ్వటమే కాదు... శాశ్వత బీసీ కమిషన్నూ ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనులు అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగం వాటా ఇవ్వాల్సిందే అని తీర్మానించటమే కాక... ప్రతి అడుగులోనూ దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం ఇవన్నీ ఒకెత్తు. గడిచిన 26 నెలల్లో బీసీలకు ఏకంగా రూ.54,878 కోట్ల నగదు అందజేయటం ఇంకో ఎత్తు. వివిధ పథకాల ద్వారా 3.44 కోట్ల మంది బీసీల ఖాతాల్లోకి ఈ నగదు నేరుగా చేరింది!. మరి ఇవన్నీ ‘ఈనాడు’కో... చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకో కనిపించవా? బాబు హయాంలో బీసీలకిచ్చిన అప్పులు మాత్రమే కనిపిస్తాయా? అవి ఇప్పుడివ్వటం లేదంటూ కథనాలేల? బీసీల అప్పుల కోసం మ్యాచింగ్ గ్రాంట్గా ఐదేళ్లలో బాబు ప్రభుత్వమిచ్చింది రూ.1,695 కోట్లట! మరి వై.ఎస్.జగన్ హయాంలో పథకాల రూపేణా వారికి నేరుగా ఇచ్చిన రూ.54,878వేల కోట్ల నగదుతో పోలిస్తే అదెంత? ఈ నిజాలు రాయటానికి ‘ఈనాడు’కు మనసొప్పదెందుకు? బీసీల విషయంలో అసలు ‘ఏది నిజం?’. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలే కాదు... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ బ్యాంకు రుణాలే దిక్కు. ఆ రుణాలేమైనా ఉదారంగా వస్తాయా అంటే... అదీ లేదు. లంచాలు ఇచ్చిన వారికి... పార్టీ– ప్రభుత్వ పెద్దల చేత సిఫార్సులు చేయించుకున్న వారికి మాత్రమే!! ఎందుకంటే వారికే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసేది. అలా విడుదల చేశాకే బ్యాంకులు రుణాలిచ్చేవి. అవి కూడా అరకొరే!!. ఇక బీసీల కోసమంటూ చంద్రబాబు సర్కారు ఒక్క పథకాన్ని అమలు చేస్తే ఒట్టు!. చదవండి: Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు బీసీలను అప్పుల ఊబిలోకి నెట్టడమే ఆయనకిష్టం లేదు. అందుకే నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ వారికి వర్తింపజేశారు. మారుమూలనున్న చిన్న చిన్న బీసీ కులాలకు కూడా గుర్తింపునిస్తూ... ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వారిలో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారు. ‘‘మా కులం ఉత్తరాంధ్రలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితం. అలాంటిది మాకూ ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. దీన్ని మేం కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఇటీవల ఓ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికైన మహిళ తండ్రి భావోద్వేగపూరితమయ్యారు. దీన్నిబట్టే వారికిచ్చిన ఈ గుర్తింపు వారిలో ఎంత ఆత్మ విశ్వాసాన్ని నింపిందో ఊహించొచ్చు. మీరు సగం.. ఏమీ తక్కువ కాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే తక్కువేమీ కాదు. ఖచ్చితంగా సగం!! ఇదీ జగన్ ఆలోచన. ఆచరణలో కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా దాన్ని అమలుచేస్తూనే వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులైనా, నామినేటెడ్ పనులైనా... ఈ సగాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతున్నారు. అంతేకాదు! దీన్లో మహిళలకూ సమాన వాటా ఇవ్వాల్సిందేనంటూ... దాన్నీ అమలు చేస్తున్నారు. డెప్యూటీ సీఎం పదవి మాత్రమే కాదు... కేబినెట్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఇంతటి చిత్తశుద్ధి... పోనీ దీన్లో ఓ 10 శాతమైనా చంద్రబాబులో ఏ కోశానైనా కనిపించిందా? లేనప్పుడు ‘ఈనాడు’ ప్రశ్నించలేదేం? ఇప్పుడు జరుగుతున్నదాన్ని ప్రశంసించడం సరే... ఉన్నది ఉన్నట్టు రాయరెందుకు? 26 నెలల్లో ...రూ.54,878 కోట్ల నగదు బదిలీ ‘మేనిఫెస్టోయే భగవద్గీత.. ఖురాన్... బైబిల్’ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్... అందులో పేర్కొన్న విధంగా గత 26 నెలల పాలనలో 3.44 కోట్ల మంది బీసీల బ్యాంకు ఖాతాలకు రూ.54,878 కోట్ల నగదును నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 1.27 కోట్ల మంది బీసీలకు రూ.21,981 కోట్లు లబ్ధి చేకూర్చారు. మరి బీసీలను అప్పులు పాలు చేయకుండా నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ చేయటం... ఇతర పథకాల ద్వారా వారిని అప్పులపాలు కాకలుండా ఆదుకోవటం ‘ఈనాడు’కు కనిపించవా? వాటిని ప్రస్తావించరెందుకు? ఇవన్నీ పక్కనబెట్టి రుణాల సంగతే చూసినా... బలహీన వర్గాలకు గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో బ్యాంకులు రూ.90,624 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఆ వర్గాలకిచ్చిన రుణాలు రూ.95,526 కోట్లకు చేరాయి. నిజానికి బాబు హయాంలోనూ బీసీలకు బ్యాంకు రుణాలు ఇంతకన్నా ఎక్కువేమీ లేవని సాక్షాత్తూ ఎస్ఎల్బీసీ నివేదికే చెబుతోంది. బీసీలకు ప్రత్యేకం... అధికారంలోనూ పెద్ద పీట... ఆర్థికంగానే కాదు. రాజకీయంగానూ బీసీల అభ్యున్నతి ప్రధానమనేది ముఖ్యమంత్రి జగన్ భావన. అందుకే వారికి రాజ్యాధికారంలోనూ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జానాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. వీటిలోనూ 50 శాతం మహిళలుండాలన్న నియమాన్ని మాత్రం వీడలేదు. నవరత్నాలతో బీసీల్లోని అర్హులందరికీ ఆర్ధిక ప్రయోజనం చేకూర్చటమే కాక బీసీల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రత్యేకగా వైఎస్సార్ చేయూత అందించారు. వైఎస్సార్ ఆసరా పేరిట స్వయం సహాయక బందాల్లోని బీసీ మహిళలకు ఆర్దిక సాయం... వారి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా... ప్రత్యేకంగా మత్స్యకార భరోసా... వైఎస్సార్ చేనేత పథకాలు అమలు చేస్తున్నారు. రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు పథకం అందించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీటిలో ఒక్కటీ అమలు చేయకున్నా... బీసీల ఊసే ఎత్తకున్నా... ‘ఈనాడు’ పెన్ను మాత్రం లేవలేదెప్పుడూ!!. -
అపోహలొద్దు.. అందరికీ దళితబంధు
హుజూరాబాద్ /సాక్షి, కరీంనగర్: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం ‘ఎంపీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్ సునీల్రావు, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్ దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సీఎస్ సోమేశ్కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. -
బీసీలంటే ఓటు బ్యాంకేనా చంద్రబాబూ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో బీసీలకు ఏమీ చేయలేదని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవడం వల్ల, మరోవైపు ఆ తర్వాత వరుసగా కోవిడ్ సోకడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పెట్రో ధరలు ఎందుకు పెంచుతున్నారని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఆ పని చేయకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా బాబు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న ఆందోళనను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణ అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం గౌడ సంఘీయుల రాష్ట్ర స్థాయి నేతల సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు అమలు చేస్తున్న పథకాల గురించి ఎంత దుష్ప్రచారం చేసినా అవి అందుకుంటున్న వారికి.. తమ జీవితాల్లో ఎంతమార్పు తెస్తున్నాయనేది తెలుసునని వివరించారు. కొన్ని దశాబ్దాల కిందట బాబాసాహెబ్ అంబేడ్కర్ అట్టడుగు వర్గాల వారి కోసం అధ్యయనం చేసి వారి రక్షణకు, అభ్యున్నతికి తోడ్పడి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. ఓ 20 సంవత్సరాల తర్వాత బీసీల గురించి అధ్యయనం చేయించి వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా చట్టాలు తెచ్చిన సీఎంగా వైఎస్ జగన్ను గుర్తు చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు సీఎం జగన్ అండగా నిలబడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. దేశంలోనే బీసీలకు ప్రత్యేక రాజ్యాంగం రచించిన మహనీయుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కృష్ణా, గుంటూరు డీసీఎంఎస్ చైర్పర్సన్స్ పడమట స్నిగ్ధ, భాగ్యలక్ష్మి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఏడాదిన్నర క్రితం ఇదే చోట... ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంట్లోనూ సంతోషం.. నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి. నాడు చెప్పా.. నేడు అమలు చేశా మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు.. 2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు.. మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదీ.. పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ – శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు – క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు. – ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. – సౌమ్యుడైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా బీసీనే. – గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు. – నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర.. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్ -
అన్ని పథకాల్లోనూ బీసీలకు పెద్దపీట
సాక్షి, అమరావతి : ఒకపక్క ఆశ్చర్యం.. మరోవైపు ఒకింత గర్వం.. బీసీల సంక్షేమానికి ఏడాదిన్నరలోనే ఇన్ని చేశారా? అని అనిపిస్తున్నా.. ముమ్మటికీ అదే నిజమని లబ్ధిదారుల ఖాతాల్లో సాయాన్ని జమచేసి గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు. గురువారం విజయవాడలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంత్రి’ కార్యక్రమంలో 18 నెలలుగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేసిందో, ఎన్ని పథకాలు తెచ్చిందో వివరించారు. ఇది జగనన్న ప్రభుత్వమని.. మీ అందరి ప్రభుత్వమని.. మీ అందరి కోసం ఆలోచించి చేస్తున్న ఖర్చు ఇదంతా అని పేర్కొన్నారు. అమ్మ ఒడి... రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలిగేలా 43 లక్షల మంది తల్లులకు ఏటా రూ.6,500 కోట్లు ఇస్తున్నాం. వీరిలో బీసీలు 19.66 లక్షల మంది ఉన్నారు. జనవరి 9న రెండోసారి అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా... ఈ పథకంతో దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. ఇందు కోసం ఇప్పటికే రూ.6,750 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీ రైతు కుటుంబాలు 23.69 లక్షలు కాగా ఈ రెండేళ్లలో వారికి రూ.6,140 కోట్లు లబ్ధి చేకూర్చాం. రైతులకు సున్నా వడ్డీ పథకం.. ఇందుకోసం ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.1,207 కోట్లు కాగా లబ్ధిదారులు 14.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో బీసీలు 7.14 లక్షల మంది కాగా వారికి రూ.511 కోట్ల మేర మేలు చేశాం. ఉచిత పంటల బీమా.. ఈ పథకంలో 9.48 లక్షల మంది రైతుల కోసం మొత్తం రూ.1,252 కోట్లు ఖర్చు చేయగా వీరిలో బీసీ రైతులు 4.48 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.588 కోట్ల మేర సాయం అందించాం. ఇళ్ల స్థలాల పట్టాలు.. పేదలందరికీ ఇళ్లు అందించటాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు కూడా కాకముందే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఒక యుద్ధమే చేశాం. ఈనెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వచ్చి వాటిని అందజేస్తారు. ఇళ్ల పట్టాలు తీసుకోనున్న వారిలో 15.92 లక్షల మంది బీసీ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. నేరుగా వారి పేరుతోనే డీపట్టా ఇస్తున్నాం. కోర్టు నుంచి అనుమతి రాగానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. టిడ్కో ఇళ్లు.. మొత్తం 2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నాం. వీరిలో 1.53 లక్షల మంది బీసీలే. వైఎస్సార్ నేతన్న నేస్తం.. ఈ పథకంలో 81 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. 18 నెలల్లో రూ.384 కోట్లు ఖర్చు చేశాం. వారంతా బీసీలే. వైఎస్సార్ మత్స్యకార భరోసా.. ఈ పథకంలో మొత్తం రూ.210 కోట్లు ఖర్చు చేయగా 1.07 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. వీరు కూడా బీసీలే. జగనన్న చేదోడు.. రజకులు, నాయీ బ్రాహ్మణ సోదరులు, దర్జీలకు జగన్నన్న చేదోడు పథకం అందించాం. మొత్తం లబ్ధిదారులు 2.98 లక్షలు కాగా వీరిలో బీసీలు 2.27 లక్షల మంది ఉన్నారు. వీరికి ఈ పథకం ద్వారా రూ.227 కోట్లు అందచేశాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ 9.67 లక్షల మంది లబ్ధిదారులపై రూ.2,340 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీలు 5.24 లక్షల మంది కాగా వారి కోసం రూ.1,255 కోట్లు వెచ్చించాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా... ఈ పథకంలో 2.61 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.165 కోట్లు ఖర్చు చేశాం. లబ్ధిదారుల్లో బీసీలు 1.38 లక్షల మంది కాగా వారి కోసం రూ.87 కోట్లు వ్యయం చేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక.. ప్రతి నెలా ఒకటో తారీఖునే సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 61.94 లక్షలు కాగా 18 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు ఇచ్చాం. వీరిలో బీసీ కుటుంబాలు 30.27 లక్షలు కాగా రూ.12,230 కోట్లు పెన్షన్లు కింద చెల్లించాం. వైఎస్సార్ ఆసరా.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఉన్న రుణాలు రూ.27,163 కోట్లు కాగా అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో ఆ మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినట్లుగానే మొదటి దఫాలో రూ.6,792 కోట్లు ఇచ్చాం. మొత్తం లబ్ధిదారులు 87.74 లక్షలు కాగా వారిలో 42.60 లక్షల మంది బీసీ అక్కచెల్లెమ్మలున్నారు. వారికి మొదటి విడతలో రూ.3,260 కోట్ల సాయం అందించగా నాలుగేళ్లలో మొత్తం రూ.13,040 కోట్లు బీసీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. సున్నా వడ్డీ.. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1,400 కోట్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారులు 90.37 లక్షలు కాగా వారిలో బీసీ అక్క చెల్లెమ్మలు 48.39 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.720 కోట్లు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్సార్ చేయూత.. ఈ పథకంలో అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తాం. 24.56 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తొలి ఏడాది రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఆ డబ్బుతో వారికి నెల నెలా ఆదాయం లభించేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద కంపెనీలు ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, అమూల్తో ఒప్పందాలు చేసుకున్నాం. డెయిరీలు, మేకల, గొర్రెల పెంపకం, రీటెయిల్ షాపుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నాం. వీరిలో బీసీ అక్కచెల్లెమ్మలు 14.81 లక్షల మంది కాగా వారికి రూ.2778 కోట్ల మేర ప్రయోజనం కలుగుతోంది. జగనన్న విద్యా దీవెన.. ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3, 857 కోట్లు ఇవ్వగా 18.57 లక్షల పిల్లలకు మేలు జరుగుతోంది. వీరిలో బీసీ విద్యార్థులు 9.30 లక్షల మంది కాగా వారికి రూ.1,684 కోట్ల మేలు లబ్ధి కలుగుతోంది. జగనన్న వసతి దీవెన.. ఈ పథకం ద్వారా రూ.1221 కోట్లతో 15.57 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చగా వీరిలో బీసీ విద్యార్థులు 7.43 లక్షల మంది ఉన్నారు. వారికి మొత్తం రూ.553 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యా కానుక.. ఈ పథకంతో 42.34 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం. బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.648 కోట్లు ఖర్చు చేస్తుండగా వీరిలో బీసీ విద్యార్థులు 22 లక్షల మంది ఉన్నారు. జగనన్న గోరుముద్ద.. మధ్యాహ్న భోజన పథకంతో 32.52 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుండగా వీరిలో బీసీ విద్యార్థులు 17.23 లక్షల మంది ఉన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ.. ఈ పథకంలో మొత్తం 30.16 లక్షల మంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మేలు జరుగుతోంది. వీరిలో 14.78 లక్షల మంది బీసీలున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర.. ఈ పథకంతో 2.75 లక్షల మందికి రూ.513 కోట్ల మేర ఆర్థిక సహాయం చేయగా వీరిలో బీసీ లబ్ధిదారులు 1.22 లక్షల మంది ఉన్నారు. వారికి ఇప్పటి వరకు రూ.230 కోట్ల సహాయం అందచేశాం. జగనన్న తోడు దాదాపు 9 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తోంది. వీరిలో బీసీలు 4.34 లక్షల మంది ఉన్నారు. -
ఉపాధ్యాయుల బదిలీలతో మీకేం సంబంధం?
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఫలానా విధంగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘంపై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయుల బదిలీలకు, మీ సంఘానికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేసి బదిలీల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బి.చిరంజీవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ దొనడి రమేశ్ల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.నాగేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది నవంబర్ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఉపాధ్యాయుల బదిలీలతో పిటిషనర్కు ఏంపని అని ప్రశ్నించింది. బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని, అభ్యంతరాలుంటే టీచర్లే కోర్టుకొచ్చి పోరాడే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. బదిలీలతో సంబంధం లేని బీసీ సంక్షేమ సంఘం పిల్ దాఖలు చేయడం పరిధి దాటి వ్యవహరించడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బీసీ సంక్షేమ సంఘం పేరుతో ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ న్యాయవాది పిల్ను ఉపసంహరించుకున్నారు. -
బీసీ కార్పొరేషన్ పాలక మండళ్ల ప్రకటన
-
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
సాక్షి, తాడేపల్లి : బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాగా, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. (బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు) ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు 1. రజక: రంగన్న (అనంతపురం) 2. కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం) 3. తొగట : గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ : కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల : భవానీ ప్రియ (తూ.గో) 10. పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో) 11. అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూ.గో) 12. అయ్యారక: రాజేశ్వరం (తూ.గో) 13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు) 15. కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు) 16. కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: హరీష్కుమార్ (కడప) 18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలీ: విజయలక్ష్మి (కడప) 20.నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్బి (కడప) 21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప) 22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా) 26. వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు) 27. కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు) 28. వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు) 30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు) 31. ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు) 31. జంగం: ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం) 36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం) 43. శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం) 44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46.నగరాల: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పి.సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం) 51. శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52 .దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో) 54. శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో) 55. అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు (ప.గో) ఈ కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు చేపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేకూర్చింది. ► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. ► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది. -
ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అలాగే ఈ నెల 18న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. చదవండి: దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ 2.71 కోట్ల మందికి లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. -
బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా 728 మంది బీసీలకు నామినేటెడ్ పదవులు దక్కనున్నాయి. ఈనెల 8న పదవులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించనున్నారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 52 కార్పొరేషన్లు ఏర్పాటు కాగా.. మరో నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. ► 56 కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు అందుకోనున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేయబోతోంది. ► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. ► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది. -
బాధ్యతలు చేపట్టిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
-
బీసీలే ఉత్పత్తిశక్తి కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక్కొక్కరంగంలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయి. సాగునీరు, తాగునీరు విషయంలో ఊరి చెరువులు నింపడం నుంచి, కాళేశ్వరం నుంచి రెండు మహానదుల అనుసంధానం వరకు తెలంగాణ సమాజం బలోపేతం కావటానికి తొలిఘట్టం ముగిసింది. ఇప్పుడు గ్రామీణ తెలంగాణ స్వయం సమృద్ధికి కేసీఆర్ మలిఘట్టం మొదలుపెట్టబోతున్నారు. చితికిపోయిన చేతివృత్తుల జీవితాల్లో తిరిగి వైభవం సంతరించుకునేందుకు, వాళ్లు తయారుచేసిన వస్తువులకు సమాజంలో డిమాండ్ ఉండేవిధంగా చూసి వాళ్లను ముందుకు నడిపించాలన్న మహత్తర సంకల్పంతోనే కేసీఆర్ పథక రచన చేస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీల జీవితాల్లో మార్పుతెచ్చేందుకు ఇప్పటికే కొంత కృషి జరిగింది. మత్స్యకారుల్లో, యాదవుల జీవితాల్లో కొంత మేరకు మార్పువచ్చింది. చేపలపెంపకం గత రెండేళ్లుగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గొర్రెల పెంపకం లాభసాటిగా మారింది. కోళ్ల పెంపకంపై ఇపుడు ప్రత్యేక శ్రద్ధపెడుతున్నారు. బీసీల జీవితాల్లో మార్పురావాలంటే చేతి వృత్తుల్లో సంపూర్ణంగా ఆధునీకరణ జరగాలి. ఈ అత్యాధునిక సమాజపు మార్కెట్ పోకడలకు అనుకూలంగా విభిన్నకోణాల్లో చేతివృత్తుల పనులు సాంకేతికతో బయటకు రావాలి. ఇందుకు చాలా కసరత్తు చేయవలసిఉంది. బీసీవర్గాలకు సంబంధించిన 280 గురుకులాలు ఇప్పటికే లక్ష కుటుంబాలకు ఆసరాగా మారాయి. లక్షమంది బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. బీసీల జీవితాల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తూ చేతివృత్తులనే నమ్ముకున్న చేతులకు బలాన్ని అందించటం కోసమే గ్రామీణ తెలంగాణలోను బలోపేతం చేసే పని కేసీఆర్ చేపట్టబోతున్నారు. బీసీ కులాల చేతివృత్తులన్నీ సంపదలనందించే వృత్తులుగా తీర్చిదిద్దేపని యుద్ధప్రాతిపదికగా ముందుకు సాగవలసిఉంది. బీసీల ఆర్థికమూలాలు బలోపేతం చేసేందుకు దార్శనికతతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాకముందు ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు చేనేత కార్మికుల పాలిట సంపదల క్షేత్రంగా మారింది. సమాజంలో కీలకభాగమైన బీసీల జీవితాల్లో మార్పురావాలంటే ఈ చేతివృత్తులద్వారా గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. మన ఉత్పత్తులను మనమే వాడటం, వాటిలో నాణ్యతను పెంచి నైపుణ్యతను సంతరించుకుంటే అవి మేడిన్ తెలం గాణ ఉత్పత్తులుగా మారగలుగుతాయి. బీసీల కులవృత్తులు ఆధునీకరించటం ద్వారానే ఆ వర్గీయులు ఆర్థికంగా స్థిరపడి శిరసెత్తుకుని నిలుస్తారు. ఈ వర్గాలలో తరతరాలుగా స్కిల్సెట్ ఉంది. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వస్తువులను తయారుచేసే సాంకేతికతను ఈ కులవృత్తులకు జోడించాలి. వీళ్లదగ్గర నుంచి తయారుచేసే వస్తువులు అంతర్జాతీయ ప్రమాణాలను పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అవి మేడిన్ తెలంగాణ బ్రాండెడ్ వస్తువులుగా మార్కెట్లో నిలువగలుగుతాయి. తెలంగాణలోని గ్రామీణ, పట్టణాలలో ఈ వృత్తినైపుణ్యాలను ఆధునీకరించి చేతివృత్తులకు అండగా నిలవాలన్న కేసీఆర్ సంకల్పంతో మలి అభివృద్ధి ఘట్టం మొదలుకానుంది. సంచారజాతులుగా మిగిలిన వాళ్లకు జీవనభృతి, స్థిరజీవితం నెలకొల్పి వారి నైపుణ్యాలకు ఆధునికతను అద్దాలి. గ్రామీణ పేదరికం లేకుండా చూడాలి. మనకున్న చేతివృత్తులు వాళ్లజీవితాలను మార్చి సమస్త సంపదల కేంద్రాలుగా మారాలి. ఈ విషయంలో వృత్తికళల నైపుణ్య తెలంగాణను దేశానికి నమూనాగా అందించాలన్న కేసీఆర్ తలంపు ఎంత తొందరగా పూర్తయితే సమాజంలో సగభాగం బీసీల జీవితాలు అంత త్వరగా స్థిరపడతాయి. సహస్రవృత్తుల సమస్తకళల ఆధునిక వైభవంగా తెలంగాణ విలసిల్లాలి. నైపుణ్యవంతమైన బీసీ చేతివృత్తులను ఉత్పత్తికేంద్రాలుగా మార్చే కొత్తశకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతూ తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టంచేయనున్నారు. వ్యాసకర్త జూలూరు గౌరీశంకర్ కవి, విమర్శకులు మొబైల్ : 94401 69896 -
తెరుచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు
పాల్వంచ రూరల్: కరోనా లాక్డౌన్తో మూతపడిన సంక్షేమ వసతి గృహాలు పదో తరగతి విద్యార్థుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. మార్చిలో వాయిదా పడిన ‘పది’ పరీక్షలు తిరిగి ఈనెల 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మొత్తం 66 హాస్టళ్లను సోమవారం పునః ప్రారంభించారు. రేపటి(గురువారం) నుంచి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతిస్తారు. గతంలో హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం కరోనా లాక్డౌన్తో ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాయడం క్షేమం కాదని, భోజన సౌకర్యం లేకుంటే ఇబ్బంది పడతారని భావించిన ప్రభుత్వం.. హాస్టళ్లను తెరవాలని నిర్ణయించింది. పరీక్షలకు 3,298 మంది హాస్టళ్ల విద్యార్థులు.. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో 39 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 23 బాలుర, 16 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే బాలురు 1,253 మంది కాగా, బాలికలు 1,630 మంది ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు బాలురకు 11 ఉండగా 180 మంది, 5 బాలికల హాస్టళ్లలో 55 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లుబాలికలకు 4, బాలురకు 7 ఉన్నాయి. వీటిలో 93 మంది బాలురు, 87 మంది బాలికలు పదో తరగతి చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 66 హాస్టళ్లకు 3,298 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గదికి నలుగురే.. పరీక్షలు పూర్తయ్యేంతవరకు విద్యార్థులంతా హాస్టళ్లలోనే నివాసం ఉండాలి. అయితే కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదిలో నలు గురు విద్యార్థులు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. హాస్టళ్లకు వచ్చే ముందే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అందరికీ మాస్క్లు అందజేస్తారు. భౌతికదూ రం పాటించేలా వార్డెన్లు అవగాహన కల్పిస్తారు. పరీక్ష రాసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్ ఏర్పాటు చేస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేశ్ తెలిపారు. ప్రతిరోజూ ఆల్పాహారంగా ఇడ్లీ, లేదా కిచిడీ పెడతామన్నారు. ఉదయం, సాయంత్రం స్నాక్స్, కాఫీ, రాగి జావ అందిస్తామని, బుధ, ఆది వారాల్లో చికెన్తో భోజనం, ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి ఆరు రోజులు ఆరటిపండు, శనివారం స్వీట్ అందజేస్తామని వివరించారు. విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు భోజనంతో పాటు బూస్ట్ పాలు, బిస్కెట్లు అందించనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ పీఎంఓ రమణయ్య తెలిపారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచుతున్నట్లు బీసీ సంక్షేమాధికారి సురేందర్ తెలిపారు. -
ఆర్థిక మాంద్యంలోనూ బీసీ సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : ఆర్థికమాంద్యంలోనూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2020–21కు ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నా యని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాద వ్, వి.శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ తెలిపా రు. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సోమవారం మంత్రులు మీడియాతో మాట్లాడా రు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు పెరిగాయని, 70 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతోం దని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సబ్ప్లాన్ కంటే ఎక్కువ మేలు బీసీలకు కలిగేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, కేసీఆర్ను బీసీలు శాశ్వతంగా గుర్తుకు పెట్టుకుంటారని అన్నారు. గతంలో అంకెల కోసం బడ్జెట్ రూపొం దిస్తే, తాము ఆచరణ సాధ్యమైన బడ్జెట్ను ప్రవేశ పెట్టామన్నారు. బడ్జెట్ తీరుతెన్నులపై ప్రతిపక్షా లు అర్ధం లేని విమర్శలు చేస్తున్నాయని తలసాని వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యంలోనూ బీసీలు, అణగారిన వర్గాల కోసం రూ.30వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శా ఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము బీసీ అనుకూల అనుకూల విధానాన్ని కొనసాగిస్తున్నందునే బీజేపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తోందన్నారు.దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బీజేపీ కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ను మరో జ్యోతీరావు ఫూలేగా అభివర్ణించిన శ్రీనివాస్గౌడ్ పని చేసే వ్యక్తిని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలు కక్ష కట్టి మరీ ఓడిస్తాయని హెచ్చరించారు. బీసీలకు సబ్ ప్లాన్ అవసరమనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని భవిష్యత్తులో పరిశీలిస్తారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంబీసీలకు రూ.500 కోట్లు.. అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) చెందిన వారి కోసం రూ.500 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్దమొత్తంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని, అనేక ఇతర పథకాల ద్వారా కూడా బీసీలకు మేలు కలుగుతుందన్నారు. బీసీ ఫెడరేషన్ల ఖాతాలో నిధులు లేవనే ఆరోపణలను ఖండిస్తూ, గీత కార్మికుల సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధుల కేటాయింపు పెరిగిందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో వివిధ వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచేవని, కానీ తమ ప్రభుత్వ విధానం మాత్రం అన్నివేళలా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. -
బీసీలకు వెయ్యి కోట్లు కేటాయించాలి: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు రూ. 50వేల కోట్లు కేటాయించాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలకు వెయ్యి కోట్లు ఏం సరిపోతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ను ప్రశ్నించారు. తాజాగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో బీసీల గణనను కూడా చేర్చాలని కోరారు. చట్ట సభల్లో సాధారణ బీసీ రిజర్వేషన్లను 50శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. తాజా జనాభా లెక్కల సేకరణ పత్రం నమూనా కాలమ్లో బీసీల వివరాలకు సంబంధించిన కాలమ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ 18 డిమాండ్లపై పార్టీలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా, కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు. -
బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా
సాక్షి, తాడేపల్లి: రిజర్వేషన్ల ముసుగులో టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ నేతలు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి అని అన్నారు. ప్రతాప్ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్కు దగ్గరి వ్యక్తి అని.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో అనేక సందర్భాల్లో కలిసి పనిచేశారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీ వర్గాల మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రతాప్రెడ్డి వేసిన పిల్ ఉపసంహరింప చేయాలని సవాలు విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రైవేటు చర్చ పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు నిజస్వరూపం గమనించే టీడీపీకి బీసీలు దూరమయ్యారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్ని విధాల న్యాయం చేశారని తెలిపారు. -
‘బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. సోమవారం శాసన మండలిలో బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకంలో జరిగిన అవినీతిపై శంకర్ నారాయణ మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో ఆదరణ పథకంపై పత్రికల్లో పలు అవినీతి కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆదరణ పథకం పనిముట్ల నాణ్యతపై పలు చోట్ల ఆరోపణలు వ్యక్తమయ్యాయని మంత్రి తెలిపారు. అయితే వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని శంకర్ నారాయణ చెప్పారు. అవినీతి బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు బీసీ సబ్ప్లాన్ కింద రూ. 36,472 కోట్లు కేటాయింపులు మాత్రమే జరిగాయన్నారు. అయితే వాటిల్లో ఖర్చు చేసింది రూ.28,804.75 కోట్లు మాత్రమే అని మంత్రి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తమ ప్రభుత్వం రూ.15,061 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి శంకర్నారాయణ పేర్కొన్నారు. -
గొర్రెలు, బర్రెలు కాదు..
సాక్షి, షాబాద్(చేవెళ్ల): బీసీ కార్పొరేషన్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్లో రుణాలకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్లో 5,47 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు నెలలోపు రుణాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేయడం కాదు, వారి అభ్యున్నతి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చదువుకున్న చదువులకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందూరి రాములు, జిల్లా కార్యదర్శి రాపోల్ నర్సింలు, నాయకులు సూద యాదయ్య, రామకృష్ణ, శ్రీశైలం, చందు, రమేష్, కృష్ణ, రామకోటి, శివ, తదితరులు ఉన్నారు. -
బీసీ విద్యానిధికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి క్రేజ్ పెరుగుతోంది. పథకం కింద పరిమిత సంఖ్యలో ప్రభుత్వం లబ్ధి కలిగిస్తుండగా.. దరఖాస్తుల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంది. 2016 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. తొలి రెండేళ్లలో 300 దర ఖాస్తులు రాకపోగా.. ప్రస్తుతం కోటాకు మించి పదింతలు దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన, వడపోత కత్తిమీద సాములా మారుతోంది. ఎంజేపీ ఓవర్సీస్ విద్యానిధి కింద ప్రతి ఏడాది 300 మందికి అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఈబీసీలకు 5 శాతం కేటాయిస్తుండగా.. మిగతా 95 శాతాన్ని ప్రాధాన్యత క్రమంలో బీసీలోని కేటగిరీల వారీగా అవకాశం ఇస్తున్నారు. ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఇటీవల దరఖాస్తులు స్వీకరణకు ఉపక్రమించగా.. 3,116 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో పోటీ 1:10గా మారింది. అనూహ్యంగా దరఖాస్తులు పెరగడంతో అవాక్కయిన అధికారులు.. వీటి పరిశీలనకు దాదాపు నెలన్నర సమయం తీసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన బీసీ సంక్షేమ శాఖ అక్టోబర్ 31న అర్హుల జాబితాను ప్రకటించింది. కోటా పెంచితే మేలే... ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అన్ని సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట అమలు చేస్తుండగా.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్ విద్యా నిధిగా అమలు చేస్తున్నారు. కాగా బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికైన లబ్ధిదారు విదేశాల్లో పీజీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిబంధనలకు అనుగుణంగా లబ్ధి చేకూరుస్తుండగా.. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మాత్రం అత్తెసరు సంఖ్యలోనే లబ్ధి కలుగుతోంది. దీంతో కోటా పెంచితే మేలు జరుగుతుందని భావిస్తున్న అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, లబ్ధి, ఏటా బీసీ సామాజిక వర్గం నుంచి ఎంతమంది విదేశీ విద్య కోసం వెళ్తున్నారనే అంశాలపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వీటి ఆధారంగా ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సిఫార్సు ఉంటేనే సీటు!
నిర్మల్కు చెందిన ఓ విద్యార్థికి ఇంటర్లో 952 మార్కులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజెడ్సీ కోర్సులో సీటు లభించింది. అయితే నిర్మల్ నుంచి వచ్చి నిజామాబాద్లో చదువుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశంతో బీసీ హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తులు చేసుకున్న ఇతర విద్యార్థినుల కంటే ఈ విద్యార్థికి అధికంగా మార్కులున్నాయి. అయినా బీసీ సంక్షేమశాఖ అధికారులు సీటు ఇవ్వలేదు. ఎందుకివ్వడం లేదని అధికారులను అడిగితే మీది వేరే జిల్లా, సీట్లు ఖాళీ లేవని సాకులు చెబుతూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. సదరు విద్యార్థి కన్నా తక్కువ ఉన్న వేరే విద్యార్థినులకు మాత్రం సీటు లభించడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్ : వెనుకబడిన తరగతుల(బీసీ) పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల సీట్లకు రాజకీయ రంగు పులుముకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల రికమండేషన్ ఉందా..! అయితే నీకు సీటు ఓకే అంటున్నారు జిల్లా బీసీ సంక్షేమాధికారులు. ఏ నిబంధనలూ చూడకుండా ఆ విద్యార్థికి సీటు పక్కా చేసేస్తున్నారు. దీంతో అన్ని విధాలుగా అర్హులైన నిరుపేద విద్యార్థులకు బీసీ హాస్టళ్లలో సీటు అందని ద్రాక్షలా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ హాస్టళ్లలో సీట్ల కోసం రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రికమండేషన్ లేఖలు రాసి పంపడం చర్చనీయంగా మారింది. జిల్లాలో బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లు మొత్తం 13 ఉన్నాయి. ఇందులో 7 బాలికలు, 6 బాలుర హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్లో ప్రభుత్వం నుంచి 100 సీట్లు మాత్రమే మంజూరు ఉంటాయి. కాగా జిల్లా కేంద్రంలో కళాశాలలు అధికంగా ఉండడంతో ఇక్కడి హాస్టళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక సామాన్య పేద విద్యార్థికి మెరిట్ మార్కులున్నా అధికారులను ప్రాధేయపడితే గాని సీటు దొరకదు. ఆ హాస్టల్లో ఒక్క సీటు కోసం 170 దరఖాస్తులు జిల్లా కేంద్రంలో రెండు బాలికలు, రెండు బాలుర హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి. నాందేవ్వాడలోని బీసీ(ఎ) బాలుర హాస్టల్లో ఈ ఏడాది 100 సీట్లకు గాను ఒక సీటు మాత్రమే ఖాళీ ఉంది. ఒక్క సీటు కోసం 170 వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో ప్రజాప్రతినిధులవి ఓ ఇరవై వరకున్నాయి. అయితే అదనంగా 20 సీట్లు బీసీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు చేయించుకుని కొంతమందికి సీట్లు ఇచ్చారు. మిగతా 160 మందికి సీట్లు లభించని పరిస్థితి నెలకొంది. అదే విధంగా మిర్చి కాంపౌండ్లో ఉన్న బీసీ బాలుర హాస్టల్(బి)లో 100 సీట్లు మంజూరు ఉండగా, 23 సీట్లు ఖాళీ ఉన్నాయి. 23 సీట్లకు గాను 74 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలున్నాయి. మొదటి జాబితాలో 23 సీట్లు భర్తీ చేయగా, ఇంకా 50 మందికిపైగా విద్యార్థులకు సీటు దొకరని పరిస్థితి ఉంది. అలాగే దుబ్బలో గల బాలికల (బీ,సీ) హాస్టల్లో 200 సీట్లు మంజూరుంటే 40 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఈ 40 సీట్లకు గాను 220 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ కూడా మంత్రుల, ఎమ్మెల్యేల రికమండేషన్ల లేఖలు వచ్చాయి. అయితే మొదటి జాబితాలోనే 40 ఖాళీ సీట్లను భర్తీ చేశారు. ఇంకా 180 మంది విద్యార్థినులకు సీట్లు కలగానే మారాయి. ఇక సుభాష్నగర్లో గల బాలిక (ఎ) హాస్టల్లో సీట్లు ఖాళీగా లేక ఇక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. మెరిట్ నిబంధనలు తూచ్ జిల్లా కేంద్రంలో విద్యనభ్యసించే వారు మన జిల్లావారితో పాటుగా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన విద్యార్థులున్నాయి. అయితే బీసీ హాస్టళ్లలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి టెన్త్లో, డిగ్రీ చదువుతున్న వారికి ఇంటర్లో, పీజీ చదివే విద్యార్థులకు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ మార్కులు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి సీట్లు ఇవ్వాలి. కానీ బీసీ సంక్షేమాధికారులు ఈ నిబంధనను తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టళ్లలో ఖాళీ ఉన్న ఐదు, పది శాతం సీట్లను కూడా ప్రజాప్రతినిధుల రికమండేషన్కు కేటాయిస్తున్నారు. దీంతో అసలైన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాగా మన జిల్లాకు చెందిన వారికి తప్ప.. మెరిట్ మార్కులు అధికంగా ఉన్న ఇతర జిల్లాల విద్యార్థులకు సీట్లు దక్కడం లేదు. దీంతో వారి చదువు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని బాధిత విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్ వార్డెన్తో విద్యార్థి తల్లిదండ్రులు వాగ్వాదం పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పెంపుకోసం కృషి చేయని నాయకులు జిల్లాలో ఉన్న బీసీ పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో సీట్ల కోసం ప్రతియేటా వందల కొద్దీ దరఖాస్తులు విద్యార్థుల నుంచి వస్తున్నా, అందులో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్లుగా సీట్లను పెంచకపోవడంతో పేద విద్యార్థులందరికీ న్యాయం జరగడం లేదు. అయితే సీటు కావాలని వార్డెన్లకు, బీసీ సంక్షేమాధికారులకు లేఖలు రాస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అదనంగా హాస్టల్ కాని, సీట్లు కాని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘టీడీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ సంక్షేమానికి చెందిన రూ. 1,432 కోట్లను ఇతర శాఖలకు మళ్లించారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని తెలిపారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ద్వారా రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆదరణ పథకంతో పాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. -
‘అది నిజంగా గొప్ప విషయం’
సాక్షి, పశ్చిమగోదావరి : యాభై రోజుల్లోనే అనేక హామీలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. తణుకు కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించటంతో రాజన్న రాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు పేదల కష్టాల పట్ల అవగాహన లేని మనిషని ఆయన విమర్శించారు. మహిళలకు చంద్రబాబు చేసినంత ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, బాబుకి కేవలం ఎన్నికలప్పుడే మహిళలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ‘ సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం.. రాష్ట్రం లోటు బడ్జేట్లో ఉన్నప్పటికి మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయటం గొప్ప విషయం’ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ నుంచి బాబు అనేక జబ్బులను తొలగించారని పేర్కొన్నారు. సభ ముగిసిన ఆనంతరం పలువురు మంత్రులు.. మహిళలకు కుట్టు మిషన్లను, యువకులకు టూల్ కిట్లను పంపిణీ చేశారు. -
బీసీలను గుర్తించింది ఒక్క జగనే!
సాక్షి, అమరావతి : దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ గుర్తించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను గుర్తించి వారికి పెద్దపీట వేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే పార్లమెంట్లో పెట్టిందని తెలిపారు. అందుకు తన బృందంతో కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపి సత్కరించామన్నారు. దేశంలో 36 రాజకీయ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీ చేయని ధైర్యం వైఎస్సార్సీపీ చేసిందన్నారు. టీడీపీ బీసీల పార్టీ అని ప్రగల్భాలు పలకటమే తప్ప, వారికి ఆ పార్టీ చేసిన మేలు ఏమిలేదని ఆయన విమర్శించారు. బీసీలను చంద్రబాబు తన అవసరాలకు మాత్రమే వాడుకున్నారని చెప్పారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ బిల్లుపెట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్రకెక్కిందని ఆయనన్నారు. రాష్ట్ర తాజా బడ్జెట్లో బీసీలకు ఆయన రూ.15 వేల కోట్లపైగా కేటాయించారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని.. ఇప్పటివరకు గరిష్టంగా రూ.5 వేల కోట్లు మించలేదని తెలిపారు. అలాగే, బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు.. కేబినెట్లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. -
బీసీలకు బడ్జెట్లో పెద్దపీట
-
బీసీలకు భరోసా..
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు ప్రస్తుత తొలి బడ్జెట్లోనే బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్లు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగించుకుంది తప్ప వారి అభ్యున్నతి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2019–20 వార్షిక బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకోసం మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా రూ.15,061.64 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీ ఉప ప్రణాళికలో కేటాయించిన నిధులతో బీసీ వర్గాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఈ నిధులతో వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. బీసీ కమిషన్ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్లో స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన బీసీ కులాలకు చెందిన వారికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందించనుంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మంచి రోజులు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 వరకు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని నిర్ణయించినట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. ఇందు వల్ల వారి యంత్రాలను ఆధునికీకరించుకుని, అధిక ఆదాయం ఆర్జించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. దర్జీలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున ఆదాయ మద్దతును ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 29 బీసీ కులాల కార్పొరేషన్లకు రూ.3,964.05 కోట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.3964.05 కోట్లు కేటాయించారు. ఈ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వీరి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం చేయనున్నారు. సబ్సిడీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. చేనేత కుటుంబాలకు చేయూత చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి రూ.24 వేల చొప్పున వైఎస్సార్ పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సాయం చేనేత కార్మికులు తమ పరికరాలను ఆధునికీకరించుకుని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపయోగపడనుంది. చేనేత కార్మికులు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. వధువులకు వైఎస్సార్ పెళ్లి కానుక బీసీ గర్జన, మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి బడ్జెట్లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుకను తీసుకువచ్చారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 75 వేల మంది బీసీ వధువులు ప్రయోజనం పొందనున్నారు. కాగా.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఇతర ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులను గుర్తించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. బీసీ విద్యార్థులకు అన్ని విధాల అండ రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు కేటాయించ లేదు. చదువుకునే వయసు పిల్లలందరూ విద్యా సంస్థల్లోనే ఉండాలనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి పథకం కింద బీసీ వర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఈ పథకం కింద బీసీ వర్గాలకు చెందిన పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ఏటా రూ.15,000 ఇచ్చేందుకు బీసీ ఉప ప్రణాళికలో రూ.1294.73 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లకు రూ.400 కోట్లు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ఆయన్ను కలిసి వారి ఇబ్బందులను, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సొంతంగా ఆటో కలిగి నడుపుకుంటున్న డ్రైవర్లందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తొలి బడ్జెట్లోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అదించేందుకు ఏకంగా రూ.400 కోట్లు కేటాయించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్తో ప్రతి కులానికీ భరోసా మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా వెనుకబడిన తరగతుల్లోని కులాల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్పొరేషన్లు వివిధ బీసీ ఉప–సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను సంస్కరించాక వైఎస్సార్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం తీసుకురావని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఈ వర్గాల ఆర్థిక ఔన్నత్యం కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమం కోసం పేర్కొన్న భాగం. ఈ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించారు. ► 7.82 లక్షల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,218.14 కోట్లు ► ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి అందించనున్న సాయం రూ.24,000 ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు -
‘బీసీ విద్యార్థులను చంద్రబాబు నిండా ముంచారు’
సాక్షి, అమరావతి : బీసీ విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారయణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన 1432 కోట్ల రూపాయల నిధులను మళ్లింపు చేపట్టిన ప్రభుత్వం బీసీ, కాపు, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు తమది బీసీల పార్టీ అని వారిని నిండా ముంచేశారని వ్యాఖ్యానించారు. బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థులు ప్రతిరోజు స్కాలర్షిప్ల కోసం పోన్లు చేస్తున్నారని తెలిపారు. గతేడాది పిల్లలకివాల్సిన నిధులను చంద్రబాబు ఓట్ల ప్రలోభాల కోసం మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీసీలను అనేక రకాలుగా మోసం చేసిన చంద్రబాబు విద్యార్థులను కూడా వదల్లేదని విమర్శించారు. -
‘సగర ఫెడరేషన్కు రూ. 500 కోట్లు కేటాయించాలి’
హైదరాబాద్: సగర ఫెడరేషన్ను ఏర్పాటు చేసి 12 ఏళ్లు గడుస్తున్నా ఫెడరేషన్కు పాలకమండలి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే పాలకమండలిని ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. సగరుల డిమాండ్ల సాధన కు ఈ నెల 7న సగర హక్కుల పోరాట సమితి చైర్మన్ నీరడి భూపేశ్ సాగర్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపడుతున్న భగీరథ దీక్ష పోస్టర్ను శుక్రవారం బర్కత్పురాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణతో కలసి ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న సగరుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిన సగరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగరుల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి ఆర్ధింగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని అన్నారు. -
బీసీల అభ్యున్నతికి రూ. 75,000 కోట్లు : వైఎస్ జగన్
ఇన్నాళ్లూ కేవలం చంద్రబాబు ప్రచారార్భాటానికి మాత్రమే ఉపయోగపడిన బీసీల బతుకులు వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, హామీలతో కొంగొత్తగా చిగురించనున్నాయి. బీసీల్లో ప్రతీ కులం వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యమేనని బీసీ డిక్లరేషన్ స్పష్టీకరిస్తోంది. వివిధ కుల వృత్తులకు జీవం పోసేలా తీసుకోనున్న నిర్ణయాలు వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయా సామాజిక వర్గాల పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. బీసీలంటే.. ప్రస్తుత పాలకులకు అలుసు. వెనుకబడిన తరగతులను.. తరతరాలుగా ఓటుబ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ..కూరలో కరివేపాకు చందంగా వ్యవహరించారు. బీసీలను సామాజికంగా,ఆర్థికంగా అణగతొక్కారు. రాజకీయంగా ఎదగనీయలేదు. ఇలాంటి పరిస్థితిల్లో తన 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో.. దారిపొడవునా బీసీల సమస్యలను నేరుగా చూసిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఫిబ్రవరి17న ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. భారతదేశ కల్చర్’ అని అభివర్ణించిన ఆయన.. బీసీల అభివృద్ధికి ప్రతిఏటా రూ.15వేల కోట్ల చొప్పున..ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి సంచలనం సృష్టించారు. మాట తప్పని జగన్ అధికారంలోకి వస్తే.. తమ ఆశలు నెరవేరుతాయని బీసీలు అభిప్రాయపడుతున్నారు. బీసీల్లో ఆర్థిక విప్లవం జగన్తోనే సాధ్యం అంటున్నారు!! సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. వెనుకబడిన తరగతుల్లో ఆర్థిక విప్లవం తీసుకొస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. ‘బీసీలంటే.. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. భారతదేశ కల్చర్’గా వర్ణిస్తూ.. వెనుకబడిన తరగతుల పట్ల తన గౌరవభావాన్ని చాటుకున్నారు. నిరాదరణకు గురైన వెనుకబడిన తరగతులందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ఆచరణ సాధ్యమైన హామీలను బీసీ డిక్లరేషన్లో వైఎస్ జగన్ ప్రకటించారు. బీసీల వృత్తులకు మరింత ఆర్ధిక ఊతం ఇవ్వడంతోపాటు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్ధుల ఉన్నత చదువులకు కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంతపెద్ద చదువులైనా ఉచితంగా చదివిస్తానని జగన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలపై ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 139 కార్పొరేషన్లతో నూతన శకం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతీ గ్రామంలో అర్హులందరికీ మేలు జరిగేలా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వెనుకబడిన తరగతుల కోసం ఆయా వర్గాల పేరు మీద 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా సంబంధిత వర్గాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. బడ్జెట్లో మూడొంతుల నిధులను వెనుకబడిన తరగతుల కోసమే వ్యయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయా కులాల్లోని 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతీ అక్కాచెల్లెమ్మలకు నాలుగు విడతల్లో ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75వేలు ఇస్తారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ వలంటీర్ ద్వారా నేరుగా ఇంటికి తీసువెళ్లి అక్కా చెల్లెమ్మల చేతుల్లో రూ.75వేలు పెడతారు. అన్నిటిలో సగం.. బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఇస్తామని.. అందుకు చట్టం తీసుకువస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. బలహీన వర్గాలకు ఆర్థికంగా సంపాదించుకునే అవకాశాలను కల్పించాలనే దూరదృష్టితో ఆలోచించిన జగన్.. ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వంలో చిన్న చిన్న పనులతోపాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం పనులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. బీసీలను రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు.. ప్రభుత్వ సంస్థలు, వివిధ సంస్థలు, మార్కెట్ కమిటీలు, గుడులు, ట్రస్ట్ తదితర బోర్డుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే దక్కనున్నాయి. ఇందుకు చట్టబద్దత కూడా కల్పిస్తారు. బీసీ కమిషన్ ద్వారా శాస్త్రీయ అధ్యయనం వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలు సామాజిక మార్పు కోరుతున్నాయి. ఈ సామాజిక మార్పుపై ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం, హేతుబద్ధత లేకుండా.. రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. సగర, కృష్ణ బలిజ, పూసల, గవర, పద్మశాలి, నాగవంశం వంటి వారు బీసీ–ఎగా గుర్తించమని కోరుతున్నారు. మేదర, వాల్మీకి, కురబ, వడ్డెర, మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రజక, గాండ్ల, మేదరులు, అరెకటికల ఎస్సీలుగా గుర్తించమని అడుగుతున్నారు. వీరందరి ఆకాంక్షల కోసం బీసీ కమిషన్కు అప్పగిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. బీసీ కమిషన్ పరిధిలోకి రాని ఎస్సీ, ఎస్టీల అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాత కేంద్రానికి పంపిస్తామన్నారు. బీసీలకు సంబంధించిన ఏ అంశమైనా పరిష్కారానికి బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. క్షురకుల సంక్షేమ గురించి ఆలోచించిన నేత జగనన్న బార్బర్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. క్షురకుల సంక్షేమం గురించి ఆలోచించిన నేత జగనన్న ఒక్కరే. ఏటా ప్రతి బార్బర్ షాపుకు పదివేలు కేటాయింపు, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం, ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీనిచ్చారు. ఆ హామీతో మా బతుకుల్లో ఆశలు చిగురించింది. బార్బర్ షాపులున్న వారికి ఏటా పదివేలు ఇస్తాననడంతో ఎంతో ఆసరా లభించింది. గొర్రెలు, మేకలు మృతి చెందితే రూ.6 వేలు గొర్రెలు, మేకలు మృతి చెందితే రూ.6000 పరిహారం చెల్లిస్తారు. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు ఆ సన్నిధి గొల్లలకే ఇస్తారు. వారికి వంశ పారంపర్య హక్కు కల్పిస్తారు. ప్రధాన ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇచ్చేలా చేస్తారు. బోర్డు సభ్యుల్లో నాయీ బ్రాహ్మణులకు, యాదవులకు చోటు కల్పిస్తారు. ఇంట్లో మగ్గం ఉండి.. చేనేతతోనే జీవితం గడుపుతున్న ప్రతీ అక్కా, చెల్లెమ్మకు పెట్టుబడి రాయితీ కింద నెల నెలా రూ.2000 సాయం అందిస్తారు. యాదవ సోదరులతోపాటు ఎవరు సహకార డెయిరీలకు పాలు పోసినా.. లీటర్కు రూ.4కు సబ్సిడీ ఇస్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు, రైతులతోసహా ఎవరైనా పొరపాటున మరణిస్తే.. వైఎస్సార్ బీమా కింద రూ.ఏడు లక్షలు ఆడపడుచులకు సాయంగా ఇస్తారు. ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా చట్టం తీసుకువస్తారు. చిరు వ్యాపారులకు చేయూత రహదారుల పక్కన చిరువ్యాపారం చేసుకుంటూ.. జీవిస్తున్న వారి బాధలను పాదయాత్రలో స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చిరు వ్యాపారులను గుర్తించి, వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు. వారందరికీ అవసరమైనప్పుడల్లా సున్నా వడ్డీకి రూ. 10,000 అందిస్తారు. షాపున్న ప్రతి నాయీబ్రహ్మణునికి ప్రతి షాపునకు ఏడాది 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. సంచార జాతులు ఒకేచోట ఉంటానంటే.. వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తారు. వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10,000 ఇస్తారు. పొరపాటున మత్స్యకారులకు ఏదైనా జరిగి ప్రాణాలు కోల్పోతే.. రూ.పది లక్షలు పరిహారం ఇస్తారు. బీసీలకు ఇచ్చిన హామీలు మరిచిన చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు విద్య,ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు 33 1/3 శాతానికి పెంచుతామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా దాన్ని పట్టించుకోలేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అదనపు సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆ మాటే మరిచారు. చేనేత కార్మికుల కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధితోపాటు చేనేత కార్మికులకు ప్రతీ ఏడాది బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. వెనుకబడిన కులాలకు యూనివర్శిటీల వైస్ చాన్సలర్లు, పాలక మండళ్లలో 33 1/3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలప్పుడు చెప్పి అమలు చేయలేదు. ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తి ఇవ్వకుండా కేవలం రూ.35 వేలు ఇస్తున్నారు. బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత నాలుగున్నరేళ్లు కల్పించని చంద్రబాబు... ఎన్నికల ముందు చివరి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్దత అంటూ ఉత్తుత్తి బిల్లును ఆమోదించారు. ఆ బిల్లులో ఎంత శాతం నిధులు కేటాయిస్తారో చెప్పలేదన్న విషయాన్ని అసెంబ్లీలో అధికార టీడీపీ సభ్యులే ప్రశ్నించారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అయిపోతోంది. జీవోలతో హడావుడి.. నిధులు సున్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్తో ఉలిక్కిపడిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత బీసీ డిక్లరేషన్లోని అంశాలన్నింటినీ తానే అమలు చేస్తానంటూ ప్రకటించారు. వెనుకబడిన కులాలన్నింటికీ కార్పొరేషన్లంటూ.. ఎన్నికల ముందు జీవోలు ఇచ్చారు. కాని ఆ కార్పొరేషన్లకు పైసా నిధులు విడుదల చేయలేదు. ప్రతిపక్ష నేత ప్రకటించినందున తాను కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశానంటూ ప్రచారం కోసం జీవోలు ఇచ్చారు తప్ప బీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ లేదనే విషయం ఇక్కడే తేటతెల్లమైపోయిందని బీసీ వర్గాలుæ అభిప్రాయపడుతున్నాయి. బీసీ వర్గాల కార్పొరేషన్ పరిస్థితి ఇలా ఉంటే.. గతంలో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్, బ్రాణ్మణ కార్పొరేషన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి రుణాల మంజూరు నిలిచిపోయింది!! రూ.10 వేలు చిరు వ్యాపారులకు వరం వైఎస్సార్ సంక్షేమ రాజ్యం జగన్తోనే సాధ్యం. వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బాగుంది. తోపుడు బళ్లపై పండ్లు అమ్ముకుని జీవనోపాధి పొందే చిరు వ్యాపారులకు ఏటా పెట్టుబడి సాయంగా ప్రోత్సాహం అందించేందుకు రూ.10 వేలు ఇస్తాననడం అభినందనీయం. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. – వానశెట్టి తాతాజీ, తోపుడు బళ్లపై పండ్లు అమ్ముకునే వర్తకుడు, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా బీసీలకు నామినేటెడ్ పదవుల్లో50 శాతం రిజర్వేషన్లు అభినందనీయం బీసీలకు మేలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఉంది. వెనుకబడిన తరగతులకు చెందిన వారికి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం. జగన్కు మద్దతుగా నిలుస్తాం. – పెంటిమేను చిన్ని, బీసీ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం డివిజన్ ఉపాధ్యక్షుడు, గుమ్మళ్ళదొడ్డి , గోకవరం, తూర్పుగోదావరి జిల్లా బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాననడం మంచి పరిణామం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బీసీ కమీషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం మంచి పరిణామం. ఐదేళ్లలో 75వేల కోట్లు బీసీల ఖర్చుచేస్తానని ప్రకటించారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు చిరువ్యాపారులకువడ్డీ లేకుండా పదివేల ఆర్థిక సహాయం చేస్తాననడం ఆనందంగా ఉంది. – గోపసాని పెంచలయ్య, నాగమాంబాపురం, నెల్లూరు -
బీసీల అభివృద్ధికి ఏటా 15 వేల కోట్లు
సాక్షి, కర్నూలు(అర్బన్): ‘‘రేపు మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.15 వేల కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెబుతున్నా’’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీపై బీసీ వర్గాలు సర్వత్రా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అష్టకష్టాలు పడి మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరిగి, కోరిన ధ్రువీకరణ పత్రాలతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ కులాలకు చెందిన వారికి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు 11 బీసీ ఫెడరేషన్లకు సంబంధించి మొత్తం 13,843 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4,942 మందికి మాత్రమే ఉన్నతాధికారులు రుణాలను మంజూరు చేశారు. వీరిలో ఇంకా 20 నుంచి 30 శాతం మందికి ఆయా బ్యాంకులు రుణాలు అందించని పరిస్థితి నెలకొనింది. పాలక వర్గాలు ఉన్నా, ఫలితం శూన్యం ... బీసీ జాబితాలోని రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సగర/ఉప్పర, క్రిష్ణబలిజ/పూసల, వాల్మీకి/బోయ, బట్రాజు, కుమ్మర, విశ్వ బ్రాహ్మణ, మేదర, గీత కార్మికులకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి పలు కులాలకు పాలకవర్గాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు సంబంధించిన కులాలకు చెందిన ప్రజలు సొసైటీలుగా ఏర్పడి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకునేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా, నేటికి ఫలితం దక్కని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 4,492 మందికి మాత్రమే రుణాలు ... బీసీ ఫెడరేషన్ల ద్వారా 10 బీసీ కులాలకు చెందిన సొసైటీలకు మూడు సంవత్సరాలుగా అరకొరగానే రుణాలు అందాయి. 2016–17లో 3,887 మందికి రూ.17.05 కోట్లు సబ్సిడీగా అందించాల్సి ఉండగా.. 860 మందికి రూ.4.05 కోట్లు అందించారు. 2017–18లో 3,233 మందికి రూ.32,33 కోట్లు సబ్సిడీగా అందించాల్సి ఉండగా..1,632 మందికి రూ.9.71 కోట్లు సబ్సిడీ విడుదలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 6,723 మందికి రూ.67.23 కోట్లను సబ్సిడీగా అందించాల్సి ఉండగా..ఇప్పటి వరకు 2,450 మందికి రూ.15.03 కోట్లు సబ్సిడీని మంజూరు చేశారు. వైఎస్ జగన్తోనే బీసీల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో బీసీలకు ఒరిగింది శూన్యం. సబ్ప్లాన్ పేరుతో బీసీలను మోసం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి తేనే బీసీల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది కూడా సగం మంది బీసీలకు కూడా రుణాలు అందలేదు. అనేక కష్టాలు పడి కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగినా, అర్హులైన బీసీలకు రుణాలు అందించలేని దుస్థితి ఏర్పడింది. –శ్రీరంగడు, పత్తికొండ సబ్సిడీ విడుదలలో జాప్యం తగదు బీసీ వర్గాలకు చెందిన ప్రజలు అనేక కష్టాలకు ఓర్చి మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టు తిరగడంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టు తిరిగి ఆన్లైన్లో సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయించారు. కోరిన ధ్రువీకరణ పత్రాలను అందించి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా వందల సొసైటీలకు నేటికి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకపోవడం దారుణం. జిల్లా కలెక్టర్ మంజూరు చేసి ఆప్లోడ్ చేసిన వాటికి కూడా సబ్సిడి విడుదల కాకపోవడం దురదృష్టకరం. –నాగరాజు యాదవ్, కర్నూలు -
వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు : ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): బీసీల సంక్షేమం కోసం మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపిస్తామని, బీసీల కోసం ఎంతకైనా తెగించి పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనపై రాజ్యసభలో ఒత్తిడి తేవాలని కృష్ణయ్య తన బృందంతో కలిసి శనివారం జగన్ను ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాజ్యసభలో ఒత్తిడి పెంచాలని, అలాగే తమ 15 డిమాండ్లను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని జగన్ను కోరామని తెలిపారు. బీసీ యాక్ట్ తీసుకురావాలి: ‘చట్టసభల్లో 50 శాతం, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలి. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రాష్ట్రంలో 25 శాతం నుంచి 50కి, కేంద్రంలో 27 నుంచి 50 శాతం పెంచాలి. బీసీలకు రాజ్యంగబద్ధ హక్కులు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ తీసుకురావాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రేందంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి’ అని కోరుతున్నట్లు కృష్ణయ్య చెప్పారు. బీసీల సంక్షేమానికి జగన్ స్పష్టమైన హామీనిచ్చారు: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో జనాభా ప్రకారం కోటా కల్పించాలని, రాష్ట్రానికి సంబంధించి డిమాండ్లను బీసీల ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని జగన్ను కోరామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ సీపీ మాత్రమే ప్రైవేట్ బిల్లు పెట్టిందని, అందుకు వైఎస్ జగన్ను అభినందించామని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని మోదీ బీసీలకు ఏమి చేయలేకపోయారన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరామని, అందుకు వైఎస్ జగన్ బాగా స్పందించారని కృష్ణయ్య వెల్లడించారు. బిల్లు పెట్టడమే కాదు... ఆమోదం పొందే వరకు ఒత్తిడి తేస్తామని, చివరి 3 రోజుల్లో కూడా రాజ్యసభలో లేవనెత్తుతామని జగన్ హామీ ఇచ్చారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దారిలో బీసీల పక్షాన నిలబడాలని కోరగా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. బీసీల కోసం తెగించి పోరాడుతామని, మాటలు కాదు.. ఆచరణలో చేసి చూపిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ గర్జన గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చట్టసభల్లో రిజర్వేషన్లు ఎవరు పెడతామన్న వారి సభలకు పోవటానికి తాము సిద్ధమని కృష్ణయ్య సమాధానమిచ్చారు. -
తిరుపతిలో బీసీ సన్నాహక సదస్సు
సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలోని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం బీసీ గర్జనపై రాయలసీమ రీజియన్ సన్నాహక సదస్సు జరిగింది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించి వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సంజీవయ్య, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కుప్పం ఇంచార్జి చంద్రమౌళి, రాయలసీమ, నెల్లూరు జిల్లా కో ఆర్డినేటన్లు తదితరులు పాల్గొన్నారు. -
నవ్విపోదురు... నాకేటి సిగ్గు!
రజకులు, మత్స్యకారులు, ఇతర వర్గాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చుతాం. గాండ్ల, నగర, పూసల, కురచి, బోయ, పద్మశాలి తదితర కులాలను బీసీ డీ నుంచి బీసీ ఏకు మారుస్తాం.. అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నారావారు ఆనక రిక్తహస్తం చూపారు. మేనిఫెస్టోలో చేర్చిన విధంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వాలని అడిగితే.. ‘ఇయ్యమయ్యా... తొమ్మిదేళ్లు పాలించా.. ఎక్కువ మాట్లాడితే తోక కట్ చేస్తా’ అంటూ నాయీ బ్రాహ్మణులను బెదిరించారు. హామీని నిలబెట్టుకోమని అడిగిన మత్స్యకారుల తాట తీస్తానన్న చంద్రన్న.. ‘జయహో బీసీ’ అంటూ రాజమండ్రిలో చేపట్టిన ‘టీడీపీ బహిరంగ సభ’లో మాత్రం బీసీలపై వల్లమాలిన ప్రేమ వలకబోశారు. ఆత్మస్తుతికే ప్రాధాన్యం ఇస్తూ కాస్తైనా మొహమాటం లేకుండా పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను భలేగా కాపీ కొట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెదిరింపులకు దిగితే కుదరదని గ్రహించారో ఏమో.. తాయిలాలు ఎరవేస్తూ చాలా నైస్గా బీసీలను మరోసారి మోసం చేసే కార్యక్రమానికి తెరలేపారు. నాలుగున్నరేళ్లుగా ఏం చేశారో మరి! నోరు తెరిస్తే తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉంది అంటూ గతాన్ని వల్లెవేసే చంద్రబాబు.. గత నాలుగున్నరేళ్లుగా బీసీల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా ప్రత్యేక హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ వస్తే అదే మహాభాగ్యం అని ఓసారి.. లేదు లేదు ప్రత్యేక హోదా కావాల్సిందే.. ఇన్నేళ్లు బీజేపీతో కుదరలేదు గానీ ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టి హోదా సాధిస్తాం అని మరోసారి స్వప్రయోజనాల గురించి ఆలోచించుకోవడానికే ఆయనకు సమయం చాలట్లేదు. ఇంకా బీసీ గురించి ఆలోచించాలని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయనలో ఆందోళన పెరిగిపోతుందో ఏమో.. అందుకే తాను పుట్టిందే బీసీల కోసం అన్నట్లు తెగ వరాలు కురిపిస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగా రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ఢిల్లీకి వెళ్లడం వంటి పనులతో తీరిక లేకుండా ఉండే బాబుకు.. వైఎస్ జగన్ రూపంలో ఎక్కువగా శ్రమించాల్సిన అవసరమే లేకుండా పోయింది. వైఎస్సార్ బాటలో.. ప్రజాసంకల్పయాత్ర చేపట్టి సంవత్సరం నాలుగు నెలల పాటు జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్.. ఏడాది క్రితమే బీసీల జీవన స్థితిగతులు, వారి జీవన ప్రమాణాల గురించి అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను దగ్గరగా చూసిన వైఎస్సార్ సీపీ అధినేత.. ఏం చేస్తే బడుగు బలహీన వర్గాల బాధలు తీరతాయనే అంశంపై ఓ అవగాహనకు వచ్చారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. బీసీలకు ఒనగూర్చిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాల గురించి, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించేందుకు నవరత్నాలు ప్రకటించారు. త్వరలోనే బీసీ గర్జన సభ పెట్టి తమ పార్టీ విధానాలను చెప్పేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అప్పుడే మేల్కొన్న చంద్రబాబు నిస్సిగ్గుగా వైఎస్సార్ సీపీ హామీలను కాపీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. హడావుడిగా జయహో బీసీ అంటూ ఓ సభను పెట్టేసి అచ్చంగా వైఎస్ జగన్ హామీలను తమ పార్టీవిగా చెప్పుకొంటూ భజన కార్యక్రమం కొనసాగించారు. బోల్తా కొట్టించడం వెన్నతో పెట్టిన విద్య రాజమండ్రి సభలో.. ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్లు పెట్టండని బీసీలు తనను అడిగారని చెప్పారని చెప్పిన చంద్రబాబు... వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉండి కూడా ఈ నాలుగన్నరేళ్లుగా బీసీల కోసం చేసేందేమిటని అడిగితే మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉండదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా?.. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారంటూ ఇష్టం వచ్చినట్లుగా అన్ని వర్గాల ప్రజలపై నోరు పారేసుకున్న చంద్రబాబు... ఎన్నికలు సమీపిస్తుంటే మాత్రం మరోసారి ముసుగు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అధికారం చేపట్టడానికి సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనది.. నిన్నటి దాకా బూతులు తిట్టిన పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న ఘనత ఆయనది.. అందుకే అధికారంలో ఉండగా గుర్తురాని సంక్షేమ పథకాలు దిగిపోతున్న సమయంలో ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం పట్ల ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిమ్మిని బమ్మి చేసైనా సరే ఎదుటి వారిని బోల్తా కొట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కదా మరి. -
నేడు వైఎస్ఆర్సీపీ ధర్నాలు
-
2019 ఎన్నికల్లో సత్తా చాటుదాం
కడప రూరల్: జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ఆయన మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, నాయకులు బంగారు నాగయ్య యాదవ్, చేలో రవి తదితరులు పాల్గొన్నారు. సమావేశం రసాభాసా.. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు సమక్షంలోనే ఆ సంఘానికి చెందిన నాయకులు గొడవపడ్డారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణయాదవ్ అక్కడికి వచ్చి ‘నాకు తెలియకుండా ఇక్కడ సమావేశం ఎలా నిర్వహిస్తారని.?’ప్రశ్నించడంతోనే గొడవ ప్రారంభమైంది. తరువాత ఆయన వేదిక పైకి వచ్చాక ఎక్కువ సేపు ప్రసంగిస్తుండడంతో ఆ సంఘానికి చెందిన కొంతమంది నాయకులు ఇక చాలించమని సైగలు చేశారు. దీంతో బాలకృష్ణయాదవ్ అనుచరులు ఒక్కసారిగా ముందుకు తోసుకువచ్చారు.బాలకృష్ణ యాదవ్ ప్రసంగానికే అడ్డుతగులుతారా అని గొడవపడ్డారు.దీంతో ఆ సంఘం నేతల మధ్య కాసేపు ఘర్షణ, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంతమంది అక్కడ ఉన్న కుర్చీలను విసిరేశారు. ఈ పరిణామాలపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు విస్తుపోయారు. చివరికి జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యల కోసం పారాడాల్సిన మనమే ఇలా గొడవపడడం ఏమాత్రం బాగలేదని అసహనం వ్యక్తం చేశారు. -
బీసీలకు ప్రాధాన్యమివ్వాలి
మునుగోడు నల్గోండ : చట్ట సభల్లో బీసీలకు ప్రాధాన్యమివ్వాలనే డిమాండ్తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్ట్ 7నుంచి రాష్ట్రంలో బీసీల చైతన్య బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానికంగా బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థానాల్లో తగిన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పాలమూర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలవుతుందని తెలిపారు. 36 రోజుల పాటు కొనసాగే యాత్ర 80 నియోజకవర్గాలల్లో పర్యటించి బీసీలని చైతన్యం చేయడంతో పాటు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కేంత వరకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తామన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైతున్న బీసీలకు తగినా ప్రాధాన్యత దక్కేవరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాని కొనసాగిస్తామన్నారు. బస్సు యాత్రకు బీసీలు పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గండిచెరువు వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లిఖార్జున్ యాదవ్, గుంటోజు వెంకటాచారి,మిర్యాల వెంకన్న, మందుల సైదులు, ఈదులకంటి కైలాస్గౌడ్, ఎస్కె షబ్బీర్, నవీన్, ఎల్లయ్య, వెంకన్న, లింగస్వామి, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మగౌరవం దెబ్బతీశారా?
-
‘బాబు కపట ప్రేమ మరోసారి బయటపడింది’
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపై కపట ప్రేమ మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో బీసీలకు అత్యున్నత పదవులు రాకుండా అడ్డుకున్న తీరు దారుణమని తెలిపారు. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై ప్రేమ అంటూనే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడంలో అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చెప్పేదొకటి, తర్వాత చేస్తోంది మరొకటన్నారు. బీసీ న్యాయమార్తుల విషయంలో చంద్రబాబు పంపిన నివేదికలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. -
కుల వృత్తులకు నేరుగా రుణం
సాక్షి, హైదరాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచే నేరుగా లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది. 80 శాతం సబ్సిడీపై ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు తగినన్ని నిధులు కేటాయించాలని భావిస్తోంది. వచ్చే బడ్జెట్లో ఈ రెండు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తోంది. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసినప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) రూ.వెయ్యి కోట్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. కానీ బీసీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికల పేరుతో జాప్యం జరగడంతో ఆ నిధులు ఖర్చు కాలేదు. ఎంబీసీ కులాలపై కొరవడిన స్పష్టత మరోవైపు ఎంబీసీ కులాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏయే కులాలను ఎంబీసీల జాబితాలో చేర్చనున్నారో వెల్లడించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా, వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని సీఎం సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈసారి బడ్జెట్లో ఎంబీసీల జాబితా, వారి సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసి చూపింది. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తికి వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని ఇప్పటికే నిర్ణయించింది. సంబంధిత కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు కూడా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ప్రధానంగా స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రాయితీతో కూడిన రుణాలను ఇవ్వాలని యోచిస్తోంది. రూ.లక్ష లోపు రుణాలను 80 శాతం రాయితీతో అందించేందుకు ప్రాధాన్యమివ్వనుంది. వీలైతే బడ్జెట్కు ముందుగానే ఈ పథకాలను పట్టాలెక్కించాలని సీఎం భావిస్తున్నారు. సంచార జాతు లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వకర్మలు.. ఇలా ఆయా వర్గాల ప్రతినిధులతో విడివిడిగా ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమావేశమవుతారు. ఆయా వర్గాల కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు లబ్ధిదారులకు రుణాల చెక్కులను కూడా అక్కడే మంజూరు చేయాలని భావిస్తున్నారు. సీఎం వద్ద నివేదికలు బీసీల సంక్షేమంపై ఎమ్మెల్సీ గంగాధర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ ఒక నివేదికను సిద్ధం చేయగా, బీసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్చలు జరగ్గా, అదే వరుసలో బీసీ ప్రజాప్రతినిధులు తమ సిఫారసులతో నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలన్నీ ఇటీవల సీఎం కేసీఆర్కు చేరాయి. ఈ నేపథ్యంలో బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలన్న డిమాండ్ వ్యక్తమైనప్పటికీ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులే లేనందున ఉప ప్రణాళికకు అవకాశం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు తేల్చేశాయి. ఎస్సీ, ఎస్టీలకు మాదిరే ప్రత్యేక అభివృద్ధి నిధిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. బడ్జెట్లో బీసీలకు భారీ వాటా కేటాయించే దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్కు చులకన!
సాక్షి, హైదరాబాద్: బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 2017–18 రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రూ. 5వేల 70 కోట్లను కేటా యించామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్ నేతలకు చులకన భావన ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్ విలేకరులతో మాట్లాడారు. బీసీలను గతంలో కేవలం ఓటు బ్యాంకులుగానే పార్టీలు పరిగణించాయని, ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్ బీసీల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించింది ప్రజాగర్జన సభ కాదని, సీఎం అభ్యర్థుల అధికార యావ సభ అని పేర్కొన్నారు. -
'ఆ అర్హత బీజేపీకి లేదు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీల సంక్షేమం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను కేబినెట్ నుంచి తొలగించిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మరని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
3న బీసీ సంక్షేమంపై సీఎం సమీక్ష!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సంక్షేమం, అభివృద్ధిపై డిసెంబర్ 3న సీఎం కె.చంద్రశేఖర్రావు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో బీసీలకు ప్రత్యేక ఆర్థిక, అభివృద్ధి పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రణాళికలపై అధికారులతో మంగళవారం మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు గౌడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా బాగా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన పథకాలపై చర్చించారు. గొర్ల పంపిణీ ద్వారా గొల్ల, కురుమలు, మిషన్ కాకతీయ వల్ల నిండిన చెరువుల్లో చేపలను పెంచడం ద్వారా మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీల్లో ఉపాధి లేని వారికి, కుల వృత్తులనే నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాల అభివృద్ధికి కొన్ని పథకాలను సిద్ధం చేశారు. ఇవన్నీ 3న జరిగే సమావేశంలో సీఎంకు సమర్పించి తుది రూపు తీసుకురానున్నట్లు వెల్లడించారు. కుల వృత్తులు చేయడం ఇష్టంలేని వారికి, ఆయా వర్గాల్లో చదువుకున్న వారు సొంత కాళ్లపై నిలబడటానికి అవసరమైన ఆర్థిక సాయం ఏ విధంగా అందించాలి అనే అంశంపై కూడా చర్చించారు. -
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
► బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న ► బొప్పారంలో బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కేతేపల్లి (నకిరేకల్): పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కేతేపల్లి మండల పరిధిలోని బొప్పారం శివారులో మూసీ ప్రాజెక్టు వద్ద రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. పేదవారికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారన్నారు. ఆయా పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో రూ.380 కోట్లు కేటాయించిందని తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకున్న గత పాలకులు వారికి విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో విస్మరించారని అన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉచితంగా రూ.20 లక్షల అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట : మంత్రి జగదీశ్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యుత్శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఒకే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పీజీ వరకు మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆంధ్ర పాలకుల హయాంలో జిల్లాలో 26 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అదనంగా 44 పాఠశాలలు మంజూరు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నకిరేకల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.2000కోట్లు మంజూరు చేసిందన్నారు. విద్యార్థులు కేవలం సర్టిఫికెట్ల కోసమే చదవడం కాకుండా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు సాధించి తమను కన్నవారి కలలను సాకారం చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు దిగువన ఉన్న 90 ఎకరాల స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కాసనగోడు, గుడివాడ గ్రామాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాల భవన నిర్మాణ నమూనాను మంత్రులు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభాదేవి, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, కేతేపల్లి ఎంపీపీ గుత్తా మంజుల, వివిధ గ్రామాల సర్పంచ్లు కె.లింగయ్య, కె.వెంకటరమణ, బి.సైదమ్మ, కె.లక్ష్మి, ఎంపీటీసీ కె.మోహన్, టీఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, పూజర్ల శంభయ్య, కె.శ్రీనివాస్యాదవ్, బి.సుందర్, గుత్తా మాధవరెడ్డి, బి.దయాకర్రెడ్డి, కె.మల్లేష్యాదవ్, కత్తుల వీరయ్య పి.ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్ల సమస్యల పరిష్కారానికి కృషి
► డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా ► రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ముదిరాజ్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముదిరాజ్లు నిర్వహించిన చలో హైదరాబాద్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి చేర్చడానికి తన వంతుగా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజ్లు ఎంతో కృషి చేశారని, రాష్ట్రంలోని 86 ముదిరాజ్లు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు పార్క్లో ఉన్న ముదిరాజ్ల ఆరాధ్యదైవం భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, ముదిరాజ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్, జిల్లా నాయకులు శ్రీనివాస్, శంకర్, మల్లేష్, రమేష్, శివ్వయ్య, తదితరులు పాల్గొన్నారు. -
6న ఆర్.కృష్ణయ్య రాక
కర్నూలు(అర్బన్): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 6వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని వెంగన్నబావి వద్ద ఉదయం 11 గంటలకు కార్తీక మాస వసభోజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించామన్నారు. కార్తీక మాసంలో వివిధ కులాలకు చెందిన వనభోజనాలు జరగడం సాంప్రదాయమని, బీసీల్లోని అన్ని కులాలకు చెందిన నేతలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే తొలి సారి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. -
ఉపకార వేతనాల మంజూరుకు చర్యలు
– బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్సాహెబ్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను త్వరితగతిన మంజూరు చేయిస్తామని జిల్లా బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్సాహెబ్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2016–17 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 51,710 మంది బీసీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ కింద దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధిత వెరిఫికేషన్ అధికారులు పరిశీలించి ఉపకార వేతనాల మంజూరుకు 19,711 దరఖాస్తులను మాత్రమే పంపారన్నారు. వీటిలో ఇప్పటి వరకు 10,478 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే 11,194 మంది ఈబీసీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ కింద దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 5,608 మందికి మంజూరు చేశామన్నారు. కళాశాలల్లో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ దరఖాస్తులను సంబంధిత ప్రిన్సిపాళ్లు వెంటనే తమ కార్యాలయానికి పంపాలని హుసేన్సాహెబ్ కోరారు. -
బీసీ సంక్షేమాధికారిగా హుసేన్సాహెబ్
కర్నూలు(అర్బన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిగా గాలేరు నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డీ హుసేన్సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీబీసీడబ్ల్యూఓగా విధులు నిర్వహించిన బీ సంజీవరాజు ఈ నెల 7 30వ తేదీ వరకు మెడికల్ లీవ్లో వెళ్లడంతో హుసేన్సాహెబ్కు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం ఆయనకు సంజీవరాజు బాధ్యతలను అప్పగించారు. బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ శ్రీనివాసులు, పెద్దపాడు వసతి గృహ సంక్షేమాధికారి శ్రీనివాసులు.. హుసేన్సాహెబ్కు స్వాగతం పలికారు. -
మంత్రికి వినతుల వెల్లువ
అనంతపురం న్యూటౌన్ : జిల్లా పర్యటనలో ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంఘాల నేతలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అన్ని జిల్లాలలో బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ కార్పోరేషన్కు రూ.20 కోట్లు కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలని, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బీసీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండు చేశారు. -
త్వరలో తెలంగాణ బీసీ కమిషన్
• వెంటనే ప్రక్రియ ప్రారంభానికి సీఎం ఆదేశం • బాలబాలికలకు చెరి సగం స్కూళ్ల కేటాయింపు • బీసీ సంక్షేమంపై సమీక్షలో కేసీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కేబినెట్ సమావేశమై బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని...అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తామన్నారు. బీసీ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలోనే విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి తీసుకునే చర్యలపై వారితో చర్చించనున్నట్లు వెల్లడించారు. నిరుపేద బీసీల సామాజిక ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీల సంక్షేమం పేరిట గతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు హాస్యాస్పదంగా, నామమాత్రంగా ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాలు వాస్తవికంగా ఉండాలని... దీనిపై సమగ్ర అధ్యయనం చేసి అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రి జోగు రామన్న, సీఎం ముఖ్య కార్యదర్శి సి.నర్సింగ్రావు, ప్రత్యేక కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఈ పాఠశాలలు ప్రారంభం కావాలని, వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలన్నారు. వచ్చే జూన్ నాటికే ఈ పాఠశాలలకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, విద్యార్థుల చేరిక, వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిలబస్, ఇతర విద్యా సంబంధ అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందించాలన్నారు. ఆట స్థలంతోపాటు మంచి ప్రాంగణాన్ని బీసీ గురుకులాలకు సిద్ధం చేయాలని చెప్పారు. సమాజంలో సగ భాగం ఉన్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్యను అందించటం ద్వారా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీల పిల్లల చదువుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్న విధంగానే బీసీ గురుకుల పాఠశాలలు నడవాలని, అందుకు నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిం చారు. పాఠశాలలకు ఇప్పట్నుంచే స్థలాన్వేషణ జరపాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల పరిస్థితి, భవనాలు, స్థలాలు తదితర అంశాలపైనా అధ్యయనం చేయాలని... వాటిని గురుకులాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. అకాడమీల తరహాలో స్టడీ సర్కిళ్లు రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్లు నామమాత్రంగానే ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు అన్ని స్టడీ సర్కిళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు కచ్చితంగా ఉద్యోగం సంపాదించేలా అకాడమీల తరహాలో వాటిని నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్లలో పోలీస్ కమిషనరేట్లు నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న ఈ రెండు నగరాల్లో జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. -
బీసీ సంక్షేమంలో కేటాయింపులు పూర్తి
కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల తాత్కాలిక పంపకం సిద్ధమైన ప్రాథమిక ప్రతిపాదనలు ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగు ల కేటాయింపు విషయంలో జిల్లాలో మిగతా శాఖల క న్నా బీసీ సంక్షేమశాఖ అధికారులు ఒకడుగు ముందున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలు కలుపుకుని నాలుగు జిల్లాలు గా ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ముసాయిదా వి డుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖలో ఉన్న అధికారులు, ఉద్యోగులను వారి స్థానికత, సీనియారి టీ ఆధారంగా ప్రాథమికంగా తాత్కాలిక కేటాయింపు లు పూర్తి చేశారు. శాఖలో ఉన్న డీడీ, డీబీసీడబ్ల్యూవో, ఏబీసీడబ్ల్యూవోల్లో ఎవరెవరు ఏ జిల్లాకు వెళ్తారనే విషయంలో స్పష్టతకు వచ్చేశారు. ఇదే విషయమై ఇటీవల హైదరాబాద్లోని శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నివేదికకు జిల్లా అధికారులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయి అధికారులను తా త్కాలికంగా సీనియార్టీని బట్టి కేటాయించినా మిగతా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను వారి స్థానిక మండలం ఆధారంగా జిల్లాలకు కేటాయించారు. ఆ తర్వాత శాశ్వత కేటాయింపుల కోసం ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ ఫాం తీసుకున్నారు. కొత్త జిల్లాలకు సీనియర్ అధికారులు కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కొత్త అధికారులను ఇ వ్వడం కానీ, పాత ఉద్యోగులకు పదోన్నతులు కల్పిం చడం కానీ ఉండవని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చే సింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న అధికారుల్లోనే సీనియారిటీ ప్రాతిపదికన ఏ జిల్లాకు ఎవరు వెళ్తారనే విషయంలో స్పష్టత వచ్చేసింది. ప్రాథమిక సమాచా రం ప్రకారం వరంగల్తో పాటు హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటుకానుం డగా ప్రస్తుతం డీబీసీగా ఉన్న హృషికేష్రెడ్డి వరంగల్లో కొనసాగనున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సీని యార్టీ ప్రకారం ములుగు ఏబీసీడబ్ల్యూఓ శైలజకు హన్మకొండ జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు, వరంగల్ ఏబీసీడబ్ల్యూఓకు భూపాలపల్లి ఇన్చార్జ్ బాధ్యతలు, డిప్యూటేషన్పై హైదరాబాద్లో పనిచేస్తున్న ఝాన్సీకి మహబూబాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించే అవకా శం ఉంది. అయితే, గత డిసెంబర్ 15వ తేదీ నుంచి సెలవులో ఉన్న డీడీ రమాదేవి విధుల్లో చేరేందుకు రిపోర్ట్ చేశారు. ఆమెను ఉన్నతాధికారులు జిల్లాకు కేటాయిస్తే రమాదేవి వరంగల్ బీసీ సంక్షేమ అధికారిగా ఉంటారు. మిగతా వారు వరుసగా మారుతారు. సీనియార్టీ జాబితాలో చివరలో ఉన్న ఝాన్సీ ఏబీసీడబ్ల్యూఓగా కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ ప్రాథమిక కేటాయింపులు మాత్రమేనని.. విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా అధికారులు వారి స్వస్థలాల ఆధారంగా జిల్లాలో ఉంటారా, వేరే జిల్లాలకు బదిలీ అవుతారా అన్నది తేలనుంది. ప్రస్తుతం మాత్రం ‘ఆర్డర్ టూ సర్వ్’ పద్ధతిలో కొనసాగుతారు. తేలాల్సిన వార్డెన్ల లెక్క.. బీసీ సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో మొత్తం 49 ప్రీ మె ట్రిక్, 24 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వివిద కారణాలతో ఇందులోని ఆరు ప్రీ మెట్రిక్, మూడు పోస్టు మెట్రిక్ హాసళ్లను రెండు సంవత్సరాల్లో మూసివేశా రు. అక్కడి వార్డెన్లను ఇతర చోట్లకు కేటాయించా రు. అయితే, జిల్లాల విభజనలో ఆయా మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లనుండడంతో వార్డెన్లకు ఎక్కడకు కేటాయిస్తారనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. -
రేపు బీసీ సంక్షేమ శాఖలో విభజన సమావేశం
హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగుల పంపిణీపై హైదరాబాద్లోని శాఖ కమిషనర్ కార్యాలయంలో శనివారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా నుంచి డీడీ నర్సింహస్వామి, డీబీసీడబ్ల్యూవో హృషీకేష్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివరాలు, జిల్లాలకు కేటాయింపు తదితర విషయాలపై స్పష్టత రానుంది. -
బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
ట్రంక్బాక్స్ల్లో అవినీతి ఫలితం! తప్పించేందుకు ప్రయత్నం? కరీంనగర్ సిటీ : ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడిన బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఓ పర్యవేక్షణ స్థాయి అధికారిపై వేటు పడినట్లు సమాచారం. సదరు అధికారిని సస్పెండ్చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని, సెలవులో ఉన్న కలెక్టర్ తిరిగి రాగానే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం. ఇదీ కారణం... బీసీ సంక్షేమ శాఖకు చెందిన సదరు అధికారి ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడనే అభియోగాలున్నాయి. ఇటీవల బీసీ హాస్టల్ విద్యార్థులకు 3706 ట్రంక్బాక్స్లు వచ్చాయి. 24 గేజ్తో ఉన్న ఒక్కో పెట్టె రూ.436 చొప్పున సరఫరా చేసేందుకు వరంగల్కు చెందిన కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాడు. సరఫరా చేసిన ట్రంక్బాక్స్ల్లో నాసిరకంవి ఉన్నాయని, కలెక్టరేట్ సాక్షిగా కాంట్రాక్టర్ నుంచి సదరు అధికారి డబ్బులు తీసుకోవడంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించి నాలుగు రోజుల పాటు బాక్స్ల గేజ్ను తూకం వేశారు. అధికారికంగానే 513 బాక్స్లు నాసిరకం వచ్చాయని తేల్చారు. ట్రంక్బాక్స్ల అక్రమాలకు కారణమైన సదరు అధికారి, గతంలో సెక్షన్ క్లర్క్గా ఉన్న సమయంలోనూ బాక్స్ల సరఫరాలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అప్పుటి అవినీతి ఫలితంగా ఆ సమయంలో పనిచేసిన డీబీసీబ్ల్యూవో రిటైర్డ్ అయినా ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడైన సదరు అధికారిపై పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తప్పించేందుకు ప్రయత్నం? ట్రంక్బాక్స్ల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిని సస్పెన్షన్ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ తిరిగి రాగానే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండడంతో ఆ లోగానే అప్పీల్ పేరుతో శిక్ష తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. దీనికోసం కొంతమంది అధికారులతో పలువురు సంఘ నాయకులు చర్చించినట్లు వినికిడి. శిక్ష ఖాయమని, కనిష్టంగా ఇంక్రిమెంట్లలో కోత, గరిష్టంగా సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశముందని ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డుగా వెల్లడించడం విశేషం. -
ఇద్దరు గ్రేడ్–1 వార్డెన్లకు ఏబీసీడబ్ల్యూఓలుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు గ్రేడ్–1 బీసీ వసతి గృహ సంక్షేమాధికారులకు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూరు ఐడబ్ల్యూహెచ్ వసతి గృహ సంక్షేమాధికారిణి లక్ష్మిదేవికి పదోన్నతి కల్పించి నంద్యాలకు, మీదివేముల వసతి గృహ సంక్షేమాధికారి రోషన్నకు పదోన్నతి కల్పించి వైఎస్సార్ జిల్లా పులివెందులకు బదిలీ చేశారన్నారు. నిర్ణీత గడువులోగా వీరు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపడతారని సంజీవరాజు తెలిపారు. -
'ఇద్దరు సీఎంలు బిచ్చమెత్తుకుంటున్నారు'
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హుస్నాబాద్/చిగురుమామిడి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కావాలని కేంద్రాన్ని కోరకుండా చిన్న చిన్న విషయాల కోసం చిప్ప చేతిలో పట్టుకుని బిచ్చమెత్తుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, హుస్నాబాద్, తిమ్మాపూర్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో 112 బీసీ కులాలున్నాయని, 120 సార్లు రాజ్యాంగాన్ని సవరించినా బీసీల సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో 70 కోట్ల మంది బీసీలున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 20 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటు చేసి 80 శాతం సబ్సిడీపై రుణాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్, అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు నామినేటేడ్ పదవులను ఇచ్చి గౌరవిస్తున్నంత కూడా బీసీలను గౌరవించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగేళ్లుగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని కులాలను బీసీలో చేర్చాలని ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆ రాష్ట్రాల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని 2019 ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం కోసం బీసీలంతా సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
బీసీలకూ ‘విదేశీ విద్య’ ఆర్థిక సహాయం
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న తరహాలో వీరికి కూడా అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బీసీ కులాలు, సంచారజాతులకు చెందిన వారు ఎస్సీల కంటే కూడా వెనుకబడి ఉన్న నేపథ్యంలో... వారికి కూడా విదేశాల్లో ఉన్నత విద్య అవకాశాలను కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కూడా సానుకూలంగా ఉన్నారని, దీనికి త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. విదేశాల్లో విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మైనారిటీ, బీసీ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని, రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఐఐటీల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఐఎం, బిట్స్ పిలానీ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ను వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఇలా చేయడం వల్ల విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు... బీసీ, ఈబీసీ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 కులాలను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీసీ శాఖ కోరినట్లు తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ 2015 ఏప్రిల్లోనే రాష్ట్రానికి వచ్చి ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణను నిర్వహించింది కూడా. కానీ ఏడాది గడిచినా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ప్రభుత్వపరంగా కేంద్రానికి విజ్ఞప్తిచేయాలని కోరినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ఓబీసీలుగా గుర్తించకపోవడంతో ఆ 26 కులాలకు చెందినవారు ఉద్యోగ, విద్య అవకాశాలను కోల్పోతున్నారని... దీనిపై త్వరగా నిర్ణయం వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
భవిష్యత్తు వైఎస్సార్సీపీదే
వెంకటగిరి: భవిష్యత్తు వైఎస్సార్సీపీదేనని, నాయకులు, కార్యకర్తలు వలసలు రావడం తథ్యమని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం గూడూరు డివిజన్ అధ్యక్షుడు మేరువ సురేంద్ర పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆయన సారథ్యంలో పలువురు కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి దిశానిర్దేశంలో వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కాగా పార్టీ సీనియర్ నాయకుడు నెమళ్లపూడి సురేష్రెడ్డి పార్టీలో చేరేందుకు వెళ్లే నాయకులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కూనా మల్లికార్జున్, నాయకులు యస్ధానీబాషా, వీ మోహన్, సీహెచ్ హనుమంతరావు, అర్జునగారి మురళి, పోలీస్రామచంద్రయ్య, రామచంద్రయ్యయాదవ్, గురవయ్య, అన్నిమేటి వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, సత్యారెడ్డి, మహిళావిభాగం నాయకురాలు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు తరలి వెళ్లిన నేతలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెంకటగిరి నుంచి వైఎస్సార్సీపీ నేతలు భారీగా తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల కన్వీనర్ ఆవుల గిరియాదవ్, సీనియర్నాయకుడు జీ ఢిల్లీబాబు, నక్కా వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు. డక్కిలి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పార్టీ మండల కన్వీనర్ రంగినేని రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. -
బీసీల సంక్షేమమే ధ్యేయం
► కుల వృత్తుల చేయూతకు ఆదరణ బీసీల అభివృద్ధికి రూ.8,832 కోట్లు ► కర్నూలు నుంచి అమరావతికి నాలుగు లైన్ల రహదారికి శ్రీకారం ► చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ► ప్రతి జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో బీసీ భవన్ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కర్నూలు(అర్బన్): బీసీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీల అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్లో రూ.8,832 కోట్లను కేటాయించామన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ రుణ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు మొదటి విడతగా రూ.126 కోట్లు, రెండవ విడతగా రూ.114 కోట్లు, మూడవ విడతగా రూ.69 కోట్లను విడుదల చేసినట్లు చెప్పా రు. అంతరించిపోతున్న చేతి వృ త్తులను ఆదుకునేందుకు ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ రాకున్నా, ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ అమలవుతున్న విధంగానే బీసీ సబ్ప్లాన్కు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. నూతన రాజధాని అమరావతికి కర్నూలు నుంచి నాలుగు గంటల్లో చేరుకునేందుకు వీలుగా 10 రోజుల్లో నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణాలు : మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్లను నిర్మిస్తామని, ఈ కార్యక్రమం కర్నూలు నుంచే ప్రారంభం కానుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు వెనుకబడిన కులాలకు ఇచ్చిన చేయూత, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో అనేక మంది బీసీలు రాజకీయంగా ఎదిగారన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు పూర్తిగాా నిర్వీర్యమయ్యాయనిఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయంబర్స్మెంటుకు రూ.1600 కోట్లు విడుదల చేశామన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఫెడరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. బీసీ భవన్కు వారంలో ఐదు ఎకరాల స్థలం ... జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న బీసీ భవన్కు వారం రోజుల్లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వె నుకబడిన కులాల వారికి రుణాలు ఇప్పించేందుకు పలుమార్లు బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించామన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల మందికి రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు. రూ.69 కోట్ల మెగా చెక్ విడుదల ... 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ విడుదల చేసేందుకు మూడవ విడతగా రూ.69 కోట్ల మెగా చెక్ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ కార్పొరేషన్ చైర్మన్ పి. రంగనాయకులు విడుదల చేశారు. అలాగే జిల్లాలోని 4,067 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.33 కోట్ల చెక్ను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం మణిగాంధీ, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ హర్శవర్దన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డెరైక్టర్లు బొల్లా వెంకన్న, వినుకొండ సుబ్రమణ్యం, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై. నాగేశ్వరరావుయాదవ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ పీవీ రమణ, ఏఈఓ సుబ్రమణ్యం, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి. సంజీవరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి, తెలుగు మహిళ నాయకురాలు అంకం విజయ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, ఎం. రాంబాబు, రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, కె. రామకృష్ణ, కేతూరి మధు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులివ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం హుస్నాబాద్ : రాష్ర్ట బడ్జెట్లో బీసీలకు 50శాతం నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్రావు డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిన చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ను రూ.2వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల్లోని 70కులాల్లో ఇప్పటికీ 40 సంచారకులాలుగా అభిముక్త జాతులుగా బతుకీడుస్తున్నాయని, వీరి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. కులవృత్తుల్లోని నిపుణులకు వందశాతం రారుుతీతో రుణాలు అందజేయూలన్నారు. అంతకముందు పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి గోపీనాథ్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వలుస సుభాష్, నాయకులు పిడిశెట్టి రాజు, నాగం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను నిర్లక్ష్యం చేస్తే పార్టీలు పతనమే
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన హెచ్చరిక మాచర్ల : యాభై నాలుగు శాతం ఉన్న బీసీ జనాభాను నిర్లక్ష్యం చేస్తే రాజకీయ పార్టీల చరిత్ర ముగించేలా ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావుగౌడ్ హెచ్చరించారు. పట్టణానికి వచ్చిన ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 54 శాతం ఉన్న బీసీ జాతి హక్కులను భంగపరిచేలా వ్యవహరిస్తూ 6 శాతమున్న కాపుల కోసం రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధిక శాతం జనాభా కలిగిన బీసీల జాతికి అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా బీసీలలో కాపులను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా హక్కు కలిగి ఉన్న బీసీల ప్రయోజనాలను నెరవేర్చకుండా స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వం, కొన్ని రాజకీయ పార్టీలు కాపులను బీసీల్లో చేర్చాలని కోరటం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. 13 జిల్లాల్లో బీసీలను చైతన్యపరిచి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమౌతామన్నారు. బీసీల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలను పాతరేసేందుకు బీసీలను సిద్ధపరుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల నాగేశ్వరరావు యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఈడెబోయిన మురళీ, జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షుడు జీవీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు పాల్గొన్నారు. -
'బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలి'
సామాజిక న్యాయ మంత్రిని కలిసిన దేవేందర్ గౌడ్ న్యూఢిల్లీ బీసీ సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ మంగళవారం ఇక్కడ సామాజిక న్యాయ శాఖ మంత్రి గెహ్లాట్ను కలిశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్, కార్యవర్గ సభ్యుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రం ఇచ్చారు. -
ఇన్చార్జిల గుప్పెట్లో బీసీ సంక్షేమం!
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జిల చేతుల్లోకి వెళ్లిపోయింది. కీలక పోస్టులకు ఇన్చార్జిలే పాలకులై కూర్చున్నారు. దీంతో ఇక్కడ పనులు సక్రమంగా సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పట్టించుకొనేవారు లేక.. సిబ్బంది మధ్య ఉన్న విభేదాలు మరింత ముదురి పాకాన పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: కొద్ది సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో సహా య బీసీ సంక్షేమాధికారులు (ఏబీసీ) పోస్టులు భర్తీ జరగలేదు. దీంతో సీనియర్ సంక్షేమ వసతి గృహ అధికారులకు ఏబీసీలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకూ ఉన్న రెగ్యులర్ జిల్లా బీసీ సంక్షేమాధికారి (డీబీసీ) బి.రవిచంద్రను జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం శుక్రవారం ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో అదీ ఇన్చార్జి పాలనకు వెళ్లిపోయింది. దీంతో ఈ శాఖలోని జిల్లా బీసీ సంక్షేమాధికారితో పాటు ఐదుగురు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా ఇన్చార్జీలే వ్యవహరిస్తున్నారు. కొరవడిన సమన్వయం! గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ శాఖలోని ఉద్యోగులో ్ల సమన్వయం కొరవడింది. ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటుగా మారింది. సిబ్బందిలో ఉన్న వివాదాలు ఆ శాఖను రోడ్డున పడేస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా గతంలో పని చేసి.. పదవి విరమణ చేసిన వారు కూడా ఫిర్యాదులు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇన్చార్జిల వివరాలు ఇలా.. జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇన్చార్జిగా శ్రీకాకుళం ఏబీసీ-2 బగాన ప్రకాశరావు వ్యవహరిస్తున్నారు. ఈయన ఆమదాలవలస వసతి గృహం సంక్షేమాధికారి. ఈయనకు శ్రీకాకుళం ఏబీసీ-2 ఇన్చార్జితో పాటు, డీబీసీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం-1 ఏబీసీగా సత్తారు వసంత కుమారి వ్యవహరిస్తున్నారు. ఈమె శ్రీకాకుళంలోని బీసీ కళాశాల మహిళా వసతి గృహం సంక్షమాధికారిణి. పలాస ఏబీసీగా హెచ్ కృష్ణారావు ఇన్చార్జిగా ఉన్నారు. ఈయన పలాస బీసీ వసతి గృహం అధికారి. టెక్కలి ఏబీసీగా ఎం.రాఘవేంద్రరావు ఇన్చార్జిగా ఉన్నారు. ఈయన కోటబోమ్మాళి మండలం నిమ్మాడ బీసీ వసతి గృహం అధికారి. పాలకొండ ఏబీసీగా ఎల్.అప్పారావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కొత్తూరు మండలం లోని కడుమ బీసీ వసతి గృహం సంక్షేమాధికారిగా ఉన్నారు. వెంటాడుతున్న వివాదాలు -ఈ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు వెంటాడుతున్నాయి. జిల్లా కార్యాలయంలో కొంతమంది సిబ్బంది వారి హవా సాగించుకొనేందుకు నిరంతరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి వల్ల కాకపోతే ఇతరులచే ఫిర్యాదు చేయించి, వారికి నచ్చిన విధంగా, నచ్చిన సీటుని పొందడం పరిపాటుగా మారింది. బదిలీ జరిగినా పలుకుబడితో జిల్లా కేంధ్రంలోనే ఉండేలా ఆధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ శాఖలో గతంతో పనిచేసిన డీబీసీలు కూడా వివాదాలతోనే వెళ్లిపోయారు. నాగరాణి డీబీసీగా పనిచేసిన కాలంలో పలు లోకాయుక్త కేసులు ఉండేవి. ఆ తరువాత వచ్చిన లాలా లజపతిరావు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ బిల్లులతో నగదు స్వాహ, ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. గత ఏడాది క్రితం ఇద్దరు కింది స్థాయి ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు మాయమయ్యాయి. దీనిపై అప్పట్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా స్కాలర్షిప్పుల విభాగం కోసం ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల మద్య వివాదం పెరిగింది. దీంతో మహిళా ఉద్యోగి ప్రైవేటు వ్యక్తుల సాయంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం, దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే డీబీసీ సరెండర్కు దారితీసింది. -
ఇంటి వద్దే బ్యూటీఫుల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మొబైల్ బ్యూటీపార్లర్లు అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, జిల్లా కేంద్రాలు, వాటికి సమీప ప్రాంతాల్లో ఇళ్ల వద్దే సౌందర్య సేవలు లభించనున్నాయి. యువతులకు ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ఇటీవలి కాలంలో అందంపై అతివల అభిరుచి పెరగిన నేపథ్యంలో.. ఇటువంటి సేవలు కోరుకునే మహిళల ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీపార్లర్లలో లభించే సేవలను అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. బీసీ వర్గాలకు చెందిన యువతులకు దీనిని ఒక ఉపాధి అవకాశంగా మలచాలని బీసీ సంక్షేమశాఖ నడుం బిగించింది. దాదాపు వెయ్యి మంది యువతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి బ్యూటీషియన్ కోర్సు లో శిక్షణ ఇవ్వనుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి స్కూటర్ లేదా మోపెడ్, మొబైల్ బ్యూటీ కిట్, యాప్రాన్, ఫోన్ను ఉచితంగా అందించనుంది. అతివలు ఇళ్ల వద్దే ఈ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా మొబైల్ యాప్ను రూపొందించనుంది. వచ్చే నెల నుంచే దీనిని ప్రారంభించేం దుకు సన్నాహాలు చే స్తున్నారు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో ఈ పథకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. సంచారజాతులకు ఫెడరేషన్.. సంచారజాతుల వారికోసం ప్రభుత్వం విడిగా ఫెడరేషన్ ఏర్పాటు చేయనుంది. రానున్న బడ్జెట్లో (2016-17) నిధులు కేటాయించనుంది. జిల్లాలవారీగా సంచారజాతుల వారిని గుర్తించి, స్వయం ఉపాధి, నైపుణ్యాల మెరుగుదలకు తోడ్పాటు అందించనుంది. జిల్లా కేంద్రాలకు దగ్గరలో వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంతోపాటు ఇతర పథకాలను వారికి చేరువ చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమశాఖ ఉంది. -
చెయ్యి తడపాల్సిందే
- టీడీపీ సర్కారులో ఏ పని కావాలన్నా డబ్బివ్వాల్సిందే - అవినీతి నిరోధక విభాగం నివేదిక స్పష్టీకరణ - లంచాలు ఇవ్వనిదే సామాన్య ప్రజానీకానికి పని జరగడం లేదు - రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్లు.. అన్ని శాఖల్లోనూ అవినీతి - ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలోనూ సమర్పించుకోవాల్సిందే... సాక్షి, హైదరాబాద్: ‘ఇందుగలదు.. అందులేదన్న సందేహంబు వలదు..’.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, లంచాల దందా యధేచ్చగా కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, ఇదే అదనుగా మరోవైపు అధికార యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. లంచాల వ్యవహారం సామాన్య ప్రజానీకాన్ని ఎలా పట్టిపీడిస్తోందో ఈ ఏడాది అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు.. స్టాంపులు, మున్సిపల్, పంచాయతీరాజ్, హోం, గృహ నిర్మాణం, వాణిజ్యం.. తదితర అనేక శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో సైతం అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. పేదల ఇళ్ల బిల్లుల మంజూరుకు, పాస్ బుక్కులు ఇవ్వడానికి, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ జారీకి, భవన నిర్మాణ ప్లాన్ ఆమోదానికి.. ఇలా ఆయా శాఖల్లో పనులు కావాలంటే లంచాలు తప్పనిసరై పోయాయని ఏసీబీ ఆకస్మిక తనిఖీల నివేదిక పేర్కొంది. చివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఎంతోకొంత సమర్పించుకోవాల్సిందేనని.. లంచాలు లేనిదే ఏ విభాగంలోనూ ఎలాంటి పనీ జరగడం లేదని ఇటీవల ఏసీబీ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. - రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్బుక్ జారీకి లంచం తీసుకుంటున్నారు. పహాని జారీకి, పహానీలో, రికార్డ్ ఆఫ్ రైట్స్లో, పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు మార్చాలంటే లంచం లేనిదే పని జరగడం లేదు. - గృహ నిర్మాణ శాఖలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు, బిల్లుల వాయిదాల విడుదలకు, అలాగే ఇళ్ల డాక్యుమెంట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. - రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) జారీకి, డాక్యుమెంట్లు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్నారు. భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్కు డబ్బులు ఇవ్వడం తప్పనిసరి ప్రక్రియగా మారింది. - మున్సిపల్ శాఖలో భవన నిర్మాణాల ప్లాన్ ఆమోదానికి, మంచినీటి కనెక్షన్ మంజూరు, తదితర పనులకు లంచం తీసుకుంటున్నారు. - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్స్కు లంచం తీసుకుంటున్నారు. - హోంశాఖలో ఆధారాలతో సహా ఫిర్యాదును ఫైలు చేయడానికి, చార్జిషీటు నమోదుకు, ఎఫ్ఐఆర్ జారీ చేయడానికి, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, వస్తువులు తిరిగి ఇవ్వడానకి, నిందితులకు సహాయం చేయడానికి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు తీసుకుంటున్నారు. - విద్యుత్ మీటర్లు, కనెక్షన్ల మంజూరుకు, ట్రాన్స్ఫార్మర్లు తదితరాల ఏర్పాటునకు లంచాలు ఇవ్వడం ఇంధన శాఖలో సర్వసాధారణమైపోయింది. - ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను పెంచి చూపిస్తూ నిధులు దండుకుంటున్నారు. సరుకుల కొనుగోలు అనధికారంగా చేస్తున్నారు. పేద పిల్లలకు చేరాల్సిన నిధులను చేతివాటంతో కాజేస్తున్నారు. - వాణిజ్య పన్నుల శాఖలో చెక్పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసి వారిద్వారా డ్రైవర్లనుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. వ్యక్తిగత నగదు రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో పన్నుల ఎగవేతకు ఆస్కారం కల్పిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల 25వ తేదీ వరకు ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రధానమైన కొన్ని కేసుల వివరాలు.. చెక్పోస్టులు/ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు.. ఆఫీసులో/ అధికారి వద్ద పట్టుబడిన నగదు (రూ.లలో) 1. కె. శివశంకరరావు, ప్రాజెక్టు డెరైక్టర్, ఏలూరు, పశ్చిమగోదావరి 20,00,000 2. ఆర్.టీ.ఓ గాజువాక, విశాఖపట్నం జిల్లా 4,13,149 3. జి. సతీష్, ఎఫ్ఆర్ఓ -ఎం. నాగేశ్వరరావు, అటవీ సెక్షన్ ఆఫీసర్, ఎల్,ఎన్.డి. పేట, పశ్చిమగోదావరి జిల్లా 2,39,000 4. ఆర్.సుబ్బారాయుడు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1, జి. వెంకటేశ్వర్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2, గూడూరు, నెల్లూరు 1,92,000 5. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్-పుల్లంపేట, కడప జిల్లా 1,90,815 6. శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, ఉదయగిరి, నెల్లూరు జిల్లా 1,82,100 7. కె.నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ హాస్టల్ అధికారి, విశాఖపట్నం 1,08,978 8. లాల లజపతిరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఏలూరు 1,08,400 -
ఇక మరిన్ని బీసీ కాలేజీ హాస్టళ్లు
పాలిటెక్నిక్ కాలేజీల ఆవరణల్లో ఏర్పాటు బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలకు సాంకేతిక విద్యాశాఖ ఆమోదం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన కాలేజీ హాస్టళ్ల ఏర్పాటునకు మార్గం సుగమమైంది. ఈ హాస్టళ్ల నిర్మాణానికి అనువైన స్థలం లభించకపోవడం కొంత ఇబ్బందిగా మారడంతో ఈ విషయంలో ఇప్పటివరకు కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉన్న బీసీ కాలేజీ హాస్టళ్లకు అదనంగా జిల్లాకు ఒకటి నుంచి రెండు వరకు కొత్త హాస్టళ్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల ఆవరణలో బీసీ కాలేజీ హాస్టళ్ల ఏర్పాటుకు బీసీ సంక్షేమశాఖ, సాంకేతిక విద్యాశాఖ పరస్పరం అంగీకారం తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పది జిల్లాల్లో 47 పాలిటెక్నిక్ కళాశాలలుండగా వాటిలోని 25 పాలిటెక్నిక్ కాలేజీల ప్రాంగణాల్లో ఈ హాస్టళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతిక విద్యాశాఖ అంగీకరించింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు కొనసాగింపుగా బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి రూ. 3 కోట్ల వరకు వ్యయం కావొచ్చని అధికారులు అంచనా వేశారు. హాస్టళ్ల నిర్మాణానికి ప్రస్తుతం బీసీశాఖ బడ్జెట్లో అందుబాటులో ఉన్న నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీలైనంత మేర నిధులు తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, హాస్టళ్లలో ఎంతమంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించాలి, అందులో పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు ఎన్ని సీట్లు కేటాయించాలి, తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ హాస్టళ్లలో మరిన్ని సౌకర్యాలు రాష్ట్రంలోని 247 బీసీ కాలేజీ వసతి గృహాల్లో (ఒక్కో హాస్టల్లో రెండేసి కంప్యూటర్ల ఏర్పాటు) కంప్యూటర్ల ఏర్పాటుపై ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)కు బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపనుంది. బీసీ కాలేజీల వసతి గృహాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ హాస్టళ్లలో ఆయా సౌకర్యాల కల్పనకు అవసరమైన రూ. 110 కోట్ల బడ్జెట్ కూడా అందుబాటులో ఉండటంతో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. హాస్టళ్లలో ఆధునిక గ్రంథా లయం, ఇతర సమాచారంతో కూడిన సీడీలు, ఇతర ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను అందించాలని బీసీ సంక్షేమశాఖ యోచిస్తోంది. కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్ల విధానంలోనూ మార్పులు తేవాలనే ఆలోచనతో ఉంది. హాస్టల్ అడ్మిషన్లను సైతం ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులవారీగా, మెరిట్ ఆధారంగా, ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులవారీగా కోటాల ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది. ఇలా హాస్టళ్లలో అన్ని బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతోపాటు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. -
కలిసి రాకపోతే.. టీడీపీనీ వదిలేది లేదు!
-
బీసీ బాలురకు ‘అపకారం’
మండపేట :వెనుకబడిన కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు సర్కారు క్రియలో బీసీ బాలురకు అపకారం తలపెట్టింది. బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో కోత పెట్టే క్రమంలో ఉపకారవేతనాలను బాలికలకే పరిమితం చేసింది. వారికీ అరకొరగానే నిధులు విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆదాయ పరిమితిని మరింత తగ్గిస్తూ మెలిక పెట్టింది. సర్కారు వంచనపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 9, 10 తరగతులు చదివే (ప్రీ మెట్రిక్) బీసీ విద్యార్థులకు నెలకు రూ.100 చొప్పున విద్యాసంవత్సరంలో రూ. 1000 ఉపకార వేతనాలుగా ప్రభుత్వం అందజేస్తుంది. 2013-14 విద్యాసంవత్సరానికి ప్రీ మెట్రిక్ బీసీ విద్యార్థులు జిల్లాలో 21,023 మంది ఉన్నారు. వీరిలో బాలురు 9,670 మంది ఉండగా బాలికలు 11,353 మంది ఉన్నారు. వీరికి ఉపకార వేతనాలుగా సుమారు రూ.2.10 కోట్లు విడుదల రావాల్సి ఉండగా కేవలం రూ.25 లక్షలు మాత్రమే ఇటీవల విడుదల చేసింది. ఈ నిధులను బాలికలకు మాత్రమే అందజేయాలని ఆదేశించినట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు అంటున్నాయి. గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్కు చేరుకోగా ప్రస్తుతం 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థుల్లో బాలికలు 6,196 మంది ఉన్నారు. వీరికి కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు కేవలం 2,500 మందికి మాత్రమే సరిపోతాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం తీరుతో ఉపకార వేతనాలపై ఆశలుపెట్టుకుని చదువుకుంటున్న బీసీ బాలురు హతాశులవుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగిస్తున్న చదువులకు సర్కారు తీరుతో చరమగీతం పాడాల్సి వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధృవీకరణ పత్రాల కోసం ప్రదక్షిణలు కాగా ఈ ఏడాది ఇచ్చే ఉపకార వేతనాల్లోనూ కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.44,600 లోపు వార్షికాదాయం ఉన్న వారే ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని మెలిక పెట్టింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.72 వేలు వార్షికాదాయం ఉన్న వారికి గత ప్రభుత్వం తెల్లకార్డులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆదాయ పరిమితి తగ్గించడంతో ఆ మేరకు ఇన్కం సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఈ సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో చూపిన ఆదాయాన్ని తగ్గించి కొత్త ధృవీకరణ పత్రాల జారీకి కొందరు తహశీల్దార్లు విముఖత చూపుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయం అనుచితం ఉపకార వేతనాలను బాలికలకు మాత్రమే పరిమితం చేస్తే ఎందరో పేద విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరమవుతుంది. చదువు మాని పనిబాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. బీసీ సంక్షేమంపై ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి సర్కారు కట్టుబడాలి. బీసీ బాలబాలికలందరికీ ఉపకార వేతనాలిచ్చేందుకు నిధులు విడుదల చేయాలి. - కోన సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, మండపేట ఆదాయ పరిమితి పెంచాలి ఉపకార వేతనాలకు ఆదాయ పరిమితిని తగ్గించడం చాలా దారుణం. కొత్తగా ఆదాయం తగ్గించుకుని ధృవీకరణ పత్రాలు పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలు విడుదల చేయడంతో పాటు బీసీ విద్యార్థులకు ఆదాయ పరిమితిని రెండు లక్షల వరకు పెంచాలి. - బి.సిద్ధు, విద్యార్థి సంఘం నాయకుడు, రామచంద్రపురం -
బీసీల బడ్జెట్ను రూ.25వేల కోట్లకు పెంచాలి
నకిరేకల్ : బీసీల బడ్జెట్ను రూ. 25వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ను పెంచాలని కోరుతూ ఈ నెల 18న బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆదివారం నకిరేకల్లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ కులాల అభ్యు న్నతికి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్కు రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకినాల రవి, అర్రూరి వెంకటేశ్వర్లు, పగిల్ల సందీప్, బీసీ సంఘం నాయకులు బండపల్లి శ్రీనివాస్గౌడ్, మిడిసినమెట్ల సైదులు, నేలపట్ల రమేష్, పగిల్ల వెంకన్న, గోగికార పరమేష్, పోగుల ఉపేందర్, తిరుగుడు రవి, ఆలకుంట్ల సైదులు, శ్రీనివాసచారి, మాజీద్, వెంకన్న, శ్రీను, సంకోజు కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. -
బీసీల రాజ్యాధికారం కో్సం పోరాటం: కృష్ణయ్య
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వెనకబడిన తరగతుల విద్యార్ధుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారం సాధించేంతవరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేసిన హామీలను నెరవేరేంతవరకు పోరాటం చేస్తామన్నారు. బీసీల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. -
ఏపీ బిసి సంక్షేమ సంఘం వెబ్సైట్ ప్రారంభించిన జగన్
-
ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత
మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు డెల్టాఆధునికీకరణపై నిర్లక్ష్యం వహించడం వల్లే కాలువలు బలహీన పడ్డాయని తెలిపారు. బెల్ కంపెనీ విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం కంపెనీకి 25 నుంచి 50 ఎకరాల మధ్యలో భూమి కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులతో చర్చించామన్నారు. కృష్ణా యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల కోసం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. భవానీపురం వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పింఛన్ల పెంపు కార్యక్రమం, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, ఎన్టీఆర్ ఆరోగ్య కార్యక్రమాలు, జన్మభూమి - మనఊరు కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నేరుగా విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.5 కోట్లతో మంగినపూడిబీచ్ అభివృద్ధి పనులు, రూ. 3 కోట్లతో గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ వద్ద రిసార్ట్స్ ఏర్పాటు చేసి బోటు షికార్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.25 లక్షలతో చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు నారగాని ఆంజనేయప్రసాద్, కుంచే దుర్గాప్రసాద్ (నాని) పాల్గొన్నారు. -
అందుకు నేను రెడీ.. మీరు రెడీయా?
-
నేను రెడీ.. మీరు సిద్ధమా?
బీసీలకు ఏపీ అసెంబ్లీలో 33 శాతం సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధమని.. అవతలివైపు టీడీపీ రెడీనా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాలు చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీల మీద ప్రేమ తనకొక్కడికే ఉన్నట్లు దాన్ని ఒలకబోస్తున్నట్లుగా చంద్రబాబు హడావుడిగా బీసీ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను వంద సీట్లు ఇస్తామంటూ ఆయన ప్రకటించారు గానీ ఏనాడూ 50-60 సీట్లకు మించి ఇవ్వలేదు. ఇప్పుడు 33 శాతం సీట్లు బీసీలకు ఇవ్వడానికి నేను సిద్ధం, వాళ్లు సిద్ధమా అన్నారు. వాళ్లకు న్యాయం జరగాలంటే బీసీలకు అవకాశం ఇచ్చిన చోట అవతలి అభ్యర్థి కూడా బీసీయే అయి ఉండాలని ఆయన తెలిపారు. అప్రాప్రియేషన్ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు బీసీల విషయం గురించి మాట్లాడాలనడం ఎంతవరకు న్యాయమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగారు. -
చేనేత పరిశ్రమకు జవసత్వాలు
రాష్ట్రంలో 31 మినీ క్లస్టర్లు, రెండు మెగా క్లస్టర్లు క్లస్టరు ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు గూడూరు : చేనేత పరిశ్రమకు జవసత్వాలు కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని బీసీ సంక్షేమ, ఎక్సైజ్ చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో ఇటీవల మంజూరైన చేనేత క్లస్టరు (సమగ్ర చేనేత అభివృద్ధి పథకం)ను మంత్రి ప్రారంభించారు. చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఎమ్మెల్యే కాగిత అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధికులు చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు వారు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు మార్కెట్లో ఆదరణ కల్పించేందుకు ఈ సమగ్ర చేనేత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా 31 మినీ క్లస్టర్లను ఒక్కొక్కటీ రూ. 70నుంచి60 లక్షలతో, రెండు మెగా క్లస్టర్లను ఒక్కొక్కటీ కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో పోలవరం, రాయవరం, కప్పలదొడ్డి, పెడన, చల్లపల్లి గ్రామాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత కార్మికుల హర్షధ్వానాల నడుమ మంత్రి ప్రకటించారు. సద్వినియోగం చేసుకోండి : కాగిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చేనేత క్లస్టర్లను కార్మిక సోదరులు సద్వినియోగం చేసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కోరారు. ఆధునిక డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తారని చెప్పారు. చేనేత, జౌళిశాఖ ఉపసంచాలకులు షేక్ జిలానీ, సర్పంచి తమ్మిశెట్టి వరలక్ష్మి, ఆప్కో డీఎంవో లక్ష్మణరావు, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, గూడూరు, బందరు జెడ్పీటీసీలు గోపాలకృష్ణగోఖలే, లంకే నారాయణప్రసాద్, చేనేత, జౌళిశాఖ అభివృద్ధి అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
బెజవాడ కేంద్రంగా రాష్ర్ట పాలన
శ్రీకారం చుడుతున్న మంత్రులు నేడు ఇరిగేషన్ శాఖ భవనం ప్రారంభం త్వరలో ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్య శాఖల కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరం నుంచి రాష్ట్ర పరిపాలన ప్రారంభం కానుంది. ఒకపక్క ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటులో భాగంగా రాష్ట్ర అతిథి గృహానికి మరమ్మతులు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ హైదరాబాద్ను వదిలేసి విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు శనివారం హైదరాబాదులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం నుంచే ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా మొదలు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ఈ కార్యాలయంలో తగిన భవనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడే మంత్రి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తుంటే అక్కడే ఈఎన్సీ కార్యాలయం ఉండాల్సిన నేపథ్యంలో దానినీ ఇక్కడికి తరలించనున్నారు. రైతుల బాగోగులన్నీ ఇక్కడినుంచే సమీక్ష... కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదుల ఆధారంగా వరి పంట ఎక్కువగా పండుతుంది. వ్యవసాయానికి ఈ జిల్లాలు కేంద్ర బిందువులుగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో కూడా వరి పంట ఎక్కువగా పండుతున్నా కృష్ణా, గోదావరి నదుల నీరు మాత్రం అక్కడికి అందదు. స్థానిక నదుల ద్వారా అక్కడికి సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తాయి. నదుల ద్వారా సాగునీరు, రైతుల బాగోగులన్నీ మంత్రి ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే చర్చించి సమీక్షిస్తారు. సాగర్ ద్వారా తాగునీటి విడుదల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో మరో నాలుగు శాఖలు... విజయవాడ కేంద్రంగానే ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన శాఖల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు శాఖలకు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్లు మంత్రులుగా నియమితులయ్యారు. దేవినేని ఉమామహేశ్వరావు ముందుగా తన శాఖ పాలన గురించి ప్రకటించడంతో వారు త్వరలోనే విజయవాడ కేంద్రంగా పరిపాలనా కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించేందుకు నిర్ణయించారు. వీరు ముగ్గురూ జిల్లాకు చెందినవారు కావడం, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో విజయవాడ నగరం నుంచే పాలన సాగించేందుకు సుముఖత చూపుతున్నారు. నూతన ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా విజయవాడలో ఉన్న పలు శాఖల కార్యాలయాల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ నూతన రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ఇప్పటికే పలు వివరాలు అందజేశారు. -
బీసీల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కృష్ణయ్య
హైదరాబాద్: బీసీల సంక్షేం, అభివృద్ధి కోసం చట్టసభలలో పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గౌడ యువజన సంఘర్షణ సమితి నాయకులు దూసరి వెంకటేష్గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం సాయంత్రం విద్యానగర్లోని బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి అభినంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం చేసే పోరాటంలో బీసీలందరూ సంఘటితంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్గౌడ్, తండు లాలయ్యగౌడ్, దూసరి శ్రీనివాస్గౌడ్, సతీష్చంద్రగౌడ్, లోడ పరమేష్గౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమాధికారి నాగరాణి బదిలీ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధికారిణి ఆర్.వి.నాగరాణి బదిలీ అయ్యారు. ఆమెను వైఎస్ఆర్(కడప)జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పలు క్యాడర్లలో పని చేసిన నాగరాణి 2011 జూలై 25న జిల్లా బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఈమె పైనా, ఆ శాఖపైనా వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. తన చాంబర్కు ఏసీ పెట్టించుకోవడం, పిల్లల బట్టలు కుట్టే ఏజెన్సీలతో వివాదాలు, సిబ్బంది బదిలీలు, ఇంక్రిమెంట్లు తదితర అంశాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. లోకాయుక్తలోనూ కేసులు విచారణలో ఉన్నాయి. ఈనెల 23న మళ్లీ లోకాయుక్త విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసుల విచారణకు వీలుగా ముందుగా ఆమెను బదిలీ చేయాలని లోకాయుక్త ఆదేశించడంతో బదిలీ తప్పనిసరి అయ్యింది, ఇదిలా ఉండగా బదిలీని నిలుపుదల చేసుకొనేందుకు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రిని, ఆయన బంధువును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అయితే నాగరాణిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.