-
బాబు ఇంతేకదమ్మ!
బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా భరత్కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్కి టికెట్ ఇచ్చి బీసీలను గౌరవించింది. మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే. టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. బాబు కులస్తులకే పెద్దపీట కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్ (తిరుపతి) టికెట్ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. -
తెలంగాణలో త్వరలో కులగణన
-
బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్
సాక్షి, గుంటూరు: సామాజిక న్యాయం.. బహుశా దీని గురించి చంద్రబాబు హయాంలో ఎవరూ విని ఉండరు. ఎందుకంటే.. ఆయన తన కులం గురించి తప్పా ఇతర వర్గాల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి. కానీ, గత నాలుగున్నరేళ్లలో అదెంటో ఏపీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు. పదవుల్లో, పథకాల్లో అన్నింటా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోంది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారిప్పుడు. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని అధికార పక్షానికి చంద్రబాబు సవాల్ విసిరుతున్నారు. అది సీఎం జగన్ సొంత నియోజకవర్గం. మరి పులివెందులలో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టే దమ్ము టీడీపీకి ఉందా?. ఎన్నికలొస్తున్నాయి కదా అందుకే చంద్రబాబు స్వరం మారింది. బీసీలను ఉద్ధరించేవాడిలా స్టేట్మెంట్లు ఇస్తున్నారాయన. ►చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కూడా బీసీలనే దెబ్బకొట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఓడిపోగానే.. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బీసీల నోట్లో మట్టి కొడుతూ వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తనయుడ్ని అదే బాటలో నడిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నాడు. ►బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా నమ్మారు. అందుకే బీసీలకు, అదే విధంగా ఇతర సామాజికవర్గాలకూ పెద్ద పీట వేశారు. ఇప్పుడు కులాలవారీగా ఏపీ ప్రజలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు (2014-2019)తన హయాంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? అలాగే సీఎం జగన్ తన హయాంలో సముచిత స్థానం కల్పించారో లెక్కలు చూస్తే.. 1)మంత్రి పదవులు చంద్రబాబు పాలనలో బీసీలు -8 వైఎస్ జగన్ పాలనలో బీసీలు-11 బాబు పాలనలో ఎస్సీలు -2 జగన్ పాలనలో ఎస్సీలు-5 2)స్పీకర్ బాబు పాలనలో కోడెల-కమ్మ సామాజిక వర్గం జగన్ పాలనలో తమ్మినేని సీతారాం - బీసీ శాసనమండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు 3)రాజ్యసభ ఎంపీలు బాబు పాలనలో బీసీలు-0 జగన్ పాలనలో బీసీలు-4 (50 శాతం) 4)ఎమ్మెల్సీ పదవులు బాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు -18 (37 %) జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు-29 (68 %) 5) సీఎం జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురు (80 శాతం) బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే. 6)13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 7) రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే.. 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు 8 ) 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే.. అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 9) వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 10) 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 11) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. ఈ లెక్కలు చాలావా? జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పడానికి. ‘‘నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తా’’ ‘‘మత్స్యకారుల తోలు తీస్తా’’ ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’’ ఇలాంటి కులహంకార వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు కాదా?.. దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం.. సీఎంగా ఉండి కూడా ప్రజలకు సామాజిక న్యాయం ఎందుకు అందించలేకపోయారు?.. అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ అది చేస్తా.. ఇది చేస్తా.. అంటూ చిడతలు వాయిస్తున్నారిప్పుడు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు- సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ ఒక్కటేనా?.. ఆయన బావమరిది బాలయ్య స్టైల్లోనే చెప్పాలంటే.. ‘‘బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్’’. -
అసెంబ్లీ టికెట్లు ఇవ్వండి
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న లాల్కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్సైట్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. దరఖాస్తు కోసం https://tsobmmsbc.cgg.gov.in క్లిక్ చేయండి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తోడేళ్ళను తరిమే రోజు!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement