houses
-
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్గా
ప్రస్తుతం స్పెయిన్లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్లు, బార్లు, కాఫీ హౌస్లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
కూల్చడం కుదరదు.. ఇళ్లకు ‘స్టే’ బోర్డులు
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇళ్ళు కూల్చివేయవద్దంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యనగర్, కొత్తపేటలో పలు ఇళ్ళ ముందు హైకోర్టు స్టే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని 400 మంది ఇళ్ల యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం మా ఇళ్లు ఇవ్వం అంటూ బాధితులు ఇటీవల ఆందోళన కూడా నిర్వహించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు నోటీసులిచ్చారు. దీంతో ఆయా కట్టడాల యజమానులు కోర్టుకు వెళ్లి కూల్చివేలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
లెబనాన్లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్:లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సోమవారం(సెప్టెంబర్30) తెల్లవారుజామున బీరుట్ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.బీరుట్లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్ను ఇజ్రాయెల్ ఐరన్డోమ్ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: లెబనాన్ నిరాశ్రయులు..10 లక్షలు -
Video: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు
బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి.#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024 -
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్ఆర్పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
రియల్టీ మార్కెట్లో భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్లలో భాగంగా విక్రయించింది. → డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి. → ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్లు నమోదు చేసింది. → గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం. → బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి. → బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. → ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్లు సాధించాయి. → ముంబైకి చెందిన మరో సంస్థ సన్టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి. బలమైన డిమాండ్.. కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్లిస్టెడ్లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. -
ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు.చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్.బ్రహ్మ ముహూర్తంలోనే.. ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్ వేస్తుంటారు.ఎన్ని రోజులు పడుతుందంటే.. ఒక పెయింటింగ్ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్డ్ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.ఇళ్లు, ఆఫీసుల్లో.. రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్ హౌస్లలో ఈ వాస్తు పెయింటింగ్లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్ వేస్తుంటారు.వాస్తు పెయింటింగ్తో మనశ్శాంతి వాస్తు పెయింటింగ్ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడుఇవి చదవండి: వయనాడ్ విలయం : ఆమె సీత కాదు...సివంగి -
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
హిమాయత్నగర్(హైదరాబాద్): రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీడియాలో వస్తున్న మార్పులతో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోనున్నదన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్రెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్గా ఉద్యోగ విరమణ చేసిన కె.రవికాంత్రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర కార్యదర్శి వరకల యాదగిరి, కోశాధికారి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, రాజే‹Ù, సయ్యద్ గౌస్ మొయినుద్దీన్లను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కేఎన్, హరి, సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు, ఇతర సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రధాన అసోసియేషన్లే కాకుండా కుల సంఘాల పేరిట కూడా అసోసియేషన్లు ఏర్పడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీనివల్ల జర్నలిస్టుల మధ్య ఐక్యత కొరవడుతుందని చెప్పారు. అర్హులకు మాత్రమే అక్రిడేషన్లు అందాలన్నారు. రానున్న రోజుల్లో వీటిని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు ఒకే ప్రదేశంలో కాకుండా నగరానికి నాలుగు దిక్కులలో స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, వై.నరేందర్రెడ్డి, శంకర్గౌడ్, సంఘ సంస్కర్త కన్నాట్ సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలపై పంతం
-
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
-
సోలార్ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్లోనూ ఫ్లోటింగ్ సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు శనివారం హైదరాబాద్లో మరోమారు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఏడుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం మాదాపూర్ డీఎస్ఆర్ అపార్ట్మెంట్స్లోని కవిత ఆడపడుచు అఖిల ఫ్లాట్తోపాటు ఇతర బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కవిత ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు సందర్భంగా హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలోనూ కవిత భర్త అనిల్తోపాటు శరణ్ సైతం అక్కడే ఉన్నారు. సోదాల సమయంలో ఈడీ అధికారులు కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తోపాటు కవిత పీఏలు రాజేశ్, రోహిత్రావు ఇతరుల ఫోన్లను సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలు ఉండటంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కాంకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. తమ కస్టడీలో కవిత నుంచి సేకరించిన సమాచారం.. గతంలో ఫోన్లలో వెలుగు చూసిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ప్రధానంగా గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి హైదరాబాద్ నుంచే రూ. కోట్లు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె నుంచి సేకరిస్తున్న సమాచారంతో మరికొందరి పాత్రను బయటకు తెస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలన్నీ కవిత ఆడపడుచు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తే కొత్త కోణాలు వెలుగు చూస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు. -
‘రియల్’ మోసాలు రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. కస్టమర్ల సొమ్మే యజమానికి.. నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్లో బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. మోసాల విలువ రూ.10 వేల కోట్లు.. సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి చిన్నా, పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ (టీపీడీఎఫ్ఈఏ) చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలి. ప్రాజెక్ట్ను పూర్తి చేసే ఆర్ధిక స్తోమత ఆ సంస్థకు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. దీనికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా..లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితేనే ఉత్తమం. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ ఎండీ -
వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు
సాధారణంగా మంచి మాటలు, మంత్రాలు, కొటేషన్స్ను బడులు, గుడులలో చూస్తుంటాం. వాటినిప్పుడు ఇళ్లల్లోనూ ప్లేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. ఎలాగంటే.. రీడింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్లో ఏదైనా ఒక గోడను ఎంపిక చేసుకుని.. సానుకూల ఆలోచనలను ప్రేరేపించే మంచి మాటలతో ఒక వాల్ పేపర్ను ఆ గోడ మీద అలంకరించవచ్చు. ఇది పెద్దల పెంపకాన్నీ.. పిల్లల ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఆ గది వాతావరణాన్ని మారుస్తుంది. ఫొటో ఫ్రేమ్స్.. కోట్స్ లేదా చాంట్స్తో ఫొటో ఫ్రేమ్స్ను తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో లభించే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటివల్ల ఆ గది హుందాగా కనపడుతుంది. పూజ గది.. ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గది ఉంటే.. నచ్చిన శ్లోకాలతో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అందమైన అక్షరాలతో కార్నర్ ప్లేస్లో గోడను తీర్చిదిద్దుకోవచ్చు. ఈ అలంకరణల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి చదవండి: ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త! -
Fact Check: కళ్లకు చత్వారం... చెవులకు బధిరత్వం
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది. చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది. టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది. అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి. రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి ♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. ♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. ♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. ♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. ♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. ♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా... బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ♦ రివర్స్ టెండరింగ్లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. ♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది. ♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. -
కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే తాను భూములను కబ్జాచేసి, చట్టాలను ఉల్లంఘించి కట్టుకున్న ఫిలిం సిటీ, సహా తన కోటలకు బీటలు వారుతాయన్న ఆందోళనతో రామోజీరావు కల్లు తాగిన కోతిలా చెలరేగిపోతున్నారు. ఏదో ఒకటి చేసి తన పార్ట్నర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనతో సీఎం జగన్ ప్రభుత్వంపై తన అక్కసును నిత్యం వెళ్లగక్కుతున్నారు. తాజాగా.. పేదలకు ‘సొంతిళ్లు నమ్మక ద్రోహం’.. ‘ఏ నిమిషానికి ఏమి కూలునో!’ అంటూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై విషం చిమ్ముతూ గురువారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో వాస్తవాలకు దూరంగా అవాస్తవ కథనాలను వండి వార్చడం ఇందులో భాగమే. జగనన్న ఇళ్లు ఏ నిమిషంలో కూలుతాయో.. తద్వారా పేదల ప్రాణాలకు ముప్పు అంటూ ఓ సరికొత్త డ్రామాకు ఈ కథనం ద్వారా రామోజీరావు తెరతీశారు. నిజానికి.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఖరీదైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వాటిల్లో సొంతిళ్లు సమకూరుస్తుంటే సిగ్గూశరం లేకుండా ఈ రాతలు ఏమిటి రామోజీ అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో పేదల గూటికి, పేదోడికి ఏ ఢోకాలేదు.. అసలు ఈ రాష్ట్రంలో పేదలకు పట్టిన ఏలినాటి శని నువ్వు, మీ బాబే రామోజీ అని పేదలు చెబుతున్నారు. దీంతో పేదలు ఈ జన్మలో బాబుకు ఓటు వేయరని.. అదే జరిగితే తన కోటలు కూలుతాయని రామోజీ బెంబేలెత్తి కట్టుకథలు, కాకమ్మ కబుర్లతో ఈనాడులో చేతికొచ్చింది నిస్సిగ్గుగా రాసిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పేదల గూడుపై ఈనాడులో ప్రచురించిన దుర్మార్గపు రాతల వెనుక వాస్తవాలు ఏమిటంటే.. ఈనాడు ఆరోపణ: అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు నెలైనా కాకముందే కూలింది. కాంట్రాక్టర్ శ్లాబ్ వేస్తున్న సమయంలో సిమెంట్ తక్కువ వాడాడు.. వాస్తవం: రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండే హేమజ్యోతి, ఆనందు దంపతులకు మల్లాపురం లేఅవుట్లో ఇల్లు మంజూరైంది. వీరు తమ ఇంటిని తామే నిర్మించుకునే ఆప్షన్ 1, 2 ఎంచుకున్నారు. ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరుచేయడంతో పాటు, 15 టన్నుల ఇసుకను ఉచితంగా, 55 బస్తాల సిమెంట్, 270 కిలోల స్టీల్ సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసింది. లబ్ధిదారులే ఒక తాపీ మేస్త్రీని గుర్తించి ఇంటి నిర్మాణం చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఇల్లు ఆప్షన్–3 (ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లు) కింద నిర్మించినది కాదు. పైగా.. కూలింది శ్లాబ్ కాదు. ఇంటి ముందు భాగంలో ఉండే మూడు అడుగుల సన్షేడ్ భాగం. ఎక్కడ ఏం జరిగినా దానిని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ఈ వ్యవహారంలోనూ తన దగుల్భాజితనాన్ని ప్రదర్శించారు. ఆరోపణ: పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చుచేస్తోంది. వాస్తవం: ఇల్లులేని నిరుపేదలందరికీ రూ.15 లక్షల వరకూ మార్కెట్ విలువైన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో లెవెలింగ్, తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.రెండు వేల కోట్లు వెచ్చించారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు.. ఒక్కో యూనిట్కు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు. ఇందులో పట్టణాల పరిధిలో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.78 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి అదనంగా పావలా వడ్డీకి రూ.35వేలు బ్యాంకు లోన్ సమకూరుస్తున్నారు. రూ.15 వేలు విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు, రూ.40వేల వరకూ మేలుచేస్తూ స్టీల్, సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇంత పెద్దఎత్తున మేలు చేస్తుంటే కేవలం రూ.30 వేలు ఖర్చుచేస్తున్నారని రామోజీరావు రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఆరోపణ: ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం కేవలం ఒక శాతం మాత్రమే పూర్తయింది. ఇళ్ల నిర్మాణాల కేటాయింపులో కేవలం ఒక ఏజెన్సీకే మేలు చేశారు.. వాస్తవం: ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని 3,55,256 మంది ఎంచుకున్నారు. వీరందరినీ స్థానికంగా గుర్తించిన లేబర్ ఏజెన్సీలకు అనుసంధానం చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 72,906 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఆప్షన్–3 ఇళ్లలో 20 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. కానీ, ఈనాడు మాత్రం ఒక శాతం మాత్రమే పూర్తయ్యాయని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాతలు రాశారు. లబ్ధిదారుల అంగీకారం మేరకు లేబర్ ఏజెన్సీలతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 897 ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో 57 ఏజెన్సీలు వివిధ జిల్లాల్లో పనులు చేస్తున్నాయి. గరిష్టంగా ఒక్కో ఏజెన్సీకి 40,590 ఇళ్లను కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే ఒక ఏజెన్సీకే మేలు చేసినట్లు ఎక్కడాలేదు. -
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్
CM Jagan Public Meeting At Ongole Updates ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్ పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్ ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం: సీఎం జగన్ ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్ చురకలు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట! ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం ప్రొసీజర్స్ను 3,300కు పెంచాం పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని ప్రసంగం పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు? పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? ఒంగోలులో సీఎం జగన్.. ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ సీఎం జగన్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఒంగోలులో సీఎం జగన్కు ఘన స్వాగతం జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని ►ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం ► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్ సీఎం జగన్ ఒంగోలు పర్యటన ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్ 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. -
నెరవేరిన నిరుపేదల ఏళ్లనాటి ఎదురుచూపులు
-
రూ.1కే టిడ్కో ఇళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సొంతిల్లు లేని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని, అందరినీ ఒక ఇంటివారిని చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం సోనియానగర్లో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రూ.1కే లబ్ధిదారులకు అందజేశారు. అందుకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను వారి చేతికి ఇచ్చారు. దీంతో పట్టలేని సంతోషంతో లబ్ధిదా రులు సీఎం జగన్ కటౌట్కు క్షీరాభిషేకం చేశారు. మంత్రి బొత్స మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ఒక్కో లబ్ధిదారుతో రూ.500 చొప్పున డీడీ తీయించారని, రూ.5 లక్షల బ్యాంకు రుణానికి అంగీకరింపజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లును అందించిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఏ ఒక్కరి నుంచి డబ్బు వసూలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో అన్ని పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. అంగరంగ వైభవంగా... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నిర్మించిన 1,056 టిడ్కో ఇళ్లలో మంగళవారం గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రూ.82.85 కోట్లతో ఈ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారని, ఒక్కొక్కటీ రూ.12 లక్షల విలువైన సొంత ఆస్తిని అక్కచెల్లెమ్మలకు కేవలం రూ.1కే అందించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. లబ్ధిదారులకు ఇంటితాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, టిడ్కోబోర్డు డైరెక్టర్ నాగేశ్వరి పాల్గొన్నారు. -
జగనన్న మా దేవుడు
-
కొత్తగా మరో 2.32 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలైన అక్కచెల్లెమ్మలు మరింతమందికి సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకు పైగా నిరుపేద మహిళల పేరిట ఉచితంగా స్థలాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణం ద్వారా కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. వేగంగా ఇళ్ల నిర్మాణం జగనన్న కాలనీల్లో అనుమతులు ఇచ్చిన 22 లక్షలకు పైగా ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా, మిగిలినవి టిడ్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్లు పునాది నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించి నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షిస్తోంది. వేగంగా బిల్లులు చెల్లిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో కొత్తగా నిర్మించనున్న 2.32 లక్షల ఇళ్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30,652 ఉన్నాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 29,892, కాకినాడ జిల్లాలో 25,826, పల్నాడు జిల్లాలో 22,202 ఇళ్లు ఉన్నాయి. పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. అదేవిధంగా పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో రూ.లక్షకు పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. వసతులు కల్పిస్తున్నాం రాష్ట్రంలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. కేంద్ర నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్లలో నీరు, విద్యుత్ సరఫరా పనులు చేపడుతున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతాం. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నాం.- ఎండీ కె.వెంకట రమణారెడ్డి, గృహ నిర్మాణ సంస్థ -
లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకూ సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇప్పటివరకూ లక్ష ఇళ్లను పేదలకు అందజేసింది. ఈనెల 22కల్లా మరో 25,456 ఇళ్లను అందించనుంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 15,504 యూనిట్లను బుధవారం లబ్ధిదారులకు అందించేందుకు టిడ్కో అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 66 ప్రాంతాల్లో నిర్మించిన 1,00,200 ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, తాజాగా నెల్లూరు, అనంతరం సాలూరు 1,056, విజయనగరం 1,120, పెద్దాపురం 1,584, మచిలీపట్నం 2,304, చిత్తూరు 2,016, మదనపల్లి 1,872 టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారుచేశారు. ఈ మొత్తం ప్రక్రియ ముగియగానే 18 యూఎల్బీల్లో 24,812 యూనిట్లను మార్చిలో లబ్ధిదారులకు అందిస్తారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫేజ్–1లో 1,51,298 టిడ్కో ఇళ్లు పూర్తిచేస్తారు. ఇలా రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరలను పక్కనబెట్టి, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను అందిస్తోంది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు గత ప్రభుత్వం మోపిన ఆర్థిక భారాన్ని సగం తగ్గించి ఇళ్లను కేటాయించింది. అన్ని వసతులతో ఆధునిక పట్టణ ఇళ్లు.. జీ+3 విధానంలో నిర్మంచిన టిడ్కో ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్ సదుపాయం, రోడ్లు వంటి అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ తర్వాతనే లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 15 వేలకు పైగా ఉన్నాయి. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తుండగా, బుధవారం 15,504 యూనిట్లను అందిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేసి, అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటుచేశారు. ఇక్కడి వారికి ఎలాంటి ఇబ్బందిలేకుండా జగనన్న నగరాల్లో (టిడ్కో ఇళ్లు) పట్టణ స్వయం సహాయక సంఘాలు స్వయంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను మెప్మా ఏర్పాటుచేస్తోంది. లబ్ధిదారులకు జగన్ సర్కారు మేలు.. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ప్రభుత్వం మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు.. 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు.. 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. 300 చ.అ. ఇంటిని నిరుపేదలకు రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు రూ.10,339 కోట్ల ప్రయోజనం చేకూర్చింది. అలాగే, 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించడంతో పాటు వారు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు తగ్గిపోయింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటే జగన్ సర్కారు రూ.3,237 కోట్లతో సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాక.. రివర్స్ టెండరింగ్లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692కు తగ్గించడంతో పాటు, అన్ని పనుల్లోను దాదాపు రూ.4,368 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఇక అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తంగా రూ.5,487.32 కోట్ల మేర లబ్ధిపొందారు. టిడ్కో ప్రాంగణాల్లో జేఎంఎం, కమ్యూనిటీ హాళ్లు మరోవైపు.. టిడ్కో నివాసాల వద్ద పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్న జగనన్న మహిళా మార్టులను ఏర్పాటుచేయనున్నారు. వీటితో పాటు స్థానికుల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లను సైతం నిర్మిస్తున్నారు. తొలివిడతలో 21 యూఎల్బీల్లోని టిడ్కో నివాసాల వద్ద వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు ఇళ్ల ప్రాంగణాల్లో టిడ్కో విభాగం 1,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తోంది. ఇక్కడ 4 వేల చదరపు అడుగుల్లో రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో జగనన్న మహిళా మార్టు, రెండో అంతస్తులో కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి తేనున్నారు. టిడ్కో నివాసితుల్లో అధిక శాతం మెప్మా సభ్యులే. దాంతో అక్కడి వారికి ఉపాధితో పాటు ఆదాయ మార్గాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి నిర్వహణను సైతం స్థానిక టిడ్కో నివాసితులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకే అప్పగించనున్నారు. జేఎంఎం నిర్మాణానికి ఇప్పటికే విజయనగరంలో పనులు ప్రారంభించగా, మంగళవారం తాడిపత్రిలోను, బుధవారం నెల్లూరు, గురువారం మదనపల్లిలోను పనులు చేపట్టనున్నారు. ఇళ్ల పేరిట పేదలను ముంచిన చంద్రబాబు.. ఇక టిడ్కో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాదిస్థాయి దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతో పాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారుచేశారు. అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టి రూ.3,805 భారం మోపింది. అలాగే, 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. -
శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
-
వెంకటగిరిలో నేడు 1,008 టిడ్కో గృహాల ప్రారంభోత్సవం
-
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు (అన్నిరకాల విభాగాలు) మొత్తం మీద 5 శాతం పెరిగాయి. 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి. మధ్యస్థ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు నెలకొన్న డిమాండ్ అమ్మకాల్లో వృద్ధికి దారి తీసింది. అయితే రూ.50 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు (అందుబాటు ధరల) అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గాయి. 97,983 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైంది. ఈ వివరాలను నైట్ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం వృద్ధిని చూశాయి. అమ్మకాల గణాంకాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ► ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణెలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి. ► చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► కోల్కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఖరీదైన ఇళ్లకు ఆదరణ ఇళ్ల విక్రయాల పరంగా 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశ బలమైన ఆర్థిక మూలాల నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లలో నమ్మకం నెలకొంటోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొంత ఒత్తిడి నెలకొంది. ఇది విక్రయాల్లో ప్రతిఫలిస్తోంది. –ఎండీ శిశిర్బైజాల్ ,నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్ బలమైన పనితీరు వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశి్చతులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి ఆరంభ సవాళ్లు గతేడాది ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ పనితీరు చూపించింది. కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్ అసాధారణ స్థాయికి చేరుకుంది. 2023 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ నిలిపివేయడం కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోలుదారుల్లో సానుకూల ధోరణితో మధ్యస్థ ప్రీమియం, ఖరీదైన ఇళ్లకు బలమైన డిమాండ్ను తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో బడ్జెట్ ఇళ్ల (అఫర్డబుల్) విభాగం సవాళ్లను ఎదుర్కొంటోంది. –వికాస్ వాధ్వాన్, ప్రాప్టైగర్ గ్రూప్ సీఎఫ్వో హైదరాబాద్లో ఇళ్లకు భలే గిరాకీ హైదరాబాద్: రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ ప్రముఖ మార్కెట్గా వృద్ధి చెందుతోంది. 2023 సంవత్సరానికి ఇళ్ల అమ్మకాల పరంగా దేశంలో హైదరాబాద్ రెండో అతిపెద్ద వృద్ధి మార్కెట్గా నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరిగాయి. 2022లో హైదరాబాద్లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. 2023 చివరి త్రైమాసికంలో హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నూతన ఇళ్ల సరఫరా 2023లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు సరఫరాలోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. ఈ వివరాలను ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాలకు సంబంధించిన వివరాలతో వార్షిక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 33% వృద్ధి నమోదైంది. -
పేదల గుండెల్లో ‘గూడు’..
పేదలే సీఎం జగనన్నకు నేస్తాలు.. వారి ఆనందాలే ఆయనకు సంతృప్తి నిస్తోంది.. వారికి కూడు, గుడ్డ, నీడ నివ్వడం.. వారిని ప్రేమతో చూసుకోవడమే ఆయనకు తెలిసిన పని.. అందుకే ఇళ్లు లేని నిరుపేదలు పైరవీకారులను ఆశ్రయించే పనిలేకుండా చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలకు చెక్ పెట్టారు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న బడుగులకు సొంతింటి కల సాకారం చేశారు. ఆర్థిక స్తోమత లేని అభాగ్యులకు అండగా నిలిచారు. అందుకే ఆయన పేదల పక్షపాతి అయ్యారు. పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో అర్హులందరికీ స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ పథకం లబ్ధిదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – చిత్తూరు కలెక్టరేట్ జగన్న పుణ్యంతో ఇల్లు కట్టుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో ఇంటి పని పూర్తి చేశాం. మంచి ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో పనులు పూర్తి చేశాం. ఇల్లు మంజూరు కోసం గతంలో లెక్కలేనన్ని సార్లు అధికారులకు వద్దకు వెళ్లి అర్జీలు ఇచ్చాం. అప్పట్లో ఏ మాత్రం సమస్యను పట్టించుకోలేదు. తిరిగి తిరిగి వేశారిపోయి ఆశలు వదులుకున్నాం. సీఎం జగనన్న పుణ్యమాని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటిల్లిపాది సీఎంకు రుణపడి ఉంటాం. – గౌరి, పచ్చికాపల్లం. వెదురుకుప్పం. విలువైన స్థలంతో పాటు ఇల్లు కట్టించారు విలువైన స్థలం ఉచితంగా ఇచ్చారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు. మా మండలంలో ప్రధాన రహదారి పక్కనే స్థలం కేటాయించారు. టీడీపీ పాలనలో ఇంటి స్థలం కోసం జన్మభూమి కమిటీ సమావేశాల్లో లెక్కలేనన్ని సార్లు అర్జీలు ఇచ్చాం. అయినా న్యాయం జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీరు మా వద్దకు వచ్చి వివరాలు తీసుకుని వెళ్లి ఇంటి స్థలంతో పాటు, ఇళ్లు మంజూరు చేయించారు. సీఎం జగనన్న లాంటి ప్రజానాయకుడిని ఎన్నటికీ మరిచిపోము. –కుమారి, టీకెఎంపురం. సొంత గూడు దొరికింది రోజు కూలీ పనులకు వెళితేగానీ మాకు పూట గడవదు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత మాకు లేదు. అప్పులు చేయాలన్నా అప్పు పుట్టదు. కూలీ నాలీ చేస్తే వచ్చే డబ్బులతో అద్దె ఇంట్లో సంవత్సరాలు గడిపాం. సీఎం జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మాకు సొంతింటి కల నెరవేర్చారు. ఉచితంగా ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లుని నిర్మించి ఇచ్చారు. దీంతో మాకు సొంత గూడు దొరికింది. సీఎం జగనన్న మేలు ఎన్నటికీ మరువలేము. –వనమ్మ, కోణంగిపల్లె, వెదురుకుప్పం మండలం మా కల సాకారం చేశారు సీఎం జగనన్న మా కల సాకారం చేశారు. సొంతింటి కోసం సంవత్సరాలుగా కలలు కన్నాం. గత సర్కారులో ఎవరూ మా సమస్యను పట్టించుకోలేదు. సొంతిల్లు ఇస్తామని మాటలు చెప్పి, మాయ చేశారే తప్ప న్యాయం చేయలేదు. కొన్ని సామాజిక వర్గాలకే గతంలో న్యాయం చేసేవారు. ఇప్పుడు అలా కాదు నాలాంటి పేదలందరికీ జగనన్న న్యాయం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి మేలును ఎప్పటికీ మరిచిపోము. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యింది. –జమున, చిన్నపోటుచేను. వెదురుకుప్పం మండలం -
ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. 2022లో ఏడు పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో (సెపె్టంబర్ వరకు) అమ్మకాలు క్రితం ఏడాది మొత్తం అమ్మకాలతో పోల్చి చూసినా, 7 శాతం వృద్ధితో రూ.3,48,776 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది తొమ్మిది నెలల అమ్మకాలు గతేడాది మొత్తం అమ్మకాలను మించి ఉండడం, ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తోంది. ఇళ్ల ధరలు సగటున 8–18 శాతం మధ్య ప్రముఖ పట్టణాల్లో ఈ ఏడాది పెరిగాయి. కనుక గతేడాది అమ్మకాలతో కచి్చతంగా పోల్చి చూడలేం’’అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఏడు పట్టణాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోగా, తర్వాతి మూడు నెలల్లో (జూన్ త్రైమాసికం) ఒక శాతం అధికంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్టు చెప్పారు. పండుగల్లో జోరుగా విక్రయాలు పండుగల సీజన్లో ఇళ్ల అమ్మకాలు ప్రముఖ పట్టణాల్లో బలంగా ఉన్నట్టు అనుజ్ పురి వెల్లడించారు. కనుక మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది చివరికి రూ.4.5 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో ఏడు పట్టణాల్లో 3.49 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ చివరి వరకు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఇళ్లు అమ్మడవుతాయన్నది అంచనాగా ఉంది. 2022 మొత్తం మీద అమ్ముడైన యూనిట్లు 3.65 లక్షలుగా ఉన్నాయి. హైదరాబాద్లో 43 శాతం అధికం ► ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు, 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా ఉంది. ► పుణెలో 96 శాతం అధికంగా రూ.39,945 కోట్ల విక్రయాలు కొనసాగాయి. ► చెన్నైలో 45 శాతం వృద్ధితో రూ.11,374 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 41 శాతం పెరిగి రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 29 శాతం వృద్ధితో 50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ► కోల్కతాలో అమ్మకాల విలువ 19 శాతం పెరిగి రూ.9,025 కోట్లుగా ఉంది. -
హైదరాబాద్లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
గృహ యజ్ఞం మెగా డ్రైవ్
తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్ నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్గా విడుదల చేసింది. అడ్వాన్స్ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా డిసెంబర్ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్ డ్రైవ్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్మెంట్, లెంటల్, రూఫ్ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. డ్రైవ్పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్ చేసి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలంటీర్ల కీలక పాత్ర గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్ డ్రైవ్లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది. నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రమంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నసచివాలయం పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. సంక్షేమ పథకాల షెడ్యూల్డ్... ► నవంబరు 7వ తేదీ..వైఎస్సార్ రైతు భరోసా. ►నవంబరు15.. భూపంపిణీ. ►నవంబరు 28.. విద్యాదీవెన. ►ఖరీప్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్ఫెడ్కు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైన గ్యారంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్ఆధ్వర్యంలో ఖరీప్ ధాన్యం సేకరణ. ►రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్టు సమావేశం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►రహదారుల,భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల, భవనాలశాఖ పరిధిలో గెస్ట్హోస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోనున్న ఆర్ అండ్ బిశాఖ. ►తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఈ కార్యాలయంలో అవసరమైన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం. ►శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. ►ఒక మోటారు వెహికల్ ఇన్స్ఫెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం. జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్కు వివరాలు అందించిన అధికారులు. ►ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించామని వెల్లడి. ►60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని వెల్లడి ►6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్ పరీక్షలు. ►8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామన్న అధికారులు. ►5,22,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు. ►11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు. ►జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న మంత్రులు. ►వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందన్న మంత్రులు. ►ఈ కార్యక్రమాన్ని అభినందించిన కేబినెట్. వైద్య పరీక్షల్లో గుర్తించిన వారికి చికిత్స విషయంలో సమగ్రమైన ఫాలో అప్ చేయాలి: సీఎం జగన్ ►గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు. ►ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యుక శ్రద్ధ వహించాలి. ►తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలి. ►ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ►మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. ►చికిత్సలు పూర్తయిన తర్వాతకూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ►జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని మంత్రులను ఆదేశం. ►శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలి. ►వారు ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా, తదుపరి చికిత్స అందించేలా చూడాలి. ►ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదు. ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ►రిఫరెల్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలి ►ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలి. ►దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలి. ►వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాలి. అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలి: సీఎం జగన్. ►గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలి. ►అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్కు పంపించాలి. వీరికీ చేయూత నివ్వాలి. ►ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం. కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలి. ►మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారు: సీఎం జగన్ ►నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. ►ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. ►అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగా ప్రచారం చేపట్టాలి. ►నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ►దిశ యాప్ను ఏ రకంగా డౌన్లోడ్ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్నుకూడా డౌన్లోడ్ చేస్తాం. ►యాప్ ద్వారా ఎంపానెల్ ఆస్పత్రులు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ►దీనివల్ల సులభంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించవచ్చు. ►గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారు కాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ►వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నాం. ►ఈ కార్యక్రమంపైనాకూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ►కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నాం. మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్పై బోధనకోసం ఇంజినీరింగ్ కాలేజీల మ్యాపింగ్ . ►ట్యాబులు డిజిటల్ పరికరాలు, యాప్లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశం. ►అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టే ఐఎఫ్పీ ప్యానెల్స్ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారు. ►ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. ►పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ►వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు ►సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్థతలో పెంచేలా చూస్తారు ►డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారు. 50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ.. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదం. ►ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్ , డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్ధ. ►ఇది రూ.4,640 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 8080 మందికి ఉపాధి అందించనుంది. ►దీంతో పాటు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం. పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పుకు కేబినెట్ ఆమోదం. ►పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం నిర్ణయం. ►లీజు విధానం స్థానే సేల్ డీడ్ విధానంలో కేటాయింపు ►పరిశ్రమలకోసం మాత్రమే ఆభూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం. ►పరిశ్రమలు పెట్టేవారికి ఆర్థిక సంస్థలనుంచి వెసులు బాటుకోసమే నిర్ణయం ►పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన. న్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రిమండలి. ►అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ ►ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►దీనికోసం సబ్ లీజింగ్కు అనుమతి ఇచ్చిన కేబినెట్. ►రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎన్టీపీసీ. ►గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్టీపీసీ లిమిటెడ్కు అనుమతులు మంజారు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి. ►తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►వైయస్సార్ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు. ►విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్– 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్ మైనేని. ►డేవిస్కప్ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్. ►2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్ 1గా ఉన్న సాకేత్ మైనేని. ► ఏపీ ఫెర్రోఅల్లాయిస్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం. ►ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు. ►స్టీల్ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం. ►రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న ప్రభుత్వం ►దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్. ►902 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు ►లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఏడాదికి రూ.31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ. ►రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు అనుమతిలిస్తూ కేబినెట్ ఆమోదం. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్రంలో 100 ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఇందులో 45 పోస్టులు అప్గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరరీ పోస్టులు. ►ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ ►సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం. ►ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. ►అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందన్న సీఎం. ►ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందన్న సీఎం. ►ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్. ►మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. ►కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు. ►ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాప్ట్ ఆర్డర్ 2023కు ఆమోదం. ►జోనల్ వ్యవస్థలో మార్పులకు కేబినెట్ నిర్ణయం. ►డిస్ట్రిక్ కేడర్గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ. ►జోనల్ కేడర్గా జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నవారు. ►మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమానస్థాయి వారు. ►స్టేట్ లెవల్ కేడర్ అంతా మల్టీజోనల్ కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవల్ ఇనిస్టిట్యూషన్స్, కేపిటల్ ఏరియాలో పోలిస్ కమిషనరేట్ మినహాయిస్తే) ►దీనివల్ల 95శాతం పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి. ►స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10నుంచి 7కు తగ్గింపు. ►ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మారుస్తూ నిర్ణయం. ►వీటితోపాటు రెండు మల్టీ జోన్లు. ►ర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం. ►ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్బోర్డు, లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం. ►దేవాదాయశాఖలో కేడర్ను బలోపేతం చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు. ►జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు. ►విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి. ►పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా.. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్ధలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. -
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించిన కేబినెట్ అందుకుఆమోద ముద్ర వేసింది. కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జ.గనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు. చదవండి: ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే.. -
అఫ్గాన్ భూకంప విలయం.. 2000 మంది మృతి
కాబూల్: ఆఫ్గానిస్థాన్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతస్థాయిలో భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు నేలకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 400కు పైగా ఇళ్లు నేలకూలాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఏడాది తూర్పు ఆఫ్గానిస్థాన్లో భయంకరమైన భూకంపం సంభవించింది. కొండప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్ Follow the Sakshi Telugu News channel on WhatsApp: -
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న ఇళ్లలో విద్యుత్ పొదుపు పథకం భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘నవరత్నాలు’లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విద్యుత్ ఆదా చర్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారీ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు విద్యుత్ పొదుపు చేయగల ఉపకరణాలను అందించే ప్రాజెక్టును చేపట్టడాన్ని ఢిల్లీలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ కౌన్సెలర్ డాక్టర్ జోనాథన్ డెమెంగే ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో చేపడుతున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను డెమెంగేకు ఈఈఎస్ఎల్ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వివరించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతో పాటు విద్యుత్ పొదుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను అందించే ప్రయత్నాన్ని డెమెంగే ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి లబ్ధిదారునికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను అందజేయడం వల్ల, ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చంద్రశేఖరరెడ్డి ఆయనకు తెలిపారు. ఫలితంగా ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్ల మిగులుతాయన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని డెమెంగే సూచించారు. గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్లను డెమెంగే అభినందించారు. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని డెమెంగే కోరారు. ఇంధన సామర్థ్య గృహ నిర్మాణ పథకాల వల్ల సామాన్య ప్రజలతో పాటు పర్యావరణానికీ లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మార్గనిర్దేశం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
-
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్లు ఉండే ఇంగ్లాండ్లో సెకండ్ హోమ్లు, హాలిడే హోమ్ల సమస్య కార్న్వాల్లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్లు ఉన్నట్లుగా కార్న్వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
కదిలిన అవినీతి పునాది!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి రూ.వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఎలా కాజేశారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా తరలించిన రూ.118.98 కోట్లను లెక్క చూపని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. 46 పేజీల ఆ సుదీర్ఘ లేఖలో నగదును ఏ విధంగా తరలించారు? బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మెసేజ్లు, ఎక్సెల్ షీట్లు, కోడ్ భాషలో రాసుకున్న సంకేతాలను విశదీకరిస్తూ అన్ని సాక్ష్యాధారాలతో మరీ నోటీసులిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అత్యధిక కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ను చంద్రబాబు స్వయంగా పరిచయం చేశారు. పీఎస్ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తనకు చేరవేస్తుంటారని, అతడి ద్వారా తాను సూచనలు చేస్తుంటానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ముడుపులపై మనోజ్ వాసుదేవ్ పార్థసానికి దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబుకు ముడుపులు ఏ రూపంలో, ఎలా ఇవ్వాలో ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పేవారని, లేదంటే తమ బిల్లులు పాస్ కాకుండా పెండింగ్లో పెట్టేవారని పార్థసాని వాంగ్మూలంలో వెల్లడించాడు. చంద్రబాబుకు రూ.వందల కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు మనోజ్ పార్థసాని తన వాంగ్మూలంలో ఐటీ శాఖకు తెలియచేశాడు. వితండ వాదనతో మళ్లీ నోటీసులు.. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అదే ఏడాది నవంబరు 1, 5వ తేదీల్లో అతడిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2020లో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు వితండ వాదన చేయడంతో ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ ఆయనకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జత చేయటంతో చంద్రబాబు ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు వెల్లడైంది. అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబుకు ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నందున దీన్ని అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. పేదల ఇళ్లలోనూ.. తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన చంద్రబాబు పేదల ఇళ్లను సైతం వదల్లేదు. రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ దోపిడీకి వేసిన పథకం ఐటీ నోటీసుల్లో బయటపడింది. ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదలకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్తో టచ్లో ఉండాలని చెప్పారని, పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని సూచించినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. లోకేశ్కూ అవినీతి సొమ్ము ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపారు. ఈమేరకు చంద్రబాబుకు జారీ చేసిన సుదీర్ఘ నోటీసుల్లో నారా లోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేశ్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నిస్తూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్లను స్క్రీన్షాట్ల రూపంలో జత చేసి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్లన్నీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వా«దీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవి కావడం గమనార్హం. వీటిని శ్రీనివాస్ ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజే‹Ùకు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి ప్రస్తావించగా కిలారు రాజేష్కు రూ.4.5 కోట్లను టీడీపీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. -
గృహ లక్షలే లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న గృహలక్ష్మి పథకానికి భారీపోటీ నెలకొంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవటానికి పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేసేందుకు గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే జిల్లా కలెక్టర్లు ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 15.04 లక్షలు అందాయి. వాటిల్లో ప్రాథమిక స్రూ్కటినీతో 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. గతంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో నెలకొన్న గందరగోళం, నిధుల సమస్య కారణంగా ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణంలో కొత్తవి చేపట్టడం లేదు. ఉన్నవి పూర్తి చేయటమే కష్టంగా మారిన తరుణంలో ‘గృహలక్ష్మి’అర్హులను ఎలా ఎంపిక చేస్తారా చూడాల్సిందే. ఎమ్మెల్యేలదే హవా.. గృహలక్ష్మి పథకాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. ఇళ్లు కేటాయించేందుకు రూపొందించే జాబితా వారి కనుసన్నల్లోనే సిద్ధం కానుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జాబితా సిద్ధం చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే సూచించిన గ్రామాలు, ప్రజలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే పారీ్టలకతీతంగా ఈ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అలాగే ఎంపికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. జాబితా రూపొందించిన తర్వాతగానీ అది ఎంతవరకు అమలైందో తెలుస్తుంది. ఎంపికలు ఎలా ఉన్నా.. పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఇళ్ల కేటాయింపు పెద్ద సవాల్గానే మారే అవకాశం కనిపిస్తోంది. డబుల్బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపికలోనూ వివాదాలు తప్పేలా లేవు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే వివాదాలు చెలరేగే ప్రమాదం నెలకొంది. ఇది నేతలకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అధికారులు పక్కన పెట్టిన దరఖాస్తుల్లోనూ అర్హులున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. వాటిని కూడా పద్ధతిగా పరిశీలిస్తే కనీసం మరో 2 లక్షల వరకు దరఖాస్తులు అర్హమైనవిగా తేలుతాయని అంటున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ జరపాలని, తూతూ మంత్రంగా గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నవి 4 లక్షల ఇళ్లే.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన 3.57 లక్షల ఇళ్లు కేటాయిస్తుంది. ముఖ్యమంత్రి పరిధిలో 43 వేల ఇళ్లు రిజర్వ్ చేశారు. వెరసి మొత్తంగా 4 లక్షల ఇళ్లు అర్హులకు కేటాయిస్తారు. ఇప్పుడు 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చటంతో, వీటిల్లో ఎవరికి ఇళ్లు దక్కుతాయోనన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో ఇళ్లు దక్కించుకునేందుకు ముమ్మరపోటీ నెలకొంది. ఇప్పటి నుంచి దరఖాస్తుదారులు తమకు అందేలా చూడాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఎక్కువగా సమయం లేనందున వీలైనంత తొందరలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పేదల ఇళ్లలోనూ పేలాలు ఏరుకున్న చంద్రబాబు
-
హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన ఇళ్ల సరఫరా
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని తొమ్మిది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్–జూన్ కాలంలో 1,22,213 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగానే ఉంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు ప్రాప్ఈక్విటీ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. తొమ్మిది పట్టణాల్లో కలిపి అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది. ► టైర్–1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ► ముంబైలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది. ► పుణెలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 % పెరిగి 52,208 యూనిట్లుగా నమోదైంది. ► కోల్కతా పట్టణలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధరలపై గృహ రుణాల ప్రభావం నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక నివాస గృహాల అందుబాటు ధరలపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాలకు సంబంధించి ‘అఫర్డబులిటీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఓ సగటు గృహస్థుడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి రేటును నైట్ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ తరచూ ట్రాక్ చేస్తుంటుంది. ఓ గృహస్థుడు తన ఇంటి రుణ ఈఎంఐని చెల్లించేందుకు వీలుగా అతడి ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తుంటుంది. 2023లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై గృహ రుణాల రేట్ల ప్రభావం పడినట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో అహ్మదాబాద్ అందుబాటు ధరలతో కూడిన ఇళ్ల మార్కెట్గా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 23 శాతంగా ఉంది. ఆ తర్వాత 28 శాతంతో పుణె, కోల్కతా, 28 శాతంతో చెన్నై, బెంగళూరు, 30 శాతంతో ఢిల్లీ ఎన్సీఆర్, 31 శాతంతో హైదరాబాద్, 55 శాతంతో ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. నైట్ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ ప్రకారరం ఒక పట్టణంలో 40 శాతం నిష్పత్తి ఉందంటే.. ఆ పట్టణంలోని నివాసులు సగటున తమ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ ఈఎంఐ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు అర్థం. 40 శాతం ఉంటే అందుబాటు ధరలుగా పరిగణిస్తుంది. 50 శాతానికి పైగా రేషియో ఉందంటే ఇళ్ల ధరలు అందుబాటులో లేనట్టుగా భావిస్తుంది. -
హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయం.. 29 మంది మృతి..
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వివిధ ఘటనల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోయాయి. ఏడుగురు మృతి చెందారు, మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. 16 Killed, Many Feared Trapped As Monsoon Fury Returns To Himachal Read here: https://t.co/5bjrcB342e pic.twitter.com/k3QM3rfryM — NDTV (@ndtv) August 14, 2023 తీవ్రంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో రాష్ట్రంలో 257 మంది మృతి చెందారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాగా.. 32 మంది తప్పిపోయారు. 290 మంది గాయపడ్డారు. శివ మందిర్ కూలి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలో శివ మందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం భక్తులు గుమికూడారని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ తెలిపారు. ఈ క్రమంలో మందిరం కూలిపోగా.. భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేస్తోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. Rescue Operations Underway As Temple Collapses Due To Landslide In Shimla pic.twitter.com/WJYBNXVchQ — NDTV (@ndtv) August 14, 2023 ఉత్తరాఖండ్లోనూ.. ఉత్తరాఖండ్లోనూ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. ఈ దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. #WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand. (Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 వర్షాలతో తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు. 1,169 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: Dwarka Expressway: ద్వారకా ఎక్స్ప్రెస్వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు -
పేదలగూడుపై జనసేన అబద్దాలు
-
వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు ‘గృహలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ధ్వంసమైన 419 ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు తగిన విధంగా పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ‘భారీ వర్షాల పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల’పై నిర్వహించిన లఘు చర్చకు మంత్రి ప్రశాంత్రెడ్డి సమాధానమిచ్చారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకోకున్నా.. 2020లో, తర్వాత రాష్ట్రం వరదలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని.. అయినా సీఎం కేసీఆర్ ధైర్యం కోల్పో కుండా పకడ్బందీగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారని వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇళ్లు నీట మునిగిన వారికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర సర్కారే ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. గతంలో భారీ వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సా యాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు రూ.150 కోట్లు చెల్లించిందని, త్వరలోనే మిగతా రూ.300 కోట్ల ను చెల్లించనున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసానిచ్చేలా రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర సమీక్ష తెలంగాణలో ఎన్నడూ లేనంత భారీ వర్షా లు నమోదయ్యాయని, ఈ వానలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షించార ని వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో అర్ధరాత్రి దాకా గంటలకొద్దీ సమీక్షలు, ప్రాజెక్టుల వారీగా పరిశీలనలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించా రు. వరద ప్రాంతాలకు సీఎం రాలేదన్న వి మర్శలు సరికాదని.. సీఎం కేసీఆర్ ఫొటోల కవరేజీ కోసం ఫోజులిచ్చే నాయకుడు కాద ని, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక బృందాలను పురమాయించి. మంత్రులు, కలెక్టర్లు, అధికారులను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వరదలతో కోతకు గురైన భూములపై సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. నష్టంపై పూర్తి అంచనాలు అందాక ఆర్థిక సాయంపై సీఎం తగిన నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల అలుగులు పటిష్టమై, కాలువల కట్టలు బలపడటంతో ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొన్నారు. వరదలు, వానల నష్టం ఇదీ.. రాష్ట్రంలో వరంగల్ కార్పొరేషన్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మి కుంట, ఖమ్మం కార్పొరేషన్, మహబూ బాబాద్, భైంసా, నిజామాబాద్ కార్పొరేషన్, పెద్దపల్లి, నర్సంపేటలలో అధిక నష్టం సంభవించిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శాసన మండలిలో చెప్పారు. 141 పురపాలికల్లో ముందస్తు, సహాయ చర్యలు చేపట్టామని, తాత్కాలిక మరమ్మతులకు రూ.76 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణకు మొత్తం రూ.304 కోట్లు, యూఎల్బీల పునరుద్ధరణ పనులకు రూ.380 కోట్లు అవసరమన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా 1,500 మందిని కాపాడామని మంత్రి చెప్పారు. 139 గ్రామాలకు చెందిన 27,062 మందికి 157 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కలి్పంచామని.. తాగునీరు, ఆహారం, దుప్పట్లు, మందులు సరఫరా చేశామని వివరించారు. ములుగు జిల్లా కొండాయి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపామన్నారు. 64 గ్రామాలు/ప్రదేశాలలో నీటిపైపులు దెబ్బతిని.. 1,199 జనావాసాలు 25,418 కుటుంబాలపై ప్రభావం పడగా.. వందశాతం తాగునీటి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. 769 గ్రామాల్లో పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. 23,075 స్తంభాలు, 3,405 డీటీఆర్లు దెబ్బతిని దాదాపు రూ.62.98 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. -
మధ్యతరగతి కుటుంబాలకు అసాధ్యమైన సొంతింటి కలను మీరు సుసాధ్యం చేసి చూపించారు
-
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి ఇక అందరిదీ
-
అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్
-
బీడుగా మారిన భూముల్లో పేదల సొంతింటి కల నెరవేరుతోంది :ఎంపీ సత్యవతి
-
Live: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
ప్రజాప్రభుత్వ ఆవిష్కరణలో మరో మైలురాయి
-
కృష్ణాయపాలెం లేఅవుట్ లో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
-
25న డబుల్ ఇళ్ల కోసం ధర్నా
కాచిగూడ/సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంకుశ కేసీఆర్ను గద్దె దించడం, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాధించడం కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మర్రి శశిధర్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, శ్యామ్సుందర్ గౌడ్, నాగూరావు నామాజీ, కేశబోయిన శ్రీధర్, కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమారమేశ్ యాదవ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డబుల్ ఇళ్ల అంశంపైనే కిషన్రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ కోర్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు ఒక్కో జిల్లానుంచి ఐదువేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లబి్ధదారులకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను ఇవ్వాలనుకోడం సరికాదని, ముందుగా అక్కడి స్థానికులకే ఇళ్లు కేటాయించాలని, తర్వాతే ఇతర ప్రాంతవాసులకు ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇళ్ల సమస్యపై ఆందోళన తర్వాత రేషన్కార్డులు, పింఛన్ల మంజూరు వంటి అంశాలపై కూడా వరుస ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
పేదలకు శరవేగంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
-
రేపు పేదల గృహ నిర్మాణాలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ
-
కేంద్రం ఒప్పుకోకున్నా ఆ భారం భరించడానికి ప్రభుత్వం సిద్ధం: సజ్జల
సాక్షి, అమరావతి: కలల రాజధాని కట్టబోతున్నామని చంద్రబాబు భ్రమలు కల్పించారు తప్ప చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం జీవం ఏమీ లేదని.. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలతో ఈ ప్రాంతంలో జీవం కన్పిస్తోందన్నారు. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పేదల నిర్మాణాలకి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఆరు నెలలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా 25 ఊర్లు ఈ ప్రాంతంలో రాబోతున్నాయన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఈ భారాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆరు నెలలలో ఊళ్లు వస్తాయి.. పాఠశాలలు, డిజిటల్ లైబ్రరీలు లాంటివి వస్తాయి.. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అన్ని సౌకర్యాలతో కొత్త ఊళ్లు రాబోతున్నాయని అన్నారు. పేదల నివాసానికి అనువుగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు. చదవండి మూడు నెలల తర్వాత ఐటీ ఉద్యోగి సమాధి బద్ధలు.. పిల్లల భవిష్యత్తు కోసమేనట -
‘మంగళగిరిలో లోకేష్ ఓటమి.. అందుకే పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోంది’
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్కే ప్రజలు మద్దతు’ -
సఫాయి సర్పంచ్
-
అసత్యమే సిరా.. సత్యం వధ.. నాడు కళ్లకు గంతలు.. నేడు పిచ్చిరాతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ సత్యాన్ని వధించి, అసత్యమనే సిరాతో తన ఈనాడు పత్రికలో మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. ‘ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు’ శీర్షికన విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో పరిస్థితి ఇదంటూ టీడీపీ పాలనలో చేసిన మోసాలను కప్పిపుచ్చి, ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు రాతలతో విషం చిమ్మారు. వాస్తవం ఏమిటంటే.. 2019 ఎన్నికల్లో ఎలా అయినా గెలుపొందాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తెరపైకి తీసుకొచ్చింది. కేవలం 6,500 ఇళ్లు (ఫ్లాట్లు) మాత్రమే నిర్మించేందుకు భూమిని సేకరించింది. టిడ్కో ఇళ్లు ఇస్తామంటూ ఏకంగా 11,917 మంది పేదల నుంచి రూ.38.33 కోట్లు వసూలు చేసింది. మరో వైపు టీడీపీ కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల దరఖాస్తులను బ్లాకులో విక్రయించారు. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు టీడీపీ చేసిన మోసాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివ్వెరపోయింది. పక్కాగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 5,341 మంది బాధితులకు వారు చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వడంతో పాటు, వారి పూర్తి అంగీకా రంతో ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. టిడ్కో ఇళ్ల కోసం 5,341 మంది లబి్ధదారులు డీడీల రూపంలో టిడ్కోకు రూ.16 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును లబి్ధదారులకు తిరిగి చెల్లిస్తున్నారు. నిర్మించని ఇళ్లకు నంబర్లు వేసి మరీ మోసం పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో 12 వేల ఇళ్ల నిర్మాణానికి 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాద గ్రామంలో 74 ఎకరాలు మాత్రమే తీసుకుంది. అది కొండ ప్రాంతం కావడంతో అధికారులు, ఇంజినీర్లు అహరి్నశలూ శ్రమించి చివరకు 6,576 ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన 11,917 మందికి ఇళ్లు కావాలంటే మరో 100 ఎకరాల వరకు అవసరం. ఎకరం రూ.కోటి చొప్పున 100 ఎకరాలు కొనేందుకు నాడు సర్వేలు చేపట్టిన చంద్రబాబు ఆ రూ.100 కోట్లను రైతులకు చెల్లించకుండానే చేతులు ఎత్తేశారు. కొండ ప్రాంతంలో 6,576 ఇళ్ల నిర్మాణమే సాధ్యమని తెలిసినా.. ఎన్నికల్లో గెలుపొందాలనే దురాశతో 11,917 మంది లబి్ధదారులకు ఏకంగా ఇంటి నంబర్లతో స్లిప్పులు తయారు చేయించారు. ఇళ్లు నిర్మించకుండా, సరిగ్గా ఎన్నికల ముందు 2019 జనవరి 17వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి, ఆ స్లిప్పులు పంపిణీ చేసి మోసగించారు. ఇది ఈనాడుకు కనిపించదా? విజయవాడ నగరంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని, పేదల నుంచి టీడీపీ కార్పొరేటర్లు, వారి అనుచరులు నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో నమ్మించి నగదు వసూలు చేశారు. రెండు వేల మందికిపైగా లబ్ధిదారుల నుంచి రూ.70 కోట్లు వసూలు చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ టీడీపీ నాయకులు మోసం చేశారంటూ స్పందన కార్యక్రమంలో ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు బాధితులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యవహా రంపై ఈనాడు పెన్నెత్తి ఒక్క వార్తా రాయదు. మేలు చేసిన ప్రభుత్వంపై విషం టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసిందనే విషయం ఏ బాధితుడిని అడిగినా చెబుతారు. ‘ఈనాడు’కు ఆ విషయా లేవీ కనబడకపోవడం, బాధితుల గోడు వినబడకపోవడం విడ్డూరంగా ఉంది. లబి్ధదారులు చెల్లించిన ప్రతి రూపాయి సహా లెక్కలు సేకరించిన ఆ పత్రికకు, ఆ డబ్బులు నాడు ఎలా మాయమయ్యాయి, టీడీపీ కాజేసిన ఆ డబ్బుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లించింది, బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించి ఎలా బాసటగా నిలిచింది అన్న వాస్తవాలు కనబడకపోవడం సిగ్గుచేటు. టీడీపీకి కొమ్ముకాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇలా అవాస్తవాలతో విషం చిమ్మడం, సత్యం ముందు బొక్కబోర్లాపడి ప్రజా కోర్టులో దోషిగా నిలిచి నవ్వులపాలవడం ఆ పచ్చ పత్రికకు సర్వసాధారణమైంది. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాం ఇప్పటికే లాటరీ ద్వారా 6,576 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటా యించాం. గతంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక లేకుండానే 11,917 మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికే ఇళ్లు కేటాయించగా, మిగిలిన వారు నష్టపోకుండా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం చేపడు తున్నాం. వారు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తున్నాం. ఇప్పటికే రూ.13.5 కోట్లు వెనక్కు ఇచ్చాం. మరో రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఇందులోనూ రూ.1.5 కోట్లకు సంబంధించిన బిల్లులపై సంతకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ -
‘రాజధాని’ వ్యాజ్యాలన్నీ త్రిసభ్య ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను అడ్డుకునే దిశగా టీడీపీ దాఖలు చేయించిన పిటిషన్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంతో పాటు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆర్ 5 జోన్ను సృష్టిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని, 1402 ఎకరాలు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయిస్తూ జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ద్విసభ్య ధర్మాసనానికి పంపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. సవరణ చట్టం, జీవో 45పై వ్యాజ్యాలన్నింటినీ వేర్వేరు ధర్మాసనాలు విచారించడం, వైరుధ్యమైన ఉత్తర్వులు రావడం అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాజ్యాలన్నింటినీ తామే విచారిస్తామని స్పష్టంచేసింది. వాటన్నింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇళ్ల నిర్మాణాలను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ముందున్న వ్యాజ్యం కూడా త్రిసభ్య ధర్మాసనం ముందుకే వస్తుంది. రాజధాని ప్రాంతంలో సదుపాయాల కల్పన, అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడంలేదంటూ రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు మంగళవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. రాజధానిపై ఇతర వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో పేదలకిచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసిందని, రేపు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించిన ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. అందుకే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేశామని చెప్పారు. ఆర్ 5 జోన్లో ఇళ్ల స్థలాలపై వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనమే ఈ వ్యాజ్యాన్ని కూడా విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. సీఆర్డీఏ న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. సవరణ చట్టం, జీవో 45పై గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఉన్న అభ్యర్థనలే తాజా వ్యాజ్యంలో కూడా ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణం అన్నది తాజా వ్యాజ్యం దాఖలు చేయడానికి కారణమని, అందువల్లే ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిందని మురళీధరరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలకు, తాజా వ్యాజ్యానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇళ్ల నిర్మాణం మినహా మిగిలిన అభ్యర్థనలన్నీ ఒకటేనన్నారు. గతంలో సవరణ చట్టాన్ని, జీవో 45ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందే ఉన్నాయన్నారు. అందువల్ల తాజా వ్యాజ్యాన్ని కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం అన్ని వ్యాజ్యాలలోని అభ్యర్థనలను పరిశీలించింది. అన్ని వ్యాజ్యాల్లోని అభ్యర్థనలు ఒకేలా ఉన్నాయని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో విచారణ 8 వారాలకు వాయిదా... రాజధాని ప్రాంతం అభివృద్ధి విషయంలో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజధానికి సంబంధించి తాము దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందన్నారు. ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా, అదే అంశంపై దిగువ న్యాయస్థానాలు విచారణ జరపడం సబబుగా ఉండదని వివరించారు. ఈ వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాల విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు పరిశీలించాకే.. ఇళ్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతులు తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జ్యోతిర్మయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ) బి.శశిభూషణ్రావు ఉదయం త్రిసభ్య ధర్మాసనం ముందు జరిగిన విషయాలను వివరించారు. అన్ని వ్యాజ్యాలను విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో ఆ ఉత్తర్వులను పరిశీలించిన తరువాత ఈ వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. -
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అక్కచెల్లెమ్మలకు రూపాయికే టిడ్కో ఇళ్లు
-
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
పేదల సొంతింటి స్వప్నం.. సాకారం చేసిన జగనన్న ప్రభుత్వం
-
పేదలకు ఇళ్లు..ఎల్లో మీడియాకు కుళ్లు..
-
జగనన్న వల్లే టిడ్కో ఇల్లు వచ్చింది.. అన్ని మౌలిక వసతులతో నిర్మించి ఇస్తున్నారు
-
అబ్బో ఎంత పెద్ద ఇళ్లో... విస్తీర్ణమైన గృహాలకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలు నిర్ణయంలో విస్తీర్ణం కూడా ప్రధానమైనదే. ఎవరు ఇంటికొచ్చినా అబ్బా ఎంత పెద్ద ఇళ్లో అనిపించుకోవాలనే కోరిక ప్రతీ గృహ కొనుగోలుదారులకు ఉంటుంది. ఫలితంగా దేశంలో ఏటేటా గృహ విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇంటి విస్తీర్ణాలలో 7 శాతం వృద్ధి నమోదైంది. 2018లో 1,150 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణం.. 2023 నాటికి 1,225 చ.అ.లకు పెరిగిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. గృహ కొనుగోలు ఎంపికలో కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2020 కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు గృహాలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఈ ఇళ్ల నిర్వహణ సులువు వంటి రకరకాల కారణాలతో చిన్న సైజు గృహాలను కొనుగోలుదారులకు ఎక్కువగా కోరుకునేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్, ఐసోలేషన్ గది వంటి కొత్త అవసరాలు ఏర్పడటంతో ఇంటి విస్తీర్ణాలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత నాలుగేళ్లలో తొలిసారికి గృహ విస్తీర్ణాలు పెరగడం ప్రారంభమైంది. 2023 నుంచి ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ.. పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. హైదరాబాదీలు విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే యూనిట్ సైజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఫ్లాట్ విస్తీర్ణం సగటున 2,200 చ.అ.లుగా ఉన్నాయి. ఏడాదిలో ఫ్లాట్ల సైజులలో 29 శాతం మేర వృద్ధి నమోదయింది. 2022 క్యూ1లో 1,700 చ.అ.లుగా ఉన్న ఫ్లాట్ల సగటు విస్తీర్ణం.. 2023 క్యూ1 నాటికి 2,200 చ.అ.లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోనే పెద్ద సైజు గృహాలలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. అత్యధికంగా ఎన్సీఆర్లో ఫ్లాట్ల సైజులు 50 శాతం మేర పెరిగాయి. 2022 తొలి త్రైమాసికం (క్యూ1)లో 1,130 చ.అ.లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,700 చ.అ.లకు పెరిగాయి. బెంగళూరులలో 1,200 చ.అ. నుంచి 1,300 చ.అ.లకు, కోల్కతాలో 800 చ.అ.ల నుంచి 1,150 చ.అ., పుణేలో 877 చ.అ. నుంచి 1,013 చ.అ.లకు పెరిగాయి. ముంబై,చెన్నైలలో క్షీణత: ఆశ్చర్యకరంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నైలలో గృహ విస్తీర్ణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. 2013లో 932 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణాలు.. 2022 క్యూ1 నాటికి 783 చ.అ.కు, 2023 క్యూ1 నాటికి 743 చ.అ.కు పడిపోయాయి. 2019తో పోలిస్తే 2020లో మాత్రమే ఫ్లాట్ల విస్తీర్ణాలలో 21 శాతం వృద్ధి నమోదు కాగా.. ఆ తర్వాతి ఏడాది నుంచి విస్తీర్ణాలలో క్షీణతే కనిపిస్తుంది. చెన్నైలో ఏడాది కాలంలో విస్తీర్ణాలు 6 శాతం మేర తగ్గాయి. 2022 క్యూ1లో 1,250 చ.అ. లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,175 చ.అ.లకు క్షీణించాయి. కరోనా తొలి దశలో చిన్నవైనా పర్లేదు సొంతిల్లు కావాలనే భావన గృహ కొనుగోలుదారులలో రావటంతో అప్పటి నుంచి ఎంఎంఆర్లో ఫ్లాట్ల విస్తీర్ణాలు క్రమంగా తగ్గుతున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఎంఎంఆర్, చెన్నైలలో పెద్ద సైజు గృహాల సరఫరా తగినంత ఉండటం, ఖరీదైన మార్కెట్లు కావటం కూడా చిన్న సైజు ఇళ్ల సరఫరా పెరగడానికి కారణమని పూరీ వివరించారు. -
ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్లు, మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి 7,350 కోట్లు ఖర్చు చేయనుంది. మహిళా పేరు మీదనే ఇల్లు మంజూరవుతుంది. లబ్దిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపికకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ది పొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించబడిన గృహలక్ష్మి లోగో ఉంటుంది. సంబంధిత కుటుంబం ఆహార భద్రత కార్డును కలిగి ఉండాలి. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా దరఖాస్తులు జిల్లా కలెక్టర్లు స్వీకరించనున్నారు. లబ్ధి దారుల ఎంపికలో స్క్రూటినీ చేసి, లబ్ధి దారులను కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్తో పాటు, మొబైల్ యాప్ను ప్రభుత్వం సిద్దం చేయనుంది. మూడు దశల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ రూఫ్ తోపాటు పనులు పూర్తయిన తర్వాత మొత్తం అమౌంట్ అందజేయనుంది. తొలుతగా లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు..!
-
ఇది మహాయజ్ఞం.. దేవుడు నాకిచ్చిన అవకాశం: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: రాష్ట్ర సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం. ప్రతీ లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 16,240 కుటుంబాలు.. ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే కాలనీలో నివాసం ఉండబోతోంది. రూ. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 178 ఎకరాల్లో 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. ► ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8వ తేదీన 8,859 ఇళ్ల పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం. ఇదే గుడివాడకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మనం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు 17,000.. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. ► అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల పట్టాల మీద 75,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం. ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు లక్ష ఖర్చు.స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 - 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ► దేవుడు నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా. కొంత మందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువయ్యాయి. నిరుపేదలకు నివాసం ఉండే 300 చ.అ. ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2వేలు. ఒక్కో ప్లాట్ కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో లక్ష. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం 1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోంది. మిగిలిన 3 లక్షల రూపాయలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. ► చంద్రబాబు హయాంలో.. నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు. అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు. వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నాం. ► 365 చదరపు అడుగలకి సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చ.అ. వాటికి 50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం లక్ష, మరో 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి 4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 430 చ.అ. తీసుకున్న ప్రతి పేద వాడికీ 3 లక్షలు కాకుండా, డిపాజిట్ లక్ష నుంచి 50 వేలకు తగ్గించాం. రూ. 4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. ► టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రభుత్వం 16,601 కోట్లు ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం. అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతున్నా. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి?. నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. ఆలోచన చేయాలి.మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ► అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు. అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్లు సంవత్సరాల కాలంలో 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా వెళ్తున్నాయి. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతు భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు ఇవ్వగలిగాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం 19,674 కోట్లు. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం. చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు రూ. 14,129 కోట్లు ఇవ్వగలిగాం. అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని విద్యాదీవె, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగాం. మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు? అని సీఎం జగన్ గుడివాడ బహిరంగ సభగా నిలదీశారు. -
పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్
-
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ఖరీదైన ఇళ్లు
-
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ, పెత్తందారులు అడ్డుకున్నారు: పొన్నవోలు
-
అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు
పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్ షిప్గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన సీఎం జగన్.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
కేరళలో కాలనీయే ఖాళీ ..!
కొచి: కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా గ్రామంలో ఒక కాలనీలో ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న 100కి పైగా ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ ఎన్నారైలకు చెందిన ఇళ్లే. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి మెరుగైన జీవితం కోసం ప్రజలు వివిధ దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ సంపాదించిన డబ్బులతో తమ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించారు. రిటైర్మెంట్ జీవితం ఆ ఇళ్లల్లోనే గడిపారు. వారి తదనంతరం పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆ ఇళ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఉన్న ఆ కాలనీ ఒకేసారి ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ మంచి సదుపాయాలు ఉండడంతో చాలా మంది ఆ ఇళ్లను కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. -
అమరావతిలో పండగ వాతావరణం...
-
రాజధాని పేదల ఇళ్ల స్థలాల కోసం మరో 268 ఎకరాలు
-
పేద కుటుంబాల ఇళ్ల స్థలాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే -
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసిన జగన్ సర్కార్
-
ఏపీలో పెద్ద ఎత్తున గృహనిర్మాణాలు
-
నెల్లూరు కావలిలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం
-
అందనంత దూరాన ఆవాసం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గృహాల కొరతను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో 1.9 కోట్ల గృహాల కొరత ఉంటే.. 2030 నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండనుందని పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గృహ, పట్టణ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా దాదాపు నాలుగు కోట్ల గృహాల కొరత ఏర్పడుతుందని పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో దాదాపు 36 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తుండగా, నిపుణులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తుండడమే పట్టణీకరణకు ప్రధాన కారణమని, గ్రామీణ ప్రాంతాల నుంచి సామాన్య జనం నగరాల బాట పడుతున్నారని చెబుతున్నారు. భూముల ధరలు,నిర్మాణ వ్యయం పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సొంతంగా ఓ గూడు దొరకడం గగనమవుతోంది. పట్టణాలు, నగరాల్లో వివాద రహిత భూములు లేకపోవడం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ఆచరణ సాధ్యమైన రెంటల్ మార్కెట్ లేకపోవడం తదితర అంశాలు గృహాల కొరతకు కారణమవుతున్నాయి, అందరికీ అందుబాటు ధరలో గృహాలు ఉండేందుకు వీలుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం తగ్గేలా చర్యలు తీసుకోవడమేగాక, ఆర్థిక సహకారం కూడా అందిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఒకప్పుడు భారీగా స్థలాలు సేకరించిన పలు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకుని రాలేకపోయాయి. అలాంటి స్థలాలను గృహ నిర్మాణ రంగానికి కేటాయిస్తే పరిస్థితులు మెరుగు అవుతాయని అంటున్నారు. సింగిల్ విండో పద్ధతి బెటర్.. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు త్వరగా అనుమతులు రావడానికి వీలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అమలు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ‘రెరా’(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతుల పేరిట కొంతవరకు అలాంటి వెసులుబాటు వచ్చినా.. అది భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఉపయోగపడుతోంది. మధ్య, దిగువ తరగతులకు అనుకూలంగా గృహాల నిర్మాణానికి అవసరమైన లే అవుట్లు, ఇళ్ల నిర్మాణానికి సులువుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అనుమతుల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సకాలంలో అనుమతులు రాక నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల కూడా పేదలకు గృహాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం, క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం కేవలం ఆర్థికంగా వెనుకబడిన, దిగువ ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని, వీటిని మధ్యాదాయ వర్గాలకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మౌలిక సదుపాయాలూ సమస్యే.. గ్రామీణ ప్రాంతాల నుంచి 2030 నాటికి అదనంగా 8.33 కోట్ల మంది ప్రజలు నగరాలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క గృహవసతే కాకుండా పరిశుభ్రమైన నీరు, ముగురునీటి పారుదల, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. పట్టణాలు, నగర జనాభాలో 17% మంది (అల్పాదాయ వర్గాలు) మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు అంచనా. 71 శాతం ప్రజలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. 60 శాతం ప్రజలకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే.. మరుగుదొడ్ల సౌకర్యం లేని మురికివాడలు సైతం ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వస్తున్న వారి ఆదాయాల్లో మార్పుల కారణంగా నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భూ సేకరణ వ్యయానికీప్రోత్సాహకాలు ఇవ్వాలి అందుబాటులో ఉండే గృహాలకు సంబంధించి నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ఆకర్షించేందుకు కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. పన్ను ప్రోత్సాహకాలతో డెవలపర్లను, వడ్డీ రాయితీలతో కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది. అయితే ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్టులకు భూమి సేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల కేంద్రం ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ వ్యయాలపై కూడా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. – అన్షుల్ జైన్, ఎండీ, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా మౌలిక వసతులు కల్పించాలి నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించాలంటే స్థలం కొరత ప్రధాన సమస్య. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అలా వెళ్లాలంటే శివారుల్లో ముందుగా రహదారులు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. హైదరాబాద్ డెవలపర్ల విషయానికొస్తే.. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు గ్రిడ్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓఆర్ఆర్ పరిధిలో ఈ తరహా గృహాల నిర్మాణం ఊపందుకుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. – శేఖర్రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ నెరవేరని పీఎంఏవై లక్ష్యం పీఎంఏవై పథకం కింద 2015 నుంచి 2022 మధ్య మొత్తంగా 1.23 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు లబ్ది దారులకు అప్పగించింది అందులో సగమే. 61 లక్షల గృహాలను మాత్రమే అందించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షలో బయటపడింది. వాస్తవానికి 1.07 కోట్ల గృహాల పనులు ప్రారంభించినా.. అన్నీ పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేని కారణంగా 5.61 గృహాలను లబ్ది దారులకు అందించలేకపోవడం గమనార్హం. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వాటాతో పాటు లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. అయితే పలు రాష్ట్రాలు తమ వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీగుర్తించింది. -
ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనకాపల్లి యూఎల్బీలో.. అనకాపల్లి యూఎల్బీలో జూన్ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు. రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే.. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా హౌసింగ్ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్లోని టిడ్కో హౌసింగ్కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. – జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్ -
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
నిరుపేదల టిడ్కో గృహాలపై ఎల్లో మీడియా విషం
-
బందరులో భయపడ్డ బాబు..
-
హైదరాబాద్ మార్కెట్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి. ‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఎఫ్వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్లో డిమాండ్ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్ టైగర్ నివేదిక పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► కోల్కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి. -
అప్పట్లోనే అదరగొట్టారు.. ఆ గ్రామంలో ఇళ్లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు, ఆ ఊరి మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు అక్కడి ఇళ్లను చూసి ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు అలాగే చూస్తుండిపోతారు. ప్రస్తుతం ఆధునిక ఇళ్లను నిర్మించుకుంటున్న కాలంలోనూ ఆ ఊళ్లో ఇప్పటికీ మిద్దె భవంతులే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీటిని స్థానికంగా మిద్దె భవంతులని, మిద్దె ఇళ్లని, హవేలి బాలంగి అని, బంగళా అని పిలుస్తారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఇళ్లను యజమానులు అలాగే కాపాడుకుంటున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటూ, ఆధునిక హంగులు సమకూర్చుకుంటూ ఆ ఇళ్లలోనే మూడు నాలుగు తరాలుగా నివసిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల గ్రామమైన పేట్సంగంలో అడుగు పెట్టగానే రోడ్డుకు ఇరువైపులా మిద్దె భవంతులు (రెండంతస్తులు) కనిపిస్తాయి. ఈ గ్రామంలోని మొత్తం నివాస భవనాల్లో దాదాపు సగం మిద్దె ఇళ్లే. ఊళ్లో మూడు వందల పైచిలుకు కుటుంబాలు నివసిస్తుండగా.. ఆయా కుటుంబాల్లో చాలావరకు తమ తాతల కాలం నుంచి మిద్దె ఇళ్లల్లోనే ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లోనైతే మూడు, నాలుగు తరాలవారు జీవిస్తున్నారు. కాగా వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గ్రామంలో పురాతన ‘శ్రీ సంగమేశ్వర దేవాలయం’ ఉంది. దీంతో గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది పేర్లు సంగయ్య, సంగవ్వ అని ఉంటాయి. డూప్లెక్స్ మాదిరి ఇళ్లు.. ఈ పాత కాలం నాటి మిద్దె ఇళ్లకు లోపలి నుంచే (డూప్లెక్స్ మాదిరి) మెట్లు ఉంటాయి. ఇంటి గోడలు నిర్మించిన తర్వాత పెద్దపెద్ద దూలాలు ఏర్పాటు చేసి వాటిపై చెక్కలను కప్పి స్లాబ్కన్నా బలంగా తయారు చేశారు. దానిపైన మళ్లీ గోడలు నిర్మించి గదులు నిర్మించుకున్నారు. చాలా ఇళ్లల్లో కర్ర లేదా మట్టితో కట్టిన మెట్లు ఉన్నాయి. పూర్వ కాలంలో రైతులు పంట ఉత్పత్తులను మిద్దె పైన నిల్వ చేసేవారు. నివాసం కూడా ఉండేవారు. పై నుంచి కిందకు చిన్న రంధ్రం ఉండేది. అందులోంచి వడ్లు, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులను కిందికి జారవిడిచేవారు. పంట ఉత్పత్తులే కాకుండా, ఇతర వస్తువుల్ని కూడా మిద్దె మీద దాచుకునేవారు. తర్వాతి కాలంలో అంటే ఆరేడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు మాత్రం ముందు భాగం స్లాబ్ వేసి, బయటి నుంచి మెట్లు ఇచ్చారు. పేట్సంగంలో నిర్మించిన మిద్దె ఇళ్లు ఎక్కువగా తూర్పు ముఖంతో నిర్మించగా, కొన్ని ఉత్తర(గంగ) ముఖంతో నిర్మించారు. పడమర, దక్షిణ ముఖంతో ఒక్క ఇల్లూ కనిపించదు. చల్లగా వెచ్చగా.. మా నాన్న కట్టిన మిద్దె ఇంట్లోనే పుట్టి, పెరిగినం. మిద్దె ఇల్లు కావడం వల్ల వానాకాలం, చలి కాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇళ్లకు మంచి రంగులు వేయించుకుని కొత్తదనం తీసుకువచ్చాం. – అన్నారం సంగాగౌడ్, పేట్సంగం తరతరాలుగా ఉంటున్నాం.. మా తాతలు, తండ్రులు, మేము అందరం మిద్దె ఇళ్లల్లోనే పెరిగాం. మా పిల్లలు కూడా ఈ ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఊళ్లో చాలామందికి మిద్దె ఇళ్లు ఉన్నయి. – కూచి హన్మాండ్లు, పేట్సంగం చదవండి: ప్రియుడితో ఉండగా వాట్సాప్కి మెసేజ్.. కోపంగా ఇంటికి వెళ్లి -
రెడీమేడ్ ఇళ్లు, భలే మోడళ్లు .. 90 శాతం పనులు ఫ్యాక్టరీలోనే.. ప్రత్యేకతలివే!
పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మన దేశ వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడళ్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ’ పేరిట లైట్ హౌస్ ప్రాజెక్టులను ప్రారంభించి.. వాటిని లైవ్ లేబొరేటరీలుగా మార్చింది. సాక్షి, అమరావతి: పట్టణ గృహ నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక, సిమెంట్తో నెలల తరబడి ఇళ్ల నిర్మాణాలు చేయక్కర్లేకుండా ఫ్యాక్టరీలోనే దాదాపు 90 శాతం ఇంటి పనులు పూర్తయిపోతాయి. విడిభాగాలను సైట్కు తరలించి బిగిస్తే బహుళ అంతస్తుల భవనం సిద్ధమైపోతుంది. విదేశాల్లో అమలులో ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మనదేశంలో చేపట్టే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో వేగంగా బహుళ అంతస్తుల భవనం సిద్ధం కావడం ఇందులో ప్రత్యేకత. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 54 అత్యుత్తమ ప్రాజెక్టులను పరిశీలించి మనకు అనువైన 6 మోడళ్లను ఎంపిక చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ పేరుతో చెన్నై, రాజ్కోట్, ఇండోర్, లక్నో, రాంచీ, త్రిపురలో నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవంగాను, లైట్ హౌస్ ప్రాజెక్టులుగా పేర్కొంటున్న వీటిని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కాలేజీలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలకు లైవ్ లే»ొరేటరీలుగా ఉపయోగపడనున్నాయి. ఆరు ప్రాజెక్టుల్లో 6,368 ఇళ్ల నిర్మాణం భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న 6 రాష్ట్రాల్లో విభిన్న టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణాలను చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ విధానంలో చెన్నైలో అన్ని వసతులతో 1,152 ఇళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. రాజ్కోట్లో మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులు కోవిడ్తో దేశంలో ప్రతికూల పరిస్థితులున్నా తక్కువ కాలంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఇండోర్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానెల్ విధానంలో 1,024 ఇళ్లు, లక్నోలో పీవీసీ ఫ్రేంవర్క్ టెక్నాలజీతో 1,040 ఇళ్లు, రాంచీలో ప్రీకాస్ట్ కాంక్రీట్–3డీ నిర్మాణ విధానంలో 1,008 ఇళ్లు, అగర్తల (త్రిపుర)లో లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్ విధానంలో 1,000 ఇళ్లు నిర్మించారు. ఇకపై దేశంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలో.. ఈ విధానంలో భవనం గోడలు, స్లాబ్, మెట్లు, బీమ్ మొదలైన అన్ని భాగాలు ప్లాంట్ లేదా కాస్టింగ్ యార్డ్లో తయారు చేసి, సైట్లో ఒకదానికొకటి బిగిస్తారు. కాంక్రీట్ను కూడా ఫ్లైయాష్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో చేస్తారు. దీంతో మన్నికగా ఉండడంతో పాటు సహజ వనరులను సంరక్షించినట్టవుతుని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీతో చెన్నైలో 1,152 ఇళ్లను నిర్మించారు. మోనోలిథిక్ టన్నెల్ కాంక్రీట్తో.. ‘టన్నెల్ఫార్మ్’గా పిలిచే అచ్చుల్లో స్లాబ్లు, గోడలు, గదులను ఒకేసారి వేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఒక్కరోజులో సెంట్రింగ్ సపోర్టును తొలగించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. వీటికీ ఫ్లైయాష్ గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో కాంక్రీట్ తయారు చేస్తారు. బాక్స్ టైప్ మోనోలిథిక్ స్ట్రక్చర్ కావడంతో భూకంపం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటుంది. గుజరాత్లోని రాజ్కోట్ ఈ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. శాండ్విచ్ ప్యానెల్ టెక్నాలజీ ఇలా.. ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించేటప్పుడు సంప్రదాయ ఇటుక గోడలకు బదులుగా ఫ్యాక్టరీలో తయారైన సిమెంట్ లేదా కాల్షియం సిలికేట్ బోర్డులను వాడతారు. స్టీల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్కు గోడలుగా ఈ బోర్డులను బిగిస్తారు. వీటిని ఫ్యాక్టరీలోనే తయారుచేసి సైట్లో ఒకదానికొకటి అనుసంధానిస్తారు. ఇవి తక్కువ బరువుతో పాటు మెరుగైన థర్మల్ ఇన్సులేషన్గానూ పనిచేస్తాయి. బలమైన పునాది కూడా అవసరం లేదు. ఇండోర్ (మధ్యప్రదేశ్)లో ఈ టెక్నాలజీతో 1,024 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పీవీసీ పాలిమర్ కాంక్రీట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఇంటి ప్లాన్ ప్రకారం పాలీ వీనైల్ క్లోరైడ్ (పీవీసీ) వాల్ ప్యానెళ్లు ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్లో బిగిస్తారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్ బిగించిన తర్వాత గోడ ప్యానెళ్లను డెక్కింగ్ ఫ్లోర్తో అనుసంధానం చేస్తారు. గోడ ప్యానెళ్ల మధ్యనున్న ఖాళీల్లో కాంక్రీట్ నింపుతారు. లక్నోలో 1,040 ఇళ్లను ఈ టెక్నాలజీతో చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్– 3డీ వాల్యూ మెట్రిక్ విధానం 3డీ వాల్యూమెట్రిక్ కాంక్రీట్ నిర్మాణంలో గదులు, టాయిలెట్, కిచెన్, బాత్రూమ్, మెట్లు.. ఇలా వేటికవే మాడ్యూల్స్గా యార్డులో నిర్మించి సైట్లో బిగిస్తారు. ఇలా ఒకదానిపై మరొకటిగా ఎన్ని అంతస్తులైనా బిగించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా గోడలంటూ వేరుగా ఉండవు. అన్ని వాతావరణాలను తట్టుకోవడం దీని ప్రత్యేకత. ఈ విధానంలో రాంచీలో 1,008 ఇళ్లను నిరి్మస్తున్నారు. లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్– ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చరల్ పునాది అవసరం లేని ఈ టెక్నాలజీలో గాల్వనైజ్డ్ లైట్ గేజ్ స్టీల్ భాగాలతో ఇంటి భాగాలను బిగిస్తారు. ఫ్రేమ్ల మధ్యలో ఇన్సులేషన్ మెటీరియల్ను నింపి, తేలికపాటి కాంక్రీట్ ప్యానెళ్లను గోడలుగా అతికిస్తారు. ఈ విధానంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లోనే నిర్మించవచ్చు. భవనాన్ని విడదీసి మరోచోటుకు తరలించవచ్చు. స్టీల్ ఫ్రేమ్ బీమ్లు తేలిగ్గా ఉండటంతో భూకంపాలను తట్టుకుంటుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనువైనది కావడంతో అగర్తల (త్రిపుర)లో 1,000 ఇళ్లను నిర్మించారు. -
ఇంటికి హక్కు.. ఖజానాకు కిక్కు.. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్దీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇళ్లు, నిర్మాణాలను ఎలా క్రమబద్ధీకరించాలి, ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సేకరించిన వివరాలను పరిశీలించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం సమావేశం కానుంది. ఇళ్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణతోపాటు ఈ హక్కుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై ఆదాయార్జన శాఖల అధికారులతోనూ సోమవారమే కేబినెట్ సబ్ కమిటీ విడిగా సమావేశం కానుంది. రెండు కీలక అంశాలపై ఒకేరోజు సబ్ కమిటీ భేటీలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల నుంచి సాదాబైనామాల దాకా.. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేని ఇళ్లు, నిర్మాణాల వివరాలను మొత్తం 12 కేటగిరీల్లో రెవెన్యూ శాఖ సేకరించింది. ఇందులో ప్రభుత్వ స్థలాలు, సాంఘిక సంక్షేమశాఖ సేకరించిన భూములు, సీలింగ్ భూములు, ఆబాదీ/గ్రామకంఠం, దేవాదాయ, వక్ఫ్, శిఖం/ఎఫ్టీఎల్, పలు శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, పలు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం లీజుకిచ్చిన భూములు, నోటరీలు మాత్రమే ఉన్న భూములు, సాదాబైనామా లావాదేవీలు జరిగిన భూములు, ఇతర కేటగిరీల స్థలాలు ఉన్నాయి. ఈ కేటగిరీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామాల నుంచీ వివరాలను పంపాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్దేశిత ఫార్మాట్ పంపగా.. తహసీల్దార్లు ఆ వివరాలను సేకరించి అందజేశారు. 12.5 లక్షల నిర్మాణాలు? కొన్నిరోజులుగా రెవెన్యూ యంత్రాంగం సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు 12.5 లక్షల వరకు ఉన్నట్టు తేల్చారు. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. ఒక్కో రెవెన్యూ డివిజన్లో 15వేల నుంచి 17 వేల వరకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. మొత్తంగా 60శాతానికి పైగా నిర్మాణాలు గ్రామ కంఠాలు, ఆబాదీ భూముల్లోనే ఉన్నాయని.. అలా ఉన్నవాటి సంఖ్య ఏడున్నర లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక గ్రామాలు, పట్టణాల్లో కలిపి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు కలిపి మరో రెండున్నర లక్షలు (16–20 శాతం) ఉండవచ్చని.. మిగిలిన కేటగిరీల్లో మరో 2–3 లక్షల వరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతానికి తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ లెక్కలు వేశామని.. సమగ్రంగా పరిశీలన చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత సోమవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ డేటా సేకరణకు నిర్ణయం తీసుకున్నారని.. ఈ వారం రోజుల్లో 20 జిల్లాల నుంచే పూర్తి సమాచారం వచ్చిందని, మరికొన్ని జిల్లాల నుంచి అందాల్సి ఉందని అంటున్నాయి. రెగ్యులరైజ్ చేసేదెలా? దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుంటే.. వాటిని క్రమబదీ్ధకరించడం ఎలాగన్న దానిపై సోమవారం జరిగే కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్దీకరించాల్సిన ఇళ్లు, నిర్మాణాలు ఎన్ని ఉంటాయి? వాటిని క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలేమిటన్న వివరాలను ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జీవో 58, 59 (పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న నివాసాల క్రమబదీ్ధకరణ) మాదిరిగా స్థలాల ప్రభుత్వ విలువ ఆధారంగా సీలింగ్ నిర్ణయించి.. చదరపు గజాల లెక్కన ఫీజు వసూలు చేసి క్రమబద్దీకరించాలా? లేక ప్రతి ఇల్లు/ నిర్మాణానికి గ్రామాలు/పట్టణాల వారీగా గంపగుత్తగా రుసుము నిర్ణయించి క్రమబదీ్ధకరించాలా? అన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సాదాబైనామాలు, నోటరీ (జీహెచ్ఎంసీ పరిధిలో) భూముల విషయంలోనూ క్రమబదీ్ధకరణకు అవకాశాలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఈ అన్ని అంశాలపై సబ్ కమిటీ తీసుకునే నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదికగా అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగతంగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. క్రమబదీ్ధకరణ కటాఫ్ తేదీని, దరఖాస్తు గడువును త్వరలో ప్రకటించవచ్చని అంటున్నాయి. బూమరాంగ్ అవుతుందా? ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠాలు, ఇతర భూముల్లోని ఇళ్లు, నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం బూమరాంగ్ అవుతుందా అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. గతంలో పట్టణాలు, గ్రామాల్లోని ఓపెన్ ప్లాట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రకటించింది. రూ.1,000 చెల్లించి వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకోవాలని.. తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లించి స్థలాలు, భవనాలను క్రమబదీ్ధకరించుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనతో లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. తమ భూములు, భవనాలపై ప్రభుత్వానికి మళ్లీ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రజల నుంచి ప్రతికూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను ఎటూ తేల్చకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఇళ్లు, నిర్మాణాల క్రమబదీ్ధకరణ చేపడితే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా క్రమబదీ్ధకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, అదే సమయంలో ఆదాయం సమకూర్చుకోవడానికి గల అవకాశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనున్నట్టు తెలిసింది. ఆదాయ వనరులపెంపుపైనా నజర్ సోమవారమే మరో ప్రధాన అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్కమిటీ భేటీ కానుంది. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం పెంపునకు మార్గాలపై ఆర్థిక, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించనుంది.ఇందులో ప్రభుత్వ భూముల వేలం, విలువైన అసైన్డ్ భూముల సేకరణ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, దిల్ వంటి సంస్థల చేతుల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలు తదితర అంశాలను పరిశీలించి.. ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. -
టర్కీ భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..13 అడుగులు కుంగిన ఇళ్లు
ఇస్తాన్బుల్: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు. భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
పేదల సొంతింటి కల సాకారం..ఉగాదికి సాముహిక గృహ ప్రవేశాలు
పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మెటీరియల్, సకాలంలో బిల్లులను కూడా చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు సొంతిళ్లలోకి చేరిపోయారు. తుదిదశకు చేరిన వాటిని ఉగాది పండుగ నాటికి పూర్తి చేయించి సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సాక్షి, పుట్టపర్తి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగం పెరిగింది. పేదలు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలను చేపట్టి వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో పడ్డ అవస్థలు తీరుతుండటంతో సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సొంతింటి కల సాకారం దిశగా పాలన సాగిస్తున్నారని లబ్ధిదారులు కొనియాడుతున్నారు. అవసరమైన నిధులు కేటాయింపులు జరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి, బీడుపల్లి, జగరాజుపల్లి, ఎనుములపల్లి వద్ద జగనన్న కాలనీలు వెలిశాయి. అలాగే ధర్మవరం పట్టణ సమీపంలోని కాలనీలో చాలా ఇళ్లు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయి. పనుల పరుగులు.. ప్రభుత్వ మార్గదర్శకాలతో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 168 జగనన్న లేఅవుట్లలో 24,643 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలకు నివాసయోగ్యం కింద ఇల్లు మంజూరు చేశారు. జిల్లాకు సంబంధించి మొత్తం 62,716 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా.. మిగిలిన వాటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇబ్బందుల్లేకుండా చర్యలు.. ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.80 లక్షలకు తోడు డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు చేపట్టారు. ఈ రుణంతో లబి్ధదారులు బయటి వ్యక్తుల ద్వారా అప్పులు చేయకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికితోడు ఇబ్బందిలేకుండా ఇసుక, మెటీరియల్ అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మౌలిక వసతుల కల్పన.. జిల్లా వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 168 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఆయా లేఅవుట్లలో విద్యుత్ లైన్లు, రహదారులు, కరెంటు మీటర్లు, తాగునీటి వసతుల కల్పన వంటి పనులు చేపట్టారు. ఫలితంగా కాలనీలు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షహీనా. హిందూపురం పట్టణ సమీపంలోని మణేసముద్రం. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు అయింది. మెటీరియల్ దగ్గరి నుంచి బిల్లుల దాకా అన్ని విధాలా సహకారం లభించడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేశామని షహీనా హర్షం వ్యక్తం చేశారు. ఈమె మల్లీశ్వరి. ధర్మవరం పట్టణం శాంతినగర్ వాసి. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించడంతో ఇంటి నిర్మాణం పూర్తయిందని మల్లీశ్వరి తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే తమ సొంతింటి కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఇలా.. జిల్లాకు మంజూరైన ఇళ్లు 62,716 జగనన్న లేఅవుట్లు 168 నిర్మాణాలు పూర్తి చేసుకున్నవి 5,750 పైకప్పు పూర్తయినవి 3,713 పైకప్పు వరకు 2,742 పునాది వరకు 12,403 పునాది పనుల్లో.. 22,230 ప్రారంభం కానివి 15,878 (చదవండి: స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..) -
జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో జోషిమఠ్ వంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ధాత్రి పట్టణంలోని నాయి బస్తీలో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతోపాటు ఓ మసీదుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు భూమి కుంగిపోవడంపై స్పందించిన జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తునట్లు వెల్లడించారు. భవంతులకు పగుళ్లు ఏర్పడటంపై గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల బృందాన్ని సదరు గ్రామాలకు పంపినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. కాగా ధాత్రి మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. అయితే భూమి కుంగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ధాత్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పటి వరకు 20 భవనాలకు బీటల వారగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా బస్తీ ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. అయితే స్థానికంగా రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కలా ప్రాంతాల్లో నది నీరు ప్రవహించడం వంటి అనేక కారణాలు కొండ పక్కనే ఉన్న గ్రామంలో భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే ఎక్కువగా పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు. చదవండి: విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఇళ్లులేవు.. అనుమతులూ లేవు..
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు పక్కా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారా అని రెండేళ్లుగా వేచి ఉన్నామని.. ఇప్పటికీ ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభమే కాలేదని అంటున్నారు. కనీసం సొంతంగా కట్టుకునే పర్మిషన్లూ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పాత, సగం కూలిపోయిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే సొంతంగా కట్టుకునేందుకు అనుమతులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఇటీవల భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న సీఎం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి, స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతకుముందు జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించడానికి వాసాలమర్రి మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సీఎం సాయంత్రం తిరుగుప్రయాణంలో గ్రామంలోని రామాలయం వద్ద ఆగి మాట్లాడారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేకంగా లేఅవుట్ అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి చేపట్టాల్సిన పనులపై సర్వే చేశారు. రూ.152 కోట్లతో డీపీఆర్ను రూపొందించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 481 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక వాసాలమర్రిలో ప్రస్తుతం 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ఈ 481 ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారి కోసం జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతర్గత మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకు, పార్కు, ఫంక్షన్హాల్, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, పోస్టాఫీస్, మినీ మార్కెట్, సబ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించారు. గ్రామాన్ని పునర్నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఇళ్లు కూడా నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇవేవీ ముందుకుపడలేదు. వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి గ్రామంలో 481 పెంకుటిళ్లు కూల్చివేసి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రెండేళ్లు అవుతోంది. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనడమేగానీ నిర్మాణం ప్రారంభం కావడం లేదు. గ్రామ అభివృద్ధి కోసం రూ.152 కోట్లతో డీపీఆర్ పంపించారు. నిధులు రాలేదు. లేఅవుట్ కాలేదు. 50 ఇళ్లు కూలిపోయాయి. నా ఇల్లు కూడా సగం కూలిపోయింది. కొత్తగా కట్టుకుందామంటే పర్మిషన్ లేదు. వెంటనే ఇళ్లు కట్టించాలని, లేకుంటే కట్టుకునే పర్మిషన్ అయినా ఇప్పించాలని గ్రామస్తులు పంచాయతీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదైనా సీఎం సార్ నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. మూడు విడుతలుగా నిధులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మౌలిక వసతుల కోసం రూ.58 కోట్లతో మరో డీపీఆర్ పంపించామని కలెక్టర్ చెప్తున్నారు. త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్, వాసాలమర్రి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం నూతన భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు. వానాకాలంలో పాత ఇళ్లు కొన్ని కూలిపోయాయి. కొందరు గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వకుండా.. మరోవైపు సొంత డబ్బులతో కట్టుకుందామనుకున్నా అనుమతులు ఇవ్వక పోవడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. – పలుగుల మధు, ఉప సర్పంచ్ -
గోహత్యపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు
గుజరాత్ కోర్టు గో హత్యపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కోర్టు అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తి కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. గో హత్య నిలిపేస్తే భూమిపై ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు జడ్జి పేర్కొన్నారు. సదరు వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆవుపేడతో చేసిన ఇళ్లు రేడియోషిన్కి గురికావని సైన్స్ రుజువు చేసింది. గోమూత్రం అనేక నయం చేయలేని వ్యాధులకు మందు. ఆవు ఒక జంతువు మాత్రమే కాదని, 68 కోట్ల పవిత్ర స్థలాలకు, 33 కోట్ల దేవతలకు నిలయమని అన్నారు. అందుకు సంబంధించిన శ్లోకాలను ప్రస్తావిస్తూ..ఆవులను హింసిస్తే మన సంపద, ఆస్తులు నశిస్తాయని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు కోపం, ఆవేశం వంటివి పెరిగిపోవడానికి గోవధే కారణం. దీనిని పూర్తిగా నిషేధించే వరకు వాతావరణం మార్పులకు(కాలుష్యానికి) గురికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సదరు వ్యక్తిని గతేడాది ఆగస్టులో 16 ఆవులు అక్రమంగా రవాణ చేయడంపై అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించడమే గాక సుమారు రూ. 5 లక్షల జరిమాన విధించింది. (చదవండి: 76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!) . -
ఏపీలో ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు ఊపు...
సింగపూర్ కు చెందిన ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ కేంద్ర పెట్రోలియం బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొంది ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని నెలల క్రితం ఇంధన సరఫరా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏజీ అండ్ పీ ప్రధామ్ రీజనల్ హెడ్ సాక్షితో ముచ్చటించారు. నేచురల్ పైప్లైన్ గ్యాస్ సరఫరా ప్రగతి తదితర విశేషాలు ఆయన మాటల్లోనే... ఏపీలో విస్తారంగా... ఇండియాలో 30 ఏళ్లుగా సీఎన్జీ గ్యాస్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. సౌత్తో పోల్చితే నార్త్లో ఎక్కువగా ఢిల్లీ, ముంబైలో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, హైదరాబాద్లలోనూ సీఎన్జీ యాక్టివిటీ ఎక్కువ. కాకినాడలోనే 50 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్లో సీఎన్జీని వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 120 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం కమర్షియల్ వినియోగానికే ఉన్నాయి. ఈ నేపధ్యంలో గృహావసరాలకు సంబంధించిన వినియోగాన్ని కూడా విస్తృతం చేయాల్సి ఉంది. బహుళ ప్రయోజనాలు... పైప్లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలో లభిస్తుంది అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం, పర్యావరణ హితం కూడా. సరఫరా మొత్తం పైప్లైన్ సిస్టమ్లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. ఇక నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. వేగంగా ఇన్స్టలేషన్... గూడూరు టౌన్లోనే కాకుండా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలో 9 సిఎన్జీ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. నేషనల్ హైవే కావలితో పాటు నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి.. మొదలైన చోట్ల పైప్లైన్ యాక్టివిటీ జరుగుతుంటే హౌజ్హోల్డ్ ఇన్స్టాలేషన్ నాయుడుపేట, గూడురులలో జరుగుతోంది. సిఎన్జీ గ్యాస్ కనెక్షన్తో పాటే పంబ్లింగ్, స్టౌ వంటివన్నీ ఇందులో కలిపే ఉంటాయి. మొదటి నెలలో ఇన్స్టాలేషన్ చార్జ్ ఉంటుంది. తర్వాత నెల నుంచి ఉండదు. కాకపోతే ముందు 6 వేల రూపాయలసెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది. ప్రతీ నెల గ్యాస్ వాడుకున్నదాన్ని బట్టి ఆ తర్వాత బిల్పే చేసే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా ఈ ఛార్జెస్ ఉంటాయి. గూడూరు టౌన్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ రూ. 800 ఉంటే నాయుడుపేట టౌన్లో రూ.2700 ఉంది. కమర్షియల్ రిజిస్ట్రేషన్స్ కు అంటే స్కూల్, బిజినెస్ ఇతరవాటికి ఒక విధంగా, రెసిడెన్సియల్కు ఒక విధంగా రేటు ఉంటుంది. పైప్లైన్ ప్రొవిజన్ బట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 10000ల రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఒక్కో ఇంటికీ మ్యాగ్జిమమ్ రెండు కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వంటకు కావల్సిన గ్యాస్తో పాటు వాటర్ గీజర్కు కూడా కనెక్షన్ ఇస్తాం. స్పందన బాగుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోంది. అదే విధంగా ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వారి గైడ్లైన్స్ ప్రకారం మేం పనులు నిర్వహిస్తున్నాం. -
రిటైల్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల జోరు
దేశ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్స్) గతేడాది అరు రెట్లు వృద్ధి చెంది 492 మిలియన్ డాలర్లుగా (రూ.4034 కోట్లు) నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం రిటైల్ వ్యాపారాలు పుంజుకోవడాన్ని కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 2021లో రిటైల్ రియల్ ఎస్టేట్లోకి 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం గమనించాలి. 2020, 2021లో కరోనా ఉధృతంగా ఉండడం పెట్టుబడులపై ప్రభావం చూపించింది. ఇక భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు 2022లో 20 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 4.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డేటా కేంద్రాలు, సీనియర్ హౌసింగ్, హాలీడే హోమ్స్ తదితర ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్లోకి గతేడాది 867 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021లో వచ్చిన 453 మిలియన్ డాలర్ల కంటే 92 శాతం పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చే ప్రత్యామ్నాయ సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్స్ ఆకర్షించాయి. ఆఫీస్ మార్కెట్లోకి 41 శాతం ఇక గతేడాది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 41 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చాయి. అంటే 1.9 బిలియన్ డాలర్లను ఆఫీస్ స్పేస్ విభాగం ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో పెట్టుబడులు 1.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి రెట్టింపునకు పైగా పెరిగి 464 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్, వేర్హౌసింగ్ ఆస్తుల్లోకి 63 శాతం తక్కువగా 422 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 1,130 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివాస ప్రాజెక్టుల్లోకి సైతం 29 శాతం తక్కువగా 656 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పెట్టుబడులు గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వస్తున్నాయి. నిర్మాణాత్మక వచ్చిన మార్పుతో ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుంది’’అని కొలియర్స్ఇండియా తన నివేదికలో పేర్కొంది. చదవండి: ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్! -
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
పటాన్చెరు టౌన్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని జీఎంఆర్ హాల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పదో ప్లీనరీ మహాసభలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. తమది తెలంగాణ వాదమని అన్నారు. కొన్ని పేపర్లకు పేరు ఉండదు.. ఊరు ఉండదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయని విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెస్మీట్ పెట్టిందిలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ 300 మంది జర్నలిస్టులతో సమావేశం పెడతారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందని, దమ్ముంటే మోదీ కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమంలో వారు చేసిన పోరాటాలు మరచిపోలేమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వార్తలను ఉన్నది ఉన్నట్లు రాయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్లీనరీలో ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు గమనించాలని కోరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు బలం వచ్చిందని అన్నారు. -
నాలుగో విడత టిడ్కో ఇళ్లు పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో (జీ+3) ఇళ్లు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ పనులపైనా టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్ అధ్యక్షతన బుధవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు. నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నవాటిని అందజేయనున్నారు. ఇందులో నంద్యాల 5 వేలు, శ్రీకాకుళం 1,280, పొన్నూరు 2,368, అడవి తక్కెళ్లపాడు(గుంటూరు) 2,500, సాలూరు 1,200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయి. కాగా, పంపిణీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని పూర్తయితే అన్నింటినీ అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో ప్రభుత్వం రూ. 1కే అందిస్తున్న 300 చ.అడుగుల యూనిట్లు మినహా మిగిలిన 365, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల విషయంలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కానివారికి నాలుగైదు రోజుల్లో మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, జనవరి చివరినాటికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన 1.20 లక్షల యూనిట్ల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 75 నుంచి 80 శాతం పూర్తయిన బ్లాకులకు యుద్ధప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను ఆదేశించారు. బోర్డు సమావేశంలో చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటు టిడ్కో బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు!
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసొస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్గా ఎదగాలంటే చేయాల్సిందిదే! స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కండీషన్స్ అప్లై ఎలాగైతే ఉంటుందో అలాగే స్థిరాస్తి రంగానికీ ఉంటుంది. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్లోని వసతులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం శివారు ప్రాంతాలలో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా ఏ ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్ నిర్ణయించుకుంటాడు. ఇలాంటి పరిస్థితులలో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా.. గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్మెంట్ను నిర్మిస్తుంది. ఇందులో ధర చ.అ.కు రూ.5,500లకు విక్రయిస్తుంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్లో ధర చ.అ.కు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్లలో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు. రేపటి అవసరాన్ని బట్టే కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమం అని చాలా మంది సలహా ఇస్తుంటారు కానీ ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థ్ధిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్లు చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. పైగా విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని బట్టి గృహాలను కొనుగోలు చేయాలి. చాలా మంది ప్రస్తుతం ఆర్జించే ఆదాయానికి పరిమితమై కొనుగోలు నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు, పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈరోజు 2 బీహెచ్కే కొనే చోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్లో 2.5 బీహెచ్కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్కే ధరకే వస్తుంది. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. ఉత్తమ గృహ కొనుగోలుదారులు చేసేదిదే. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వీటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలలో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఇప్పటికే ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలకు, ప్రాంతాలతో దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ఏరియాలకు కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ మెరుగైంది కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, నేడు పరిస్థితి మారింది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. – నరేంద్ర కుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ చదవండి: NPCI: ఫోన్పే, గూగుల్పే యూజర్లకు భారీ ఊరట.. -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
పవన్ పై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ ఫైర్
-
పేదలకు ఇళ్ళు ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట : మంత్రి జోగి రమేష్
-
హైదరాబాద్ లగ్జరీ జోష్.. దేశంలో రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధరల రియల్టీ మార్కెట్గా ఉన్న హైదరాబాద్ లగ్జరీ విపణిగా అభివృద్ధి చెందింది. కరోనా కంటే ముందు వరకూ దేశంలో అఫర్డబులిటీ మార్కెట్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచేది. కానీ, ఇప్పుడు దేశంలోని అత్యంత లగ్జరీ స్థిరాస్తి విపణిలో ముంబై తర్వాత భాగ్యనగరం రెండో స్థానానికి ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే మనదే తొలిస్థానం. ∙ గృహ కొనుగోలుదారుల సగటు ఆదాయం, నెలవారీ ఈఎంఐ చెల్లింపు నిష్పత్తి ఆధారంగా నైట్ఫ్రాంక్ కొనుగోలు సూచీని అంచనా వేసింది. దీని ప్రకారం.. 2010లో హైదరాబాద్లో ఆదాయంలో 53% ఈఎంఐ కోసం వెచ్చించేవారు. ఆ తర్వాత 2014లో 42%, 2019లో 33%, 2020లో 28%గా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ, కరోనా తర్వాత వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈఎంఐ భారం కూడా పెరిగింది. ఫలితంగా 2021లో ఆదాయంలో ఈఎంఐ వాటా 29%, 2022 నాటికి 31 శాతానికి వెచ్చించాల్సి వస్తోంది. ముంబైలో 2010లో ఆదాయంలో 93 శాతంగా ఈఎంఐగా చెల్లిస్తే సరిపోయేది. 2022 నాటికి 53 శాతానికి తగ్గింది. 22 % ఈఐఎం నిష్పత్తితో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్గా నిలవగా.. 26%తో పుణే రెండో స్థానంలో, 27%తో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. తగ్గిన కొనుగోలు శక్తి.: ఏడాది క్రితం 7.30 శాతంగా ఉన్న గృహ రుణ వడ్డీ రేట్లు ఏడాది కాలంలోనే 0.95% మేర పెరిగి 8.25కి చేరింది. దీంతో గృహ కొనుగోలు నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నైట్ఫ్రాంక్ ఇండియా ‘అఫర్డబులిటీ ఇండెక్స్ క్యూ3–2022’ నివేదిక వెల్లడించింది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా స్థిరాస్తి కొనుగోళ్ల శక్తి సగటున 2% క్షీణించడంతో పాటూ ఈఎంఐలపై 7.4% అదనపు భారం పడుతుందని వివరించింది. చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా.. -
స్వగృహ వేలం 2.0
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సర్కారు.. మరో విడత ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆస్తుల రెండో విడత వేలానికి ఏర్పాట్లు చేస్తోంది. 10 జిల్లాల పరిధిలోని 19 ప్రాంతాల్లో ఉన్న నివాస, వాణిజ్య స్థలాలతోపాటు గృహాల జాబితాలను సిద్ధం చేసింది. తొలి విడతలో 9 జిల్లాల పరిధిలోని రాజీవ్ స్వగృహ ఆస్తులను విక్రయించి, రూ.503 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సర్కారు.. ఈసారి కనీసం రూ.1,000 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో ప్రకటన రెండో విడత స్వగృహ ఆస్తుల వేలానికి ఈ నెల 11న వేలం ప్రకటన జారీ చేయనున్నారు. 14వ తేదీ నుంచే వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.9 వేల కోట్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేసి దాదాపు రూ.నాలుగు వేల కోట్లను సమీకరించింది. తాజాగా రెండో విడత స్వగృహ ఆస్తుల వేలం నిర్వహిస్తోంది. ప్లాట్లు, ఇళ్లతోపాటు ఖాళీ స్థలాలు కూడా.. ఈ–వేలంతో పాటు భౌతికంగా నేరుగానూ వేలం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, తుర్కయాంజల్, కుర్మాలగూడ, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బహదూర్పల్లి ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ ప్లాట్లతోపాటు మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ లేఅవుట్లోని కమర్షియల్ ప్లాట్లకు హెచ్ఎండీఏ ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా చందానగర్, కవాడిపల్లిలోని ప్లాట్లకు టీఎస్ఐఐసీ ఆన్లైన్ ద్వారా వేలం జరపనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీఎస్ గావ్, మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాపూర్, పోతులమడుగు, నిజామాబాద్ జిల్లాలోని మల్లారం, కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు, నల్లగొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్లలోని ప్లాట్లు.. వికారాబాద్ జిల్లాలోని ఆలంపల్లి, గంగారాం ప్రాంతాల్లోని రెండు ఖాళీస్థలాలకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సాధారణ వేలం నిర్వహించనున్నారు. ఖమ్మం టౌన్షిప్లోని 6.9 ఎకరాల ఖాళీ స్థలానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎకరాకు రూ.3 కోట్ల కనీస ధరతో వేలం పాట చేపడతారు. నివాస ప్లాట్లకు కనీస ధర (అప్సెట్ ప్రైస్)గా చదరపు గజానికి.. జిల్లాల్లో రూ.7 వేల నుంచి రూ.12 వేలు, హెచ్ఎండీఏ/టీఎస్ఐఐసీ పరిధిలో రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖరారు చేశారు. గృహాల విషయానికి వస్తే.. చదరపు గజానికి రూ.10,500, రూ.12 వేలు కనీస ధర నిర్ణయించారు. వేలానికి అంతా సర్వ సన్నద్ధం రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులు, జిల్లా కలెక్టర్లు వేలానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు సీఎస్కు నివేదించారు. వేలం వేయనున్న ఆస్తుల వివరాలు, లేఅవుట్లు, సైట్ ఫోటోలు, వేలం విధానం తదితర వివరాలను సంబంధిత సంస్థ వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ఆదేశించారు. -
కరోనా ఎఫెక్ట్: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్.. టూ కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పెద్ద పట్టణాల్లో ఖరీదైన ఇళ్ల అద్దెలు గడిచిన రెండేళ్లలో 8–18 శాతం మేర పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె పట్టనాల్లో లగ్జరీ ఇళ్ల కొనుగోలు, అద్దెకు డిమాండ్ పెరిగినట్టు వెల్లడించింది. అత్యధికంగా ముంబైలోని వర్లి ప్రాంతంలో అద్దె 18 శాతం పెరిగింది. 2000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖరీదైన భవంతి అద్దె 2020లో నెలవారీగా రూ.2 లక్షలు ఉంటే, అది రూ.2.35 లక్షలు అయింది. బెంగళూరు జేపీ నగర్లో అద్దె రెండేళ్లలో 13 శాతం పెరిగి రూ.52,000 అయింది. రాజాజీ నగర్లో కిరాయి 16 శాతం పెరిగి రూ.65,000కు చేరింది. ప్రముఖ లగ్జరీ హౌసింగ్ మార్కెట్లలో అద్దెలు గత రెండేళ్లలో రెండంకెల్లో పెరిగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. కరోనా రెండో విడత తర్వాత పెద్ద సైజు ఇళ్లకు ప్రాధాన్యాత పెరిగినట్టు చెప్పారు. చెన్నైలోని అన్నా నగర్లో సగటు నెలవారీ అద్దె 13 శాతం పెరిగి రూ.63,000 అయింది. కొట్టు పురంలో 14 శాతం పెరిగి రూ.84,000కు చేరింది. హైదరాబాద్లో 15 శాతం భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2,000 చదరపు అడుగుల ఇంటి నెలవారీ అద్దె రెండేళ్లలో 15 శాతం పెరిగి రూ.62,000 అయింది. ఇదే సమయంలో చదరపు అడుగు ధర 6 శాతం పెరిగి రూ.7,400కు చేరింది. హైటెక్ సిటీ ప్రాంతంలో సగటు నెలవారీ అద్దె 11 శాతం పెరిగి రూ.59,000 అయింది. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
ఒక్క రూపాయికే ఇల్లు
(అనంతపురం) గుంతకల్లు టౌన్: మనిషి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. నిరుపేదలకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాలను కేటాయించిన దేశచరిత్రలో నూతన అధ్యాయానికి తెర లేపారని కొనియాడారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గుంతకల్లులో టిడ్కో ఇల్లు మంజూరైన 2,160 మంది లబ్దిదారుల పేరిట మంగళవారం మున్సిపల్ కౌన్సిల్హాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా చేస్తామంటూ గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొండిగోడలకే పరిమితమైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించడమే కాక, ఆయా కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి పరిచినట్లు వివరించారు. రోజూ 50 నుంచి 100 మంది లబ్దిదారుల పేరిట టిడ్కో ఇళ్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, మాజీ చైర్మన్ ఎన్.రామలింగప్ప, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టిడ్కో డీఈ రంగారావు, మద్దయ్య, ఏసీపీ కేఎండీ.ఇషాక్, ఆర్ఓ నాసిర్, మెప్మా టీపీఆర్వో మోహన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు. -
దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!
పలానా దేశం అనగానే వాళ్లు ఇలా ఉంటారనే ఒక భావన ఒకటి ఉంటుంది. దక్షిణాఫ్రికా అనగానే నల్లజాతీయలు అని తెలుస్తుంది అందరికీ. అక్కడ ఘోరమైన ఎండలు కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా ఉంటారు. అలాంటి చోట ఒరానియా అనే ఒక విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. పైగా అక్కడ రోడ్లు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి కార్మికులు, సెక్యురిటీ గార్డు వరకు అంతా తెల్లవాళ్లే. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది . ఈ పట్టణం పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది, వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం. స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన పట్టణం ఈ పట్టణం 1991 నుంచి ఇలానే ఉంది. వారంతా 17వ శతాబ్దపు డచ్ వలసదారుల వారుసులు. దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ నది ఒడ్డున సుమారు 8 వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రవేట్ యజామాన్యంతో కలిసి ఒక పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా కూడా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణవివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దుకుంది. అయితే ఆ పట్టణ వాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్ కోతలు, స్థానికి పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. అంతేకాదు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఈ పట్టణంలో ఉండాలనుకునే నివాసితులు కొన్ని విలువలను పాటించాలి, భాద్యతగా మెలగాలి, సభ్యుత్వం పొంది ఉండాలి. ఐతే ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంతవరకు తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ నగరంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఐతే చాలామంది మాత్రం ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగానూ వర్ణవివక్షతకు పెద్ద పీఠం వేసే ప్రాంతంగానే చూస్తుండటం గమనార్హం. అంతేకాదు దక్షిణాఫ్రికా నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఈ పట్టణాన్ని పునరుద్ధరించటానికి అవిశ్రాంతంగా ప్రయత్నించారు. అందులో భాగంగా 1995లో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కలిసి ఉన్నారు కూడా. (చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!) -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. అల్లం నారాయణ హామీ
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, త్వరలోనే స్థలాలను ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే జర్నలిస్ట్ల కోసం ఒక బ్రిడ్జి కోర్స్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. మూడోసారి అకాడమీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా బుధ వారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు అల్లం నారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
కృష్ణా (మచిలీపట్నం): పేదల సొంతింటి కల సాకారం అయ్యే తరుణం ఆసన్నమైంది. టిడ్కో గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రిజి్రస్టేషన్ పూర్తయితే ఇంటిపై సర్వ హక్కులు పొందినట్లేనని అధికారులు చెప్పటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు టిడ్కో గృహ లబ్ధిదారులతో ప్రస్తుతం సందడిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం దీనిపై దృష్టి పెట్టింది. కలెక్టర్ రంజిత్ బాషా.. మున్సిపల్, టిడ్కో, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో దీనిపై తరచూ సమీక్షించి దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణాలో 13,712 ఇళ్లు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేసి, నాటి పాలకులు నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. పేదలైన లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. 365 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల గృహానికి రూ. 3.15 లక్షలు, 430 ఎస్ఎఫ్టీ గృహాలకు రూ.3.65 లక్షలు రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. ఇందుకు రిజి్రస్టేషన్లు అవసరం దృష్ట్యా, యుద్ధ ప్రాతిపదికన వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రిజిస్టేషన్లకు ప్రత్యేక కౌంటర్లు.. టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలతో కార్పొరేషన్, మునిసిపాలిటీల అధికారులు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జత చేసిన దరఖాస్తులు వస్తుండటంతో సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా రిజిస్టర్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ రిరిజిస్ట్రేషన్ తో ఆటంకం లేకుండా టిడ్కో గృహ లబ్ధిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, గుడివాడ సబ్ రిజి్రస్టార్ల పరిధిలో ఇప్పటికే రిజి్రస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఉయ్యూరులో సోమవారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గృహ సముదాయాల్లో సకల హంగులు.. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన 13,712 ఇళ్లు నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చాయి. డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలనే లక్ష్యంగా టిడ్కో జిల్లా ప్రాజెక్టు అధికారి చిన్నోడు నేతృత్వంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గృహ సముదాయాల వద్ద మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులలో నిర్మిస్తున్న గృహ సముదాయాల వద్ద మొత్తం రూ. 139.29 కోట్లతో రహదారులు, అండర్ గ్రౌం డ్రైనేజీల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సకాలంలో రిజిస్ట్రేషన్.. టిడ్కో గృహ లబి్ధదారులకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు శ్రద్ధ తీసుకున్నాం. కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. లబి్ధదారుల వివరాలతో మున్సిపల్ అధికారులు దరఖాస్తు చేస్తే, ఎటువంటి ఆలస్యం లేకుండా రిజి్రస్టేషన్ చేస్తున్నాం. లబి్ధదారుల్లో వృద్ధులు కూడా ఉన్నందున వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – టి. ఉపేంద్రరావు, జిల్లా రిజి్రస్టార్, కృష్ణా జిల్లా -
అన్నలకు గృహయోగం
వారంతా పోరుబాటలో అడవిబాట పట్టిన అన్నలు. అన్యాయంపై బంధూకు ఎక్కుపెట్టి ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరులు. కంటి నిండా నిద్రలేక కడుపునిండా తిండిలేక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాలకు దూరమై వేదన అనుభవించారు. తిరుగుబాటు యుద్ధంలో ఎందరో తూటాలకు నేలకొరిగారు. కానీ ప్రస్తుతం పాలకులు మారారు..పాలనా మారింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అందుకే వారంతా జనావాసంలోకి వచ్చారు. కుటుంబాలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాంటి ‘మాజీ’లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలిచింది. నాలుగు ఎకరాల్లో 135 మందికి పట్టాలివ్వగా...వారంతా సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవించే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి శివారున సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక భాగాన కప్పలబండ పొలాల్లో సుమారు 5 ఎకరాల్లో లోచెర్ల పెద్దారెడ్డి పేరుతో కాలనీ ఏర్పాటు చేసి 135 మందికి పట్టాలిచ్చింది. లొంగిపోయి.. జనజీవన స్రవంతిలోకి.. ప్రభుత్వాల హామీతో లొంగిపోయిన మాజీ నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అందరిలా జీవించాలనే తపనతో బతుకుతున్నారు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకున్నారు. పిల్లలను చదివిస్తున్నారు. రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి నిలువ నీడలేదు. దీంతో అంతా కలిసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో 2021 మే నెలలో పట్టాల పంపిణీ జరిగింది. ప్రస్తుతం అందరూ ఓ కాలనీ ఏర్పాటు చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం కాలనీలో రోడ్డు, విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు. కాలనీ పూర్తి స్థాయిలో ఏర్పడేలోపు ప్రాథమిక పాఠశాలు, కుటీర పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధికి ఇబ్బందులు ఉండవని వారు కోరుతున్నారు. అప్పటి బాధలు వర్ణించలేం అజ్ఞాతంలో భాగంగా పదేళ్ల పాటు అడవిలో ఉన్నా. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో లొంగిపోయాను. ప్రస్తుతం నాపై కేసులేమీ లేవు. వ్యవసాయం చేసుకుంటున్నా. నేను 1999లోనే జన జీవన స్రవంతిలో కలసిపోయాను. అడవిలో ఉన్నప్పటి బాధలు వర్ణించలేనివి. ఎవరికీ అలాంటి బాధలు రాకూడదు. – ఆంజనేయులు, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి ఇల్లు కట్టుకుంటున్నా నేను 2007లో లొంగిపోయాను. ప్రభుత్వంతో పాటు ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా...ఇల్లు నిర్మించుకుంటున్నా. – ఎస్.శ్రీనివాసులు, అమగొండపాళెం ప్రభుత్వం గుర్తించింది మా అన్న ఎన్కౌంటర్ అయ్యాడు. వదిన విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తోంది. నేను 1994లోనే లొంగిపోయాను. నాపై కేసులన్నీ కొట్టేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. పట్టాలిచ్చి మాకంటూ కాసింత నీడనిస్తోంది. – ఎం.రంగనాయకులు, గూనిపల్లి, పుట్టపర్తి మంచి రోజులొచ్చాయి 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లొంగిపోయాను. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ పాలనపై నమ్మకం ఏర్పడింది. ఆయన మరణం తర్వాత కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నా. రామాంజి, నార్సింపల్లి, బుక్కపట్నం మండలం ప్రభుత్వ కృషి మరువలేనిది మా నాన్న లోచెర్ల పెద్దారెడ్డి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ప్రజా ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నాన్నతో కలిసి నేనూ పదేళ్లు అజ్ఞాతంలో ఉన్నా. 1992లో ప్రజా జీవనంలోకి వచ్చా. కప్పలబండ పొలంలో 4.88 ఎకరాల్లో సుమారు 135 ప్లాట్లు ప్రభుత్వం మాకోసం మంజూరు చేసింది. మాజీ నక్సలైట్ల కాలనీ అని పేరు పెట్టుకున్నాం. అయితే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి లోచెర్ల పెద్దారెడ్డి కాలనీగా నామకరణం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చొరవ మరువలేనిది. – లోచర్ల విజయభాస్కర్రెడ్డి -
ట్రెండ్ మారింది.. గ్రేటర్లో ఒక్కసారిగా ఆ గృహాలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. కరోనా కంటే ముందు తక్కువ విస్తీర్ణం ఉండే అందుబాటు గృహాలను కొనుగోలు చేసేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి భౌతిక దూరం తప్పనిసరి కావటంతో ఇంటి విస్తీర్ణం పెరిగింది. దీంతో చవక గృహాల నుంచి మధ్య తరహా ఇళ్ల వైపు దృష్టిసారించారు. ఫలితంగా రూ.25–50 లక్షల మధ్య ధర ఉండే గృహాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. గ్రేటర్లో గత నెలలో రూ.2,841 కోట్ల విలువ చేసే 5,408 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇందులో 53% ఈ తరహా ఇళ్లే ఉన్నాయని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. 25 శాతం క్షీణత: గతేడాది జూన్లో జరిగిన 7,251 రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూన్ నాటికి 25 శాతం తగ్గుదల కనిపించింది. త్రైమాసికాల వారీగా గమనిస్తే.. ఈ ఏడాది జనవరి – మార్చి (క్యూ1)లో రూ.9,230 కోట్ల విలువ చేసే 21,488 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్యూ2 నాటికి రూ.8,685 కోట్ల విలువ చేసే 17,074 ప్రాపర్టీలు రిజిస్ట్రేషనయ్యాయి. రూ.25 లక్షల లోపు ధర ఉన్న సామాన్య గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతుంది. గతేడాది జూన్లో వీటి వాటా 40 శాతంగా ఉండగా.. ఈ జూన్ నాటికి 16 శాతానికి క్షీణించింది. ఇక గతేడాది జూన్లో మధ్య తరహా ఇళ్ల వాటా 35 శాతంగా ఉంది. 81 శాతం గృహాల వాటా వీటిదే: రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాలకు 2021 జూన్లో 25 శాతం ఉండగా.. గత నెలలో 32 శాతానికి పెరిగింది. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాలకు గతేడాది జూన్లో 7 శాతం వాటా ఉండగా.. ఇప్పుడవి 9 శాతానికి పెరిగింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 81 శాతం ప్రాపర్టీలు 2 వేల చ.అ. లోపు విస్తీర్ణం ఉన్నవే. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్నవి 9 శాతం, 3 వేల కంటే ఎక్కువ ఉన్నవి 2 శాతం ప్రాపర్టీలున్నాయి. చదవండి: Yamaha Rx 100: ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది! -
పునాదుల్లేని ఊరు.. ఎక్కడ ఉందో తెలుసా?
దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనిపించని పూరి గుడిసె గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. – అవినిధ్, హౌసింగ్ ఏఈ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి. – పీరా, కరిడికొండ గ్రామస్తుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం. – నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు -
ఒక్క రూపాయికే పక్కా ఇల్లు
మాటే మంత్రంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్రాభివృద్ధే ఆశయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నారు. ఒకే ఒక్క రూపాయికి లక్షలాది రూపాయలు విలువచేసే పక్కా ఇంటిని పేదలకు అందించే బృహత్తర కార్యక్రమానికి విజయనగరంలోని సారిపల్లి వేదికగా మారింది. సకల సదుపాయాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను మంత్రులు ప్రారంభించి లబ్ధిదారులకు గురువారం అప్పగించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టణాల్లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ పత్రాలను చేతికి అందిస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ సాకారమవుతోంది. విజయనగరానికి సమీపంలోని సారిపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సిద్ధమైంది. 800 ఇళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గురువారం ప్రారంభించనున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇంటిపత్రాలను అందించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. విద్యుత్దీపాల కాంతులతో కాలనీలోని ఇళ్లు జిగేల్మంటున్నాయి. అందంగా.. విశాలంగా.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద జి+3 విధానంలో రూ.161.52 కోట్ల వ్యయంతో 2,656 ఇళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఏ–కేటగిరిలో 300 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంతో 1,536 ఇళ్లు, బి–కేటగిరీలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో 192 ఇళ్లు, సి–కేటగిరీలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో 928 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమైన 800 ఇళ్లను లబ్ధిదారులకు గురువారం మంత్రుల చేతుల మీదుగా అందించడానికి ఏపీ టిడ్కో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల ఆస్తి ఒక్క రూపాయికే... రాష్ట్ర ప్రభుత్వం ఏ–కేటగిరి కింద ఒక్కో ఇంటిని రూ.6.55 లక్షల వ్యయంతో నిర్మింస్తోంది. ఆ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తోంది. మిగతా రూ.5.05 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంమీద లబ్ధిదారులకు మాత్రం కేవలం ఒక్క రూపాయికే రూ.6.55 లక్షల విలువగల ఇంటిని అందజేస్తోంది. సి–కేటగిరీ కింద నిర్మించే 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల డబుల్ బెడ్రూం ఇళ్లకు ఒక్కోదానికి రూ.8.55 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షలు సమకూర్చుతోంది. లబ్ధిదారు తన వాటా కింద రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కింద రూ.3.65 లక్షలను అధికారులు సమకూరుస్తున్నారు. రూ.41 కోట్లతో మౌలిక సదుపాయాలు... సారిపల్లిలోని జగనన్న టిడ్కో కాలనీ లేఅవుట్లో లబ్ధిదారుల ఇళ్లకు సామాజిక, మౌలిక వసతులు కల్పించేందుకు రూ.41.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తాగునీటి సరఫరా కోసం రూ.8.93 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.61 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.3.97 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి రూ.4.92 కోట్లు, కాలనీ చుట్టూ రిటైనింగ్ వాల్ కోసం రూ.11.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, విజయనగరం శివారు సోనియానగర్లో 1120 ఇళ్లు, నెల్లిమర్లలో 570, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 మొత్తం 3,712 ప్లాట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిచేసి వచ్చే డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో చక్కని వసతులు... ఇళ్లలో పూర్తిగా టైల్స్తో కూడిన గచ్చు ఏర్పాటు చేశారు. బెడ్ రూమ్, లివింగ్ రూమ్ ఆకట్టుకునేలా రూపొందించారు. గ్రానైట్ ఫ్లాట్ఫాంతో కూడిన వంటగది, సింక్ చక్కగా ఉన్నాయి. ఆధునిక వసతులతో కూడిన టాయిలెట్ కూడా ఉంది. ఇక కాలనీలో 40 అడుగుల వెడల్పుతో కూడిన రోడ్ల నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేశారు. విద్యుత్ సరఫరా ఇప్పటికే కల్పించారు. అన్ని వసతులతో సిద్ధమైన ఇళ్లను మంత్రులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. లబ్ధిదారుల చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు... టిడ్కో కాలనీలో ఇళ్ల మంజూరుపత్రాలతో పాటు లబ్ధిదారుల పేరిట రిజి స్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను కూడా మంత్రుల చేతుల మీదుగా అందజేస్తాం. తొలివిడతలో ఏ–కేటగిరీకి సంబంధించిన 15 బ్లాకుల్లోని 480 ఇళ్లు, సి–కేటగిరీకి సంబంధించి 10 బ్లాకుల్లోని 320 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేశాం. లబ్ధిదారులకు ఎలాంటి ఖర్చులు, వ్యయప్రయాసలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం. సారిపల్లి లే అవుట్లో మిగిలిన 1,856 ప్లాట్లను ఆగస్టునాటికి సిద్ధం చేస్తాం. – ఎస్.జ్యోతి, ఎస్ఈ, ఏపీటిడ్కో (చదవండి: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
టిడ్కో ఇళ్లకు లైన్ క్లియర్
పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకపక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే.. మరోపక్క టిడ్కోలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్ల పాటు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగా ఉండడంతో వేగంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భీమవరం(ప్రకాశం చౌక్): ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం టిడ్కో అధికారులు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో టిడ్కో ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ల పనులు ముమ్మరం చేశారు. ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితం... నూతన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో 20,784 టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఏ కేటగిరీలో 300, బీ కేటగిరీలో 365, సీ కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లు నిర్మించగా, ఇవన్నీ కలిపి 20,784 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో నాలుగు పట్టణాల్లో కలిపి 300 చదరపు అడుగుల ఇళ్లు 6944 నిర్మించగా, ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను ఫేజ్–1లో లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగవంతం జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్లాట్లను లబ్ధిదారుల పేరిట ఉచిత రిజస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మెప్మా విభాగం అధికారులు ఆయా పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించడంతో రిజస్ట్రేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా రిజస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించడంపై లబ్దిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఇలా... ఇప్పటివరకు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 3758 మందికి ప్లాట్లు రిజస్ట్రేషన్ చేశారు. అందులో భీమవరంలో 900, పాలకొల్లులో 1458, తాడేపల్లిగూడెంలో 1400 చొప్పున ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేపట్టారు. మూడు పట్టణాల్లోని ఫేజ్–1 లబ్ధిదారుల్లో 2577 మంది రూ.68.39 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు. ఫేజ్–1 కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జిల్లాలో ఫేజ్–1లో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు కేటగిరీల ఇళ్లూ ఈ ఫేజ్లో ఉన్నాయి. – ఎం.స్వామినాయుడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్ -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
ఇళ్లే మిగిలాయి!
ఈ ఫొటోలోని ఇళ్లను చూస్తున్నారుగా. కొండపైన భలే కట్టుకున్నారు కదా. యెమెన్ హధర్మట్ ప్రాంతంలోని డవన్ లోయలో ఉంది ఈ ప్రాంతం. దీనికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం. పేరు హైద్ అల్ జజిల్. వందలాది మంది నివసించేవారు. కానీ 2004 నాటి జనాభా లెక్కల్లో ఇక్కడ 17 మందే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కరంటే ఒక్కరే ఉంటున్నారు. మంచి వేతనాలు వస్తున్న, అన్ని సౌకర్యాలున్న సౌదీ అరేబియాకు అనేక మంది వలస వెళ్లారు. దీంతో వరదలు వచ్చి ఇక్కడి ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత శిథిలమయ్యాయి. కొన్నాళ్లుగా కాల్పుల మోతతో దద్దరిల్లిన యెమెన్లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఫొటోగ్రాఫర్ తారిక్ జైదీ ఇటీవల ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తన కెమెరాలో బంధించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఇకపై అలా కుదరదు.. ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పనిచేసే ప్రాంతంలో అధి కారులు, సిబ్బంది నివాసం ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీచేశారు. ఇంతకాలం ఆర్టీసీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటూ పనిచేసే ఇతర ప్రాంతానికి నిత్యం వస్తూ పోతుండేవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా ఫిర్యాదులున్నా పట్టించుకోలేదు. దీనిపై ఎండీ సజ్జనార్కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా ఉంటున్న ఇంటి చిరునామాలను వెంటనే అందజేయాలని ఆదేశించటం విశేషం. ఇటీవలే ఈడీ స్థాయి మొదలు డిపో మేనేజర్ వరకు మూకుమ్మడి బదిలీలు జరి గాయి. అయితే, నలుగురైదుగురు రాజీనామా చేయగా, పదిమంది వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో కొందరు వేరే ప్రాంతాల్లో ఉంటూ పనిచేసే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. దీన్ని సజ్జనార్ గమనించి తప్పని పరిస్థితిలో మినహా, కుటుంబాలతో కలసి పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలంటూ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీచేశారు. -
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల పంపిణీ ముమ్మరం
-
విశాఖలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలో ఒక లక్షా 80 వేల మందికి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది. ఇల్లు లేని వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. దీనిపై కొందరు పిటిషన్ దాఖలు చేయడంతో ఇళ్ల స్థలాలు పంపిణీ నిలిచింది. ఇప్పుడు ఆ పిటిషన్ కొట్టి వేయడంతో లబ్ధిదారులు సంతోష వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్అండ్బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇంటి నంబర్ కనుక్కోవడం ‘కత్తి మీద సామే’. ఒకరకంగా పజిల్ను తలపిస్తుంది. ఈ సంక్లిష్టతను ఛేదిస్తూ ఇంటి నంబర్ల ఆచూకీని సులభతరం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్ను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి నంబర్ల డిజిటలైజేషన్ను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(టీఎండీపీ) కింద డిజిటల్ డోర్ నంబరింగ్(డీడీఎన్) సిస్టంను ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని శ్రీరాంనగర్లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలు చేశారు. దానిని మరింత అభివృద్ధి చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 5వ, బాచుపల్లి 17వ, బండ్లగూడ 19వ డివిజన్లో కూడా డిజిటల్ నంబరింగ్ విధానం తీసుకొస్తున్నారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ప్రతి ఇంటికీ కేటాయించిన ‘క్యూఆర్’కోడ్ను స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరు, చిరునామా వివరాలన్నీ తెలుస్తాయి. జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసి, ఇతర ప్రభుత్వ శాఖలకు లింక్ చేయడంతో పన్నుల వసూళ్లు, ఇతర వివరాలన్నీ ఆ నంబర్ ద్వారా తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్, డిజిటలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దేశంలోని వివిధ పట్టణాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ఆధార్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఈ డీడీఎన్ ప్రాజెక్టును అనుసంధానించాలని సర్కార్ నిర్ణయించింది. ముందుగా 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 16 అంకెల డిజిటల్ నంబర్తో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని నగరాలు, మునిసిపాలిటీల్లో ... గత కొన్నేళ్లుగా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లను మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా ఏదీ విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సహాయంతో డిజిటల్ డోర్ నంబరింగ్ విధానాన్ని రూపొందించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. డిజిటల్ డోర్ నంబరింగ్లో 16 అంకెలతో కూడిన కోడ్ ఉంటుంది. ఈ అంకెల్లోనూ మూడు విభాగాలుంటాయి. నగరం/పట్టణాన్ని తెలిపే కోడ్తోపాటు స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు ఇంకో కోడ్ ఉంటుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ఇంటికి ప్రత్యేక డోర్ నంబరును కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఆధారంగా ఇల్లు ఏ నగరం /పట్టణం... ఏ వార్డు/డివిజన్లో ఉన్నదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇంటి పలకపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు ఇంటి పన్ను, ఇతర పన్నుల వివరాలన్ని తెలిసిపోతాయి. చెల్లింపులు, బకాయి వివరాలు ప్రత్యక్షమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో క్యూ ఆర్ కోడ్ విధానంలో డిజిటల్ నంబరింగ్ సిస్టమ్ను త్వరగా అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆయా ఇళ్ల నుంచి చెత్త సేకరించేవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఆస్తుల బదిలీకి అనుసంధానం డిజిటల్ డోర్ నంబరింగ్లో కొత్తగా కేటాయించే డిజిటల్ నంబర్, క్యూఆర్ కోడ్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే లావాదేవీలకు అనుసంధానం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిజిటల్ నంబర్ కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ నంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయ్ !
న్యూఢిల్లీ: ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 15–20 శాతం అధికంగా అమ్ముడుపోవచ్చని ప్రాప్టైగర్ సంస్థ అంచనా వేసింది. నిలిచిన డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడానికి తోడు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు కలిసొచ్చే అంశాలుగా పేర్కొంది. 2020లో ఇళ్ల విక్రయాలు ఎనిమిది ప్రధాన పట్టణాల్లో 47 శాతం పడిపోయి 1,82,639 యూనిట్లుగా ఉండగా.. 2019లో 4,47,586 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు ఎక్కువ కాలం పాటు కొనసాగడం ఇళ్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడేలా చేసిందని అర్థం చేసుకోవచ్చు. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ క్యూ3 2021’పేరుతో ప్రాప్టైగర్ ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె నగరాల్లోని ధోరణులపై వివరాలను ఇందులో పొందుపరిచింది. ‘‘2021 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు (తొమ్మిది నెలల్లో) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగి 1,38,051 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,23,725 యూనిట్లుగా ఉన్నాయి. జూలై నుంచి ఇళ్ల ధరలు పెరగడం మొదలైంది. నిలిచిన డిమాండ్ తిరిగి రావడం, పండుగల విక్రయాలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడం, ఉపాధి మార్కెట్లో అనుకూలతలు, తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మొత్తం మీద 15–20 శాతం స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ప్రాప్టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ రాజన్సూద్ తెలిపారు. -
Floating Cities: అలలపై కలల ఇల్లు.. ఇక భవిష్యత్ వీటిదేనా?
ప్రపంచవ్యాప్తంగా జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. చివరకు ఒక గూడు కట్టుకునేందుకు కూడా కాసింత జాగా దొరకని పరిస్థితి. దీనికి తోడు ప్రకృతి విపత్తులు. భూకంపాలు వచ్చి ఇళ్లు నేలమట్టమవుతుండటం, సముద్రమట్టాలు పెరిగిపోయి నివాసా లను ధ్వంసం చేస్తుండటం.. ఇలా అన్నింటినీ గమనించిన నెదర్లాండ్స్లోని పలు నిర్మాణ సంస్థలు సరికొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చాయి. నీటిపై తేలియాడేలా ఇళ్లు నిర్మిస్తే ఎలా ఉంటుంది..? స్థిరంగా ఉండే సరస్సులపై అన్ని వసతులతో నగరాలే ఏర్పాటు చేస్తే..? ఇలా అనుకున్నదే తడవుగా ఆమ్స్టర్డ్యామ్ వద్ద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి. –సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్ పొలాలు కూడా నీటిపైనే! వాస్తవానికి ఇలా నీటి పైన తేలియాడే ఇళ్లు నిర్మించుకొని నివసించడం, పంటలు పండించడం లాంటివి శతాబ్ధాల కిందటి నుంచే ఉన్నాయి. పెరూ, బొలీవియా సరిహద్దుల్లోని టిటి కాకా సరస్సులో కొంతమంది అనేక ఏళ్ల కిందటి నుంచి తేలియాడే ఇళ్లలోనే జీవిస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా చాలాకాలం కిందట ఇలాంటి నిర్మాణాలుండేవి. కానీ నగరీకరణ, పట్టణీకరణలతో క్రమంగా సరస్సులు, వాటిపైన నిర్మాణాలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు కాలాలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారిపోతుండటంతో నిర్మాణ సంస్థలు మళ్లీ నీటిపైన తేలియాడే ఇళ్లవైపు దృష్టిసారించారు. సముద్రమట్టాలు పెరుగుతుండటం నెదర్లాండ్స్కు ముప్పుగా పరిణమించింది. దీంతో అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నీటిపై తేలియాడే నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఆ దేశ నిర్మాణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడ చదవండి: ఆజానుబాహుల దేశంగా పేరు.. కానీ పొట్టిగా అయిపోతున్నారు! ఆమ్స్టర్డ్యామ్లోని మాంటెఫ్లోర్ సంస్థకు చెందిన వాన్ నెమెన్ ఏకంగా 100 ఫ్లోటింగ్(తేలియాడే) ఇళ్లను నిర్మించి ఒక ఊరునే తయారుచేశాడు. అక్కడ నివసించేవారి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు.. ఇలా అన్నీ ఏర్పాటైపోయాయి. అలాగే ఆమ్స్టర్డ్యామ్కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో మింకే వాన్ వింగర్డన్ నీటిపైనే అత్యాధునిక పశువులశాల, పొలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గానిక్ పంటలను ఉత్పత్తి చేయడానికి తాను ఏర్పాటు చేసుకున్న పొలం అనుకూలంగా ఉంటుందని, భవిష్యత్లో వీటికి మంచి ఆదరణ ఉంటుందని వింగర్డన్ చెబుతున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన ఓషియానిక్స్ అనే సంస్థ దాదాపు 200 ఎకరాల్లో 10,000 మంది నివసించేలా నిర్మించబోతోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే మొట్టమొదటి స్థిరమైన ఫ్లోటింగ్ కమ్యూనిటీ అవుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా త్రిభుజాకారంలో దాదాపు 5 ఎకరాల్లో 300 మంది చొప్పున నివసించేలా తేలియాడే నగరాలను నిర్మిస్తున్నామని తెలిపింది. ముంపు ముప్పు ఎదుర్కొంటున్న వెనిస్, జకర్తా, షాంగై తదితర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చాలా ఉపయోగకరమని పేర్కొంది. పెనుగాలులకు నిలుస్తాయా? పెనుగాలులకు ఈ ఇళ్లు నిలుస్తాయా? నీటిపైన కొట్టుకుపోకుండా తట్టుకుంటాయా? అనే ప్రశ్నలను చాలా మంది ఆసక్తిదారులు వ్యక్తం చేస్తున్నారని నెదర్లాండ్స్లోని నిర్మాణ సంస్థలు తెలిపాయి. తాము అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే విధంగానే వీటిని నిర్మిస్తున్నామని సమాధానమిచ్చాయి. వీటిని నిర్మించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొన్నాయి. చిన్నచిన్న అలలు, నీటి ఒత్తిడి వల్ల ఇంటి కోసం వేసే ప్లాట్ఫామ్ పైకి, కిందకు కదలడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాయి. టిటి కాకా సరస్సులోని తేలియాడే ఇళ్లను చూడటానికి వెళ్లిన పర్యాటకులు పలు ఆసక్తి విషయాలను వెల్లడించారు. ‘‘ఈ ఇళ్లు గాలులకు కొట్టుకుపోవా? అని బోటు డ్రైవర్ను అడిగాను. ‘వీటికి పడవలు లాగానే లంగర్లు వేసుంటాయి. అందువల్ల పెనుగాలుల వల్ల కొట్టుకుపోయే అవకాశం తక్కువ. ఒకవేళ అలా వెళ్లిపోతే.. మేమే వాటిని వెతుక్కుంటూ వెళ్తాం’ అని అతను నవ్వుతూ జవాబిచ్చాడు’’ అని డారిస్ హోవర్డ్ తన బ్లాగ్లో రాసుకున్నారు. ‘ముంపు ముప్పు ఎదుర్కొంటున్న నగరాల్లో అన్ని వసతులతో ఈ తేలియాడే ఇళ్లను నిర్మించుకోవచ్చు. అన్ని నిర్మాణాలకు భిన్నంగా, మనసుకు ఆహ్లాదంగా ఉండే ఈ ఇళ్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్లో అన్ని దేశాల్లో తేలియాడే నగరాలు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. బలమైన స్టైరోఫోమ్, కాంక్రీట్, చెక్క ఉపయోగించి నీటిపై తేలియాడేలా బెడ్ తయారు చేసి.. దానిపైన నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపాయి. నీటి ఒత్తిడికి మునగకుండా.. తగిన బరువుతోనే నిర్మిస్తున్నామని వెల్లడించాయి. -
పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు: బొత్స
సాక్షి, నెల్లూరు: భగత్సింగ్ నగర్లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని.. పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ పాలనాదక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు. (చదవండి: ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు) గత ప్రభుత్వం మోసం చేసింది: మంత్రి అనిల్ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు:ఏడు ఇళ్లు నేలమట్టం
-
త్వరపడండి.. ఇళ్లు ఖరీదు కేవలం రూ. 87 మాత్రమే
రోమ్: మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారా..? అయితే త్వరపడండి ఇది మీకు మంచి అవకాశం. అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? అత్యంత సుందరమైన ప్రదేశంలో అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఎంత చౌక అంటే ఆ ఇంటి విలువ కేవలం రూ. 87 రూపాయలు మాత్రమే. నమ్మడం కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ చాన్స్ మన దేశంలో కాదు. ఇటలీలో మాయోంజా అనే అందమైన పట్టణం ఉంది. ఇది రోమ్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే అక్కడి ప్రభుత్వం వారు విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే ఆ ప్రదేశంలోని 90 శాతం ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దానితో ఎంతో అందమైన ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరూ నివసించకపోవడంతో బోసిపోయింది. అందుకే అక్కడి ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మాయోంజాలోని ఇళ్లల్లో ప్రజలు నివాసముండడానికి ప్రోత్సహించేందుకు అతి తక్కువ ధరకే ఈ ఇళ్లను విక్రయిస్తున్నారు. మాయోంజా నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఇలా ఇళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని అక్కడి మేయర్ క్లాడియో స్పెర్డుటి పేర్కొన్నారు. అయతే ఈ ఇళ్లను విడతల వారీగా విక్రయానికి ఉంచనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఇళ్ల కొనుగోళ్లకు సంబందిచిన దరకాస్తుల స్వీకరణ ఈ నెల 28న ముగియనుంది. ఈ పట్టణం ఒకప్పుడు నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. అయితే 1968వ సంవత్సరంలో వచ్చిన భూకంపం ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దానితో మాయోంజ పట్టణం పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం ప్రజలు నివసించక అక్కడ అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఆ పట్టణం జనంతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకే వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటల్లోనూ పాల్గొనవచ్చు. టౌన్ అత్యంత పురాతనమైనది కావడంతో ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదానికి దగ్గరగా ఇంకొకటి కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేందుకు ఎంతో బాగుంటుంది కాబట్టి అందరూ ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే కొనుగోలు చేసిన ఇళ్లను మరమత్తులు చేయించుకోవాలి. వాటిని కొత్త ఇళ్లల్లా తీర్చిదిద్దుకోవాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసిన ఇళ్లను పునరుద్ధరించాలి. దానితో పాటు ఒప్పందంలో డిపాజిట్గా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇళ్లు పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో కచ్చితంగా నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని పునర్నిర్మాణం చేసి ఎలా ఉపయోగించుకోబోతున్నారో మాత్రం కశ్చితంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియచేయాలి. వాస్థవానికి ఇటలీలోని గ్రామీన ప్రాంతాల్లో ఈ పధకం మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇలా ప్రజలు నివసించని నిర్మానుష్యపు ప్రాంతాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీ అనే ప్రాంతంలోని కాళీ ఇళ్లను కేవలం ఒక్క అమెరికన్ డాలరుకే అప్పట్లో అమ్మకానికి పెట్టారు. అలాగే సిసిలియా అనే మరో గ్రామంలోనూ ఇదే తరహాలో ఒక యూరోకే ఇళ్లని విక్రయించడం జరిగింది. మరి ఈ ఆఫర్ ఎంతమంది ప్రజలకి నచ్చుతుందో వేచి చూడాల్సిందే. -
డ్రైనేజీ మృతుల కుటుంబాలకు డబుల్ ఇళ్లు
సాక్షి, ఎల్బీనగర్( హైదరాబాద్): బీఎన్రెడ్డి నగర్ డివిజన్లోని పద్మావతినగర్ కాలనీలో ఇటీవల డ్రైనేజీ పూడికతీత పనుల్లో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు చెరో డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం నగర మేయర్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మేయర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను శివకుమార్ భార్య ధరణి శ్రావణిగౌరి, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మకు అందచేశారు. వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ప్లాట్లలో 701 నెంబర్ను భాగ్యమ్మకు, 702 ప్లాట్లును శ్రావణి గౌరికి కేటాయించారు. ఇప్పటికే వీరికి రూ.17 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ: 20,403 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో పట్టణాలు, నగరాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–అర్బన్(పీఎంఏవై–యూ) పథకం కింద మంజూరై నిర్మాణాలు మొదలవ్వని, పునాది దశ కూడా పూర్తి చేసుకోని ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పీఎంఏవై–వైఎస్సార్ (అర్బన్) పథకం కింద 20,403 ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు తొలి దశ కార్యక్రమంలో భాగంగా వీటి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఒక్కో ఇంటికి పీఎంఏవై–వైఎస్సార్(అర్బన్) పథకం కింద ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేయనుంది. మొత్తం 20,403 ఇళ్లలో 2016–17కి సంబంధించి 2,529 ఇళ్లు, 2017–18కి సంబంధించి 7,465, 2018–19కి సంబంధించి 10,409 ఇళ్లున్నాయి. -
ఆ అరుపులు నా చెవిలో మార్మోగుతున్నాయి
ముంబై : ‘‘ నా కళ్ల ముందే నా కుటుంబసభ్యులు చనిపోతున్నా.. వాళ్లను రక్షించుకోవటానికి ఏమీ చేయలేకపోయా’’ అంటూ శనివారం నాటి కాళరాత్రి పరిస్థితి తల్చుకుని కుమిలిపోయాడు ఆటో డ్రైవర్ అక్షయ్ జిముర్. భారీ వర్షాల కారణంగా ముంబైలోని చెంబూర్ వాషినాకా న్యూ భరత్నగర్లోని వంజార్ దాండా పరిసరాల్లో కొండ కింద ఉన్న ప్రహరీపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గోడ కూలి ఇళ్లపై పడింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందారు. మృతుల్లో అక్షయ్ కుటుంబం కూడా ఉంది. తల్లిదండ్రులు సూర్యకాంత్, మీనా.. అక్క ఆపేక్ష శిథిలాల కింద నలిగి కన్నుమూశారు. అక్షయ్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. అక్షయ్ అమ్మ, అక్క శనివారం రాత్రి జరిగిన ఘటనను అతడు గుర్తు చేసుకుంటూ.. ‘‘ నేను మానాన్న ఇద్దరం ఆటో నడుపుతాము. రాత్రి ఎనిమిది గంటలకు నేను ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అందరం భోజనం చేసి నిద్రపోవటానికి ఉపక్రమించాము. మా ఇంటి మీద ఉన్న రెండు ఇళ్లు కుప్పకూలి మా ఇంటి మీద పడ్డాయి. మా ఇళ్లు కూడా కుప్పకూలింది. అయితే ఏం జరుగుతోందో కొన్ని క్షణాలు మాకు అర్థం కాలేదు. అర్థం అయ్యేలోపే అంతా జరిగిపోయింది. నేను శిథిలాలనుంచి బయటపడేసరికి రాత్రి 12.15 అయింది. అమ్మానాన్న, అక్క ఇరుక్కుపోయారు. అంతా బురద, చీకటి.. ఓ కరెంట్ తీగ తెగి మా ఇంటి మీద పడింది. కొద్దిసేపటి తర్వాత మా పొరిగింటి వాళ్లు అక్కడికి వచ్చారు. నేను ఇంట్లోకి వెళదామనుకున్న ప్రతీ సారి కరెంట్ షాక్ తగిలింది. అక్కడికి వచ్చినవాళ్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లుకు ఫోన్ చేశారు. వారినుంచి స్పందన లేదు. మా అమ్మానాన్న, అక్క సహాయం కోసం అరస్తూ ఉన్నారు. కానీ, నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఆ అరుపులు నా చెవిలో మార్మోగుతున్నాయి. తెల్లవారుజామున 3.30కు ఫైర్ సిబ్బంది వచ్చారు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లు సమయానికి స్పందించి ఉంటే నేను నా కుటుంబాన్ని రక్షించుకుని ఉండేవాడ్ని. ఉదయం 5-6 గంటల ప్రాంతంలో వారి మృతుదేహాలను బయటకు తీశారు’’ అంటూ తన కన్నీటి కథను చెప్పుకొచ్చాడు. -
వరద బీభత్సానికి కుప్పకూలిన వైద్య కేంద్రం, ఇళ్ళు : బీహార్
-
‘చరిత్రలోనే ఇళ్ల నిర్మాణం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది’
-
మొదటి విడతలో లక్ష 11 వేల ఇళ్ల నిర్మాణం
-
ఇళ్లకు డిమాండ్ వాస్తవమే
ముంబై: ఇటీవలి కాలంలో ఇళ్లకు పెరిగిన డిమాండ్ వ్యవస్థలో వాస్తవికంగా వచ్చిందే కానీ.. గతంలో నిలిచిన డిమాండ్ ఒక్కసారిగా తోడయ్యింది (పెంట్అప్) కాదన్నారు గృహ రుణాల అగ్రగామి సంస్థ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్. ఈ డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని తాను బలంగా భావిస్తున్నట్టు చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ధరలు.. గృహ రుణాలపై పన్ను పరమైన ప్రయోజనాలు గడిచిన కొన్ని నెలల్లో డిమాండ్కు తోడ్పడిన అంశాలుగా పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారు.. చిన్న ఇళ్ల నుంచి విశాలమైన ఇళ్లుకు మారే వారు.. మరో ప్రాంతంలో రెండో ఇళ్లను కొనుగోలు చేసే వారి రూపంలో డిమాండ్ విస్తృతమైనట్టు వివరించారు. ప్రాపర్టీ టెక్నాలజీపై ఓ వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరేఖ్ మాట్లాడారు. ఇంటి నుంచే కార్యాలయ పని విధానం వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు ఎంపిక చేసుకునే ప్రాంతానికి సంబంధించి విస్తృతమైన ఆప్షన్లు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి తక్కువ డిజిటైజ్ అయిన ఏకైక రంగం నిర్మాణమేనన్నారు. ‘‘రియల్ ఎస్టేట్ రంగం టెక్నాలజీపై 1.5 శాతంలోపే వెచ్చిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్కు సంబంధించి తాజా సమాచారం అందుబాటులో ఉండదని ఎవరైనా అంగీకరించాల్సిందే. రియల్ ఎస్టేట్లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని టెక్నాలజీ తీసుకొస్తుంది. అదే విధంగా వ్యయాల పరంగా సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని పరేఖ్ పేర్కొన్నారు. -
బొద్దింక దెబ్బకు హడలెత్తిన కొత్త జంట
బొద్దింక ఏమిటి.. పద్దెనిమిది ఇళ్లు మార్పించడం ఏమిటన్న డౌట్ వస్తోందా? నిజమే.. కొత్తగా ఓ పెళ్లయిన జంట బొద్దింకతో పడ్డ అవస్థలు, తర్వాతి చిక్కులు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ కారణం కూడా చాలా సింపులే.. ముందు అసలు కథేమిటో తెలుసుకుందామా? మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 2017లో ఓ అమ్మాయితో పెళ్లయింది. హాయిగా కొత్త కాపురం పెట్టారు. ఓ రోజు ఆమె కిచెన్లో పనిచేసుకుంటోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టింది. వెళ్లి చూస్తే భయంతో గజగజా వణికిపోతూ కనిపించింది. మళ్లీ కిచెన్లోకి వెళ్లనంటే వెళ్లబోనంటూ మొండికేసింది. మరెట్లా అంటే.. ఇల్లే మార్చేద్దామన్నది. సరేనని ఇల్లు మారారు. మళ్లీ అదే సీన్.. మళ్లీ కిచెన్.. గట్టి కేక, భయం, వణుకు.. ఇలా మూడేళ్లలో ఒకటీ రెండు కాదు ఏకంగా 18 ఇళ్లు మార్చాల్సి వచ్చింది. ప్రతిచోటా కిచెన్లో ఆమె భయపడి కేక పెట్టినది బొద్దింకలను చూసే. ఇలా భయపడటంతో వదిలేయకుండా చేతికందిన వస్తువు తీసి విసరడం, బొద్దింకలు తాకిన వస్తువులను బయటపడేయడం మొదలుపెట్టింది. అసలు తాము వెళ్లిన ప్రతిచోటా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో, ఏం చేయాలో, ఆమెకు బొద్దింకలంటే ఉన్న భయాన్ని (ఫోబియాను) ఎలా పోగొట్టాలో అర్థంగాక సదరు భర్త తలపట్టుకుంటున్నాడట. -
స్విగ్గీ ఆర్డర్..ఇల్లు దోచేశారు!
లక్నో: ప్రస్తుతం నడుస్తోంది ఆన్లైన్ యుగం. ఇల్లు దాటకుండా.. కాలు కదపకుండా నచ్చిన వస్తువులను, ఆహారాన్ని మనం ఉన్న చోటకే తెప్పించుకోగలుతున్నాం. ఇందుకు గాను ఆయా సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ బాయ్లను నియమించుకుంటారు. వీరు మన ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాటిని మనం ఉన్న చోటకు తీసుకొచ్చి అందజేస్తారు. అయితే యూపీకి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్స్ మాత్రం కాస్త డిఫరెంటు. వీరు కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటికి తీసుకురావడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల మీద కన్నేస్తారు. ఇంటి పరిసరాలను.. అందులో ఉన్న వస్తువులను స్కాన్ చేసుకుని వెళ్లి.. తీరిగ్గా రాత్రికి వచ్చి వాటిని దొంగతనం చేస్తారు. తాజాగా నోయిడాలో ఇలా దొంగతనం చేసి పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు.. నోయిడా స్విగ్గీ సంస్థ ఫుడ్ డెలివరీ కోసం కాంట్రాక్ట్ బేస్లో బులంద్షహర్ జిల్లాకు చెందిన మహమ్మద్ కఫిల్, రవి శంకర్ నియమించింది. ఈ క్రమంలో వీరు రెండు రోజుల క్రితం నోయిడాలోని ఒక ఇంట్లో రాత్రిపూట అక్రమంగా ప్రవేశించి, తాళం పగలగొట్టి, అక్కడున్న 32 ఇంచ్ల ఎల్ఈడీ టీవీ, 2 ట్రాక్సూట్లు, 2 వ్రిస్ట్ వాచ్లు, కొంత సొమ్మును దొంగిలించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సిగ్గీ డెలివరీ బాయ్ల నిర్వాకం వెలుగు చూసుంది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని.. వీరి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని నోయిడా అడిషనల్ డీసీపీ రన్వీజయ్సింగ్ తెలిపారు. అయితే నిందితులిద్దరిని ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు స్విగ్గీ సంస్థ ప్రకటించింది. తాము దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని స్విగ్గీ సంస్థ తెలిపింది. కాగా, దొంగిలించిన వస్తువులను కొన్న మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా తొందరలొనే పట్టుకుంటామని నోయిడా పోలీసులు తెలిపారు. చదవండి: ‘కుక్కలా ఉన్నావ్’ : బిగ్బాస్ ఫేమ్పై దారుణ ట్రోలింగ్ -
లక్ష ఇండ్లను మంజూరు చేశాం: హరీశ్రావు
సాక్షి, మెదక్: కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆడపిల్లను ఇంట్లో లక్ష్మీ దేవతగా కొలుస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంటలో శనివారం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తండాల్లో, గ్రామాల్లో కరెంటు కరువు ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటుకు, ఎరువులకు కరువు లేదని తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ చొరవ ఎంతో ఉందని తెలిపారు. బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టిన బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో మీటర్ పెట్టాలని విమర్శించారు. రాష్ట్రంలో మిటర్లు పెడితే కేంద్రం నుంచి 2500 కోట్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో రైతులు మరణించిన వారం రోజులకే వారి అకౌంట్లో రైతు బీమా(ఐదు లక్షలు) జమ అవుతున్నదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో లక్ష ఇండ్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎవరి ఖాళీ స్థలంలో వారు ఇల్లు కట్టుకునే విధానం ద్వారా చేగుంట మండలముకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. దసరా పండుగకు మేనమామ లాగా చీర పంపిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రతి తండాలను గ్రామ పంచాయతీ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. కొన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ప్రతి తండాలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తామని తెలిపారు. చేగుంట మండలంలోని కిస్టాపుర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేస్తామని పేర్కొన్నారు. కాగా చేగుంట మండలంలోని ఇబ్రహీంపుర్, రుక్మపుర్, చెట్ల తిమ్మై పల్లి అటవీ భూముల పరిష్కారం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని, త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టేది రూ.11400 కోట్లు అయితే కేంద్రం ఇచ్చేది రూ.2300కోట్లు అని హరీశ్రావు తెలిపారు.