Georgia
-
ముంచుకొస్తున్న మెగాబర్గ్ ముప్పు?!
అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం. ఎంతలా అంటే.. ముంబైలాంటి మహానగరాలు ఆరు కలిస్తే ఇది ఏర్పడిందట. అంతటి ఐస్బర్గ్ ఓ ద్వీపం వైపుగా దూసుకొస్తోంది. అలాంటప్పుడు ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చర్చిద్దాం. A23a.. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది. బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్బర్గ్గా ప్రకటించింది కూడా.ఇక.. సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణిస్తోంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దీవికి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మంచు ఫలకం. ఈ ఐస్బర్గ్ పైభాగానికి పదిరెట్లు సముద్రంలో ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే.. ట్రిలియన్ టన్నుల బరువుండొచ్చనేది ఒక అంచనా. ప్రపంచంలోనే భారీ మంచు ఫలకం కావడంతో.. అందరి కళ్లు దీని మీదే ఉన్నాయి. అందుకే దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే గంటకు ఒక మైలు వేగంతో పయనిస్తోందట!.ఢీ కొడితే ఏమౌతుందంటే..సౌత్ జార్జియా పెద్దగా జనావాసం లేని ద్వీపం. కానీ, వైవిధ్యమైన జంతుజాలం అక్కడ ఉంది. కింగ్ పెంగ్విన్స్, సాధారణ సీల్స్తో పాటు ఎలిఫెంట్ సీల్స్ ఈ దీవి ఆవాసం. అయితే గతంలో ఈ దీవిని ఈ తరహాలోనే ఐస్బర్గ్లు ఢీ కొట్టాయి. ఆ టైంలో పక్షులు, సీల్ చేపలు లాంటివి లెక్కలేనన్ని మరణించాయి. అలాగే ఇప్పుడు ఈ భారీ ఐస్బర్గ్ ఢీ కొడితే.. ఆ నష్టం ఊహించని స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. అంతేకాదు.. అది అక్కడి నౌకాయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిశ మార్చుకుంటుందా?అయితే సౌత్ జార్జియాకు చేరుకునేలోపే మెగాబర్గ్.. ముక్కలయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే అంచనా వేస్తోంది. అలాగే.. దీవి వైపు కాకుండా దిశ మార్చుకుని పయనించే అవకాశమూ లేకపోలేదని చెబుతోంది. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలనే ఉదాహరణలుగా చెబుతోంది. అయితే.. ఢీ కొట్టనూ వచ్చు!మరోవైపు.. శాటిలైట్ వ్యవస్థ ద్వారా దీని కదలికలను పరిశీలించిన బ్రిటిష్ అంటార్కిటికా సర్వే ప్రతినిధి ఆండ్రూ మెయిజెర్స్ మాత్రం పై వాదనలతో ఏకీభవించడం లేదు. ఇది మిగతా ఐస్బర్గ్లాగా ముక్కలు కాకపోవచ్చనే ఆయన అంటున్నారు. పైగా అది దిశ మార్చుకునే అవకాశాలను ఆయన కొట్టిపారేశారు. ఇది గతంలోని ఐస్బర్గ్ల మాదిరి కనిపించడం లేదని అంచనా వేస్తున్నారాయన. ద్వీపాన్ని ఢీ కొట్టిన తర్వాత అది దక్షిణాఫ్రికా వైపు దారి మళ్లొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.ఏ23ఏ ఏర్పాటునకు క్లైమేట్ ఛేంజ్తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ తరహా భారీ మంచు ఫలకలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అంటార్కిటికాలో సముద్ర మట్టం పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదల.. భవిష్యత్తులో ఈ తరహా భారీ ఐస్బర్గ్లను మన ముందు ఉంచే అవకాశాలే ఎక్కువ. A68aకి ఏమైందంటే.. ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో అతిపెద్ద ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
జిమ్మీ కార్టర్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా 39వ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నేత జిమ్మీ కార్టర్ ఇక లేరు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జార్జియా రాష్ట్రంలో ప్లెయిన్స్లోని తన నివాసంలో ఆదివారం ప్రశాంతంగా కన్నుమూశారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యధిక కాలం జీవించిన రికార్డు ఆయనదే. 1977–81 మధ్య అధ్యక్షునిగా చేసిన కార్టర్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు దేశాధినేతలు కార్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నాయకత్వ పటిమ తిరుగులేనిదని బైడెన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వానికి, సానుకూల దృక్పథానికి కార్టర్ ప్రతిరూపమని కొనియాడారు. కార్టర్ అంత్యక్రియలను జనవరి 9న పూర్తి అధికార లాంఛనాలతో జరపనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా కార్టర్తో తాను తీవ్రంగా విభేదించినా ఆయన నిష్కళంక దేశభక్తుడన్నది నిస్సందేహమని ట్రంప్ పేర్కొన్నారు. కార్టర్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఆయనకెంతో ఇష్టమైన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే జరిగే అవకాశముంది. రైతు బిడ్డ జిమ్మీ కార్టర్గా ప్రసిద్ధుడైన జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్ ఓ నికార్సైన రైతు బిడ్డ. 1924 అక్టోబర్ 1న జార్జియాలోని ప్లెయిన్స్ అనే చిన్న పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి కార్టర్ సీనియర్ ఓ రైతు. తల్లి లిలియన్ నర్సు. 1943లో అమెరికా నావల్ అకాడమీలో క్యాడెట్గా ఆయన కెరీర్ మొదలైంది. దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడమే గాక ప్రతిష్టాత్మక అణు జలాంతర్గామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 1962లో తొలిసారి సెనేటర్గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్ అయ్యారు. 1974లోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామాకు దారితీసిన వాటర్గేట్ కుంభకోణం నుంచి అమెరికా అప్పటికింకా బయట పడనే లేదు. 1977 ఎన్నికల్లో నెగ్గి అమెరికా అధ్యక్షుడయ్యారు. 1979లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందంలో కీలకపాత్రధారిగా నిలిచారు. చైనాతో అమెరికా దౌత్య సంబంధాలకు తెర తీసిన అధ్యక్షునిగా నిలిచిపోయారు. మానవ హక్కులే మూలసూత్రంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరి్నర్వచించారు. అయితే అఫ్గానిస్తాన్పై సోవియట్ యూనియన్ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇరాన్ బందీల సంక్షోభమూ కార్టర్ చరిత్రపై ఓ మచ్చగా మిగిలింది. డజన్ల కొద్దీ అమెరికన్లను ఇరాన్ తిరుగుబాటు విద్యార్థులు బందీలుగా చేసుకోవడం స్వదేశంలో ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. 1980 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి రొనాల్డ్ రీగన్ చేతిలో ఓటమి చవిచూశారు. అలా వైట్హౌస్ను వీడినా కార్టర్ ప్రజాసేన మాత్రం నిరి్నరోధంగా కొనసాగింది. అమెరికా ప్రభుత్వం తరఫున ఉత్తర కొరియాకు శాంతి స్థాపన బృందాన్ని తీసుకెళ్లారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు చేసిన నిరి్వరామంగా కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్కు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య రోసలిన్ ఏడాది క్రితమే మరణించారు. When I look at Jimmy Carter, I see a man not only for our times, but for all times. A man who embodied the most fundamental human values we can never let slip away.And while we may never see his likes again, we would all do well to try to be a little more like Jimmy Carter. pic.twitter.com/I0xDM05xmH— President Biden (@POTUS) December 30, 2024భారత్తో అనుబంధం కార్టర్కు భారత్తో మంచి అనుబంధముంది. ఆయన తల్లి లిలియన్ పీస్ కార్ప్స్ బృందంలో భాగంగా 1960ల చివర్లో భారత్లో హెల్త్ వలంటీర్గా పని చేశారు. దాంతో కార్టర్ భారత్కు సహజ మిత్రునిగా పేరుబడ్డారు. మన దేశంలో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షునిగా నిలిచారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమర్జెన్సీని ఎత్తేసిన మరుసటేడాది కార్టర్ భార్యాసమేతంగా భారత్కు వచ్చారు. ఆ సందర్భంగా భారత పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నియంతృత్వ పాలనను స్పష్టంగా వ్యతిరేకించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగానో మెరుగుపరిచినదిగా ఆ పర్యటన చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్టర్ దంపతులు ఢిల్లీ సమీపంలోని ఓ గ్రామాన్ని సందర్శించడం అందరినీ ఆకర్షించింది. -
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
జార్జియా అధ్యక్షునిగా సాకర్ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?
టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్ యూనియన్)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు. 1990 ప్రాంతంలో ఇంగ్లిష్ సాకర్ టీమ్ మాంచెష్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.నేను ఇక్కడే ఉన్నా.. !మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్ యూనియన్ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.అసలు ఏం జరిగింది..?యురోపియన్ యూనియన్లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి.వీటిని యురోపియన్ యూనియన్లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
USA Presidential Elections 2024: వైట్హౌస్కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్కు 51, హారిస్కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్ను క్లీన్స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్ను పలుమార్లు క్లీన్స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్కు శుభాకాంక్షలు తెలిపారు. -
చెస్ ఒలింపియాడ్: నేడు చైనా, జార్జియాలతో భారత్ పోరు
చెస్ ఒలింపియాడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్లు విరామం తర్వాత తదుపరి పోటీలను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం పురుషుల జట్టు చైనాను ఢీకొంటుండగా, మహిళల జట్టు జార్జియాతో తలపడుతుంది. భారత జట్లు ఈ టోర్నీలో వరుసగా ఆరు రౌండ్లలోనూ విజయాలు సాధించాయి. పురుషుల జట్టులో భారత నంబర్వన్ ర్యాంకర్ ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ కీలక పాత్ర పోషిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. చైనా గట్టి ప్రత్యర్థి కావడంతో ఈ మ్యాచ్ ఫలితం భారత్ పతక వేటను శాసించనుంది. తర్వాత అమెరికా, ఉజ్బెకిస్తాన్లతో భారత పురుషుల జట్టు తలపడుతుంది. మహిళల ఈవెంట్లో జార్జియా కూడా కఠినమైన ప్రత్యర్థే కావడంతో ఏడో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లకు కష్టమైన సవాళ్లు ఎదురవనున్నాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి భారత జట్లు 12 పాయింట్లతో పురుషుల, మహిళల కేటగిరీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి. -
అమెరికా స్కూల్లో కాల్పుల మోత
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు. మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నినో... నీకు సలాం!
ఒలింపిక్స్కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్ నినో సాలుక్వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్ ఇయాన్ మిల్లర్ కూడా 10 ఒలింపిక్స్లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్కు దూరంగా ఉన్నాడు. 2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!
ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్ ప్లాన్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్ వెయిట్ లాస్ ఫిట్నెస్ కొచ్చ్ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!. జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్లో ఎక్కువ వర్కౌట్లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్ వ్యాయామాలు జోష్ఫుల్గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట. దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్లో ఒక్కో ఫ్రూట్ వెరైటీని యాడ్ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది. కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. పైగా స్పీడ్గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..! View this post on Instagram A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee) (చదవండి: ఆ ఒక్క ఎక్క్ర్సైజుతో..అధిక బరువుకి చెక్ పెట్టిన నర్సు!) -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
ఆ గుహలోకి వెళ్తే అంతే సంగతులు..!
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్స్క్కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
NRI: జాలి చూపడమే అతని తప్పైంది!
న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రయం లేని వ్యక్తిపై జాలి చూపించిన క్రమంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన ఆ వ్యక్తి.. భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్లో పార్ట్ టైమ్ క్లర్క్గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్ వద్ద అతనికి జూలియన్ ఫాల్కెనర్ అనే వ్యక్తి కన్పించాడు. అతడిని చూస్తే నిలువ నీడలేనట్టు కనిపించాడు. దీంతో చలించిపోయిన వివేక్ మానవత్వంతో అతన్ని చేరదీశాడు. రెండు రోజుల పాటు తినడానకి ఫుడ్ ఇస్తూ సాయం చేశాడు. ఇక.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో వేసుకొనేందుకు తనవద్ద ఉన్న జాకెట్ను కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న వివేక్.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. వివేక్ మాటలను అతను పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జూలియన్ తన వెంట ఉన్న సుత్తితో విచక్షణారహితంగా వివేక్ తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వివేక్ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జూలియన్ మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివేక్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: మాల్దీవుల పర్యాటకం.. తగ్గిన భారత టూరిస్టులు -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్ఫోన్కు అతుక్కుపోయేలా చేసే టిక్టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..
పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్ టిక్టాక్ వీడియో, టీవీ షోలు వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్లతో సాగిన గాథ వారిది. అసలేం జరిగిందంటే..యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్టాక్ వీడియో ఆమెకు చేరింది. వీడియోలో ఉన్న అమ్మాయి తన కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు. ఎందుకు వేరయ్యారంటే.. అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది. ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్ ఆదేశాలు జారీ
అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు. జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. -
అమ్మ కుట్టీ అమ్మ కుట్టీ... వెళ్దాం ఛలో ఎలి.కుట్టీ
అవసరమే కాదు ఆసక్తి కూడా కొత్త భాషను దగ్గర చేస్తుందని మలయాళ భాషను గడగడా మాట్లాడే ఎలిజెబెత్ కీటోన్ను చూస్తే అర్థమవుతుంది. జార్జియా (యూఎస్)కు చెందిన ఎలిజబెత్ ఇంగ్లీష్ టీచర్. కొత్త భాషలు నేర్చుకోవడం అంటే ఇష్టం. సౌత్కొరియా ఆ తరువాత యూఏఈలో ఇంగ్లీష్ పాఠాలు చెప్పింది. దుబాయ్లో ఉన్నప్పుడు మలయాళీ కుర్రాడు అర్జున్తో ఎలిజబెత్కు పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లయింది. ఇక అప్పటి నుంచి శ్రీవారి మాతృభాషను నేర్చుకోవాలని డిసైడై పోయింది ఎలిజ బెత్. ‘30 రోజుల్లో మలయాళం’లాంటి ఔట్డేటెడ్ పుస్తకాలు, మార్గాలు తప్ప కొత్తవి కనిపించలేదు. దీంతో కోళికోద్లో ఉన్న ఒక టీచర్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మలయాళం భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తనదైన స్టైల్లో సొంతంగా నోట్స్ రాసుకొని, డూడుల్స్ తయారు చేసుకొని మలయాళ భాషపై పట్టు సంపాదించింది. ‘ఎలి.కుట్టీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఆసక్తి ఉన్నవారికి మలయాళం నేర్పుతోంది. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్పోర్టుకు చేరుకున్న ట్రంప్ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
ట్రంప్ అరెస్ట్.. మగ్షాట్తో చరిత్ర సృష్టించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్న నేపథ్యంలో స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. నిబంధనల ప్రకారం పోలీసులు ట్రంప్ను అరెస్ట చేసి జైలులోకి తీసుకెళ్లారు. ట్రంప్కు జైలు అధికారులు P01135809, ఖైదీ నెంబర్ కేటాయిచారు. పోలీసు రికార్డుల కోసం కెమెరా ముందు ఆయన ఫొటోను (మగ్షాట్) కూడా తీశారు. ఫుల్టన్ కౌంటీ రికార్డుల ప్రకారం ట్రంప్ ఎత్తు 6.3 అడుగులు. 97 కిలోల బరువు ఉన్నారు. ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 2లక్షల డాలర్ల విలువైన బాండ్ను(భారత కరెన్సీ ప్రకారం రూ.1.65 కోట్లు) సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. ఆ వెంటనే బెయిల్ రావడంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ఆయన జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్పై బయటకొచ్చారు. చదవండి: ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా ఆ దేశంలో దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. ఇక అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్షాట్) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఆయనపై ఇప్పటి వరకు నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. https://t.co/MlIKklPSJT pic.twitter.com/Mcbf2xozsY — Donald J. Trump (@realDonaldTrump) August 25, 2023 కాగా తన మగ్ షాట్ ఫోటోను ట్రంంట్ ట్విటరల్లో పోస్టు చేశారు. ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్గా మారింది.అయితే 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ను ట్విటర్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ యాజమాన్య పగ్గాలు ఎలాన్ మస్క్ తీసుకున్నా గత నవంబర్లో ట్రంప్పై బ్యాన్ తొలగించారు. కానీ ట్రంప్ ట్విటర్కు దూరంగా ఉంటూ వచ్చారు. నేడు అరెస్టు తర్వాత తొలిసారి తన ఖాతాలో మగ్షాట్ను పోస్టు చేశారు.. ‘ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూ లొంగను..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ను కేవలం 2గంటల్లో 4.2 కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల సార్లు రీట్వీట్ చేశారు. -
ట్రంప్పై మరో తీవ్రమైన అభియోగం
వాషింగ్టన్: రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని డొనాల్డ్ ట్రంప్పై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది. మరోసారి అధ్యక్షపీఠంపై కూర్చుకునేందుకు తహతహలాడుతున్న ట్రంప్పై అభియోగాలు నమోదవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ సోమవారం తన 41–చార్జ్ అభియోగాల పత్రంలో సంబంధిత వివరాలను పొందుపరిచింది. ట్రంప్తోపాటు మరో 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాలు ట్రంప్కు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు తోటి వ్యక్తులు కుట్ర పన్నారని జ్యూరీ పేర్కొంది. ఆగస్ట్ 25వ తేదీలోపు ఈ 19 మంది స్వచ్ఛందంగా సరెండర్ కావాలని ఫుల్టన్ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్ సోమవారం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్ మాజీ న్యాయవాది రూడీ గిలియానీ, శ్వేతసౌధం మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్, అధ్యక్షభవనం మాజీ న్యాయవాది జాన్ ఈస్ట్మన్, న్యాయశాఖ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ క్లార్క్ ఉన్నారు. రాజకీయ దురుద్దేశం: ట్రంప్ ‘ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభియోగాలను అధికార డెమొక్రటిక్ పార్టీ నేతలు సమర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ పన్నిన కుట్రను ఈ అభియోగాలు బట్టబయలుచేస్తున్నాయి’ అని సెనేట్ మెజారిటీ లీడర్ షూమర్, హౌజ్ మైనారిటీ లీడర్ హకీమ్ అన్నారు. -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..
విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్ సైనికుడు సీపీఎల్ లూథర్ హెర్షెల్ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్ 1న జరిగిన కొరియన్ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా. ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. కొరియన్ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్ సత్కారమని యూస్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. (చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..) -
భారత్కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్కు తిరిగివచ్చే ముందు అమృత్పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్గా ఉన్న అమృత్పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్, టాడ్జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్ఎన్ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్ఎన్ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్ఎన్ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్ఎన్ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
అమృత్పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్లో డ్రైవర్గా పని చేసే అమృత్పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్పాల్ను దుబాయ్ నుంచి పంజాబ్కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్పాల్ భారత్కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్ప్రీత్ సింగ్ అమృత్పాల్ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్ప్రీత్ సింగ్ అమృత్సింగ్ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్పాల్ బైక్పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్ప్రీత్ సింగ్ పంజాబ్లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు కుడిభుజం. పంజాబ్లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్పాల్ సింగ్కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్సింగ్పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్సర్కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్పాల్కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్పాల్కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్పాల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్కు తిరిగి వచ్చాడు. అమృత్పాల్ దుబాయ్ నుంచి పంజాబ్కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్దీప్ కౌర్ అమృత్పాల్ సింగ్ భార్య. బ్రిటన్కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్పాల్కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్పాల్పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్పాల్పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్లో కేసు -
ఫారిన్ ఏజెంట్ బిల్లుపై రణరంగంగా జార్జియా
తిబ్లిస్: జార్జియా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లు రణరంగానికి దారితీసింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని తిబ్లిస్లోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులకు, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జురాబ్ జపారిడ్జ్ సహా 66 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జురాబ్ను బాగా కొట్టినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. జార్జియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రకారం 20 శాతానికి పైగా విదేశీ నిధులు కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు తమని తాము విదేశీ ఏజెంట్లుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తారు. -
100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేస్కుంటుండగా కాల్పులు..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. జార్జియా రాష్ట్రం డౌగ్లాస్ కౌంటీలోని ఓ ఇంట్లో 100 మంది టీనేజర్లు కలిసి పార్టీ చేసుకుంటుండగా కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10:30-11:30 మధ్య ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీలో ఏదో గొడవ జరిగే కాల్పులు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అందరూ టీనేజర్లే ఉన్నారని, ఘటన సమయంలో పెద్దలు ఒక్కరైనా ఉన్నారో లేదో తెలియదని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు అయ్యాక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని చెప్పారు. కాల్పులు ఒక్కరే జరిపారా? లేదా ఎక్కువ మందికి ఇందులో ప్రమేయం ఉందా? తెలియాల్సి ఉందన్నారు. చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీ కన్నుమూత.. -
'స్లమ్డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్లో గోల్డ్ మెడల్
జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా యూరోపియన్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్(EURO 2023) విజేతగా నిలిచింది. అయితే ఆమె బ్లాక్బాస్టర్ సినిమా.. ఆస్కార్ విజేత స్లమ్డాగ్ మిలియనీర్ మ్యూజిక్తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్ చేయడం విశేషం. మధ్యలో బాలీవుడ్ సినిమా గలియోంకీ రాస్లీలా రామ్లీలాలోని సూపర్హిట్ సాంగ్ డోల్ బాజే పాట కూడా వినిపించడం విశేషం. భారతీయ సంప్రదాయమైన చీరకట్టుతో అనస్తాసియా గుబనోవా స్కేటింగ్ చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక అనస్తాసియా గుబనోవా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్షిప్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన యూరో స్కేటింగ్ చాంపియన్షిప్లో 199.1 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో స్విట్జర్లాండ్కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది. ⛸️Avrupa Artistik Patinaj Şampiyonası'nda kadınlarda altın madalya aşağıdaki enerjik ve harika serbest program performansıyla Anastasiia Gubanova'ya gitti. Kısa programı da zirvede tamamlayan Gubanova kariyerinin ilk Avrupa Şampiyonluğu'nu yaşadı. #EuroFigure pic.twitter.com/LlJCtc2SWu — Murat Taşkolu (@murattaskolu) January 28, 2023 చదవండి: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు కొట్టించుకుంది -
ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు!
జాగ్రత్తగా చూస్తే ఈ ఫొటోలో కొండశిఖరంపై ఒక కట్టడం కనిపిస్తోంది కదూ! కొండశిఖరంపై వెలసిన ఈ కట్టడం ఒక చర్చి. కొండశిఖరంపైకి ఎక్కి దీనిని చేరుకోవడానికి లోహపు నిచ్చెన మెట్లదారి మాత్రమే దిక్కు. ఇది జార్జియాలో ఉంది. ‘కాటస్కీ పిల్లర్’గా ప్రసిద్ధి పొందింది. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎలాంటి ఆధారాలు లేవు. తొలిసారిగా పద్దెనిమిదో శతాబ్దిలో జార్జియన్ ప్రిన్స్ వాఖుస్తి తన పుస్తకంలో ఈ నిర్మాణం గురించి ప్రస్తావించాడు. తర్వాత 1944లో అలెగ్జాండర్ జాపారిడ్జ్ అనే పర్వతారోహకుడు తన బృందంతో కలసి ఈ కట్టడాన్ని సందర్శించాడు. చాలాకాలంగా దీనిని ఎవరూ ఉపయోగించకుండా విడిచిపెట్టేశారు. అయితే, 1999 నుంచి వివిధ దేశాలకు చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. దీని నిర్మాణ శైలిని బట్టి, ఈ చర్చిని పదమూడో శతాబ్దిలో నిర్మించి ఉంటారని వారి అంచనా. -
1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం
న్యూయార్క్: పురావస్తు శాస్త్రవేత్తలు జార్జియాలో 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతాన్ని కనుగొన్నారు. టిబిలిసికి నైరుతి దిశలో సుమారు 100 కి.మీ దూరంలో ఒరోజ్మని గ్రామం వద్ద జరుపుతున్న తవ్వకాల్లో బయటపడింది. ఈ దంతాన్ని ఒక విద్యార్థి గుర్తించాడు. ఒరోజ్మని గ్రామం దమనిసికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో 1.8 మిలియన్ ఏళ్ల క్రితం మానవ పుర్రెలను 1990ల చివరిలోనూ, 2000ల ప్రారంభంలో కనుగ్నొన్నారు. ఈ సందర్భంగా జార్జియన్ నేషనల్ మ్యూజియంలోని పురావస్తు శాస్త్రవేత్త జార్జి కోపలియాని మాట్లాడుతూ....ఆ విద్యార్థి తవ్వకాలు జరపడానికి మ్యూజియం నుంచి వచ్చిన బృందానికి నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. ఆ సమయంలోనే పురాతన దంతాన్ని కనుగ్నొట్లు పేర్కొన్నారు. తాము ఈ దంతం విషయమై పాలియోంటాలజిస్ట్ని సంప్రదించామని, అతను కూడా దీన్ని 'హోమిన్ టూత్గా' నిర్ధారించాడని చెప్పారు. 2019 నుంచి తమ బృందం మళ్లీ ఒరోజ్మని వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించిదని జార్జికోపలియాన్ చెప్పారు. కానీ కోవిడ్-19 కారణంగా ఆ తవ్వకాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. తమ బృందం గతేడాది నుంచి ఈ తవ్వకాలు తిరిగి ప్రారంభించినట్లు తెలిపింది. అప్పటి నుంచి తమ బృందం చరిత్ర పూర్వంకు ముందు రాతి పనిముట్లు, అంతరించిపోయిన జాతుల అవశేషాలను కనుగొందని వెల్లడించారు. అంతేకాదు ఈ దంతం ఆధారంగా ఈ ప్రాంతంలో సంచరించే హోమినిన్ల జనాభా గురించి అధ్యయనం చేయగలగడమే కాకుండా తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. (చదవండి: వింత ఘటన ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఆకృతి) -
విడాకుల గురించి టిక్టాక్లో చెప్పిందని..హత్య చేసిన మాజీ భర్త!
ఇటీల ఏం జరిగిన ప్రతి విషయాన్ని సోషల్ మాధ్యమ్యంలో షేర్ చేయడం ఒక అలవాటైపోయింది జనాలకు. ఇవి ఒక్కోసారి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయనే స్ప్రుహ కూడా ఉండటం లేదు. అదీగాక వ్యూస్, ఫాలోవర్స్ మాయలో ఏ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వ్యక్తిగత విషయాలు గురించి చెప్పేటప్పుడూ కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీతో ఉండే వ్యక్తులకు అలా చెప్పడం నచ్చుతుందో లేదో తెలియదు. అందువల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక మహిళ సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత విషయాలను చెప్పి.. విగత జీవిగా మారింది. వివరాల్లోకెళ్తే...పాకిస్తానీ అమెరికన్ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించి వివాహం ఎందుకు విఫలమయ్యిందో, అందుకు దారితీసిని విషయాల గురించి సోషల్ మాధ్యమంలో షేర్ చేసింది. పైగా విడాకుల తీసుకున్న మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా వివరించింది. పైగా ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తనకు ఎదురైన కూడా పంచుకుంది. అంతే ఇది నచ్చిన ఆమె మాజీ భర్త ఆమెను చంపేందుకు రెడీ అయిపోయాడు. వాస్తవానికి సానియా ఖాన్ తన మాజీ భర్త రహెల్ అహ్మద్ ఇద్దరు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు చికాగోలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ఏమైందో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. దీంతో ఆమె టేనస్సీకి వెళ్లిపోదాం అనుకుంది. ఐతే ఆమె టిక్టాక్, ఇన్స్ట్రాగ్రాంలో మంచి యాక్టివిగ్ ఉంటుంది. తనకు ఆనందం కలిగినా, బాధ కలిగినా ఆ విషయాలను సోషల్ మీడియాలోని నెటిజన్లతో షేర్ చేసుకోవడం అలవాటే. అలానే ఆమె టేనస్సీకి బయలుదేరే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయాలన్ని వివరిస్తూ...పోస్ట్లు పెట్టింది. పైగా తనలాంటి వాళ్ల కోసం పాటుపడతానని, సమాజం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి అవమానాన్నైనా తట్టుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అంతే ఇది తెలుసుకున్న జార్జియాలో ఉన్న ఆమె మాజీ భర్త చికాగోలో ఉన్న తన వద్దకు వచ్చి తుపాకితో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అహ్మద్ తల్లిదండ్రలు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఏదీ ఏమైన కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. (చదవండి: అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...) -
Chess Olympiad: ఎదురులేని భారత్
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు వరుసగా ఆరో విజయంతో టాప్ ర్యాంక్లోకి వచ్చింది. జార్జియాతో బుధవారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ 3–1తో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నానా జాగ్నిద్జెతో జరిగిన గేమ్లో హంపి 42 ఎత్తుల్లో...లెలా జావఖిష్విలితో గేమ్లో వైశాలి 36 ఎత్తుల్లో గెలిచారు. నినో బాత్సియాష్విలితో గేమ్ను హారిక 33 ఎత్తుల్లో... సలోమితో జరిగిన గేమ్ను తానియా 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ‘బి’ 3–1తో నెగ్గగా... చెక్ రిపబ్లిక్తో మ్యాచ్ను భారత్ ‘బి’ 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’–ఉజ్బెకిస్తాన్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’కాగా... భారత్ ‘బి’ 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం ఏడో రౌండ్ మ్యాచ్లు జరుగుతాయి. -
గ్రేట్ వారియర్.. గ్రామసింహంపై ప్రశంసల వర్షం
కొన్ని సందర్భాల్లో జంతువుల చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనుషులు ఆలోచనతో చేయలేని పనులను సైతం జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని చేసి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలోని రోడ్డు ఆ సమయంలో రద్దీగా ఉంది. వాహనాలు బిజీ బిజీగా రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది చిన్నారులు రోడ్డు దాటడానికి సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ పెంపుడు కుక్క అక్కడికి వచ్చి వారికి సాయం అందించింది. రోడ్డును బ్లాక్ చేసి వాహనాలను ఆపి.. పిల్లలు రోడ్డుదాటేలా చూసుకుంది. చిన్నారులు రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో డాగ్.. క్రాసింగ్ గార్డ్లాగా విధులు నిర్వహించింది. కార్లు ముందుకు కదులుతుంటే కుక్క గర్జిస్తూ వాటిని ఆపింది. ఈ క్రమంలో చిన్నారులు సురక్షితంగా రోడ్డు దాటారు. అనంతరం కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. వీడియో ఆఫ్ ది డే, గ్రేట్ వారియర్ అంటూ కామెంట్స్ చేశారు. This Will Make Your Day.❤️ pic.twitter.com/5MFETG4OA9 — Awanish Sharan (@AwanishSharan) July 30, 2022 ఇది కూడా చదవండి: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు! -
అప్పటి వరకు యుద్దం ఆగదు.. బాంబ్ పేల్చిన మాజీ ప్రధాని
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా, ఈయూ సహా కొన్ని దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సైతం ఆంక్షలను లెక్కచేయకుండా దాడులను ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ మిత్ర దేశాలను సైతం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రష్యా మాజీ ప్రధాని, రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై విధించిన అద్భుతమైన ఆంక్షలతో ఉక్రెయిన్లో పరిస్థితులపై మార్పును ఆశించవద్దని తెలిపారు. పుతిన్ తన లక్ష్యాలను సాధించే వరకు సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, శనివారం రష్యా బలగాలు కీవ్ సహా ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే 2008లో జరిగిన జార్జియా-రష్యా దాడిని మిద్వెదెవ్ మరోసారి గుర్తు చేశారు. అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంక్షలు అనేవి తాత్కాలికమంటూ బాంబ్ పేల్చారు. -
దారుణ అవమానాలు.. ఎక్కువ కాలం బతకను: మాజీ అధ్యక్షుడు
త్బిల్సి: ఎన్నికల్లో మోసానికి పాల్పడి.. విజయం సాధించారనే ఆరోపణల నేపథ్యంలో జార్జియా అధ్యక్షుడు సాకాష్విలిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. జైలులో ఉన్న సాకాష్విలి.. తన అరెస్ట్కు వ్యతిరేకంగా జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 39 రోజులుగా ఆయన ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి జైలు సిబ్బందిపై సంచనల ఆరోపణలు చేశారు. జైలులో తనను తిడుతున్నారు.. కొడుతున్నారని.. త్వరలోనే చనిపోతానేమో అని భయమేస్తుంది అన్నారు. సాకాష్విలి 2004-2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల్లో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా సాకాష్విలి మాట్లాడుతూ.. ‘‘జైలు సిబ్బంది నన్ను బూతులు తిట్టారు.. నా మెడ మీద కొట్టారు.. జుట్టు పట్టుకుని నేల మీద పడేసి లాక్కెళ్లారు. ఇలానే కొసాగితే.. త్వరలోనే నేను చనిపోతానని భయమేస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలులో తన పరిస్థితిని వివరిస్తూ.. తన లాయర్కు లేఖ రాశాడు. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి పేర్కొన్నాడు. (చదవండి: 400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు ) ప్రస్తుతం ఈ లేఖ జార్జియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు. సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహాదర దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాకాష్విలికి అత్యవసరంగా హైటెక్ క్లినిక్లో చికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. (చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?) సాకాష్విలికి అంతర్లీన రక్త రుగ్మత ఉన్నందున అతని నిరాహారదీక్ష ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా మారినందున అతనికి మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సాకాష్విలిని జైలు ఆసుపత్రికి తరలించడాన్ని ఉక్రెయిన్ నిరసించింది, ఈ చర్య "అదనపు నష్టాలను సృష్టిస్తుంది" అని పేర్కొంది. చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే.. -
అట్లాంటా, డల్లాస్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
అట్లాంటా, డల్లాస్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అమెరికాలోని అట్లాంటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ స్వాతి కులకర్ణి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇండియన్ అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ (ఐఏసీఏ) 50వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి పూజా బాత్రా, లిసా క్యూపిడ్, నికోల్. కౌంటీ కమిషనర్లతో పాటు లూసీ కాంగ్రెస్ సభ్యుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశభక్తి గీతాల ఆలాపన, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. డల్లాస్లో భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకులను అమెరికాలోని డల్లాస్లో ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అమెరికా, భారత జెండాలను పట్టుకుని వందేమాతరం, జైహింద్ నినాదాలు చేశారు. -
జార్జియాలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
అట్లాంటా : జార్జియాలోని కమ్మింగ్ సిటీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జార్జియాలోని అట్లాంటా రిక్రియేషన్ క్లబ్లో ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఇందులో 11 నుంచి 19 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహిస్తున్నారు. కోవిడ సంక్షోభం తర్వాత జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి టోర్నమెంట్ ఇదే. అట్లాంటా రిక్రియేషన్ క్లబ్ అనేది ఉత్తర అట్లాంటా జార్జియన్లకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ ప్లే మరియు కోచింగ్ అరేనాతో సేవలందించే ప్రీమియం సౌకర్యం. ఇక్కడ జరుగుతున్న పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
Tokyo Olympics: ప్రపంచ రికార్డులను ఎత్తేశాడు
జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె సంచలన ప్రదర్శన చేశాడు. బుధవారం పురుషుల +109 కేజీల వెయిట్లిఫ్టింగ్లో లాషా... తన ఆకారానికి తగ్గట్టే బరువులను ఇట్టే ఎత్తేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు... 176 కేజీల బరువుతో అజానుబాహుడైన లాషా... మొత్తం 488 కేజీలు (స్నాచ్లో 223+క్లీన్ అండ్ జెర్క్లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన అలీ డెవౌడి (ఇరాన్) కంటే లాషా 47 కేజీలు ఎక్కువగా ఎత్తడం విశేషం. ఒలింపిక్స్లో లాషాకు ఇది రెండో స్వర్ణం. 2016 రియోలో +105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అతడు బంగారు పతకంతో మెరిశాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్లో 200+క్లీన్ అండ్ జెర్క్లో 241)తో రజతాన్ని.... మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్లో 190+క్జీన్ అండ్ జెర్క్లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు
సాక్షి, వెబ్డెస్క్: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్ సీన్ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్ మర్డర్ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి... రాణి కేతేవాన్ కథ ఏంటంటే.. సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. గోవాలో రాణి కేతేవాన్ అవశేషాలు ఈ క్రమంలో రాణి కేతేవాన్ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్ గోవా సెయింట్ అగస్టీనియస్ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 22 వేల డీఎన్ఏలతో పోల్చారు తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్లో 22,000 కంటే ఎక్కువ డీఎన్ఏ సీక్వెన్స్లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్ను హత్య చేసినట్లు తెలిపారు. -
గోల్ఫ్ కోర్టులో కాల్పులు.. ముగ్గురి దుర్మరణం
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జార్జియాలోని ఓ గోల్ఫ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కెన్నెసాలోని పైన్ట్రీ కౌంట్రీ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జెన్ సిల్లర్ అనే ఆటగాడితో పాటు మరో రెండు మృతదేహాలను కాబ్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 41 ఏళ్ల సిల్లర్ తలలో బుల్లెట్ దూసుకుపోయిందని.. దీంతో అక్కడిక్కడే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఇక దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి పాల్ పియర్సన్ అనే వ్యక్తితో పాటు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాళ్ల శరీరంలోనూ బుల్లెట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దుండగుడి కోసం ప్రస్తుతం తనీఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సిల్లర్ మృతిపట్ల గోల్ఫ్ అసోషియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు గోఫండ్మీ పేజీ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు. -
ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి?
మనం కొన్ని సార్లు వార్తలలో ఒక్క రోజులో కోటీశ్వరడు అయినట్లు వచ్చిన వార్తలను ఇప్పటి వరకు చదివి ఉంటాం. కానీ, జార్జియా జరిగిన ఈ సంఘటన గురుంచి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. సాదరణంగానే మన లాగే క్రిస్ విలియమ్స్ ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. అలా ఒక రోజు ఉదయం 9 గంటలకు లేవగానే విలియమ్స్ తన ఫోను చూసి షాక్కు గురయ్యాడు. నేనేమైనా కల కంటున్నానా అని తన కళ్లు నులిమి చూసుకున్నాడు. క్రిప్టోకరెన్సీ రాకెట్ బన్నీలో 20 డాలర్లు పెట్టుబడి పెట్టిన క్రిస్ రాత్రికి రాత్రే ట్రిలియనీర్ అయిపోయాడు. జార్జియాలోని మాంచెస్టర్లో చదువుకుంటున్న నర్సింగ్ పాఠశాల విద్యార్థి క్రిస్ విలియమ్స్ గత ఎనిమిది నెలల నుంచి క్రిప్టోకరెన్సీపై అధ్యయనం చేస్తున్నాడు. గత వారం రాకెట్ బన్నీ అనే క్రిప్టోకరెన్సీలో 20 డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఈ విలువ ఆ మరుసటిరోజుకు 1.4 ట్రిలియన్లకు పెరిగింది. మన కరెన్సీలోకి మార్చుకుంటే దీని విలువ సరిగ్గా రూ.10,37,49,10,00,00,000. అక్షరాల దీని విలువ రూ.కోటి కోట్లకు పైమాటే. కాసేపటికి తేరుకున్న విలియమ్స్ ఆ మొత్తాన్ని వేరే వాలెట్లోకి మార్చుకునేందుకు ప్రయత్నించాడు. అది అదే ధరను ఇతర వాలెట్లో చూపించడం లేదని తాను ఇన్వెస్ట్ చేసిన కాయిన్బేస్ వాలెట్ను సంప్రదించాడు. తాము ఈ సమస్య పరిష్కారానికి రాకెట్ బన్నీని సంప్రదిస్తున్నామని జవాబు వచ్చింది. చాలా రోజులు గడిచిన ఎటువంటి సమాధానం రాకపోవడంతో సలహా కోసం ఈ విషయాన్ని విలియమ్స్ ట్విటర్లో నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. క్రిప్టోకరెన్సీలపై ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్నూ ట్యాగ్ చేసి, సలహా ఇవ్వాలని కోరాడు. తాను పెట్టుబడి పెట్టిన క్రిప్టోకరెన్సీ స్కామ్ కాకపోవచ్చని విలియమ్స్ భావిస్తున్నాడు. అతడు ఇంత మొత్తంలో వచ్చిన డబ్బును ఎన్నడూ ఖర్చు చేయలేనని కాబట్టి నేను దానిని మంచి పనుల కోసం వినియోగిస్తాను అని విలియమ్సన్ చెప్పాడు. ఆ డబ్బుతో కుటు౦బాన్ని మంచిగా చూసుకోవడం, సహోదరీలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు ఉచిత వైద్య క్లినిక్లను ప్రారంభిస్తానని క్రిస్ చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులకు కాయిన్ బేస్ యాప్ విలియమ్సన్ ఖాతాను స్తంభింపచేసింది. దీంతో అంత మొత్తంలో వచ్చిన ఆ నగదును కాయిన్ బేస్ నుంచి ఉపసంహరించుకోలేడు, ఎటువంటి వర్తకం చేయలేడు. ఒక వార్త కథనం ప్రకారం కాయిన్ బేస్ ఈ సంఘటన గురుంచి వివరించింది. అదే రోజు జార్జియాలోని జాస్పర్ లో నివసిస్తున్న అతని స్నేహితుడు అదే నాణెం కొన్నాడు. కానీ అతడికి అంత మొత్తం నగదు జమ కాలేదు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం వల్ల విలియమ్సన్ ఖాతాలో అంతా మొత్తం సంపద జమ అయినట్లు పేర్కొంది. -
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. -
దొంగకే జాబ్ ఆఫర్ చేసిన రెస్టారెంట్ యజమాని
జార్జియా: అమెరికాలోని జార్జియాలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కార్ల్ వాలెస్ తాళం కాదు ఏకంగా జాబే ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దీ రోజుల క్రితం ఓ తెల్లవారు జామున 4 గంటలకు ఓ దొంగ అద్దాలు పగలగొట్టి లోపలికి దూరాడు. అయితే అతనికి ఏమీ దొరక్క అక్కడే ఉన్న క్యాష్ బ్యాక్సు ఎత్తుకెళ్లాడు. వాడో తింగరోడులాగున్నాడు ఎందుకంటే అది ఖాళీదట. ఉదయాన్నే రెస్టారెంట్కు వచ్చిన ఆ యజమానికి ముందు విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత అతన్ని చూసి విపరీతమైన జాలీ వేసింది. పాపం అతనికి ఎంత కష్టం వచ్చిందో, అందుకే చివరకు క్యాష్ లేని బాక్సు కూడా ఎత్తుకెళ్లాడని చెబుతూ ‘నాయనా మా రెస్టారెంట్లో జాబ్ కోసం దరఖాస్తు చేసుకో జాబ్ ఇస్తాను. నువ్వే చేసే దొంగతనం కన్నా ఇది చాలా మంచి పనేగా’ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. పోలీసులకు భయపడి రాడేమో అని ఫిర్యాదు కూడా ఇవ్వను అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టుకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ తింగరి దొంగ మాత్రం స్పందించనేలేదట. చదవండి: వాట్సాప్ వినియోగదారులకి సీఈఆర్టీ హెచ్చరిక -
‘జార్జియా’కు పయనమైన హీరో విజయ్
జార్జియా ట్రిప్ ప్లాన్ చేశారు హీరో విజయ్. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనేందుకే విజయ్ జార్జీయా ప్రయాణం అయ్యారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్న్ దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. చదవండి: ఓటు వేసిన హీరో విజయ్.. బిల్డప్ అంటూ ట్రోల్స్ విజయ్తో రొమాన్స్ చేయనున్న బుట్ట బొమ్మ! -
తుపాకీ మరణాలు ఆగేదెన్నడు?
గత బుధవారం ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు వద్ద జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో 9 సంవత్సరాల పాపతోపాటు నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. దానికి కొద్దిరోజుల ముందు కొలరాడో సరుకుల దుకాణంలో పదిమంది, అట్లాంటా ప్రాంతంలోని మసాజ్ కేంద్రంలో 8 మంది వ్యక్తులు దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. 1975 నుంచి అమెరికాలో జరిగిన ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలలో మరణాలు (15 లక్షల మంది), అమెరికా స్వాతంత్య్ర యుద్ధ కాలం నుంచి ఆ దేశ చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో సంభవించిన మరణాలను (14 లక్షల మంది) మొత్తంగా కలిపి చూసినా సరే అమెరికాలో తుపాకీ కాల్పుల వల్లే ఇంకా ఎక్కువమంది ప్రజలు మరణించారని సమాచారం. ఈ కాల్పుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఒక ఏడాదిలోపే నాలుగేళ్ల పిల్లలను 80 మందిని తుపాకులు పొట్టన బెట్టుకుంటున్నాయి. అదే సమయంలో 50 మంది కంటే తక్కువగానే పోలీసు అధికారులు కాల్పుల్లో చనిపోతున్నారు. భారీ కాల్పులకు ఉపయోగపడే తుపాకుల పట్ల చాలామందికి ఆకర్షణ ఎక్కువ. గతంలో అమెరికన్లు వేటాడటం కోసం ఉపయోగించే తుపాకులు నేరాలకు ఎన్నడూ వాడేవారు కాదు. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అంతగా ప్రమాదం కలిగించని ఆయుధాల స్థానంలో మిలటరీ ఉపయోగించే సెమీ–ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే ఏఆర్–15 లేదా ఏకే–47 వంటి మారణాయుధాలు వచ్చి చేరుతున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని కోరుకున్నప్పుడు మారణాయుధాలే వ్యక్తుల ఎంపికగా మారుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్లో ఇపుడున్న పరిస్థితుల్లో తుపాకుల నిరోధక చట్టం వంటిది తీసుకురావడం అసాధ్యం, అసంభవమే అని చెప్పాలి. ఉదారవాదులు పదేళ్లపాటు మారణాయుధాలపై నిషేధించాలని కోరుతూ వచ్చారు కానీ అది ప్రాణాలను కాపాడినట్లు బలమైన సాక్ష్యం కనిపించడం లేదు. కానీ ఏఆర్–15 ఒక సాంప్రదాయిక చిహ్నంగా మారిపోయింది కాబట్టే ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా మార్కెట్లోకి వస్తున్న ఈ మారణాయుధాలను (వీటినే అమెరికాలో దెయ్యపు తుపాకులు అంటారు) తన కార్యనిర్వాహక ఆదేశం ద్వారా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అరికట్టవచ్చు. ఎందుకంటే వీటిలో చాలావరకు పూర్తి తయారీ కాని తుపాకులుగానే ముద్రపడుతూ బయటికి వస్తున్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన తుపాకీ హింసలపై నిపుణుడు డాక్టర్ గరెన్ వింటెముట్ దీనిపై జోక్ చేస్తూ ‘దెయ్యపు తుపాకులను సొంతం చేసుకున్నారు. వాటిని కనిపెట్టడం అసాధ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. జాతీయవాదులు దీన్ని సాకుగా తీసుకుని ఈ ఘోస్ట్ గన్స్ నుంచి రహస్యంగా మారణాయుధాల తయారీకి పూనుకుంటున్నారు. గత సంవత్సరం అలాంటి తుపాకీతోనే అతివాద ఉద్యమ మద్దతుదారు నిఘా అధికారిని కాల్చి చంపాడు. పోతే మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మార్ని అపహరించాలని ప్రయత్నించిన వ్యక్తి కూడా ఈ ఘోస్ట్ గన్నే కలిగి ఉండటం గమనార్హం. 2019లో ఒక్క సంవత్సరంలోనే 10 వేలకు పైగా దెయ్యపు తుపాకులను నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అధ్యక్షుడు బైడెన్ ఈ ఘోస్ట్ గన్స్ ప్రమా దాన్ని తగ్గించడానికి వెంటనే కార్యనిర్వాహక ఆదేశాన్ని ఇవ్వడం మంచిది. ఈ తుపాకులను ఎక్కడెక్కడ నేరాల్లో ఉపయోగించారో డేటాను సేకరించాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం తుపాకుల నియంత్రణలో ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు కూడా అమెరికాలో తుపాకీ మరణాలను అంత సులభంగా తగ్గించలేవు. కానీ తుపాకుల నిషేధం దిశగా తీసుకునే కనీస చర్యలు కూడా అమెరికా సమాజాన్ని ఎంతో కొంత సురక్షితంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు.. వ్యాసకర్త: నికోలస్ క్రిస్టాఫ్ అమెరికన్ జర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత -
ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే..
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు జీవరాశులే కాదు ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు విశ్వరూపం దాల్చి భూమి కూడా ఆవిరైపోతుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ స్టడీ మాత్రం జీవరాశులకు అంత టైంలేదని అంటోంది ఉన్నది కేవలం వంద కోట్ల ఏళ్లే అని హెచ్చరిస్తోంది! హమ్మయ్య.. వందకోట్ల ఏళ్లు ఉంది కదా.. ఫర్వాలేదులే అనుకుంటున్నారా? మరి ఇదంతా ఎలా జరగబోతోందనేది తెలుసా?.. విశ్వంలోని అన్ని గ్రహాలతో పోలిస్తే భూమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మనం బతికి ఉండటానికి అత్యవసరమైన ఆక్సిజన్ వాయువుతో కూడిన వాతావరణమే. గాలిలో ఆక్సిజన్ ఉండేది 20 శాతమే అయినా.. అది లేకుంటే ప్రాణకోటి మనుగడ సాగించలేదు. అలాంటి ఆక్సిజన్ పరిస్థితిపై జార్జియా టెక్, టోహో యూనివర్సిటీలు సంయుక్తంగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. భూమ్మీది ఆక్సిజన్ వంద కోట్ల ఏళ్లలో మాయమైపోతుంది. ఈ శాస్త్రవేత్తలు భూవాతావరణం, జీవ, భౌగోళిక పరిస్థితులన్నింటినీ సిమ్యులేట్ చేసి భూమి భవిష్యత్తును చూసే ప్రయత్నం చేశారు. సూర్యుడి వెలుగులో వచ్చే మార్పులు.. గాల్లోంచి నీటిలోకి, ఆ తరువాత రాయిలోకి చేరే క్రమంలో ఆక్సిజన్లో వచ్చే మార్పులు వంటివి పరిశీలించి ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాల్లో కొన్నింటిపై ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిగినా.. తాజా పరిశోధన మరింత స్పష్టంగా జరిగింది, సంక్లిష్టమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. మొత్తంగా సుమారు 110 కోట్ల ఏళ్ల తరువాత భూ వాతావరణంలోని ఆక్సిజన్ శరవేగంగా తగ్గిపోవడం మొదలవుతుందీ అని శాస్త్రవేత్తలు తేల్చారు. వయసు పెరుగుతున్న కొద్దీ సూర్యుడిలోని ఇంధనం ఖర్చవడం ఎక్కువై, ప్రకాశం పెరిగిపోవడం దీనికి కారణమవుతుందని అంచనా వేశారు. భూ ఉపరితలం బాగా వేడెక్కి, వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ను ముక్కలు చేస్తుందని, దానివల్ల భూమ్మీద పచ్చదనం అన్నది లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. పచ్చదనం లేకుంటే మొక్కలు, చెట్లు వదిలే ఆక్సిజన్ తగ్గిపోతుందని గుర్తు చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే.. భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతుండగా.. దాదాపు 240 కోట్ల ఏళ్ల క్రితమే వాతావరణంలోకి ఆక్సిజన్ వచ్చి చేరింది. మొక్కల మాదిరిగా అప్పట్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు కిరణ జన్య సంయోగ క్రియ సాయంతో ఆక్సిజన్ను విడుదల చేశాయని.. తరువాత మొక్కలు పుట్టుకొచ్చి వాతావరణంలో ప్రాణవాయువు మోతాదు పెరిగిందని అంచనా. ఆక్సిజన్ పెరిగిన తర్వాతే ఏకకణ జీవుల స్థానంలో బహుకణ జీవులు, తర్వాత ఇతర ప్రాణులు ఆవిర్భవించాయి. సౌర కుటుంబానికి ఆవల జీవం ఆనవాళ్లు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. సూర్యుడి లాంటి నక్షత్రం నుంచి తగినంత దూరంలో (మరీ చల్లగాగానీ.. మరీ వేడిగా కానీ లేని) ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. ఈ సమయంలో పలు కీలక అంశాలను పరిశీలించాలని తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆక్సిజన్ మొత్తం నశించిన తర్వాత వాతావరణంలో పేరుకుపోయే మిథేన్ వాయువు కీలక ఆధారాల్లో ఒకటని అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. శనిగ్రహానికి ఉన్న ఉపగ్రహం టైటాన్లో ఇప్పుడు కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ లెక్కన అక్కడ ఎప్పుడో ప్రాణికోటి ఉండే ఉంటుందన్న అంచనాలూ ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
జార్జియాలో తలకిందులైన పరిస్థితి
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అందనంత దూరంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ జార్జియా, నెవెడాలోనూ దూసుకుపోతున్నారు. దీంతో మరోసారి అగ్రరాజ్య పగ్గాలు చేపట్టాలన్న ట్రంప్ గెలుపు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. కాగా జార్జియా(16)లో ఇప్పటికే 99శాతం ఓట్లు లెక్కింపు పూర్తైంది. ఇక ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే జార్జియా, బైడెన్కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ గనుక గెలుపు ఖాయమైతే అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్ సొంతమవుతుంది. ఇక నెవెడాలోనూ గెలిచినట్లయితే బైడెన్ 290 ఓట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. జార్జియా ఫలితం వెలువడినట్లయితే, ప్రపంచానికి ‘పెద్దన్న’, అమెరికా కాబోయే అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠకు నేడే తెర పడనుంది.( చదవండి: ‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్కు గట్టి కౌంటర్) -
పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే
వాషింగ్టన్: ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్కి కోర్టులో కూడా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ను సవాల్ చేశారు. ఈ క్రమంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ జార్జియా, మిచిగాన్ కోర్టులు ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేదు. ఇక నెవాడా మీదనే ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. జార్జియా కేసులో, ఆలస్యంగా వచ్చిన 53 బ్యాలెట్లను ఆన్-టైమ్ బ్యాలెట్లతో కలిపినట్లు ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. మిషిగాన్లో కూడా ఇదే కారణంతో ఓట్లను లెక్కించకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జార్జియాలోని ఒక ఉన్నత న్యాయమూర్తి జేమ్స్ బాస్ మాట్లాడుతూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి "ఎలాంటి ఆధారాలు లేవు".. ఈ పిటిషన్లని పరిగణలోకి తీసుకోలేం అని తెలిపారు. (చదవండి: ఎన్నికల ఫలితాలపై ట్రంప్ దావాలు భ్రమే..!) మిషిగాన్ కేసులో, న్యాయమూర్తి సింథియా కూడా స్టీఫెన్స్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. "యోగ్యతపై విజయం సాధించే అవకాశం ఉందని తెలుసుకోవడానికి నాకు ఎటువంటి ఆధారం లేదు." లాస్ వెగాస్తో సహా నెవాడా జనాభా కలిగిన క్లార్క్ కౌంటీలో ఓటింగ్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. ఇక మిచిగాన్, జార్జియా తీర్పులపై ట్రంప్ ప్రచార ప్రతినిధి స్పందించలేదు. అధ్యక్ష పదవిని నిర్ణయించగలిగే కొన్ని కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ నెవాడాలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిడిగాన్లో బిడెన్ విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి బైడెన్ కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన జో బైడెన్) లాస్ వెగాస్లో గురువారం ఒక విలేకరుల సమావేశంలో మాజీ నెవాడా అటార్నీ జనరల్ ఆడమ్ లక్సాల్ట్, ఇతర ట్రంప్ మద్దతుదారులు ముఖ్యంగా మాజీ పరిపాలనా అధికారి రిచర్డ్ గ్రెనెల్ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలానే ఎన్నికల్లో డెమొక్రాట్లు అవకతవకలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించలేదు. ఇక లక్సాల్ట్ మాట్లాడుతూ.. ‘లెక్కించబడిన ఓట్లలో చనిపోయిన ఓటర్లు ఉన్నారని మేము నమ్ముతున్నాము. మహమ్మారి సమయంలో క్లార్క్ కౌంటీ నుంచి బయటికి వెళ్లిన వేలాది మంది ప్రజల ఓట్లు లెక్కించారని మాకు తెలిసింది” అని తెలిపారు. అంతేకాక "సరికాని ఓట్ల లెక్కింపును ఆపమని" ఆదేశించాల్సిందిగా న్యాయమూర్తిని కోరడానికి ఫెడరల్ కోర్టులో దావా వేస్తామని అన్నారు. క్లార్క్ కౌంటీలోని ఎన్నికల అధికారి జో గ్లోరియా విలేకరులతో మాట్లాడుతూ సరికాని బ్యాలెట్లను ప్రాసెస్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం లేదని ఎన్నికల న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య
వాషింగ్టన్ : అమెరికాలో హైదరాబాద్కు చెందిన 37ఏళ్ల వ్యక్తి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. వివరాలు.. పాతబస్తీ చంచల్ గూడాకు చెందిన మహ్మద్ ఆరిఫ్ మోహియుద్దీన్ అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా జర్జియాలో నివాసముంటున్నాడు. అక్కడ స్థానికంగా కిరణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న ఆరిఫ్పై కొంతమంది దుండగులు దాడి చేసి అనంతరం కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరిఫ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చదవండి: కుటుంబంలో చిచ్చు రేపిన కలహాలు ఈ విషయాన్ని హైదరాబాద్లోని ఆరిఫ్ కుటుంబ సభ్యులకు జార్జియా పోలీస్ అధికారులు సమాచారం అందించారు. దీంతో తను, తన తండ్రి అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్ భార్య మెహ్నాజ్ ఫాతిమా వేడుకున్నారు. యూఎస్లో తమకు ఎలాంటి బంధువులు లేరని, భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.అదే విధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో మాట్లాడినట్లు, అతను అరగంటలో తిరిగి కాల్ చేస్తానని చెప్పినట్లు ఫాతిమా తెలిపారు. చదవండి: విషాదం: నీ వెంటే మేమూ! కానీ అతని నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని కొంత సమయానికి తన భర్తను ఎవరో పొడిచి చంపినట్లు బావ ద్వారా తెలిసిందన్నారు. జార్జియాలోని ఆసుపత్రిలో ఉన్న భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తోపాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఫాతిమాను యూఎస్ పంపించాలని కోరుతూ కుటుంబం తరపున లేఖ రాశారు. . -
నా అరెస్ట్ వారెంట్ని తినాలి!
జార్జియా: సాధారణంగా మేకలకు ఆకలేస్తే చెట్లు, మొక్కల ఆకులు తింటాయి. కానీ ఈ మేక ఏంటో అమెరికాలోని జార్జియాలో ఓ పోలీసు అధికారిణి కారులోకి దూరి ఆమెకు సంబంధించిన ఆఫీసు పేపర్లను తిన్నది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను డగ్లస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్బుక్లో ఫోస్ట్ చేసింది. ‘మేం నవ్వుకున్నాం. మీరు కూడా నవ్వుకుంటారని ఆశిస్తున్నాం’ అని కాప్షన్ జత చేసింది. డిప్యూటీ పోలీసు అధికారిణి జార్జియాలోని ఓ ఇంటికి వెళ్లి సివిల్ పేపర్లను ఇచ్చి కారు వద్దకు వచ్చేసరికి ఒక మేక తన కారులోకి దూరి ఆఫీసు పేపర్లను తింటూ కనిపిస్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతారు. ఆమె ఆఫీసు పనుల మీద పలు నివాసాలకు వెళ్లినప్పుడు కారు డోర్ వేయకుండానే వెళ్తారు. దీంతో కొన్ని సార్లు ఆమె కారులోకి వీధి కుక్కలు దూరడానికి ప్రయత్నించేవి. కానీ ఈసారి ఒక మేక తన కారులోకి దూరింది. ఈ వీడియోలో ఆమె మేకను కారు నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించడం, అది కాగితాలను నములుతూ ఎంతకూ వెళ్లకపోవడం చూడవచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండు రోజుల్లో మూడు లక్షల మంది వీక్షించగా, నాలుగు వేల లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోలీసు అధికారిణి తిరిగి రాకముందే నా అరెస్ట్ వారెంట్ను తినాలి’ అని ఆ మేక అనుకుంటుదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు యువతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆన్మోల్ నారంగ్ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్పాయింట్లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్పాయింట్లో నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న అన్మోల్.. ఓక్లహామ్లోని లాటెన్ ఫోర్ట్ సిల్లో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్పు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న నా కల శనివారంతో తీరింది. (చదవండి: భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం) నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించాను. ఇష్టమైన కెరీర్లో ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా జార్జియాలోని రోస్వెల్లో పుట్టిపెరిగిన అన్మోల్.. తన తాతయ్య(భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలిటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమొరియల్ సందర్శించిన అనంతరం వెస్ట్పాయింట్లో చేరాలన సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నెరవేర్చుకున్నారు.(హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన) -
జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి
జార్జియా : అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్(41) తన కుటుంబసభ్యులతో కలిసి ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్ రోడ్ సమీపంలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయింది. కాగా విమానం కూలిపోతున్న దృశ్యాలను ఒకరు తన ఫోన్లో బంధించారు. విమానం కూలడానికి ముందు ఆకాశంలోనే విమానానికి మంటలంటుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత విమానం కూలిపోవడం వీడియోలో కనిపించింది. ఈ ప్రమాదంలో షాన్ చార్ల్స్ సహా భార్య జోడిరే మోంట్, పిల్లలు జేస్ లామోంట్(6), ఎలిస్ లామోంట్(4)లతో పాటు పైలట్ లారీ రే ప్రూట్ (67) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ' రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్స్టన్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. -
మార్కెట్లో ఫైట్
తిబిలిసీ (జార్జియా రాజధాని) లోని ఫ్లీ మార్కెట్కు (పాత వస్తువులు, పురాతన వస్తువులు, సెకండ్హ్యాండ్ వస్తువులు దొరికే ప్రాంతం) వెళ్లారు ప్రభాస్. అక్కడ ఓ గొడవ జరిగింది. విలన్స్ను రఫ్ఫాడించారు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్ ముగిసింది. అక్కడి ఫ్లీ మార్కెట్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ ఫైట్ను చిత్రీకరించారని సమాచారం. ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జార్జియా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఎవరికివారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభాస్ కూడా స్వీయ గృహనిర్భందంలో ఉన్నారు. -
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్.. జార్జియాలో శివాణి
యాదాద్రి జిల్లా : భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు విద్యార్థులు సమాచారం అందించారు. దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. -
డార్లింగ్ ఈజ్ బ్యాక్
షూటింగ్ కోసం జార్జియాను చుట్టేశారు ప్రభాస్. కొన్ని ఫైట్లు, కూసిన్ని డైలాగ్స్తో జార్జియా షెడ్యూల్ను పూర్తి చేశారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్స్టోరీ తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల కోసం జార్జియా వెళ్లింది చిత్రబృందం. కరోనా ప్రభావం, వర్షాలను సైతం లెక్క చేయకుండా ఈ షెడ్యూల్ను పూర్తి చేశారు. ‘‘డార్లింగ్ (ప్రభాస్) మళ్లీ తన డార్లింగ్స్ (స్నేహితులు) దగ్గరకు వచ్చేశారు. జార్జియాలో షెడ్యూల్ను పూర్తి చేశాం. త్వరలోనే ఫస్ట్ లుక్ను విడుదల చేస్తాం’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు రాధాకృష్ణ. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేసి, టైటిల్ను ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆగేది లేదు
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కంగారులో ఉన్నారు. చాలా సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ప్రభాస్ కొత్త చిత్రం షూటింగ్ మాత్రం జార్జియాలో ముందు ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతోందని దర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ‘‘పది డిగ్రీల ఉష్ణోగ్రత, వర్షం, దానికి తోడు కరోనా కంగారు. వీటన్నింటి మధ్య కూడా మా సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాం. మా టీమ్ స్పిరిట్ని ఏదీ ఆపలేదు’’ అని రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడిక్ లవ్స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాధా కృష్ణ. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. -
లైవ్లో రిపోర్టర్తో వెకిలి చేష్టలు
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియాలో ఎన్బీసీ అనుబంధ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా రిపోర్టర్కు చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సవన్నా వంతెనపై ఇటివల జరిగిన మారథాన్ను అలెక్సా అనే రిపోర్టర్ లైవ్ రిపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మారథాన్లో భాగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రిపోర్టర్ వెనుక భాగంపై చెయ్యితో కొట్టాడు. అతని చేష్టలకు ఆ రిపోర్టర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అనూహ్య ఘటన నుంచి తేరుకుని కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏ మహిళా ఉద్యోగి ఇలాంటి చేదు అనుభవాన్ని చవిచూడాలనుకోదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఆమె సవన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే తన తప్పును గ్రహించిన థామస్ అనే ఆ ఆకతాయి ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నిజానికి తాను ఆమె భుజంపై తట్టాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఆమె వెనుక భాగంపై కొట్టానని చెప్పాడు. అయినప్పటికీ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు సవన్నా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు
అట్లాంటా: ప్రకృతిని పూజించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అట్లాంటాలో ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 5న సౌత్ ఫోర్సిత్ మిడిల్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అట్లాంటాలో వందల సంఖ్యలో నివసిస్తోన్న తెలంగాణ మహిళలు వేడుకకు తరలి వచ్చారు. వారంతా కలిసి గౌరీదేవీని తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరయ్యారు. అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. ఈ వేడుకలో పసి పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలకు 2,500మంది పైచిలుకు హాజరయ్యారు ఇక దసరా పండగను జమ్మి పూజతో ప్రారంభించారు. కోలాటాల కోలాహలంతో వేడుక కన్నులవిందుగా సాగింది. అందంగా తయారు చేసిన బతుకమ్మలకు టీడీఎఫ్ జ్యూరీ బహుమతులను అందజేసింది. టీడీఎఫ్ బృందం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాక, తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ పాత్రను గుర్తు చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నానమ్మ-మనుమరాలు థీమ్తో ఈ యేడాది తీసుకువచ్చిన ఆన్సైట్ బతుకమ్మకు విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించామని పేర్కొంది. టీడీఎఫ్ సంస్థ తెలంగాణలో చేపడుతోన్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ చేసిన ఈఐఎస్ టెక్నాలజీస్కు టీడీఎఫ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేడుకలు విజయవంతమవడానికి సహాయ సహాకారాలు అందించిన రాపిడ్ ఐటీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, పీచ్ క్లినిక్, ఫార్మర్స్ ఇన్సూరెన్స్, డ్రవ్ ఇన్ఫో, ఆర్పైన్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ, శేఖర్ పుట్ట రియల్టర్, సువిధ గ్రోసరీస్, పటేల్ బ్రదర్స్, ఏజెంట్ రమేశ్, ఓర్దశన్ టెక్నాలజీస్కు ధన్యవాదాలు తెలిపింది . ఈ ప్రోగ్రాంకు రఘు వలసాని ఫొటోగ్రఫీ, డీజే దుర్గం సౌండ్ సిస్టమ్ను అందించారు. సువిధ ఇండో పాక్ గ్రోసరీస్, బిర్యానీ పాట్, అడ్డా ఈటరీ వారు విందును ఏర్పాటు చేశారు. స్వప్న కట్ట, స్థానిక కళాకారులైన శ్రీనివాస్ దుర్గమ్లు వారి గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. -
ఘనంగా ‘తామా’ బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ, దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అమెరిన్డ్ సోలుషన్స్, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సమర్పణలో సెప్టెంబర్ 28న ఈ వేడుకలు జరిగాయి. ఇందులో సుమారు 1700 మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల బతుకమ్మలతో సందడి చేశారు. ప్రపంచమంతా నివసిస్తున్న తెలుగువారు అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగను భాద్రపదమాసములో జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరిగే ఈ పండుగ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని అన్ని ప్రాంతాల తెలుగువారు నిర్వహిస్తున్నారు. ఏడు వరుసల్లో రంగు రంగుల పూలను పేర్చి, పసుపుతో గౌరమ్మను బతుకమ్మపైన పెట్టి రెండు అగరుబత్తులను వెలిగించి.. అన్ని బతుకమ్మలను ఒక ప్రాంగణంలో పెట్టి మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఇండియా నుంచి ప్రముఖ జానపద గాయకులు డా. శ్రీనివాస లింగా హాజరయ్యారు. ఆయన తన పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. లింగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలోని యాసలతో పాటలు వినిపించడం కార్యక్రమానికే ఒక వన్నె తెచ్చింది. దాదాపు 500 మహిళలు 100 పిల్లలు లింగా పాటలతో రెండు గంటలపాటు బతుకమ్మ ఉత్సాహంగా ఆడి అనంతరం నిమజ్జనం చేశారు. ఈ బతుకమ్మ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహిరంచిన స్నేహ బుక్కరాయసముద్రం, కనకలక్ష్మి చింతల, గీత వేదుల విజేతలను ప్రకటించారు. గెలచిన విజేతలకు రమేష్ అన్నాబత్తుల, విజు చిలువేరు బహుమతులను అందజేశారు. ప్రియా బలుసు ట్రివియా బహుమతులు, మహేష్ పవార్ కోలాటం కర్రలు స్పాన్సర్ చేశారు. బతుకమ్మ ఆటకు ముందు ప్రేక్షకులకు ఒక ప్రశ్నావళి నిర్వహించి.. అందులో గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందచేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న శశికళ పెనుమర్తి, నీలిమ గడ్డమణుగు, శాంతి మేడిచెర్ల, శ్రీదేవి దాడితోట, హేమశిల్ప ఉప్పల, శ్రీవల్లి శ్రీధర్, దాస్యం మాధవిలు పెద్దలను, చిన్నారులను ఆకట్టుకున్నారు. బతుక్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల్లో అత్యంత మక్కువతో పనిచేసిన కార్యకర్తలు.. వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, బిల్హన్ ఆలపాటి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్, వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, విజు చిలువేరు, మహేష్ పవార్, రామ్ మద్ది, రామ్కిచౌడారపు, రమేష్ కోటికే, శ్రీనివాస్ కుక్కడపు, రమేష్ వెన్నెలకంటి, బాలనారాయణ మద్ద, శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వెంకట్ మీసాల, విజయ్ రావిళ్ల, సురేష్ దూలిపుడి, మోహన్ ఈదర, శ్రీనివాస్ గుంటక, సుధాకర్ బొర్రా, యశ్వంత్ జొన్నలగడ్డ, విజయ్ బాబు కొత్త, ప్రభాకర్ కొప్పోలు, నాగరాజు, నవీన్, సాయిప్రశాంత్, శుశ్రుత, సంతోష్ కిరణ్ వరద, సరితా కోటికే, శ్రీదేవి, విజయ్, శివ మాలెంపాటి, వినోద్ రెడ్డి తుపిలి, గౌరీధర్, సత్య నాగేందర్ గుత్తుల, రాజ్ కిరణ్ మూట తదితరులను వేడుకల్లో పాల్గొన్న మహిళలు అభినందించారు. ‘తామా’ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన అట్లాంటా ప్రజానీకం, స్పాన్సర్స్, ఆడియో లైటింగ్ అందించిన శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సురేష్ ఓలం, స్టేజీ, ఫోటోబూత్లను చక్కగా అలంకరించిన ఉదయ ఈటూరు, మీడియా సహకారం అందించిన టీవీ9 శివకుమార్ రామడుగు, టీవీ5, మనటీవీ ప్రవీణ్ పురం, టీవీ ఆసియా అంజలి చాబ్రియా తదితరులకు ‘తామా’ అధ్యక్షులు వెంకీ గద్దె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
మహిళను షాక్కు గురిచేసిన జింక
అమెరికాకు చెందిన లిండా టెన్నెంట్ అనే మహిళను ఓ జింక షాక్ గురిచేసింది. ఈ ఘటన బ్రన్స్విక్లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లిండా ఆఫీస్కు వెళ్తుండగా.. పెట్రోల్ పంప్ వద్ద తన కారును నిలిపారు. అందులో నుంచి బయటకు దిగిన తర్వాత.. అటుగా దూసుకొచ్చిన జింక ఆమె తలపై నుంచి దూకింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొద్దిసేపు అలానే నిలబడిపోయారు. తన తలకు ఏమైనా అయిందా అని చూసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీనిని లిండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తనకు చిన్న గాయం మాత్రమే అయిందని.. ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. తొలుత ఎవరైనా దొంగలు తనపై దాడి చేయడానికి వచ్చారమోననని అనుకున్నానని తెలిపారు. కానీ ఒక్కసారిగి జింక తన పై నుంచి దూకడంతో భయపడ్డట్టు చెప్పారు. -
వైరల్: పిల్లాడిని వెనకాల కట్టుకుని..
జార్జియా : విద్యార్థిని తన చదువుమీద శ్రద్ధ పెట్టడానికి ఓ ప్రొఫెసర్ చేసిన సాయం నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాకు చెందిన రమట సిస్సొకో సిస్సే.. లారెన్స్విల్లేలోని జార్జియా గ్విన్నెట్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. బయోలజీ, అనాటమీ, సైకాలజీ ఆమె సబ్జెక్టులు. కొద్దిరోజుల క్రితం అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థిని(చంటిపిల్లాడి తల్లి) పిల్లాడితో క్లాస్ రూంలోకి వచ్చి కూర్చుంది. బేబీ సిట్టర్ దొరకని కారణంగా బాబుతో క్లాస్కు రావాల్సి వచ్చిందని తన పరిస్థితిని రమటకు వివరించింది. పిల్లాడిని ఒళ్లో పెట్టుకుని బోర్డుపై ఉన్న అంశాలను నోట్స్ రాసుకోవటం విద్యార్థినికి ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన రమట పిల్లాడిని తన వీపు వెనకాల కట్టుకుని, పాఠం చెప్పటం మొదలుపెట్టింది. ఇలా మూడు గంటల పాటు పిల్లాడిని వీపు వెనకాల ఉంచుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పింది. రమట కూతురు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా దానికి విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు 57వేల లైకులు సంపాదించుకుంది. -
బజరంగ్ పసిడి పట్టు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాది నాలుగో స్వర్ణ పతకం సాధించాడు. జార్జియాలో జరుగుతున్న తిబిలిసి గ్రాండ్ప్రి టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్ తన టైటిల్ను నిలబెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో బజరంగ్ 2–0 పాయింట్ల తేడాతో పీమన్ బిబ్యాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది డాన్ కొలోవ్–నికోలా ప్రెటోవ్ టోర్నీలో, ఆసియా చాంపియన్షిప్లో, అలీ అలియెవ్ టోర్నీలో బజరంగ్ స్వర్ణ పతకాలు సాధించాడు. 90 సెకన్లలో సుశీల్ ఓటమి...: బెలారస్లో జరుగుతున్న మెద్వేద్ రెజ్లింగ్ టోర్నీలో భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ కేవలం 90 సెకన్లలో చేతులెత్తేశాడు. పురుషుల 74 కేజీల విభాగం ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్లో బెక్జోద్ అబ్దురఖ్మోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ ఓడిపోయాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో తొలి రౌండ్లో ఓడిపోయిన తర్వాత సుశీల్ పాల్గొంటున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
వెరైటీ ఫొటోషూట్..కంగ్రాట్స్!!
ప్రస్తుతం ఫొటోషూట్ల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం ఏదైనా సరే తమ ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. ముఖ్యంగా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో ఈ సందడి మామూలుగా ఉండదు. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా లేకుండా మహిళలంతా బేబీ బంప్ ఫొటోషూట్లతో హల్చల్ చేస్తున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ ఆ ఙ్ఞాపకాలను పదిలపరచుకుంటున్నారు. జార్జియాకు చెందిన సారా వీలెన్ కర్టిస్ అనే మహిళ కూడా ఇలాంటి ఫోటోషూట్తో ప్రస్తుతం సోషల్మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే ఒక విషయం... మీరు అనుకుంటున్నట్టుగా సారా గర్భవతి కాదు.. కానీ ఆమె చేసింది మాత్రం బేబీ బంప్ షూటే. ఏంటి అదెలా సాధ్యం అనుకుంటున్నారా...అవును..తను బిడ్డలా భావించే పీహెచ్డీ థీసిస్తో ఆమె ఫొటోషూట్ నిర్వహించారు. ‘ నేను నా థీసిస్తో ఫొటోషూట్ చేశాను. లాంగెస్ట్ లేబర్ ఎవర్’ అని ట్వీట్ చేసి.. పీహెచ్డీ లైఫ్ హ్యాష్ట్యాగ్ను జత చేశారు. వినూత్నంగా ఉన్న ఆమె ట్వీట్కు 66 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలో ‘ అవును పీహెచ్డీ చేయడం అంటే బిడ్డను కనడం కంటే తక్కువేమీ కాదు. నాకు ఇప్పుడు 66 వ నెల. ఇంకెప్పుడు పూర్తవుతుందో’ అంటూ ఓ పీహెచ్డీ స్కాలర్ కామెంట్ చేశాడు. ఇక మరికొంత మంది..‘ కంగ్రాట్స్. సాధారణంగా డాక్టర్లు.. తల్లి చేతిలో బిడ్డను పెడతారు. కానీ మీరు మాత్రం బిడ్డ పుట్టాక డాక్టర్ అవుతారు’ అని చమత్కరిస్తున్నారు. ఇంతకీ సారా పరిశోధన చేస్తున్న అంశం ఏంటంటే.. ఎపిజెనెటిక్ వేరియేషన్ అండ్ ఎక్స్పోజర్ టు ఎండోక్రిన్ డిస్రప్టింగ్ కాంపౌండ్స్(DNA క్రమంలో మార్పులు కాకుండా జన్యు సమాసంలో సంభవించే సంక్రమిత మార్పులు-వాటికి దారితీసే అంశాలు). Yes, I did a photo shoot with my thesis. Longest labor ever. #phdlife pic.twitter.com/wpGdFPANd6 — Sarah Whelan Curtis (@sarahwcurtis) June 4, 2019 -
అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు
అట్లాంటా, జార్జియా : అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు అక్కడున్న ప్రవాస తెలుగువారిని కలవర పెడుతున్నాయి. మే 17న కమ్మింగ్లో శ్రీ మహాలక్ష్మి ఆలయం, అట్లాంటాలోని రివర్డేల్లోని ఆలయంలో 18న చోరీలు జరిగాయి. ఈ రెండు దేవాలయాల్లో ఒకే గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూజారుల కళ్లుగప్పి విగ్రహాలకు అలంకరించిన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. మొత్తం ఆరుగురు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. హిందూ మతం ఆచార వ్యవహారాల గురించి పూజారిని అడుగి దృష్టి మరల్చగా, మిగతా వారు చోరీకి పాల్పడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. -
‘ప్రమాదంలో ఉన్నాం.. కచ్చితంగా చంపేస్తారు’
‘మేము ప్రమాదంలో ఉన్నాము. దయచేసి మాకు సహాయం చేయండి. ఇప్పుడు గనుక ఇంటికి(సౌదీ అరేబియా) తిరిగి వెళ్తే కచ్చితంగా చంపేస్తారు. ఏ సురక్షిత దేశంలోనైనా సరే మాకు ఆశ్రయం కల్పించండి. మా దేశంలో ఉన్న బలహీన చట్టాల కారణంగా మాకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చాము’ అంటూ సౌదీ అరేబియాకు చెందిన అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాస్పోర్టులను పునరుద్ధరించి సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకుంటున్నారు. సౌదీ అరేబియాలో మహిళలను బానిసలుగా చూడటాన్ని భరించలేక.. ఆ దేశ యువతి రహాఫ్ ముహమ్మద్ అల్ఖునన్ కొన్నిరోజుల క్రితం థాయ్లాండ్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో యూఎన్ శరణార్థి సంస్థ ఆమెకు కెనడాలో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలో సౌదీకి చెందిన ఇద్దరు యువతులు మహా అల్సుబే(28), వఫా అల్సుబే(25)కూడా ఇదేవిధంగా ఇంటి నుంచి పారిపోయి జార్జియాకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పాస్పోర్టులను రద్దు చేశారు. చదవండి : ‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’ ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన సదరు యువతులు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యను అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన యూఎన్ శరణార్థి సంస్థ.. బాధితులకు రక్షణ కల్పించాల్సిందిగా జార్జియా అధికారులకు విఙ్ఞప్తి చేసింది. కాగా ఇంతవరకు తమ అధికారులను బాధితులెవరూ కలవలేదని జార్జియా హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోఫో డినారడిజే గురువారం తెలిపారు. ఆశ్రయం కల్పించాల్సిందిగా తమను కోరలేదని, కనీసం సహాయం కోసం కూడా అర్థించలేదని పేర్కొన్నారు. చదవండి : అమెరికాలో సౌదీ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఇక ఆడపిల్లగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న దుబాయ్ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం కొంతకాలం క్రితం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆమె తరహాలోనే పలు యువతులు కూడా ఇటీవలి కాలంలో సౌదీ నుంచి పారిపోయి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సౌదీకి తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో రొటానా ఫారియా(22), ఆమె సోదరి తాలా(16) ఫారియా అనే అక్కాచెల్లెళ్లు న్యూయార్క్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయాల పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రెండు నెలలు మాత్రమే!
జార్జియాలో క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. కీలక సన్నివేశాల కోసం మైసూర్, చెన్నై కూడా వెళ్లొచ్చారు. ఎలాగూ హైదరాబాద్లో మేజర్ షూటింగ్ జరుగుతోంది. ఇదంతా... ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం గురించే. ఇంకెంతకాలం ‘సైరా’ జర్నీ కొనసాగుతుంది అంటే ఇంకా రెండు నెలలు. అంటే మార్చి ఎండింగ్లో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఈ విషయాన్ని ఈ చిత్రనిర్మాత, హీరో రామ్చరణ్ ఓ సందర్భంలో వెల్లడించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ సంక్రాంతి పండగ తర్వాత హైదరాబాద్లోని ఓ స్టూడియోలో ప్రారంభం అవుతుందని సమాచారం. సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు ‘సైరా’ టీమ్. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్సేతుపతి, సుదీప్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్. -
చిరంజీవి @ 41
దాదాపు నెల రోజుల పాటు జార్జియాలో యుద్ధం చేయనున్నారు ‘సైరా’. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా’. చిరంజీవి తనయుడు హీరో రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూనిట్ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం మొదలయ్యే ఈ షెడ్యూల్ వచ్చే నెల 25వరకు.. అంటే దాదాపు నెల రోజులు జరుగుతుందని సమాచారం. ఒకే సీక్వెన్స్కు చెందిన క్లైమాక్స్ వార్ను షూట్ చేస్తారు. ఈ షూట్లో చిరంజీవి, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, ముఖేష్ రిషిలు పాల్గొంటారు. ఆల్రెడీ జగపతిబాబు, ముఖేష్ రిషి లొకేషన్లో ల్యాండ్ అయ్యారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమి తాబ్ బచ్చన్, తమన్నాలు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో 41ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అందుకుని ఆయన తనయుడు రామ్చరణ్ ‘‘సినిమా, నేను మిమ్మల్ని ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉంటాం’’ అని స్పందించారు. -
ఈ గీతతో సముద్రం మీదే ప్రయాణం..
ఈ చిత్రంలో ఎరుపు రంగు గీతను చూశారా. ఈ గీత ఆకారం చూడటానికి అనేక వంపులు ఉన్నట్టు ఉంది కదా. అయితే నిజానికిది అచ్చంగా నిలువు గీత. అదేంటీ గీత అన్ని వంకరలు ఉంటే నిలువు గీత అంటారేంటీ అనుకుంటున్నారా.. నిజంగానే ఇది నిలువు గీతే.. ఎందుకంటే మన భూమి గోళాకారంలో ఉండటం వల్ల దానిమీద నిలువు గీసినా ఈ చిత్రంలోని మ్యాప్లో కనిపించినట్టుగా అనేక వంకరలు వస్తుంది. అలాగే మ్యాప్పై పెద్ద సరళ రేఖ గీసినా.. భూమి మీదకి వచ్చేసరికి అనేక వంకరలు వస్తుంది. ఈ గీతకు మరో విశిష్టత ఉంది. ఈ గీతను పట్టుకుని వెళితే.. ఎక్కడా భూమిపై అడుగు పెట్టకుండా కేవలం సముద్ర మార్గం గుండా ప్రయాణించవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర మార్గం గుండా ప్రయాణించే అతిపెద్ద సరళ రేఖ. ఈ రేఖను ఐదేళ్ల క్రితం జార్జీయాకు చెందిన పాట్రిక్ అండర్సన్ అనే వ్యక్తి రెడ్డిట్లో పోస్ట్ చేశాడు. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మ్యాప్పై రేఖను గీశాడు. అయితే ఇది సరైనదా.. కాదా కనుక్కునేందుకు గాను ఇటీవల ఐర్లాండ్లోని భౌతిక శాస్త్రవేత్త రోహన్, ఇండియన్ ఐబీఎంలో పనిచేస్తున్న ఇంజనీర్ కుశాల్ ముఖర్జీలు అల్గారీథమ్ను అభివృద్ధి చేశారు. దీన్ని ఉపయోగించి మ్యాప్పై గీసిన ఈ రేఖ సరైనదని వారు కనుగొన్నారు. బలూచిస్తాన్లో మొదలయ్యే ఈ అతిపెద్ద సముద్ర ప్రయాణం అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ అట్లాంటిక్, పసిఫిక్, సౌత్ బేరింగ్ సముద్రాల మీదుగా సాగి రష్యాలోని కమ్చట్కా తీర ప్రాంతంలో ముగుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం 32 వేల కిలోమీటర్లు ఉంటుంది. -
రహదారిపై కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
-
కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
వాషింగ్టన్ : జార్జియాలోని ఓ రహదారిపై అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ విమానం అమెరికా వైమానిక దళంలో సేవలందించింది. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చిందని, దాన్ని స్టోర్ రూమ్కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం సవాన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 9 మంది మిలటరీ సిబ్బందితో టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానం అగ్నిగుండం వలే నేలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు విమానం రోడ్డుపై పడిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. సీ-130 రకానికి చెందిన ఈ కార్గో విమానాన్ని ప్రస్తుతం ప్యూటో రికో ఎయిర్ నేషనల్ గార్డ్స్ వినియోగిస్తున్నారు. నేషనల్ గార్డ్స్ ప్రతినిధి పాల్ డాలెన్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానం 50 ఏళ్ల క్రితం నాటిది అయినప్పటికీ, అది ప్రస్తుతం కండీషన్లోనే ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
పురుగులు పీక్కు తిన్నాయి..
బ్లిసీ, జార్జియా : రాజధాని బ్లిసీలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మోడల్ రెబెక్కా జెనీను బ్రతికుండగానే పురుగులు పీక్కు తిన్నాయి. జెనీ చర్మ బాహ్యత్వచంపై అభివృద్ధి చెందిన ఇచ్మైట్స్ పెద్ద ఎత్తున గుడ్లను పెట్టినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కన్ను గుర్తించలేని సైజులో ఉండే ఈ జీవులు ఆమె శరీరాన్ని లోలోపల తినేయడం ప్రారంభించాయని వెల్లడించారు. డెమన్షియా వ్యాధితో 2010లో ప్రూఇట్ హెల్త్ ఆసుపత్రి జెనీను ఆమె కూతురు చేర్చారు. అప్పటి నుంచి ఆమెకు అక్కడే వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, జెనీ మృతిపై ఆసుపత్రిని ఆమె కూతురు కోర్టుకు ఈడ్చారు. -
సగం కుళ్లిపోయినా ఆమె బతికే ఉంది
వాషింగ్టన్ : దాదాపు పాడుబడిపోయి కంపుకొడుతున్న ఓ ఇంట్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఓ మహిళను అమెరికా అగ్నిమాపకశాఖ పోలీసులు గుర్తించారు. ఓ వ్యాధి కారణంగా బాగా లావెక్కి కదలలేకుండా మంచాన పడిపోయి ఉన్న ఆమెను చూసి దుఃఖితులయ్యారు. పైగా ఆమె కాళ్లకు పురుగులు పట్టి దాదాపు సగం వరకు కుళ్లిన స్థితిలోకి చేరడంతో ఆమె చనిపోయిందనే తొలుత భావించిన పోలీసులు ఆ తర్వాత ఆమె బతికి ఉండటాన్ని చూసి శర వేగంగా ఆస్పత్రికి తరలించారు. తమ జీవితంలో ఇలాంటి కేసు చూడలేదంటూ వర్ణించారు. వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ జార్జియాలోని ఓ ఇంట్లో ట్రాసీ సారెల్స్ (50) అనే మహిళ చాలా రోజులుగా మంచంలో కదలేని స్థితిలో పడి ఉంది. ఆమెకు టెర్రి సారెల్స్ (54) అనే భర్తతోపాటు, క్రిస్టియాన్ (18) అనే కుమారుడు ఉన్నాడు. ఆమె మంచానికి పరిమితం కావడంతో ఆమెను పూర్తిగా వారు నిర్లక్ష్యం చేశారు. ఎంతలా అంటే ఆమె పడి ఉన్న మంచంపై కనీసం బెడ్షీట్ లేదు. పైగా ఆ గది మొత్తం దుర్గందంతో నిండిపోయింది. ఆమె భర్త ఉపయోగించుకునే గది కంప్యూటర్ వద్ద తప్ప మరెక్కడా కూడా శుభ్రత అంటూ లేదు. ఓ చెత్త కర్మాగారంగా ఆ ఇల్లు మారిపోయింది. వంటగదిలో సీలింగ్ వరకు చెత్త పేరుకుపోయింది. ఆమె ముఖంపై ప్లాస్లిక్ పేపర్లు, తదితర ఇతర వస్తువులు వేసి ఉంచారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఆమెను చూసేందుకు వెళ్లనట్లు కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించిన భర్తపై కేసులు నమోదు చేశారు. అయితే, ఆమె కుమారుడు స్పందిస్తూ తమ వద్ద అసలు డబ్బులు లేవని, ఏ ఒక్కరికీ ఉద్యోగం లేకపోవడంతోనే ఎలాంటి సపర్యలు చేయలేకపోయామంటూ వివరించాడు. కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు ట్రాసీని గుర్తించారు. -
రియల్ క్యాచ్.. రియల్ హీరో..
ఓ వైపు ఎగసి పడుతున్న మంటలు, మరో వైపు పై అంతస్తు నుంచి వేగంగా కిందకు వస్తున్న ఓ చిన్నారి. క్రికెట్ మ్యాచ్ లో క్యాచ్ మిస్సయితే కనీసం బ్యాట్స్ మెన్ కయినా లైఫ్ వచ్చిందంటాం. కానీ నిజజీవితంలో ఓ అగ్నిమాపక సభ్యుడికి వచ్చిన క్యాచ్ మిస్సయినా, లేక అదుపుతప్పి మంటల్లో పడినా ఒకటి కాదు రెండు ప్రాణాలు పోవాల్సిందే. రియల్ క్యాచ్ పట్టి చిన్నారి ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నెటిజన్లతో శభాష్ అనిపించుకున్నారు కెప్టెన్ స్కాట్ స్ట్రాప్. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్థులను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తారు అగ్నిమాపక సిబ్బంది. అవసరం వస్తే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే వారిలో అగ్నిమాపక విభాగంలో పని చేసేవారు ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది చూపించే ధైర్య సాహసాలే ఎంతో మందికి పునర్జన్మనిచ్చాయి. అమెరికాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలను ఓ కెప్టెన్ కాపాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.. అమెరికాలోని జార్జియాలో జనవరి 3న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఓ వైపు అగ్నికీలలను అదుపు చేస్తూనే మరో వైపు మంటల్లో ఇరుక్కున్న వారిని రక్షించడానికి సహాయకచర్యలు ముమ్మరం చేశారు. దట్టమైన మంటలు దాదాపు ఇంటిని చుట్టుముట్టడంతో అందులో చిక్కుకున్న వారిని నిచ్చెన సహాయంతో బిల్డింగ్ పై నుంచి కిందకు దిగడానికి ఏర్పాట్లు చేశారు. ఓ డజను మంది బిల్డింగ్ పై నుంచి కిందకు దిగడానికి సిద్దంగా ఉన్నారు. సరిగ్గా అదేసమయంలో మంటల తీవ్రత ఎక్కువవ్వడంతో పై నుంచి దిగుతున్న వ్యక్తి ఓ చిన్నారిని కిందకు విసిరారు. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ స్కాట్ స్ట్రాప్ చిన్నారిని తన రెండు చేతులతో పట్టుకొన్నారు. పక్కనే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి రెండు చేతుల్లో చిన్నారిని ఒడిసిపట్టుకొని పరిగెత్తుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వీడియో చూసిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. 'కొన్ని సందర్భాల్లో ఫుట్ బాల్ను క్యాచ్ పట్టుకున్నట్టు చిన్నారులను పట్టుకోవాల్సి వస్తుంది. బాల్కనీలపై నుంచి చిన్నారులను కిందకు వేసే సమయంలో తమ పక్కన మంటలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా కేవలం చిన్నారులను పట్టుకోవడంపైనే దృష్టి ఉంచాలి' అని అగ్నిమాపక సిబ్బంది సభ్యులు ఒకరు తెలిపారు. జార్జియాలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారితో పాటూ 12 మంది ప్రాణాలను కాపాడగలిగామని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. -
చిన్నారి ప్రాణాలను కాపాడిన రియల్ హీరో
-
బరువుకు... పొట్టలోని బ్యాక్టీరియాకు లింక్?
తినే తిండే మనం లావెక్కేందుకు లేదా సన్నబడేందుకు కారణమని ఇన్నాళ్లూ అనుకుంటున్నామా? ఇందులో నిజం కొంతే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన కడుపులో, పేవుల్లో ఉండే బ్యాక్టీరియా ఏం తింటుందో... దాన్ని బట్టి మన బరువు ఆధారపడి ఉంటుందన్నది జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతున్న విషయం. వివరాల్లోకి వెళితే.. ఆహారంలో పీచుపదార్థం ఎక్కువ ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే శరీరానికి బదులు బ్యాక్టీరియా ఈ పీచుపదార్థాన్ని తినేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఆహారంలో పీచు తక్కువైనప్పుడల్లా బ్యాక్టీరియా రకాల్లో తేడాలొచ్చేస్తాయి. ఇది కాస్తా ఊబకాయం మొదలుకొని మధుమేహం చివరకు గుండెజబ్బులకు దారితీస్తుంది. అమెరికా తదితర దేశాల ఆహారంలో చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, పీచు తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఈ కారణంగానే అక్కడ ఊబకాయ సమస్యలు ఎక్కువ. జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అండ్రూ గెవిర్ట్తోపాటు యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్కు చెందిన బెడిక్లు వేర్వేరుగా కొన్ని ఎలుకలపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. పీచు తక్కువగా ఇచ్చినప్పుడు పేవుల్లోని బ్యాక్టీరియాలో తేడాలు వచ్చాయని, మోతాదు పెంచినప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినా.. మునుపటి స్థాయికి చేరుకోలేదని వీరు అంటున్నారు. ఏతావాతా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. బరువు తగ్గాలంటే వీలైనంత వరకూ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని!